Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page

ప్రధాన వార్తలు

YS Jagan Speech At Rentapalla1
చంద్రబాబూ.. నాగమల్లేశ్వరరావు భార్యా, కూతురికి ఏం చెబుతారు?: వైఎస్‌ జగన్‌

సాక్షి, పల్నాడు: రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం​ మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్‌ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు. జూన్‌ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్‌ ప్రస్తావించారు.

Sakshi Guest Column On Middle Eastern trends in India2
భారత్‌లో మధ్యప్రాచ్యపు సెగలు

2025 జూన్‌ 12, 13 వేకువజాముల్లో ఇజ్రాయెల్‌ భారీ సైనిక చర్యకు తెరతీసింది. ఇరాన్‌ అణుశక్తి సదుపాయాల మీద దాడులు చేసింది. రెండు దేశాల నడుమ నెలల తరబడిగా సాగుతున్న ఉద్రిక్తత, ఈ ఘటనతో పెను యుద్ధంగా మారింది.దశాబ్దాల నుంచీ అపరిష్కృతంగా కొన సాగుతున్న భౌగోళిక రాజకీయ వైరాలు ఎంత దారుణంగా పరిణమిస్తాయో అంద రికీ అవగతమైంది. ఈ యుద్ధాలను ప్రజలు ప్రారంభించారా? లేదు! ఎవరెవరి అధికార దాహానికో వారు బలవుతున్నారు. ఇజ్రాయెల్‌ దాడి ఫలితంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం తప్ప దన్న అంచనాలతో బ్రెంట్‌ క్రూడ్‌ ధర భగ్గుమని బ్యారెల్‌ 116 డాలర్లకు చేరింది. కోవిడ్, ఉక్రెయిన్, ఎర్ర సముద్రం సంక్షోభాలతో విచ్ఛిన్నమై ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్న ప్రపంచ సరఫరా వ్యవస్థలు మరోసారి ఖంగుతిన్నాయి. ఇరాన్‌లోని హోర్మూజ్‌ జల సంధి హై–రిస్క్‌ యుద్ధక్షేత్రంలో ఉండటంతో, అంతర్జాతీయ చమురు సరఫరాలు 20 శాతం నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో నౌకారవాణాపై బీమా చార్జీలు ఒక్కఉదుటున నాలుగు రెట్లు పెరిగాయి. మరోవైపు ఇన్వెస్టర్లు తమ నిధులను సురక్షితమైన బంగారం మార్కెట్లోకి తరలించడంతో, అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు (31.1 గ్రాములు) 2,450 డాలర్ల రికార్డు ధర పలికింది. ఈక్విటీ మార్కెట్లు కుప్పకూలాయి.ఇండియా తప్పించుకోగలదా?అనేక వర్ధమాన దేశాలతో పాటు ఇండియా సైతం ఈ పరిణా మాల ప్రభావం నుంచి తప్పించుకోలేదు. ఇంధన, ఆహార ధరలు పెరుగుతాయి. ఉపాధి దెబ్బతింటుంది. కోట్ల మంది జీవితాలు మధ్య ప్రాచ్య ఆర్థిక వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నాయి. ఇండియా తన అవసరాల్లో రమారమి 85 శాతం ముడి చమురును విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. ధరల్లో కొద్ది పాటి తేడా వచ్చినా రూపాయి విలువ ఆటుపోట్లకు గురవుతుంది. గల్ఫ్‌ దేశాల్లో ఇంజి నీర్లు, నర్సులు, కార్మికులు, ప్రొఫెషనల్స్‌గా 90 లక్షల మంది భారతీ యులు పనిచేస్తున్నారు. వారి భద్రత ఇప్పుడు అపాయంలో పడింది. వారు ఏడాదికి 100 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువే నిధులు స్వదే శానికి పంపిస్తున్నారు. ఎన్నో లక్షల కుటుంబాలు ఈ డబ్బుతోనే జీవనం సాగిస్తున్నాయి. ఇక, మధ్య ఆసియాను ఇండియాతో అనుసంధానం చేసే ఇరాన్‌ చాబహార్‌ పోర్టు కూడా యుద్ధ ప్రాంతంలోనే ఉంది. ఇండియాకు ఎంతో ముఖ్యమైన ఈ వాణిజ్య పోర్టు ప్రాజెక్టు నుంచి వైదొలగాల్సిందిగా ఇప్పుడు అమెరికా నుంచి ఒత్తిడి వస్తుంది. రెడ్‌ సీ, హోర్మూజ్‌ల ముట్టడి ముప్పు కూడా పొంచి ఉంది. 60 శాతం పైగా ఇండియా వర్తకం ఈ కారిడార్ల ద్వారానే జరుగుతోంది. దాడి, ప్రతిదాడుల దృష్ట్యా సరుకు రవాణాలో జాప్యం జరుగుతుంది. బీమా వ్యయాలు చకచకా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ వాణిజ్యం దెబ్బ తింటుంది. కరెన్సీ మార్కెట్‌ లోనూ అస్థిరత్వం చోటు చేసుకుంటుంది. డాలరుకు రూపాయి విలువ ఇప్పటికే 86 దాటింది. దీంతో మార్కెట్లో సరఫరా పెంచేందుకు ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను విక్రయించాల్సి వస్తుంది. ఫలితంగా ప్రభుత్వ విదేశీ మారక నిల్వలు క్షీణిస్తాయి. ఈ అంకెలకు అందని నష్టం మరొకటి ఉంది. అది లెక్కించడానికి అలవి కానిది. పెరిగే చమురు ధరల వెనుక, నౌకా రవాణాలో జాప్యం వెనుక ఎందరో సామాన్యుల ఇక్కట్లు దాగి ఉంటాయి. పూర్తిస్థాయి యుద్ధం కొనసాగితే అది ఒక ప్రాంతానికి పరి మితం కాదు. ప్రపంచ వ్యాప్త అస్థిరతకు నాంది పలుకుతుంది. మధ్యప్రాచ్యపు అగ్నిజ్వాలలు ఖండాంతర కార్పొరేట్‌ బోర్డు రూము ల్లోకి, కుటుంబాల డైనింగ్‌ టేబుల్స్‌ మీదకు, పాఠశాలల క్లాస్‌ రూముల్లోకి నాలుకలు జాపుతూ విస్తరిస్తాయి.నష్ట నివారణ చర్యలువాటి బారిన పడకుండా ఇండియా లోగడ రూపొందించుకున్న వ్యూహాలు, యంత్రాంగాలు ఎంతవరకు ఉపకరిస్తాయన్నది కీలకం. వీటిలో ముందుగా ప్రస్తావించాల్సింది ఇంధన కవచం. దేశంలోని 39 మిలియన్‌ బ్యారెళ్ల వ్యూహాత్మక రిజర్వుల నుంచి అవసరమైనప్పు డల్లా కొంత కొంత చమురును మార్కెట్లోకి విడుదల చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. స్వల్పకాలిక ధరల ఒడుదొడుకులను ఈ విధానంతో అధిగమించవచ్చు. గల్ఫ్‌ చమురు సరఫరా లోటు భర్తీ చేసేందుకు రష్యా, వెనిజులా, బ్రెజిల్, గయానా దేశాల నుంచి దిగు మతులను పెంచుతోంది. అత్యవసర పరిస్థితులు ఉత్పన్నమై ఇంధన దిగుమతులకు డాలర్లకు కొరత ఏర్పడేట్లయితే, దాన్ని తట్టుకు నేందుకు వీలుగా ద్వైపాక్షిక చెల్లింపు(రూపాయిల్లో పేమెంటు) ఏర్పాట్లను పునః ప్రారంభిస్తోంది.ప్రవాసుల భద్రత మరో అంశం. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, బహ్రెయిన్‌ దేశాల్లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రవాసుల కోసం నిరంతరాయంగా పనిచేసే సహాయక కేంద్రాలను ప్రారంభించింది. అత్యవసర పరిస్థితిలో వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రణాళికలు రూపొందించి గల్ఫ్‌ ప్రభుత్వాల సహకారంతో వాటికి రిహార్సల్స్‌ చేస్తోంది. స్వదేశాలకు డబ్బు పంపించడానికి ఇబ్బంది లేకుండా యూపీఐ ఆధారిత నగదు చెల్లింపు ఏర్పాట్లు జరిగాయి.దౌత్యపరంగా సున్నితమైన సమతుల్యతను ఇండియా పాటిస్తోంది. ఒమన్, యూఏఈ, సౌదీలతో తెరవెనుక దౌత్యం నెరపుతోంది. తక్షణం వైరాలకు స్వస్తి పలకాలని, ఉద్రిక్తతలను నివారించాలని, బేషరతు చర్చలు జరపాలని యూఎన్‌ సమావేశంలో పిలుపు నిచ్చింది. మరోవంక, ఇండియన్‌ నేవీ అరేబియా సముద్రంలో 16 యుద్ధనౌకలను సన్నద్ధం చేసింది. గల్ఫ్‌ గస్తీలను పెంచింది. ప్రస్తుత ఘర్షణలు ఆసరాగా చేసుకుని ఉగ్రవాదులు పేట్రేగిపోకుండా సైబర్‌ ఇంటెలిజన్స్‌ వ్యవస్థలను అప్రమత్తం చేసింది. ద్రవ్యరంగంలో కరెన్సీ ఆటుపోట్లను నివారించేందుకు ఆర్బీఐ చేతిలో 643 బిలియన్‌ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయి. దేశీయంగా ద్రవ్యోల్బణం జడలు విప్పకుండా కేంద్రం అదనపు ఆహార నిల్వలను విడుదల చేస్తోంది. ఎంఎస్‌ఎమ్‌ఈ ఎగుమతిదారు లకు ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహకాలు, రుణహామీలు రెడ్‌ సీ బాధిత సంస్థలకూ వర్తింప చేస్తోంది. మన వ్యూహం ప్రస్తుత సైనిక ఘర్షణల సమయంలో ఇండియా ‘పవర్‌ ప్లేయర్‌’గా ఉండాలనుకోవడం లేదు. ఇంధన భద్రత, ప్రవాసుల క్షేమం, వర్తక మార్గాల రక్షణ... ఈ మూడు అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోడమే ప్రధాన కర్తవ్యంగా భావిస్తోంది. దీనికోసం అనివార్యంగా ‘సంరక్షణాత్మక తటస్థత’ అనే సంక్లిష్ట వ్యూహం అనుసరించాల్సి వస్తోంది. జూన్‌ 2025 ఒక సంక్షుభిత దశాబ్దాన్ని వినాశకరమైన మలుపు తిప్పింది. ఇరాన్‌ అణు మౌలిక సదుపాయలపై జరిగిన దాడి, ఇరాన్‌ ప్రతీకార దాడుల ఫలితంగా మధ్యప్రాచ్యం అంతటా దీర్ఘకాలిక అస్థి రత నెలకొంటుంది. ఇండియా విషయానికి వస్తే, ఈ పరిణామాన్ని విదేశాంగ విధానానికి సవాలుగా మాత్రమే పరిగణించలేము. వ్యూహా త్మక పరిపక్వతకు, ఆర్థిక పటుత్వానికి, నైతిక స్థైర్యానికి ఇది ఒక పరీక్ష లాంటిది. మనం అప్రమత్తంగా ఉంటూ, మధ్యప్రాచ్యంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలని, మనకు చేరువలోనే కాలి బూడిదవుతున్న ఈ ప్రాంతంలో తిరిగి వివేకం ఉదయించాలని కోరుకోవాలి.శైలేశ్‌ హరిభక్తి వ్యాసకర్త పారిశ్రామికవేత్త, పర్యావరణ కార్యకర్త(‘ద ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌’ సౌజన్యంతో)

