‘హనీమూన్‌’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్‌తో పాటు ప్రియుడు.. | Honeymoon Case Cops Reconstruct Crime Scene With Sonam | Sakshi
Sakshi News home page

‘హనీమూన్‌’ కేసు దర్యాప్తు: మేఘాలయకు సోనమ్‌తో పాటు ప్రియుడు..

Jun 17 2025 1:50 PM | Updated on Jun 17 2025 2:52 PM

Honeymoon Case Cops Reconstruct Crime Scene With Sonam

షిల్లాంగ్: మధ్యప్రదేశ్‌కు చెందిన కొత్త జంట రాజా రఘువంశీ, సోనమ్‌ల హనీమూన్‌ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో భాగంగా సోనమ్‌ను, అమె ప్రియుడు రాజ్ కుష్వాహా, ఇతర నిందితులను మేఘాలయ పోలీసులు సంఘటనా స్థలానికి తీసుకువచ్చారు. నాడు నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ (Scene Reconstruction) చేశారు.

సోనమ్, రాజా రఘువంశీలు హనీమూన్‌లో ఉండగా, ఒ​​క పథకం ప్రకారం రాజా రఘువంశీ హత్య జరిగింది. రాజా మృతదేహం దొరికిన ఆరు రోజులకు సోనమ్‌ యూపీలోని ఘాజీపూర్‌లో కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విచారణలో సోనమ్ తన భర్త హత్యలో తన పాత్రను అంగీకరించింది. అయితే ఆమెపై ఉన్న అభియోగాలను నిరూపించే ఆధారాలను పోలీసులు కోర్టుకు అందించాలి. ఇందుకోసం వారు సోనమ్‌ను మేఘాలయ తీసుకువచ్చారు.

మేఘాలయలోని సోహ్రాలో నేరాల రేటు అతి తక్కువ.  గత కొన్ని దశాబ్దాలుగా ఈ పర్యాటక ప్రదేశంలో ఎటువంటి హత్య జరగలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు ఈ కేసు దర్యాప్తుపై మరింత దృష్టి సారించారు. నిందితులు పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని మేఘాలయ డిప్యూటీ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ఇదాషిషా నోంగ్‌రాంగ్ అన్నారు. అందుకే సీన్ రీకన్‌స్ట్రక్షన్  చేసి, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. విచారణ కోసం సోనమ్‌ కస్టడీని పొడిగించాలని కోర్టును కోరనున్నామన్నారు.

ఇది కూడా చదవండి: అంబులెన్స్‌లో కేదార్‌నాథ్‌.. బెడిసికొట్టిన ‘ప్లాన్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement