ఫరీదాబాద్‌ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం | Faridabad Woman Case Probe Reveals Father in Law | Sakshi
Sakshi News home page

ఫరీదాబాద్‌ కేసు: చేసిందంతా మామనే.. ఎంత దారుణం

Jun 28 2025 11:33 AM | Updated on Jun 28 2025 12:06 PM

Faridabad Woman Case Probe Reveals Father in Law

ఫరీదాబాద్‌: హర్యానాలోని ఫరీదాబాద్‌లో రెండు నెలలుగా కనిపించకుండా పోయిన మహిళ  కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఆ మహిళ మృతదేహాన్ని ఆమె అత్తమామలే స్వయంగా తమ ఇంటి ముందు పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో  మామనే ఆమైపై అత్యాచారం చేసి, హత్య చేశారని వెల్లడయ్యింది. ఇందుకు మృతురాలి అత్త, భర్త కూడా సహకరించారని తెలుస్తోంది.

మృతురాలు తన్ను ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలోని షికోహాబాద్‌కు చెందినది. ఆమెకు రెండేళ్ల క్రితం అరుణ్ సింగ్‌తో వివాహమయ్యింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, మామ భూప్ సింగ్, అతని భార్యను పోలీసులు అరెస్టు చేశారు. తన్ను భర్త అరుణ్ పరారీలో ఉన్నాడు. తమ కోడలు తన్ను అదృశ్యమయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి, ఈ విషయం బయటకు పొక్కకుండా అత్తామామలు జాగ్రత్తపడ్డారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 21న రాత్రి అరుణ్ తన భార్య తన్ను తినే ఆహారంలో నిద్రమాత్రలు కలిపాడు. అర్థరాత్రి తన్ను గదిలోకి ప్రవేశించిన మామ  అపస్మారక స్థితిలో ఉన్న ఆమెపై అత్యాచారం చేసి, ఆపై ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.  

ఈ దారుణం తర్వాత అతను తన కుమారుడు అరుణ్‌ను పిలిచాడు. వారిద్దరూ కలిసి తన్ను మృతదేహాన్ని.. అప్పటికే వీధిలో తవ్విన గొయ్యిలో పడవేసి, దానిపై ఇటుకలు, మట్టిని పోశారు. ఆ గొయ్యి మురుగునీటి కోసం తవ్వినదని భూప్ సింగ్ చుట్టుపక్కలవారికి తెలిపాడు. దీనిపై అనుమానించిన ‍స్థానికులు తహశీల్దార్‌కు ఫిర్యాదు  చేశారు. ఆయన ఆ గొయ్యిని తవ్వించగా, తన్ను మృతదేహం బయటపడింది. ఈ ఘటనలో పోలీసులు మామ భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్ కుమార్తె కాజల్‌పై కేసు నమోదు చేశారు. కాగా తమ
కుమార్తె తన్నును కట్నం కోసం అత్తమామలు వేధిస్తున్నారని, వివాహం తర్వాత కూడా  తమ కుమార్తె ఏడాదిపాటు తమ ఇంటిలోనే ఉన్నదని ఆమె తండ్రి  రోదిస్తూ మీడియాకు తెలిపాడు.

ఇది కూడా చదవండి:‘మధ్యవర్తిత్వం’ చట్టవిరుద్ధం.. పాక్‌కు భారత్‌ మరో షాక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement