breaking news
case
-
శ్రీకాకుళం పోలీసులకు కోర్టులో బిగ్ షాక్
-
ఆటమ్ టూ మర్డర్ కేసు..!? డాక్టర్ ప్రియాంక కేసులో ఎస్పీ సంచలన విషయాలు!
-
వేటపోతుకు ఇచ్చిన విలువ కూడా డాక్టర్ ప్రియాంకకు లేదా? అనితపై అడ్వకేట్ రజిని ఫైర్
-
డా. ప్రియాంక ఘటనపై SP సంచలన వ్యాఖ్యలు
-
సాయి కృష్ణ కేసులో కీలక మలుపు.. మాకేమి తెలీదు.. అంత CI నాగరాజుకే..
-
యాక్సిడెంట్ చేసింది వాళ్లే..? రాజమండ్రి డాక్టర్ కేసులో మార్గాని భరత్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు సీఐ నాగరాజును సిట్ అధికారులు ప్రశ్నించారు. మరోవైపు సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లను ఐదు రోజులపాటు సిట్ అధికారులు విచారించనున్నారు. ఈ మేరకు ఐదు రోజులపాటు విచారించేందుకు కోర్టు అనుమతించింది.ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యను సిట్ అధికారులు నేటి నుంచి కస్టడీలోకి తీసుకోనున్నారు. కాగా సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు కానిస్టేబుళ్లు ప్రస్తుతం వేర్వేరు సబ్ జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. -
మోదీని దూషించి.. మూడు సార్లు మకాం మార్చిన బాలిక!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీని దూషించిన కేసులో నోయిడాకు చెందిన 15 ఏళ్ల బాలిక రుచికా సింగ్ ఎదుర్కొంటున్న కష్టాలు ఇంకా తొలగలేదు. బహిరంగంగా క్షమాపణ కోరినప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఆమెకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ద్వారా చిరునామా లీక్ కావడంతో ఆమె తల్లితో పాటు మూడు సార్లు ఇల్లు మార్చాల్సిన దుస్థితి ఏర్పడింది.ఢిల్లీలోని జంతర్మంతర్లో జరిగిన విద్యార్థి ఆందోళన సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో రుచికా సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ప్రధాని మోదీ ఆమెను క్షమిస్తూ సందేశం ఇవ్వడంతో ఢిల్లీ పోలీసులు ఆమెపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేశారు. ఈ క్రమంలోనే రుచికా కూడా తన తప్పును మన్నించాలని దేశ ప్రజలను కోరుతూ, ఒక వీడియో విడుదల చేశారు. అయినప్పటికీ ఆమెకు కష్టాలు తప్పలేదు.రుచికా సింగ్ తరఫు న్యాయవాది అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఎఫ్ఐఆర్ నమోదు సమయంలో ఆమె వయసు కేవలం 14 ఏళ్లని, ఆగస్టు 1 నాటికి ఆమెకు 15 ఏళ్లు నిండాయని తెలిపారు. ఈ ఎఫ్ఐఆర్లో చిరునామా లీక్ కావడంతో కొందరు ఆమె ఇంటికి వెళ్లి అత్యాచార హెచ్చరికలు, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీంతో ప్రాణభయంతో వారు ఫరీదాబాద్లోని బంధువుల ఇంట ఆశ్రయం పొంది, ఆ తర్వాత మరో అజ్ఞాత ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు.ఈ ఘటనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని న్యాయవాది ఖండించారు. రుచికా సెలూన్ వర్కర్ కాదని, ఢిల్లీ పాఠశాలలో ఓపెన్ స్కూలింగ్ విధానంలో పదవ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థి అని తెలిపారు. ఆమె తల్లి సింగిల్ పేరెంట్ అని, ప్రైవేట్ ట్యూషన్లు చెబుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారన్నారు. ఈ వేధింపులు ఆ తల్లీకూతుళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఇది కూడా చదవండి: అభిజీత్ దీప్కే అరెస్ట్కు రంగం సిద్ధం? -
సాయికృష్ణ కేసు.. సిట్ కీలక ప్రకటన
సాక్షి, విజయవాడ: సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ కీలక ప్రకటన చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏ4గా ఉన్న సురేష్ పరారీలో ఉన్నట్లు సిట్ వెల్లడించింది. సురేష్ పరారీలో ఉన్నట్టు ఆచూకీ తెలపాలని సిట్ ప్రకటన విడుదల చేసింది. సాయికృష్ణ లాకప్ డెత్ తరువాత సెటిల్మెంట్ చేసేందుకు సురేష్ ప్రయత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. లాకప్ డెత్ కేసులో అరెస్టయిన సీఐ నాగరాజుకు సురేష్ స్నేహితుడు.సిట్ ఎదుట విచారణకు హాజరైన తరువాత కేసు నమోదు కాగానే సురేష్ పరారయ్యాడు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఆరుగురిపై కేసు నమోదు కాగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సురేష్ పరారీలో ఉన్నాడని ఇప్పటికే ఏపీ హైకోర్టుకు సిట్ నివేదించింది.కాగా, సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నాగరాజును మూడో రోజు శనివారం సిట్ విచారించింది. సుమారు 8 గంటల పాటు ఈ విచారణ సాగింది. ఆర్ఎంపీతో ట్రీట్మెంట్ చేయించారా? మృతదేహం వివరాలు స్వర్గపురి రికార్డుల్లో రాయకుండా ఎందుకు ఒత్తిడి చేశారు? సాయికృష్ణ తల్లిని బెదిరించారా? నీ కొడుకు చనిపోయాడు.. ఫొటోకు దండవేసుకో.. అని అన్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ మాజీ సీఐ నాగరాజు నుంచి మౌనమే సమాధానమైంది. సిట్ అధికారులు ఏ ప్రశ్న అడిగినా నాగరాజు తనకేమీ తెలియదని, సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే సిట్ అధికారులు ఈ కేసులో నిందితులైన కానిస్టేబుళ్లు, నాగరాజు అనుచరుడు, ఆర్ఎంపీని విచారించి వివరాలు రాబట్టారు. ఆ వివరాల ఆధారంగా నాగరాజును సిట్ ప్రశ్నిస్తోంది. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడం, కస్టడీలో చిత్రహింసలకు గురిచేయడం, మృతదేహాన్ని మాయం చేయడం వంటి అంశాలపై ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రక్తపు మరకలు లేకుండా చేయడంపై సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది.సాయికృష్ణను ఎవరి ఆదేశాలతో స్టేషన్కు తీసుకు వచ్చారని ప్రశ్నించగా, తనకేమీ సంబంధం లేదని నాగరాజు చెప్పినట్లు తెలిసింది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై కూడా ప్రశ్నించినట్లు తెలిసింది. అవేమీ తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా పుటేజీ ఎందుకు డిలీట్ అయిందని ప్రశ్నించగా తనకేమీ తెలియదని సమాధానం చెప్పినట్లు సమాచారం. మరికొన్ని ప్రశ్నలకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు తెలిసింది. -
కృష్ణలంక PSలో సీన్ రీక్రియేషన్
-
మోదీపై అభ్యంతకర పోస్టులు.. మెటా హెడ్పై కేసు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టిన నిరసనలలో ప్రధాని మోదీకి అభ్యంకతరంగా పోస్టులు చేశారంటూ మోటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీనివాస్పై కేసు నమోదైంది. ఆయనతో పాటు పలువురి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఇద్దరు బీజేపీ కార్యకర్తలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రధాని మోదీకి సంబంధించినటువంటి అభ్యంతరకరమైన, తప్పుడు కంటెంట్ను తమ ఫ్లాట్పారమ్లపై (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) ప్రసారం కావడానికి అనుమతించారని,అటువంటి పోస్టులను తొలగించడంలో విఫలమయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు, ప్రధానమంత్రిని అసభ్యకరంగా, అవమానకరంగా మరియు తప్పుదోవ పట్టించే విధంగా చిత్రీకరిస్తూ మార్ఫింగ్ చేయబడిన, డిజిటల్గా తారుమారు చేయబడిన అనేక వీడియోలు ,చిత్రాలు అందులో కనిపించాయని తెలిపారు.కాగా నీట్లీకేజ్కు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టింది. దీంతో మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామా చేశారు. మరిన్ని డిమాండ్లను సైతం కేంద్రం ముందుంచింది. -
సాయికృష్ణ కేసు.. సిట్ కస్టడీకి సీఐ నాగరాజు
సాక్షి, విజయవాడ: సీఐ నాగరాజును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. రాజమండ్రి నుండి విజయవాడకు తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీఐ నాగరాజును విజయవాడ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచనున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు తరలించే అవకాశం ఉంది. అనంతరం సీట్ కార్యాలయంలో సీఐ నాగరాజును విచారించేందుకు సిట్ సిద్ధమైంది.కాగా, సాయికృష్ణ లాకప్డెత్పై నమోదు చేసిన కేసులో దర్యాప్తు పురోగతికి సంబంధించిన వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కృష్ణలంక పోలీస్స్టేషన్ అప్పటి ఇన్స్పెక్టర్ నాగరాజును పోలీసు కస్టడీకి అప్పగించే విషయంలో సుప్రీంకోర్టు ఏం ఉత్తర్వులిచ్చిందో వాటిని తమ ముందుంచాలని కూడా ఆదేశించింది.ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సాయికృష్ణ లాకప్డెత్ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సెంటర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అధ్యక్షుడు గోచిపాత శ్రీనివాసరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. -
అంత్యక్రియలు చేశాక మాట మార్చిన పోలీసులు.. నాగ మహేష్ మరణంపై అక్కా.. చెల్లెళ్ల డిమాండ్స్
-
కృష్ణలంక సాయికృష్ణ కేసులో మరో ట్విస్ట్
-
సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సాయికృష్ణ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ వేశారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు వేసిన పిటిషన్లోనే హెబియస్ కార్పస్ అంశం పెట్టారు. సీబీఐ విచారణ పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నట్లు విజయలక్ష్మితో సంతకం పెట్టించారు అడ్వకేట్.హెబియస్ కార్పస్ పిటిషన్పై సాయికృష్ణ పిన్ని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ పిటిషన్ ఏ విధంగా వెనక్కి తీసుకుంటారంటూ అడ్వకేట్ కనకదుర్గ ప్రశ్నించారు. పిటిషనర్కు తెలియకుండా సంతకం తీసుకున్నారని కనకదుర్గ.. హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్కు తెలియకుండా హెబియస్ను విత్ డ్రా చేసుకుంటున్నట్లు పిటిషన్ ఎలా ఫైల్ చేస్తారని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.పిటిషన్ ఫైల్ చేసిన అడ్వకేట్కి నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. న్యాయవాది లైసెన్స్ రద్దుకు బార్ కౌన్సిల్కు రిఫర్ చేస్తామని న్యాయమూర్తి హెచ్చరించారు. విచారణను రేపటి(గురువారం)కి కోర్టు వాయిదా వేసింది. -
మోదీపై అభ్యంతకర పోస్టర్.. నటిపై ఫిర్యాదులు
కోల్కతా:ప్రధాని నరేంద్ర మోదీపై 'అసభ్యకరమైన' పోస్టర్ను ప్రదర్శించారనే ఆరోపణలతో ప్రముఖ బెంగాలీ నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు నమోదైంది. కోల్కతాలో ఇటీవల జరిగిన విద్యార్థి నిరసనలో మోదీ చిత్రపటాన్ని అసభ్యకరరీతిలో ప్రదర్శించారని నటి శ్రీలేఖపై పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి.నిన్న (ఆదివారం) ఆనంద్పూర్ పోలీసు స్టేషన్లో బీజేపీ నాయకురాలు కేయా ఘోష్, నటి శ్రీలేఖ మిత్రపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. కేవలం ఒకే చోట కాకుండా బిధాన్నగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్తో సహా పలు జిల్లాల్లోని వివిధ పోలీసు స్టేషన్లలో ఆమెపై ఫిర్యాదులు దాఖలైనట్లు నివేదికలు వెల్లడించాయి.ఈ అంశమై బీజేపీ నేత మాట్లాడుతూ.. "దేశ ప్రధానిని అవమానించేలా ఒక అసభ్యకరమైన పోస్టర్ను ప్రదర్శించినందుకు నటి శ్రీలేఖ మిత్రపై ఫిర్యాదు దాఖలైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. శ్రీలేఖ మిత్రను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలి" అని పేర్కొన్నారు.నిరసన ప్రదర్శన నేపథ్యంNEET ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కోల్కతా రోడ్లపై భారీ నిరసన ప్రదర్శన జరిగింది.ఈ నిరసనలో శ్రీలేఖ మిత్ర కూడా పాల్గొన్నారు. ఆ సమయంలో ఆమె ప్రధాని మోదీకి సంబంధించిన అభ్యంతరకరమైన/అసభ్యకరమైన చిత్రంతో ఉన్న పోస్టర్ను పట్టుకున్నట్లు ఫోటోలు వెలువడ్డాయి.అయితే దీనిపై శ్రీలేఖ మిత్ర తన సోషల్ మీడియా పేజీలో ఒక వీడియో స్టేషను విడుదల చేస్తూ ఘాటుగా స్పందించారు."నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే అరెస్ట్ చేయండి; నన్ను ఉరిశిక్షకు పంపాలనుకుంటే ఉరిశిక్షకు పంపండి. దీనికి వ్యతిరేకంగా కూడా కచ్చితంగా ఒక ఉద్యమం వస్తుందని నేను నమ్ముతున్నాను" అని ఆమె సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. -
పదేపదే పిటిషన్లతో ట్రయల్కు ఆటంకం
