
దేశవ్యాప్తంగా జీరో కమీషన్ మోడల్ను అమలు చేస్తున్నట్లు ఓలా క్యాబ్స్ తెలిపింది. 10 లక్షలకు పైగా డ్రైవర్ భాగస్వాములు తమ సంపాదనలో 100 శాతం ఆదా చేసుకోవచ్చని చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా ఉన్న ఈ కార్యక్రమం ఆటోలు, బైకులు, క్యాబ్ డ్రైవర్లకు బిగ్ రిలీఫ్ అవుతుందని పేర్కొంది. రైడ్ పరిమాణం లేదా ఆదాయంపై ఎటువంటి పరిమితులను ఉండవని పేర్కొంది.
కొత్త ప్రోగ్రామ్లో భాగంగా డ్రైవర్లు ఈ ప్రణాళికను ఎంచుకోవచ్చని చెప్పింది. కమీషన్ రూపంలో ఓలాకు వెళ్లే ఛార్జీలను ఎటువంటి మినహాయింపులు లేకుండా డ్రైవర్లు ఆ మొత్తాన్ని పొందవచ్చు. అయితే అందుకు నెలవారీ సబ్స్క్రిప్షన్ పొందాలని కంపెనీ తెలిపింది. ఈ ఫీచర్ను ఉపయోగించుకునే డ్రైవర్లు 30 రోజుల పాటు రోజుకు రూ.67 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అంటే నెలకు రూ.2,010 అవుతుంది.
ఇదీ చదవండి: వార్షిక టోల్ పాస్ను ప్రకటించిన కేంద్రం
ఈ ఫీచర్తో డ్రైవర్లు జీరో కమీషన్ క్లెయిమ్ చేసుకునే ఛార్జీలపై ఎలాంటి పరిమితులు లేవని, తమ ఛార్జీల మొత్తాన్ని క్లెయిమ్ చేసేటప్పుడు వాహనం ఎంపికపై కంపెనీ ఎలాంటి ఆంక్షలు విధించదని తెలిపింది. ఈ ఫీచర్ ఓలా ఆటో, ఓలా బైక్స్, ఓలా క్యాబ్స్కు అందుబాటులో ఉంది. ‘కమీషన్లను తొలగించడం వల్ల డ్రైవర్ భాగస్వాములకు మరింత అవకాశాలు లభిస్తాయి’ అని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మార్పు వల్ల డ్రైవర్ ఆదాయం ఏటా రూ.1,36,000 పెరుగుతుందని, ప్రస్తుత స్థాయిలతో పోలిస్తే ఇది 30 శాతం అధికమని చెప్పింది.