
సాక్షి, విజయవాడ: హైకోర్టులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు ఊరట లభించింది. జత్వాని వ్యవహారంలో తనపై నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టులో పీఎస్ఆర్ ఆంజనేయులు క్వాష్ పిటిషన్ వేశారు.
విచారణ చేపట్టిన హైకోర్టు.. ఈ కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది.