
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసును ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అదే ద హంట్ (The Hunt: The Rajiv Gandhi Assassination Case). ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. జూలై 4 నుంచి సోనీలివ్లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ టీజర్ కూడా రిలీజ్ చేసింది. అందులో.. 'రాజీవ్ గాంధీ బతికే ఉన్నారా? ఆయనింకా బతికే ఉన్నారా?' అని శ్రీలంకలోని భారత హై కమిషనర్ కార్యాలయానికి ఫోన్ రావడంతో టీజర్ మొదలవుతుంది. బాంబు పేల్చి రాజీవ్గాంధీని చంపిందెవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? అన్న కోణాల్లో విచారణ మొదలుపెడతారు.
ప్రతి సెకను కూడా ముఖ్యమేనంటూ నిందితులను పట్టుకునే పనిలో ఉంటారు. తర్వాత ఏం జరిగిందన్నది తెలియాలంటే ఓటీటీలో సిరీస్ చూడాల్సిందే! ద హంట్కు నగేశ్ కుకునూర్ దర్శకత్వం వహించాడు. కాగా 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్లో నాటి దేశ ప్రధాని రాజీవ్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఆ సమయంలో లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం ఆత్మాహుతి దాడికి పాల్పడటంతో రాజీవ్ గాంధీ హతమయ్యారు.
The assassination that shook the nation. The manhunt that stunned the world.
The Hunt - The Rajiv Gandhi Assassination Case, streaming from 4th July on Sony LIV.#TheHuntOnSonyLIV pic.twitter.com/ExOXEZxYFK— Sony LIV (@SonyLIV) June 18, 2025