YS Jagan Slams Chandrababu Over Target YSRCP Kamma Leaders3
కమ్మవాళ్లు మా పార్టీలో ఉంటే నీకేంటి?: చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

సాక్షి, పల్నాడు: ఏపీలో కొందరు పోలీసులు కుల ఉన్మాదంతో పనిచేస్తున్నారని.. కమ్మవాళ్లు కేవలం చంద్రబాబుకి ఊడిగం చేయడానికే పుట్టారా? అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఇక్కడి డీఎస్పీ హనుమంతరావు కుల ఉన్మాది. కమ్మ పుట్టుక ఎందుకు పుట్టావంటూ లక్ష్మీనారాయణ అనే కార్యకర్తను ఆయన అవమానించారు. అది భరించలేక సెల్ఫీ వీడియో తీసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సీఎం, ఆయన కుమారుడు ఎలాంటి రాజకీయాలు చేస్తున్నారో ఆ వీడియోలో చెప్పాడు. లక్ష్మీనారాయణ ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. చంద్రబాబూ.. మీకు ఊడిగం చేయడానికే కమ్మవారు పుట్టారా?. వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు నాగమల్లేశ్వరరావు, గుత్తా లక్ష్మీనారాయణ.. ఈ ముగ్గురి విషయంలో.. నేను చంద్రబాబును ఒకటే అడుగుతున్నాను. మా పార్టీలో కమ్మ వాళ్లు ఉండొద్దా? మీ పార్టీ కేవలం వారికేనా? అని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.ఏం పాపం చేశారని.. వైఎస్సార్‌సీపీలోని కమ్మ సామాజిక వర్గ నేతలను చంద్రబాబు టార్గెట్‌ చేసి వేధిస్తున్నారు. చంద్రబాబును ఎవరైనా ప్రశ్నిస్తే, వెంటాడి వెంటాడి వేధిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. జైలుకు పంపిస్తున్నారు. ఏం పాపం చేశాడని నాగమల్లేశ్వరరావును పొట్టన పెట్టుకున్నాడు. ఏం పాపం చేశాడని లక్ష్మీనారాయణ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునేలా చేశారు. చంద్రబాబుకి ఊడిగం చేయడానికి సిద్ధంగా లేడనే దేవినేని అవినాష్‌ను వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని వల్లభనేని వంశీని జైల్లో పెట్టి వేధిస్తున్నారు. చంద్రబాబు శాడిజానికి వల్లభనేని వంశీ బాధపడుతున్నాడు. కొడాలి నాని ఏం పాపం చేశాడని కేసు పెట్టారు. ఏంపాపం చేశాడని.. మా పార్టీ నేత తలశిల రఘురాంపై 3 కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని అబ్బయ్య చౌదరిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని దగ్గుబాటి సురేష్‌ వైజాగ్‌ ల్యాండ్‌ క్యాన్సిల్‌ చేశారు. ఏం పాపం చేశాడని నంబూరు శంక్రరావును వేధిస్తున్నారు. నా పక్కనే అన్నాబత్తుని శివకుమార్‌. తెనాలి మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయననూ వేధిస్తున్నారు. ఏం పాపం చేసిందని.. మంగళగిరికి చెందిన రాజ్‌కుమార్‌-కృష్ణవేణిలను వేధించారు. రాజ్‌కుమార్‌ను మోకాళ్ల మీద రోడ్డు మీద కూర్చోబెట్టారు. మహిళ అని చూడకుండా కృష్ణవేణిని వేధించారు. ఏం పాపం చేశాడని.. ఇంటూరి రవిపై 19 కేసులు పెట్టి వేధించారు. ఏం పాపం చేశాడని.. ఏం పాపం చేశాడని.. బ్రహ్మనాయుడిని వేధిస్తున్నారు. ఏం పాపం చేశాడని.. పోసానిపై 9 కేసులు పెట్టి వేధించారు. చంద్రబాబును ఎవరైనా కమ్మ వారు వ్యతిరేకిస్తే, వీరు ప్రవర్తిస్తున్న తీరు రాక్షసులకన్నా దారుణం.సినిమా చూపిస్తాంవైఎస్సార్‌సీపీ కమ్మ నేతలను వేధించే కుట్రలో ఎల్లో మీడియా మీడియా భాగమైంది. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఒక ముఠా. రాష్ట్రాన్ని దోచుకోవడం. అదే మీ పని. గజదొంగలుగా దోచుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న వారిని అణిచి వేస్తున్నారు. పోలీసులూ.. చంద్రబాబు పాపంలో భాగం కావొద్దు.ఒక విషయం గుర్తుంచుకొండి. కొందరు పోలీసు అధికారులకు చెబుతున్నాను. చంద్రబాబు ఎల్లకాలం ఉండడు. ఇప్పటికే ఏడాది గడిచింది. నాలుగేళ్ల తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. అప్సుడు మీకు సినిమా చూపిస్తాం. ఇప్పుడు తప్పు చేస్తున్న వారందరినీ బోను ఎక్కిస్తాం. చంద్రబాబు పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. అందరూ మోసపోయారు. వెన్నుపోటుకు గురయ్యారు. ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు. ఇది ఎల్లకాలం సాగదు. ప్రజలు, దేవుడు తప్పకుండా మొట్టికాయలు వేస్తారు’’ అని వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల వేదికగా వ్యాఖ్యలు చేశారు.

Sakshi Editorial On G7 countries4
జీ7 మేల్కొనదా?!

నానాటికీ మసకబారుతున్న ప్రతిష్ఠను కాస్తయినా పునరుద్ధరించుకోవాలన్న స్పృహ కూడా లేకుండా ఎప్పటిలా జీ7 రెండు రోజుల సమావేశాలు కెనడాలోని ఆల్బెర్టాలో పేలవంగా ముగిశాయి. రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం అంతూ దరీ లేకుండా కొనసాగుతుండగా, తాజాగా ఇరాన్‌పై అమెరికా అండతో ఇజ్రాయెల్‌ దండెత్తింది. కానీ రెండు విషయాల్లోనూ తన వైఖరి ఎలావుండాలో, ఏం చేయాలో జీ7 తేల్చుకోలేకపోయింది. సమావేశాల ముగింపులో లాంఛనంగా విడుదల కావాల్సిన ఉమ్మడి ప్రకటన కరవైంది. ఏకపక్షంగా ఇరాన్‌పై దాడులకు దిగి పశ్చిమాసియాలో మరో మహాసంగ్రామానికి తెరలేపిన ఇజ్రాయెల్‌ను పల్లెత్తు మాట అనకుండా తప్పంతా ఇరాన్‌దేనని ఈ దేశాలు తేల్చాయి. ఆ యుద్ధం పర్యవసానాలు తమను సైతం చుట్టుముడతాయనీ, అమెరికా ఆ ఊబిలోకి దిగితే అది మరో ప్రపంచ యుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉన్నదనీ తెలిసినా కిక్కురుమనలేదు. ఇరాన్‌ను ఏదో ఒకటి అనకపోయినా... రష్యాను నిందించే ప్రయత్నం చేసినా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు ఆగ్రహం కలుగుతుందన్న భయం జీ7 దేశాలను వెన్నాడింది. సమావేశాలకు ముందు బ్రిటన్, కెనడాలు రష్యాపై మరిన్ని ఆంక్షలుంటాయని ఆర్భాటంగా ప్రకటించాయి. కానీ ట్రంప్‌ తీరు చూశాక వాటికి నోరుపెగల్లేదు. గాజా విషయంలో ఇజ్రాయెల్‌ను తప్పుబట్టినట్టు కనబడుతూనే, ఇరాన్‌పై దండయాత్ర విషయంలో ఒక్క మాట అనలేకపోయాయి. అసలే జీ7 ‘నిన్నటి క్లబ్‌’ అని పేరుబడింది. ఆ అపకీర్తిని మరింత పెంచుకోవటానికే సభ్యదేశాలు పాటుపడుతున్నట్టు కనబడుతోంది!ఒకప్పుడు జీ7 మహా శక్తిమంతమైనది. 1980వ దశకంలో ప్రపంచ జీడీపీలో దాని వాటా ఏకంగా 70 శాతం. నిరుడు ఆ వాటా 30 శాతానికి కాస్త అటూ ఇటూగా ఉంది. ఆర్థిక కార్యకలా పాలు పశ్చిమం నుంచి తూర్పు దిశకు వలసవచ్చి చాన్నాళ్లవుతోంది. ఈ పారిశ్రామిక దేశాలకు చైనా సవాలుగా నిలిచింది. ఆర్థికంగా బలపడుతోంది. ఆ దేశానికి జీ7లో చోటు లేదు. అటు రష్యాకు మధ్యలో కొన్నాళ్లు సభ్యత్వం ఇచ్చినా 2014లో క్రిమియాను దురాక్రమించటంతో వెళ్లగొట్టారు. మన దేశం సైతం ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. అయినా పరిశీలక హోదాయే తప్ప సభ్యత్వం లేదు. ట్రంప్‌ ఏలుబడి మొదలయ్యాక ప్రపంచ సంస్థలను అమెరికా చిన్నచూపు చూడటం మొదలైంది. భద్రతామండలికి విలువే లేకుండా పోయింది. తానే నిర్మించిన డబ్ల్యూటీవోను అమెరికా బేఖాతరు చేస్తోంది. ప్యారిస్‌ ఒప్పందం నుంచి, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఏర్పడుతున్న ఖాళీని భర్తీ చేయొచ్చన్న ఆలోచనగానీ, అందుకు తగిన ప్రణాళికలుగానీ జీ7 దగ్గర లేవు. ఎంతసేపూ అమెరికా తోకపట్టుకు పోవాలన్న ధోరణే. ట్రంప్‌ మాటలు గమనిస్తే ఆయనకు ప్రధాన ఎజెండా అయిన వాణిజ్యంపై ధ్యాసలేదన్న సంగతి తెలుస్తుంది. సదస్సులో ఎక్కువసేపుంటే ఉక్రెయిన్‌ విషయంలో ఒత్తిడి తప్పదన్న భయం వల్లనో, ఇరాన్‌ సంగతి తేల్చాలన్న ఆవేశంతోనో ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. వెళ్లేముందు రష్యా దురాక్రమణకు మీరే కారణమంటూ నిందించారు. తమ మాజీ అధ్యక్షుడు ఒబామా, అప్పటి కెనడా ప్రధాని స్టీఫెన్‌ హార్పర్‌లు 2014లో రష్యాను జీ7నుంచి బయటకు నెట్టకపోతే ఇవాళ ఆయన సమావేశాల్లో ఉండేవారని, యుద్ధం ఆపటానికి ఒత్తిడి తెచ్చేవారమని నిష్ఠూరమాడారు. అసలు యుద్ధమే వచ్చి వుండేది కాదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అందుకే, ఇక్కడ న్యాయానికి చోటులేదని గ్రహించారో ఏమో... ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సైతం సమావేశాలకు మధ్యలోనే గుడ్‌బై చెప్పారు. నిరుడు జూన్‌లో జరిగిన జీ7 సమావేశాల సందర్భంగా ఉక్రెయిన్‌కు 5,000 కోట్ల డాలర్ల రుణమిస్తామని తీర్మానించారు. దాని ప్రకారం నెలకు వంద కోట్లు ఉక్రెయిన్‌కు అందించాలి. కానీ ట్రంప్‌ రాకముందే డిసెంబర్‌లోనే అప్పటి అధ్యక్షుడు బైడెన్‌ దానికి కోత పెట్టారు. ఆయనొచ్చాక ఇక చెప్పేదేముంది? ఈ భారాన్ని ఇతర సభ్య దేశాలు మోస్తున్నాయి. నిజానికి, గత వైభవం మళ్లీ దక్కాలంటే జీ7 పరిపూర్తి చేయాల్సిన లక్ష్యాలు చాలానే ఉన్నాయి. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు తమ వంతు కృషి అవసరం. కృత్రిమ మేధ, క్వాంటమ్‌లకు కావాల్సిన అత్యంత కీలకమైన ఖనిజాల సరఫరా ఆటంకం లేకుండా చూసుకోవాలి. పటిష్ఠమైన మౌలిక సదుపాయాల కల్పనకూ, యువతకు భారీయెత్తున ఉద్యోగావకాశాలు వచ్చిపడే రంగాలపై దృష్టి సారించాలి. కానీ ఇవన్నీ సాకారం కావాలంటే యుద్ధాలు లేని ప్రపంచం ఉండాలి. మరి దానికోసం జీ7 చేసిందేమిటి? ఈ దేశాలన్నీ అమెరికా సాగించిన యుద్ధాల్లో భాగస్వాములుగా మారి చేజేతులా ఆర్థిక వ్యవస్థల్ని ఛిన్నాభిన్నం చేసుకున్నాయి. నిజానికి ఇజ్రాయెల్‌ను పూర్వంలా యూరప్‌ దేశాల్లో జనం వెనకేసుకు రావటం లేదు. ఇరాన్‌ అణ్వస్త్రం తయారు చేయటం అనర్థమన్న అభిప్రాయం ఉన్నా ఆ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి దాన్ని ఒప్పించాలని మెజారిటీ జనం భావిస్తున్నట్టు సర్వేల్లో తేలింది. అయినా జీ7 దేశాలకు పట్టదు. మనవరకూ చూస్తే ఈ సదస్సు ఎంతో కొంత తోడ్పడిందని చెప్పాలి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత నేరుగా పారిశ్రామిక దేశాధినేతలందరినీ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా కలిసి ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్‌ తీరు గురించి, దానిపై చర్య తీసుకోక తప్పని పరిస్థితి గురించి వివరించగలిగారు. ఏదేమైనా ఇలాంటి సదస్సులు మొక్కుబడిగా, బాతాఖానీ క్లబ్‌లుగా మారితే ఫలితం ఉండదు. కనీసం వచ్చే సమావేశాల నాటికైనా జీ7 దేశాలు ఈ సంగతి గ్రహించాలి.

CM Revanth Reddy Fires On KCR About Banakacharla5
కేసీఆర్‌ సూచనతోనే బనకచర్ల!: సీఎం రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: ‘ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్‌లో నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు వెయ్యి టీఎంసీలకి మించి నీళ్లు అవసరం. ఏటా 3 వేల టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. నీటి లభ్యత ఉన్న నేపథ్యంలో రెండు రాష్ట్రాలు చర్చించుకుని నీళ్లను వాడుకోవాలని 2016 సెపె్టంబర్‌ 21న అప్పటి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 వేల టీఎంసీలు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని కనిపెట్టింది కేసీఆరే. ఆ నీటి వినియోగంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది ఆయనే. కేసీఆర్‌ సూచన నుంచే గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌లో కేసీఆర్‌ చేసిన సూచనలను రికార్డు చేశారని, ఆ మినట్స్‌ కాపీని ఎంపీలందరికీ అందజేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ చేపడుతున్న గోదావరి–బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నికర జలాల వినియోగం పూర్తి కాకముందే మిగులు జలాల లభ్యతను ఎలా తేల్చుతారంటూ బీజేపీ ఎంపీ రఘునందర్‌రావు అడిగిన ప్రశ్నకు సీఎం బదులిస్తూ కేసీఆర్‌పై ఆరోపణలు చేశారు. గోదావరి జలాల తరలింపే ఆ భేటీల లక్ష్యం ‘చంద్రబాబు, కేసీఆర్‌ మధ్య సమస్యలు రావడంతో 2016 తర్వాత 3 వేల టీఎంసీల మిగులు జలాల అంశం మరుగున పడిపోయింది. ఆ తర్వాత 2019 ఆగస్టులో నాటి ఏపీ సీఎం జగన్‌తో ప్రగతిభవన్‌లో నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమై మళ్లీ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం అని ఆ సమావేశంలో కేసీఆర్‌ అన్నారు. కేసీఆర్, జగన్‌లు ప్రగతిభవన్‌లో నాలుగుసార్లు సమావేశమై గోదావరి జలాలను రాయలసీమకు తరలించుకోవడంపై చర్చలు జరిపారు. గోదావరి జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు తరలించడమే నాటి సమావేశాల లక్ష్యం. ఈ నేపథ్యంలోనే బనకచర్ల ప్రాజెక్టును ప్రస్తుతం ఏపీ చేపట్టింది. 400 టీఎంసీలను రాయలసీమకు తరలించాలని అప్పట్లో కేసీఆర్, జగన్‌ మాట్లాడుకున్నారు. అందులో భాగంగానే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా నేరుగా 200 టీఎంసీలు, పరోక్షంగా 100 టీఎంసీలు కలిపి 300 టీఎంసీలను తరలిస్తామంటూ ఏపీ తాజాగా ప్రతిపాదించింది..’ అని రేవంత్‌ చెప్పారు. ఆ మినట్స్‌నే గుదిబండగా మార్చాలని ఏపీ చూస్తోంది.. రాయలసీమకు గోదావరి జలాల తరలింపునకు పెద్దన్నగా సహకరిస్తా అని నాడు కేసీఆర్‌ హామీ ఇచ్చినట్టు పత్రికల్లో వచ్చిన వార్తలను సీఎం రేవంత్‌ రెడ్డి చదివి వినిపించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించి.. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు తరలించే ఉద్దేశంతో కేసీఆర్‌ ఆ ప్రతిపాదనలు చేశారని వివరణ ఇచ్చారు. బనకచర్లతో తెలంగాణ నష్టపోకుండా ప్రభుత్వానికి సహకరించడానికే తాము ఈ భేటీకి వచ్చామన్నారు. సీఎం జోక్యం చేసుకుని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌లో ఉన్న అంశాలను మళ్లీ చదివి వినిపిస్తా అని అన్నారు. ‘గోదావరి నీళ్లను శ్రీశైలంలో వేయాలంటే తొలుత సాగర్‌లో వేయాల్సి ఉంటుంది. కానీ బనకచర్ల ప్రాజెక్టు ద్వారా సాగర్‌లో వేయకుండా నీళ్లను నేరుగా తరలించుకుంటామని ఏపీ ప్రతిపాదించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అపెక్స్‌ కౌన్సిల్‌లో ఏపీ, తెలంగాణ సీఎంలు చర్చించిన తీసుకున్న నిర్ణయం ప్రకారమే బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ఏపీ వాదిస్తోంది..’ అని చెప్పారు. దీంతో.. రాజకీయ ఉద్దేశంతో జరుగుతున్న ఈ సమావేశం నుంచి తాము వాకౌట్‌ చేస్తున్నట్టు వద్దిరాజు ప్రకటించారు. బీజేపీ ఎంపీ డీకే అరుణ నచ్చజెప్పబోగా, ‘పోనీయండి’ అంటూ సీఎం వారించారు. కొన్ని వాస్తవాలు బయటకు వచ్చినందుకు మిత్రుడు కొంత ఇబ్బంది పడ్డట్టు ఉన్నాడని వ్యాఖ్యానించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం మినట్స్‌నే తెలంగాణకు గుదిబండగా మార్చడానికి ఏపీ ప్రయత్నిస్తోందని అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల కేటాయింపులను 2015లో నాటి సీఎం కేసీఆర్‌ అంగీకరించడంతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని విమర్శించారు. జూలైలో ప్రధాని, కేంద్ర మంత్రులను కలుస్తాం బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి టెక్నికల్, లీగల్, పొలిటికల్‌..మూడు మార్గాల్లో ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. గురువారం మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ను కలిసి అభ్యంతరం తెలుపుతామని అన్నారు. ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో ఈ సమావేశానికి రాలేమని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలు సమాచారం ఇచ్చారని, వారిని సైతం సీఆర్‌ పాటిల్‌ వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. జూలైలో జరిగే పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా ప్రధాని మోదీతో పాటు కేంద్ర జలశక్తి, ఆర్థిక, పర్యావరణ శాఖల మంత్రులను కలిసి అభ్యంతరాలు తెలియజేస్తామని వెల్లడించారు. రాజకీయ ప్రయత్నాలు ఫలించకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఎంపీ అసదుద్దీన్‌ సూచించినట్టు జలవివాదాల్లో నిపుణులైన న్యాయవాదులను నియమించుకుంటామని చెప్పారు. పార్టీలకు అతీతంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఎంపీలందరూ ఈ సమావేశంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిద్దామని ప్రతిపాదించారు. తెలంగాణ ప్రయోజనాలను పరిక్షించిన తర్వాతే ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరదామన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ కమిషనర్‌ గౌరవ్‌ ఉప్పల్, సలహదారు ఆదిత్యనాథ్‌ దాస్‌లు ఎంపీలను సమన్వయం చేస్తారన్నారు. కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్‌ ప్రాజెక్టులపై ఒక డాక్యుమెంట్‌ తయారు చేసి ఎంపీలందరికీ అందించాలని ఆదిత్యనాథ్‌ను ఆదేశించారు. సీఎం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడంటూ విమర్శలు చేస్తున్నారని, నిరంతరం వెళ్లి సంప్రదింపులు చేస్తేనే ప్రాజెక్టులకు అనుమతులు వస్తాయని సీఎం అన్నారు. భవిష్యత్తులో సైతం కేంద్రంతో సంబంధాలు కొనసాగిస్తామన్నారు. కాంగ్రెస్‌ ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్‌ షెట్కార్, కుందూరు రఘువీర్‌ రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్, రఘురాం రెడ్డి, బీజేపీ నుంచి డీకే అరుణ, రఘునందన్‌ రావు, ఎంఐఎం నుంచి అసదుద్దీన్‌ ఒవైసీ పాల్గొన్నారు.

Sakshi Guest Column On Gold And dollar currency6
డాలర్‌ వెలవెల... బంగారం ధగధగ

బంగారం ఒక విలువైన లోహం. భారతదేశం వంటి దేశాలలో అది మహిళలకు ఇష్టమైన అలంకారం.లేకుంటే, ధనవంతులకు తమ సంపదను దాచుకునే ఒక మార్గం. కానీ ఇదే బంగారం 1971 ఆగస్టు 15 వరకూ అమెరికా డాలర్‌కు విలువను కల్పించిన సాధనం. నాటి వరకూ, అమెరికా డాలర్‌ అంతర్జాతీయ వాణిజ్య లావాదేవీలకు అవసరమైన రిజర్వ్‌ కరెన్సీగా కొనసాగగలిగేటందుకు, ఈ డాలర్‌ – బంగారం లింక్‌ ఉపయోగపడింది. అయితే, నాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్‌ ఈ లింక్‌ను తెగ్గొట్టేశాడు. అంటే, ఇక ముందర తాము ముద్రిస్తోన్న డాలర్‌లకు ఆ మేరకు, వెనుక తట్టున బంగారాన్ని నిల్వ పెట్టబో మని తేల్చి చెప్పేశాడు. ఈ రకంగా డాలర్‌ అనేది ఫ్లోటింగ్‌ కరెన్సీగా మారింది. అంటే, బంగారం లింక్‌ తెగిపోయిన తర్వాత డాలర్‌ తాలూకు విలువ, ఇతర దేశాల కరెన్సీ లతో పోలిస్తే, దానికున్న డిమాండ్‌పై ఆధారపడ సాగింది. ఇదే క్రమంలో, ప్రపంచంలోని అనేక కరెన్సీలు మెల్లమెల్లగా ఫ్లోటింగ్‌ కరెన్సీలుగా మారాయి. ఒక దేశం వివిధ దేశాలతో చేసిన వ్యాపారం తదితర లావాదేవీల ఫలితంగా సమకూరిన అనేక దేశాల కరెన్సీలతో పాటుగా... వాటిలో ఒకటిగా, కొద్దిపా టిగా బంగారం నిల్వలను కూడా వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు (మన రిజర్వ్‌ బ్యాంక్‌ వంటివి) తమ కిట్టీలో అట్టిపెట్టుకోసాగాయి. కాగా, ఈ కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న వివిధ కరెన్సీల నిల్వలు అన్నింటిలోనూ డాలర్‌దే తిరుగులేని పై చేయిగా ఉంటూ వస్తోంది. కానీ, ఇటీవల మరలా కథ తిరగబడుతోంది. వివిధ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మారకం నిల్వలలో యూరో కరెన్సీని అధిగమించి డాలర్‌ తరు వాతి స్థానంలోకి బంగారం నిల్వలు చేరుకుంటు న్నాయి. అంటే, డాలర్‌ యుగం ముగుస్తోందన్న మాట. కానీ దానికి తక్షణ ప్రత్యామ్నాయం కనపడని ఈ సంధి దశలో, బంగారం తిరిగి ప్రాభవంలోకి వస్తోంది. దీనికి తార్కాణమే నేడు కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వల స్థాయి సుమారుగా 36 వేల టన్నులకు చేరుకోవడం. గతంలో ఈ స్థాయిలో అవి ఉన్నది 60 సంవత్సరాల క్రితం మాత్రమే! 1971లోనే బంగారంతో లింక్‌ తెగిపోయినా... నేటి వరకూ కూడా డాలర్‌ తన అంతర్జాతీయ రిజర్వ్‌ కరెన్సీ స్థానాన్ని పదిలంగా అట్టిపెట్టుకోగల్గింది. అయితే 1980ల నుంచీ, ఔట్‌సోర్సింగ్‌ రూపంలో అమెరికా పరిశ్రమలు చైనా వంటి ఇతర చవక శ్రమ శక్తి దేశాలకు తరలిపోవడం, 1990ల మధ్య నుంచీ, ఇంటర్నెట్‌ సాంకేతికత వలన అమెరికాలోని సేవా రంగం కూడా పెద్ద ఎత్తున భారతదేశం వంటి దేశాలకు తరలి వెళ్ళిపోవడం; యాంత్రీకరణ వేగం పెరిగి అమెరికాలో ప్రజలకు ఉపాధి అవకాశాలు తగ్గి పోవడం... ఫలితంగా వారి కొనుగోలు శక్తి పడిపోయే పరిస్థితులు వచ్చాయి. ఈ క్రమంలోనే అమెరికా భారీ ఎత్తున ఇతర దేశాల దగ్గర అప్పులు చేయసాగింది. అంతిమంగా నేడు ఈ అప్పు స్థాయి సుమారుగా 35 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా పాలకులు తమ ప్రజల కొనుగోలు శక్తిని కాపాడే ప్రయత్నంలో భాగంగా 2008 ఆర్థిక సంక్షోభ సమయంలో, 2020 కోవిడ్‌ లాక్‌డౌన్‌ కాలంలో ఉద్దీపన పథకాల కోసం పెద్ద ఎత్తున లక్షల కోట్ల డాలర్లను ముద్రించారు. అంతకు ముందర అనేక దశాబ్దాలుగా కూడా అమెరికాలో డాలర్ల ముద్రణ శ్రుతి మించి జరిగింది. ఈ క్రమంలోనే డాలర్‌ కరెన్సీ తన విలువను కోల్పోసాగింది. 2022 అనంతరం, ఆ దేశంలో విజృంభించిన ద్రవ్యోల్బణం లేదా ధరల పెరుగుదల అనేవి దశాబ్దాల పాటు జరి గిన డాలర్‌ల అపరిమిత ముద్రణ ఫలితమే.ఈ క్రమంలోనే, బలహీనపడుతోన్న డాలర్‌ రూపంలో తమ తమ విదేశీ మారకద్రవ్య నిల్వలను అట్టిపెట్టుకోవడం కంటే, బంగారం వంటి నికరంగా విలువను నిలబెట్టుకోగల ప్రత్యామ్నాయాన్ని ఆశ్ర యించడం మేలని కేంద్ర బ్యాంకులు నిర్ణయించుకుంటున్నాయి. దీనంతటితో పాటుగా, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధ క్రమంలో, అమెరికా ప్రభుత్వం రష్యాపై అనేక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలలో భాగంగా అమె రికా డాలర్‌ కరెన్సీ లావాదేవీల వ్యవస్థ నుంచి, రష్యాను బయటకు నెట్టివేసింది. ఈ బహిష్కరణ అనేది ప్రపంచంలోని చాలా దేశాలకు డాలర్‌పై ఆధారపడడం తాలూకు అభద్రతను బోధపరిచింది. ఫలితంగా, నేడు పలు దేశాలు డాలర్‌పై ఆధారపడ డాన్ని తగ్గించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే అవి బంగారం దిశగా కూడా మళ్ళుతున్నాయి.గత 15 ఏళ్లుగా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. 2024లో ఇవి రికార్డు స్థాయిలో 1,180 టన్నుల బంగా రాన్ని కొనుగోలు చేశాయి. కేంద్ర బ్యాంకుల కిట్టీలో బంగారం నిల్వల స్థాయి పెరుగుతూ రావడం అనేది... పాత డాలర్‌ యుగం ఆధిపత్య స్థానంలో మరో సరికొత్త కరెన్సీ లేదా కరెన్సీల సమూహం వచ్చి చేరే వరకూ నడిచే సంధి యుగం లక్షణమే.డి. పాపారావు వ్యాసకర్త సామాజిక, ఆర్థిక రంగాల విశ్లేషకులుమొబైల్‌: 98661 79615

Yellow Media Spreading False Propaganda On Ys Jagan Palnadu Tour7
నిజం దాచి ఎల్లో మీడియా విష ప్రచారం.. అసలు జరిగింది ఇదే..

