case
-
కరీంనగర్ PMJ జ్యువెలరీ కేసులో పురోగతి
-
అషురెడ్డికి హైకోర్టు బిగ్ షాక్.. ఏ క్షణమైనా అరెస్ట్
-
యూట్యూబ్లో చూసి ప్లాన్.. భార్యకు పాలకోవా తినిపించి..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరులో వివాహిత పద్మజ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఏఎస్పీ విభుకృష్ణ మీడియాకు వెల్లడించారు. భర్త కిరణ్కుమార్.. పాలకోవలో విషం కలిపి హత్య చేసినట్లు పోలీసులు నిర్థారించారు. కిరణ్కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు.. మీడియా ఎదుట హాజరుపరిచారు.భర్త కిరణ్.. భార్య హత్యకు యూట్యూబ్లో శోధించి ప్లాన్ వేశాడు. హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు కొరియర్ ద్వారా విషం తెప్పించిన భర్త.. పాలకోవాలో విషం కలిపి భార్యకు తినిపించడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. భార్య చనిపోయిందో లేదో అనుమానంతో భర్త కిరణ్.. ఆమె ముఖంపై దిండుతో నొక్కినట్లు ఏఎస్పీ వెల్లడించారు. భార్య లావుగా ఉండటం, తనను నిత్యం అనుమానిస్తోందన్న కారణంతోనే కిరణ్ హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. -
మామ వేధింపులు తట్టుకోలేక కోడలు..!
బెంగళూరు: భర్త ఇంట్లో అదనపు కట్న వేధింపులను తట్టుకోలేక వివాహిత తన మూడు నెలల పసికందును ఉయ్యాలలో ఉంచి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద సంఘటన బెంగళూరు హుళిమావు ఠాణా పరిధిలో జరిగింది. వందన (23) ఫ్యాన్కు ఉరి వేసుకుని చనిపోయింది. వివరాలు.. మూడేళ్ల క్రితం విక్రమశేషతో ఆమెకు పెద్దలు ఘనంగా పెళ్లి చేశారు. రూ. 4 లక్షల విలువగల బైకు, బంగారు అభరణాలు కట్నంగా ఇచ్చారు. వీరికి 3 నెలల పసిబిడ్డ ఉంది. భర్తతో పాటు మామ, ఆమెను అధిక కట్నం తేవాలంటూ రోజూ వేధించేవారు. వందన తల్లిదండ్రులకు చెప్పుకుని బాధపడేది. పెద్దలు అనేక సార్లు రాజీ పంచాయతీలు చేసినా భర్తలో మార్పు రాలేదు. గదిలో ఆమె శవమై తేలింది. విక్రంశేషు కుటుంబీకులే వందనాను కొట్టి చంపేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. భర్తతో మామ శ్రీనివాస్, మరిది వినిష్లపై హులిమావు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పసికందు తల్లి కోసం ఏడుస్తుంటే చూపరుల కళ్లు చెమర్చాయి. -
పెళ్లయి ఇద్దరు పిల్లలున్నా అనేక మందితో రేణుక ఎఫైర్.. సీతారాం కేసులో విస్తుపోయే నిజాలు
-
తేనె పూసిన ఎల్లో కత్తులు
-
నీతి కబుర్లు చెప్పే అధికారులు.. హనీ ట్రాప్ పై నోరు మెదపడం లేదు
-
కడపలో కిలాడీ లేడి.. వలపు వల విసిరింది.. 82 లక్షలు కొట్టేసింది
-
సెటిల్ చేసుకుందాం రా! సోషల్ మీడియాలో వైరల్ అయిన అషురెడ్డి ఆడియో
-
వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి కేసు విచారణ వాయిదా
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి.. సోషల్ మీడియా పోస్టు కేసు విచారణ వాయిదా పడింది. మంగళవారం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. ఈ కేసుపై రేపు(బుధవారం) హైకోర్టులో విచారణలో అన్ని పక్షాల వాదనలను పరిగణలోకి తీసుకోవాలని ‘సుప్రీం’ కోరింది. అలాగే రేపటి హైకోర్టు విచారణ నేపథ్యంలో మధ్యంతర ఉపశమన చర్యలకు నిరాకరించింది. సోషల్ మీడియా పోస్టు కేసులో హైకోర్టు మద్యంతర ఉత్తరులను సుప్రీంకోర్టులో శ్రీహరి సవాల్ చేశారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. కేసు వివరాల్లోకి వెళితే సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర యానిమేషన్ చిత్రాలు, అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే అభియోగంపై వైఎస్సార్సీపీ నేత పూడి శ్రీహరి అనే వ్యక్తిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు కత్తి పట్టుకున్నట్లుగా ఉన్న యానిమేషన్ వీడియోలను వైరల్ చేశారని టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుతో, ఏప్రిల్ 1న తాడేపల్లిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేశారంటూ శ్రీహరి తరపున హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. తొలుత ట్రయల్ కోర్టు రిమాండ్ను తిరస్కరించినప్పటికీ, పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా ఆ ఉత్తర్వులపై స్టే లభించింది.ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరగా, తనపై రాజకీయ కక్షసాధింపు జరుగుతోందని శ్రీహరి పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ అంశంపై ఇప్పటికే హైకోర్టులో విచారణ పెండింగ్లో ఉన్నందున, తాము ప్రస్తుతానికి జోక్యం చేసుకోలేమని, నిందితులకు ఎలాంటి మధ్యంతర రక్షణ కల్పించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తదుపరి విచారణను వెకేషన్ బెంచ్కు వాయిదా వేస్తూ, హైకోర్టు నిర్ణయానికే ప్రాధాన్యతనిచ్చింది. -
హనీ ట్రాప్ కేసులో నలుగురు పోస్ట్ ఊస్ట్
-
ఆ వీడియోలతో బెదిరించి కోట్లు.. TDP నేతల గలీజ్ దందాలో పోలీసులపై యాక్షన్
-
హనీట్రాప్ కేసులో TDP కీలక నేత సస్పెండ్
-
చేతికి మట్టి అంటకుండా.. మటాష్.. పెద్ద దస్తగిరి హత్యలో భారీ కుట్ర!
-
దస్తగిరి హత్య కేసు.. FIR కాపీలో ఏముంది? ఇదీ అసలు నిజం
-
హోం స్టేలో యుఎస్ యువతిపై అత్యాచారం
బెంగళూరు: కర్ణాటకలో దారుణం జరిగింది. హోం స్టేలో నివాసం ముంటున్న ఓ యుఎస్ మహిళ అత్యాచారానికి గురైంది. మూడురోజులుగా తనను లైంగిక వేదింపులకు గురి చేస్తున్నట్లు మహిళ పేర్కొంది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వివరాల్లోకి వెళితే కొడుగులోని ఓ హోమో స్టేలో ఒక అమెరికన్ మహిళ తాత్కాలిక నివాసం ఉంటుంది. అయితే ఆమెపై గత మూడురోజులు అందులో పనిచేసే వ్యక్తి అత్యాచారం చేసినట్లు యువతి పేర్కొంది. ఆ సమయంలో ఆమె ఎవరిని సంప్రదించకుండా వైపై సేవలు నిలిపివేసినట్లు పేర్కొంది. దీంతో తను మైసూరు వెళుతున్నానని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నానని కంప్లేంట్లో తెలిపింది. అనంతరం అక్కడి నుండి యుఎస్ ఎంబసీని సంప్రదించగా వారు మైసూరు పోలీసులకు వివరాలు తెలియజేశారు.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హోం స్టే నిర్వాహకుడితో పాటు అందులో పని చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు కొడగు ఎస్పీ తెలిపారు. నిందుతుడు జార్ఖండ్కు చెందిన వృజేశ్ కుమార్గా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ కేసుపై లోతైన విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
హత్య వెనుక కనిపించని కుట్ర.. సినిమాను తలిపించే ట్విస్ట్
-
దస్తగిరి కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి: కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి.అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు. రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యాప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది.రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావనకడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి.మాజీ సీఎం జగన్ వస్తారని..ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కలి్పంచాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం.వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో.. దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.నిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప: కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించి కొన్ని పత్రాలు, ఒక ల్యాప్ట్యాప్ తీసుకెళ్లారు. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు గరళం తాగిన శివుడు జగన్
-
సింగర్ మంగ్లీ కేసులో రిమాండ్ కు మధు
-
TCS లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. నిదాఖాన్ HR కాదు..
-
రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
సాక్షి, లక్నో: లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ద్వంద్వ పౌరసత్వం (Dual Citizenship) రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బఆరోపణపై విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ శుక్రవారం ఆదేశించింది. ఈ విచారణను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా నిర్వహించాలని లేదా ఈ విషయాన్ని ఒక కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించి జరిపించాలని ఆదేశించింది.రాహుల్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్న తన అభ్యర్థనను లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జనవరి 28న తిరస్కరించగా, ఆ ఉత్తర్వును సవాలు చేస్తూ బీజేపీ కార్యకర్త ఎస్. విఘ్నేష్ శిశిర్ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కర్ణాటక నివాసి అయిన పిటిషనర్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), అధికార రహస్యాల చట్టం, విదేశీయుల చట్టం, పాస్పోర్ట్ చట్టంలోని నిబంధనల కింద ఆరోపణలు చేస్తూ, ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు.ఇదీ చదవండి: ఇన్స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లిఈ ఫిర్యాదును మొదట రాయ్బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలు చేశారు. 2025 డిసెంబర్ 17న, హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది. పౌరసత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని దిగువ కోర్టు పేర్కొంది. లక్నో కోర్టు తన అభ్యర్థనను కొట్టివేసిన తర్వాత పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇదీ చదవండి: టీసీఎస్ కేసు : మతమార్పిడి ఆరోపణల్లో సంచలన సాక్ష్యంఇదీ చదవండి: నో ఇంజెక్షన్, రోజుకో పిల్ : యూఏఈ సంచలనం -
200 కోట్ల స్కామ్.. మంగ్లీ కేసులో మరో ట్విస్ట్..
-
నేను ఏ తప్పు చేయలేదు.. చేయను కూడా..: సింగర్ మంగ్లీ
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.మధునాయక్ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు. ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది. ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది. నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది. -
డాక్యుమెంట్స్ లో ఏముంది..? నిందితులు దేనికోసం వెతికారు..?
-
మంగ్లీ కేసు రోజుకో ట్విస్టు
-
'నా వల్ల కావడం లేదు.. నా తప్పుంటే జైలుకైనా వెళ్తా'.. సింగర్ మంగ్లీ ఆవేదన
తనపై వస్తున్న ఆరోపణలపై టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకు ఎలాంటి వ్యాపారాలు లేవు.. పాటే నా ప్రాణమని చెప్పిన మంగ్లీ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఈ వివాదంపై సీపీ సజ్జనార్ను కలిపి ఫిర్యాదు చేసిన మంగ్లీ.. తన లాయర్తో డీజీపీని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియా మాట్లాడారు. ఈ వివాదంతో 30 రోజులుగా నా ప్రోగ్రామ్స్ అన్నీ వదులుకోవాల్సి వచ్చిందని తెలిపింది. దయచేసి చెబుతున్నా.. నా తప్పు ఉంటే ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధమని ప్రకటించింది. సోషల్ మీడియాలో వచ్చే వాటిని ఎవరు నమ్మకండని విజ్ఞప్తి చేసింది. సోషల్మీడియాలో పెట్టే పోస్టులు చూస్తుంటే చాలా బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన వారందరిపైనా కేసులు పెట్టానని మంగ్లీ తెలిపింది. డీజీపీని కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.మంగ్లీ మాట్లాడుతూ..'నాకు పాటల ప్రపంచ తప్ప మరేది తెలియదు. సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకండి. కొందరి కామెంట్లు చూసి లోలోపల కుమిలిపోతున్నా. ఇక నా వల్ల కావటం లేదు. నేను తప్పు చేస్తే, విచారణకు సిద్ధం. ఆరోపణలు నిజమైతే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమే. బాధితుడి ఆవేదన చూస్తుంటే నాకూ బాధగా ఉంది. నేను కూడా పేదరికం నుంచే వచ్చా. ఆ బాధేంటో నాకు తెలుసు. నాపై కోపం ఉంటే వచ్చి మాట్లాడండి. ప్రజలకు నన్ను దూరం చేస్తున్నారు. తెలిసి, తెలియక తప్పు మాట్లాడితే క్షమించండి. సంబంధం లేని విషయాల్లో నా ఫొటోలు దయచేసి వాడకండి. బాధితులకు నేను అండగా ఉంటా. నా దుష్ప్రచారం చేసిన వారిని కూడా కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరుతున్నా. మధు నాయక్, హిమకాంత్ రెడ్డి, రమావత్ మధు, సిద్ధు, సుబ్బారావులపై డీజీపీకి ఫిర్యాదు చేశా' అని అన్నారు. అసలేం జరిగిందంటే..సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట రూ.10 కోట్ల మోసానికి పాల్పడ్డారని సుబ్బారావు అనే న్యాయవాది ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగ్లీతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మంగ్లీ కూడా పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. అసత్య ప్రచారం చేస్తోన్న సుబ్బారావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరింది. -
నేచురల్ డెత్ కాదు.. బాత్ రూమ్ లో వేసి నరికారు.. YS వివేకా కేసులో సంచలన విషయాలు
-
రూ.90 లక్షలు ఇస్తేనే ఫస్ట్నైట్ : తీవ్ర ఘర్షణ, కట్ చేస్తే!
ఆగ్రాలో జరిగిన ఒక వింత సంఘటన పెళ్లి చేసుకున్న మొదటి రోజే ఆ కొత్త పెళ్లికొడుకు ఆశలను అడియాశలు చేసింది. పెళ్లిలో మూడు ముళ్ల ముచ్చటను పూర్తి చేసుకొని ఫస్ట్నైట్ ముచ్చట కోసం ఎదురు చూస్తున్న వరుడుకి భారీ షాక్ తగిలింది. చివరికి ఇది ఘర్షణకు, ఆ తరువాత పోలీస్ కేసు వరకు దారి తీసింది. విషయం ఏమిటంటే..ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. 90 లక్షల డిమాండ్ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జగదీష్పురా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలి రాత్రే వధువు తన భర్తను రూ. 90 లక్షలు డిమాండ్ చేసిన ఘటన వైరల్గా మారింది. ఆగ్రాలోని జగదీష్పురా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి (ఒక డాక్టర్ తమ్ముడు), హత్రాస్కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి వేడుకలు ఘనంగా ముగిసాయి. సాంప్రదాయం ప్రకారం దంపతులు శోభనం గదిలోకి వెళ్లారు. ఈ వేడకలో భాగంగా వధువు కొంగున ఎంతో కొంత బంగారం మూట గట్టడం ఆనవాయితీ. కానీ ఈ వధువు తనకు ఏకంగా రూ. 90 లక్షల నగదు కావాలని డిమాండ్ చేసింది. అది ఇస్తేనే శారీరక సంబంధానికి అంగీకరిస్తానని భర్తతో చెప్పింది. దీంతో షాకైన భర్తఅందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.పెళ్లికొడుకు కుటుంబ సభ్యులు ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు, కానీ వధువు తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి రప్పించింది. దీంతో వారొచ్చి నానా హంగామా సృష్టించడంతో వివాదం మరింత ముదిరింది. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. వరుడి ఇంటిపై దాడి చేసిన వస్తువులను ధ్వంసం చేశారు.అక్కడితో ఆగలేదు... పెళ్లికొడుకు కుటుంబాన్ని లోపల ఉంచి బయట నుంచి తాళం వేశారు.ఇంట్లో ఉన్న పీఎన్జీ (PNG) గ్యాస్ పైప్లైన్ను పగులగొట్టి, గ్యాస్ లీక్ చేసి ఇంటికి నిప్పు పెట్టాలని చూశారని ఆపోపణలు. మొత్తానికి పొరుగువారి సహాయంతో వరుడి కుటుంబం ప్రాణాలతో బయటపడింది. దీంతో నిందితులు, వధువు అక్కడినుంచి పారిపోయారు. పోతూ పోతూ, వధువు తనతో పాటు అత్తగారి నగలను, విలువైన వస్తువులను తీసుకుని ఉడాయించింది.ఈ ఘటనపై వరుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేసింది. అసలు ఆమె ఉద్దేశం పెళ్లి కాదని, కేవలం డబ్బు సంపాదించడమేనని ఆమె లక్ష్యమని బాధితులు తమ ఫిర్యాదులో తెలిపారు. ఈ విషయాన్నివధువు స్వయంగా ఒప్పుకుందని కూడా వారు పేర్కొన్నార. అలాగే గ్యాస్ పేల్చి, అందరినీ చంపేయాలని చూశారని బాధితులు ఆరోపించారు. తొలుత పోలీసులు స్పందించకపోవడంతో, వరుడి కుటుంబం కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు జగదీష్పురా పోలీసులు వధువు, ఆమె తండ్రి , ఇతరులపై కేసు నమోదు చేశారు.ఎట్టకేలకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి కోసం కూడా గాలిస్తున్నారు. ఇది అసలైన మోసమా లేక వరకట్న వేధింపుల కేసు నుంచి తప్పించుకోవడానికి ముందుగా ప్లాన్ చేసిన గొడవా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ రోజు ఏంజరిగిందంటే.. విజయ రెడ్డి కేసులో ఊహించని ట్విస్ట్..
-
10 లక్షలు డిమాండ్.. మంగ్లీ కేసులో మరో మలుపు
-
ఘజియాబాద్ చిన్నారి ఉదంతం.. సుప్రీంకోర్టు కంటతడి
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో నాలుగేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటన నాగరిక సమాజాన్ని తలదించుకునేలా చేసింది. ఒకవైపు కామాంధుడి పాశవిక చర్య, మరోవైపు పోలీసుల ఉదాసీనత, ఆపై ఆసుపత్రుల అమానవత్వం.. మొత్తంగా ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. ఈ ఉదంతంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది.మార్చి 16న జరిగిన ఈ దారుణ ఘటనలో చిన్నారి ప్రైవేట్ భాగాల్లో వస్తువులు జొప్పించి, హింసించినట్లు పోస్ట్మార్టం నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ ఉదంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా, అందులో కనీసం ‘పోక్సో’ సెక్షన్లను చేర్చకపోవడంపై సుప్రీంకోర్టు అనుమానం వ్యక్తం చేసింది. మరోవైపు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న చిన్నారిని చూసి కూడా.. ఖజన్ సింగ్ మాన్వీ హెల్త్ కేర్, సెయింట్ జోసెఫ్ ఆస్పత్రులు చేర్చుకోకపోవడంతో సకాలంలో వైద్యం అందక ఆ చిన్నారి కన్నుమూసింది. ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వ్యవస్థే మృత్యువుకు దారి చూపడం అమానవీయమని సుప్రీం కోర్టు మండిపడింది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులైన ఆసుపత్రులకు కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ కేసును సీరియస్గా తీసుకుంది. ఏప్రిల్ 13న ఘజియాబాద్ పోలీస్ కమిషనర్, నంద్గ్రామ్ ఎస్హెచ్ఓ స్వయంగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) లేదా కేంద్ర సంస్థకు అప్పగించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.‘న్యాయం అంటే కేవలం తీర్పు చెప్పడమే కాదు.. బాధ్యతను గుర్తు చేయడం కూడా’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.ఇది కూడా చదవండి: స్టూడెంట్ డెత్ మిస్టరీ: పార్టీ చేసుకుందామని పిలిచి.. -
అక్క మృతి.. చెల్లెలిపై కేసు: 13 ఏళ్ల తర్వాత..
ముంబై: ఒక బిడ్డ దూరమైందన్న శోకం ఒకవైపు.. మరో బిడ్డ జైలు పాలవుతుందన్న భయం మరోవైపు.. ఆ రాత్రి ముంబై హైవేపై జరిగిన ప్రమాదం ఆ కుటుంబానికి 13 ఏళ్ల పాటు నరకాన్ని చూపింది. అయితే ఈ కేసులో చిక్కుముడి ఎట్టకేలకు వీడింది. పోలీసుల రికార్డుల్లో నేరస్తురాలిగా ముద్రపడిన సోదరిని ఆమె సోదరుడే కాపాడాడు.2012, అక్టోబర్ 14న వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన ఆ ఘోర ప్రమాదం ఖురానా కుటుంబంలో తీరని ఆవేదనను నింపింది. ఆస్పత్రిలో అక్క గుంజన్ ప్రాణాలు వదలగా, నాడు కారు నడిపిన చెల్లెలు పారుల్ ఖురానా నిర్లక్ష్యమే ఈ మృతికి కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. సొంత అక్క మరణానికి కారణమయ్యానన్న అపరాధభావం ఒకవైపు, పోలీసుల విచారణ మరోవైపు పారుల్ను కుంగదీశాయి. న్యాయం కోసం ఆమె చేసిన పోరాటం ఒక ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. ఏకంగా 13 ఏళ్ల పాటు సాగింది.ఈ కేసులో అత్యంత కీలక మలుపు వారి సోదరుడి వాంగ్మూలం. పోలీసులు చెబుతున్నట్లు పారుల్ కారు నడపలేదని, ప్రమాద సమయంలో స్టీరింగ్ గుంజన్ చేతిలోనే ఉందని అతను కోర్టులో వెల్లడించాడు. వెనుక నుంచి వేగంగా వచ్చిన ‘బెస్ట్’ బస్సు ఢీకొట్టడం వల్లే కారు నియంత్రణ కోల్పోయిందని సాక్ష్యం ఇచ్చాడు. ‘చనిపోయిన ఒక సోదరిని కాదని, తప్పు చేసిన మరో సోదరిని కాపాడటానికి ఏ తమ్ముడూ అబద్ధం చెప్పడు’ అని మేజిస్ట్రేట్ ఏ.ఎం. ముజావర్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసులో మానవీయ కోణాన్ని ఆవిష్కరించాయి.పోలీసుల దర్యాప్తులోని వైఫల్యాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. కారు నేరుగా వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టిందని పోలీసులు వాదించగా, కారు వెనుక భాగం ధ్వంసమైన ఫోటోలు అసలు నిజాన్ని బయటపెట్టాయి. బస్సు ఢీకొట్టిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నా, ఆ కోణంలో కనీసం విచారణ చేయకపోవడం దర్యాప్తు అధికారి నిర్లక్ష్యమేనని కోర్టు తేల్చి చెప్పింది. చివరకు వాస్తవాలను, ఫోటో సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకున్న బోరివలి కోర్టు, పారుల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. -
గిరిజన బాలిక కేసులో నిందితుడిని తప్పించే యత్నం
-
చదువు చెప్తానని.. నమ్మిన బాలికపై అత్యాచారం
-
దగ్గుబాటి కుటుంబ కేసు.. ఆ విషయంలో జాగ్రత్త..!
దగ్గుబాటి కుటుంబానికి సంబంధించిన కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసు విచారణ ఏప్రిల్ 10కి కోర్టు వాయిదా వేశారని దగ్గుబాటి కుటుంబం లీగల్ టీమ్ తెలిపింది. గతంలో మాదిరిగానే రాబోయే విచారణకు దగ్గుబాటి కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టంగా చేసిందని వెల్లడించింది.అయితే విచారణ సమయంలో నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేయలేదని లీగల్ టీమ్ పేర్కొంది. దీనికి విరుద్ధంగా ప్రత్యర్థులు,కొన్ని వర్గాలు చేసే ప్రచారం పూర్తిగా అసత్యం, తప్పుదోవ పట్టించేవని తెలియజేసింది. ఈ కేసుకు సంబంధించి మీడియా సంస్థలు ఏవైనా వార్తలు ప్రచురించే ముందు కోర్టు ఆదేశాలను పరిశీలించడం, దగ్గుబాటి కుటుంబం న్యాయ సలహాదారుని సంప్రదించి ప్రచురించాలని లీగల్ టీమ్ విజ్ఞప్తి చేసింది.అసలు కేసు ఏంటంటే..?గతంలో సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కుటుంబ సభ్యులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఫిలింనగర్ రోడ్డునెంబర్–1లో ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో బాధితుడు నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో పోలీసులు నిర్మాత దగ్గుబాటి సురేష్బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేష్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)లపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది.2022 నవంబర్లో దక్కన్ కిచెన్ హోటల్ను జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. నందకుమార్కు చెందిన దక్కన్ కిచెన్ హోటల్ అంశంలో దగ్గుబాటి కుటుంబంతో స్థల వివాదం ఉంది. నందకుమార్ సిటీ సివిల్ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ అంశంలో స్టేటస్ కో కొనసాగించాలని.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు దిగవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తూ గతేడాది జవనరిలో దగ్గుబాటి కుటుంబం హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దీంతో మరోసారి బాధితుడు నందకుమార్ దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కోర్టు ఆదేశాల ఉల్లంఘన కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన నాంపల్లి న్యాయస్థానం ఈ ఘటనలో కేసు నమోదు చేసి విచారణ చేయాలంటూ ఫిలింనగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
అందుకే లాగిపెట్టి చెంప చెల్లు మని.. వైఎస్ సునీతపై KS ప్రసాద్ షాకింగ్ నిజాలు
-
నాపై మూడేళ్లుగా సీఐ అత్యాచారం
యశవంతపుర(కర్ణాటక): మహిళలను వేధించిన వ్యవహారంలో దక్షిణ కన్నడ జిల్లా మూడబిదిరె సీఐ పీజీ సందేశ్ వివాదం కొనసాగుతూనే ఉంది. వేధింపుల కేసులో ఆయనను సస్పెండ్ చేస్తే సరిపోదు, కేసు కూడా పెట్టాలి అని బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా వేణూరు పోలీసులు సందేశ్పై అత్యాచారం కేసు నమోదు చేశారు. 2020 నుంచి 2023 మధ్య మూడేళ్లపాటు తన ఇంటికి సందేశ్ తరచూ వస్తూ లైంగిక దాడి చేసేవాడని మహిళ ఫిర్యాదులో ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది. ఇది జిల్లా పోలీసులకు కూడా తలనొప్పిగా మారింది. 2020లో సందేశ్ బెళ్తంగడి సర్కిల్లోని వేణూరు పోలీసుస్టేషన్ సీఐగా పని చేసేవారు. ఘటన అక్కడే జరగడంతో కేసును అక్కడే నమోదు చేసుకున్నారు. సందేశ్పై ఇద్దరు మహిళలు చేసిన లైంగిక వేధింపుల అరోపణలు అవాస్తవమని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. కానీ అంతలోనే రేప్ కేసు పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. రానురాను ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న కుతూహలం వ్యక్తమవుతోంది. అలాగే సీఐని అరెస్టు చేస్తారా అనేది మిస్టరీగా మారింది. -
ఇదిగో దస్తగిరి స్టేట్మెంట్.. ఈ ఒక్క దానికి సమాధానం చెప్పండి చాలు
-
ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్
సాక్షి, న్యూఢిల్లీ: అన్యాయంగా ఇరికించిన మద్యం అక్రమ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముప్పిడి అవినాశ్రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మాల్యబాల్చి, జస్టిస్ విపుల్ ఎం. పంచోలి త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతకిందట ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం పిటిషన్ కొట్టివేతకు దర్యాప్తు సంస్థలు చేసిన అభ్యర్థనలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు కోర్టు ఆదేశాలను గౌరవించి లొంగిపోయాడు. విచారణకు సహకరించాడు. పోలీసుల కస్టడీ ముగిసిన తర్వాత నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీలో ఇంకా ఎందుకు ఉంచాలి?’ అని ప్రశ్నించింది. దర్యాప్తు కొలిక్కి రావడానికి కనీసం మరో పది రోజుల సమయం కావాలన్న ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా విజ్ఞప్తిని ధర్మాసనం తిరస్కరించింది. కింది కోర్టు విధించే షరతులు, పూచీకత్తుకు లోబడి అవినాశ్రెడ్డిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ఈ కేసులోని ప్రత్యేక పరిస్థితుల ఆధారంగా మాత్రమే ఈ బెయిల్ మంజూరు చేస్తున్నామని ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అవినాశ్రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.అవినాశ్రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ దవే వాదనల్లో ముఖ్యాంశాలు.. » ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఆదేశాల మేరకే నిందితుడు విదేశాల నుంచి తిరిగి వచ్చి ఫిబ్రవరి 26న దర్యాప్తు అధికారుల ముందు లొంగిపోయారు. » ఇప్పటికే మూడు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. కస్టోడియల్ విచారణ పూర్తయినందున ఆయన ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. » ఇదే అక్రమ కేసులో ఆయన సోదరుడితో పాటు పలువురు సహ నిందితులకు ఇప్పటికే బెయిల్ మంజూరయ్యింది. » దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నందున ఇప్పటికే దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను రెగ్యులర్ బెయిల్ పిటిషన్గా పరిగణించి ఊరట కల్పించాలి.ఆర్టికల్ 142 ఏమి చెబుతోందంటే.. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం, సుప్రీంకోర్టు తన ముందు పెండింగ్లో ఉన్న ఏ విషయంపైనైనా సంపూర్ణ న్యాయం చేయడానికి అవసరమైన ఆదేశాలు లేదా డిక్రీలను జారీ చేసే ప్రత్యేక అధికారాన్ని కలిగి ఉంటుంది. చట్టంలో నిర్దిష్ట నిబంధనలు లేనప్పుడు లేదా ఉన్న చట్టం పరిధి సరిగా వర్తించలేని పరిస్థితి ఉన్నప్పుడు అత్యున్నత న్యాయస్థానం ఈ అధికారాన్ని ఉపయోగించి న్యాయం చేకూర్చుతుంది. -
అవినాష్ రెడ్డికి పాదాభివందనం చేసినా తక్కువే
-
ఆల్గో ట్రేడింగ్ కేసులో సెటిల్మెంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ బ్రోకర్ల కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని 111 సంస్థలు వినియోగించుకున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తాజాగా వెల్లడించింది. కొన్ని ఆల్గోరిథమిక్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్తో చేతులు కలిపిన స్టాక్ బ్రోకర్లపై పెండింగ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ చర్యలను నిలువరించేందుకు వీలుగా సెటిల్మెంట్ పథకాన్ని సెబీ తీసుకువచ్చింది.దీంతో ఒక్కో సంస్థ రూ. లక్ష చొప్పున చెల్లించి కేసులు సెటిల్ చేసుకున్నట్లు సెబీ పేర్కొంది. శాట్ లేదా వివిధ కోర్టులలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై న్యాయపరమైన ప్రక్రియను ఎదుర్కోవలసి ఉన్న స్టాక్ బ్రోకర్ సంస్థలకు 2025 జూన్ 16 నుంచి సెపె్టంబర్ 16వరకూ సెబీ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. అయితే పథకానికి చివర్లో భారీ స్పందన కనిపించడంతో 2025 అక్టోబర్వరకూ గడువును పొడిగించింది. -
వివేకా బాడీ ఇంట్లో నుంచి అంబులెన్స్ ఎక్కించే వరకు పక్కనే ఉన్న.. అసలు అక్కడ జరిగిందేంటంటే..!
-
సునీతతో డ్రామా.. ఇదొక 200 కోట్ల ప్రాజెక్ట్.. మాజీ SP సంచలన నిజాలు
-
పాల విషాదం.. ప్రజల్లో భయం.. బయటపడ్డ నిజం..
-
‘ట్రావెల్ విత్ జో’ కేసు.. 10 నెలలైనా వీడని ఉత్కంఠ
పాకిస్తాన్ గూఢచారులకు కీలక సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో గత ఏడాది అరెస్టయిన హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి రాణి అలియాస్ జ్యోతి మల్హోత్రా ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గత ఏడాది మే నెలలో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. పది నెలలు గడుస్తున్నా విచారణ మాత్రం అడుగు ముందుకు పడలేదని ‘ది ప్రింట్’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటివరకు కనీసం నేరారోపణలపై ప్రాథమిక విచారణ కూడా ప్రారంభం కాకపోవడం గమనార్హమని వ్యాఖ్యానించింది.అసలు కేసు ఏంటి?హిసార్కు చెందిన జ్యోతి మల్హోత్రా 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఉత్తరాది రాష్ట్రాల్లో జరిగిన సోదాల్లో భాగంగా ఆమెను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్తో ఆమె నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, దేశ భద్రతకు ముప్పు కలిగించేలా కీలక ప్రాంతాల వీడియోలను పంచుకున్నారని పోలీసులు ప్రధానంగా ఆరోపిస్తున్నారు.వివాదంలో 'పాండో డ్యామ్' వీడియోఈ కేసులో హిమాచల్ ప్రదేశ్లోని 'పాండో డ్యామ్'కు సంబంధించిన వీడియో అత్యంత కీలక సాక్ష్యంగా మారింది. ఈ డ్యామ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ‘కేటగిరీ-బి’ కిందకు వచ్చే అత్యంత సున్నితమైన ప్రాంతమని, ఇక్కడ వీడియోలు తీయడం నిషిద్ధమని భక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టం చేసింది. అయితే ఈ డ్యామ్ నిషిద్ధ ప్రాంతం కాదని, దీనికి సంబంధించిన ఫోటోలు, వివరాలు ఇప్పటికే ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయని జ్యోతి తరపు న్యాయవాది రవీందర్ సింగ్ ధుల్ వాదిస్తున్నారు.పాక్ హైకమిషన్ ఉద్యోగితో సంబంధాలు?జ్యోతి మల్హోత్రా 2023లో వీసా కోసం ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్కు వెళ్లినప్పుడు అక్కడ పనిచేసే ముహమ్మద్ ఎహసాన్-ఉర్-రహీమ్ అలియాస్ డానిష్తో పరిచయం ఏర్పడిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. వీరిద్దరూ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా టచ్లో ఉన్నారని, ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి భద్రతా అధికారులతో రహస్య సమావేశాలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా ఫాలోవర్స్ను పెంచుకోవాలనే ఆశతో, డబ్బు ఆశకు లోబడి ఆమె భారత దేశ భద్రతకు సంబంధించిన వివరాలను పంచుకున్నట్లు పోలీసులు కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.బెయిల్ నిరాకరణ.. సుప్రీంకోర్టుకు లాయర్ఇటీవలే పంజాబ్, హర్యానా హైకోర్టు జ్యోతి బెయిల్ దరఖాస్తును తిరస్కరించింది. ఆమె దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో ‘అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్’ ప్రయోగించే అధికారం జిల్లా పోలీసులకు లేదని, అది కేవలం కేంద్ర హోం శాఖకు మాత్రమే ఉంటుందని జ్యోతి తరపు న్యాయవాది వాదిస్తున్నారు. హైకోర్టు తీర్పును త్వరలోనే సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని ఆయన తెలిపారు.జ్యోతి తండ్రి ఆవేదన‘మా అమ్మాయి కేవలం టూరిస్టుగా అక్కడికి వెళ్లింది. సాధారణ పర్యాటకులు తీసినట్లే ఆమె కూడా వీడియోలు తీసింది. పాకిస్తాన్ కోణం ఉండటంతో ఎవరూ నిజం వినడానికి సిద్ధంగా లేరు’ అని జ్యోతి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. 2,500 పేజీల ఛార్జ్షీట్ ఫైల్ చేసినా, సప్లిమెంటరీ ఛార్జ్షీట్ పేరుతో పోలీసులు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం జ్యోతి మల్హోత్రా హిసార్ జైలులో ఉన్నారు. దేశ సార్వభౌమాధికారానికి ముప్పు తెచ్చే సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో విచారణ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: ఏ పనీ చేయకున్నా.. నీరసం వేధిస్తోందా? -
మరో మహిళతో భర్త సంబంధాన్ని పెళ్లి అనలేం: హైకోర్టు
శివాజీనగర(బెంగళూరు): ఓ మహిళ (66) తన భర్త (77) అక్రమంగా రెండవ పెళ్లి చేసుకున్నాడని దాఖలు చేసిన కేసును హెకోర్టు కొట్టివేసింది. భర్త పర స్త్రీతో సంబంధం కలిగి ఉండడం వివాహానికి సమానం కాదు, కాబట్టి కేసు చెల్లదని స్పష్టంచేసింది. న్యాయమూర్తి నటరాజ్ కేసును విచారించారు. వివాహం చేసుకున్నప్పుడు మాత్రమే కేసు వర్తిస్తుందన్నారు. తన భర్త మరో మహిళ (51)ను వివాహం చేసుకొన్నారు, ఆయన కుమారులు మద్దతుగా నిలిచారు అని మహిళ ఆరోపించారు. ఆ తరువాత మహిళ భర్త, కుమారులు, ఆ మహిళ కేసును రద్దు చేయాలని పిటిషన్ వేశారు. చివరకు కేసు వీగిపోయింది. -
కుమారుడు తప్పు చేస్తే తండ్రికి శిక్ష.. గల్ఫ్లో అంతే?
గల్ఫ్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న తప్పు చేసినా అక్కడ శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి. ఇటీవల ఓ మైనర్ బాలుడు చేసిన తప్పుకు అతని తండ్రికి కోర్టు శిక్ష విధించింది. పిల్లాడి సంరక్షణ బాధ్యత తండ్రిదేనని తెలిపింది.అబుదాబీలో ఇటీవల ఓ మైనర్ బాలుడు ఒకరి ఇంట్లోకి అనుమతి లేకుండా వెళ్లాడు. అంతేకాకుండా అక్కడ ఉన్న మరో మైనర్ బాలుడి చిత్రాలను వీడియో తీసి అతనిని ఆట పట్టించడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందని సదరు కుటుంబం సదరు కుటుంబం ఈ విషయంపై కేసు నమోదు చేసింది. ఈ వివరాలను పరిశీలించిన అక్కడి న్యాయమూర్తి ఇది పిల్లాడి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమేనని తీర్పు ఇచ్చారు.అందుకు గాను సదరు కుటుంబానికి 50 వేల దిర్హామ్లు జరిమానా విధించారు. అయితే ఆ పిల్లాడు మైనర్ అని వాదించినప్పటికీ వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులేదనని వారి ఎటు వెళుతున్నది ఏం చేస్తున్నది కనిపెడుతూ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. దీంతో చేసేదేం లేక ఆ ఫ్యామిలీ ఆ మెుత్తాన్ని చెల్లించడానికి అంగీకరించింది. -
పచ్చ మీడియా సైలెంట్.. బయటపడ్డ పెంచలయ్య సిఫార్స్ పత్రం
-
వైఎస్ వివేకా కేసులో సునీతకి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్
-
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
డేరా బాబా కేసు.. పంజాబ్ హైకోర్టు సంచలన తీర్పు
చండీగఢ్: డేరా సచ్ఛా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ పంజాబ్- హర్యానా హైకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో గతంలో కింది కోర్టు విధించిన యావజ్జీవ కారాగార శిక్షను హైకోర్టు రద్దు చేసింది. రామ్ రహీమ్ తరపు న్యాయవాది జితేందర్ ఖురానా ఈ విషయాన్ని వెల్లడించారు. 2002లో హర్యానాకు చెందిన జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిపై కాల్పులు జరగడం, ఆపై చికిత్స పొందుతూ ఆయన మరణించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డేరా ఆశ్రమంలో జరిగే అకృత్యాలను వెలుగులోకి తెచ్చినందుకే ఆయనను హత్య చేశారనే ఆరోపణలు నాడు వినవచ్చాయి. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు, 2019లో గుర్మీత్ రామ్ రహీమ్ సహా మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ, డేరా బాబా హైకోర్టును ఆశ్రయించారు. శనివారం జరిగిన విచారణలో సాక్ష్యాధారాల లోపాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, ఆయనపై ఉన్న ఆరోపణలు నిరూపితం కాలేదని స్పష్టం చేస్తూ, కేసు నుంచి విముక్తి కల్పించింది.ఈ హత్య కేసులో నిర్దోషిగా విడుదలైనప్పటికీ, రామ్ రహీమ్ సింగ్ ప్రస్తుతానికి జైలులోనే కొనసాగనున్నారు. తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 2017లో ఆయనకు 20 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ప్రస్తుతం ఆయన హర్యానాలోని రోహ్తక్ జిల్లా సునారియా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. కాగా రామ్ రహీమ్ సింగ్కు హర్యానా ప్రభుత్వం పదే పదే పెరోల్ మంజూరు చేయడంపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. ఎన్నికల సమయంలోనే ఆయనకు పెరోల్ లభించడం వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ప్రతిపక్షాలు, సిక్కు మత సంస్థలు ఆరోపించాయి. తాజా తీర్పుతో డేరా బాబా అనుచరులు హర్షం వ్యక్తం చేస్తుండగా జర్నలిస్టు ఛత్రపతి కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర నిరాశకు లోనయ్యారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో వారు ఉన్నట్లు సమాచారం. -
రఘురామకృష్ణరాజు కేసులో విచారణకు హాజరైన సునీల్ నాయక్
-
అసలు ఆధారాలే లేవు.. లిక్కర్ కథ ముగిసిందా ?
-
పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన మంత్రివర్గ సహచరులు, తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కుమార్తె కవితలతో సహా మొత్తం 23 మందికి ఢిల్లీ సీబీఐ కోర్టులో భారీ ఊరట లభించింది. వారందరినీ ఈ కేసు నుంచి తప్పిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్ తదితరులపై మోపిన ఆరోపణలను నిరూపించేందుకు సీబీఐ తగిన ఆధారాలు చూపలేదని కోర్టు తేల్చి చెప్పింది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని స్పష్టం చేసింది. అంతా నిబంధనల ప్రకారమే జరిగిందని పేర్కొంది. కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, మద్యం వ్యాపారులు కలిపి తాము కోరుకున్న వ్యక్తులకు ఆర్థిక ప్రయోజనం చేకూర్చేలా కుట్ర పన్నారన్న సీబీఐ ఆరోపణలను కోర్టు తోసిపుచ్చింది.నిందితుల మధ్య ముందస్తు ఒప్పందం, నేరపూరిత కుట్ర జరిగినట్లు రుజువు చేసే బలమైన ఆధారాలను ప్రాసిక్యూషన్ సమర్పించలేకపోయిందని కోర్టు పేర్కొంది. ఈ కేసు ప్రధానంగా దినేష్ అరోరా వంటి అప్రూవర్ల సాక్ష్యాలపై ఆధారపడి ఉందని, అయితే వారికి ఇతర స్వతంత్ర సాక్షుల మద్దతు లేదని, అందువల్ల వారి సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని ఢిల్లీ సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. అదే రకంగా హోల్సేల్ లాభాల మార్జిన్ను 5% నుండి 12% కి పెంచడం అనేది విధానపరమైన నిర్ణయమే తప్ప, అది కేవలం ఒక వర్గానికి లాభం చేకూర్చడానికే చేశారన్న ఆరోపణలకు సైతం తగిన ఆధారాలను చూపలేకపోయిందని పేర్కొంది. ఈ కేసులో సీబీఐ చేసిన ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు లేవంది.ప్రభుత్వ విధానం తప్పుగా ఉండటం నేరం కిందకు రాదని తేల్చి చెప్పింది. అంతేకాక ఈ మొత్తం వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగిందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలకు నేరాన్ని ఆపాదించడానికి వీల్లేదంది. పాలసీలో మార్పుల కోసం కేజ్రీవాల్ నేరుగా నగదు డిమాండ్ చేసినట్లు లేదా కుట్రలో పాల్గొన్నట్లు సీబీఐ చూపిన ఆధారాలు ‘అనుమానాల‘ స్థాయిలోనే ఉన్నాయని, అవి అభియోగాలు నమోదు చేయడానికి సరిపోవని కోర్టు పేర్కొంది. మద్యం పాలసీని మనీష్ సిసోడియా మార్చారని చెప్పలేమని, ఫైళ్ల కదలికలు, నోటింగ్స్ అన్నీ అధికారిక నిబంధనల ప్రకారమే ఉన్నాయని కోర్టు పేర్కొంది.కల్వకుంట కవితను కీలక కుట్రదారుగా పేర్కొన్నప్పటికీ, ఆమె ద్వారా రూ.100 కోట్ల ముందస్తు నగదు బదిలీ జరిగిందన్న ఆరోపణలకు సంబంధించి సమర్పించిన ఆధారాలు ఎంత మాత్రం సరిపోవని, బలహీనంగా ఉన్నాయని కోర్టు భావించింది. విజయ్ నాయర్కు ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక హోదా లేదని, పాలసీ రూపకల్పనలో ఇతను కీలక పాత్ర పోషించాడనడానికి తగిన ఆధారాలు లేవని ఢిల్లీ సీబీఐ కోర్టు పేర్కొంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన ఒక పద్ధతి ప్రకారం, వివిధ విభాగాల మధ్య చర్చల తర్వాత జరిగిందని తేల్చింది. లెఫ్టినెంట్ గవర్నర్ పర్యవేక్షణలోనే జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోలేవు...ఎన్నికల రాజకీయ పార్టీలు ఖర్చు చేసే నిధుల విషయంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను పరిశీలించే ప్రాథమిక అధికారం కేవలం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల్లో పరిమితికి మించి ఖర్చు చేశారంటూ వచ్చిన ఫిర్యాదుల పరిష్కారానికి ’ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951’ కింద ’ఎన్నికల పిటిషన్’ దాఖలు చేసుకోవడమే చట్టబద్ధమైన మార్గమని కోర్టు పేర్కొంది.అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ చట్టం వంటి కఠినమైన చట్టాలను, ఎన్నికల చట్టాల పరిధిలోకి వచ్చే అంశాలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యామ్నాయంగా వాడకూడదని కోర్టు తేల్చి చెప్పింది. రాజకీయ ఆరోపణలను నేరాలుగా మార్చకూడదంది. ఒకవేళ దర్యాప్తు చేయాల్సి వస్తే.. అది ఎన్నికల చట్ట ఉల్లంఘనలకు సంబంధం లేకుండా, స్వతంత్రంగా రుజువయ్యే స్పష్టమైన నేరమై ఉండాలని తెలిపింది. ఎన్నికల వేళ వచ్చే ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకుంటే, అది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని, చట్ట పాలనను, ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని సీబీఐ కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.వ్యాపార అవకాశవాదం నేరం కిందకు రాదు...ప్రభుత్వం ఏదైనా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ప్రైవేటు సంస్థలు అందులోని సడలింపులను వాడుకుని లాభపడాలని చూడటం సహజమని కోర్టు పేర్కొంది. ఇలాంటి ‘వ్యాపార అవకాశవాదం’ ఎప్పుడూ నేరం కిందకు రాదని తెలిపింది. ఒకవేళ నేరంగా పరిగణించాలంటే, అందులో మోసం, ఫోర్జరీ, లంచం, క్విడ్ ప్రో కో, నిధుల దుర్వినియోగం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు ఖచ్చితంగా ఉండాలని కోర్టు స్పష్టం చేసింది.2002 నాటి సుప్రీం కోర్టు తీర్పును ఉటంకించిన సీబీఐ కోర్టు, ప్రభుత్వం తీసుకునే ఆర్థిక నిర్ణయాల వల్ల ప్రైవేటు వ్యక్తులకు లాభం చేకూరినా, అందులో దురుద్దేశం, చట్ట ఉల్లంఘన లేకుంటే వాటిని నేరంగా పరిగణించలేమని కోర్టు వివరించింది. ప్రభుత్వానికి ఆర్థిక నష్టం వాటిల్లినంత మాత్రాన లేదా ఒక ప్రైవేట్ వ్యక్తి లాభపడినంత మాత్రాన దానిని నేరంగా పరిగణించలేమంది. అక్కడ అవినీతి, అక్రమ సంపాదన జరిగినట్లు ఆధారాలు ఉంటేనే అది నేరపూరిత చర్య అవుతుందని తెలిపింది.విధానాల రూపకల్పన, అమలు బాధ్యత పాలకులదే...ప్రజా విధానాలను రూపొందించడం, మార్చడం లేదా పాతవాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం అనేది పూర్తిగా శాసన కార్యనిర్వాహక వ్యవస్థల రాజ్యాంగబద్ధమైన హక్కు అని తెలిపింది. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన వారు కాబట్టి, సామాజిక అవసరాలను గుర్తించే అధికారం శాసనకర్తలకు ఉంటుందని తెలిపింది. న్యాయస్థానాలు సాధారణంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలలో జోక్యం చేసుకోవని గుర్తు చేసింది. ఒక కొత్త చట్టం లేదా విధానం వచ్చేటప్పుడు ప్రభుత్వం ఈ క్రింది అంశాలను పరిశీలిస్తుంది. ప్రస్తుత సమాజంలో ఉన్న పరిస్థితులను విశ్లేషించడం, వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించడం, పాత విధానం వల్ల కలిగే లాభ నష్టాలను బేరీజు వేయడం, ఆ విధానం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావాన్ని చర్చించడం వంటి ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో భాగం.నిర్ణయాలను నేరపూరిత చర్యలుగా చూడకూడదు...ప్రభుత్వం పాత విధానంలోని లోపాలను సవరించి కొత్త విధానాన్ని తెచ్చినప్పుడు, దాన్ని కేవలం ‘కుట్ర‘ లేదా ‘నేరపూరిత దురుద్దేశం‘తో చూడకూడదని సీబీఐ కోర్టు తెలిపింది. పాత విధానంలోని లోపాల వల్ల లాభపడిన వ్యక్తులు, కొత్త విధానంలోని మార్పులను అడ్డుకోవడానికి ఫిర్యాదులు, ఆరోపణలు చేయవచ్చునంది. కేవలం ఫిర్యాదుల్లో రాసిన భాషను బట్టి లేదా ఊహించిన కుట్రలను బట్టి విధాన నిర్ణయాలను నేరాలుగా పరిగణించడానికి వీల్లేదంది. నిజాయితీగా తీసుకున్న విధాన నిర్ణయాలను నేరపూరిత చర్యలు చూడరాదంది. ఇలాంటి చర్యల వల్ల పాలకులు గానీ, ప్రభుత్వ అధికారులు గానీ కొత్త సంస్కరణలు తీసుకురావడానికి వెనకాడతారని తెలిపింది. పరిపాలనలో కొత్త ప్రయోగాలు చేయడానికి ఎవరూ ముందుకు రారని తేల్చి చెప్పింది. ప్రభుత్వాలు తమ విధులను సక్రమంగా నిర్వహించకుండా ఇలాంటి చర్యలు అడ్డుకుంటాయంది.ప్రభుత్వ నిర్ణయాలను దర్యాప్తు సంస్థలు విశ్లేషించజాలవు... సీబీఐ గానీ, ఇతర దర్యాప్తు సంస్థలకు గానీ ప్రభుత్వ నిర్ణయాలను విశ్లేషించే అధికారం లేదని తెలిపింది. ఒక నిర్ణయం వల్ల ఆర్థికంగా లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా అని లెక్కలు వేయడం వారి పని కాదంది. ఆ నిర్ణయం పరిపాలనాపరంగా సరైనదా కాదా అని వారు తీర్పు చెప్పలేరంది. ప్రభుత్వం ఒక పాలసీని ఎందుకు తెచ్చింది? అసలు ఆ పాలసీ అవసరమా? అని ప్రశ్నించే హక్కు కూడా వారికి లేదని తెలిపింది. దర్యాప్తు సంస్థల పని కేవలం చట్టం ప్రకారం నేరం జరిగిందా లేదా?‘ అని చూడటం మాత్రమేనంది. ప్రభుత్వ నిర్ణయాల్లో మంచి చెడులు చూడటం దర్యాప్తు సంస్థల పని కాదని తేల్చి చెప్పింది.ప్రైవేటు సంస్థకు లాభం కలిగినంత మాత్రాన అది నేరం అయిపోదు...ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త విధానం వల్ల ఏదైనా ప్రైవేట్ సంస్థకు అనుకోకుండా లాభం చేకూరవచ్చునని, అంత మాత్రన అది నేరం అయిపోదని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ దర్యాప్తు సంస్థలు ప్రతి నిర్ణయాన్ని క్రిమినల్ కేసుగా మార్చడం మొదలుపెడితే, నిజాయితీగా పనిచేసే అధికారులు నిర్ణయాలు తీసుకోవడానికి భయపడతారంది. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కేసులో ఇరుక్కుంటామో అన్న భయంతో పాలన ఆగిపోతుందని తెలిపింది. రాజకీయ నాయకత్వం ఆదేశాల మేరకు, నిబంధనల ప్రకారం పనిచేసే అధికారులను వేధించడం వల్ల వ్యవస్థ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.ప్రభుత్వ విధానాలపై క్రిమినల్ కేసులు పెట్టలేవు...ఒక అధికారి తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి చెడు ఉద్దేశం లేనపపుడు అలాంటి వారిని శిక్షించడం తగదని తెలిపింది. అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించాలంటే, దర్యాప్తు సంస్థల అనవసరపు వేధింపుల నుండి వారికి రక్షణ ఉండాలని తెలిపింది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం సరైందా కాదా అనేది అసెంబ్లీ లేదా పార్లమెంటులో చర్చించాలే తప్ప, దానికి బదులుగా క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించి ఆ విధానాన్ని ప్రశ్నించడం రాజ్యాంగ విరుద్ధమంది. ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందనే అంశంపై దర్యాప్తు సంస్థలు క్రిమినల్ కేసులు పెట్టలేవంది. అభివృద్ది చెందుతున్న ఓ దేశానికి అధికారుల నిర్ణయాలలో స్థిరత్వం, నిశ్చయత చాలా ముఖ్యమంది. ఏళ్ళ క్రితం నిజాయితీతో తీసుకున్న నిర్ణయాలను ఇప్పుడు నేరాలుగా పరిగణించి విచారిస్తే, భవిష్యత్తులో ఏ అధికారి కూడా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి సాహసించడని తేల్చి చెప్పింది. ఆర్థిక విధానాల విషయంలో కోర్టులు లేదా దర్యాప్తు సంస్థలు జోక్యం చేసుకోకూడదని, అవి ప్రభుత్వ ప్రత్యేక పరిధిలోకి వస్తాయంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ సీబీఐ కోర్టు తన తీర్పులో ఉదహరించింది.ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చుననే కోణంలో సీబీఐ దర్యాప్తు సాగింది...ఈ కేసులో దర్యాప్తు జరిగిన తీరును మొదటి నుండి చివరి వరకు పరిశీలించిన తర్వాత, సీబీఐ దర్యాప్తులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కోర్టు తేల్చి చెప్పింది. దర్యాప్తు అనేది నిష్పక్షపాతంగా జరగాలని, కానీ ఇక్కడ దర్యాప్తు సంస్థ ఒక నిర్ణీత లక్ష్యంతో ముందే ఊహించుకున్న నేరారోపణలతో ముందుకు వెళ్లినట్లుగా కనిపిస్తోందని తెలిపింది. దర్యాప్తు సంస్థ తన దృష్టిని మధ్యలో మార్చుకుంటూ, ఎవరెవరిని ఈ కేసులోకి లాగవచ్చు అనే కోణంలో దర్యాప్తు సాగించిందని కోర్టు తెలిపింది. ప్రచార సంస్థలు , చిన్న వ్యాపారులు, అంగడియాలు (నగదు బదిలీ చేసేవారు), ఇంటి యజమానులు, హోటల్ నిర్వాహకులు, రాజకీయ కార్యకర్తలు, రాష్ట్ర స్థాయి నేతలు చివరకు జాతీయ నాయకత్వాన్ని ఈ కేసులో ఇరికించారంది.ఎక్కడో ఒకచోట ఏదో ఒకటి జరిగి ఉంటుందన్న ముందస్తు ఊహతో దర్యాప్తు సాగించిందని తెలిపింది. ఏ ఒక్క విభాగాన్ని వదలకుండా అందరినీ లాగాలన్న ఉద్దేశంతో ఈ దర్యాప్తు జరిగినట్లు కనిపిస్తోందని కోర్టు వ్యాఖ్యానించింది. ఒక విధాన నిర్ణయం తీసుకున్నప్పుడు లేదా దానిని అమలు చేసినప్పుడు అందులో నేరం ఉందని నిరూపించడానికి బలమైన సాక్ష్యం ఉండాలంది. కేవలం రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎవరికైనా లాభం చేకూరిందని భావించి, అందరినీ నేరస్తులుగా చిత్రించడం తగదని కోర్టు తేల్చి చెప్పింది. ఒక వ్యవస్థీకృత నేరం జరుగుతున్నప్పుడు, ఆ నేరాన్ని నడుపుతున్న అసలు వ్యక్తులను వదిలేసి, వారిని రాజకీయ లేదా ఉన్నత స్థాయి అధికారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ఉపయోగించుకోవడం సరైన దర్యాప్తు అనిపించుకోదని పేర్కొంది. -
ఆయేషా మీరా అస్థికల అప్పగింత
-
లిక్కర్ కేసులో క్లీన్ చిట్..: కవిత స్పందన ఇదే
సాక్షి హైదరాబాద్: లిక్కర్ కేసులో క్లీన్ చీట్ ఇవ్వడంపై మాజీ ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. చివరకు సత్యమే గెలిచిందన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే లిక్కర్ కేసులో తనను ఇరికించారని అయినా కడిగిన ముత్యంలా బయిటకు వచ్చానన్నారు. లిక్కర్ కేసు రాజకీయ కుట్రని దానిని ఎవ్వరూ నమ్మలేదని తెలిపారు.ఈ తీర్పుతో న్యాయవ్యవస్థపై తనకున్న నమ్మకం నిలిచిందన్నారు. తనను మూడేళ్ల పాటు నానా మాటలన్నారని ఐదు నెలలకు పైగా జైలులో పెట్టారని ఈ సందర్భంగా కవిత ఆవేదన వ్యక్తం చేశారు. కష్టకాలంలో తనకు అండగా ఉన్న అభిమానులకు శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎటువంటి కుట్ర రౌస్ రెవెన్యూ కోర్టు స్పష్టం చేసింది. ఈకోసులో ఉన్న నిందితులు తప్పు చేశారని సాక్షాదారాలు లేవని తెలిపింది.ఏం జరిగింది?ఢిల్లీ లిక్కర్ కేసులో అవినీతి జరిగిందంటూ ఆ సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న కవితను మార్చి 2024న అధికారులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను తీహార్ జైలుకు తరలించారు. దీంతో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆమెకు బెయిల్ మంజూరైంది. దీంతో ఐదు నెలల అనంతరం ఆమె జైలు నుంచి విడుదలైంది. కాగా తాజాగా ఈ కేసులో మాజీ ఎమ్మెల్సీ కవితతో పాటు మిగతా వారు ఎటువంటి నేరాలకు పాల్పడలేదని రౌస్ రెవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. -
న్యాయం గెలిచింది.. కంటతడి పెట్టిన కేజ్రీవాల్
-
ల్యాబ్ రిపోర్టు లేకుండానే యాంటీడోట్?
-
బొగ్గుల శ్రీనివాస్ ది హత్యే.. చంపింది వాళ్లే.. ACP సంచలన ప్రెస్ మీట్
-
రచయిత బొగ్గుల శ్రీనివాస్ హత్య కేసు.. వీడిన మిస్టరీ
సాక్షి, ఖమ్మం జిల్లా: పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే యత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండటం.. శ్రీనివాస్ కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసిన పోలీసులు హత్యగా తేల్చారు. ఈనెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లడంతో ఏపీకి చెందిన బొగ్గుల శ్రీనివాస్ మృతి చెందారు. రిజర్వాయర్లోకి కారు దూసుకెళ్లాక డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి బయటకు వచ్చి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపట్టారు. ఆయన సోదరుల ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు.శ్రీనివాస్ ప్రయాణించిన కారు ఏపీలోని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వేణుమాధవ రెడ్డిదిగా గుర్తించారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన ఆచూకీ లేకపోవడంతో ఆ దిశగా విచారణ చేపట్టారు. వేణుమాధవరెడ్డి, శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నాయని గుర్తించారు. దర్యాప్తులో శ్రీనివాస్ది హత్యగా తేల్చారు. -
అయేషా మీరా కేసు క్లోజ్ చేసిన సీబీఐ
-
ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (టీజీ ఎఫ్ఎస్ఎల్) అగ్నిప్రమాదంలో కీలక మలుపు జరిగింది. అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధం అయినట్లు నాగపూర్ బృందం గుర్తించింది. 1100 కేసుల డేటా రికవరీ కోసం బృందం యత్నించింది. కేసుల డేటా రికవరీ కష్టం అని ప్రత్యేక బృందం తేల్చింది.ఈ నెల(ఫిబవరి) 7వ తేదీన జరిగిన ఎఫ్ఎస్ఎల్ భారీ అగ్ని ప్రమాద ఘటనలో పలు కీలక కేసుల ఫైళ్లు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఎఫ్ఎస్ఎల్ భవనం మొదటి అంతస్తులో జరిగిన ఈ ప్రమాదంలో దాదాపు 50 కంప్యూటర్లు, తీవ్రమైన నేరాల్లో పోలీసులు సేకరించిన సాంకేతిక ఆధారాలు, సీజ్ చేసిన హార్డ్డిస్కులు, కేసు రికార్డులు పూర్తిగా దగ్ధమయ్యాయి.ఇందులో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతోపాటు ఇటీవల దర్యాప్తు కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు సైతం కాలి బూడిదైనట్టు పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. రెండు అంతస్తులున్న ఈ భవనం మొదటి అంతస్తులోనే ఆధారాలను భద్రపర్చేగదితో పాటు, పలు కేసుల్లో ఆధారాల విశ్లేషణ తర్వాత నివేదికలను భద్రపరుస్తారు. రెండో అంతస్తులో ఫోరెన్సిక్ పరికరాలు, కెమికల్ ల్యాబ్ మెటీరియల్ ఉంటుంది. ఈ ల్యాబ్లోకి మంటలు వ్యాపించలేదు. అలాగే కింది అంతస్తులోకి మంటలు పోలేదు. ప్రమాదంలో కేవలం ఒకటో అంతస్తు పూర్తిగా దగ్ధమవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.రాష్ట్రంలో జరిగే నేర పరిశోధనకు ఈ ప్రయోగశాల శాస్త్రీయ సహాయం అందిస్తుంటుంది. హత్యలు, దోపిడీలు, లైంగిక దాడులు, మోసాలు వంటి కేసులకు సంబంధించిన సాక్షాధారాలు ఇక్కడే నిక్షిప్తమై ఉంటాయి. ఎక్కడ నేరం జరిగినా ఘటనాస్థలంలో సేకరించిన నమూనాల పరీక్ష ఇక్కడే చేస్తారు. ఈ న్యాయ వైజ్ఞానిక శాస్త్ర ప్రయోగశాలలో వేలి ముద్రల పరిశీలన, రక్తం, వెంట్రుకలు, డీఎన్ఏ వంటి పరీక్షలు చేస్తారు. అలాగే తుపాకులు, బుల్లెట్ల పరిశీలన జరుపుతారు. వీటితోపాటుగా విషాలు, మత్తు పదార్థాల పరీక్షలు, సంతకాలు, నకిలీ పత్రాల పరిశీలన వంటివి చేస్తారు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి, హెరాయిన్ వంటి (నార్కోటిక్) పదార్ధాల పరిశీలన జరుపుతారు. -
మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతి
సాక్షి, అన్నమయ్య జిల్లా: మదనపల్లె బాలిక హత్య కేసు నిందితుడు మృతిచెందాడు. కురబలకోట మండలం కరసానివారిపల్లి చెరువులో మృతదేహం లభించింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి ముదివేలు పోలీసులు చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల చిన్నారి హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఆమెపై నిందితుడు లైంగికదాడి చేసి, ఆపై హత్య చేశాడు. మదనపల్లె పట్టణంలో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల చిన్నారి సోమవారం సాయంత్రం ఆడుకుంటూ అదృశ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు ఎంత గాలించినా జాడ కానరాలేదు. దీంతో ఒకటో పట్టణ పోలీస్స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.రాత్రంతా ఎంత వెతికినా చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. కుటుంబీకులు అనుమానంతో బాలిక ఇంటికి సమీపంలోనే ఉండే కులవర్ధన్ అనే వ్యక్తిపై మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కులవర్ధన్ ఇంటికి చేరుకున్నారు. లోపల తలుపులు వేసుకుని కులవర్ధన్ ఎంతకీ తీయకపోవడంతో పోలీసులు గడియ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం కనిపించింది. -
రచయిత బొగ్గుల శ్రీనివాస్ కేసు.. ఒంటిపై గాయాలు!
కూసుమంచి: ఏపీకి చెందిన ప్రముఖ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచగా, పురోగతి సాధించినట్లు తెలిసింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఈనెల 14న ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లో మునగగా మృతదేహాన్ని గుర్తించారు. అయితే, ఘటన జరిగాక కారు నడుపుతున్న వ్యక్తి ఒడ్డుకు చేరి అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెప్పడంతో కూసుమంచి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.సదరు వ్యక్తి హైదరాబాద్లో పోలీసులకు లొంగిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని, అదే జరిగితే కేసులో చిక్కుముడి వీడుతుందని భావిస్తున్నారు. దీంతో పాటు కారు యజమానిని కూడా అదుపులోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇక శ్రీనివాస్ మృతదేహానికి నేలకొండపల్లి ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించిన నివేదిక వచ్చినట్లు సమాచారం. శ్రీనివాస్ నీట మునగడంతో చనిపోలేదని, ఆయన ఒంటిపై గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం చేసిన వైద్యులు ధ్రువీకరించారని తెలిసింది.ఏదేమైనా మిస్టరీగా మారిన శ్రీనివాస్ మృతి కేసు మరో రెండు రోజుల్లో ఓ కొలిక్కి రానున్నట్లు తెలుస్తోంది. మృతుడు శ్రీనివాస్ సెల్టవర్ల వ్యాపారంలో ఉండగా, ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేపడుతున్నారు. దర్యాప్తు వేగవంతం చేశామని, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోగా.. త్వరలోనే కేసు ఛేదిస్తామని కూసుమంచి ఎస్సై నాగరాజు ‘సాక్షి’కి తెలిపారు. -
అంతా.. ఫిబ్రవరిలోనే
సాక్షి,సిటీబ్యూరో/మణికొండ: అప్పట్లో తెలుగునాట కలకలం సృష్టించిన సినీనటి ప్రత్యూష ఆత్మహత్య కేసులో సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి హైకోర్టు విధించిన శిక్షను ఖరారు చేస్తూ తీర్పు చెప్పింది. 24 ఏళ్ల ఈ ఎపిసోడ్లో కీలక ఘట్టాలన్నీ ఫిబ్రవరిలోనే జరగడం యాదృచ్ఛికం. 2002లో.. నగరంలోని తార్నాకలో ఉండే ప్రత్యూషకు సహా విద్యార్థి, సిద్ధార్థరెడ్డితో పరిచయం ప్రేమకు దారి తీసింది. 1998లో ‘రాయుడు’ చిత్రంతో ప్రత్యూష సినీ రంగంలోకి అడుగుపెట్టింది. 2002 నాటికి ఆమె సుమారు 10 సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో ప్రత్యూష, సిద్ధార్థరెడ్డిల పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ.. సిద్ధార్థ కుటుంబం వీరి వివాహానికి అంగీకరించలేదు. ఈ వివాదం నేపథ్యంలో 2002 ఫిబ్రవరి 23న పంజగుట్టలోని బ్యూటీపార్లర్లో ఉన్న ప్రత్యూషను సిద్ధార్థ తన కారులో ఎక్కించుకున్నాడు. అప్పటికే హైదర్గూడలో ‘ఆర్గానోఫాస్ఫేట్’ పురుగుల మందు ఖరీదు చేసి కూల్డ్రింక్లో కలిపి తెచ్చాడు. దీన్ని ఇద్దరూ కారులోనే తాగారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరుసటి రోజు ప్రత్యూష మరణించింది. 2004లో.. ఈ ఉదంతంపై పంజగుట్ట పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యూష పోస్టుమార్టం నివేదికలోని అంశాలు, ఇతర పరిణామాల ఆధారంగా ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందని, సిద్ధార్థతో పాటు అందులో ప్రమేయం ఉన్న వాళ్లు హత్య చేసి కేసును తారుమారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. చివరకు ప్రత్యూషది ఆత్మహత్యగా తేలి్చన సీబీఐ.. అందుకు ప్రేరేపించిన సిద్ధార్థపై అభియోగపత్రం దాఖలు చేసింది. కేసును విచారించిన సెషన్స్ కోర్టు 2004 ఫిబ్రవరిలో నిందితుడికి శిక్ష విధించింది. 2026లో.. ఈ తీర్పును సిద్ధార్థ రెడ్డి హైకోర్టులో అప్పట్లో సవాల్ చేయడంతో సెషన్స్ కోర్టు విధించిన శిక్షను తగ్గిస్తూ, జరిమానాను పెంచుతూ 2011 డిసెంబర్లో తీర్పు ఇచ్చింది. సెషన్స్ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు తగ్గించడాన్ని సరోజినీ దేవి, శిక్ష విధించడాన్ని సిద్ధార్థ సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం సుప్రీంకోర్టు తీర్పునిస్తూ అతడి పిటిషన్ను తోసిపుచి్చంది. నాలుగు వారాల్లోగా లొంగిపోవాలని సిద్ధార్థను ఆదేశించింది. ఇలా ఈ కేసులో 2002 ఫిబ్రవరి– 2026 ఫిబ్రవరి మధ్య 24 ఏళ్లలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. -
అబిడ్స్ SBI కాల్పుల కేసులో ట్విస్ట్
-
సాఫ్ట్ వేర్ విజయశాంతి రెడ్డి కేసులో న్యూ ట్విస్ట్..
-
మాజీ మంత్రి కాకాణిపై కేసు నమోదు
సాక్షి నెల్లూరు : కూటమి ప్రభుత్వం వైఎస్సార్సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తుంది. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై మరో అక్రమ కేసు నమెదు చేసింది. ఇటీవల కోవూరు, గుమ్మళ్లదిబ్బలో ఓక మైనర్ బాలిక మృతి చెందింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు మాజీ మంత్రి వెంటనే స్పందించారు.బాధిత కుటుంబానికి అండగా నిలిచి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నించారు. దీంతో మంత్రిపై పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. ఇటీవల వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమ కేసుల నమోదు చేసి తీవ్ర వేదింపులకు గురిచేస్తున్నారు. -
అమ్మా.. ఎందుకిలా చేశావ్?
పచ్చని కాపురం ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముత్యాల్లాంటి ఇద్దరు పిల్లలు, ఇద్దరు ముసిముసిమాటల మెరికలు. ఇంతలో ఏ కష్టం వచ్చిందో, తనకు ఎందుకు జీవితం నచ్చలేదో, అర్ధాంతరంగా మృత్యుడికి చేరాలనుకుంది.. తను దూరమైతే పిల్లలు ఒంటరవుతారన్న ఉద్దేశ్యంతో వారిని కూడా తన ఒడికి చేర్చుకుంది. అల్లారుముద్దుగా పెంచిన బిడ్డలకు ఉరితాడు బిగించింది. ఆమె రాసిన చివరి లేఖ కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. తిరుపతి జిల్లా: ఇద్దరు పిల్లలతో ఒక తల్లి మరణించిన సంఘటన పుత్తూరు పట్టణంలో కలకలం రేపింది. పుత్తూరు పట్టణం కృష్ణానగర్ 3వ వీధిలో నివాసం ఉంటున్న శివకుమార్ (28), పద్మజ (27)లకు తేజశ్రీ (7), లాస్య (4) అనే ఇద్దరు పిల్లలు. అప్పుల బాధ తాళలేక పద్మజ తన పిల్లలు తేజశ్రీ, లాస్యలతో పాటు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న వారందరూ కృష్ణానగర్కు పరుగులు తీశారు. విగతజీవులుగా పడివున్న తల్లి, కూతుళ్లను, కన్నీరుమున్నీరై విలపిస్తున్న పద్మజ తల్లిదండ్రులను చూసి చలించిపోయారు. ప్రేమించి పెళ్లిచేసుకుంది పద్మజ పుత్తూరు మండలం నేసనూరు గ్రామానికి చెందిన కన్న ప్పరెడ్డి – నాగభూషణం దంపతుల కుమార్తె. శివశంకర్ పుత్తూ రు మండలం పైడిపల్లి గ్రామానికి చెందినవాడు. ఇద్దరూ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లుగా వీరి వివాహ జీవితం సాగుతోంది. శివశంకర్కు ఉద్యోగం లేకపోవడంతో ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఎందుకింత పనిచేసిందో? శ్రీసిటీకి ఉద్యోగానికి వెళ్లాను. మధ్యాహ్నం పిల్లలు చదివే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది. పాఠశాల 2.30 కి వదిలేస్తారు తీసుకెళ్లండన్నారు. తెలిసిన వ్యక్తికి మా పిల్లల్ని తీసుకెళ్లాలని ఫోన్చేశా. వాళ్లు తీసుకొస్తుంటే నా భార్య ఎదురుగా వచ్చి పిల్లల్ని తీసుకెళ్లిందంట. సాయంత్రం నాకు ఫోన్చేసి ఎక్కడున్నావని అడిగింది. 6 గంటల కంతా ఇంటికి వచ్చేస్తానని చెప్పా. గ్రూపునకు డబ్బులు కట్టావా అని అడిగింది. నేను మేడమ్తో మాట్లాడా వచ్చి కడతానని చెప్పా. సాయంత్రం ఇంటికి వచ్చి చూస్తే తలుపువేసి ఉంది. ఎంతకూ తెరవకపోవడంతో మిద్దెపైకి వెళ్లి చూసా. అక్కడ లేకపోవడంతో ఇంటి కిటికీకొంత తీసి లోపలకు చూస్తే అమ్మాయి వేలాడుతూ కలిపించింది. వెంటనే ఇరుగుపొరుగు వారిని తీసుకువచ్చి తలుపు పగులకొడితే ముగ్గురూ వేలాడుతూ కనిపించారు. ఉద్యోగం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అప్పులు ఉన్నాయి. ఈనెల 2వ తేదీ నుంచి ఉద్యోగంలో చేరా. అప్పులు తీర్చేస్తానని కూడా చెప్పా. ఎందుకింత పనిచేసిందో తెలియడం లేదు. శివశంకర్, పద్మజ భర్తఆఖరి లేఖ పద్మజ తన బిడ్డలతో ఆత్మహత్య చేసుకునే మునుపు తన ఆఖరి లేఖను ఇలా రాసింది. ‘‘తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికీ నా జీవితం ఒక గుణపాఠం. ఒక అమ్మాయి తన భర్తకు ఎలాంటి లక్షణాలు ఉండకూడదు అని కోరుకుంటుందో, అలాంటివన్నీ నా భర్తలో ఉన్నాయి. ఇలాంటి జీవితాన్ని నేను కలలో కూడా ఊహించలేదు. శివశంకర్ నన్ను పెళ్లి చేసుకున్న పాపానికి నేను ఎంత కష్టపడాలో అంతా అనుభవించాను. నా కడుపున పుట్టిన పాపానికి నా పిల్లలు కూడా ఈ కష్టాలు అనుభవిస్తున్నారు. నిన్ను భరించే ఓపిక ఇక నాకు లేదు. ఊరంతా అప్పులే ఉన్నాయి. లోన్లు తీసేసి, నా దగ్గర డబ్బు లేదు అంటే నేను ఏం చేయాలి? నేను వాటిని తీర్చలేను. నువ్వు పనికి వెళ్లకపోయినా, ఎవరితో తిరిగినా అడిగే భార్య ఇక నీకు ఉండదు. హాయిగా ఉండు. నన్ను చేసుకుని నువ్వు కష్టపడుతున్నావు కదా, ఇక నేను ఉండను. హాయిగా బతుకు. భార్యను, పిల్లలను పోషించలేని వాడివి ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఎలాగో ఇంకో పెళ్లి చేసుకుంటావు కదా, ఈసారైనా జీవితంలో స్థిరపడ్డాక చేసుకో. అంతేగానీ నాలాగా ఇంకొక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయకు. ఇంకొక జన్మలో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకుని, పుట్టింటి వాళ్లతో కలిసి జీవించాలని దేవుడిని కోరుకుంటున్నాను..’’ ఒక్కసారి ‘‘పాప’’ అని పిలువు చాలు అన్నయ్యా ‘‘అన్నా.. ఇప్పటివరకు నీతో మాట్లాడలేదంటే నీ మీద ప్రేమ లేక కాదు, నిన్ను ఎదుర్కొనే ధైర్యం లేక. నీవు అడిగే ఏ ఒక్క ప్రశ్నకూ నా దగ్గర సమాధానం లేదు. ఎనిమిది సంవత్సరాలు అవుతోంది నీ నోటి నుండి ‘పాప’ అని విని. చివరి సారిగా నన్ను, నా పిల్లల్ని వచ్చి చూడు. ఇక చూడాలనుకున్నా మేము ఉండం. నీ నోటితో ఒక్కసారి ‘పాప’ అని పిలువు చాలు అన్నయ్యా. ప్లీజ్ అన్నా.. సారీ నాన్న, నన్ను క్షమించండి. – ఇట్లు, వి. పద్మ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం పద్మజ ఇంటి వద్ద లభించిన ఆధారాలతో ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణాలుగా తెలుస్తోంది. ఆర్థిక ఇబ్బందులేనా? వేరే ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాల పోస్టుమార్టం నివేదిక, విచారణలో కనుగొనే అంశాల ఆధారంగా ఆత్మహత్యకు కారణాలను వెల్లడిస్తాం. – జి.రవికుమార్, డీఎస్పీ -
యాటిట్యూడ్ స్టార్కు మరో షాక్.. కేసు నమోదు..!
బరాబర్ ప్రేమిస్తా మూవీ హీరో చంద్రహాస్పై మరో కేసు నమోదైంది. ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్లో బూతు సాంగ్ పాడారని ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. అతని ప్రవర్తన, వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్పై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇప్పటికే చంద్రహాస్పై ప్రముఖ జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదులో ప్రస్తావించారు. దీనిపై ఇప్పటికే మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బరాబర్ ప్రేమిస్తా మూవీలోని ఓ సాంగ్ను పాడిన చంద్రహాస్.. అందులో తన సొంత పదజాలంతో పాడారు. బూతులు ఊపయోగిస్తూ పాడడంతో అది కాస్తా సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అతనిపై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. -
వివేకానంద రెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: సుప్రీంకోర్టులో వైయస్ వివేకానంద రెడ్డి హత్యకేసుపై విచారణ జరిగింది. ఒక అంశంపైనే దర్యాప్తు చేయాలన్న ట్రయల్ కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సునీత రెడ్డి సవాల్ చేశారు. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని సీబీఐ తరుపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామని సీబీఐ పేర్కొంది.విచారణలో భాగంగా జస్టిస్ సుందరేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో మళ్లీ మినీ ట్రయల్ నిర్వహించలేమని.. ఇలా అయితే మూడు, నాలుగేళ్లు పడుతుందన్నారు. ఇది అంతులేకుండా ముందుకు వెళ్తుంది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చు. ఎవరిని విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వం అని జస్టిస్ సుందరేష్ స్పష్టం చేశారు.గత విచారణలో(జనవరి 20) కూడా.. వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ విచారణ కొసాగింపునకు ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతివ్వడాన్ని సవాల్ చేస్తూ ఆయన కుమార్తె సునీత సుప్రీంను ఆశ్రయించగా.. ‘ఇంకెంతకాలం సీబీఐ దర్యాప్తు కొనసాగించాలి?. మళ్లీ మినీ ట్రయల్ కోరుకుంటున్నారా?. ఇలా అయితే సీబీఐ దర్యాప్తు పూర్తయ్యేందుకు పదేళ్లు పడుతుంది’’ అంటూ జస్టిస్ సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా.. సునీత పిటిషన్పై వైఖరి తెలియజేయాలని సీబీఐని కోరారు. అయితే.. తమ వైఖరి తెలియజేసేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరఫు న్యాయవాది కోరడంతో.. తదుపరి విచారణను నేటికి (ఫిబ్రవరి 5) వాయిదా వేసింది. ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు కొనసాగించొచ్చని ఎవరిని.. విచారించాలన్న అంశంపై ఎలాంటి ఆదేశాలివ్వమని పేర్కొంది. -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్లోని కొన్ని భాగాలను పాకిస్తాన్లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
కాంతార ‘సీన్’ వివాదంలో కొత్త ట్విస్ట్
బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. కాంతార చిత్రంలోని ఓ దైవ సన్నివేశాన్ని ఇమిటేట్ చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆయనపై కేసు నమోదైంది. దీంతో ఈ కేసుపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అసలేం జరిగిందంటే 2025లో గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్స్ ఫెస్టివల్ జరిగింది. కాంతార చిత్రంలో హిరో రిషబ్ పోషించిన పంజుర్లి, గులిగ అనే దైవంశకు చెందిన క్యారెక్టర్లను పోషించారు. అయితే ఈ కార్యక్రమంలో రణవీర్ సింగ్ ఆ క్యారెక్టర్లను కామెడీగా అనుకరించారు. దీంతో రణవీర్ సింగ్పై కన్నడీగులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే తన తప్పు తెలుసుకున్న రణవీర్ సింగ్ వారికి క్షమాపణ చెప్పారు. అనంతరం రిషబ్ షెట్టి చాలా బాగా ఆ పాత్రలను పోషించాడు అని చెప్పడం కోసమే అలా చేశానని వివరణ ఇచ్చారు.అయితే దైవాంశకు చెందిన పాత్రలను రణవీర్ సింగ్ కామెడీగా ఇమిటేట్ చేశారని ఆరోపిస్తూ గత డిసెంబర్లో ప్రశాంత్ మితల్ అనే న్యాయవాది బెంగళూరులోని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆ దీనిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 196,299,302 ల ప్రకారం కేసు ఫైలు చేశారు. దీనిపై ఏప్రిల్ 8న విచారణ జరగనుంది.అయితే గతేడాది పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన కాంతారా చాప్టర్-1 మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. రూ.800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డులు సృష్టించింది. 2022లో విడుదలైన కాంతారా చిత్రానికి ఇది ప్రీక్వెల్గా కాంతారా చాఫ్టర్-1 విడుదలైంది. -
కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యం
సాక్షి, విజయవాడ: కూటమి ఎమ్మెల్యే శ్రీధర్ బాధితురాలి కేసుపై పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేసినా.. కానీ పోలీసులు స్పందించలేదు. ఈనెల 26న డీజీపీకి బాధితురాలు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై దళిత మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేయగా.. ఆ మహిళ ఫిర్యాదుపై కనీసం ఎఫ్ ఐఆర్ కూడా పోలీసులు నమోదు చేయలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకి ఫిర్యాదు చేసినట్టు ఆమె వెల్లడించారు. రైల్వే కోడూరు పోలీసులు, తిరుపతి ఎస్పీ ఫిర్యాదు తీసుకోలేదని బాధితురాల వాపోయింది. బాధితురాలు ఫిర్యాదును తీసుకోకుండా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. ఎమ్మెల్యేపై డీజీపీకి ఫిర్యాదు చేసినా చర్యల్లో తాత్సారం చేశారు. డీజీపీకి చేసిన ఫిర్యాదును బాధిత మహిళ విడుదల చేశారు.ఎమ్మెల్యే శ్రీధర్ శారీరక, మానసిక వేధింపులపై బాధితుల ఫిర్యాదు చేసింది. కొట్టి, తిట్టి తనను లైంగికంగా ఎమ్మెల్యే శ్రీధర్ లోబర్చుకున్నట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఐదు సార్లు తనకు అబార్షన్ చేయించినట్టు డీజీపీకి బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దారుణంపై సాక్షి కథనాలతో రాజకీయ ప్రకంపనలు రేపాయి. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కీచక పర్వంతో దూమారం రేగింది. మహిళను వేధించిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోని ప్రభుత్వం.. డైవర్షన్ కోసం కాలయాపన కమిటీని జనసేన తెరపైకి తీసుకొచ్చింది. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీని ప్రకటించింది. దళిత మహిళను వేధించిన ఎమ్మెల్యేలకు చర్యలకు పూనుకోని ప్రభుత్వం.. ఉద్యోగిని మోసం చేసిన ఎమ్మెల్యేపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. జనసేన దృష్టికి బాధిత మహిళ ముందే ఈ విషయాన్ని తీసుకెళ్లిన కానీ పట్టించుకోలేదు. -
బాబుకు బిగ్ షాక్.. మద్యం అక్రమ కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
YS వివేకా కేసులో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో సునీతకు బిగ్ షాక్..
-
మేనకగాంధీపై సుప్రీం ఆగ్రహం
వీధికుక్కల కేసులో మాజీ కేంద్రమంత్రి మేనకాగాంధీపై సుప్రీంకోర్టు తీవ్రవ్యాఖ్యలు చేసింది. దేశ అత్యున్నత ధర్మాసనంపై ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేయడం సరికాదంది. ఇటీవల మేనకగాంధీ ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ సుప్రీంకోర్టును విమర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.వీధికుక్కల కేసును సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మంగళవారం విచారించింది. మేనకాగాంధీ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ని కోర్టు ప్రశ్నిస్తూ" కొద్దిరోజుల క్రితం మీరు కోర్టులు ఉదాసీనంగా వ్యవహరించాలన్నారు. మీ క్లైంట్ ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుందో మీరు గమనించారా? మీ క్లైంట్ తప్పు చేసింది. అయినా మేము ఏ తనపై ఎటువంచి చర్యలు తీసుకోలేదు. ఇది మా గొప్పతనం కాదా? ఆమె పాడ్కాస్ట్లో మాట్లాడిన మాటలు మీరు చూశారా? ఆమె బాడీలాంగ్వేజ్ ఏంటి? అని ప్రశ్నించింది. " మీరేమో కోర్టులకు ఉదాసీనత ఉండాలంటారు మరోవైపు మీక్లైంట్ ఇష్ఠారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.మీ క్లైంట్( మేనకాగాంధీ) ప్రస్తుతం జంతువుల హక్కుల కార్యకర్తగా ఉంది, ఆమె గతంలో కేంద్రమంత్రిగా పనిచేసింది. అయితే జంతువుల రక్షణకోసం ఇప్పటి వరకూ తను చేసిన పనులు ఏంటి? వాటి కోసం బడ్జెట్లో ఏమైనా ప్రత్యేక నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించిందా? లేదా వాటికోసం మూగజీవాల ఏదైనా కొత్త పథకాలు వచ్చేలా చేసిందా అని కోర్టు ప్రశ్నించింది.కుక్కకాటు వేస్తే వాటికి ఆహారం వేసిన వారిని బాధ్యులు చేయాలని గతంలో కోర్టు చేసిన వ్యాఖ్యలు సరదాకు చేసిన కావని సీరియస్గా మాట్లాడినవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా వీధికుక్కలను నియంత్రించలేకపోతే అవి కరిస్తే పెద్దమెుత్తంలో పరిహారం చెల్లించేలా ప్రభుత్వాల్ని ఆదేశిస్తామని ఇదివరకే కోర్టు హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
మద్యం అక్రమ కేసులో మోహిత్ రెడ్డికి భారీ ఊరట
-
మమతకు సుప్రీంలో చుక్కెదురు
సుప్రీంకోర్టులో మమతా బెనర్జీకీ చుక్కెదురైంది. ఈడీ అధిాకారులపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లపై కోర్టు స్టే విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈడీ విచారణలో తన పరిధిని అతిక్రమించిందని రాష్ట్ర పోలీసులు అధికారులపై కేసులు నమోదు చేశారు. కాగా తాజాగా సుప్రీంకోర్టు దానిపై స్టే విధించింది.దానితోపాటు ఐప్యాక్ ఆపీసులో సీసీ కెమెరాల, పుటెజ్ను భద్రపరచాలని , ఫైల్ చోరీ కేసులో సాక్షాలకు రక్షణ కల్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా ఐప్యాక్ కార్యాలయం, డైరెక్టర్ ప్రాంగణంలో సోదాలు జరిపే సమయంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నుంచి ఆటంకాలు ఎదురయ్యాయని ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. "అధికారుల ఫోన్లు, కీలక డాక్యమెంట్లను మమతా బెనర్జీతో పాటు ఇతర అధికారులు లాక్కున్నారు. అనంతరం బెంగాల్ పోలీసులు సీసీటీవీ పుటేజ్ను ధ్వంసం చేశారు. మమతా బెనర్జీ ఐ-ప్యాక్ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఏంటి" అని తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈడీ దర్యాప్తును అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలని బెంగాల్ సీఎం మమతతో పాటు పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
సీబీఐ ఆఫీస్ లో హీరో విజయ్
-
కరూర్ తొక్కిసలాట వెనుక కుట్రకోణం
-
బాలికపై సామూహిక అత్యాచారం : యూట్యూబర్ అరెస్ట్, పరారీలో ఎస్ఐ
లక్నో : ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మరో దారుణ ఘటన కలకలం రేపింది. 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి, కదులుతున్న కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒక పోలీసు అధికారి ఒక యూట్యూబర్ ఉండటం మరింత ఆందోళన రేపింది.బాధిత బాలిక పోలీసులకు అందించిన సమాచారం ప్రకారం కాన్పూర్లోని సచెండి ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 14 ఏళ్ల బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి యూట్యూబర్ శివబరన్ అరెస్ట్ చేశారు. సబ్-ఇన్స్పెక్టర్ అమిత్ కుమార్ మౌర్య పరారీలో ఉన్నాడు.ఏం జరిగిందంటే..7వ తరగతి చదువు మానేసిన మైనర్ బాలిక సోమవారం రాత్రి సుమారు 10 గంటలకు తన ఇంటి నుండి బయటకు వెళ్ళగా, మహీంద్రా స్కార్పియోలో వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేశారు.అనంతరం సచెండిలోని రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వాహనంలోనే దాదాపు రెండు గంటల పాటు ఆమెపై లైంగిక దాడి జరిగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఇంటి బయట వదిలి వెళ్లారు. బాధితురాలి సోదరుడు అర్ధరాత్రి సమయంలోఆమెను గమనించి 112కు డయల్ చేసి పోలీసులు ఫిర్యాదు చేశాడు. అయితే ఎలాంటి తక్షణ చర్యలు తీసుకోలేదు.నిందితులలో ఒకరు పోలీసని చెప్పడంతో తమ ఫిర్యాదును పట్టించుకోలేదని బాలిక సోదరుడు ఆరోపించాడు. ఉన్నతాధికారులను ఆశ్రయించిన తర్వాతే కేసు నమోదు చేశారని, అంతేకాకుండా ఫిర్యాదులో నిందితుల పేర్లను మొదటగా చేర్చలేదని పేర్కొన్నాడు.బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించామని, నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) దినేష్ త్రిపాఠి తెలిపారు. జర్నలిస్టును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని, పోలీసు కానిస్టేబుల్ను గుర్తించి విచారణ పూర్తయిన తర్వాత అతడిని కూడా అరెస్టు చేస్తామని డీసీపీ తెలిపారు. కిడ్నాప్, సామూహిక అత్యాచారానికి సంబంధించిన సెక్షన్లతో పాటు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేశామని, విచారణ పూర్తి పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు.పరారీలో ఉన్న SIని పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని మరో పోలీసు అధికారి రఘుబీర్ లాల్ విలేకరులకు తెలిపారు. -
50 వేలు సుపారీ ఇచ్చి ప్రియుడితో కలిసి..
విశాఖపట్నం: ప్రియుడి మోజులో పడి, సుపారీ ఇచ్చి మరీ భర్తను అంతమొందించింది ఓ ఇల్లాలు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో జరిగిన ఈ ఘటన వివరాలు పీఎంపాలెం పోలీసులు బుధవారం తెలిపారు. బక్కనపాలెం ఎనీ్టఆర్ కాలనీకి చెందిన అల్లాడ నాగరాజు(38), రమ్య దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. కంచరపాలేనికి చెందిన సంజీవి వసంతరావుతో రమ్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమకు అడ్డు వస్తున్నాడనే నెపంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి హత్యకు పథకం రచించింది. నాగరాజును చంపేందుకు వీరిద్దరూ కంచరపాలేనికి చెందిన బాలకృష్ణ, ప్రవీణ్కు రూ.50 వేలు ఇచ్చారు. నిందితులు వసంతరావు, బాలకృష్ణ, ప్రవీణ్ పథకం ప్రకారం నవంబరు 29న మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలో గల ఓ లాడ్జిలో నాగరాజును హత్య చేసి శవాన్ని తిమ్మాపురం వెళ్లే రోడ్డులో ఉన్న బావికొండ సమీప నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అనంతరం ఏమీ తెలియనట్లు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ డిసెంబర్ 17న పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు ఇచి్చంది. మిస్సింగ్ కేసు నమోదు చేయాలని, తన భర్త మద్యానికి బానిసయ్యాడని, రూ.5 వేలు నగదు, బంగారం పట్టుకుని వారం రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. అనుమానం వచి్చన పోలీసులు రమ్యను తమదైన శైలిలో విచారించగా, హత్య ఉదంతం బయటపడింది. పథకం ప్రకారం తామే హత్య చేసినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు బుధవారం మృతదేహం పడేసిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. బాగా పాడైపోయిన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. కేసు నమోదు చేసి, నిందితులు నలుగురినీ అరెస్టు చేసినట్లు పీఎంపాలెం సీఐ బాలకృష్ణ చెప్పారు. -
జైల్లో గంజాయి ఘటన .. అధికారి సస్పెండ్
సాక్షి నిజామాబాద్: సెంట్రల్ జైల్లో అధికారుల నిర్లక్ష్యంపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఇటీవల గంజాయి తీసుకున్నారనే నెపంతో ఇద్దరు ఖైదీలపై దాడి చేసిన జైలర్ ఉపేందర్ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరో జైలర్ సాయి సురేశ్పై బదిలీ వేటు వేశారు. అంతేకాకుండా జైలు సూపరిండెంట్ దశరథంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేశారు.ఇటీవల నిజామాబాద్ జైలులో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇద్దరు ఖైదీలు గంజాయికోసం ఘర్షణ పడుతుండడంతో వారిని గమనించిన జైలు అధికారి వారిపై దాడిచేశారు దీంతో వారికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఒకరికి ప్రక్కటెముకలు విరిగాయి. దీంతో ఈ విషయం అందరికీ తెలిసింది. ఈకేసును బోధన్ కోర్టు విచారించగా పోలీసులు తమను తీవ్రంగా కొట్టారని న్యాయమూర్తి ముందు ఖైదీలు తెలపారు. దీంతో ఈ కేసుపై కోర్టు విచారణకు ఆదేశించింది.ఆ నేపథ్యంలో ఉన్నతాధికారులు వారిపై చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా జైలులో గంజాయి, బీడీలు, ఇతర నిషేధిత వస్తువులతో అక్రమ వ్యాపారం చేస్తున్న ఏడుగురు ఖైదీలను సంగారెడ్డి, చర్లపల్లి, చంచల్గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. -
ఉన్నావ్ కేసులో సుప్రీం షాక్.. నిందితుని బెయిల్ పై స్టే..
-
28న ఆరావళిపై సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: దేశంలోని ఆరావళి పర్వత శ్రేణుల నిర్వహణకు సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. వివాదాస్పదంగా మారిన ఆరావళి పర్వతాల నిర్వచనం, దాని అనుబంధ అంశాలపై సుప్రీంకోర్టు డిసెంబర్ 28న విచారణ చేపట్టనుంది. ఈ వ్యవహారాన్ని సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా (స్వచ్ఛందంగా) స్వీకరించడం గమనార్హం.చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ ఎ.జి. మసీహ్లతో కూడిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. కోర్టు జాబితాలో ఈ అంశాన్ని ‘ఆరావళి కొండలు-పర్వత శ్రేణుల నిర్వచనం, సంబంధిత అంశాలు’గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫై చేసిన ఆరావళి పర్వత శ్రేణుల కొత్త నిర్వచనం చుట్టూ వివాదం నెలకొంది. ఈ కొత్త నిబంధనల కారణంగా ఈ పర్వత పర్యావరణ వ్యవస్థలో భారీగా మైనింగ్కు అవకాశం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని విస్తారమైన ఆరావళి ప్రాంతాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎటువంటి శాస్త్రీయ అంచనా లేకుండా, ప్రజాభిప్రాయాన్ని సేకరించకుండానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని శాస్త్రవేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రస్తుతానికైతే మైనింగ్ కోసం సమగ్ర నిర్వహణ ప్రణాళిక సిద్ధమయ్యే వరకు, ఆరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరావళి ప్రాంతంలో కొత్త లీజులను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పర్యావరణం, భూగర్భ శాస్త్రం, ప్రకృతి పరిరక్షణ ఆధారంగా మైనింగ్ నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ఐసీఎఫ్ఆర్ఈ)ని ఆదేశించింది. కేంద్రం ఇప్పటికే నిషేధించిన ప్రాంతాలకు అదనంగా ఈ జోన్లను గుర్తించాల్సి ఉంటుంది. సోమవారం సుప్రీం కోర్టులో జరగబోయే విచారణలో ఆరావళి భవిష్యత్తుపై ఎటువంటి ఆదేశాలు వెలువడుతాయనే ఆసక్తి నెలకొంది.ఇది కూడా చదవండి: ‘షార్ట్లతో తిరగొద్దు’.. హుకుం జారీ! -
డ్రగ్స్ కేసు.. రకుల్ సోదరుడు పరార్!
-
భర్త సంసారానికి పనికిరాడని.. నవ వధువు
యశవంతపుర: ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవ వధువు గానవి (26) గురువారం రాత్రి చనిపోయింది. వివరాలు.. అక్టోబర్ ఆఖరిలో సూరజ్తో గానవికి వివాహమైంది. వీరిద్దరూ బెంగళూరువాసులే. ఇటీవల శ్రీలంకకు హనుమూన్కు వెళ్లాగా అక్కడే గొడవపడి తిరిగి వచ్చారు. మూడురోజుల కిందట ఆమె భర్త ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేర్పించారు. బ్రెయిన్డెడ్ అయి చివరకు మరణించింది. అతడు మగాడు కాదు గానవి పెద్దమ్మ మాట్లాడుతూ భర్త నపుంసకుడని, సంసారానికి పనికిరాడని గానవి తొలి రాత్రిరోజే తనకు చెప్పి బాధపడిందన్నారు. పెద్దమొత్తంలో బంగారం, స్థలం, కారు, ప్రతి నెలా ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని భర్త వేధించేవాడని బంధువులు అరోపించారు. వారి ఫిర్యాదు మేరకు రామమూర్తినగర పోలీసులు నమోదుచేశారు. -
నిన్ను 53 రోజులు జైలుకు పంపింది అందుకే
-
అడ్డంగా ఇరుక్కున్నారుగా!! పచ్చ బొట్టు సాక్షిగా బయటపడ్డ పచ్చి నిజం
-
ఆధారాల్లేవ్..! మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ..! CID.. బాబు భజన..
-
యువతికి వేధింపులు : హౌసింగ్ సొసైటీపై రూ.62లక్షల దావా, చివరికి
బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి తనకు జరిగిన అవమానం, వేధింపులపై పోరాడిన తీరు విశేషంగా నిలిచింది. హౌసింగ్ సొసైటీ బోర్డు సభ్యుల వేధింపులు, అతిక్రమణ , బెదిరింపులను సహిస్తూ మౌనంగా ఉండిపోలేదు ఆమె. వారిపై చట్టపరమైన చర్యలకు దిగి హౌసింగ్ సొసైటీపై రూ.62 లక్షలు దావా వేసింది. సొసైటీలో ఫిర్యాదు చేసి విజయాన్ని సాధించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంది. స్టోరీ ఏంటీ అంటే..బాధిత యువతి రెడ్డిట్లో షేర్ చేసిన వివరాల ప్రకారం అపార్ట్మెంట్లో తన స్నేహితులతో ఏర్పాటు చేస్తున్న మీట్ ఘర్షణ దారితీసింది. అది చివరికి రూ.62 లక్షల సివిల్ దావా, నిందితులైన బోర్డు సభ్యులకు 20వేల జరిమానా, తొలగింపుతో ముగిసింది. తన ఐదుగురు స్నేహితులు ఆమె ఇంటికి వచ్చినప్పుడు వివాదం మొదలైంది. వారు తన ఫ్లాట్కి వచ్చినపుడు, ఎలాంటి సంగీత ధ్వనులు లేకుండా, గోల, గందరగోళం లేకుండా, చాలా కామ్గా తమ ఇంట్లో ఆమె వంట చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు, ఇంతలో ఆ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యుడు ఆమె ఫ్లాట్కి వచ్చి "బ్యాచిలర్లకు అనుమతి లేదు" అని చెప్పి, ఫ్లాట్ యజమానికి ఫోన్ చేయమని కోరడంతో సమస్య మొదలైంది. తాను తన ఓనర్తో మాట్లాడానని, మీ సమస్య ఏంటి అని ప్రశ్నించింది. ఆ తరువాత కొద్దిసేపటికే, నలుగురైదుగురు పురుషులు ఆమె గదిలోకి బలవంతంగా ఎంట్రీ ఇచ్చారు. మద్యం, గంజాయి తాగుతున్నారని ఆరోపిస్తూ నానా యాగీ చేశారు. అంతటితో ఆగిపోలేదు. మరుసటి రోజు ఆమెను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ మళ్లీ గొడవకు దిగారు. దీంతో ఆమె ఫ్రెండ్స్లోని జెంట్స్ వారిని బైటికి నెట్టారు. రెచ్చిపోతున్న ఒక సభ్యుడిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో సొసైటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసు అధికారులు వచ్చి ఆమెను యాజమాన్యాన్ని నిరూపించమని అడిగారు. అయితే తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందికి కలిగించలేదంటూ అందుకు నిరాకరించింది. అలాగే లివింగ్-రూమ్ కెమెరాలో రికార్డ్ అయిన విజువల్స్ను చూపించింది.అలాగే ఆమె CCTV ఆధారాలను బిల్డర్చ సొసైటీ ఛైర్మన్కు సమర్పించినప్పుడు, నిందితులైన సభ్యులను వెంటనే తొలగించారు ఒక్కొక్కరికి రూ. 20,000 జరిమానా విధించారని మరో పోస్ట్లో వెల్లడించింది.మరోవైపు వేధింపులు, అతిక్రమణ, దాడి ఆరోపణలతో హౌసింగ్ సొసైటీ, బోర్డు సభ్యులకు నోటీసులు జారీ చేసింది. రూ. 62 లక్షల పరిహారం చెల్లించాలంటే దావా వేసింది. అలాగే పురుషులు మళ్ళీ తన ఫ్లాట్లోకి రాకుండా ఉండేలా శాశ్వత నిషేధాన్ని కూడా ఆమె కోరింది.సోషల్ మీడియా ప్రశంసలుఆమె పోస్ట్లు వైరల్ గామారాయి. ఆమె ధైర్యాన్ని , సంకల్పాన్ని నెటిజన్లు కొనియాడారు. ఆ కేసుతో ముందుకు సాగండి—ఎవరూ ఒకరి ఇంట్లోకి చొరబడలేరు” అని ఒకరు ధైర్యం చెప్పారు. -
మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో బాధితురాలే అరెస్ట్
సాక్షి, పార్వతీపురం మన్యం జిల్లా: స్త్రీ శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏపై కేసులో పోలీసులు స్వామి భక్తి ప్రదర్శించారు. ఈ కేసులో బాధితురాలినే పోలీసులు అరెస్ట్ చేశారు. మంత్రి డైరెక్షన్లో విచారణ చేసిన పీఏను కాపాడేందుకు యత్నిస్తున్న పోలీసులు.. కేసు పెట్టిన బాధితురాలినే అరెస్ట్ చేశారు. రెడ్బుక్ రాజ్యాంగంతో నిందితులను కాపాడిన పోలీసులు.. వాట్సాప్ చాటింగ్ సైబర్ క్రైమ్ అంటూ కేసు పక్కదారి పట్టించారు.మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ పై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. టీచర్గా పనిచేస్తున్న భర్త కరోనాతో చనిపోయిన తన నుంచి కారుణ్య నియామకం కోసం డబ్బులు వసూలు చేయడంతోపాటు మానసికంగా, శారీరకంగా వేధించాడని, లైంగిక వాంఛ తీర్చాలంటూ వేధించాడని బాధితురాలు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అయితే, లైంగికదాడి కేసులో నిందితుడు సతీష్ను ఇప్పటివరకు టచ్ చేయని పోలీసులు.. బాధితురాలినే అరెస్ట్ చేయడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.మంత్రి సంధ్యారాణి పీఏ సతీష్ దురాగతాలపై బాధితురాలి కథనం ప్రసారం చేసినందుకు సాక్షి మీడియాకు సాలూరు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ ఫిర్యాదుతో సాక్షి మీడియాకు పోలీసులు ఫిర్యాదులు ఇచ్చినట్టు తెలిపారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపకుండా తాత్సారం చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదులపై మాత్రం ఆగమేఘాల మీద కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం. కాగా, బాధితురాలిని 24 గంటలపాటు పోలీసులు అదుపులోనే ఉంచుకున్న కథనాన్ని సాక్షి ప్రసారం చేసింది. -
2019 రియల్టర్ హత్య కేసు.. CBI అదుపులో DK ఫ్యామిలీ
-
మరదలితో ఎఫైర్..! మీర్పేట మాధవి కేసులో షాకింగ్ నిజాలు
-
టీటీడీ పరకామణి చోరీ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తిరుమలలో ఏం జరిగినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని.. ఏ ఘటన జరిగినా టీటీడీ బోర్డుదే బాధ్యత అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. కానుకల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్న ధర్మాసనం.. టెక్నాలజీని వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది.టీటీడీ పరకామణి చోరీ కేసు పిటిషన్పై హైకోర్టు ఇవాళ(డిసెంబర్ 19, శుక్రవారం) విచారణ చేపట్టింది. పరకామణి లెక్కింపు వ్యవహారంలో గత విచారణలో సలహాలు ఇవ్వమన్న దానిపై ఏమైనా సలహాలు ఇస్తారా అంటూ టీటీడీ స్టాండింగ్ కౌన్సిల్ను న్యాయస్థానం ప్రశ్నించింది. కానుకల లెక్కింపు,పర్యవేక్షణ, రికార్డుల సేకరణ కోసం AI టెక్నాలజీ, కంప్యూటర్స్ వినియోగించాలని పేర్కొంది. చివరి పైసా వరకు లెక్క సరిగ్గా ఉండాలని.. చోరీలు, మోసాలు జరగకుండా చూడాలని హైకోర్టు చెప్పింది.టీటీడీ బోర్డ్ వెంటనే వీటిపై చర్యలు చేపట్టాలని.. ఒక ముసాయిదా రూపొందించాలని పేర్కొంది. రెండు వారాల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. టీటీడీ బోర్డు 8 వారాల్లోగా ప్లాన్ B పై నివేదిక సమర్పించాలని ఆదేశించిన హైకోర్టు.. తదుపరి విచారణ వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. -
సుప్రీం తీర్పునే మార్చేసిన ఈనాడు..