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత పదేపదే పిటిషన్లు వేస్తూ విచారణను అడ్డుకోవటాన్ని సీబీఐ ప్రత్యేక కోర్టు తప్పుపట్టింది. ఇలాంటి పిటిషన్లతో ట్రయల్ మరింత ఆలస్యం అవుతుందని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదని.. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించిందని గుర్తు చేసింది. మరోసారి దర్యాప్తునకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుందని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం పేర్కొంది. సీబీఐ చేపట్టిన దర్యాప్తుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, మరింత దర్యాప్తు జరిపించాలని సునీత దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదని స్పష్టం చేస్తూ కొట్టివేసింది. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఒకసారి అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించిన విషయాన్ని గుర్తు చేసింది. సందేహాలతో అవే అంశాలపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశాలివ్వడం చట్టపరంగా సాధ్యం కాదని తేల్చి చెప్పింది. దర్యాప్తు ఎలా సాగాలనే విషయాన్ని న్యాయస్థానం నిర్దేశించలేదని పేర్కొంటూ సునీత అభ్యర్థనను తిరస్కరించింది. సీబీఐ దర్యాప్తు సరిగా చేయలేదని, ఇటీవల దాఖలు చేసిన చార్జీషీట్ను అనుమతించవద్దంటూ ప్రత్యేక న్యాయస్థానంలో ఆమె పిటిషన్ దాఖలు చేశారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఉద్దేశాన్ని సీబీఐ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఈ పిటిషన్పై న్యాయమూర్తి డాక్టర్ పట్టాభి రామారావు విచారణ చేపట్టారు. అన్ని పక్షాల నుంచి సుదీర్ఘ, సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేసి.. శుక్రవారం వెల్లడించారు.మళ్లీ దర్యాప్తు అనవసరం..సీబీఐ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. గతంలో కోర్టు నిర్దేశించిన అంశాలన్నింటినీ పరిశీలించి అదనపు దర్యాప్తు పూర్తి చేశామని తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో కాల్ డేటా, సందేశాల సమయాలను ధృవీకరించామన్నారు. మునుపు అర్ధరాత్రి పంపినట్లు భావించిన సందేశాలు వాస్తవానికి భారత కాలమానం ప్రకారం ఉదయం 7.12 గంటలకు పంపినవేనని సాంకేతికంగా నిర్ధారించామని వివరించారు. అదనపు దర్యాప్తులో నలుగురు వ్యక్తులను విచారించామని, హత్యలో ఇతరుల ప్రమేయాన్ని సూచించే కొత్త ఆధారాలు ఏవీ లభించలేదని స్పష్టం చేశారు. అందువల్ల మరింత దర్యాప్తు అవసరం లేదని, ట్రయల్ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు పూర్తి చేసి మూడో సప్లిమెంటరీ తుది నివేదిక సమర్పించిన తర్వాత అదే అంశాలపై మళ్లీ దర్యాప్తు కోరడం చట్టబద్ధం కాదన్నారు.అనుమానాలతో పదేపదే పిటిషన్లు..నిందితుల తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే ఒకసారి కోర్టు ఆదేశాల మేరకు అదనపు దర్యాప్తు పూర్తయిందని, అదే అంశాలపై మరోసారి విచారణ కోరడం చట్టబద్ధం కాదన్నారు. తాజా మౌఖిక లేదా పత్ర ఆధారాలు లేకుండా.. కేవలం అనుమానాల ఆధారంగా పదేపదే దర్యాప్తునకు ఆదేశిస్తే అది రీ–ఇన్వెస్టిగేషన్ అవుతుందని, చట్టం అలాంటి ప్రక్రియను అనుమతించదని వాదించారు. సునీత ఇప్పటికే వివిధ కోర్టుల్లో ఒకే అంశంపై పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు చేశారని, ఒకవైపు రోజువారీ విచారణ జరపాలని కోరుతూ, మరోవైపు పదేపదే కొత్త పిటిషన్లతో ట్రయల్ ఆలస్యం చేస్తున్నారన్నారు. బాధితురాలికి దర్యాప్తు సంస్థపై పర్యవేక్షణ చేసే హక్కు లేదని, వ్యక్తిగత అభిప్రాయాలను అధికారులపై రుద్దలేరని వాదించారు. అన్ని పక్షాల నుంచి సమగ్ర వాదనలు విన్న న్యాయమూర్తి.. దర్యాప్తు సంస్థ ఎలా విచారణ జరపాలి, ఎవరిని ఎలా ప్రశ్నించాలి, ఏ అంశాన్ని ఎలా నిర్ధారించాలనే విషయాలను తాము నిర్దేశించలేమని తేల్చిచెప్పారు. సందేహాలు మాత్రమే అదనపు దర్యాప్తునకు ఆదేశాలు ఇవ్వడానికి సరిపోవన్నారు. ఇప్పటికే కోర్టు ఆదేశాల మేరకు ఒకసారి అదనపు దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో, అదే అంశాలపై మళ్లీ విచారణ కోరడానికి చట్టం అవకాశం ఇవ్వదని స్పష్టం చేశారు. పిటిషన్లో ఎలాంటి మెరిట్ లేదంటూ సునీత పిటిషన్ కొట్టివేశారు.తీర్పులో పేర్కొన్న కీలక అంశాలివీ..1). ఇప్పటికే అదనపు దర్యాప్తు..ఈ కేసులో గతంలోనే కోర్టు సెక్షన్ 173(8) సీఆర్పీసీ కింద పరిమిత అంశాలపై అదనపు దర్యాప్తునకు సీబీఐని ఆదేశించింది. ఆ ఆదేశాలను అమలు చేస్తూ సీబీఐ మూడో సప్లిమెంటరీ నివేదిక దాఖలు చేసినందున అదే అంశాలపై మరోసారి అదనపు దర్యాప్తు కోరడం చట్టపరంగా నిలబడదు.2. ఇది చట్టబద్ధమైన ‘ప్రొటెస్ట్’ కాదుసునీత ఈ పిటిషన్ను సెక్షన్లు 190, 200 సీఆర్పీసీ కింద దాఖలు చేసినా, కొత్త నేరాలపై కోర్టు కాగ్నిజెన్స్ తీసుకోవాలని కోరలేదు. ఆమె స్వయంగా సాక్ష్యమివ్వలేదు. సాక్షుల జాబితాను కూడా సమర్పించలేదు. దీనిని ప్రైవేట్ కంప్లైంట్ లేదా ప్రొటెస్ట్ పిటిషన్గా పరిగణించలేం.3. కొత్త ఆధారాలు లేవుగతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ విచారణ నిర్వహించిన తర్వాత కొత్త నిందితులు, కొత్త సాక్ష్యాలు లేదా కొత్త ఆధారాలు వెలుగులోకి రాలేదు. కొత్త మెటీరియల్ లేకుండా మరోసారి దర్యాప్తునకు ఆదేశించాల్సిన అవసరం లేదు.4. మరింత దర్యాప్తు పేరిట రీ–ఇన్వెస్టిగేషన్..ఇప్పటికే పరిశీలించిన కాల్ డేటా, సాక్షుల వాంగ్మూలాలు, సందేశాలను మరో కోణంలో మళ్లీ పరిశీలించాలని ఆమె కోరుతున్నారు. ఇది వాస్తవానికి ‘ఫర్ధర్ ఇన్వెస్టిగేషన్’ కాకుండా ‘రీ–ఇన్వెస్టిగేషన్’ కోరినట్లే. అలాంటి ఆదేశాలు ఇవ్వడానికి ఈ కోర్టుకు అధికారం లేదు.5. దర్యాప్తు ఎలా చేయాలో చెప్పలేం..దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా పని చేయాల్సి ఉంటుంది. ఏ సాక్షిని ఎలా విచారించాలి? ఏ కోణంలో దర్యాప్తు చేయాలి? ఎలాంటి నిర్ధారణకు రావాలనే విషయాలను కోర్టు నిర్దేశించలేదు. అలాంటి ఆదేశాలివ్వడం దర్యాప్తు సంస్థ అధికార పరిధిలో జోక్యం చేసుకున్నట్లవుతుంది.6. గత ఆదేశాల పరిధిని విస్తరించలేంగతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు కిరణ్ యాదవ్, అర్జున్రెడ్డి మధ్య జరిగిన సందేశాల పరిశీలనకే పరిమితం. తాజా పిటిషన్ ద్వారా ఆ పరిధిని విస్తరించి మరిన్ని అంశాలపై విచారణ జరపాలని కోరడం సబబుకాదు.7. నిరవధికంగా విచారణా..?క్రిమినల్ కేసుల్లో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదు. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు వేగవంతమైన విచారణ జరపాలని ఆదేశించింది. మరోసారి దర్యాప్తు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యమవుతుంది. -
హనీమూన్ హత్య కేసులో సోనమ్కు బిగ్ షాక్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయా హనీమూన్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ప్రధాన నిందితురాలు సోనమ్కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. ఆమె బెయిల్ను గురువారం రద్దు చేస్తూ ఆదేశాలు వెలువరించింది. అంతేకాదు.. మూడు వారాల్లోగా ట్రయల్ కోర్టు ఎదుట లొంగిపోవాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఆమె బెయిల్పై సుప్రీం కోర్టు ఇదివరకే అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఇండోర్కు చెందిన సోనమ్ రఘువంశీ.. 2025 మేలో భర్త రాజా రఘువంశీతో కలిసి హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అక్కడే వీరిద్దరూ అదృశ్యం కాగా.. కొద్ది రోజుల తర్వాత రాజా మృతదేహం ఓ లోయలో లభ్యమైంది. దర్యాప్తులో భాగంగా రాజా హత్య వెనుక సోనమ్ కుట్ర ఉందని పోలీసులు అనుమానించారు. తన తండ్రి దగ్గరే పని చేసే ప్రియుడి రాజ్ కుశ్వాహాతో కలిసి ఆమె ప్లాన్ వేసినట్లు గుర్తించారు. ఈ ఇద్దరూ.. సుపారీ గ్యాంగ్తో కలిసి రఘువంశీని హత్య చేసినట్లు దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. బెయిల్ ఎలా వచ్చింది?ఈ కేసులో సోనమ్కు షిల్లాంగ్ ట్రయల్ కోర్టు ఏప్రిల్లో బెయిల్ మంజూరు చేసింది. అరెస్టు సమయంలో నిబంధనల ప్రకారం కారణాలు సరిగ్గా తెలియజేయలేదన్న సాంకేతిక అంశాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం మేఘాలయ హైకోర్టు కూడా ఆ బెయిల్ ఉత్తర్వులను సమర్థించింది. అయితే, బెయిల్ మంజూరును సవాలు చేస్తూ మేఘాలయ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అరెస్టు మెమోలోని తప్పు కేవలం టైపింగ్ లేదా క్లరికల్ పొరపాటు మాత్రమేనని, దాని ఆధారంగా బెయిల్ ఇవ్వడం సరికాదని ప్రభుత్వం వాదించింది.విచారణకు ఆటంకం కలిగే అవకాశంజస్టిస్ ఎంఎం సుంద్రేశ్, జస్టిస్ పీబీ వరాలేతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి.. ప్రస్తుత దశలో సోనమ్ బెయిల్పై బయట ఉండటం న్యాయ ప్రక్రియకు ఆటంకం కలిగించే అవకాశం ఉందని అభిప్రాయపడింది. విచారణ వేగంగా కొనసాగకపోతే ఆరు నెలల తర్వాత ఆమె మళ్లీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు తెలిపింది.సోనమ్ వాదనతనపై అభియోగాలను సోనమ్ ఖండించింది. తాను నిర్దోషినని, కేసు పూర్తిగా పరిస్థితుల ఆధారిత సాక్ష్యాలపైనే ఆధారపడి ఉందని ఆమె తరఫు న్యాయవాదులు వాదించారు. కేవలం ఆరోపణల ఆధారంగా తనను దోషిగా చూడలేమని కోర్టుకు తెలిపారు. అయితే సుప్రీంకోర్టు ఈ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండా.. బెయిల్ను రద్దు చేస్తూ మూడు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మేఘాలయా హనీమూన్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. -
మీ బతుకంతా ఇంతేనా...? కాదంబరిని కావాలనే ఇరికించారా..?
-
బిగ్ ట్విస్ట్.. ఛార్జ్ షీట్ లో బయటపడ్డ జత్వానీ కీ పాయింట్స్..
-
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసు పూటకో మలుపు
-
ట్రైనీ IPS ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో ట్విస్ట్
-
ట్రైనీ IPS ఉదయ్ కేసులో కీలక మలుపు
-
సాయికృష్ణ కేసులో సంచలన పరిణామం
సాక్షి, విజయవాడ: సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు, అసిస్టెంట్ కమిషనర్ మానసను నిందితులుగా చేర్చాలంటూ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు నమోదైంది. జూలై 21న విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున పొన్నవోలు ఫిర్యాదు చేశారు.డీజీపీ హరీష్కుమార్ గుప్తాను ఏ–1గా పేర్కొన్న పిటిషనర్.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖర్బాబును ఏ–2గా, విజయవాడ సౌత్జోన్ ఏసీపీ ఎం.మానసను ఏ–3గా చేర్చారు. సాయికృష్ణను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి అదృశ్యం, మరణం వరకు ఉన్నతాధికారులకు సమాచారం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. విజయవాడ కమిషనరేట్ టాస్క్ఫోర్స్ బృందమే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు.టాస్క్ఫోర్స్ విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున కమిషనర్కు అరెస్టు విషయం తెలియదనడం సాధ్యం కాదని వాదన. సాయికృష్ణను మే 6న అదుపులోకి తీసుకుని మే 9 వరకు కృష్ణలంక పోలీస్స్టేషన్లో ఉంచినట్లు సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. జూన్ 15న హైకోర్టుకు మాత్రం సాయి కృష్ణ ఆచూకీ తెలియదని అధికారులు చెప్పారని పిటిషన్లో పేర్కొన్నారు.హైకోర్టుకు ఇచ్చిన సమాచారం, సీఐ రిమాండ్ రిపోర్టులోని వివరాలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయని పిటిషనర్ వాదన. మే 28నే సాయికృష్ణ అక్రమ నిర్బంధం, ప్రాణహాని అనుమానాలపై డీజీపీ, కమిషనర్కు ఈ–మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు. సమాచారం అందినా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా, సాయి కృష్ణను రక్షించేందుకు చర్యలు తీసుకోలేదని.. ఉన్నతాధికారుల ఉద్దేశపూర్వక మౌనం వల్ల సాక్ష్యాలను మాయం చేసేందుకు, నిందితులను కాపాడేందుకు అవకాశం కలిగిందని పిటిషన్లో ఆరోపించారు.పోలీస్స్టేషన్ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ల మార్పు, ఫుటేజీ మాయం అంశాలపైనా పిటిషన్లో ప్రస్తావించారు. సాయి కృష్ణ మృతదేహాన్ని రహస్యంగా దహనం చేయడం, సెల్ఫోన్తో నకిలీ ఆధారాలు సృష్టించడం సంస్థాగత కుట్రలో భాగమని పిటిషనర్ పేర్కొన్నారు. స్పెషల్ బ్రాంచ్ నివేదికలు, డైలీ స్టేటస్ రిపోర్టులు, అధికారుల రోజువారీ సమావేశాల ద్వారా అక్రమ నిర్బంధ సమాచారం ఉన్నతాధికారులకు చేరుతుందని పిటిషన్లో వాదన. ఇది కేవలం కిందిస్థాయి పోలీసుల చర్య కాదని, ఉన్నతస్థాయి కుట్ర–కప్పిపుచ్చే ప్రయత్నం జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు.సిట్ దర్యాప్తు కిందిస్థాయి పోలీసులకే పరిమితమైందని, ఉన్నతాధికారుల పాత్రను ఉద్దేశపూర్వకంగా విస్మరించిందని పేర్కొన్న పిటిషనర్.. డీజీపీ, కమిషనర్, ఏసీపీపై హత్య, నేరపూరిత కుట్ర, అక్రమ నిర్బంధం, అధికార దుర్వినియోగం, సాక్ష్యాల మాయం అభియోగాలు ఉన్నాయన్నారు. బీఎన్ఎస్ సెక్షన్లు 61, 49, 103, 127(3), 198, 238తో పాటు సెక్షన్ 3(5) కింద చర్యలు తీసుకోవాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వర్తించే క్రమంలో చేసిన చర్యలు కావని, అందువల్ల విచారణకు ముందస్తు అనుమతి అవసరం లేదని పిటిషనర్ వాదన. పోలీస్ కస్టడీలో కొట్టడం, అక్రమంగా నిర్బంధించడం అధికారిక విధుల్లో భాగం కాదని సుప్రీంకోర్టు తీర్పులను పిటిషన్లో ఫిర్యాదుదారు ఉదహరించారు.ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తుతోపాటు ప్రైవేట్ ఫిర్యాదును కలిపి విచారించేందుకు బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 233ను అమలు చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. సాయి కృష్ణ కేసులో డీజీపీ నుంచి కిందిస్థాయి పోలీసుల వరకు మొత్తం పాత్రను వెలికితీయాలని పిటిషన్ వేశారు. ఎంతటి ఉన్నతస్థానంలో ఉన్నా చట్టానికి ఎవరూ అతీతులు కాదు అనే సూత్రాన్ని అమలు చేయాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీజీపీ, కమిషనర్, ఏసీపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోర్టును తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. -
ఆ తల్లి పిటిషన్ వెనక్కి తీసుకోవడానికి కారణం..! CI నాగరాజును లేపేస్తే కేసు ఉండదు అని...!
-
సాయి కృష్ణతోనే పెంచులయ్యని చంపించి.. అడ్వకేట్ రజిని విస్తుపోయే నిజాలు
-
సాయికృష్ణ కేసుపై న్యాయవాదుల సంచలన వ్యాఖ్యలు..
-
గాదె సాయికృష్ణ పిన్ని కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ పిన్ని అడ్వకేట్ కనకదుర్గ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘విజయలక్ష్మి తప్పుకున్నా.. మేం పోరాటం చేస్తాం. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిపై ఒత్తిళ్లు ఉన్నాయి. అందుకే ఆమె మానవ హక్కుల కమిటీ సాయం వద్దంది. కేసు నుంచి ఆమె తప్పుకున్నా.. నేను పోరాడుతా’’ అంటూ కనకదుర్గ స్పష్టం చేశారు.మేము సామాన్యులం.. ఏం చెప్పమంటే అది చెప్పిస్తున్నారు. నాక్కూడా చెప్పకుండా ఆమె కోర్టుకు వచ్చారు. ఒత్తిళ్ల వల్ల అడ్వకేట్స్ను మార్చుకుంది. సాయి కృష్ణ తల్లిని కోర్టుకు తీసుకుని రావడానికి కూడా హైడ్రామా నడిపించారు. హైడ్రామా ఎవ్వరు నడిపించారూ ఆమె వెనుక ఎవ్వరు ఉన్నారో మాకు తెలియడం లేదు. సాయికృష్ణ తల్లి వెనకడుగు వేసిన మా లీగల్ బ్యాటిల్ కొనసాగుతుంది. మా అక్క విజయలక్ష్మీ పోరాటం చేయకపోయినా..నేను పిన్నిగా సాయికృష్ణ కోసం మానవ హక్కుల కమిటీ తరపున పోరాటం చేస్తాం’’ అని కనకదుర్గ తెలిపారు. -
ప్రాణాపాయ స్థితిలో బాధితుడు.. చోద్యం చూస్తున్న పోలీసులు
సాక్షి,నెల్లూరు: జిల్లా పోలీస్ శాఖలో బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య ధోరణి మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కావలి మండలంలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఒక ఘోర దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై స్థానికులు, బాధితుడి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కావలి మండలానికి చెందిన వాసు అనే యువకుడిపై నాలుగు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వాసు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో నెల్లూరు ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నాడు.తమ కుమారుడిపై అన్యాయంగా దాడి జరిగిందని, నిందితులను శిక్షించాలని కోరుతూ బాధితుడి తల్లి, బంధువులు కావలి రూరల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. అయితే, బాధితుల పట్ల బాధ్యతగా నడుచుకోవాల్సిన పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించడానికి నిరాకరించడం గమనార్హం. గత నాలుగు రోజులుగా స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కనీసం కేసు కూడా నమోదు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఒక ప్రత్యక్ష సాక్షి స్వయంగా పోలీసుల ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చేందుకు సిద్ధపడినా, కావలి రూరల్ పోలీసులు ఆ సాక్ష్యాన్ని సైతం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు కావాలనే నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారా? అనే అనుమానాలు బాధితుడి కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. -
దొరికిన సైకో కిల్లర్..!
-
రావణ్ పై ఉపా కేసు.. ఆధారాలతో నిరూపించకపోతే కోర్టులో జరిగేది ఇదే
-
టీసీఎస్ కేసు.. జైల్లో ప్రసవ వేదన భరించలేనిది!
నాసిక్ టీసీఎస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితురాలిగా అభియోగాలు ఎదుర్కొంటున్న నిదా ఖాన్కు నాసిక్ లోకల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలులోనే బిడ్డకు జన్మనివ్వాల్సి రావడం ఏ మహిళకైనా తీవ్రమైన వేదనతో కూడుకున్నదన్న కోర్టు.. ఈ సందర్భంగా శ్రీకృష్ణ జనన ప్రస్తావన తేస్తూ కీలక వ్యాఖ్యలు గమనార్హం. మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణలకు సంబంధించిన కేసులో నిదా ఖాన్ నిందితురాలిగా ఉంది. ఈ కేసులో అరెస్టుల పర్వం మొదలయ్యాక ఆమె పరారయ్యింది. అయితే.. దాదాపు 25 రోజుల తర్వాత మే 7న ఆమెను ఛత్రపతి శంభాజీనగర్లోని ఓ అద్దె ఇంటి నుంచి పోలీసులు అరెస్టు చేశారు. అయితే పరారీలో ఉన్న టైంలో తాను గర్భంతో ఉన్నానని.. ముందస్తు బెయిల్ కావాలని ఆమె వేసిన పిటిషన్ను నాసిక్ రోడ్ కోర్టు కొట్టేసింది. తాజాగా.. మరోసారి ఆమె గర్భధారణను ప్రధాన కారణంగా చూపిస్తూ బెయిల్ పిటిషన్ వేయగా.. జులై 6న బెయిల్ మంజూరు చేసింది. కోర్టు రూ.75 వేల వ్యక్తిగత బాండ్తో పాటు అదే మొత్తానికి ఒక పూచీకత్తును సమర్పించాలని ఆదేశించింది.నిదా ఖాన్ బెయిల్ వాదనను పోలీసులు, బాధితుల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. లైంగిక దాడి, బలవంతపు మత మార్పిడి ఆరోపణలకు సంబంధించి దర్యాప్తులో తగిన ఆధారాలు లభించాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిదా ఖాన్ తరఫు న్యాయవాది రాహుల్ కస్లీవాల్ మాత్రం ఆమె నిర్దోషి అని, తప్పుడు కేసులో ఇరికించారని కోర్టుకు తెలిపారు. ఆమె ఉన్నత విద్యావంతురాలని, టీసీఎస్లో అసోసియేట్గా పనిచేసిందని పేర్కొన్నారు.జైలులో ప్రసవం వేదన భరించలేనిది..బెయిల్ తీర్పు సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి కేజీ జోషి తన ఉత్తర్వుల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. “శ్రీకృష్ణుడి జననం జైల్లో జరిగింది. అలాంటి పరిస్థితుల మాదిరిగా ఓ బిడ్డకు జైలులో జన్మనివ్వాల్సి రావడం వల్ల కలిగే మానసిక వేదన, సామాజిక కళంకం ఏ మహిళకైనా తట్టుకోలేనిది. కాబట్టి పుట్టబోయే బిడ్డ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని.. అలాంటి బాధాకర పరిస్థితులను నివారించేందుకు న్యాయ విచక్షణను ఉపయోగించడం సముచితమని కోర్టు భావిస్తోంది అంటూ తీర్పు ఇచ్చారు. అంతేకాకుండా.. దర్యాప్తు పూర్తయి చార్జిషీట్ దాఖలైన నేపథ్యంలో ఆమెను జైలులో కొనసాగించడం వల్ల ప్రత్యేక ప్రయోజనం లేదని న్యాయస్థానం పేర్కొంది.టీసీఎస్ కేసులో ఆరోపణలు ఏమిటి?నాసిక్లోని టీసీఎస్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక వేధింపులు, మత మార్పిడికి ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై పోలీసులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిదా ఖాన్కు సంబంధించిన కేసులో.. మతపరమైన విషయాలతో ప్రభావితం చేయడం, బురఖా, మత గ్రంథాలు ఇవ్వడం, బాధితురాలి మొబైల్లో కొన్ని అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయడం, నమాజ్ నేర్పించడం, హిజాబ్ ధరించే విధానం వివరించడం వంటి ఆరోపణలు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్లతో పాటు.. బాధితురాలు దళితురాలు కావడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.టీసీఎస్ వివరణఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత టీసీఎస్.. వేధింపులు, బలవంతపు చర్యల విషయంలో తమ సంస్థకు జీరో టాలరెన్స్ విధానం(ఉపేక్షించేది లేదని) ఉందని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.శ్రీకృష్ణుడు దేవకి–వసుదేవులకు మధుర కారాగారంలో జన్మించాడు. కంసుడి నుంచి రక్షించేందుకు వసుదేవుడు ఆయనను గోకులానికి తీసుకెళ్లగా.. నందుడు, యశోద దంపతులు పెంచి పెద్ద చేశారు. అందుకే శ్రీకృష్ణుడిని జన్మనిచ్చిన తల్లి పేరుతో దేవకీనందనుడు, పెంచిన తల్లి–తండ్రుల పేర్లతో యశోదానందనుడు, నందలాలా అని కూడా పిలుస్తారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు: అంబటి రాంబాబు
సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు ఎట్టపరిస్థితుల్లో భయపడేది లేదని వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు (గురువారం) గుంటూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ నేతలు అమరావతి రైతులను పరామర్శించడానికి వెళితే టీడీపీ నాయకులు తమపై దాడి చేశారని దానిపై పోలీసుల వద్దకు వెళితే కనీసం తమ ఫిర్యాదులను కూడా తీసుకోవడం లేదన్నారు.టీడీపీ నేతలే తమపై దాడిచేసి తిరిగి వారే వైఎస్సార్సీపీ నాయకులపై కేసు పెట్టారన్నారు. పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ మెుండితోక అశోక్ ఇచ్చిన ఫిర్యాదును ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. టీడీపీ నేతలు కానిస్టేబుల్పై దాడి చేసిన పోలీసులు కేసు నమోదు చేయలేదని అతనిపై దాడి చేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వంలో అరాచకం పెరిగి పోయిందని పోలీస్ స్టేషన్లలోనే హత్యలు చేస్తున్నారని అంబటి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదని తెలిపారు. -
సాయి కృష్ణని ఎక్కడైతే చంపాడో అక్కడే CI నాగరాజు విచారణ
-
DSP భీమ్ రెడ్డి డైరీలో సినీ హీరో పేరు?
-
జగన్ దెబ్బకు పోలీసుల్లో కదలిక.. క్రాంతి కుమార్ కేసులో కొత్త మలుపు!
-
నా అనుభవంతో చెప్తున్నా.. ఎవ్వరు తప్పించుకోలేరు.. సాయి కృష్ణ కేసులో వచ్చే తీర్పు ఇదే
-
ఆయన ఫోన్, ల్యాప్ టాప్ ఏం చేసారంటే.. అడ్వకేట్ జనార్దన్ షాకింగ్ నిజాలు
-
CI నాగరాజు మామూలోడు కాదు.. ఈ కేసు వెనుక పెద్ద మాఫియా
-
గన్నవరంలో రావణపై పెట్టిన కేసు దారుణం ఉరిశిక్ష పడే సెక్షన్లు..
-
టెర్రస్ మీద సాయి కృష్ణ ను కాలిస్తే.. ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు.. అడ్వకేట్ సంచలన నిజాలు
-
సాయికృష్ణ తల్లిని చంపేందుకు జైలు నుంచే CI మర్డర్ ప్లాన్
-
క్రాంతికుమార్ కేసులో కీలక పరిణామం
సాక్షి, విజయవాడ: క్రాంతికుమార్ సూసైడ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాంతికుమార్ ఆత్మహత్యపై పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. క్రాంతికుమార్ ఫోన్ను స్వాధీనం చేసుకోనున్న పోలీసులు.. ఫోన్ ఇవ్వాలంటూ క్రాంతికుమార్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నార్త్ ఏసీపీ సత్యానందరావును కలిసి క్రాంతి కుమార్ తండ్రి వెంకటేశ్వరరావు ఫోన్ అందజేయనున్నారు. కాగా, దళిత యువకుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో చంద్రబాబు ప్రభుత్వ బండారాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. పోలీసులు మూడు నెలలపాటు తనను భౌతికంగా హింసిస్తున్నారని... ఆ చిత్రహింసలు భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. సెల్ఫీ వీడియో తీస్తూనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియో వెలుగులోకి రావడంతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దారుణం బహిర్గతమైంది.లాకప్లోనే సాయికృష్ణ అదృశ్యం.. పోలీసుల వేధింపులతో క్రాంతి కుమార్ ఆత్మహత్య.. ఇవి రెండూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్యలేనని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ కర్కశ కూటమి ప్రభుత్వం ఇటువంటివి ఇంకెన్ని దారుణాలు పాల్పడిందోనని సర్వత్రా చర్చ జరుగుతోంది. -
గాదె సాయికృష్ణ తల్లి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, విజయవాడ: తమను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విజయవాడ లాకప్డెత్ మృతుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటీకీ సాయికృష్ణ బూడిద ఇవ్వలేదని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. బూడిదైనా ఇప్పించాలని.. లేకపోతే నడిరోడ్డుపై పెట్రోల్ పోసుకుని చచ్చిపోతానన్నారు. తన కొడుకును హింసించిన వాళ్లు ఇంకా ఉన్నారని.. లాకప్ డెత్ వెనుక ఉన్న పెద్దలను ఎందుకు అరెస్ట్ చేయలేదన్న సాయికృష్ణ తల్లి.. విచారణ తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సాయికృష్ణ తల్లి తీవ్రంగా మండిపడ్డారు. ‘‘నన్ను చంపాలనే కుట్ర జరుగుతుంది. మేము కాపులంతా ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు. నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా?. కేసు వెనుక పెద్దవాళ్లు ఉన్నారు. అందుకే ఇలా చంపారు. నా కొడుకుని తీసుకెళ్లిన వాళ్లను ఇంకా అరెస్ట్ చేయలేదు’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో మెజిస్టీరియల్ విచారణకు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి హాజరయ్యారు. రెండు గంటల పాటు ఆమె నుంచి సమాచారం తీసుకున్నారు. కేసు విషయాలు అన్ని అడిగి తెలుసుకున్నారని విజయలక్ష్మి తెలిపారు. -
గోవాలో CI నాగరాజు ఫోన్.. పోలీస్ విచారణలో బయటపడ్డ సంచలన నిజాలు..
-
సాయికృష్ణ కేసు.. సిట్ లంచ్మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి
సాక్షి, విజయవాడ: గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ఏపీ హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సిట్ హైకోర్టును ఆశ్రయించడంతో కస్టడీ విచారణకు బ్రేక్ పడింది. సీఐ నాగరాజు కస్టడీ విచారణ షరతులపై సిట్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత సీఐని సిట్ కస్టడీకి తీసుకోనుంది. తదుపరి విచారణ ఎల్లుండికి హైకోర్టు వాయిదా వేసింది. నాగరాజు అరెస్టు నుంచి కస్టడీలోకి తీసుకొని విచారించడం వరకు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో తనను సిట్ ఇరికించే ప్రయత్నం చేస్తుందని ఇప్పటికే న్యాయమూర్తికి సీఐ నాగరాజు చెప్పిన సంగతి తెలిసిందే.కాగా, సిట్ కస్టడీ వేళ.. ఈ కేసు నిందితుడు, సీఐ(సస్పెండెడ్) నాగరాజు కోర్టుకు రాసిన లేఖ బయటకు వచ్చింది. అందులో తాను నిర్దోషినని పేర్కొంటూ.. ప్రత్యేక దర్యాప్తు బృందంపై సంచలన ఆరోపణలకు దిగాడు. సాయికృష్ణ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని నాగరాజు విజయవాడ కోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. అయితే.. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించాడు. అంతేకాదు తనను బెదిరించి, భయభ్రాంతులకు గురిచేసి.. నేరం ఒప్పించాలని చూస్తోందని, అందుకే కస్టడీకి కోరిందని అంటున్నాడు.సాయికృష్ణ కేసులో తనను సిట్ కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం అసలే లేదని.. కేవలం కేసులో ఇరికించేందుకే సిట్ ఈ డ్రామా ఆడుతోందని ఆరోపించాడు. ఒకవేళ.. తనను విచారించాల్సి వస్తే న్యాయవాదుల సమక్షంలోనే అది జరిగేలా చూడాలని కోర్టును కోరాడు. అదేవిధంగా, తనపై ఎలాంటి మానసిక, శారీరక ఒత్తిడి (టార్చర్) జరగకుండా కోర్టు జోక్యం చేసుకోవాలన్నాడు. -
ఎముకలు బూడిద... సాయి కృష్ణ డెడ్ బాడీ దొరికింది..?
-
స్టేషన్ టెర్రస్ పై సాయికృష్ణ ఎముకలు, బూడిద..
-
ఇంటి పక్కనే ఇంత జరుగుతుంటే ఏం చేస్తున్నావ్ చంద్రబాబు
-
పోలీస్ కస్టడీలోనే CI నాగరాజును అంతం చేసే కుట్ర..
-
సీఐని చంపేస్తారా..!? సాయికృష్ణ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
క్రిమినల్స్ అయితే ఎందుకు పిలిచి ముసలి కన్నీరు కార్చుతున్నావ్
-
ఆఫ్ట్రాల్ CI గాడివి.. క్రిమినల్ అయితే చంపేస్తావా..?
-
తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా.. సాయికృష్ణ కేసులో నోరు విప్పిన హెడ్ కానిస్టేబుల్స్
-
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక మలుపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఈ కేసులో కీలక సాక్షుల నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఓ మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీ డాక్టర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాయికృష్ణకు పోలీస్స్టేషన్లోనే ఆర్ఎంపీతో వైద్యం చేయించినట్లు గుర్తించారు. సాయికృష్ణ లాకప్డెత్ ఎపిసోడ్ బయటకు రాగానే ఆర్ఎంపీ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసులో మహిళా కానిస్టేబుల్, ఆర్ఎంపీని సిట్ బృందం ప్రశ్నిస్తోంది.సాయికృష్ణ లాకప్డెత్, శవాన్ని మాయం చేయడంలో మాజీ సీఐ నాగరాజుకు సహకరించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని విజయవాడ సౌత్జోన్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం లొంగిపోయారు. అనంతరం పోలీసులు వీరిని సిట్ కార్యాలయానికి తరలించారు. ఇప్పటికే సిట్ వీరి ఇద్దరిపై కేసు నమోదు చేస్తున్నట్లు కోర్టులో మెమో జారీ చేసింది. వీరిద్దరు గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు.వీరి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. వీరిని విచారణకు హాజరుకావాలని కుటుంబ సభ్యులకు సైతం నోటీసులు అందజేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్లో క్రైం కానిస్టేబుల్ బాబూరావును ఇప్పటికే సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఇక మాజీ సీఐ నాగరాజు సన్నిహితుడు సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని, ఈ కేసుకు సంబంధించి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. ప్రస్తుతం లొంగిపోయిన ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లను విచారిస్తే ఈ కేసులో అసలు సూత్రధారులు, పాత్రధారులు వెలుగులోకి రావడంతోపాటు ఈ దారుణంలో ఉన్న అనుమానాల చిక్కుముడులు వీడతాయనే భావన వ్యక్తమవుతోంది. కాగా, కృష్ణలంక పోలీసు స్టేషన్లో మరో 10 మంది కానిస్టేబుళ్లను ఇప్పటికే విచారించినట్లు తెలుస్తోంది.ప్రభుత్వ, పోలీసు పెద్దలను రక్షించే దిశలోనే దర్యాప్తు! మొత్తం మీద ఈ దారుణంలో ప్రభుత్వ, పోలీసు పెద్దల పాత్రను రక్షించే విధంగానే సిట్ దర్యాప్తు పక్కా ప్లాన్తో జరుగుతోందన్న భావన పోలీసు వర్గాల్లోనే వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను లేకుండా చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్, స్వర్గపురి పరిసర ప్రాంతాల్లో సీసీ ఫుటేజీ మొత్తం మాయం చేశారు. నాలుగు హార్డ్ డిస్క్లను ఫార్మెట్ చేశారని తెలుస్తోంది. దీనిని రికవరీ చేయడం సాధ్యమే అయినా, ఆ దిశగా ప్రయత్నాలు సాగడం లేదు. సిట్ కూడా ఫోరెన్సిక్ ద్వారా సీసీ ఫుటేజీ రికవరీ దిశగా ప్రయత్నాలు చేయటం లేదు. సీసీ ఫుటేజిని రికవరీ చేయడం కష్టమనే భావన వ్యక్తం అవుతుంది. కేసులో కీలక ఆధారమైన సీసీ ఫుటేజీ లేకపోతే,, కేసులో పురోగతి కష్టమనే భావన పోలీసు వర్గాల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు సిట్ దర్యాప్తు కేవలం స్టేట్మెంట్ల పరిశీలన, అనుమానాస్పందంగా ఉన్నవారిని విచారించడం మినహా, కేసులో కీలక ఆధారాలు మాత్రం సేకరించలేదని సమాచారం. క్రాంతి ఆత్మహత్యపై ‘సాగు’తున్న దర్యాప్తు మాజీ సీఐ నాగరాజు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో విడుదల చేసి చనిపోయిన క్రాంతికుమార్ ఉదంతంపైన చేస్తున్న దర్యాప్తు మందకొడిగా సాగుతోంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఏసీపీ సత్యానందం రెండు రోజుల క్రితమే క్రాంతికుమార్ ఇంటికి వెళ్లి అతని తండ్రి, కుటుంబ సభ్యులనుంచి స్టేట్మెంటు రికార్డు చేశారు. స్టేషన్కు సోమవారం తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావును పిలిచి పలు అంశాలపై ఏసీపీ విచారించారు.సస్పెండ్ అయిన కానిస్టేబుల్ సురేశ్ గురించి కూడ వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. సీఐ నాగరాజు ఎలా వేధించింది క్రాంతికుమార్ సెల్ఫీ వీడియోనే చెబుతోంది కదా అని విచారణాధికారికి తండ్రి నివేదించినట్లు సమాచారం. ప్రధానంగా మాదిగ పుట్టుక పుట్టడం, బూటు పాలిష్ చేయడం వంటి అంశాలతో తీవ్ర వేదన చెందినట్లు ఆయన పోలీసులకు తెలిపారు. కాగా నాగరాజుపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలన్న డిమాండ్లపై అధికారులు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
సీఐ నాగరాజు మాస్టర్ స్కెచ్.. 32 టెరాబైట్స్ CCTV ఫుటేజ్ డిలీట్..
-
హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ
-
ఈ రోజు కోర్టులో జరగబోయేది ఇదే.. సాయి కృష్ణ కేసుపై కారుమూరి షాకింగ్ నిజాలు
-
సాయికృష్ణ కేసు: హైకోర్టు విచారణ వేళ రాజకీయ మల్లగుల్లాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కాపు యువకుడు గాదె సాయికృష్ణ లాకప్డెత్ కేసులో సిట్ విచారణ తూతూ మంత్రంగా సాగుతోంది. అసలు సూత్రధారులు, పాత్రధారులను రక్షించే విధంగా దర్యాప్తు పక్కదారి పట్టిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సాయికృష్ణ మిస్సింగ్కు సంబంధించి కీలకమైన ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ సోమవారం హైకోర్టులో విచారణకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వ పెద్దలు తెరవెనుక పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. బాధిత కుటుంబ సభ్యుల ద్వారా కేసు ఉపసంహరణకు ఓ పచ్చనేత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఈ కేసులో సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయమనే ఆందోళనతో తెర వెనుక కుట్రలకు పదును పెట్టారు. -
ఇవాళ హైకోర్టు ముందుకు సాయికృష్ణ కేసు
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. SIT కు కీలక రిపోర్టు ఇచ్చిన అంబటి..
-
రాముల వారి సొమ్ముతో లగ్జరీ కార్లు, ఫార్మ్హౌస్లు?
లక్నో: ప్రస్తుతం దేశంలో అయోధ్య రామాలయ హుండీలో విరాళాల చోరీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించిన నేరస్థుల లైఫ్ స్టైల్పై ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వారి గ్రామంలో ఈ విషయమై పోలీసులు విచారణ చేయగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో పోలీసులు ఇదివరకే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఇందులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతని బావ లవకుష్ మిశ్రా ఉన్నారు. అయితే అనుకల్పే మాస్టర్మైండ్ ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు. తాజాగా అయోధ్య పరిసరాల్లోని ఆయన గ్రామాన్ని సందర్శించగా ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.అయోధ్య సమీపంలోని అతని గ్రామమైన బసవాకు పోలీసులు విచారణ నిమిత్తం వెళ్లారు. ఇతరుల ఇళ్లతో పోలిస్తే అతని ఇల్లు చాలా విభిన్నంగా అత్యంత విలాసవంతమైనదిగా కనిపించినట్లు పేర్కొన్నారు. ఆ విషయమై వారి ఇంటి పరిసరాల్లోని వ్యక్తులను విచారించగా ఒక్కసారిగా వారి ఆర్థిక స్థితిలో పెనుమార్పులు వచ్చినట్లు తెలిపారు.అంతేకాకుండా అనుకల్ప్ మిశ్రా ఇటీవల గ్రామం వెలుపల ఒక ఫార్మ్హౌస్ నిర్మించాడని గత ఏడాది అయోధ్యలో రూ. 65 లక్షలు వెచ్చించి ఒక ఇల్లు కొనుగోలు చేశాడని అతని వద్ద ఇప్పటికే ఒక వాహనం ఉండగా, కొత్తగా స్కొర్పియో ఎస్యూవీ బుక్ చేశాడని పేర్కొన్నారు.కొద్దిరోజుల క్రితం వరకు ఆ కుటుంబం తీవ్రమైన "ఆర్థిక ఇబ్బందుల్లో" ఉండేదని, కానీ ఇప్పుడు వారికి ఎటువంటి లోటులేదని ఆర్థికంగా చాలా బలంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవలే అనుకల్ప్ ఒక ప్రసిద్ధ మత ప్రవచనకర్త (కథావాచక్) తో ఏడు రోజుల పాటు అత్యంత వైభవంగా మతపరమైన కార్యక్రమాన్ని నిర్వహించాడని అతని బంధువులు తెలిపినట్లు పేర్కొన్నారు.అనుకల్ప్ మిశ్రా నేపథ్యంఒక బ్యాంకు అవుట్సోర్సింగ్ టీమ్లో పనిచేసే మిశ్రా, దాదాపు మూడేళ్ల క్రితం రామాలయ విరాళాల లెక్కింపు బృందంలో చేరాడు. ఆ తర్వాత అదే బ్యాంక్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా తన బావ లవకుష్ మిశ్రాను కూడా అదే టీమ్లోకి తీసుకువచ్చాడు.అయోధ్యలోని రుదౌలీ ప్రాంతానికి చెందిన లవకుష్ మిశ్రా ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతను కూడా ఇటీవల లక్ష రూపాయలకు పైగా విలువైన బైక్ను కొనుగోలు చేసినట్లు పొరుగువారు తెలిపారు. -
సాయికృష్ణ కేసు కంచికే.. పోలీసులే పోలీసులపై విచారణ.. కృష్ణలంక క్రిమినల్స్
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సిట్ అదుపులో సీఐ నాగరాజు సన్నిహితుడు..
-
విజయవాడ సీపీపై సాయికృష్ణ తల్లి సంచలన కామెంట్స్
-
మాకు బాబుపై నమ్మకం లేదు.. హైకోర్టును ఆశ్రయించిన సాయికృష్ణ తల్లి...
-
గంగమ్మ లాకప్ డెత్ కేసులో హై కోర్టు కీలక నిర్ణయం..
-
హైకోర్టుకు సాయి కృష్ణ తల్లి.. ఖాకీలపై నమ్మకం లేదు.. సీబీఐకి ఇవ్వండి!
-
హస్తికలు వెలికితీయండి... సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుపై NHRC ఆగ్రహం
-
కర్త, కర్మ, క్రియ CP రాజశేఖర్ బాబే...! హైకోర్టు న్యాయమూర్తికి నా విన్నపం ఇదే
-
Big Update: సాయి కృష్ణ శవం మాయం చేసింది.. హెడ్ కానిస్టేబుల్ అశోక్
-
100 మంది ఉన్న పోలీసు స్టేషన్ లో సాయి కృష్ణను చంపడం ఒక్కరు కూడా చూడరా?
-
లోకేశ్, అనిత, పవన్.. పోలీసు శాఖకు పట్టిన చీడ.. కృష్ణలంక రాక్షసులు
-
రాధా గాయత్రి కేసులో కీలక పరిణామం
సాక్షి, విశాఖపట్నం: రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సింహాచలంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. శ్రీచరణ్ కుటుంబ సభ్యులను నిలదీసిన రాధా గాయత్రి కుటుంబ సభ్యులు.. శ్రీచరణ్ ఎక్కడున్నాడో చెప్పాలంటూ ఆమె తల్లి పట్టుబట్టింది. శ్రీచరణ్ ముస్సోరి వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని రాధా గాయత్రి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాధ గాయత్రి పెద్ద కర్మ వేదికగా వివాదం రాజుకుంది.శ్రీచరణ్ తల్లిదండ్రులను రాధాగాయత్రి తల్లిదండ్రులు, బంధువులు చుట్టుముట్టారు. శ్రీచరణ్ ఇక్కడే ఉండి డ్రామాలు ఆడుతున్నారంటూ మండిపడ్డారు. శ్రీచరణ్ వచ్చే వరకు అతడి తల్లిదండ్రులను విడిచిపెట్టేది లేదని రాధా గాయత్రి బంధువులు తేల్చి చెప్పారు. అందరి సమక్షంలో శ్రీచరణ్కు బంధువులు కాల్ చేయించగా.. ముస్సోరిలో విచారణాధికారిని కలిసిశానంటూ శ్రీచరణ్ చెప్పాడు. ఎంక్వైరీ ఆఫీసర్కు స్పాట్లోనే బంధువులు కాల్ చేయగా.. ఇంతవరకు శ్రీచరణ్ తనను కలవలేదంటూ విచారణాధికారి చెప్పినట్లు సమాచారం.కాగా,ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో విశాఖపట్నానికి చెందిన యువతి రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆమె మరణంపై ఇప్పటికే భర్త శ్రీచరణ్పై హత్య కేసు కూడా నమోదు చేశారు. రాధా గాయత్రి తన తల్లితో మాట్లాడినట్లు చెబుతున్న ఓ ఆడియో క్లిప్ కూడా వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవర్తనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు భర్త శ్రీచరణ్పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. -
పెద్దలకు తెలిసే జరిగిందా..? సాయికృష్ణ కేసులో బిగుస్తున్న ఉచ్చు
-
సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు
-
CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్
-
CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!
-
ఈ సిట్ మాకొద్దు.. జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాల్సిందే.. సాయికృష్ణ తల్లి పిటిషన్
-
‘చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పోలీసులు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. సాయికృష్ణపై రెండు నాన్ బాయిల్ వారెంట్లు ఉన్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని కృష్ణ లంక పోలీసులు కలిపి హింసించి చంపారు. ఎక్కడ కుడా సీసీ ఫుటేజ్ లేకుండా మాయం చేశారు’’ అని రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘జగ్గయ్యపేటలోని ఒక ల్యాండ్ డీల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ ఒత్తిడితో లాకప్ డెత్ జరిగింది. సిటీ కమిషనర్ రాజశేఖర్ ఆదేశాల మేరకే సీఐ నాగరాజు మరికొందరు కలసి హింసించి సాయికృష్ణని అతి కిరాతకంగా చంపారని రాచమల్లు ఆరోపించారు‘‘ప్రజా సంఘాలు, వైఎస్సార్ పార్టీ కలిసి వారికి మద్దతు తెలపడంతో సీఐ నాగరాజుపై కేసు కట్టారు. ఈ హత్యకు సూత్రధారులు, పాత్రధారులపై కేసు నమోదు చేయాలి. రిమాండ్ రిపోర్టులో ఎన్నిగంటలకు చనిపోయాడు? ఎప్పుడు చనిపోయాడు అనేది రాయలేదు. ఈ రిపోర్టు చంపిన వారే రాసినట్టు ఉంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి విచారణ జరిపాలి’’ అని రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. -
CI నాగరాజు అరెస్ట్ అంతా డ్రామానా? రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు అన్ని మాయం
-
సాయికృష్ణ ను చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందటే..?