సాక్షి, పల్నాడు: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనపై ఎల్లో మీడియా విషం కక్కుతోంది. ప్రజాదరణ చూసి ఓర్వలేక పచ్చి అబద్దాలను పచ్చ కూటమి వల్లె వేస్తోంది. సత్తెనపల్లిలో తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందినట్టు ఎల్లోమీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తోంది. ఎల్లో మీడియా విష ప్రచారం చూసి జనం అవాక్కవుతున్నారు.నిజానికి జయవర్ధన్‌ రెడ్డి అస్వస్థతతో మృతి చెందారు. ర్యాలీ పాల్గొన్న సమయంలో ఆయన అలసటకు గురయ్యారు. అలసటతో ఒక షాపు ఎదుటకు వెళ్లి కూర్చున్న సీసీ కెమెరా విజువల్స్ లభ్యమయ్యాయి. కొద్దిసేపటి తర్వాత వెళ్లేందుకు లేచిన జయవర్ధన్‌ కుప్పకూలారు. వెంటనే స్థానికులు బైకు మీద ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయవర్ధన్‌ మృతి చెందారు. దీనిపై కూడా ఎల్లో బ్యాచ్‌ విష ప్రచారం చేస్తోంది.

donald trump latest statement on india pak ceasefire8
‘భారత్‌-పాక్‌ యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్‌ పాకిస్తాన్‌’

వాషింగ్టన్‌: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయితే, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికే భారత్‌-పాక్‌ల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ ఊదరగొట్టిన ట్రంప్‌ తాజాగా మరోసారి అదే పాటపాడారు. భారత్‌-పాకిస్తాన్‌ సీజ్‌ఫైర్‌లో అమెరికా జోక్యం చేసుకోలేదని ప్రధాని మోదీ ప్రకటన చేశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘యుద్ధాన్ని నేనే ఆపా.. ఐలవ్‌ పాకిస్తాన్‌.రెండు న్యూక్లియర్‌ దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపాను. మోదీ గొప్ప వ్యక్తి ఆయనతో రాత్రి మట్లాడా. గత రాత్రే భారత్‌ - అమెరికా ట్రేడ్‌ గురించి ఆయనతో మాట్లాడాను’అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

Yuvraj Singh Father makes Shocking claim without naming player But9
‘సచిన్‌, గంభీర్‌, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ (Yograj Singh) మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచాడు. ఒక్కడి కోసం.. భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) సెలక్టర్లు ఎంతో మంది గొప్ప ఆటగాళ్ల కెరీర్‌ను నాశనం చేశారని ఆరోపించాడు.ఒ​క్కడికి అండగా నిలిచేందుకు సర్వనాశనంఈ మేరకు.. ‘‘సీనియర్ల నుంచి సౌరవ్‌, సచిన్‌, రాహుల్‌ ద్రవిడ్‌ (Rahul Dravid), వీవీఎస్‌ లక్ష్మణ్‌, జవగళ్‌ శ్రీనాథ్‌, అని కుంబ్లే.. యువతరం నుంచి భజ్జీ (హర్భజన్‌ సింగ్‌), యువీ (యువరాజ్‌ సింగ్‌), వీరూ (వీరేందర్‌ సెహ్వాగ్‌), మహ్మద్‌ కైఫ్‌, జహీర్‌ ఖాన్‌.తండ్రులు- కుమారులు.. పెద్దన్నలు- తమ్ముళ్ల కలయికతో జట్టు ఎంతో బాగుండేది. సీనియర్ల సలహాలతో జూనియర్లు రాటుదేలేవారు. కానీ మనం ఏం చేశాం?.. ఒ​క్కడికి అండగా నిలిచేందుకు మన ఇంటిని మనమే నాశనం చేసుకున్నాం.అతడి పేరును నేను ఇక్కడ ప్రస్తావించదలచుకోలేదు. కానీ ఈరోజుకీ అతడి వల్లే ఇదంతా జరిగిందని చెప్పగలను. అతడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? జట్టు పరిస్థితి ఎలా ఉంది?సచిన్‌ అలాంటివాడే..స్వార్థం కోసం ఇతరుల కెరీర్‌ను నాశనం చేసేవాళ్లు కొందరైతే.. కొంతమంది నిస్వార్థంగా ఇతరులను ప్రేమిస్తారు. సచిన్‌ టెండుల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌, గౌతం గంభీర్‌ లాంటివాళ్లు రెండో కోవకు చెందిన వారు.ఇతరుల కోసం వారు ఆడతారు. స్టార్లు కావాలన్న తాపత్రయం వారికి లేదు’’ అంటూ యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇన్‌సైడ్‌ స్పోర్ట్స్‌తో వ్యాఖ్యానించాడు. అదే విధంగా.. 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యులైన వారిపై ఎలాంటి కారణం లేకుండానే బీసీసీఐ సెలక్టర్లు వేటు వేశారని ఆరోపించాడు.ధోనిని ఉద్దేశించేనా?‘‘గౌతం గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌, మహ్మద్‌ కైఫ్‌ వంటి వాళ్ల కెరీర్‌ను బీసీసీఐ సెలక్టర్లు నాశనం చేశారు. 2011 ప్రపంచకప్‌ గెలిచిన తర్వాత వారిని బయటకు పంపేశారు’’ అని యోగ్‌రాజ్‌ సింగ్‌ పేర్కొన్నాడు. కాగా టీమిండియా దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఉద్దేశించే యోగ్‌రాజ్‌ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.గతంలో కూడా అతడు ధోని తన కుమారుడు యువీ కెరీర్‌ను నాశనం చేశాడంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. తాజాగా.. పేరు చెప్పకపోయినప్పటికీ ధోనిని దృష్టిలో పెట్టుకునే యోగ్‌రాజ్‌ సింగ్‌ ఇలా మాట్లాడి ఉంటాడని క్రికెట్‌ ప్రేమికులు అంచనా వేస్తున్నారు. కాగా ధోని కెప్టెన్‌గా వచ్చిన తర్వాత జట్టులో మార్పులు చేస్తూ యువ తారలతో నింపేశాడు. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ వంటి దిగ్గజాలు అతడి హయాంలోనే ఎదిగారు. ఇక సారథిగా ధోని టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే వరల్డ్‌కప్‌, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ అందించాడు. చదవండి: Ind vs Eng: కోహ్లి స్థానంలో అతడే బ్యాటింగ్‌ చేస్తాడు: రిషభ్‌ పంత్‌

SBI credit card New rule from July 15 higher minimum due in next bill Youth Finance10
SBI క్రెడిట్‌ కార్డు కొత్త రూల్‌.. జూలై 15 నుంచి..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ (SBI Card) నిబంధనల్లో కొత్త మార్పులు చేస్తోంది. కనీస మొత్తం బకాయిలు (మినిమమ్‌ అమౌంట్‌ డ్యూ- ఎంఏడీ) లెక్కింపు పద్ధతిని సవరించింది. క్రెడిట్ కార్డు హోల్డర్ డిఫాల్ట్ అవ్వకుండా క్రెడిట్ కార్డు బిల్లింగ్ సైకిల్‌ గడువు తేదీ నాటికి తిరిగి చెల్లించాల్సిన కనీస మొత్తాన్ని ఎంఏడీ అంటారు. ఎంఏడీ లెక్కింపులో చేసిన ఈ సర్దుబాటుతో మినిమమ్‌ డ్యూ కట్టేద్దాంలే.. అనుకునే పెద్దమొత్తంలో బకాయిలున్న కొంతమంది క్రెడిట్ కార్డు హోల్డర్లు ఇక కాస్తంత ఎక్కువ మినిమమ్‌ డ్యూ చెల్లించాల్సి రావచ్చు.ఎందుకంటే కొత్త ఎంఏడీ ఫార్ములా ప్రతి నెలా ఫైనాన్స్ ఛార్జీలు ఫీజులను పూర్తిగా చెల్లించేలా చేస్తుంది. వాటిని పూర్తిగా చెల్లించకుండా లేదా ఏదో కొంత మొత్తం చెల్లించి తర్వాత పొడిగించుకుందామంటే కుదరదు. పెరిగిన ఎంఏడీ చెల్లింపు కొంతమందికి ప్రత్యేకించి రివాల్వింగ్ క్రెడిట్ కార్డ్ రుణం ఉన్నవారికి భారంగా అనిపించినప్పటికీ అది మంచిదే. క్రెడిట్ కార్డ్ రుణాన్ని రివాల్వింగ్ చేయడం అంటే సరళంగా చెప్పాలంటే క్రెడిట్‌ కార్డు బకాయిని పాక్షికంగా లేదా పూర్తిగా చెల్లించేసి కొత్త కొనుగోళ్ల కోసం మిగిలిన క్రెడిట్ పరిమితిని ఉపయోగించడం అన్నమాట.ఏం మారిందంటే.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుల కొత్త మినిమమ్‌ డ్యూ (MAD) ఫార్ములా, పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్‌ను ఎస్‌బీఐ కార్డ్‌ తమ వెబ్‌సైట్‌లో వివరించింది. జూలై 15 నుంచి కొత్త ఎంఏడీ లెక్కింపులో 100% జీఎస్టీ, 100% ఈఎమ్ఐ మొత్తం, 100% ఫీజులు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, ఏదైనా ఓవర్ లిమిట్ మొత్తం, మిగిలిన బ్యాలెన్స్ బకాయిలలో 2% ఉంటాయి. ఇంతకుముందు ఈఎంఐ, ఛార్జీల్లో కొంత భాగాన్ని మాత్రమే చేర్చేవారు. వినియోగదారులు కాస్త మొత్తాన్ని చెల్లించి, మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి వీలుండేది.ఇక పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ విషయానికి వస్తే.. కార్డుదారుడి బకాయిపై అందుకున్న చెల్లింపులను 100% జీఎస్టీ, 100% ఈఎంఐ మొత్తం, 100% ఫీజు / ఛార్జీలు, 100% ఫైనాన్స్ ఛార్జీలు, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, రిటైల్ ఖర్చులు, క్యాష్ అడ్వాన్స్‌తో సర్దుబాటు చేయాలని పేమెంట్ సెటిల్మెంట్ ఆర్డర్ పేర్కొంది. ఈ సవరించిన క్రమం వడ్డీ,పెనాల్టీ పడే భాగాలను మొదట క్లియర్ చేసేలా చేస్తుంది. దీంతో దీర్ఘకాలికంగా కార్డుదారులకు వడ్డీ పెరుగుదలను తగ్గిస్తుంది.యువతా.. క్రెడిట్ కార్డు భారం పెంచుకోవద్దుఆర్థిక స్థిరత్వానికి స్మార్ట్ క్రెడిట్ కార్డ్ మేనేజ్ మెంట్ అనేది కీలకం. ముఖ్యంగా యువ ప్రొఫెషనల్స్ కు ఇది చాలా ముఖ్యమైనది. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపులు సజావుగా జరగడానికి, రుణ భారం పెరగకుండా చూసుకునేందుకు నిపుణులు సూచించే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియజేస్తున్నాం.పూర్తి మొత్తం, సకాలంలో చెల్లించండి - ఎల్లప్పుడూ కనీస మొత్తానికి బదులుగా మీ మొత్తం బిల్లును చెల్లించడానికి ప్రయత్నించండి. ఇది వడ్డీ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. మీ క్రెడిట్ స్కోరును ఆరోగ్యంగా ఉంచుతుంది.ఆటో-పే & అలర్ట్ లను పెట్టుకోండి - చెల్లింపులను ఆటోమేట్ చేయండి లేదా రిమైండర్ లను పెట్టుకోండి. తద్వారా మీరు గడువు తేదీలను ఎన్నడూ కోల్పోరు. ఆలస్య రుసుము, పెనాల్టీ వడ్డీ రేట్లు త్వరగా పెరుగుతాయని గమనించండి.మితిమీరిన వాడకం వద్దు - క్రెడిట్ కార్డులు మీ బడ్జెట్ కు అనుబంధంగా ఉండాలి. దానిని మీరి పోకూడదు. బలమైన క్రెడిట్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి మీ క్రెడిట్ లిమిట్‌లో 30% కంటే తక్కువగా ఖర్చు చేయండి.వడ్డీ రేట్లను అర్థం చేసుకోండి - ఒకవేళ బకాయిలు ఉన్నట్లయితే, అధిక వడ్డీ రేట్లను గుర్తుంచుకోండి. అప్పు తీర్చడం వల్ల దీర్ఘకాలంలో డబ్బు ఆదా అవుతుంది.రివార్డ్ లు, ఆఫర్ లను సద్వినియోగం చేసుకోండి - క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ లు, రివార్డ్ పాయింట్లను తెలివిగా ఉపయోగించండి. అవి మీ ఖర్చు అలవాట్లు, ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి.స్టేట్ మెంట్ లను క్రమం తప్పకుండా చెక్ చేయండి - అనధికార ఛార్జీలు లేదా లోపాలను ముందుగానే పట్టుకోవడం కోసం లావాదేవీలను ఎప్పటిక​ప్పుడు పర్యవేక్షించండి.కార్డుల సంఖ్యను తగ్గించుకోండి - ఎక్కువ కార్డులను వాడటం చూడ్డానికి బాగానే ఉంటుంది. కానీ అతిగా ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ కార్డులుంటే తగ్గించుకోవడం మంచిది.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement