Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు | Air India crash UAE doctor pledges rs 6 crores to families of Medical students victims | Sakshi
Sakshi News home page

Air India Incident భారీ విరాళం ప్రకటించిన యూఏఈ వైద్యుడు

Jun 17 2025 4:10 PM | Updated on Jun 17 2025 5:32 PM

Air India crash UAE doctor pledges rs 6 crores to families of Medical students victims

యూఏఈ ఇండియన్​ డాక్టర్​ దాతృత్వం

మరణించిన వైద్య విద్యార్థులు, వైద్యుల కుటుంబాలకు రూ.6 కోట్ల విరాళం

Air India plane crash అహ్మదాబాద్‌లో జరిగిన  ఎయిరిండియా విమానం  171 ప్రమాదంలో ఘోర ప్రమాదం  వందల కుటుంబాల్లో విషాదాన్ని  నింపింది. ఈ ప్రమాంలో విమాన ప్రయాణికులతోపాటు,  అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన  బాధిత వైద్య విద్యార్థులు ,వైద్యుల కుటుంబాలను ఆదుకోవడానికి యుఏఈలో ఉండే భారతీయ డాక్టర్ షంషీర్ వాయాలిల్  (Indian doctor Shamshir Vayalil) ముందుకొచ్చారు.  సుమారు రూ. 6కోట్ల (2.5 మిలియన్ దిర్హామ్‌ సహాయాన్ని ప్రకటించారు..

కేరళకు చెందిన వైద్యుడు బహుళజాతి ఆరోగ్య సంరక్షణ సంస్థ , VPS హెల్త్‌కేర్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ డాక్టర్ వాయలిల్ మానవ్, ఆర్యన్, రాకేష్ , జైప్రకాష్‌లను "భవిష్యత్ ఫ్రంట్‌లైన్ హీరోలు" అంటూ వారికి నివాళి అర్పించారు. స్వయంగా మెడికల్ హాస్టల్‌లో చదువుకున్న ఆయన   వైద్య విద్యార్థుల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.   భోజనం తింటున్న సమయంలో హాస్టల్‌లో జరిగిన ప్రమాదంలపై ఆయన తీవ్రంగా చలించిపోయారు. ఈ నేపథ్యంలో యువ వైద్యుల కుటుంబాలకు అండగా నిలబడానికి నిర్ణయించుకున్నారు. అబుదాబి నుంచే ఆయన ఈ సాయాన్ని ప్రకటించారు. దీన్ని మరణించిన నలుగురు విద్యార్థుల కుటుంబాలలో ఒక్కొక్కరికి రూ. కోటి, తీవ్రంగా గాయపడిన ఐదుగురు విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షలు, సన్నిహితులను కోల్పోయిన  వైద్యుల కుటుంబాలకు రూ. 20 లక్షల అందించనున్నారు. బీజే మెడికల్ కాలేజీలోని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ద్వారా  డా. షంషీర్‌  ప్రకటించిన సాయం త్వరలోనే అందనుంది.

ప్రమాదం తర్వాత జరిగిన పరిణామాలను చూసినప్పుడు తాను తీవ్రంగా కలత చెందారట.  తాను హాస్ట్‌లో ఉంటూ చదువుతకుంటూ రోజులను తలచుకున్న ప్రమాద దృ‍శ్యాలను  చూసి చలించిపోయారట.  వాయలిల్ తాను చదువుకునే రోజుల్లో మంగళూరు (Mangalore)లోని కస్తూర్బా మెడికల్ కాలేజీ, చెన్నై(Chennai)లోని శ్రీ రామచంద్ర మెడికల్ కాలేజీ హాస్టళ్లలో ఉన్నారట. స్వయంగా వాయలిల్‌ అల్లుడు, లులు గ్రూప్ ఇంటర్నేషనల్ యజమాని M.A. యూసుఫ్ అలీ  తెలిపారు. మరోవైపు బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ కూడా అయిన  వాయలిల్‌ తన దాతృత్వాన్ని  చాటుకోవడం ఇదే మొదటి సారి కాదు 2010లో, మంగళూరు విమాన ప్రమాదం తర్వాత, బుర్జీల్ హోల్డింగ్స్‌లో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలను కల్పించారు.

ఇదీ చదవండి: Cancer Risk ఈ ఫుడ్స్‌తో ముప్పే..!డాక్టర్‌ వార్నింగ్‌


కాగా లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా విమానం AI-171 ,జూన్​ 12న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే   అతుల్య హాస్టల్ కాంప్లెక్స్‌లో కూలిపోయింది. ఈఘటనలో మెడికల్ కాలేజీ (BJMC) మెస్ భవనంలో భోజనం చేస్తుండగా మరణించిన వారి సంఖ్యను BJMC జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (JDA) ధృవీకరించింది . ప్రమాదంలో మరో 20 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలిపింది. వారిలో 11 మంది డిశ్చార్జ్ అయ్యారు, మిగిలిన  చికిత్స పొందుతున్నారని DA అధ్యక్షుడు డాక్టర్ ధవల్ గమేటి తెలిపారు. విద్యార్థుల ప్రాణనష్టంతో పాటు, "అతుల్యం" నివాస గృహాలలో నివసిస్తున్న సూపర్-స్పెషాలిటీ వైద్యుల నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఒక నివాస వైద్యుడి భార్య గాయపడి చికిత్స పొందుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement