తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం జ్యేష్టాభిషేకం శాస్తోక్తంగా ప్రారంభమైంది. ఏటా మూడురోజుల పాటు తిరుమల శ్రీవారికి జ్యేష్టాభిషేకం నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా శాంతిహోమం చేశారు. శతకలశ ప్రతిష్ఠ ఆవాహన, నవకలశ ప్రతిష్ఠ ఆవాహన, కంకణ ప్రతిష్ఠ అనంతరం స్వామి, అమ్మవార్లకు అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం చేసి కంకణధారణ చేశారు.
ఆ తరువాత శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారికి వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో విహరించారు.