-
వివేకా కేసులో చంద్రబాబుకు సీబీఐ కోర్టు షాక్
-
నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీకి షాక్.. సోనియా, రాహుల్కు ఊరట
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో మంగళవారం ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు నుంచి కాంగ్రెస్ దిగ్గజ నేతలు సోనియా, రాహుల్ గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన తాజా చార్జిషీట్ను పరిగణనలోకి తీసుకునేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ జరిపిన దర్యాప్తు.. కొత్తగా నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కాకుండా, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి దాఖలు చేసిన ప్రైవేట్ ఫిర్యాదు, మేజిస్ట్రేట్ జారీ చేసిన సమన్ల ఉత్తర్వుల ఆధారంగానే జరిగిందని కోర్టు గమనించింది. అందుకే ఎఫ్ఐఆర్ కాపీని పొందే అర్హత ఈ దశలో నిందితులకు లేదని కూడా కోర్టు తీర్పునిచ్చింది. అయితే ఈ కేసుకు సంబంధించి తదుపరి దర్యాప్తు కొనసాగించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చింది.ఈ కేసులో మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఈడీ ఫిర్యాదు మేరకు ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)సోనియా , రాహుల్ తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. తమ అగ్ర నాయకత్వంపై కేంద్రంలోని మోదీ-షా ద్వయం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ వేధింపులు, బెదిరింపులు, ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించింది. నేషనల్ హెరాల్డ్ కేసు పూర్తిగా అవాస్తవమని, అంతిమంగా న్యాయమే గెలుస్తుందని కాంగ్రెస్ వాదించింది.కాంగ్రెస్ చేసిన ఈ ఆరోపణలను బీజేపీ తిరస్కరించింది. సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మాజీ న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కాంగ్రెస్ వాదనలను నిరాధారమని కొట్టిపారేశారు. ఈ ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైనప్పుడు ప్రధాని మోదీ పదవిలో లేరని, ఈ కేసు 2008 నాటిదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు మానుకొని, వారు చేసిన దోపిడీకి లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం తన పని తాను చేసుకోనివ్వాలని ఆయన పేర్కొన్నారు.ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఎఫ్ఐఆర్లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ 120(బి), మోసానికి సంబంధించిన సెక్షన్ 420 కింద ఫిర్యాదులు నమోదయ్యాయని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. ఈ కేసు పాతది కాబట్టి దీనిని పాత శిక్షాస్మృతి (పెనల్ కోడ్) కింద నమోదు చేశారని ఆయన తెలియజేశారు. కాగా ఈ కేసులో గాంధీలకు తాత్కాలిక ఉపశమనం లభించినప్పటికీ, ఈడీ తదుపరి దర్యాప్తుకు కోర్టు అనుమతించడం ఉత్కంఠ కలిగిస్తోంది. ఇది కూడా చదవండి: విజయ్ దివస్ 2025: పాక్ను మట్టి కరిపించి.. ‘బంగ్లా’ను గెలిపించి.. -
మరోకేసు విజయవంతంగా మూసివేయించిన చంద్రబాబు
-
సందేశ్ఖాలీ కేసు: కీలక సాక్షిపైదాడి,కుమారుడు, డ్రైవర్ మృతి
కోల్కతా, సాక్షి : పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన సందేశ్ఖలి వివాదానికి సంబంధించిన కేసుల్లో కీలక సాక్షిపై దాడి జరిగింది. ఈ ప్రమాదంలో భోలానాథ్ ఘోష్ తీవ్ర గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకోగా, అతని చిన్న కుమారుడు , కారు డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదం అనేక అనుమానాలకు తావిస్తోంది.ఈకేసుకు సంబంధించి బుధవారం కోర్టుకు వెళుతుండగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బోయ్ఖలి పెట్రోల్ పంప్ సమీపంలో ఒక ట్రక్కు అమిత వేగంతో వచ్చి అతని వాహనాన్ని ఢీకొట్టింది. ట్రక్కు కారును ఢీకొట్టి, ఈడ్చుకెళ్లి, సమీపంలోని నీళ్లలోకి నెట్టివేసింది. వెంటనే ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఘోష్ చిన్న కుమారుడు సత్యజిత్ ఘోష్ (32), కారు డ్రైవర్ సహనూర్ మొల్లా (27) స్పాట్లోనే మరణించారు. తీవ్రంగా గాయపడిన భోలానాథ్ను మెరుగైన చికిత్స కోసం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.మృతదేహాలను పోస్ట్మార్టం పరీక్ష కోసం కోల్కతాలోని ఎస్ఎస్కెఎం ఆసుపత్రికి తరలించారు.సందేశ్ఖాలి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్ తనపై దాఖలు చేసిన అనేక కేసుల్లో ఒకదానికి సంబంధించి బసిర్హాట్ సబ్-డివిజనల్ కోర్టుకు హాజరు కావడానికి ఘోష్ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. చదవండి: మొటిమల చికిత్స కోసం వెళితే, దారుణం: రూ. 31 లక్షల దావాహత్యకు కుట్రఇది ఉద్దేశ పూర్వకంగా చేసిన దాడి అని, తన తండ్రిని హత్య చేసేందుకు పన్నిన పన్నాగమని ఘోష్ పెద్ద కుమారుడు బిశ్వజిత్ ఆరోపించారు. షాజహాన్ జైలు నుండే ఈ పథకం వేశాడన్నారు. 2024 జనవరిలో సందేశ్ఖాలిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులపై జరిగిన దాడిలో, అలాగే షాజహాన్కు వ్యతిరేకంగా సమాచారం ఇచ్చిన సంబంధిత సిబిఐ దర్యాప్తులో ఘోష్ ప్రధాన సాక్షులలో ఒకరిగా ఉన్నారు.ఏంటీ సందేశ్ఖాలీ కేసుపశ్చిమ బెంగాల్లోని ఉత్తే 24 పరగణాల జిల్లాలో ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, లైంగిక వేధింపులు, భూకబ్జాలకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. మహిళలను బంధించి లైంగికంగా హింసించారని ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం స్పందించలేదని బాధితులు తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో కలకలం రేపింది. ఈ అంశాన్ని కోల్కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసంపై ఈడీ అధికారులు తనిఖీల నిమిత్తం వెళ్లినపుడు షాజహాన్ అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు.షాజహాన్ అనేక కేసులకు సంబంధించి గతంలో అరెస్టు , కస్టడీలో ఉన్నాడు. మనీలాండరింగ్ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే కోల్కతాలోని ప్రత్యేక కోర్టులో మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దాఖలు చేసిన ED ప్రాసిక్యూషన్ ఫిర్యాదు, భూకబ్జాలు, అక్రమ చేపల పెంపకం మరియు వ్యాపారం, ఇటుక బట్టీలను స్వాధీనం చేసుకోవడం, కాంట్రాక్టుల కార్టలైజేషన్, అక్రమ పన్నులు ,లెవీల వసూలు మరియు భూమి ఒప్పందాలపై కమీషన్లపై కేంద్రీకృతమై ఉన్న నేర సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో వివరించింది. ఇదీ చదవండి: Indigo Crisis హర్ష్ గోయెంకా నో డిలే, నో డైవర్షన్ వైరల్ వీడియో -
పెళ్లి చేసుకోమని వేధిస్తోంది
ఛత్తీస్గఢ్లో ఒక మహిళా డీఎస్పీపై కేసు నమోదయ్యింది. కల్పనాఅనే మహిళా డీఎస్పీ తన వద్ద నుంచి రూ.రెండు కోట్ల రుపాయలు కాజేసిందని దీపక్ థండన్ అనే వ్యాపార వేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా తన భార్యకు విడాలకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని తీవ్ర వేధింపులకు గురిచేస్తోందని తెలిపారు.ఛత్తీస్గఢ్ రాయిపూర్కు చెందిన దీపక్ థండన్ అనే వ్యాపారవేత్త, కల్పనా అనే మహిళా డీఎస్పీపై సంచలన ఆరోపణలు చేశారు. కల్పనా తనను తీవ్రంగా వేధిస్తుందని తెలిపారు. 2021లో తామిద్దరం తొలిసారిగా కలుసుకున్నామని కొద్దిరోజులకే ఇద్దరం సన్నిహితంగా మెదిలామన్నారు. ఆ తర్వాత నుంచి కల్పనా తన వద్ద నుంచి పెద్ద మెుత్తంలో డబ్బు గుంజసాగిందన్నారు. తనకు రూ.12 లక్షల విలువ గల డైమండ్ రింగ్ కానుకగా ఇచ్చానని, రాయ్పూర్లో ఉన్న ఒక హోటల్ తన సోదరుడి పేరు మీదకు మార్చేలా ఒత్తిడి తెచ్చిందని తెలిపారు.ఆ తర్వాత కొంతకాలానికే కల్పనా రూ.30 లక్షలు విలువజేసే మరో ప్రాపర్టీ తన పేరు మీదకు మార్చాలనడంతో ఆ విధంగా చేశానన్నారు. అంతేకాకుండా తనకు రూ. 22లక్షల విలువైన కారును బహుమతిగా ఇచ్చానని ఆ వాహనం తన భార్య పేరు మీద తీసుకున్నానని తెలిపారు. కాగా ఇప్పుడు తన భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లిచేసుకోవాలని వేధిస్తోందని తెలిపారు. తమ సంబంధం విషయం తన భార్యకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరిగాయని దీపక్ అన్నారు.ఈ నేపథ్యంలో డీఎస్పీ వేధింపులు తట్టుకోలేక తన భార్యతో కలిసి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను డీఎస్పీ కల్పనా కొట్టిపడేసింది. ఆ వ్యాఖ్యలన్ని నిరాధారమైనవని తెలిపింది. -
మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు
వింటర్ చైల్డ్, పర్వత మనిషి తనకు తాను గర్వంగా అభివర్ణించుకున్న ఒక పర్వాతారోహకురాలు అనూహ్య పరిస్థితుల్లో కన్ను మూసింది. ఈ ఘటన పర్వతారోహకుల ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే ఈ విషాదానికి ఆమె ప్రియుడే కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అసలు ఏం జరిగిందంటే..కెరిస్టీన్ గుర్ట్నర్ అనే33 ఏళ్ల ఆస్ట్రియన్ మహిళ 39 ఏళ్ల ప్రియుడు థామస్ ప్లాంబర్గర్తో ఎత్తైన శిఖరం గ్రాస్గ్లాక్నర్ను అధిరోహించారు. థామస్ అనుభవజ్ఞుడైన గైడ్ కూడా. ఈ జంట అనుకున్న దానికంటే రెండు గంటలు ఆలస్యంగా ఆ అవరోహణను ప్రారంభించారు. -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు హరికేన్-పవర్ విండ్స్ లాంటి తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. గుర్ట్నర్ అలసిపోయిన గుర్ట్నర్ 150 అడుగుల దిగువన దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అయితే ఆమెను గైడ్ చేసి సాయం చేయాల్సిన ప్లాంబర్గర్ నిర్లక్ష్యంగా వదిలేశాడు. అత్యవసర దుప్పట్లు లేదా బివౌక్ సంచిని ఉపయోగించలేదని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. కొన్ని గంటల తరువాత గానీ రెస్క్యూ సర్వీసులను సంప్రదించలేదు. పైగా మొదటి కాల్ తర్వాత తన ఫోన్ను సైలెంట్లో పెట్టుకున్నాడు. దూర నుంచి ఒక హెడ్టార్చ్తప్ప ఇంకేమీ వెబ్ క్యామ్లో కనిపించలేదు.మరోవైపు తీవ్రమైన గాలుల కారణంగా మరుసటి రోజు ఉదయం దాకా రెస్క్యూ బృందాలు గుర్ట్నర్ను చేరుకోలేకపోయాయి. అప్పటికే ఆమె చనిపోయిందని గుర్తించారు. దీంతో ప్లాంబర్గర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.స్నేహితురాలిలా కాకుండా, ఆల్పైన్ హై-ఎలిట్యూడ్ టూర్లతో ఇప్పటికే చాలా అనుభవమున్న వ్యక్తిగా, టూర్ను ప్లాన్ చేశాడు కాబట్టి,బాధ్యతాయుతమైన గైడ్గా వ్యవహరించాలని ఇన్స్బ్రక్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం పేర్కొంది. తీవ్ర నిర్లక్ష్యంతో నరహత్యకు పాల్పడ్డాడని, దోషిగా తేలితే మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు దురదృష్టవశాత్తూ జరిగినవిషాదకరమైన ప్రమాదమని ప్లాంబర్గర్ న్యాయవాది వాదిస్తున్నాడు. ఈ కేసును 2026, ఫిబ్రవరి 19న, ఇన్స్బ్రక్ ప్రాంతీయ కోర్టులో విచారించ నున్నారు. గుర్ట్నర్ కోసం స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆన్లైన్ స్మారక పేజీని ఏర్పాటు చేశారు. అద్భుతమైన మహిళ అంటూ కెర్స్టిన్ గుర్ట్నర్కు అనేకమంది నివాళులర్పించారు. పలు సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. -
ఆశారాం బాపుకు ఝలక్ ?
ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీంకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో బాధితురాలి తరపు లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నాడని కోర్టుకు తెలిపారు. ఆశారాం బాపుకు అనారోగ్య కారణాలతో అక్డోబర్ లో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.వివాదాస్పద మత గురువు ఆశారం బాపు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. తనకు వయసు రీత్యా తీవ్రమైన ఆరోగ్య సమస్యలున్నాయని కనుక మెరుగైన చికిత్స కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆశారం బాపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన వయస్సు 86 సంవత్సరాలని వయస్సు రీత్యా వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. వీటిని విచారించిన కోర్టు ఆయనకు అక్డోబర్ లో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.అయితే బాధితురాలి తరపు న్యాయవాది ప్రస్తుతం ఆశారాం బాపు ఆరోగ్యంగానే ఉన్నారని కోర్టుకు తెలిపారు. ఆశారం బాపు ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారు. ఆయన అహ్మదాబాద్, ఇండోర్, జోధ్పూర్ నగరాలు ప్రయాణం చేశారు. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అలా దేశవ్యాప్త పర్యటనలు చేయలేరని పేర్కొన్నారు. దీనిని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆశారం బాపుకిచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు.ఆశారం బాపుపై కేసు ఏమిటి2013 ఆగస్టు 15న ఆశారం బాపు దగ్గర్లోని తన ఆశ్రమంలో తనపై ఆత్యాచారం చేశారని 16 ఏళ్ల బాలిక దీంతో ఆశారం బాపుని అరెస్టు చేసి జోద్ పూర్ సెంట్రల్ జైలుకి తరలించారు. రెండు నెలల తరువాత గుజరాత్ లోని సూరత్ ఆశ్రమంలో ఆశారాం బాపు తన కుమారుడు తమపై అత్యాచారం చేసారని ఇద్దరు అక్కాచెల్లెల్లు కేసు నమోదు చేశారు. వీటిపై విచారణ జరిపిన జోద్ పూర్ కోర్టు 2018 ఏప్రిల్ 25న ఆశారాం బాపుకు జీవిత ఖైధు విధించింది. ఈ నేపథ్యంలో 12 సంవత్సరాల తరువాత తొలిసారిగా గత అక్టోబర్ లో ఆశారాం బాపుకు తొలిసారిగా ఈ ఏడాది ప్రారంభంలో బెయిల్ వచ్చింది. -
మహిళా వ్యాపారవేత్తపై ఫార్మా బాస్ నిర్వాకం : తుపాకీతో బెదిరించి, న్యూడ్ వీడియోలు
ముంబైలో జరిగిన అమానవీయ ఘటన కలకలం రేపింది. మహిళా వ్యాపారవేత్తను తుపాకీతో బెదిరించి, వివస్త్రను చేసి వీడియోల రికార్డ్ చేశారు కొంతమంది దుండగులు. ఎదురు తిరిగి మాట్లాడితే, ఫోటోలు, వీడియోలను బహిర్గతం చేస్తానని బెదిరించిన వైనం సభ్య సమాజాన్ని నివ్వెర పర్చింది.మేనేజింగ్ డైరెక్టర్ , వ్యవస్థాపక సభ్యుడు అయిన జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్ సహా ఒక ప్రైవేట్ కంపెనీ సీనియర్ అధికారులు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమావేశం నెపంతో ఫ్రాంకో-ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ (FIPPL) కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం ఆమెను వేధించి, తుపాకీతో బెదిరించి ఆమె నగ్నంగా మారాలని బలవంతం చేశారు. మహిళపై దుర్భాషలాడి, ఆమె నగ్న వీడియోలు, ఫోటోలను రికార్డ్ చేసి, దాని గురించి ఎవరికైనా తెలియజేస్తే వాటిని బహిరంగంగా వెల్లడిస్తానని బెదిరించారని ఆరోపించారు. దీనికి సంబంధించి 51 ఏళ్ల బాధిత మహిళ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసులు జాయ్ జాన్ పాస్కల్ పోస్ట్, మరో ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులపై లైంగిక వేధింపులు, దాడి మరియు క్రిమినల్ బెదిరింపుల కింద అభియోగాలు మోపారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు. -
పెంచలయ్య హత్య కేసులో పురోగతి
సాక్షి, నెల్లూరు జిల్లా: ఉద్యమకారుడు పెంచలయ్య హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హత్య కుట్రదారు ఆరని కామాక్షిని అరెస్ట్ చేసిన పోలీసులు.. రిమాండ్కు తరలించారు. బోణిగానితోటలోని కామాక్షి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఏ1 నిందితుడు జేమ్స్ పోలీసుల అదుపులో ఉన్నాడు. జేమ్స్ కాలుకి బుల్లెట్ తగలడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.పెంచలయ్య హత్య కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వారి వద్ద నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ‘‘పెంచలయ్య గంజాయి, మాదక ద్రవ్యాలపై పోరాటం చేస్తుండేవాడు. అదే కాలనీకి చెందిన గంజాయి వ్యాపారి ఆరవ కామాక్షి పెంచలయ్యపై కక్ష పెంచుకొంది. తన వ్యాపారానికి అడ్డం వస్తున్నాడని హతమార్చడానికి కుట్ర పన్నింది. స్కూల్ నుంచి బిడ్డను తీసుకొస్తున్న క్రమంలో పెంచలయ్యపై దాడి చేశారు..పది మంది పాశవికంగా పొడిచి చంపారు. A1 జేమ్స్ ను ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది. నేడు కామాక్షిని గంజాయి పట్టుబడ్డ కేసులో అరెస్టు చేశారు. పీటీ వారెంట్ కింద ఈ కేసులో కామాక్షిని అదుపులోకి తీసుకుంటాం. ఈ హత్య కేసులో మొత్తం 14 మంది వున్నారు. 9 మందిని అరెస్ట్ చేశాం. మిగతా ఐదుగురి కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని డీఎస్పీ వెల్లడించారు.ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ ఆగ్రహంకామ్రేడ్ పెంచలయ్యను గంజాయి గూండాలు హత్య చేయడంపై ప్రజానాట్య మండలి, డీవైఎఫ్ఐ నేతలు మండిపడ్డారు. కామ్రేడ్ పెంచలయ్య హత్యకు గురికావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో గంజాయి గ్యాంగ్లు రెచ్చిపోతున్నాయని డీవైఎఫ్ఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి గ్యాంగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ డిమాండ్ చేసింది. -
వివేకా హత్య కేసు.. అంతా కూతురు సునీతే చేశారు!
-
ఐబొమ్మ రవిని నిర్దోషిగా బయటకు తెస్తా
హైదరాబాద్: మూవీ పైరసీ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నిర్దోషిగా బయటకు తీసుకొస్తానని ఏపీ హైకోర్టు న్యాయవాది పెటేటి రాజారావు అన్నారు. గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానంలో ఇమ్మడి రవి కేసు విషయంలో చట్టపరంగా బలమైన వాదనలు వినిపించి, త్వరలోనే జైలు నుండి బెయిల్పై విడుదల చేయిస్తానని అన్నారు. పోలీసులు పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ సెక్షన్లే అని తెలిపారు. SHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi CaseSHORTSNow playingAP High Court Advocate Peteti Raja Rao Intresting Comments on IBOMMA Ravi Case -
సృష్టి ఫెర్టిలిటీ కేసులో నమ్రతకు బెయిల్
సాక్షి హైదరాబాద్: సృష్టి ఫెర్టిలిటీ కేసులో అరెస్టైన ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. సరోగసీ పేరుతో అక్రమాలు, పిల్లల విక్రయం వంటి పలు అభియోగాలు ఆమెపై నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో సరోగసీ పేరుతో 'సృష్టి' ఫెర్టిలిటీ సెంటర్ చాలా మోసాలు చేస్తోందని గతంలో కేసులు నమోదయ్యాయి. ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని పోలీసులు దర్యాప్తులో తేల్చారు. దీనికోసం ఏపీలో కొంత మంది ఏఎన్ఎం(ANM)ల సహాయం కూడా తీసుకున్నారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని సృష్టి యూనివర్సల్ ఫెర్టిలిటీ సెంటర్ యజమాని డాక్టర్ నమ్రతను జులై 27న పోలీసులు అరెస్టు చేశారు. సరోగసీ చేయకపోయినా చేసినట్లు నమ్మించి పలువురు దంపతులను మోసం చేశారని, ఐవీఎఫ్(IVF) కోసం వచ్చే వారిని సరోగసీ వైపు మళ్లించి డబ్బులు దోచుకున్నారని. తదితర ఆరోపణలతో డాక్టర్ నమ్రతపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా డాక్టర్ నమ్రతతో కలిసి 1988లో ఆంధ్ర వైద్య కళాశాలలో వైద్యవిద్యను చదివిన ముగ్గురు వైద్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రధాన నిందితురాలు నమ్రతా బెయిల్ పై విడుదలయ్యారు. -
బాబు సర్కార్ కు బిగ్ షాక్.. మద్యం కేసులో ఆ ముగ్గురికి ఊరట
-
సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమే..
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పిటిషన్లన్నీ రాజకీయ ప్రేరేపితమని ప్రతివాదులు సీబీఐ కోర్టుకు విన్నవించారు. వివేకా హత్యను కూడా గత ఎన్నికల సమయంలో ప్రచారాస్త్రంగా ప్రత్యర్థులు వినియోగించుకునే యత్నం చేశారని, సాక్ష్యాలు, ఆధారాలు లేకున్నా ఎంపీ వైఎస్ అవినాశ్రెడ్డిని ఓడించడమే ధ్యేయంగా పనిచేశారని కోర్టుకు తెలియజేశారు. ఆమె వెనుక ఉన్న కొన్ని రాజకీయ శక్తుల వల్ల ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేస్తూ.. అసలు దోషులు బయట తిరిగేందుకు తోడ్పడుతున్నారని వివరించారు.ఇప్పుడు అదే శక్తులు వచ్చే ఎన్నికల వరకు కేసు విచారణ పూర్తి కాకూడదని కుయుక్తులు పన్నుతున్నారని కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. ఇందులో భాగంగానే సునీత తాజా పిటిషన్ దాఖలు చేశారని వివరించారు. వైఎస్ వివేకా హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు చేపట్టేలా సీబీఐని ఆదేశించాలని కోరుతూ సీబీఐ కోర్టులో సునీత పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి డాక్టర్ టి.రఘురామ్ సోమవారం ప్రతివాదుల వాదనలు విన్నారు. వాదనల అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.అంతకుముందు శివశంకర్రెడ్డి, వైఎస్ భాస్కర్రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాశ్రెడ్డి తరఫు న్యాయవాది సాయి ఉమామహేశ్వర్రావు వాదనలు వినిపించారు. వాదనల్లో ముఖ్యాంశాలు.. ‘అన్ని అంశాలు పరిశీలించాం, వందల మందిని విచారించాం, కాల్ రికార్డులు, వీడియోలు.. ఇలా అన్నింటిపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ చెబుతోంది. అయినా మరింత లోతుగా దర్యాప్తు కొనసాగించాలని కోరడం సరికాదు. ఇది కేసు విచారణను ఆలస్యం చేయడమే. దాదాపు నాలుగేళ్ల పాటు దర్యాప్తు కొనసాగించినంత కాలం సీబీఐ విచారణపై సునీత నోరు మెదపలేదు.నిరాధారంగా కొందరిని నిందితులుగా చేర్చడాన్ని ఆమె ‘ఎంజాయ్’చేశారు. చార్జ్షీట్, అదనపు చార్జ్షీట్ దాఖలు చేసినప్పుడూ తను అనుకున్నట్లే దర్యాప్తు సాగుతోందని మౌనంగా ఉన్నారు. ఇప్పుడు మరికొందరిని చేర్చాలన్న ఉద్దేశంతో పిటిషన్ వేశారు. కళ్లారా చూసిన ప్రత్యక్ష సాక్షి హత్య చేసింది ఎవరో చెప్పిన తర్వాతా నిందితులకు తోడ్పడేలా ఆమె పిటిషన్లు వేశారు. షేక్ దస్తగిరి (ఏ–4) తానే గొడ్డలితో నరికానని నేరుగా సీబీఐ కార్యాలయానికి వెళ్లి చెప్పినా అరెస్టు చేయలేదు.క్రిమినల్ కేసుల దర్యాప్తు చరిత్రలో ఓ కరుడుగట్టిన హంతకుడు నేరం ఒప్పుకున్నా అరెస్టు చేయకపోవడం ఇదే తొలిసారి. అతన్ని సమరి్థస్తూ సునీత పలు పిటిషన్లు వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దస్తగిరి యథేచ్ఛగా బయట తిరుగుతున్నా బెయిల్ రద్దు కోరుతూ పిటిషన్ వేయని సునీత ఎలాంటి ఆధారాలు లేకుండా నిందితులుగా చేర్చిన వారి బెయిల్ రద్దుకు పిటిషన్లు వేయడం విస్తుగొలిపే విషయం. సునీత పిటిషన్ సమర్థనీయం కాదు. కొట్టివేయండి’ అని న్యాయవాదులు వాదనలు వినిపించారు. -
ఐ బొమ్మ రవికి ఏమి శిక్ష పడబోతుందో తెలుసా? షాక్ అయ్యే విషయాలు!
-
అబద్ధాలు సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానం
సాక్షి ప్రతినిధి కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరగని విషయాలను జరిగినట్లు సీఎం స్థాయిలో చంద్రబాబు తననుద్దేశించి అసెంబ్లీలో మాట్లాడటం తీవ్రంగా బాధించిందన్న సీఐ శంకరయ్యను ఏకంగా ఉద్యోగం నుంచే తొలగించడం రాష్ట్రంలో అరాచక పాలనకు అద్దం పడుతోంది. తనపై అబద్ధాలు ప్రచారం చేయడం సరికాదన్నందుకు ఊస్టింగే బహుమానంగా దక్కింది. తనకు ప్రమోషన్ రాకపోయినా, వచ్చినట్లు ప్రచారం చేయడం అబద్ధం అని చెప్పినందుకు సర్కారు కక్షగట్టిందని ఇట్టే స్పష్టమవుతోంది. తమను ఎవ్వరూ ప్రశ్నించకూడదన్న నిరంకుశ ప్రభుత్వ దమననీతికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు సీఐ జె.శంకరయ్యను బాబు సర్కార్ శుక్రవారం ఉద్యోగం నుంచి తొలగించింది. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. అబద్ధాలొద్దన్నందుకు కక్షగట్టారు2019 మార్చి 15వ తేదీన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. అప్పట్లో పులివెందులలో సీఐగా పనిచేసిన శంకరయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పోలీసు అధికారులు ఇటీవల సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లో చేరిన శంకరయ్య అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిచేస్తూ కడప వీఆర్కు వచ్చారు. వైఎస్ వివేకా హత్యకు సంబం«ధించి అనుసరించిన వైఖరి ఫలితంగానే సీఐగా ఉన్న శంకరయ్యకు డీఎస్పీగా పదోన్నతి లభించిందని సీఎం చంద్రబాబు పదేపదే అసెంబ్లీలో ప్రస్తావించారు. బాబు మాటలపై శంకరయ్య తీవ్రంగా కలత చెందారు. చేయని తప్పునకు అవమానాలపాలు కావాల్సి వస్తోందని మదనపడ్డారు. ఈ నేపథ్యంలో తన పరువుకు తీవ్ర నష్టం వాటిల్లిందని తన న్యాయవాది ద్వారా సీఎంకి నోటీసులు పంపారు. తనకు పదోన్నతి కల్పించకపోయినా కల్పించినట్లు పదేపదే అబద్ధాలు చెప్పడం సరికాదని నోటీసుల్లో ప్రస్తావించారు. తనను మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.1.45 కోట్లు పరిహారం చెల్లించాలన్నారు. గుడ్లురిమిన పెద్దలు.. ఉద్యోగం ఉఫ్..తనకు పదవులు దక్కకపోయినా దక్కినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని సీఐ శంకరయ్య ప్రశ్నించినందుకు ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం సంచలనం సృష్టించింది. శంకరయ్య వైఎస్సార్ జిల్లాలోని వేంపల్లెతోపాటు పలు ప్రాంతాల్లో ఎస్ఐగా పనిచేశారు. ఆ తర్వాత సీఐగా కర్నూలు జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, కడప వీఆర్, అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయంలో పని చేశారు. విధి నిర్వహణలో రాజీ పడకుండా నిజాయితీగా పనిచేసే వ్యక్తిగా పోలీసు శాఖలో గుర్తింపు పొందారు. సీఐ డిస్మిస్ వ్యవహారం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇంత ఏకపక్షంగా నిర్ణయం ఎలా తీసుకుంటారని పోలీసులు విస్తుపోతున్నారు. -
నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం
-
తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్
-
తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు
-
ఫ్లాట్ నంబర్ 1903.. ఐబొమ్మ రవి కేసులో మరిన్ని షాకింగ్ విషయాలు
సాక్షి, హైదరాబాద్: ‘ఐబొమ్మ’సహా పదుల సంఖ్యలో పైరసీ వెబ్సైట్లు నిర్వహించి, హైదరాబాద్ సైబర్ క్రైమ్ అధికారులకు చిక్కిన ఇమ్మడి రవి పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ మేరకు నాంపల్లి న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జ్యుడీషియల్ రిమాండ్లో భాగంగా చంచల్గూడ జైలులో ఉన్న రవిని దర్యాప్తు అధికారులు గురువారం కస్టడీలోకి తీసుకుని ఐదు రోజులపాటు విచారించనున్నారు.ఇందులో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు అతడి నెట్వర్క్పై దృష్టి పెట్టారు. పైరసీ సర్వర్లు ఎక్కడెక్కడ ఉంచాడు? ఆయా వ్యవహారాల్లో సహకరించింది ఎవరు.. ఇతర సాంకేతిక అంశాలపై ప్రశ్నించనున్నారు. మరోపక్క ఆరేళ్లలో 21 వేల చిత్రాలను పైరసీ చేసిన, బెట్టింగ్/గేమింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ఇమ్మడి రవి ఆర్థికాంశాలపైనా అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న కొన్ని స్థిరాస్తుల్ని గుర్తించారు. అతడు పౌరసత్వం తీసుకున్న కరేబియన్ దీవుల్లోని దేశమైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్లోనూ కొన్ని ఆస్తులు ఖరీదు చేసినట్లు అనుమానిస్తున్న అధికారులు ఆ కోణంలోనూ విచారించనున్నారు.ఏడాదిలోనే హోంలోన్ క్లోజ్... పైరసీ, బెట్టింగ్ దందా ద్వారా రవి భారీ మొత్తం ఆర్జించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబీకులకు దూరంగా ఉంటున్న రవి ఓ సమీప బంధువుతో మాత్రం సన్నిహితంగా ఉన్నట్లు గుర్తించారు. వివిధ సందర్భాల్లో ఆ బంధువు రవి ఖాతాకు రూ.కోటి బదిలీ చేసినట్లు ఆధారాలు సేకరించారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. 2018 నుంచి పైరసీ వెబ్సైట్లు నిర్వహిస్తున్న రవి మూసాపేట్లోని రెయిన్బో విస్టా అపార్ట్మెంట్లోని ఎ–బ్లాక్లోని 1903 ఫ్లాట్ను 2019లో ఖరీదు చేశాడు.ఆ సమయంలో కేవలం కొంత మొత్తం చెల్లించిన అతడు.. మిగిలింది హోంలోన్ తీసుకున్నాడు. అయితే కేవలం ఏడాదిలోనే ఆ లోన్ను రవి క్లియర్ చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఇప్పటివరకు రవికి సంబంధించిన ఆరు బ్యాంకు ఖాతాలను విశ్లేషించిన పోలీసులు వాటిలో రూ.28 కోట్ల లావాదేవీలు గుర్తించారు. దాదాపు మరో 25 బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నారు. బిట్ కాయిన్ల రూపంలోనూ భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసు కస్టడీలో భాగంగా పోలీసులు రవికి సంబంధించిన క్రిప్టో కరెన్సీ వాలెట్స్ వివరాలు సేకరించనున్నారు. -
రవి బొమ్మ కనబడిందా? తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు
-
హన్మకొండ జిల్లా: వీడిన ‘నాటు కోళ్ల’ మిస్టరీ
సాక్షి, హన్మకొండ జిల్లా: నాటుకోళ్ల కేసులో ఎట్టకేలకు మిస్టరీ వీడింది. ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలంలో వదిలేసినట్లు పోలీసులు తేల్చారు. వరదలో రెడ్డిపురం ఫామ్లోని కోళ్లు కొట్టుకుపోయాయి. దీంతో మిగిలిన కోళ్లను రైతు పొలాల్లో వదిలేశారు.ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారి పక్కన గత శనివారం రెండు వేలకు పైగా నాటుకోళ్లను వదిలి వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో ఎల్కతుర్తివాసులు మొత్తం.. పత్తి చేలలో పరుగెత్తారు. దొరికిన కాడికి కోళ్లను పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. గంట వ్యవధిలో కోళ్ల అరుపులతో ఊరు ఊరంతా దద్దరిల్లింది. కొంతమంది వెంటనే నాటు కోడి పులుసు చేసుకుని సంతోషంగా విందు చేసుకున్నారు.సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్గా మారాయి. మరో వైపు, కోళ్లలో వ్యాధి ఉందనే వదంతులు చక్క ర్లు కొట్టాయి. ఎల్కతుర్తి పశువైద్యాధికారి కూడా వందతులను ఖండించారు. కోళ్లలో ఎలాంటి వైరస్ లక్షణాలు లేవని, శాంపిల్స్ను వరంగల్ ల్యాబ్కు పంపి పరీక్షించగా ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. కోళ్లు వదిలివెళ్లడం వెనుక ఉన్న మిస్టరీని తేల్చేందుకు విచారణ చేపట్టిన పోలీసులు.. చివరికి ఇన్సూరెన్స్ కోసమే ఓ రైతు.. కోళ్లను పొలాల్లో వదిలేసినట్లు స్పష్టం చేశారు. -
Air India Crash: ‘పైలట్ను నిందించొద్దు’: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: గత జూన్లో అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన కేసులో కేంద్ర ప్రభుత్వానికి, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీసీసీఏ)కి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ప్రమాదంపై న్యాయ విచారణ కోరుతూ ఎయిర్ ఇండియా పైలట్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్కు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ నోటీసు జారీ చేసింది. పైలట్ తండ్రి.. ఈ ఘటనకు సరైన కారణాన్ని గుర్తించేందుకు, జవాబుదారీతనం నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జోయ్మల్య బాగ్చి , జె సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం.. విమాన ప్రమాదంపై తప్పుడు నివేదికలు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషాద సంఘటనకు పైలట్ను బాధ్యుడిని చేస్తూ, నిందించకూడదని ధర్మాసనం పేర్కొంది. ‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి బాధ్యుడంటూ పైలట్ను నిందించకూడదు. ఇది ఒక విషాద ఘటన. ప్రాథమిక నివేదికలో పైలట్ వైపు నుండి ఎటువంటి తప్పు లేదని తేలింది. ఇటువంటి తప్పుడు నివేదికలు రూపొందించకూడదు. ఇటువంటి ఘటనలపై పరిశోధించేందుకు నిర్థిష్ట నిబంధనలున్నాయని జస్టిస్ బాగ్చి అన్నారు. దివంగత పైలట్ తండ్రి, పిటిషనర్ వ్యక్తం చేసిన బాధను, న్యాయమైన దర్యాప్తు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నట్లు ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ మాట్లాడుతూ, ‘నియమం 11 అనేది ప్రమాదాలకు సంబంధించినది. నిబంధన తొమ్మిది ప్రకారం ప్రాథమిక దర్యాప్తు మాత్రమే నిర్వహించారు. మేము స్వతంత్ర దర్యాప్తును కోరుతున్నాం. ఈ విమాన ప్రమాదంపై అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు జరిగేలా చూడాలని’ కోర్టును కోరారు.2025, జూన్ 12న మధ్యాహ్నం 1:38 గంటలకు అహ్మదాబాద్ నుండి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ 171 టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కన్నుమూశారు.ఇది కూడా చదవండి: వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు -
వీధి కుక్కల కేసు: ‘సుప్రీం’ కీలక ఆదేశాలు
ఢిల్లీ: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులు, రోడ్లు, ఎక్స్ప్రెస్ వేలపై పైకి వీధి కుక్కలు, పశువులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఇందుకోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని, ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీనిని తప్పనిసరిగా అమలు చేయాలని తెలిపింది.ఈ ఆదేశాల అమలుపై ఎనిమిది వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలని సుప్రీంకోర్టు కోరింది. పాఠశాలలు, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆస్పత్రులలోకి వీధి కుక్కలు రాకుండా ఎనిమిది వారాల్లోగా తగిన ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా మున్సిపల్ సిబ్బంది వీధికుక్కలు ఉండే స్థలాలను, భవనాలను గుర్తించాలని, ఈ ప్రాంతాల్లో తిరిగే వీధి కుక్కలను స్టెరిలైజేషన్ చేసి, రీ లొకేషన్ చేయాలని కోరింది. వీధి కుక్కలను వాటిని పట్టుకున్న ప్రాంతాలలో తిరిగి వదిలిపెట్టకూడదని, ఎప్పటికప్పుడు మున్సిపల్ సిబ్బంది వీధి కుక్కలు తిరిగే ప్రాంతాలలో తనిఖీ చేయాలని సుప్రీం కోర్టు తెలిపింది. పబ్లిక్ ఏరియాలలో వీధి కుక్కలు తిరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని, వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఈ నివేదిక అమలుపైన అఫిడవిట్ దాఖలు చేయాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. -
బాలిక అబద్ధం.. ‘పోక్సో’కు అమాయకుడు బలి
ప్రేమ, నమ్మకం, ద్రోహం... ఈ మూడింటి మధ్య నలిగిపోయిన ఒక యువకుని దీనగాథ ఇది. అబద్ధపు ఆరోపణల కారణంగా ఏడాదిపాటు జైలు జీవితం గడిపిన ఆ యువకుడి కేసు.. 'పోక్సో (POCSO) చట్టం' దుర్వినియోగానికి ఒక ఉదాహరణగా నిలిచింది. తన స్నేహితురాలిని ఆమె ప్రియుడు తప్పుదారి పట్టిస్తున్నాడని భావించి, అతనితో స్నేహం మానుకోవాలని చెప్పినందుకు ఆ యువకుడు ఏకంగా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు.ఈ కేసులో బాధితుడు అయిన యువకుడు తన స్నేహితురాలి ప్రియుడి ప్రవర్తన సరిగా లేదని గుర్తించాడు. అతనితో తిరగడం ప్రమాదకరమని భావించి, ఆ మైనర్ బాలికను పలుమార్లు హెచ్చరించాడు. అతనికి దూరంగా ఉండమని సలహా ఇచ్చాడు. అయితే అప్పటికే అతనితో శారీరక సంబంధం ఏర్పరచుకున్న ఆ బాలికకు ఈ సలహా నచ్చలేదు. సరిగ్గా ఇదే సమయంలో, ఆ మైనర్ బాలిక కుటుంబ సభ్యులకు ఆమె ప్రేమ వ్యవహారం తెలిసింది. దీంతో ఆమె తన ప్రియుడిని రక్షించేందుకు, చట్టపరమైన సమస్యల నుంచి తన ప్రియుడిని తప్పించేందుకు అతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన ప్రియుడి స్థానంలో తనకు సలహా ఇచ్చిన నిర్దోషి అయిన స్నేహితుడిపైనే తప్పుడు పాక్సో(POCSO) కేసు పెట్టింది. ఆ బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, పోలీసులు ఆ యువకుడిని అరెస్ట్ చేశారు. అబద్ధపు సాక్ష్యం కారణంగా ఆ యువకుడు ఏకంగా ఒక సంవత్సరం పాటు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా బెయిల్ లభించడం కూడా కష్టమైంది.ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలఒక ఏడాది పాటు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత, ఈ కేసులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. కోర్టు విచారణలో, సాక్ష్యాధారాలు, బాలిక వాంగ్మూలంలోని పరస్పర విరుద్ధ అంశాలను న్యాయవాది నిరూపించగలిగారు. చివరకు నిజం బట్టబయలైంది: బాలిక తన ప్రియుడిని రక్షించేందుకు, తనపై వచ్చిన ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు కుట్రకు పాల్పడిందని రుజువైంది. దాంతో కోర్టు ఆ నిర్దోషి అయిన యువకుడిని తక్షణమే విడుదల చేసింది. అయితే ఆ యువకుడు అంతవరకూ కోల్పోయిన కాలాన్ని, సామాజిక గౌరవాన్ని తిరిగి ఎవరూ ఇవ్వలేరు. మరోవైను ఈ ఘటన అతని భవిష్యత్తుకు అడ్డుగోడగా మారింది.న్యాయవ్యవస్థ ముందు ప్రశ్నలు Innocent Minor boy spent 1 YEAR in Jail in false POCSO case filed by his friend because he used to ask her to avoid her boyfriend who was of wrong behaviour Minor girl had sex with BF but implicated friend when family came to know of her affairpic.twitter.com/I6Yj3xbfN0— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) November 4, 2025 ప్రేమ కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి, ఒక నిర్దోషి జీవితాన్ని నాశనం చేసిన ఆ బాలికకు ఎందుకు శిక్ష పడలేదు? అలాగే ఆ బాలిక ఇటువంటి కుట్రకు పాల్పడేందుకు ఆమె ప్రియుడు సహకరించివుంటే అతనిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అమాయక యువకుడిపై తప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు, చట్టం రక్షణగా ఉండాల్సింది పోయి, ఏడాదిపాటు శిక్షకు కారణంగా నిలిచింది. ఈ ఘటన పాక్సో(POCSO) లాంటి కఠిన చట్టాల దుర్వినియోగం ఎలా జరుగుతుందో తెలియజేస్తుంది. మైనర్ల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు, ఈ విధంగా దుర్వినియోగం కావడం సమాజానికి మంచిది కాదని పలువురు అంటున్నారు. ఈ తరహా తప్పుడు కేసుల వల్ల నిజమైన బాధితులు అవమానానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా తప్పుడు ఫిర్యాదులు చేసే మైనర్లను, వారి వెనుక ఉన్నవారిని గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పాక్సో (POCSO) చట్టంలో తగిన సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. హర్యానాలోని పానిపత్లో జరిగిన ఒక ఉదంతం ఆధారంగా ఈ కథనం రాయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ట్విట్టర్లో దీపికా నారాయణ్ భరద్వాజ్ పేరుతో షేర్ అయిన సోస్టు జత చేయడం జరిగింది. దీనిలో న్యాయవాది తమన్నా కాదియాన్ ఈ అంశంపై మాట్లాడటాన్ని చూడవచ్చు.ఇది కూడా చదవండి: భారత్ అణు పరీక్షలు?.. పాక్కు దబిడి దిబిడే! -
‘ఫిజిక్స్వాలా’పై ఎఫ్ఐఆర్.. కారణం ఇదే..
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ ‘ఫిజిక్స్వాలా’ చిక్కుల్లో పడింది. ఈ కంపెనీ రూపొందించిన ఒక ప్రకటన.. కశ్మీర్లోని పర్యావరణాన్న దెబ్బతీసేవిధంగా ఉందనే ఆరోపణలు వచ్చాయి. బారాముల్లాలోని గుల్మార్గ్ సమీపంలోని బాదర్కోట్ అడవుల గుండా ‘‘ఫిజిక్స్వాలా’ అధ్యాపకులు స్కార్పియో వాహనాల్లో వెళుతున్నట్లు చూపిన ఈ ప్రకటన పోలీసు దర్యాప్తుకు దారితీసింది. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గుల్మార్గ్ ఇఫ్తిఖర్ అహ్మద్ ఖాద్రీ ఫిర్యాదు మేరకు టాంగ్మార్గ్ పోలీస్ స్టేషన్లో ‘ఫిజిక్స్వాలా’పై ఎఫ్ఐఆర్ దాఖలైంది.రిజిస్ట్రేషన్ ప్లేట్లు లేని ఆరు నల్ల స్కార్పియో వాహనాల్లో ‘ఫిజిక్స్వాలా’ అధ్యాపకులు అక్రమంగా అడవిలోకి ప్రవేశిస్తున్నట్లు చూపించే ఈ యూట్యూబ్ వీడియోపై ఫిర్యాదు నమోదయ్యింది. 9 నుండి 12 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫిజిక్స్వాలా ఈ ఫుటేజ్ ఉపయోగించింది. ఈ చర్య భారత అటవీ చట్టం 1927, అటవీ సంరక్షణ చట్టం 1980కు విఘాతం కలిగించేలా ఉంది. ‘ఫిజిక్స్వాలా’ పై అటవీ అధికారి చేసిన ఫిర్యాదులో ఆ వాహనాలను పచ్చని పచ్చిక బయళ్లపై నడిపి, మూలికలు, వృక్షజాలానికి నష్టం కలిగించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు భారతీయ న్యాయ సంహిత నిబంధనల కింద.. ‘ఫిజిక్స్వాలా’ ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందంటూ కేసు నమోదు చేశారు. 20 రోజుల క్రితం జమ్ముకశ్మీర్లోని బుద్గాం పర్యావరణ వ్యవస్థను దెబ్బతీసినందుకు పలువురు యూట్యూబర్లపై కేసు నమోదయ్యింది. వారు పచ్చిక బయళ్ల గుండా డ్రైవింగ్ చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దీంతో డిప్యూటీ కమిషనర్ బిలాల్ మోహిదిన వారిపై ఎఫ్ఐఆర్కు ఆదేశించారు. ఈ కేసులపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. -
అనిల్ అంబానీ రిలయన్స్ గ్రూప్పై ఈడీ చర్య
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై మనీలాండరింగ్ ఆరోపణల దర్యాప్తును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వేగవంతం చేసింది. సుమారు రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేస్తున్నట్లు తాజాగా తెలిపింది. అక్టోబర్ 31న జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.జప్తు చేసిన ఆస్తుల వివరాలుమనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో ముంబైలోని పాలి హిల్లో ఉన్న అనిల్ అంబానీ కుటుంబ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఎనిమిది నగరాల్లోని ఆస్తులు జప్తు అయ్యాయి. సుమారు రూ. 3,084 కోట్లు విలువ చేసే ఆ ఆస్తులు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, తూర్పు గోదావరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇందులో నివాస భవనాలు, కార్యాలయ ప్రాంగణాలు, భూములున్నాయి.అసలు కేసు ఏంటి?అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ యెస్ బ్యాంక్ నుంచి సమీకరించిన నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఇతర మార్గాలకు మళ్లించి మనీలాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్ (RHFL), రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్ (RCFL) సేకరించిన నిధుల మళ్లింపుపై దర్యాప్తు జరుగుతోంది. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ RHFLకు రూ.2,965 కోట్లు, RCFLకు రూ.2,045 కోట్లు ఇచ్చింది. అయితే వీటిని తిరిగి చెల్లించడంలో అనిల్ అంబానీ, తన ఆధ్వర్యంలోని రిలయన్స్ సంస్థలు విఫలమయ్యాయి.ఈడీ దర్యాప్తులో అనిల్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ గ్రూప్ లింక్డ్ సంస్థలకు పెద్ద ఎత్తున నిధుల మళ్లింపు, రుణాల మంజూరు జరిగినట్లు తేలింది. ఈ వ్యవహారాన్ని ఈడీ ఉద్దేశపూర్వక, స్థిరమైన నియంత్రణ వైఫల్యాలుగా అభివర్ణించింది. కొన్ని కంపెనీలు దరఖాస్తు చేసిన అదే రోజున రుణాలు పంపిణీ చేసినట్లు తెలిపింది. కొన్ని సందర్భాల్లో దరఖాస్తులు సమర్పించడానికి ముందే రుణాలు అడ్వాన్స్ చేసినట్లు పేర్కొంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్, అమెజాన్ల పంట పండించిన స్టార్టప్ -
Sabarimala Theft Case.. మాజీ అధికారి అరెస్ట్
తిరువనంతపురం: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో బంగారం చోరీ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుధీష్ కుమార్ను ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)అధికారులు.. సుధీష్ కుమార్ను అదుపులోకి తీసుకుని, విచారించిన దరిమిలా ఈ అరెస్ట్ జరిగింది.ఆలయ ద్వారం వద్దనున్న శిల్పాలకు పూత పూసిన పొరలు బంగారంతో తయారు చేసినవని తెలిసినప్పటికీ, సుధీష్ కుమార్ అధికారిక పత్రాలలో వాటిని రాగి పొరలుగా తప్పుగా నమోదు చేసినట్లు దర్యాప్తు అధికారులు కనుగొన్నారని ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి మహసర్ (అధికారిక రికార్డు)ను ట్యాంపరింగ్ చేసి, బంగారాన్ని దొంగిలించేందుకు సుధీష్ కుమార్ సహాయం చేశాడని సిట్ నిర్ధారించింది. 2019లో శబరిమల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వ్యవహరించిన సుధీష్ నాడు ఉన్నికృష్ణన్ పొట్టిని దాతగా ఆమోదించారు. దీనికితోడు దేవస్వం బోర్డు ఆ బంగారు పొరలను రాగి పలకలుగా చెప్పాలంటూ ఉన్నికృష్ణన్ పొట్టిని కోరిందని సిట్ గుర్తించింది. అధికారులు శిల్పాలను ట్యాంపరింగ్ చేసినప్పుడు కూడా, సుధీష్ వాటిని రికార్డులలో రాగి పొరలుగా పేర్కొన్నారు.అయితే పొట్టికి ఆ షీట్లు అందకపోయినా, సుధీష్ అతని పేరును రికార్డులలో రాశారని చూపించే ఆధారాలను సిట్ స్వాధీనం చేసుకుంది. సుధీష్ మరో నిందితుడు మురారి బాబుకు ఈ బంగారం చోరీలో సహాయం చేశాడని కూడా దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సుధీష్ కుమార్ను అధికారులు (ఈరోజు) శనివారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. తదుపరి విచారణ కోసం అతనిని తిరిగి కస్టడీకి కోరే అవకాశం ఉందని సమాచారం. -
మేయర్ దంపతుల కేసులో సంచలనం.. ఐదుగురికి ఉరిశిక్ష
-
చిత్తూరు కోర్టు సంచలన తీర్పు.. ఐదుగురికి మరణ శిక్ష
-
కాసేపట్లో చిత్తూరు మాజీ మేయర్ కఠారి అనురాధ దంపతుల హత్య కేసులో తీర్పు
-
Zakir Naik: హసీనా బహిష్కరిస్తే.. యూనస్ ఆహ్వానించారు!
ఢాకా: బంగ్లాదేశ్లోని ముహమ్మద్ యూనస్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏడేళ్ల క్రితం అప్పటి హసీనా సర్కారు ఇస్లామిక్ ప్రచారకుడు జకీర్ నాయక్కు బంగ్లాదేశ్లోకి ఎప్పటికీ ప్రవేశం లభించదని ప్రకటించగా దీనికి భిన్నంగా యూనస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నవంబర్ 28-29 తేదీలలో ఢాకాలో జరిగే ఛారిటీ కార్యక్రమానికి జకీర్ నాయక్కు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది.బంగ్లాదేశ్ వివాదాస్పద నిర్ణయంవివాదాస్పద ఇస్లామిక్ ప్రచారకర్త జకీర్ నాయక్పై భారతదేశంలో మనీలాండరింగ్తో పాటు పలు విద్వేషపూరిత ప్రసంగాలు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదేవిధంగా జకీర్ నాయక్కు బంగ్లాదేశ్లోకి ప్రవేశం లేదని ప్రకటించిన బంగ్లాదేశ్ ఇప్పుడు ఏడేళ్ల తర్వాత తన నిర్ణయం మార్చుకోవడం వివాదాస్పదంగా మారింది. 2016, జూలైలో రాజధాని ఢాకాలోని ‘హోలీ ఆర్టిసన్ బేకరీ కేఫ్’ పై దాడి వెనుక జకీర్ నాయక్ ప్రమేయం ఉందనే ఆరోపణలు వినిపించాయి. ఈ దాడిలో పాల్గొన్న ఇద్దరు ఉగ్రవాదులు.. జకీర్ నాయక్ బోధనలతో ప్రేరణ పొందారనే వార్తలు వెలువడ్డాయి. ఈ నేపధ్యంలోనే అప్పటి ప్రభుత్వం జకీర్ నాయక్ను బంగ్లాదేశ్లోకి ప్రవేశించకుండా నిషేధించింది.2016లో జకీర్ నాయక్పై ఎన్ఐఏ కేసుభారతదేశంలోని జాతీయ దర్యాప్తు సంస్థ కూడా అతనిపై ఉగ్రవాదం, మనీలాండరింగ్ తదితర ఆరోపణల కింద దర్యాప్తు చేస్తోంది. ఢాకాలో ఉగ్రవాద దాడి తర్వాత అతను ఆ దేశం నుంచి పరారయ్యాడు. ప్రస్తుతం మలేషియాలో తలదాచుకున్న జకీర్ నాయక్ స్పార్క్ ఈవెంట్ మేనేజ్మెంట్ నిర్వహించే ఛారిటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నవంబర్ 28-29 తేదీలలో బంగ్లాదేశ్కు రానున్నారు. ఈ కార్యక్రమం ఢాకాలోని అగర్గావ్ ప్రాంతంలో జరగనుంది. వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించారనే ఆరోపణలతో 2016లో ఎన్ఐఏ తొలిసారిగా ఉగ్రవాద నిరోధక చట్టాల కింద జకీర్ నాయక్పై కేసు నమోదు చేసింది.జకీర్ అప్పగింతకు మలేషియా సహకారం?60 ఏళ్ల జకీర్ నాయక్ 2016లో భారతదేశం నుండి మలేషియాకు వెళ్లి, అక్కడ శాశ్వత నివాస హోదాను పొందాడు.తనపై సాగుతున్నఅన్యాయమైన విచారణ నుండి సురక్షితంగా బయటపడేవరకూ తాను భారతదేశానికి తిరిగి రానని జకీర్ నాయక్ గతంలో వెల్లడించారు. కాగా తమ దేశంలో సమస్యలు సృష్టించనంత వరకు జకీర్ నాయక్ను బహిష్కరించలేమని, భారత్కు పంపే ప్రసక్తే లేదని మలేషియా ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ ఏడాది మొదట్లో భారతదేశంలోని మలేషియా హైకమిషనర్ దాతో ముజాఫర్ షా ముస్తఫా మాట్లాడుతూ జకీర్ నాయక్ అప్పగింతకు సంబంధించి భారతదేశానికి పూర్తి సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి: Delhi: గొంతు కోసి.. సిలిండర్ పేల్చి.. యువతి చేతిలో ‘పార్ట్నర్’ హతం -
మద్యం కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
ములకలచెరువు: నకిలీ మద్యం కేసులో ఇద్దరు నిందితులను అన్నమయ్య జిల్లా ములకలచెరువు ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. శనివారం సాయంత్రం పెద్దపాళ్యం క్రాస్ వద్ద తనిఖీల సందర్భంగా రెండు కార్లలో వేగంగా వెళుతున్న ఏ 15 బాలాజీ, ఏ 20 సుదర్శన్ను ఎక్సైజ్ పోలీసులు అడ్డగించి పట్టుకున్నారు. తండ్రి, కుమారులైన వీరినుంచి 8స్మార్ట్ ఫోన్లు, 4 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకుని ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో నిందితుడైన జనార్దన్రావు అతని స్నేహితులు ములకలచెరువులో మద్యం దుకాణాలు నడుపుతున్నారని, అక్కడ అక్రమ మద్యం తయారు చేయాలని 2025 ఏప్రిల్లో కోరినట్లు విచారణలో బాలాజీ వెల్లడించాడు. -
ఏ తప్పూ చేయకుండా జైల్లో మగ్గుతున్నారు
విజయవాడలీగల్: మద్యం అక్రమ కేసులో ఏ తప్పూ చేయకుండా నిందితులు సుదీర్ఘకాలం జైళ్లలో మగ్గుతున్నారని డిఫెన్స్ న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో విచారణ పూర్తయ్యిందని, ఇందుకు అనుగుణంగా చార్జ్షీట్లు కూడా దాఖలయ్యాయని పేర్కొంటూ రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కుకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ నిందితులకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. నిందితులకు బెయిల్ మంజూరుచేస్తే, విచారణకు ఎప్పుడు పిలిచినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నారని, ఎటువంటి షరతులకైనా సిద్ధమని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో జైలులో ఉన్న రాజ్ కేసిరెడ్డి, చెరుకూరి వెంకటేష్నాయుడు, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, బూనేటి చాణక్య, సజ్జల శ్రీధర్రెడ్డి, బాలాజీకుమార్ యాదవ్, నవీన్కృష్ణల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో శుక్రవారం వాదనలు జరిగాయి. నిందితుల తరపున సీనియర్ న్యాయవాదులు పొన్నవోలు సుధాకర్రెడ్డి, చంద్రగిరి విష్ణువర్థన్, నాగేంద్రరెడ్డి, ఎం వాణి, నగేష్రెడ్డి వాదనలు వినిపించారు. ప్రాసిక్యూషన్ తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా ఆన్లైన్లో హాజరై వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్లపై ఇరు పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును కోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఎటువంటి ఆధారాలూ చూపలేకపోయిన సిట్: పొన్నవోలురాజ్ కేసిరెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ‘కేసుకు సంబంధించి నిందితులపై సిట్ విచారణ పూర్తిచేసి, చార్జ్షీటు కూడా దాఖలుచేసింది. ఈ కేసులో 409 మంది సాక్షులను విచారించింది. గత ప్రభుత్వ లిక్కర్ పాలసీలో రాజ్ కేసిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసులో సిట్ ఎటువంటి ఆధారాలు చూపలేకపోయింది. సిట్ అధికారులు సెల్టవర్ లొకేషన్ ఆధారంగా రాజ్ కేసిరెడ్డిని ముద్దాయిగా నిర్ధారిస్తూ రిమాండ్ రిపోర్టుల్లో పేర్కొనడం తగదు. వాస్తవానికి ఒక్కో టవర్ లొకేషన్ 3 నుండి 5 కిలోమీటర్ల పరిధి కలిగి ఉంటుంది. ఆ పరిధిలో ఎంతో మంది సెల్ఫోన్లు వాడతారు. అంతమాత్రాన ఈ కేసుతో వారందరికీ నిందితులతో సంబంధం ఉందని ఎలా నిర్ధారిస్తారు? సిట్ అధికారులు నిందితుడి కార్యాలయం కూడా జూబ్లిహిల్స్ పరిధిలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి లొకేషన్ కూడా అదే పరిధిలో ఉంది. అంతమాత్రాన ఆయనకు కేసుతో సంబంధం ఉందని భావించాలా?. రాజ్ కేసిరెడ్డిని కావాలనే 188 రోజులుగా జైలులో ఉంచారు. అరవింద్ కేజ్రివాల్ వర్సెస్ సీబీఐ, కల్వకుంట్ల కవితకు సంబంధించిన కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అనుగుణంగా రాజ్ కేసిరెడ్డికి బెయిల్ మంజూరు చేయవలసినదిగా కోరుతున్నాను’ అని అన్నారు. 24వరకు రిమాండ్ పొడిగింపురాజ్ కేసిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, వెంకటేష్ నాయుడు ,చాణక్య, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలకు ఈనెల 24వరకు రిమాండ్ను కోర్టు పొడిగించింది. రిమాండ్ ముగియడంతో శుక్రవారం వారిని కోర్టులో హాజరు పరిచారు.సాగదీత ధోరణి మార్చుకోని లూథ్రాప్రాసిక్యూషన్ తరఫున తొలుత వాదనలను వినిపించిన లూథ్రా గురువారం తరహాలోనే కేసు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు సుదీర్ఘంగా చదువుతూ, ‘అదే వాదన’ అన్న ధోరణిని ప్రదర్శించారు. ఈ సందర్భంలో డిఫెన్స్ తరపున న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గంటలు గంటలు కౌంటర్, రిమాండ్ రిపోర్టులు చదువుతూ పోతే వాదనలు ఎప్పుడు వినిపిస్తారని ప్రశ్నించారు. కోర్టు విలువైన సమయాన్ని లూథ్రా వృథా చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీ మిథున్రెడ్డి అమెరికా వెళ్లేందుకు అనుమతిరాజంపేట ఎంపీ మిథున్రెడ్డి ఈ నెల 27 నుంచి 31 వరకు న్యూయార్క్లో జరిగే ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 80వ సెషన్కు హాజరయ్యేందుకు అనుమతిస్తూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 23 నుంచి నవంబరు 4వ తేదీ వరకు ఆయనకు అనుమతి మంజూరు చేస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి పి. భాస్కరరావు ఉత్తర్వులు జారీ చేశారు. రూ. 50వేలు చొప్పున ఇద్దరి పూచీకత్తు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. ఆమెరికా పర్యటన ముగించుకొని తిరిగి రాగానే పాస్ పోర్టు తిరిగి కోర్టుకు సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చెవిరెడ్డిపై కేసు అంతా కుట్ర కోణమే: న్యాయవాది వాణిరెడ్డి చెవిరెడ్డి భాస్కరరెడ్డి తరపు న్యాయవాది వాణిరెడ్డి వాదనలు వినిపిస్తూ...ఆయన ప్రజలలో నుండి వచ్చారని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు. ఈ కేసుతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. వాదనల్లో మరికొన్ని అంశాలు.. » గన్మెన్ గిరిబాబు సాక్ష్యం ఆధారంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై ఈ అక్రమ కేసు నమోదుచేశారు. » సిట్ అధికారులు గిరిబాబును 2025 జూన్ 1న విచారణ జరిపారు. » ఆ మర్నాడు జూన్ 2న అతనికి ప్రమోషన్ కల్పించి భారీ వేతనం పెంపుతో ఆక్టోపస్లోకి తీసుకున్నారు. » కేసు వెనుక ప్రలోభాల పర్వం ఎంత దారుణంగా ఉందో ఈ ఒక్క విషయం అద్దం పడుతోంది. » బాలాజీకుమార్ యాదవ్, నవీన్కృష్ణ ఇరువురు చిరు ఉద్యోగులు. » వారిని కూడా సంబంధం లేని మద్యం కేసులో అక్రమంగా అరెస్టు చేశారు. » నిందితులకు సంబంధించిన పాస్పోర్టులను సీజ్చేశారు. » లుక్అవుట్ నోటీసులు కూడా జారీచేశారు. » ఇటువంటి పరిస్థితులలో నిందితులు ఎక్కడికి పారిపోయే పరిస్థితి లేదు. » రాజ్యాంగంలోని 21వ అధికరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ బెయిల్ మంజూరు చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాము. -
తెలుగు హీరోయిన్ మిస్సింగ్.. అసలు స్టోరీ ఇదే
చైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాలతో మెప్పించిన వాసంతిక మిస్సింగ్ అంటూ రెండురోజులుగా సోషల్మీడియాలో వైరల్ అవుతుంది. చాలామందికి అసలు విషయం ఏంటి అనేది తెలియలేదు. ఒక హాస్టల్ నుంచి వెళ్తున్న సీసీటీవి ఫుటేజ్ కూడా విడుదల చేయడంతో చాలామంది నిజమేనని అనుకున్నారు. అయితే, అసలు విషయం తను నటిస్తున్న కొత్త సినిమా గురించి. ఇప్పుడు హీరోయిన్గా ఎంట్రీ వాసంతిక ఇచ్చింది. ఇప్పటికే 90's - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ చిత్రంలో దివ్య అనే పాత్రతో మెప్పించన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆమె మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.డైరెక్ట్గా ఓటీటీలో విడుదలD/o ప్రసాద్రావు కనబడుటలేదు అనే సినిమాలో వాసంతిక ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ టైటిల్ను చూస్తే అర్థం అయింది కదా. ఒక యువతి మిస్సింగ్ స్టోరీతో మూవీని తెరెక్కించారు. అందుకే సినిమా ప్రమోషన్ కోసం ఇలా హీరోయిన్ మిస్సింగ్ అంటూ ఒక వీడియోను వైరల్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్గా జీ5లో విడుదల కానుంది. అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని మేకర్స్ ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇందులో ఉధయబాను, రాజీవ్ కనకాల కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా వాసంతిక మెప్పించింది. సలార్లో కూడా ఆమె నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ఓటీటీలో విడుదల కానుంది. Swathi is missing.Family is in panic, the world is spinning.What next?Start tuned to know what happened to Swathi, D/o Prasadrao#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 #DaughterOfPrasadRaoKanabadutaledhu #ZEE5Telugu #RaajeevKanakala #UdayaBhanu #VasanthikaMacha pic.twitter.com/ZlpUnZWTrb— ZEE5 Telugu (@ZEE5Telugu) October 15, 2025 -
పక్కావ్యూహం ప్రకారమే..!
రాష్ట్రంలో నకిలీ మద్యం దందా తీగ లాగుతుంటే ఉండవల్లి కరకట్ట బంగ్లాలో డొంక కదులుతోంది. నకిలీ మద్యం వ్యవస్థీకృత దోపిడీకి కర్త, కర్మ, క్రియ ముఖ్య నేతేనని నిగ్గు తేలుతోంది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం దగ్గర మొదలైన ఈ వ్యవహారం... అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ మద్యం దుకాణాల రద్దు... బెల్టుషాపులకు పచ్చ జెండా... పర్మిట్ రూమ్లకు గేట్లెత్తి వ్యవస్థను నియంత్రణలోకి తెచ్చుకుని... నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు నెలకొల్పి షాప్లకు సరఫరా చేయడం వరకు అంతా పక్కా వ్యూహంతో సాగిందని స్పష్టమవుతోంది.నాణ్యమైన మద్యం అందిస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఇచ్చిన హామీ వెనుక విస్తుపోయే ‘ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్’ వంటి భారీ కుట్ర ఉందని క్రమంగా అర్థమవుతోంది. మందుబాబుల బలహీనతను ఆసరాగా చేసుకుని కల్తీ మద్యం నిషా ఎక్కించి రూ.వేల కోట్లు కొల్లగొట్టే కుంభకోణం వెలుగుచూస్తోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణ వెనుక పన్నాగం ఉందని తేటతెల్లమవుతోంది. సాక్షి, అమరావతి : టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు సాగిస్తున్న నకిలీ మద్యం దందాకు నిరుటి ఎన్నికలకు ముందే కుట్ర పన్నారు. అధికారంలోకి రాగానే దోపిడీ విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నారు. తనకు టికెట్ ఇస్తే ‘‘ఆఫ్రికా మోడల్’’ నకిలీ సరుకు దందాను ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ముఖ్యనేత దోపిడీకి సహకరిస్తానని జయచంద్రారెడ్డి ఎన్నికలకు ముందే ఆఫర్ ఇచ్చారు. పెదబాబు, చినబాబు వెంటనే ఈ డీల్కు పచ్చజెండా ఊపారు. ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్కుమార్రెడ్డి, శంకర్యాదవ్లను సైతం పక్కనపెట్టారు. ఖర్చంతా తానే భరిస్తానని శంకర్యాదవ్ చెప్పినా టీడీపీ అధినాయకత్వం వినిపించుకోలేదు. ఆయనకు టికెటివ్వాలని కార్యకర్తలు కరకట్ట నివాసం వద్ద ధర్నాలు చేసినా ఒప్పుకోలేదు. క్యాడర్ వ్యతిరేకించినా జయచంద్రారెడ్డికే తంబళ్లపల్లె టికెట్ ఇచ్చారు. దీనివెనుక ఉద్దేశం... ‘‘ఒక సీటు పోయినా ఫర్వాలేదు. ఒకవేళ అధికారంలోకి వస్తే ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాతో భారీ దోపిడీకి పాత్రధారిగా జయచంద్రారెడ్డి ఉంటారు’’ అనే ఆలోచనేనని స్పష్టమవుతోంది. ఇక తాజాగా పెద్ద ఎత్తున బయటపడిన నకిలీ మద్యం ఉదంతంలో జయచంద్రారెడ్డి పాత్ర ఉందని స్పష్టమైనా.. ఆయనను తూతూమంత్రంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేశారు. ఇంతవరకు అరెస్టు చేయలేదు. దీన్నిబట్టే నకిలీ మద్యం దందాలో ప్రభుత్వ పెద్దల ప్రమేయం స్థాయిలో ఉందే నిర్ధారణ అవుతోంది. అంతా గుప్పిట పట్టి.. భారీ స్కెచ్.. నాణ్యమైన మద్యం ఎంత అమ్మినా.. ఆ డబ్బు రాష్ట్ర ఖజానాకే పోతుంది. మన జేబులు నిండేదెలా? అని ముఖ్య నేత భావించారు. అందుకే నకిలీ మద్యాన్నే అధికారికంగా విక్రయించే కుట్రకు కూటమి ప్రభుత్వం రాగానే తెరతీశారు. మద్యం వినియోగం తగ్గించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టి, పారదర్శకంగా అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించారు. వాటి స్థానంలో టీడీపీ సిండికేట్ ద్వారా 3,736 ప్రైవేటు దుకాణాలను ఏర్పాటు చేయించారు. అనుబంధంగా మరో 3,736 పర్మిట్ రూమ్లకు అనుమతిచ్చారు. టీడీపీ సిండికేట్ అనధికారికంగా ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలను తెరిచింది. తాజాగా 540 బార్లనూ (త్వరలో మరో 300 కూడా) ఈ సిండికేట్కే కట్టబెట్టింది. మరోవైపు రాష్ట్రంలోని 20 మద్యం డిస్టిలరీలు దశాబ్దాలుగా టీడీపీ సీనియర్ నేతల కుటుంబాల ఆ«దీనంలోనే ఉన్నాయి. వాటిలో 14 డిస్టిలరీలకు గతంలో చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులిచ్చింది. మిగిలిన ఆరింటికి అంతకుముందున్న ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. 20 డిస్టిలరీలనూ ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా మద్యం కొనుగోళ్ల కోసం ఎంప్యానెల్ చేసింది టీడీపీ ప్రభుత్వమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి అనుమతివ్వలేదు. ఈ విధంగా తయారీ నుంచి విక్రయాల వరకు నెట్వర్క్ అంతటినీ ముఖ్యనేత టీడీపీ మద్యం మాఫియా గుప్పిట్లో పెట్టారు. పచ్చ సీసాలో నకిలీ మద్యం కూటమి అధికారంలోకి రాగానే అత్యంత ప్రాధాన్యతతో కొత్త మద్యం విధానం ఎందుకు అమలు చేశారో లోగుట్టు బయటపడుతోంది. మొత్తం మద్యం నెట్వర్క్ తమ చేతుల్లోకి రావడంతో ముఖ్య నేత రెండో దశ కుట్రను అమలు చేశారు. జయచంద్రారెడ్డితో చినబాబు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దందాకు తెరతీశారు. మొత్తం నకిలీ ముఠాకు తనకు అత్యంత సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చినబాబు సమన్వయకర్తగా పెట్టారు. రాష్ట్రంలో ప్రాంతాలవారీగా టీడీపీ నేతలకు నకిలీ మద్యం పంపిణీ బాధ్యతలు కట్టబెట్టారు. నర్నీపటా్ననికి చెందిన సీనియర్ నేత కుటుంబానికి ఉత్తరాంధ్ర, ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ప్రజాప్రతినిధికి ఉమ్మడి ఉభయ గోదావరి, బాపట్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ కీలక నేతకు రాయలసీమలో నకిలీ మద్యం దందా బాధ్యతలు అప్పగించారు. ఆ వెంటనే ఆఫ్రికా దేశాల్లో నకిలీ మద్యం తయారుచేసే విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రవ్యాప్తంగా యూనిట్లను నెలకొల్పారు. కుటీర, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)ల రీతిలో జిల్లాలు, మండల స్థాయిలో నకిలీ మద్యం తయారీ యూనిట్లు ఏర్పాటు చేయడం గమనార్హం. టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు, కట్టా సురేంద్రనాయుడు ఒడిశా, బిహార్ తదితర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి నకిలీ మద్యం తయారీలో శిక్షణ ఇప్పించారు. ముఖ్య నేత సన్నిహితులైన టీడీపీ సీనియర్ నేతల కుటుంబాలకు చెందిన డిస్టిలరీల ద్వారా అక్రమంగా ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి భారీగా కొని ఆ యూనిట్లకు తరలించారు. రాష్ట్రమంతా ముఖ్యనేత ప్రవేశపెట్టిన నకిలీ బ్రాండ్లు కేరళ మాల్ట్, బెంగళూరు బ్రాందీ, ఓల్డ్ అడ్మిరల్... ఇవీ ప్రస్తుతం రాష్ట్రంలో జోరుగా అమ్మకాలు సాగుతున్న మద్యం బ్రాండ్లు. ఎప్పుడూ వినని ఈ బ్రాండ్లు ఎక్కడివి అనే కదా మీ అనుమానం...? ఇవి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతో ప్రవేశపెట్టిన ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం బ్రాండ్లు. వారి మాస్టర్ ప్లాన్లో భాగంగా జయచంద్రారెడ్డి, అద్దేపల్లి జనార్దన్రావు, సురేంద్రనాయుడు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న నకిలీ బ్రాండ్లే. అనకాపల్లి జిల్లా రాంబిల్లి, పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం... ఇలా తనిఖీలు చేసిన ప్రతిచోటా పట్టుబడినది టీడీపీ సిండికేట్ ప్లాంట్లలో తయారవుతున్న నకిలీ మద్యమే. గుట్టలుగుట్టలుగా నిల్వ చేసిన నకిలీ మద్యం బ్రాండ్ల సరుకు దొరకడం అధికారులనే విస్మయపరుస్తోంది. దీన్నిబట్టే ఎంత పక్కాగా, యథేచ్ఛగా ముఖ్య నేత ఆఫ్రికా మోడల్ నకిలీ దందాను నడిపిస్తున్నారో స్పష్టమవుతోంది. మోగుతున్న మరణమృదంగం... టీడీపీ కూటమి ప్రభుత్వం... బ్రాండెడ్ ముసుగులో విచ్చలబిడిగా విక్రయిస్తున్న నకిలీ మద్యం రాష్ట్రంలో మరణ మృదంగం మోగిస్తోంది. 60 నుంచి 75 శాతం వరకు ఆల్కహాల్ ఉండే నకిలీ మద్యం తాగడంతో గుండె, ఊపిరితిత్తులు, ఉదరం, మూత్ర పిండాలు వేగంగా దెబ్బతింటున్నాయి. నాడీ వ్యవస్థపై దుష్ప్రభావంతో చిత్తచాంచల్యం ఆవహిస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారు వేగంగా తీవ్ర అనారోగ్యానికి గురై కొద్ది రోజుల్లోనే మృత్యువాత పడుతున్నారు. అంతుబట్టని మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, ఏలూరు జిల్లాల్లో వరుస హఠాన్మరణాలకు నకిలీ మద్యమే కారణమని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఎక్సైజ్ శాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తమ మెడకు చుట్టుకుటుందని భావించారు. భవిష్యత్లో ఇబ్బంది రాకుండా ఎక్సై్సజ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తనిఖీలు, దాడులు చేసింది. ఏదో కిందిస్థాయి ముఠా దొరికితే కేసులు నమోదు చేసి ట్రాక్ రికార్డు కాపాడుకోవాలనుకుంది. కానీ, వారు ఊహించని రీతిలో నకిలీ మద్యం వెనుక ఉన్న వ్యవస్థీకృత మాఫియా బండారం బయటపడింది. ఈ మాఫియా డాన్ ముఖ్యనేతేనని తేలడంతో ఎక్సైజ్ శాఖ అధికారులకు నోట మాట రాలేదు. ప్రభుత్వ ముఖ్య నేత ఆదేశంతో నకిలీ మద్యం మాఫియా తీవ్రతను కప్పిపుచ్చేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే, నకిలీ మద్యం దారుణాలు రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తుండటంతో సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. తొలి ఏడాది రూ.5,280 కోట్ల దోపిడీ రాష్ట్రంలో అమ్ముడవుతున్న మద్యంలో మూడో వంతు నకిలీ అని ఎక్సైజ్ శాఖ వర్గాలు అంచనా వేయడం గమనార్హం. ఈ లెక్కన టీడీపీ కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాది రూ.5,280 కోట్ల నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం మద్యం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది టీడీపీ సిండికేట్ లక్ష్యం. అంటే, రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టడానికి పన్నాగం పన్నింది. ఇందులో నకిలీ మద్యం దందాకు మూల విరాట్ అయిన ముఖ్యనేత కరకట్ట బంగ్లాకు 30 శాతం వాటాగా లెక్కతేల్చారు. మొత్తంమీద రూ.15 వేల కోట్లు కరకట్ట బంగ్లాకు కమీషన్గా చేరనుంది. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్కు 20 శాతం వాటా. ఇంత భారీ దోపిడీ కాబట్టే పెదబాబు, చినబాబు ఈ దందాను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అప్పట్లో దుష్ప్రచారం ... రాద్ధాంతం... ఇప్పుడు అంతటా మౌనం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాణ్యమైన మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా విక్రయిస్తేనే టీడీపీ కూటమి, ఎల్లో మీడియా రాద్ధాంతం చేసింది. చంద్రబాబు, లోకేశ్, పవన్కళ్యాణ్, అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు తదితరులు దుష్ప్రచారమే పనిగా పెట్టుకున్నారు. మద్యం నాణ్యమైనది కాదని చెన్నైకు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబ్ నివేదిక ఇచ్చిందని రఘురామ తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. అసలు తాము అటువంటి నివేదిక ఇవ్వలేదని ఆ ల్యాబ్ ప్రకటించంతో వారి కుట్ర బెడిసికొట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీలో విక్రయిస్తున్న మద్యం నాణ్యమైనదేనని ప్రకటించింది. అప్పట్లో రాద్ధాంతం చేసిన చంద్రబాబు, ఆయన గ్యాంగ్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం యూనిట్లు క్రమంగా బయటపడుతున్నా కిమ్మనడం లేదు. కఠిన చర్యలు తీసుకోవడం లేదు. రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లలో విక్రయిస్తున్న మద్యం నాణ్యతను ర్యాండమ్గా పరీక్షించాలని కూడా భావించడం లేదు. ఇదంతా చూస్తుంటే నకిలీ మద్యం మాఫియాకు ప్రభుత్వ పెద్దల దన్ను ఉందన్నదే స్పష్టమవుతోంది. స్పిరిట్ .. మనుషులకు ప్రాణాంతకం!వాస్తవానికి ఈ స్పిరిట్లో 100 శాతం ఆల్కహాల్ ఉంటుంది. ఇది మనుషులకు అత్యంత ప్రమాదకరం. పరిశ్రమలు తమ ఉత్పత్తుల (ఆహార సంబంధిత కాదు) తయారీకి ఈ స్పిరిట్ను ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తాయి. ఇక బ్రాండెడ్ మద్యం కంపెనీల పరిశ్రమల్లో ఉండే అధునాతన, భారీ యంత్ర పరికరాలతో స్పిరిట్ను బాగా పలుచన (డైల్యూట్) చేసి ఆల్కహాల్ను 42 శాతానికి తగ్గిస్తాయి. తర్వాతే మద్యం తయారీకి ముడి సరుకుగా ఉపయోగిస్తారు. ఎందకంటే ఆల్కహాల్ 42 శాతం కంటే ఎక్కువ ఉండడం ఆరోగ్యానికి తీవ్ర హానికరం. కాగా, ఏడాదిగా టీడీపీ కూటమి పెద్దలు అక్రమంగా నెలకొల్పిన నకిలీ మద్యం యూనిట్లు ప్రమాణాలు ఏమీ పాటించలేదు. వీటిలోని చిన్నచిన్న యంత్రాలకు స్పిరిట్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం లేదు. స్పిరిట్లోని ప్రమాదకర కారమిల్ ద్రావణం, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు బ్రాండెడ్ కంపెనీల మద్యం సీసాలు, మూతలు కూడా తయారు చేస్తున్నారు. నకిలీ మద్యంలో ఆల్కహాల్ 75 శాతం వరకు ఉంటోందని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. అది ఎంత ప్రమాదకరమో ఊహకే అందడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సీసాల్లో నకిలీ మద్యం నింపి మూతలు బిగించి టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉన్న 3,736 ప్రైవేట్ దుకాణాలు, 3,736 పర్మిట్ రూమ్లు, 75 వేల బెల్ట్ దుకాణాలు, ఇప్పటికి 540 బార్లలో (త్వరలో మరో 300 కూడా) యథేచ్ఛగా అమ్ముతున్నారు. -
మహిళలను గౌరవించాలి
కర్ణాటక: యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితునికి హైకోర్టు బెయిలును నిరాకరించింది. వివరాలు.. కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాకు చెందిన సయ్యద్ పర్వేజ్ నిందితుడు. ఈ ఏడాది ఏప్రిల్ 1న బిహార్ కూలీ యువతి (19) కేరళ నుంచి సొంతూరికి వెళ్లాలని బయల్దేరింది. బెంగళూరు కేఆర్ పురం రైల్వేస్టేషన్లో దిగింది. మరుసటి రోజు అర్ధరాత్రి యువతి తెలిసిన వ్యక్తితో భోజనం చేయాలని హోటల్కు నడుచుకుంటూ వెళ్తోంది. ఈ సమయంలో అక్కడే ఉన్న నిందితుడు పర్వేజ్, మరొక నిందితుడు వారిపై దాడి చేశారు. యువతిని లాక్కెళ్లి అఘాయిత్యం చేశారు. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేసి పరప్పన జైలుకు తరలించారు. బెయిలు ఇవ్వాలని నిందితుడు పర్వేజ్ హైకోర్టును ఆశ్రయించాడు. మహిళలను గౌరవించాలని మన పురాణాలు ఘోషిస్తున్నాయి, అర్ధరాత్రి మహిళలు నిర్భయంగా నడిచి వెళ్లినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు మహాత్మాగాంధీ చెప్పారు, ఈ నేరంలో బెయిలు ఇవ్వలేము అని జడ్జి ఎస్.రాచయ్య తీర్పు చెప్పారు. -
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
-
సవీంద్ర కేసును సీబీఐకి అప్పగించటంపై వైఎస్ జగన్ హర్షం
సాక్షి, తాడేపల్లి: సవీంద్ర(Savindra) కేసును సీబీఐ(CBI)కి అప్పగించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jagan Mohan Reddy) హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు ఇచ్చిన సుమోటో ఆదేశాలను తాను స్వాగతిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే హ్యాష్ ట్యాగ్తో ఎక్స్లో ఆయన పోస్టు చేశారు. హైకోర్టు నిర్ణయం రాష్ట్రంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితికి నిదర్శనమన్న వైఎస్ జగన్.. చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోవటం లేదన్నారు.‘‘ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారు. వాక్ స్వాతంత్య్రాన్ని అడ్డుకుంటున్నారు. అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు చేస్తున్నారు. సెక్షన్ 111ని దుర్వినియోగం చేయటం నిత్యకృత్యంగా మారింది. సరైన విచారణ, ప్రజల హక్కుల పరిరక్షణ అవసరాన్ని కోర్టు ఆదేశాలు తేటతెల్లం చేశాయి’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.I welcome the Hon’ble High Court’s suo moto direction to hand over the case of social media activist Kunchala Savindra Reddy to the CBI. This decision reveals the alarming state of affairs in Andhra Pradesh, where the police under the @ncbn–led government have been crushing…— YS Jagan Mohan Reddy (@ysjagan) September 27, 2025ఇదీ చదవండి: చంద్రబాబు ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! -
మోదీపై వీడియో.. పన్నూకు బిగ్ షాక్
ఖలిస్థానీ ఉగ్రవాది, 'సిఖ్స్ ఫర్ జస్టిస్' నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ(Gurpatwant Singh Pannun)కు మరో షాక్ తగిలింది. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) ఉపా చట్టం (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధ చట్టం) కింద అతనిపై తాజాగా ఓ కేసు నమోదు చేసింది. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి పన్నూ చేసిన వీడియో ప్రకటనే ఇందుకు కారణంగా తెలుస్తోంది.పంద్రాగస్టు సందర్భంగా.. ఎర్రకోటలో దేశ ప్రధాని జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వేడుకల్లో మోదీని జెండా ఎగరేయకుండా అడ్డుకున్న వాళ్లకు భారీ నజరానా ప్రకటించాడు సిక్స్ ఫర్ జస్టిస్ ప్రధాన న్యాయ సలహాదారు గురుపత్వంత్ సింగ్. ఈ పరిణామాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్ఐఏ.. UAPA (Unlawful Activities Prevention Act) కింద కేసు నమోదు చేసింది.ఆగస్టు 10వ తేదీన రిలీజ్ చేసిన ఆ వీడియోలో.. సిక్కు సైనికుల్లో ఎవరైనా సరే ప్రధాని మోదీని జాతీయ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవాలని, అలా చేస్తే రూ.11 కోట్ల బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. అంతటి ఆగకుండా.. పంజాబ్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను కలిపి "కొత్త ఖలిస్తాన్" అనే పటాన్ని కూడా విడుదల చేశాడు.ఈ చర్యలను భారత దేశ భద్రత, భౌగోళిక సమగ్రతను భంగపరిచే ప్రయత్నంగా భావిస్తూ.. ఎన్ఐఏ అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇదిలా ఉంటే.. సిక్కు సమాజంలో అసంతృప్తిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని, తీవ్ర వాద భావజాలాన్ని వ్యాప్తి చెందిస్తున్నాడని ఇదివరకే అతనిపై అభియోగాల కింద పలు కేసులు నమోదు అయ్యాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) అనే వేర్పాటువాద సంస్థను 2007లో స్థాపించగా.. వ్యవస్థాపకుల్లో గురుపత్వంత్ సింగ్ పన్నూ కూడా ఒకడు. ఈ సంస్థను భారత్ 2019లోనే నిషేధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (UAPA) కింద భారత ప్రభుత్వం అతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడు అమెరికాలో ఉన్నట్లు సమాచారం. పన్నూకు అగ్రరాజ్యంతో పాటు కెనడా పౌరసత్వం కూడా ఉంది.ఇదీ చదవండి: బ్రిటన్ మినిస్టర్ కావడమే లక్ష్యమంటున్న భీమవారం వాసి! -
చర్లపల్లి: సంచిలో మృతదేహం కేసు.. ఆ మహిళ ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: చర్లపల్లి సంచిలో మృతదేహం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చనిపోయిన మహిళ బెంగాల్కు చెందిన ప్రమీలగా గుర్తించారు. పది సంవత్సరాల నుంచి భర్తతో దూరంగా ఉంటున్న ప్రమీల.. మరొక వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఇటీవల బెంగాలీ యువకుడితో ప్రమీలకు పరిచయం కాగా, కొండాపూర్ ప్రాంతంలో అతనితో కలిసి ఉంటుంది.ప్రమీలను హత్యను చేసిన ఆ యువకుడు గోనె సంచిలో వేసుకొని చర్లపల్లి స్టేషన్కు వచ్చాడు. ఆటోలో మృతదేహాన్ని 37 కిలోమీటర్లు తీసుకొచ్చిన ఆ వ్యక్తి.. చర్లపల్లి రైల్వే స్టేషన్ గోడ పక్కన పెట్టి వెళ్లిపోయాడు. రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్లోకి వెళ్లి స్నానం చేసి బట్టలు మార్చుకొని అస్సాం వెళ్లే ట్రైన్ ఎక్కి వెళ్లిపోయాడు. హత్యకు సంబంధించి సీసీ ఫుటేజ్ లభ్యమైంది.కాగా, చర్లపల్లి రైల్వేస్టేషన్ గోడ వద్ద సంచిలో మహిళ మృతదేహం కలకలం రేపిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 15న ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని ఓ వ్యక్తి ఆటోలో తీసుకొచ్చి పడేసినట్టు స్థానిక ఆటో డ్రైవర్లు పోలీసులకు సమాచారం అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు పరిసరాల్లోని సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
మద్యం డాన్.. మరో డ్రామా!
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ హయాంలో లేని కుంభకోణం ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు చంద్రబాబు సర్కారు బరితెగించి వ్యవహరిస్తోంది. టీడీపీ వీర విధేయ అధికారులతో కూడిన సిట్తో ఈ పన్నాగాన్ని అమలు చేస్తోంది. అందుకోసం సాక్షులను, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేసింది. రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వెంటాడి వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేశారు. వాటి ఆధారంగానే గత ప్రభుత్వ మద్యం విధానంపై అక్రమ కేసులు నమోదు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు డైరెక్షన్లో సిట్ ఎప్పటికప్పుడు వివిధ పాత్రలను తెరపైకి తెస్తూ నిరాధార అభియోగాలతో ప్రజల్ని తప్పుదారి పట్టిస్తోంది. మొదట రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి, వికాట్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పలను అక్రమంగా అరెస్టు చేసి బురద జల్లారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసి దు్రష్పచారం చేశారు. టీడీపీ అనుకూల మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. అంతటితో చంద్రబాబు కుట్రలు ఆగలేదు... ఈ రెడ్బుక్ కుట్ర కేసులో రెండో అంకంగా.... నర్రెడ్డి సునీల్రెడ్డి నివాసంలో సోదాలతో మరో కట్టుకథ వినిపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, సజ్జల భార్గవ్రెడ్డి పేర్లను తెరపైకి తెచ్చారు. తాజాగా వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. చెన్నై, హైదరాబాద్లలోని ఆయన నివాసాలు, కార్యాలయాల్లో సిట్ అధికారులు శుక్రవారం సోదాలకు దిగారు. చెన్నైకు చెందిన వ్యాపారవేత్త వైఎస్ అనిల్రెడ్డి ఏనాడూ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లోగానీ ఇతర అంశాల్లో గానీ ఆయన ఏనాడూ కల్పించుకోలేదు. కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్ అనిల్రెడ్డి నివాసంలో సోదాలు చేయాల్సిందేనని సిట్ను ఆదేశించింది. ఇదే అదనుగా ఎల్లో మీడియా ద్వారా వైఎస్ కుటుంబంపై బురద జల్లాలన్నదే అసలు లక్ష్యం. రానున్న రోజుల్లో సిట్ ద్వారా రెడ్బుక్ కుట్రలకు మరింత పదును పెట్టడమే ధ్యేయంగా చంద్రబాబు ప్రభుత్వం బరితెగిస్తోందన్నది స్పష్టమవుతోంది.మద్యం కుట్రదారు చంద్రబాబే..ఇప్పటికీ బెయిల్పైనే ఉన్న బాబు చంద్రబాబు ప్రభుత్వం బరితెగించి ఈ కుట్రకు ఎందుకు పాల్పడుతోంది అంటే... అసలు మద్యం విధానం ముసుగులో దోపిడీకి పాల్పడింది టీడీపీ ప్రభుత్వమే అన్నది వాస్తవం. రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే. 2014–19లో టీడీపీ హయాంలో తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. 4,834 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్కు కట్టబెట్టారు. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును అడ్డగోలుగా తొలగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ రెండు చీకటి జీవోలతో దోపిడీకి తెరతీశారు. తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండి కొట్టారు. దీనిపై రాజ్యాంగబద్ధ సంస్థ ‘కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక ఎంఆర్పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి టీడీపీ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు బృందం బాగోతం ఆధారాలతో సహా బయటపడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పటి సీఎం చంద్రబాబు తదితరులపై ఐపీసీ సెక్షన్లు: 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్పైనే ఉన్నారన్నది అసలు నిజం. టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే గతానికి మించిన స్థాయిలో మద్యం దోపిడీకి తెగబడుతున్నారు. మద్యం విధానం ద్వారా తమ దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఈ కుట్రకు తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై అక్రమ కేసు నమోదు చేసి సిట్ ద్వారా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది.రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుట్రరెడ్బుక్ కుట్ర కేసు కోసం చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో వ్యవహరించింది. ఈ కేసుకు కేంద్ర బిందువుగా రాజ్ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కూటమి సర్కారు కుతంత్రం దాగుంది. ఆయన చెప్పని విషయాలను సైతం చెప్పినట్టుగా సిట్ తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేసింది. అసలు ఆ వాంగ్మూలంపై ఆయన సంతకం చేయలేదని సిట్ అధికారులే ఆ రిమాండ్ నివేదికలో వెల్లడించారు. లేదంటే రాజ్ కేసిరెడ్డి తాను ఆ వాంగ్మూలం ఇవ్వలేదని న్యాయస్థానానికి చెబితే తాము ఇబ్బంది పడాల్సి వస్తుందనే భయంతోనే సిట్ ఆ విషయాన్ని నివేదికలో పేర్కొంది. ఇక అసలు విషయం ఏమిటంటే... రాజ్ కేసిరెడ్డి ఎవరో కాదు... ఆయన టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) వ్యాపార భాగస్వామి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడు కూడా. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటే 2021లోనే రాజ్ కేసిరెడ్డి ప్రస్తుత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని)తో భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్ఫ్రాకాన్ ఎల్ఎల్పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. అక్రమంగా నిధులు తరలించారని సిట్ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైడే ఇన్ఫ్రా ఎల్ఎల్పీ హైదరాబాద్లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్ 403, ప్లాట్ నంబర్ 9)తో రిజిస్టర్ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్ ఐడీ (accounts@wshanviinfraprojects.com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ అన్నది బహిరంగ రహస్యమే. అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్ ఇప్పించారు. అనంతరం ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేశారు. ఇక కేశినేని చిన్ని బినామీ కంపెనీ ‘ఉర్సా ఐటీ సొల్యూషన్స్’కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీశారు. కేశినేని చిన్ని ముసుగులో ప్రభుత్వ పెద్దలు దోపిడీకి పాల్పడుతున్నారు. మరి రాజ్ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. అంటే ఇదంతా చంద్రబాబు రెడ్బుక్ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు రద్దు చేయాలని రూపొందించిన ఫైల్పై చంద్రబాబు, కొల్లు రవీంద్ర చేసిన డిజిటల్ సంతకాలు మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రపై 2023 అక్టోబర్ 28నసీఐడీ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ -
వివేకా కేసుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఢిల్లీ: వివేకా హత్య కేసులో నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.ఈ కేసులో తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు ముగిసిందని అడిషనల్ సొలిసిటర్ జనరల్.. సుప్రీంకోర్టుకు తెలిపారు. తదుపరి దర్యాప్తు అంశంపై కోర్టుదే నిర్ణయం అని ఏఎస్జీ తెలిపారు.‘‘దర్యాప్తు చేయాలన్న పిటిషనర్ వాదనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘మీరు బస్ మిస్సయ్యారు.. ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలైంది. ఆ దశలోనే ఈ అంశాలు చెప్పాలి కదా?. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఈ అంశాలన్నీ ట్రయల్ కోర్టులో ఎందుకు చెప్పలేదు?. ఇలాగే పిటిషన్లు వేస్తూ వెళ్తే ట్రయల్ రన్ పూర్తి కావడానికి దశాబ్దం పడుతుంది. ఈ దశలో మేం చేసేది ఏం లేదు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, గత నెలలో వివేకా హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ‘ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు అవసరమని సీబీఐ భావిస్తోందా.. రాష్ట్ర ప్రభుత్వం కడప సెషన్స్ కోర్టులో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టుపై సీబీఐ అభిప్రాయమేంటి.. కేసు ట్రయల్, తదుపరి దర్యాప్తు ఏక కాలంలో కొనసాగించే అవకాశం ఉందా..’అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో గత నెల ఆగస్టు5న మరోసారి జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టగా.. వివేకా హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీం కోర్టుకు సీబీఐ వివరించింది.ఇవాళ(మంగళవారం) ఈ కేసులో నిందితుల బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. నిందితుల బెయిల్ రద్దుపై తాము జోక్యం చేసుకోలేమని.. తదుపరి దర్యాప్తు అంశంపై ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని పేర్కొంది. -
Dharmasthala case: మృతదేహాల పారవేతపై ‘సిట్’కు 30 ఫిర్యాదులు
మంగళూరు: కర్ణాటకలోని ధర్మస్థళ సామూహిక ఖననాల కేసులో సిట్ అధికారుల విచారణ మరో మలుపు తిరిగింది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుని ఆరోపణల మేరకు పలు ప్రాంతాల్లో అధికారులు తవ్వకాలు జరపగా, అనుమానాస్పద మృతదేహాలకు సంబంధించిన ఖచ్చితమైన ఆనవాళ్లు లభించలేదు. అయితే ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)నకు తాజాగా స్థానికంగా చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాలు, తప్పిపోయిన వ్యక్తులు, మృతదేహాలను అనధికారికంగా పారవేయడానికి సంబంధించి 30కి పైగా ఫిర్యాదులు అందాయి.‘మృతదేహాలను పారవేశారు’ధర్మస్థళ ఆలయానికున్న మతపరమైన పవిత్రతను కించపరచడానికే ఈ వివాదం సృష్టించారని కూడా వాదనలు వినిపిస్తున్న తరుణంలో, స్థానిక గ్రామ పంచాయతీ , పోలీసుల ప్రమేయంతో అనధికారికంగా ఇక్కడ మృతదేహాలను పారవేశారని సిట్ అధికారులకు అందిన ఫిర్యాదులలో ఆరోపణలున్నాయి. అలాగే ఆలయ ప్రతిష్టను దెబ్బతీసే లక్ష్యంతో భారీ కుట్ర జరిగిందని కొంతమంది ఫిర్యాదుదారులు సిట్ అధికారులకు తెలిపారు.సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి సమావేశందర్యాప్తు పురోగతిని సమీక్షించేందుకు, ఫిర్యాదుల విశ్వసనీయతను నిర్ణయించడానికి సిట్ చీఫ్ ప్రణబ్ మొహంతి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో ఆయనతో పాటు పోలీసు సూపరింటెండెంట్లు జితేంద్ర కుమార్ దయామా, సీఏ సైమన్, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ‘మాకు 30 కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. అవన్నీ పరిశీలనలో ఉన్నాయి. అవి నిరాధారమైనవని తేలితే, వాటిని పరిగణలోకి తీసుకోం. అయితే పలువురు ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు కోరుతున్నాయి. ఇందుకు మరింత సమాచారాన్ని సేకరించాల్సిన అవసరం ఉంది’ అని ఒక సీనియర్ అధికారి అన్నారు.అడవుల్లో అస్థిపంజర అవశేషాలుమరోవైపు ఇటీవల ఒక కీలక సాక్షి, 2012లో అత్యాచారం, హత్యకు గురైన సౌజన్య మామ విట్టల్ గౌడ సిట్ అధికారులను బంగ్లెగుడ్డె అడవులకు తీసుకువెళ్లి, మానవ అస్థిపంజర అవశేషాలను చూపించాడు. ఈ ప్రాంతం చుట్టుపక్కల పరిశీలించగా, మరిన్ని మానవ అవశేషాలు కనుగొన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఫోరెన్సిక్ దర్యాప్తుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నారని సమాచారం. అయితే దీనిపై చట్టపరమైన అభిప్రాయం కోరనున్నట్లు సిట్ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా సిట్కు అందిన ఫిర్యాదులను ముందుగా స్థానిక పోలీసులకు అప్పగిస్తామని అన్నారు. అలాగే బంగ్లెగుడ్డె అడవుల్లో తవ్వకాలు జరపాలంటే అటవీ శాఖకు సమాచారం అందించాల్సి ఉంటుందని సిట్ అధికారులు తెలిపారు. -
చార్లీ కిర్క్ ను హతమార్చిన నిందితుడిని పట్టిస్తే.. లక్ష డాలర్లు..!
-
నాపై అలాంటి కేసు.. చాలా బాధాకరం: శ్వేతా మీనన్
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత మీనన్ తనపై నమోదైన కేసుపై స్పందించింది. ఓ ఈవెంట్కు హాజరైన ఆమె.. 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో తాను సినిమాలు చేయడం లేదన్నారు. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్ది.. మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అన్నారు.శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. "శత్రువులు ఎక్కువైతే నేను మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మా ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలా అనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా' అని పంచుకుంది.కాగా.. అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మెనాచేరి మీనన్పై కంప్లైంట్ చేశారు. అయినప్పటీకీ అమ్మా మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుడా శ్వేతా మీనన్కు గతంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రెండుసార్లు ఉత్తమ నటిగా గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. -
KSR Live Show; లిక్కర్ స్కాం కేసులో బెడిసికొట్టిన టీడీపీ ప్లాన్
-
వివాదంలో కొత్త లోకా మూవీ.. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ క్షమాపణలు!
మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంటోంది. కంటెంట్ బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.అయితే ఈ సినిమాలోని ఓ సీన్ వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి. దీంతో దుల్కర్ సల్మాన్కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్ ఫిల్మ్స్ లేఖను పోస్ట్ చేశారు.ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్ లెస్ అంటూ మాట్లాడారు. ఈ సీన్ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కన్నడ డైరెక్టర్ మన్సూర్ సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు. కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు, నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు. ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు.. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్లో రాసుకొచ్చారు.#Lokah pic.twitter.com/q18SX8dh7G— Wayfarer Films (@DQsWayfarerFilm) September 2, 2025According to movies like Kannada Bhima, Malayalam films Officer on Duty, Avesham, and now Lokah,Bengaluru is being portrayed as the capital of drugs and crime.Once upon a time,it was represented in movies as a beautiful town,has come to such a state due to uncontrolled migration.— ಮಂಸೋರೆ/ManSoRe (@mansore25) September 1, 2025 -
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడు అరెస్ట్
సాక్షి, ఢిల్లీ: విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో కీలక నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. బిహార్కు చెందిన ఆరిఫ్ హుస్సేన్ అలియాస్ అబూ తాలిబ్ ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. దేశం విడిచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆరిఫ్ హుస్సేన్ను ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. రేపు(శుక్రవారం) విశాఖపట్నం ఎన్ఐఏ కోర్టులో ఆరిఫ్ హుస్సేన్ను హాజరుపర్చనున్నారు.వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు చేసేందుకు ఆయుధాలను సమకూర్చుతున్న ఆరిఫ్.. దేశంలో ఉంటూ జిహాదీ కార్యకలాపాలు నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎన్ఐఏ గుర్తించింది. సిరాజ్, సమీర్ అరెస్టుల తర్వాత దేశం విడిచి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇవాళ(గురువారం) ఆరిఫ్ను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఉగ్ర వాదులు సిరాజ్, సమీర్లతో కలిసి పని చేసిన ఆరిఫ్.. ఐడీల ద్వారా ఉగ్రదాడులు చేసేందుకు కెమికల్స్ను తీసుకెళ్తుండగా సమీర్, సిరాజులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
పుర్రె రహస్యం గుట్టురట్టు?
కర్ణాటక: ధర్మస్థలలో వందలాది శవాలను పూడ్చిపెట్టినట్లు చెప్పిన ముసుగు మనిషి చిన్నయ్య నుంచి ఒక్కొక్క విషయం వెలుగులోకి వస్తున్నాయి. అతడు మొదట్లో తీసుకువచ్చిన పుర్రె ఎక్కడిది అనే ప్రశ్నకు సమాధానం లభించింది. చిన్నయ్యను సిట్ అధికారులు విచారణ కోసం 10 రోజులపాటు కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి ప్రశ్నలతో సతమతం చేస్తున్నారు. పుర్రెను ఢిల్లీ నుంచి తీసుకువచ్చినట్లు చెప్పాడని తెలిసింది. కుట్ర చేసిన ముఠా తనను ఢిల్లీకి తీసుకువెళ్లి అక్కడ ప్రముఖ వ్యక్తులను కలిసి పుర్రె ఇచ్చారన్నాడు. పుర్రెను ముందు పెట్టుకుని కోర్టు నుంచి భద్రత తీసుకున్నానని చెప్పాడని సమాచారం. పుర్రె దొరికినది ధర్మస్థలలో తవ్వకాలు జరిగిన చోట కాదని ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. పుర్రెలో ఉన్న మట్టిని బట్టి ఆ అంచనాకు వచ్చారు. ఆపై చిన్నయ్యను గట్టిగా ప్రశ్నించగా పుర్రె ను వేరే చోట నుంచి తీసుకువచ్చినట్లు తెలిపాడు. ఇతరులు చెప్పినట్లు నేను చేశానని, కానీ సూత్రధారి వేరేవారని నోరువిప్పాడు. సదరు ముఠా నుంచి నుంచి రూ.2 లక్షలు నగదు తీసుకుని నాటకమాడినట్లు చెప్పాడు. 2023 డిసెంబరులో ఆ గ్యాంగ్ తనను సంప్రదించి ఈ వ్యవహారం నడపాలని కోరింది. ఈ అసత్య ప్రచారం చేసే గ్యాంగ్లో మహేశ్శెట్టి తిమరోడి, గిరీశ్ మట్టణ్ణవర్లు ఉన్నట్లు తెలిపాడు. చిన్నయ్య మరింత విచారించి సమాచారం సేకరించడంలో తలమునకలయ్యారు.సుజాతభట్ ను ఇంట్లోనే విచారణ! కూతురు అనన్య భట్ అదృశ్యమైందని, ఆమె ఆచూకీ కనిపెట్టాలని, వీలు కాకపోతే కనీసం అస్థికలనైనా ఇవ్వాలని ధర్మస్థలలో రభస చేసిన వృద్ధురాలు సుజాత భట్ను ఇంట్లోనే త్వరలో విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించారు. బెంగళూరు బనశంకరిలో ఆమె నివాసానికి గట్టి పోలీస్ భద్రత కలి్పంచారు. ఒకటి రెండు రోజుల్లో ఇంటికి వెళ్లి ప్రశ్నిస్తారు. ఆమె చెప్పేది నిజమా, అబద్దమా తదితరాలను ఆరా తీస్తారు. మాస్కుమ్యాన్ చూపించిన 17 ప్రదేశాల్లో తన కుమార్తె అనన్యభట్ ను పూడ్చిన స్థలం ఉందని సుజాత భట్ ఆరోపించింది. గతంలో మిస్సింగ్ ఫిర్యాదు ఇస్తే ధర్మస్థల పోలీసులు అస్సలు పట్టించుకోలేదని తీవ్ర ఆరోపణలు చేయడం చాలా ప్రచారమైంది. ఈమె వ్యాఖ్యలతో ధర్మస్థల కేసు బలపడుతుందనే సమయంలో ఆమెకు పిల్లలు లేరని తేలింది. ఈ విషయమై ప్రశ్నించగా.. మణిపాల్లో తన తాత ఆస్తి ఉండేది. ఆ ఆస్తిని తమ కుటుంబసభ్యులు ధర్మస్థల ధర్మాధికారులకు ఇచ్చారని, దీంతో నేను ఈ విధంగా అబద్ధం చెప్పానన్నారు. తరువాత ఆ మాటలు తనవి కాదని ప్రకటించింది. ఇలా నిత్యం విరుద్ధ ప్రకటనలు ఆమె ఎందుకు చేస్తోందో పోలీసులకు అంతుబట్టడం లేదు. పూర్తి వివరాలు కావాలని, విచారణకు రావాలని సిట్ నోటీసులు పంపగా ఆమె విచారణకు రాలేదు. రెండు మూడు రోజుల్లో ఇంటికెళ్లి విచారించాలని తీర్మానించారు.యూట్యూబర్ సమీర్ విచారణశివాజీనగర: ధర్మస్థల మీద అభూత కల్పనలతో వీడియోలు చేశాడనే కేసులో బళ్లారి యుట్యూబర్ సమీర్ ఆదివారం బెళ్తంగడి పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యాడు. ఉదయం 10–30 గంటలకు వస్తానని చెప్పి, మధ్యాహ్నం 1 గంటకు న్యాయవాదితో కలిసి వచ్చాడు. ధర్మస్థల దేవాలయం విరుద్ధంగా అప ప్రచారం చేసినందుకు, పలు వర్గాలను రెచ్చగొట్టేలా ప్రచారం చేశాడని అతనిపై పలు కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో కోర్టులో ముందస్తు బెయిలు తెచ్చుకున్నాడు. ధర్మస్థలలో తనకు ప్రాణ బెదిరింపు ఉందని సమీర్ చెప్పుకొన్నాడు. సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. -
'ధర్మస్థల' కేసులో మరో భారీ ట్విస్ట్