-
సిగ్గులేదా పవన్ కళ్యాణ్... నువ్వింతలా దిగజారిపోతావ్ అని జన్మలో అనుకోలేదు
-
CI నాగరాజు పాత్రదారుడు మాత్రమే... సూత్రదారులు ఎవరంటే...? పొన్నవోలు కీలక వ్యాఖ్యలు
-
సీఐ నాగరాజు వెనుక సీపీ రాజశేఖర్..! సాయికృష్ణ శవాన్ని ఇద్దరూ కలిసే మాయం..!
-
ప్రభుత్వ హత్య.. పెద్దలను కాపాడే కుట్ర... కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు... కీలక అంశాలు లేకుండానే ‘సిట్’ రిమాండ్ నివేదిక
-
నిజాన్ని దాచలేరు.. తప్పు ఒప్పుకున్న CI నాగరాజు
-
గంగమ్మ లాకప్డెత్ కేసు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, విజయవాడ: దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్పై దాఖలైన పిల్పై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. దుర్గప్ప ట్రీట్మెంట్కి సంబంధించిన అన్ని రిపోర్టులను ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్.. సీల్డ్ కవర్లో హైకోర్టుకు సమర్పించారు. రిపోర్టులు మొత్తాన్ని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. పిటిషనర్ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. గంగమ్మ కుమార్తె లక్ష్మిని పోలీసులు భయపెడుతున్నారన్నారు.ఆమె స్వగ్రామంలోకి ఎవరిని వెళ్లనివ్వట్లేదని.. గంగమ్మ మృతదేహానికి రీపోస్టుమార్టం నిర్వహించాలని పిటిషనర్ తరపున న్యాయవాది కోరారు. గంగమ్మ ఎలా చనిపోయిందని ప్రభుత్వం తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. పోస్టుమార్టం రిపోర్ట్లో గంగమ్మ ఏ కారణం చేత చనిపోయిందని రాసి ఉందంటూ హైకోర్టు ప్రశ్నించింది.గంగమ్మ ఒంటిపై గాయాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించగా.. కార్డియాక్ అరెస్ట్తో పాటు మరికొన్ని కారణాలతో గంగమ్మ చనిపోయిందని పోస్టుమార్టం రిపోర్ట్లో పేర్కొన్నారని ప్రభుత్వం తరఫున న్యాయవాది.. కోర్టుకు తెలిపారు. గంగమ్మ కూతురు లక్ష్మికి భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సంబంధించి పూర్తి వివరాలు తమ ముందు ఉంచాలని ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. -
సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. CI నాగరాజు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన నిజాలు..!
-
నాగరాజుతో డీల్..? పెద్దల పేర్లు సేఫ్ ..?
-
సీఐ నాగరాజు మామూలోడు కాదు.. 200 కోట్ల ఆస్తులు సంపాదించాడు
-
పెద్దల ఆదేశాలతో.. సిట్ ప్రశ్నలకు నాగరాజు మౌనం
-
నా ముందే నా కొడుకుని కొట్టారు.. విజయలక్ష్మి కంప్లైంట్ తో కొత్త ట్విస్ట్..
-
అరెస్ట్ డ్రామా... CI నాగరాజుకి జనసేన MLA సీటు కారుమూరి సంచలన వ్యాఖ్యలు
-
పేరు చెప్పొద్దు.. ఎమ్మెల్యే టికెట్ ఇస్తాం..! సీఐ నాగరాజు కు బిగ్ ఆఫర్..
-
సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో సాక్ష్యాలు ఎలా మాయం చేసారంటే...
-
ఈ కేసులో ఆఖరిగా వచ్చే తీర్పు ఇదే.. వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ఎంపీకి, CI నాగరాజు మధ్య భారీ డీల్? బయటకి వస్తున్న సంచలన నిజాలు
-
శవం మీద పేలాలు వేరుకునే వాడివి.. నీది ఒక బ్రతుకేనా...
-
కూటమి సీక్రెట్ ప్లాన్..! సాయి కృష్ణ కేసు వెనుక ఎంపీ, పోలీస్ మధ్య భారీ డీల్
-
పక్క ప్లాన్ చేసి చంపేశారు ... దీనివెనుక చాలా పెద్ద రాజకీయ నాయకులు ఉన్నారు..
-
సిగ్గులేదా..? కులం పేరు చెప్పి ఆడుకున్నప్పుడు.. నీ బ్రతుకంతా భజన చేయడమే..!
-
పవన్ టార్గెట్ ఎవరు..? సీఐ నాగరాజును ఎందుకు విచారించట్లేదు..?
-
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆధారాలు మాయం..?
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు.. CI నాగరాజు అరెస్ట్..?
-
లాకప్ డెత్ కేసులో రోజుకో మలుపు.. మలయాళం సినిమాను మించిన క్రైమ్ థ్రిల్లర్
-
సాయి కృష్ణ కేసు వెనుక ఉన్న బడా బాబులను కాపాడటం కోసం ఈ కేసుకు మేకప్ వేస్తున్నారు
-
సాయి కృష్ణ ను ఎందుకు.. ఎవరు చంపారంటే? వెంకట్ రెడ్డి సంచలన నిజాలు
-
సాయి కృష్ణ కేసులో సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖ: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాయి కృష్ణ కేసులో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా ఐజీ రవి ప్రకాష్ ఉండగా.. సభ్యులుగా పశ్చిమగోదావరి ఎస్పీ అద్నాన్ నయీం షమీ, అల్లూరు సీతారామరాజు ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ SP ఎల్ సుధాకర్ని నియమించింది. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మే 9న అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఆయనను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, హింసించి చంపేశారని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా సాయికృష్ణ మిస్సింగ్ కేసు వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికకు వెళ్లిన అధికారులు.. అక్కడ పని చేసే బాషా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సాయికృష్ణను లాకప్డెత్ చేసిన అనంతరం ఇక్కడే ఖననం/అంత్యక్రియలు చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.గాదె సాయికృష్ణ కేసు దర్యాప్తు నేపథ్యంలో పోలీసులు చేపట్టిన తనిఖీలు శనివారం విజయవాడ కృష్ణలంక స్వర్గపురి శ్మశాన వాటికలోని అనుమానాస్పద వ్యవహారాలను బయటకు తెచ్చాయి. అనాధ మృతదేహాల నిర్వహణలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణలతో ఎలక్ట్రికల్ ఫర్నెస్ ఆపరేటర్ బాషాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.కృష్ణలంక స్వర్గపురిలో సాయంత్రం 6 గంటల తర్వాత దహనాలు నిర్వహించకూడదన్న నిబంధన అమల్లో ఉంది. అయితే మే నెల 23వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో రెండు అనాధ మృతదేహాలను అక్కడికి తీసుకువచ్చినట్లు తేలింది. అప్పటికే సమయం ముగిసిందని దహనానికి అవకాశం లేదని ఇంచార్జి బాషా చెప్పినప్పటికీ, పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సూచనలతో మృతదేహాలను తాత్కాలికంగా అక్కడే నిల్వచేసినట్లు సమాచారం. అనంతరం 24వ తేదీ ఉదయం దహన కార్యక్రమం నిర్వహించారు.ఈ వ్యవహారం.. గాదె సాయికృష్ణ కేసుతో అనుసంధానంగా బయటపడినట్లు తెలుస్తోంది. అనాథ మృతదేహాల దహనానికి సంబంధించిన ప్రొసీజర్ను పూర్తిగా పాటించారా లేదా? రికార్డులు సక్రమంగా నిర్వహించారా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దహనాలు, ఖననాల ముందు తప్పనిసరిగా నిర్వహించాల్సిన రికార్డులు, కృష్ణలంక పోలీసులు ఇచ్చిన అనుమతులు సరైన విధంగా ఉన్నాయా? అసలు ఆ అనుమతులు ఎవరు ఇచ్చారు? అనే విషయాల్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. -
సాయి కృష్ణ కేసులో బిగ్ రివీల్.. బైక్ పై తీసుకెళ్లి దహనం చేసిన చోటు ఇదేనా..
-
గుంటూరులో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
సాక్షి, గుంటూరు: నగరంలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. సాయికృష్ణ, క్రాంతికుమార్ మరణాలపై సీబిఐ విచారణ జరపాలని డిమాండ్ వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. కొరిటపాడు లైబ్రరీ సెంటర్ నుండి లాడ్జి సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘క్రాంతికుమార్ మరణ వాంగ్మూలం ఇచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికృష్ణ పోలీసు దెబ్బలకు తట్టుకోలేక చనిపోయారు. రక్షించాల్సిన పోలీసులే హతమార్చుతున్నారు. చంద్రబాబు.. సాయికృష్ణ కుటుంబానికి అండగా ఉంటాడట. 49 రోజుల క్రితం సంఘటన జరిగితే ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదు?. హెబియస్ కార్పస్ పిటిషన్ వేయటం, వైఎస్ జగన్ వారి ఇంటికి వెళ్లేదాకా ప్రభుత్వం పట్టించుకోదా?’’ అంటూ ఆయన ప్రశ్నించారు.‘‘పోలీసులు నమోదు చేసున కేసు కోర్టులో నిలబడదు. లోపభూయిష్టమైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గత నెల 28న విజయలక్ష్మి ఒక ఫిర్యాదు చేశారు. అదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్. కానీ దాన్ని కాదని మొన్న హడావుడిగా ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారు?. సీఐ నాగరాజును బలి చేయటానికి హడావుడిగా కేసు నమోదు చేశారు. జడా శ్రవణ్ కుమార్ చాలా స్పష్టంగా సాయికృష్ణ కేసు వివరించారు. సాయికృష్ణ హత్య సీపీ, డీజీపీకి తెలియకుండానే జరిగిందా?..క్రాంతికుమార్ ఆత్మహత్య కేసు కూడా నిలపడకుండా చేస్తున్నారు. ఈ రెండు కేసుల్లో పెద్దపెద్ద వారి ప్రమేయం ఉంది. 29న కోర్టులో సాయికృష్ణను హాజరు పరుస్తారా?. కనీసం బూడిద కూడా దొరక్కుండా చేశారు. నేరాంగీకారం జరిగితే తప్ప ఇది మర్డర్ కేసుగా నిలబడదు. కాపులను చంపి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారా?. కాపులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?’’ అంటూ అంబటి రాంబాబు నిలదీశారు.‘‘పోలీసు స్టేషన్కు వెళ్లాలంటేనే జనం భయపడే పరిస్థితి ఏర్పడింది. సాయికృష్ణ వ్యవహారం వెనుక ఉన్న బడా బాబులు బయటకు రావాలి. సీఐ నాగరాజు పాత్ర ఒక్కటే సాయికృష్ణ కేసులో లేదు. సీబిఐ విచారణలో మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. రాజమండ్రి ఎస్పీ విచారణలో వాస్తవాలు వెల్లడవ్వవు’’ అని అంబటి రాంబాబు పేర్కొన్నారు. -
ఐదేళ్లు లివిన్, ఇపుడు రేప్ అంటే? కేసు కొట్టేసిన హైకోర్టు
పరస్పర అంగీకారంతో కూడిన సుదీర్ఘ సంబంధాలపై అలహాబాద్ హైకోర్టు (Allahabad High Court) కీలకమైన తీర్పు నిచ్చింది. కేవలం పెళ్లి చేసుకుంటాననే వాగ్దానాన్ని నెరవేర్చలేదనే కారణంతో ఇద్దరు వయోజనుల మధ్య ఉన్న దీర్ఘకాలిక శారీరక సంబంధాన్ని అత్యాచారం (Rape)గా పరిగణించ లేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఓ యువకుడిపై నమోదైన రేప్ కేసును న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది సంజయ్ సరోజ్ అలియాస్ సంజయ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అనుమతిస్తూ జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వును జారీ చేసింది.కేసు నేపథ్యంపోటీ పరీక్షల ప్రిపరేషన్ కోసం 2014లో ప్రయాగ్రాజ్ వచ్చింది బాధిత యువతి. ఈ క్రమంలో దూరపు బంధువు, నిందిత యువకుడు చదువు, వసతి విషయంలో ఆమెకు సహాయం చేశాడు. ఈ క్రమంలో వారిద్దరూ దగ్గరయ్యారు. 2019 దాకా దాదాపు ఐదేళ్ల పాటు సహజీవనం చేశారు. తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అతను ముఖం చాటేశాడు. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో శారీరక సంబంధం పెట్టుకుని, ఇపుడు పెళ్లి మాట ఎత్తితే కొట్టి, బెదిరంపులకు పాల్పడుతున్నాడంటూ 2019లో ప్రయాగ్రాజ్లోని కల్నల్గంజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. తన అశ్లీల వీడియో తీసి బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నాడని కూడా పేర్కొంది. 2020లో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయగా, 2021లో మేజిస్ట్రేట్ దీనిని పరిగణనలోకి తీసుకున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టును ఆశ్రయించి, తనపై ఉన్న క్రిమినల్ విచారణను కొట్టివేయాలని కోరాడు. కేసును, ఇరుపక్షాల వాదనలను విశ్లేషించిన అనంతరం, వారి సంబంధం చాలా సంవత్సరాలు, పరస్పర అంగీకారంతోనే సాగిందని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ నిర్ధారించింది.ఐదేళ్ల సుదీర్ఘ సంబంధాల తర్వాత , ప్రతిసారీ కేవలం పెళ్లి వాగ్దానం వల్లే ఆమె శారీరక సంబంధానికి అంగీకరించిందంటే విశ్వసించలేమని కోర్టు పేర్కొంది. వైద్య పరీక్షల్లో ఆమెపై ఎలాంటి గాయాలు ఉన్నట్లు తేలలేదనీ, ఇరువురి సమ్మతితోనే ఈ బంధం కొనసాగిందని కోర్టు అభిప్రాయపడింది. దీర్ఘకాలిక సంబంధాల్లో తేడాలొచ్చినపుడు, లేదా విఫలమై నప్పుడు దానిని అత్యాచారంగా పరిగణించడం, చట్టాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు హెచ్చరించింది. ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్గా కాంటాక్ట్ లెన్స్ : అమెరికన్ మహిళ సంబరంఫిర్యాదుదారు తన పూర్తి అంగీకారంతో నిందితుడితో శారీరక సంబంధాలు ఏర్పరచు కున్నప్పుడు ఇది కేవలం పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం దెబ్బతినడం మాత్రమే కానీ, అత్యాచారం కిందికి రాదని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కారణంగా, నిందితుడిపై క్రిమినల్ విచారణను కొనసాగించడం సమంజసం కాదని పేర్కొంటూ, అతనిపై ఉన్న అన్ని చట్టపరమైన విచారణలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు 34 పేజీల సుదీర్ఘమైన తీర్పును వెలువరించింది. అంతేకాదు ట్రయల్ కోర్టులోని కేసు ప్రొసీడింగ్స్ మొత్తాన్ని హైకోర్టు రద్దు చేసింది.ఇదీ చదవండి: ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే! -
‘సాయికృష్ణ కేసు.. పెద్ద తలకాయలను బయటపెడతా’
