Fastag: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం | govt introduced FASTag based Annual Pass priced at Rs 3000 | Sakshi
Sakshi News home page

Fastag: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం

Jun 18 2025 1:21 PM | Updated on Jun 18 2025 2:19 PM

govt introduced FASTag based Annual Pass priced at Rs 3000

టోల్‌ గేట్‌ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌ యాక్టివేషన్, రెన్యువల్‌ కోసం ప్రత్యేక లింక్‌ను త్వరలో రాజ్‌గార్‌ యాత్ర యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.

ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపద

ఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద వెయిటింగ్‌ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement