PSR Anjaneyulu
-
పీఎస్ఆర్ ఆంజనేయులకు మధ్యంతర బెయిల్
సాక్షి,విజయవాడ: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిల్ లభించింది. పీఎస్ఆర్కు జిల్లా అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హై బీపీ,గుండె సమస్యలతో బాధపడుతున్న పీఎస్ఆర్.. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ జిల్లా కోర్టును ఆశ్రయించారు.విచారణ చేపట్టిన కోర్టు పీఎస్ఆర్ మెడికల్ రిపోర్ట్ను అందించాలని ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పలు వైద్య చికిత్సలు చేశారు. అనంతరం రిపోర్టులను కోర్టుకు అందించారు. ఆ రిపోర్టులను పరిశీలించిన కోర్టు అనారోగ్య కారణాల దృష్ట్యా 14 రోజులకు పీఎస్ఆర్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.కాగా, ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల అబ్జర్వేషన్లో ఉన్న పీఎస్ఆర్ను మెరుగైన వైద్యం కోసం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించనున్నారు. -
పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్
సాక్షి, అమరావతి: ముంబయి సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో పీఎస్సార్ ఆంజనేయులు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీసు కస్టడీ, కేసులో పిటిషనర్ పాత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేస్తే పిటిషనర్ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేకాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసిందని, అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఓ అమాయక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్ చేయడంపై సీఆర్పీసీ సెక్షన్ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది. మీడియాతో మాట్లాడకూడదు ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందూ కూడా మాట్లాడటానికి వీల్లేదని పీఎస్సార్ ఆంజనేయులును హైకోర్టు ఆదేశించింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, చార్జిషీట్ దాఖలు చేసేంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, కోర్టులో పాస్పోర్ట్ సరెండర్ చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయరాదని హైకోర్టు చెప్పింది. -
తప్పుడు కేసా.. కాదా అన్నది మేము తేలుస్తాం
సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుపై నమోదు చేసిన కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. జత్వానీపై వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు తప్పుడు కేసని పోలీసులు చెప్పడంపై మండిపడింది. అది తప్పుడు కేసా.. కాదా.. అన్నది చెప్పాల్సింది సంబంధిత కోర్టే తప్ప.. పోలీసులు, ప్రభుత్వం కాదని తేల్చి చెప్పింది. ఎవరు అమాయకులు.. ఎవరు అమాయకులు కాదన్న సంగతి తేలుస్తామంది.పోలీసుల పని దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్ దాఖలు చేయడం వరకేనని స్పష్టం చేసింది. ఓ నిందితుడిపై పోలీసులు కేసు పెట్టినందుకు, తిరిగి ఆ పోలీసులపైనే కేసు పెడితే, ఇక దానికి అంతు అంటూ ఉండదని వ్యాఖ్యానించింది. ఇదో ప్రమాదకర తీరుగా మారుతుందని తెలిపింది. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమంది. వాస్తవాలను నిర్ధారించుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపింది. ఎవరినో సంతృప్తి పరచడానికి ఇలా కేసులు పెట్టడం ఎంత మాత్రం సరికాదంది. వందల సంఖ్యలో సాక్షులను విచారించడానికి ఇదేమైనా రాజీవ్ గాంధీ హత్య కేసా? అని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ దశలో తమ ముందుంచే సాక్ష్యాలకు ఎలాంటి విలువాలేదంది.