సాక్షి, విజయవాడ: ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారని ప్రముఖ న్యాయవాది, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రవణ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సాయికృష్ణ మృతిపై హైకోర్టులో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తానని తెలిపారు. ఇది లాకప్ డెత్ కాదని.. ప్రీ ప్లాన్ మర్డర్ అన్న శ్రవణ్.. ల్యాండ్ సెటిల్మెంట్ కారణంగానే ఈ హత్య జరిగిందని.. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలను బయట పెడతానన్నారు.‘‘సాయికృష్ణను ఈ నెల 8న మార్కాపురం నుంచి కృష్ణలంక తీసుకొచ్చారు. ఒకరోజు మాత్రమే కృష్ణలంక పీఎస్లో ఉంచారు. 9వ తేదీ ఉదయం సాయికృష్ణను టాస్క్ఫోర్స్ ఆఫీస్ తీసుకెళ్లారు. కృష్ణలంక పీఎస్, టాస్క్ఫోర్స్ ఆఫీసుల్లో సీసీ ఫుటేజ్లను జాగ్రత్త పరచాలి. సీసీ ఫుటేజ్ మాత్రమే నిందితులను పట్టించే ప్రాథమిక సమాచారం. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుంచి ఓ ప్రైవేట్ హోటల్కు తీసుకెళ్లారు. ప్రైవేట్ హోటల్ రూమ్ 302లో సాయికృష్ణను చిత్రహింసకు గురిచేశారు. సాయికృష్ణను పగలంతా టాస్క్ఫోర్స్ పోలీసులు, రాత్రి సీఐ నాగరాజు హింసించారు..సాయికృష్ణను ఎందుకు హింసించారో.. ఏమి చెప్పమని కొట్టారో తెలియాలి.. సీఐ నాగరాజు పేరుమీదే హోటల్ రూమ్ బుక్ అయ్యింది. హోటల్ ఎంట్రీలో కూడా సీఐ నాగరాజు పేరుంది. సాయికృష్ణను విపరీతంగా కొట్టడంతో దవడ పగిలిపోయింది. 14వ తేదీన ప్రజా వైద్యశాలకు తీసుకొచ్చారు. సాయికృష్ణ చనిపోతాడని డాక్టర్లు చికిత్స చేయడానికి నిరాకరించారు. సాయికృష్ణను మణిపాల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయికృష్ణకు సివిల్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్ ట్రీట్మెంట్ చేశారు. మణిపాల్ ఆసుపత్రిలో కూడా చేతులెత్తేయడంతో మళ్లీ హోటల్కు తీసుకెళ్లారు. ఆర్ఎంపీతో సాయికృష్ణకు వైద్యం చేయించారు. హోటల్లో సీసీ ఫుటేజ్ను తప్పకుండా జాగ్రత్తపరచాల్సి ఉంది’’ అని జడ శ్రవణ్ పేర్కొన్నారు. -
‘ఫిర్యాదు చేసినప్పుడే సీపీ, డీజీపీ ఎందుకు స్పందించలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: వైఎస్సార్సీపీతో పాటు ప్రశ్నించిన వారిని టార్గెట్ చేయడమే మీ పనా? అంటూ కూటమి సర్కార్పై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల భాష సంస్కార హీనంగా ఉందన్నారు. రాజకీయ నాయకుల చెప్పుచేతల్లోకి వెళ్ళిపోయామని పోలీస్ అధికారులే చెబుతున్న పరిస్ధితి నెలకొందని ఆయన ధ్వజమెత్తారు.‘‘సాయికృష్ణ తల్లిదండ్రులు సీపీకి ఫిర్యాదు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు?. సాయికృష్ణ లాకప్ డెత్పై సీఎం, హోం మంత్రి ఎందుకు స్పందించలేదు?. వైఎస్ జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్తే తెల్లారేలోపు ఎఫ్ఐఆర్ వేశారు. మేకప్ కోసం మాజీ మంత్రి అమర్నాథ్కు నోటీసు ఇచ్చిన హోంమంత్రి.. సాయికృష్ణ లాకప్ డెత్ మీద డీజీపీ,సీపీకి ఎందుకు నోటీసు ఇవ్వలేదు’’ అంటూ కన్నబాబు ప్రశ్నించారు.‘‘ఆక్వా రంగంలో ఒక మాఫియా తయారైంది. ఫీడ్, సీడ్, ఎగుమతుల్లో మాఫియా. రైతు పరిస్ధితి చాలా దయనీయంగా ఉంది. వైఎస్ జగన్ రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం.. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగొట్టింది. రెండో ఏడాది 7 లక్షల మందికి కోత విధించారు. ఒక్క కౌలు రైతుకు కూడా పెట్టుబడి సాయం అందలేదు. మోంథా తుపాను బాధితులకు ఇవాళ్టీకి సాయం అందించలేదు...రైతులకు సున్నా వడ్డీ ఏదీ?. 393 మంది రైతులు ఒక ఏడాదిలో చనిపోయారని ప్రభుత్వం చెబుతోంది. ఉచిత పంటల బీమా పథకం ఎత్తేశారు. పొగాకు రైతులు ఇవాళ ఒంగోలులో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేస్తున్నారు. రైతులకు కార్డు ఇచ్చి.. యూరియా, ఎరువులకు కోత పెట్టారు. కౌలు రైతులు, గిరిజన రైతులు, దేవాదాయ శాఖ రైతులకు కార్డులు లేవు. వైఎస్ జగన్ తీసుకు వచ్చిన కౌలు గుర్తింపు కార్డులను చంద్రబాబు తుంగలోకి తొక్కేశారు. ఎరువులు కావాలంటే.. రూ.15-20 వేలు పెట్టి రైతులు స్మార్ట్ ఫోన్ కొనాలి. రైతును రోడ్డున పడేశారు. ఎరువు కావాలన్న.. విత్తనం కావాలన్న ఎవర్నికలవాలో తెలియదు. రైతులకు ఏం కావాలో తెలుసుకోకుండా.. మేకప్లపై డిస్కషన్లు పెడుతున్నారు’’ అంటూ కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సాయి కృష్ణ కేసుపై ACP ఫస్ట్ రియాక్షన్
-
చనిపోయింది ఒకరు కాదు.. ఇద్దరు.. సాయికృష్ణ తల్లితో విచారణ బృందం..
-
సాయి కృష్ణ ఇంటికి ACP.. జగన్ దెబ్బకు దిగొచ్చిన పోలీసులు
-
సాయికృష్ణ కేసు వెనుక.. జనం తిరగబడితే తట్టుకోలేరు.. చివరికి జరిగేది ఇదే..
-
సాయికృష్ణ కేసులో కీలక పరిణామం.. సీఐ నాగరాజుపై మర్డర్ కేసు..!
-
ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్
-
వైఎస్ జగన్ రాకతో CI నాగరాజుపై కేసు నమోదు
-
రాజకీయాల కోసం కాదు ఆ తల్లి కన్నీరుని చూసి గుండెమండి.. అంబటి రాంబాబు ఎమోషనల్
-
నేరంలో CI, ACP, DGPకి కూడా భాగం ఉంది..
-
సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే... గిగ్ వర్కర్ సాయికృష్ణ లాకప్డెత్ ఘటనలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్
-
మనిషిని చంపే హక్కు నీకెవడిచ్చాడు? సాయి కృష్ణ కేసులో మొదటి ముద్దాయి చంద్రబాబు..!
-
పోలీసుల గుట్టు రట్టు.. సాయికృష్ణ కేసులో సంచలన నిజాలు
-
సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో బాసు, బిగ్ బాసే సూత్రధారులు
-
ఆ నేతలో టెన్షన్.. తెరపైకి జనసేన బ్రోకరిజం.. 50 లక్షలు - కోటి
-
రెండు రోజులు సాయి కృష్ణ శవాన్ని స్టేషన్ లో పెట్టి ఏం చేశారో చెప్పమంటారా
-
నిద్ర లేచిన కూటమి ప్రభుత్వం.. సాయి కృష్ణ కేసులో CI సస్పెండ్
-
సాయి కృష్ణ మృతి వెనుక కీలక నేత ?
-
కోర్టుకు సాయి కృష్ణ వస్తాడా.. లేక పోలీసులు బూడిదను తెస్తారా...?
-
కుక్కలకు ఇంచార్జ్ పదవులు ఇస్తారా..? లైవ్ లో పవన్ కళ్యాణ్ ను కడిగి పడేసిన సాయి కృష్ణ మేనమామ..
-
సాయికృష్ణ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
-
కేసులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నారా?
సాక్షి,విజయవాడ: ఉర్సా భూముల వ్యవహారంలో కేశినేని సోదరుల మధ్య మాటలు మంటలు కొనసాగుతున్నాయి. 14 నెలల క్రితం వైజాగ్ ఉర్సా భూముల కుంభకోణంపై కేశినేని చిన్ని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. నాటి ఫిర్యాదుపై ఇప్పుడు కేశినేని చిన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో పోలీసులు కేశినేని నానిపై కేసు నమోదు చేశారు. ఆ కేసుపై కేశినేని నాని సోసల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఫ్రస్టేషన్తోనే తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఎంపీ కేశినేని చిన్నిపై విమర్శలు గుప్పించారు. దొంగ కంపెనీకి వేల కోట్ల విలువైన భూముల్ని కట్టబెడుతున్నారు. ప్రశ్నించినందుకు నాపై 14 నెలల తర్వాత కేసు పెట్టారు. తాను లేఖ రాసినందుకే దొంగ కంపెనీకి భూములు కేటాయించలేదని అన్నారు. డీల్ అడ్డం తిరగడంతో కేసులతో భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తిలేదని కేశినేని నాని స్పష్టం చేశారు. ఉర్సా భూముల కుంభకోణంవైజాగ్లో డేటా సెంటర్ ప్రాజెక్టు ముసుగులో 60 ఎకరాల అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తన బినామీతో కలిపి కుట్ర పన్నారని కేశినేని నాని గతేడాది ఏప్రిల్ నెలలో సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. అందులో 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కేశినేని చిన్ని, తన స్నేహితులు, బినామీలతో కలిసి కొన్ని వారాల క్రితమే ‘ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్’ను ఏర్పాటు చేశారు. ఉర్సా డైరెక్టర్లలో ఒకరైన సతీష్ అబ్బూరి, కేశినేని చిన్ని క్లాస్మేట్స్ అని ‘ట్వంటీఫస్ట్ సెంచురీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ప్రాపర్టీ స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసగించిన వ్యాపార భాగస్వాములు కూడా వీరే. ఆ అక్రమ సంస్థ ఉర్సాకు భూకేటాయింపులను తక్షణమే రద్దు చేసి.. ఆ కంపెనీ యాజమాన్యం, మూలాలు, రాజకీయ సంబంధాలపై సమగ్ర విచారణ జరిపించాలి’ అని చంద్రబాబుకు కేశినేని నాని బహిరంగ లేఖ రాశారు. -
కేశినేని బ్రదర్స్ వార్లో కీలక పరిణామం
బెజవాడ రాజకీయాల్లో కేశినేని సోదరుల మధ్య వివాదం మరో మలుపు తిరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) అవినీతి బాగోతాన్ని బయటపెడుతూ మాజీ ఎంపీ కేశినేని నాని(శ్రీనివాస్) సోషల్మీడియాలో వరుస పోస్టులు చేస్తున్నది తెలిసిందే. తాజాగా ఈడీకి సైతం ఆయన ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు ఆయనపైనే కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేశినేని బ్రదర్స్ మధ్య వివాదం మరింత ముదిరింది. తనపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరుడి వ్యవహారంపై అధికార పార్టీ ఎంపీ కేశినేని చిన్ని పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య, అనుచిత ప్రచారం జరుగుతోందని, పరువు నష్టం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎంపీ కేశినేని నానిపై పటమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే చిన్ని అధికార కూటమికి చెందిన ఎంపీ కాగా, నాని ఇటీవల కాలంగా ప్రభుత్వ విధానాలు, స్థానిక రాజకీయ పరిణామాలపై విమర్శనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈడీకి ఫిర్యాదు చేసిన కొద్దిరోజుల్లోనే నానిపై కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో అనుమానాలకు తావిస్తోంది.నాని అనుచరులు మాత్రం ఇది రాజకీయ ఒత్తిడిలో భాగంగా జరిగిన చర్య అని ఆరోపిస్తున్నారు. సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడం ఏంటని నిలదీస్తున్నారు. అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాల్సింది పోయి.. ప్రశ్నించిన వారిపైనే కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వాదిస్తున్నారు. మరోవైపు ఎంపీ చిన్ని వర్గం మాత్రం సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాన్ని సహించబోమని చెబుతోంది. -
ఒకే ఒక్క తప్పుతో అథఃపాతాళానికి..
సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే యువకుని హత్య శాండల్వుడ్లో ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. రాష్ట్రమే కాదు, దేశమంతటా వార్తలకెక్కింది. చాలెజింగ్ స్టార్గా లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన నటుడు దర్శన్ ఈ హత్య కేసులో జైలు పాలయి గురువారంతో రెండేళ్లు పూర్తి అయింది. ఆయన కెరీర్ అగమ్యగోచరమైంది.2024, జూన్ 11న మైసూరులోని ఒక హోటల్లో ఉండగా దర్శన్ను, ఆయన సన్నిహితులను పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఈ కేసులో అనేకానేక మలుపులు తీసుకుంటూ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మధ్యలోనే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చిన దర్శన్ ఆ తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ను రద్దు చేయడంతో మళ్లీ బెంగళూరు పరప్పన సెంట్రల్ జైలులో ఊచలు లెక్కబెడుతున్నాడు. అన్నీ మిస్.. మిస్ బెయిలు మధ్యలో దర్శన్ తన ప్రతిష్టాత్మక ‘ది డెవిల్’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ ఆ సినిమా విడుదల సమయంలో కటకటాల్లోనే ఉండాల్సి వచ్చింది. అంతేకాకుండా ఈ ఏడాది తన 49వ పుట్టినరోజు, 23వ పెళ్లి రోజును కూడా అభిమానులు, కుటుంబ సభ్యులతో జరుపుకోలేకపోయారు.దర్శన్ జీవితంలో చీకటిదినం 2024, జూన్ 9 నటుడు దర్శన్ పాలిట ఒక చీకటి రోజు.. బెంగళూరు సుమ్మనహళ్లి రాజకాలువలో రేణుకాస్వామి శవం లభ్యం అయింది. ఈ కేసులో దర్శన్ పేరు వినిపించడంతో పోలీసులు జూన్ 11న అరెస్టు చేశారు. జూన్ 7న కిడ్నాప్ అయిన రేణుకాస్వామి రెండు రోజుల తర్వాత రాజకాలువలో శవమై కనిపించాడు. దర్శన్ స్నేహితురాలు, నటి పవిత్ర గౌడకు రేణుకాస్వామి అసభ్యంగా సందేశాలు పంపించాడనే కారణంతో దర్శన్ అనుచరులు చిత్రదుర్గ నుంచి అతన్ని బెంగళూరుకు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి హత్య చేశారన్నది అభియోగం. తరచూ మలుపులు ఈ కేసు నిరంతరం మలుపులు తిరుగుతూనే ఉంది. బెంగళూరు జైలులో దర్శన్కు రాచ మర్యాదలు కల్పిస్తున్నారని కొన్నాళ్లు బళ్లారి జైలుకు తరలించారు. కొన్ని నెలల తర్వాత వైద్య సేవల కారణంతో బెయిల్ పొందారు. దర్శన్ బెయిల్ను రద్దు చేయాలని పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా బెయిలు రద్దయింది. గత ఏడాది ఆగస్టు నుంచి మళ్లీ దర్శన్ జైలు పక్షి అయ్యారు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన దర్శన్కు తీవ్ర నిరాశే మిగిలింది. దర్శన్, పవిత్రతో పాటు 7 మంది నిందితులు కారాగారంలోనే ఉండగా, అభిమానులు విచారంలో మునిగారు. -
10 ఏళ్ల తర్వాత సంచలన తీర్పు.. ఓడిన అభ్యర్థే అసలు విజేత!
సాక్షి, చైన్నె : రాధాపురం ఎన్నికల కేసులో హైకోర్టు పదేళ్లకు సంచలన తీర్పు వెలువరించింది. 2016 నాటి అన్నాడీఎంకే అభ్యర్థి ఇన్బదురై విజయం చెల్లదని బుధవారం ప్రకటించింది. రీకౌంటింగ్ అనంతరం అక్కడ డీఎంకే అభ్యర్థి అప్పావు విజయం సాధించినట్టు తీర్పు వెలువరించారు. వివరాలు.. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో రాధాపురం నియోజకవర్గంలో అన్నాడీఎంకే తరఫున ఇన్బ బదురై, డీఎంకే తరఫున అప్పావు పోటీ చేశారు. అప్పట్లో కేవలం 104 ఓట్ల స్వల్ప తేడాతో ఇన్బబదురై గెలిచినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను పూర్తిగా లెక్కించకుండానే ఫలితాన్ని ఏకపక్షంగా ప్రకటించారని ఆరోపిస్తూ అప్పావు చైన్నె హైకోర్టును ఆశ్రయించారు. సాధారణంగా ఇలాంటి ఎన్నికల పిటిషన్లపై 6 నెలల్లోపు తీర్పు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో సుదీర్ఘ కాలయాపన జరిగింది. ఎట్టకేలకు వివాదాస్పద పోస్టల్ ఓట్లను తిరిగి లెక్కించగా.. అప్పావు ఆధిక్యం సాధించినట్లు తేలింది. దీంతో హైకోర్టు ఇన్బదురై విజయాన్ని తాజాగా రద్దు చేస్తూ, అప్పావును విజేతగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.మాజీ ఎమ్మెల్యే హోదా, జీతభత్యాలు రద్దుపదవీకాలం (2016–2021) ముగిసిపోయిన తర్వా త ఈ తీర్పు వచ్చినప్పటికీ, ఇన్బదురైకు షాక్ తప్ప లేదు. 2016 నుండి 2021 వరకు ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఇన్బదురై పొందిన జీతం, రోజువారీ భత్యా లు, ఇతర ప్రభుత్వ ఆర్థిక సదుపాయాలను తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నా జీవితాంతం వచ్చే మాజీ ఎమ్మెల్యే పెన్షన్, ఉచిత వైద్య బీమా సదుపాయాలు పూర్తిగా రద్దవుతాయి. 2016–2021 కాలంలో రాధాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రభుత్వ, అసెంబ్లీ రికార్డుల్లో ఎక్కడెక్కడైతే అన్బదురై పేరు ఉందో.. వాటన్నింటినీ తొలగించి ‘అప్పావు’ పేరు పొందు పరిచే విధంగా హైకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇన్బదురై ప్రస్తుతం అన్నాడీఎంకే రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.ఆలస్యమైనా న్యాయం గెలిచిందితీర్పు రావడంలో చాలా కాలయాపన జరిగినప్పటికీ, చివరికి న్యాయమే గెలిచిందని మాజీ స్పీకర్ అప్పావు సంతోషం వ్యక్తం చేశారు. నాటి ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే 135 సీట్లతో అధికారాన్ని దక్కించుకోగా, డీఎంకే ఈ ఒక్క స్థానాన్ని కోల్పోవడంతో అప్పట్లో 89 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చిందన్నారు. -
తృణముల్ కాంగ్రెస్కు మరో షాక్.. అభిషేక్ బెనర్జీకి నోటీసులు
కోల్కతా: తృణముల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీకీ మరో ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ కార్యకర్తలను పరామర్శించడానికి వెళ్లి దాడికి గురైన ఘటన గడిచి 24 గంటలు గడవకముందే ఇప్పుడు మరో కేసులో ఇరుకున్నారు. నకీలీ సంతకాల విచారణలో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.పశ్చిమ బెంగాల్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CID), తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి (శనివారం) సమన్లు జారీ చేసింది. 'నకిలీ సంతకాల' వివాదానికి సంబంధించిన విచారణలో భాగంగా సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కోల్కతాలోని భవానీ భవన్ సిఐడి ప్రధాన కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని అభిషేక్ బెనర్జీకి ఆదేశాలు జారీ చేసింది. కేసు వివరాలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోభన్దేబ్ చటోపాధ్యాయను ఎన్నుకుంటూ సుమారు 70 మంది టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను అభిషేక్ బెనర్జిీ మే 19న అసెంబ్లీ సెక్రటేరియట్కు సమర్పించారు. అయితే, ఈ లేఖలోని కొన్ని సంతకాలు అసెంబ్లీ రికార్డులతో సరిపోలలేదు. ముఖ్యంగా టీఎంసీ ఎమ్మెల్యే నైనా బెనర్జీ సంతకం ఫోర్జరీ అయిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై అసెంబ్లీ సెక్రటేరియట్ కోల్కతాలోని హరే స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఈ కేసు విచారణను సిఐడి (CID) స్వీకరించి, ఇప్పటికే పలువురు టీఎంసీ ఎమ్మెల్యేలను విచారించింది. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ ఐదుగురు సీఐడీ అధికారుల బృందం ముఖర్జీ రోడ్డులోని అభిషేక్ బెనర్జీ నివాసానికి వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో వెనుతిరిగారు. ఈ నేపథ్యంలోనే తృణముల్ కార్యకర్తలను పరామర్శించడానికి అభిషేక్ వచ్చిన సమయంలో ఆయనను స్వయంగా కలిసి నోటీసులు అందజేశారు.అభిషేక్ స్పందన అయితే నోటీసులు అందుకున్న అభిషేక్ బెనర్జీ మాట్లాడుతూ.. "నేను ఇంకా నోటీసు లోపల ఏముందో పూర్తిగా చూడలేదు. నా న్యాయవాదులతో మాట్లాడి తగిన విధంగా స్పందిస్తాను. విచారణకు ఖచ్చితంగా సహకరిస్తాను, అవసరమైతే అధికారుల ముందుకు హాజరవుతాను. అని అన్నారు. -
కేసు క్లోజర్ రిపోర్టు ఇచ్చాక.. తదుపరి దర్యాప్తునకు కోర్టు అనుమతి తప్పనిసరి!
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ఒక కేసులో ఆధా రాలు లేవంటూ పోలీసులు క్లోజర్ రిపోర్టు ఇచ్చిన తర్వాత, అదే కేసుపై తదుపరి దర్యా ప్తు చేపట్టాలంటే మేజిస్ట్రేట్ నుంచి ముందుగా అనుమతి తీసుకోవడం తప్పనిసరి అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మూసేసిన కేసులో మేజి స్ట్రేట్ నుంచి ఎక్స్ప్రెస్ పర్మిషన్ తీసుకో కుండా తదుపరి దర్యాప్తు కొనసాగించడం చెల్లదని స్పష్టం చేసింది. క్రిమినల్ కేసుల్లో పోలీసులకు గల దర్యాప్తు అధికా రాల విషయంలో ఈ తీర్పును అత్యంత కీలకమైందిగా భావిస్తున్నారు. గురువారం ఈ మేరకు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ల ధర్మాసనం కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనబెట్టింది. పిటిషనర్ పళనిస్వామి వీరరాజాకు ఊరట కల్పించింది. సీఆర్పీసీ సెక్షన్ 173(8) ప్రకారం తదుపరి దర్యా ప్తునకు మెజిస్ట్రేట్ అనుమతి అవసరంలేదని కర్ణాటక హైకోర్టు తప్పుగా అర్థం చేసుకుందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వి.మోహన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. చట్టంలో నేరుగా పేర్కొనకపోయినా, కోర్టు అనుమతితోనే తదుపరి దర్యాప్తు జరగాలనే నిబంధన ఉన్న విషయం తెలుసుకోవాలన విజ్ఞప్తి చేశారు. దీనిపై ధర్మాసనం ఏకీభవించింది. ‘చట్టంలో ఎక్స్ప్రెస్ పర్మిషన్ అవసరమని లేకపోయినా, న్యాయ పరిణామ క్రమంలో సంబంధిత మేజిస్ట్రేట్ నుంచి అనుమతి కోరడం ఒక అవసరంగా రూపుదిద్దు కుంది’అంటూ స్పష్టం చేసింది. ‘రామ చౌదరి వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్, (2013) 5 ఎస్సీసీ 762, వినయ్ త్యాగి వర్సెస్ ఇర్షాద్ (2013) 5 ఎస్సీసీ 762, పీతాంబరన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ(2023), ఎస్సీసీ 402, రాబర్ట్ లాల్చుంగ్నుంగా చోంగ్తూ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ (2025) కేసులను ధర్మాసనం గుర్తుచేసింది. ‘కోర్టు అనుమతి కోరడం, సప్లిమెంటరీ రిపోర్టు దాఖలు చేయడం అనే అవసరాన్ని సెక్షన్ 173(8) నిబంధనల్లో చదువు కోవాలి. ఇది తప్పనిసరి’అంటూ వినయ్ త్యాగి కేసులోని తీర్పును ధర్మాసనం ఉటంకించింది. ‘ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని మళ్లీ దర్యాప్తు పేరుతో వేధించకుండా ఈ తీర్పు అడ్డుకుంటుంది. కేసుపై కోర్టు పర్యవేక్షణ కూడా ఉంటుంది. ఇది పౌరులకు రక్షణ వంటిది’అని ధర్మాసనం వివరించింది. ఒకసారి కేసు మూసేశాక, మేజిస్ట్రేట్కు తెలియకుండా పోలీసులు మళ్లీ దర్యాప్తు చేయలేరని స్పష్టంగా ప్రకటించింది. -
అప్పులుంటే.. చంపేస్తావా!
తెలిసీ తెలియని వయస్సులో ఈ చేతులే కదా మాకు గోరు ముద్దలు తినిపించాయి.. ఈ చేతులే కదా మమ్మల్ని ఆడించాయి.. ఈ చేతులే కదా మాకు నడక నేర్పించాయి.. అలాంటి ఈ చేతులతోనే మమ్మల్ని కాటికి సాగనంపుతున్నావా నాన్న అంటూ ఆ చిన్నారుల మూగరోదన ఆ తండ్రికి వినిపించలేదు.. అల్లారు ముద్దుగా పెంచి.. అడిగినవన్నీ అరచేతిలో పెట్టి.. మమ్మల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన నువ్వే.. ఏమాత్రం కనికరం లేకుండా.. కాళ్లు, చేతులు కట్టేసి.. కాటికి సాగే నంపే తరుణంలో నీ గుండె ఎంత బండలా మారింది నాన్నా.. అన్న ఆ పసిహృదయాల మౌనవేదన ఆ తండ్రికి కనిపించలేదు. ..కేవలం తాను చేసిన అప్పులకు తన భార్యాపిల్లలు ఎక్కడ బలవుతారో అన్న చిన్న కారణంతో.. ఎన్నో విజయాలు అందుకొని.. నిండు నూరేళ్లు జీవించాల్సిన మూడు నిండు ప్రాణాలను బలితీసుకున్నాడు ఓ తండ్రి. ఇంటి నిర్మాణం, వ్యవసాయంలో నష్టాలు.. వెరసీ అప్పులపాలైన ఓ కౌలు రైతు.. తన కుటుంబాన్ని తానే చిదిమేసుకు న్న విషాదకర సంఘటన తీవ్రంగా కలచివేసింది. వనపర్తి: జీవనోపాధి కోసం మామిడితోటలు లీజుకు తీసుకుని మామిడి పండ్లు విక్రయిస్తూ.. మిగతా సమయంలో తోటల సంరక్షణ చేసుకుంటూ జీవించే ఓ కుటుంబం సరైన లాభాలు లేక.. చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక.. అప్పులు ఇచ్చిన వారి ఒత్తిళ్లు తట్టుకోలేక ఓ కుటుంబ పెద్ద తన భార్య, ఇద్దరు పిల్లలను నీటిలో సంపులో పడేసి ప్రాణాలు తీసి.. తానూ ఉరేసుకున్న ఉదంతం ఉమ్మడి పాలమూరు జిలాల్లో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) నాలుగేళ్ల క్రితం ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం శివారులో సుమారు 50 ఎకరాల మామిడి తోటను లీజు తీసుకుని కుటుంబ సభ్యులతో కలిసి అక్కడే ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.ఈ క్రమంలో తోటల లీజు, ఇతర అవసరాల కోసం గద్వాలలో కొందరితో అప్పు చేశాడు. డోకూరులోని తన సొంత ఇంటిపై ఓ ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో రూ.లక్షల్లో అప్పు చేశాడు. ఇటీవల ఈఎంఐలు సక్రమంగా చెల్లించడం లేదని ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులు ఇంటి గోడలపై ఈ ఇంటిని అప్పుకింద జప్తు చేయనున్నట్లు రాయడంతో గ్రామంలో తోటివారు, బంధువులు, సన్నిహితుల ఎదుట అవమానంగా భావించాడు. ఐపీ పెట్టే ప్రయత్నం చేశాడు. తన వద్ద ఉన్న వాహనాలు, వస్తువులను అమ్మేసి అప్పులు తీర్చే ప్రయత్నం చేశాడు. అయినా.. వడ్డీలు వసూలు చేసేవారు, ఈఎంఐలు చెల్లించాల్సిన ఫైనాన్స్ కంపెనీల నుంచి ఒత్తిడి తగ్గలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన కుటుంబ సభ్యులతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లు, చేతులు కట్టేసి తోటలోని సంపులోకి తోసి తాను నివాసం ఉండే కంటైనర్కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరిశీలించిన డీఎస్పీ గిరిబాబు విషయం తెలుసుకున్న వనపర్తి డీఎస్పీ గిరిబాబు ఖిల్లాఘనపురం మండలం సల్కెలాపురం గ్రామ శివారులోని మామిడి తోటకు వెళ్లి ఘటనా స్థలా న్ని పరిశీలించారు. మృతదేహాలను మహబూబ్నగర్ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం తరలించి ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.గొల్లుమన్న కుటుంబం.. తల్లిదండ్రుల చాటున నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు.. ఊహించని విధంగా కన్న తండ్రే.. కాలయముడై కాళ్లు చేతులు కట్టేసి నీటి సంపులోకి తోసి ప్రాణాలు తీయడం కలకలం రేపింది. తోటలో ఆడుతూ... పాడుతూ.. సరదాగా తిరిగే చిన్నారులు విగత జీవులుగా పడి ఉండటాన్ని చూసి మామిడి తోట చుట్టుపక్కల రైతులు, కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం నర్సింహులు స్వగ్రామం డోకూరుకు తీసుకెళ్లారు. -
‘దీదీ కాపాడు’ అని మొరపెట్టుకున్న కొన్ని క్షణాల్లోనే
వరకట్నరక్కసి కోరలు సరికొత్తగా విస్తరిస్తున్న చాయలు ఇటవలికాలంలో బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యం రాజధాని నగరం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో నిన్న గాక మొన్న ట్విషా శర్మ, దీపికా నాగర్ అనుమానాస్పద మరణం ఘటనలు కలకలంరేపాయి. కట్నం కోసమే తమ బిడ్డల్ని పొట్టనపెట్టుకున్నారని అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపణల పర్వం కొనసాగుతుండగానే ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నన్ను బతికించండి అని మొరపెట్టుకున్న నిమిషాల వ్యవధిలోనే ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో శవమై తేలడం ఉద్రిక్తతను రాజేసింది.వీణా కుమారి (28) 2022లో రాజు సింగ్తో వివాహమైంది. వీరికి ఆరు నెలల కుమారుడు ఉన్నాడు. వివాహం జరిగిన కొద్దిరోజులకే వారు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ నుండి ఢిల్లీలోని ఇందర్పురికి మకాం మారారు. మృతురాలి సోదరుడు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లి జరిగినప్పటి నుండి కట్నం విషయంలో వీణను భర్త రాజు వేధిస్తూ ఉండేవారు. నీకంటే మంచి అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడినంటూ నిత్యం పోరు పెట్టేవాడు. మరోవైపు ఇటీవలే పెళ్లి చేసుకున్న మరిది రాజ్కుమార్ తన భార్య తెచ్చిన కట్నంతో (46 ఇంచుల టీవీ, బైక్) వీణ తెచ్చిన కట్నాన్ని (32 ఇంచుల టీవీ) పోల్చుతూ వేధించేవాడు. ఇద్దరూ కలిసి వీణను మానసికంగా, శారీరకంగాహింసించేవారు. ఎంతలా అంటే ఒకసారి కొట్టిన దెబ్బలకు వీణ కర్ణభేరి పగిలిపోయింది.దీంతో పాటు ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్, అదనపు ట్నం వేధింపులు మరింత పెరిగాయి. అయితే కుటుంబం పరువు పోతుందనే భయంతోనే ఇంతవరకు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా సోదరి వీణ ఆపిందని ఆయన పేర్కొన్నారు. ఇంతలోనే అన్యాయం జరిగిపోయిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 7 నిమిషాల్లో అంతారాత్రి పదిగంటలకు వీణ తన సోదరి రీనాకి ఫోన్ చేసింది. ఏడుస్తూ.. "దీదీ నన్ను కాపాడు. వీళ్లు నన్ను బాగా కొడుతున్నారు. నన్ను బతకనివ్వరు. చంపేస్తారు" అని చెప్పింది. అంతేకాదు తను చనిపోయాక తన 6 నెలల కొడుకును జాగ్రత్తగా చూసు కోమని వేడుకుంది. అంతలోనే కాల్ కట్ అయింది. ఆందోళన చెందిన రీనా తిరిగి ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. వెంటనే ఆమె వీణ ఇంటికి బయలుదేరింది. బచా లో దీదీ అని ప్రాధేయపడిన కేవలం 7 నిమిషాలకే, వీణ బావ రీనాకు ఫోన్ చేసి, "వదిన మేడ పైనుంచి కింద పడిపోయింది" అని చెప్పాడు. రీనా అక్కడికి చేరేలోపే వీణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.దీంతో అదనపు కట్నం కోసం ఆమె అత్తవారింటి వారే భవనం పైనుంచి తోసి చంపేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ కొనసాగుతోందని పశ్చిమ ఢిల్లీ డీసిపీ శరద్ భాస్కర్ వెల్లడించారు.అత్తవారింటి వాదనవీణ మామ జైపాల్ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించారు. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సహజమేనని, తాము ఒక్క స్పూన్ కూడా కట్నం అడగలేదని చెప్పారు. ఆమె భవనం పైనుంచి ప్రమాదవశాత్తూ కింద పడిపోయిందని భర్త రాజు సింగ్ వాదిస్తున్నాడు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రం హోం కాదు.. వర్క్ ఫ్రం బీచ్, అదీ గోవాలో -
నటి ట్విషా శర్మ కేసులో మరో ట్విస్ట్
-
రూ.75 లక్షల కిరీటం.. రూ.35 లక్షలకు..! దేవస్థానం అధ్యక్షుడిపై కేసు నమోదు
-
సరదా తీర్చిన ట్వీట్.. తారల మెడకు ఉచ్చు?
ఒకప్పుడు సరదాగా చేసిన పని.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో పెద్ద రాజకీయ బాంబులా పేలింది. ఐదేళ్ల కిందటి ఎన్నికల హింస తెర మీదకు రావడంతో ఇద్దరు సినీ తారలు చిక్కుల్లో పడ్డారు. వాళ్ల మీద ఫిర్యాదు నమోదు కావడం, పైగా టీఎంసీతో దగ్గరి సంబంధాలు ఉండడంతో సువేందు అధికారి సర్కార్ చర్యలు తీసుకోవడం దాదాపుగా ఖాయంగానే కనిపిస్తోందనే చర్చ ఊపందుకుంది.2021లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఫలితాల తర్వాత చెలరేగిన హింస మాత్రం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఆనాడు కౌంటింగ్ జరుగుతున్న టైంలో నటుడు పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. ఫలితాల ట్రెండ్ ఆధారంగా ఆయన చేసిన ట్వీట్ ‘ఈరోజు ప్రత్యర్థులను చితక్కొట్టే రోజు’ అనే అర్థం వచ్చేలా ఉంది. దానికి నటి స్వస్తికా ముఖర్జీ ‘హహహ’ అంటూ లాఫింగ్ రియాక్షన్తో స్పందించారు.అయితే.. ఆ తర్వాత కొన్నిగంటలకే బెంగాల్ అంతటా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎంత మంది చనిపోయారు, ఎన్ని కేసులు నమోదయ్యాయి అనే లెక్కలపై ఇప్పటికీ స్పష్టత లేదు. కనీసం 11 మంది చనిపోయినట్లు అప్పటి దీదీ సర్కార్ కేంద్ర హోంశాఖకు పంపిన నివేదికల్లో ఉంది. అయితే తర్వాత వెలువడిన వివిధ నివేదికలు, దర్యాప్తుల ప్రకారం మొత్తం మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉంది. “కాల్ ఫర్ జస్టిస్” అనే పౌర సంఘం నివేదిక ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేల హింసాత్మక ఘటనలు జరిగాయని, 25 మంది మరణించారని, సుమారు 7 వేల మంది మహిళలు వేధింపులకు గురయ్యారని పేర్కొంది.హత్యలు, దాడులు, అత్యాచారాలు, అగ్నిప్రమాదాలు, ఆస్తుల ధ్వంసం వంటి కేసులపై తర్వాత సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఒక్క దశలోనే 31 కేసులు నమోదు చేసినట్టు సమాచారం. తాజాగా వెలువడిన నివేదికల ప్రకారం.. పాత కేసులను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి వందల సంఖ్యలో కొత్త దర్యాప్తులు కూడా ప్రారంభించారు. అయితే.. ఐదేళ్ల కిందట బెంగాల్ హింసపై దర్యాప్తు చేపట్టాలని సువేందు అధికారి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ అంశం మళ్లీ చర్చకు రావడంతో.. ఇప్పుడు ఇద్దరు ప్రముఖ నటుల పేర్లు కూడా వివాదంలో వినిపిస్తున్నాయి.బెంగాలీ తారలు చేసిన ట్వీట్ హింసను ప్రేరేపించేలా ఉందని ఆరోపిస్తూ కోల్కతాలోని గరియాహట్ పీఎస్లో ఫిర్యాదు నమోదైంది. ఫిర్యాదు చేసిన జోయ్దీప్ సేన్ అనే వ్యక్తి ఆరోపణ ఏమిటంటే.. 2021 మే 2న ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పరంబ్రతా ఛటర్జీ బెంగాలీలో ఒక పోస్టు చేశారు. దానికి స్వస్తికా ముఖర్జీ నవ్వు గుర్తులతో స్పందించారు. అప్పటికే రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ప్రముఖులైన వీరి వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా పనిచేశాయి. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలపై దాడులు, హత్యలు, మహిళలపై దాడులు జరిగిన ఘటనలకు ఇలాంటి పోస్టులు మానసిక ప్రోత్సాహం ఇచ్చాయి. అంతేకాదు.. ఆ ట్వీట్ చేసిన గంటలోపే బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ హత్య జరిగిందని, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా హింస మరింత పెరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు.. ఆ ఎన్నికల హింసను విచారణ జరిపేందుకు సువేందు సర్కార్ ఓ కమిటీ కూడా వేశారు. ఈ కమిటీ కూడా వీళ్ల అంశాన్ని పరిశీలించే అవకాశమూ కనిపిస్తోంది. పరంబ్రతా ఛటర్జీ, స్వస్తికా ముఖర్జీ.. ప్రముఖ బెంగాలీ యాక్టర్లు. పరంబత్రాది సినీ నేపథ్యం ఉన్న కుటుంబం. ప్రముఖ దర్శకుడు రుత్విక్ ఘటక్కు బంధువు. రచయిత్రి మహాశ్వేతా దేవి కుటుంబానికి చెందినవారు. నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీతో పాటు హిందీ చిత్రాలు, వెబ్ సిరీస్ల్లోనూ నటించారు. అందులో కహానీ, బైషే శ్రాబోన్, పారి, బుల్బుల్, అరణ్యక్లో నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఇక.. స్వస్తిక ముఖర్జీ ప్రముఖ బెంగాలీ నటుడు సంతూ ముఖర్జీ కుమార్తె. బుల్లితెరతో కెరీర్ ప్రారంభించి బెంగాలీ స్టార్గా ఎదిగారు. బెంగాలీతో పాటు హిందీలోనూ నటించారు. పాతాళ్ లోక్, దిల్ బేచారా, ఖాలా, మస్తాన్, శ్రీమతి వాటిల్లో ప్రముఖమైనవి.పరంబత్రా, స్వస్తికా ఇద్దరూ ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. కానీ రాజకీయ, సామాజిక అంశాలపై బహిరంగంగా అభిప్రాయాలు చెప్పడం వల్ల తరచూ వార్తల్లో ఉంటుంటారు. బెంగాల్లో లౌకికవాదం, స్వేచ్ఛ, సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలు సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, బీజేపీపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లో నిలిచారు. అందుకే ఈ ఇద్దరికీ మమతా బెనర్జీ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే చెబుతుంటారు. -
అత్తాపూర్ కిడ్నాప్ కేసు.. గంటల్లోనే ఛేదించిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: అత్తాపూర్ కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు చేధించారు. మలక్పేటలోని ఓ ఇంట్లో ఆ యువతి సేఫ్గా ఉన్నట్లు గుర్తించారు. యువతి ఫోన్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేసి గుర్తించినట్లు పేర్కొన్నారు. కాగా నిన్న అత్తాపూర్లో అర్ధరాత్రి యువతిని కిడ్నాప్ చేశారు. మహేంద్రా థార్లో వచ్చిన నలుగురు యువతిని బలవంతంగా ఎక్కించుకుని వెళ్లిపోయారు..వారి నుంచి తప్పించుకునేందుకు మొదట యువతి ఆస్పత్రిలోకి పరిగెత్తినప్పటీకీ యువకులు ఆమెను బెదిరించి కారులో ఎక్కించుకుని వెళ్లిపోయారు.ఇది గమనించిన స్థానికులు వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కారును వెంబడించే ప్రయత్నం చేశారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు పోలీసులు కారును చేజ్ చేశారు. కానీ పోలీసుల కళ్లుగప్పి కిడ్నాపర్లు పారిపోయారు.ఈ నేపథ్యంలోనే ఆమె ఫోన్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేసినట్లు పేర్కొన్నారు. యువతి క్షేమంగా ఉండడంతో ఆమె కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. -
బండి భగీరథ్తో పార్టీకి సంబంధం లేదు:కిషన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: బండి భగీరథ్ అంశమై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. బండి భగీరథ్ ఇదివరకే సరెండర్ అయ్యారని ఆ విషయంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు అంశంలో కేంద్రానికి ఎటువంటి సంబంధం ఉండదని తెలిపారు. ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని తెలిపారు. పెట్రోల్ పై ట్సాక్స్ తగ్గించాలని కేంద్ర కోరినా రాష్ట్రం ఏమాత్రం తగ్గించడం లేదన్నారు.అయితే కేంద్రమంత్రి బండిసంజయ్ కుమారుడు బండి భగీరథ్ నిన్న (శనివారం) పోలీసుల ఎదుట లొంగిపోయారు. అనంతరం మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట ఆయనను హాజరుపరచగా న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను చర్లపల్లి జైలుకు తరలించారు.కాగా ఈ విషయంపై స్పందించిన బండి సంజయ్.. తన కుమారుడు ఎటువంటి తప్పు చేయలేదని చెబుతున్నాడని అందుకే పోలీసుల ఎదుట లొంగిపోయారన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందేనని తెలిపారు -
ఉన్నావ్ కేసు.. కుల్దీప్ సెంగర్కు బిగ్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నావ్ అత్యాచార కేసులో కుల్దీప్ సింగ్ సెంగర్కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ హైకోర్టు సెంగర్ జీవితఖైదు శిక్షను సస్పెండ్ చేయడాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ క్రమంలో శుక్రవారం ఆ ఆదేశాలను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో సెంగర్ మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్(బెయిల్)ను రద్దు చేయడంతో పాటు.. ఢిల్లీ హైకోర్టుకు సుప్రీం కోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు మెరిట్ లోతుల్లోకి తాము వెళ్లదల్చుకోలేదని.. అయితే సెంగర్ దాఖలు చేసిన అప్పీల్పై విచారణ జరిపి రెండు నెలల్లో విచారణ పూర్తి చేసి తీర్పు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.2017లో వెలుగు చూసిన ఉన్నావో అత్యాచార కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో మైనర్గా ఉన్న బాధితురాలిపై అత్యాచారం జరపడంతో పాటు అక్రమ రవాణాకు ప్రయత్నించారని కుల్దీప్ సింగ్ సెంగర్పై ఆరోపణలు వచ్చాయి. దర్యాప్తు సమయంలో.. ఆ కుటుంబానికి బెదిరింపులు, అనుమానాస్పద స్థితిలో యాక్సిడెంట్ జరగడం.. బాధితురాలు ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం.. బంధువులు చనిపోవడం.. ఈ కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీంతో కేసు సీబీఐ చేతికి వెళ్లింది.అదే సమయంలో ఆ అభియోగాల నేపథ్యంలో బీజేపీ ఆయన్ని సస్పెండ్ చేసింది. అటుపై ఈ కేసులో సుదీర్ఘ విచారణ అనంతరం ఆయనకు జీవిత ఖైదు విధించింది ట్రయల్ కోర్టు. అయితే ఢిల్లీ హైకోర్టు ఆ శిక్షను సస్పెండ్ చేయడంతో బాధితురాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ తన తల్లి, హక్కుల సంఘం కార్యకర్తలతో కలిసి రాజధాని రోడ్లపై నిరసనకు దిగింది. ఆ సమయంలో అధికారులు వాళ్లను ఈడ్చుకెళ్లిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ వెంటనే బాధితురాలు న్యాయం కోసం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిశారు. ఈలోపు.. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన శిక్ష సస్పెన్షన్పై సీబీఐ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) వేసింది.సెంగర్కి శిక్ష సస్పెన్షన్ ఇవ్వడం నేరం తీవ్రతను తగ్గించేలా ఉందని.బాధితురాలికి గతంలో బెదిరింపులు, ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో బెయిల్ అనర్హమని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన సుప్రీం కోర్టు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసింది. ఇప్పుడు సెంగర్ తాత్కాలిక ఉపశమనం సుప్రీం కోర్టు రద్దు చేయడంతో.. ఆయన భవిష్యత్తు ఇప్పుడు హైకోర్టు ఇవ్వబోయే తీర్పుపైనే ఆధారపడి ఉంది. -
బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్
-
PMJ జ్యువెలరీ దోపిడీ కేసు.. AI ని యూజ్ చేసి..


