
మలయాళ చిత్రాలకు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉంటోంది. కంటెంట్ బాగుంటే మనవాళ్ల థియేటర్లకు ఎగబడుతున్నారు. ఇటీవల రిలీజైన మరో మలయాళ చిత్రం కొత్త లోక ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 30 కోట్లకు పైగా నికర వసూళ్లను సాధించింది. ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్, నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమాలోని ఓ సీన్ వివాదానికి దారితీసింది. బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందంటూ విమర్శలొచ్చాయి. దీంతో దుల్కర్ సల్మాన్కు చెందిన నిర్మాణ సంస్థ వేఫరర్ ఫిల్మ్స్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మీ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఆ సన్నివేశాన్ని తొలగిస్తామని ట్వీట్ చేసింది. కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపింది. ఈ విషయంలో తమను క్షమించాలని కోరుతూ వేఫరర్ ఫిల్మ్స్ లేఖను పోస్ట్ చేశారు.
ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ నాచియప్ప గౌడ (కొరియోగ్రాఫర్ శాండీ పోషించిన పాత్ర) బెంగళూరుకు చెందిన మహిళలను వివాహం చేసుకోవడం ఇష్టం లేదని.. వారు క్యారెక్టర్ లెస్ అంటూ మాట్లాడారు. ఈ సీన్ బెంగళూరు మహిళలను కించపరిచేలా ఉందని సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. కన్నడ డైరెక్టర్ మన్సూర్ సైతం ఈ సినిమాపై విమర్శలు చేశారు. కన్నడ భీమ, మలయాళ చిత్రాలు ఆఫీసర్ ఆన్ డ్యూటీ, ఆవేశం, ఇప్పుడు కొత్త లోకా లాంటి సినిమాలతో బెంగళూరును మాదకద్రవ్యాలు, నేరాలకు రాజధానిగా చిత్రీకరించారని అన్నారు. ఒకప్పుడు, సినిమాల్లో అందమైన పట్టణంగా చూపించిన బెంగళూరు.. నియంత్రణ లేని వలసల కారణంగా ఇలాంటి స్థితికి చేరుకుందని ట్వీట్లో రాసుకొచ్చారు.
#Lokah pic.twitter.com/q18SX8dh7G
— Wayfarer Films (@DQsWayfarerFilm) September 2, 2025
According to movies like Kannada Bhima, Malayalam films Officer on Duty, Avesham, and now Lokah,Bengaluru is being portrayed as the capital of drugs and crime.Once upon a time,it was represented in movies as a beautiful town,has come to such a state due to uncontrolled migration.
— ಮಂಸೋರೆ/ManSoRe (@mansore25) September 1, 2025