బెయిల్ మంజూరుకు పీఎస్సార్ పిటిషన్జత్వానీ ఫిర్యాదు మేరకు నమోదు చేసిన కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ పీఎస్సార్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం మరోమారు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు ఎదుట ఆంజనేయులు తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నగేష్రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఈ కేసులో 60 మంది సాక్షులను విచారించారన్నారు. పలువురు పోలీసులకు ఇదే కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అలాగే తదుపరి చర్యలను కూడా నిలుపుదల చేసిందని వివరించారు. ఈ సందర్భంగా పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ తీవ్ర స్వరంతో స్పందిస్తూ, జత్వానీపై పెట్టిన కేసు తప్పుడు కేసని తెలిపారు. కేసు నమోదు చేయడానికి ముందే ఆంజనేయులు ఆదేశాల మేరకు జత్వానీ కోసం పలువురు పోలీసు అధికారులు ముంబయి వెళ్లారన్నారు. సాక్షుల వాంగ్మూలాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, పోలీసుల తీరుపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేపు ప్రతి నిందితుడు కూడా తమపై పెట్టింది తప్పుడు కేసేనంటూ, కేసు పెట్టిన పోలీసులపైనే కేసు పెట్టడం మొదలు పెడతారన్నారు. ఇలాంటి వాటికి అనుమతిస్తే పర్యవసానాలు ఊహకు కూడా అందవన్నారు. ఈ సమయంలో పీపీ లక్ష్మీనారాయణ స్పందిస్తూ, కేసు దర్యాప్తులో ఉండగానే దర్యాప్తు అధికారులను ఆంజనేయులు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారన్నారు. ఇప్పుడు బయటకు వస్తే కచ్చితంగా సాక్షులను ప్రభావితం చేస్తారని, దీని ప్రభావం కేసుపై పడుతుందని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ మంజూరు సందర్భంగా కఠిన షరతులు విధిస్తానన్నారు. ఇందుకు సంబంధించి సవివరంగా ఉత్తర్వులు కూడా ఇస్తానని స్పష్టం చేశారు. -
ఇంత నీచానికి దిగజారాలా.. నిజాయితీ గల అధికారిపై కిలాడీ లేడితో కుట్ర
-
బెయిలిస్తే సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో చెప్పండి
సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుకు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేయగలరో, దర్యాప్తునకు ఏ విధంగా ఆటంకం కలిగించగలరో చెప్పాలని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. దీని ఆధారంగా బెయిల్ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.ఈ కేసులో బెయిల్ కోరుతూ పీఎస్సార్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం జస్టిస్ లక్ష్మణరావు విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.నాగేష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ, గత 30 రోజులుగా పీఎస్సార్ ఆంజనేయులు జైల్లో ఉన్నారని తెలిపారు. దర్యాప్తు పూర్తయిందన్నారు. ఆధారాలన్నీ సేకరించిన నేపథ్యంలో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశమే లేదన్నారు.దర్యాప్తును ఎలా అడ్డుకుంటారు?సీఐడీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ, ఫిర్యాదుదారు జత్వానీకి విరుద్ధంగా ఆంజనేయులు, ఇతర అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారన్నారు. ఇదే విషయాన్ని ఈ కుట్రలో పాలుపంచుకున్న మరో ఐపీఎస్ అ«ధికారి విశాల్ గున్నీ శాఖాపరమైన విచారణ సందర్భంగా చెప్పారని తెలిపారు. ఆంజనేయులుకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేస్తారన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, శాఖాపరమైన విచారణలో చెప్పిన వివరాలను తామెలా పరిగణనలోకి తీసుకుంటామని ప్రశ్నించారు.సీఆర్పీసీ సెక్షన్ 161 లేదా 164 వాంగ్మూలం అయి ఉంటే దానిని పరిగణనలోకి తీసుకుని ఉండేవారమన్నారు. ఈ కేసు తప్పుడు కేసు అని సంబంధిత కోర్టు ఇప్పటికే అభిప్రాయపడిందని గుర్తు చేశారు. పిటిషనర్కు బెయిల్ ఇస్తే ఆయన సాక్షులను ఎలా ప్రభావితం చేస్తారో, దర్యాప్తును ఏ విధంగా అడ్డుకుంటారో చెప్పాలని అడ్వొకేట్ జనరల్కు స్పష్టం చేశారు. దీని ఆధారంగా బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని, అవసరమైన కఠిన షరతులు విధిస్తామని తెలిపారు. విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు. పీఎస్సార్పై ఏపీపీఎస్సీ కేసులో పూర్తి వివరాలు సమర్పించండిఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలు, నిధుల దుర్వినియోగం ఆరోపణలపై సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏపీపీఎస్సీ అప్పటి అదనపు కార్యదర్శి పెండ్యాల సీతారామాంజనేయులుపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు నమోదు చేసిన కేసులో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని సీతారామాంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.తనపై పోలీసులు చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, తాను అమాయకుడినని పీఎస్సార్ ఆంజనేయులు తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది. కాగా, ఏపీపీఎస్సీ మూల్యాంకనం కేసులో పీఎస్సార్ ఆంజనేయులు రిమాండ్ గురువారంతో ముగిసింది. దీంతో ఆయన్ను పోలీసులు 2వ అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరు పరిచారు. వచ్చేనెల 5వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
నేనుండగా మాన్యువల్ మూల్యాంకనం చేయలేదు
సాక్షి, అమరావతి: ‘నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ – 1 పరీక్ష పేపర్లను మాన్యువల్గా మూల్యాంకనం చేయలేదు. అందువల్ల అవకతవకలు, కుంభకోణానికి అవకాశమే లేదు..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానానికి నివేదించారు. మాన్యువల్ మూల్యాంకనం కోసం ‘కామ్సైన్’ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని స్పష్టం చేశారు. తాను కార్యదర్శిగా ఉన్న సమయంలో గ్రూప్ –1 పరీక్షల మాన్యువల్ మూల్యాంకనంలో అవకతవకలు జరిగినట్లు పోలీసులు నమోదు చేసిన అభియోగాలు పూర్తిగా అవాస్తవమన్నారు.ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలకు పాల్పడినట్లు టీడీపీ కూటమి సర్కారు నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులుపై దాఖలు చేసిన పీటీ వారెంట్ను విజయవాడ న్యాయస్థానం గురువారం విచారించింది. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం పీఎస్ఆర్కు న్యాయస్థానం ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. పీఎస్ఆర్ ఏమన్నారంటే.. ‘గ్రూప్ వన్ పేపర్లను డిజిటల్ మూల్యాంకనం చేయాలని అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్భాస్కర్ ప్రతిపాదించారు. ఆమేరకు డిజిటల్ మూల్యాంకనం చేశాం. దాన్ని సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మాన్యువల్గా మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై కొద్ది రోజులు తర్జనభర్జన పడ్డాం. కానీ ఉదయ్ భాస్కర్, ఇతర సభ్యులు ఏమాత్రం సహకరించలేదు. అనంతరం ఇన్చార్జ్ చైర్మన్గా నియమితులైన రమణారెడ్డి కొద్దికాలమే పదవిలో ఉన్నారు. ఇంతలో నాకు డీజీగా పదోన్నతి లభించింది. నన్ను బదిలీ చేస్తారనే సమాచారంతోపాటు ఏపీపీఎస్సీకి కొత్త చైర్మన్ను నియమిస్తారని తెలియడంతో గ్రూప్ వన్ పేపర్ల మూల్యాంకనంపై నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులైన గౌతమ్ సవాంగ్కు మొత్తం విషయాన్ని వివరించా. మాన్యువల్గానే మూల్యాంకనం చేయిద్దామని ఆయన అన్నారు. అందుకు అనుసరించాల్సిన విధి విధానాల గురించి అడగడంతో యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సబ్జెక్ట్ నిపుణులతో ప్యానల్ ఏర్పాటు చేసి మాన్యువల్గా పేపర్ల మూల్యాంకనంపై సమగ్ర నివేదిక సమర్పించా. ఆ తరువాత కొద్ది రోజులకే నన్ను డీజీగా మరోవిభాగానికి బదిలీ చేశారు. నేను బదిలీ అయిన తరువాత అప్పటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ మాన్యువల్గా మూల్యాంకనం చేయించారు. ఆ మూల్యాంకనం ఆధారంగానే ఫలితాలు ప్రకటించారు. వాటి ఆధారంగానే పోస్టింగులు కూడా ఇచ్చారు. ఇదీ వాస్తవం.కానీ నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా మాన్యువల్ మూల్యాంకనం చేయించినట్లు... అందులో అవకతవకలు జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది. ఏపీపీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఒకసారి డిజిటల్గా, రెండుసార్లు మాన్యువల్ మూల్యాంకనం చేసినట్టు... ఆ రెండింటిలో మాన్యువల్ మూల్యాంకనం నేను ఏపీపీఎస్సీ కార్యదర్శిగా ఉండగా చేసినట్లు పోలీసులు చెప్పడం పూర్తిగా అవాస్తవం. డిజిటల్గా ఒకసారి, మాన్యువల్గా ఒకసారి మాత్రమే మూల్యాంకనం చేశారు.మాన్యువల్ మూల్యాంకనం కూడా నేను ఏపీపీఎస్సీ కార్యదర్శి బాధ్యతల నుంచి వైదొలగిన తరువాతే చేశారు. కామ్సైన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్తో ఏపీపీఎస్సీకి సంబంధించిన క్వశ్చన్ బ్యాంకులు, ఇతర కాని్ఫడెన్షియల్ పనుల కోసమే నిబంధనల మేరకు ఒప్పందం చేసుకున్నాం. అందుకు బిల్లు చెల్లించాం. వీటిని వక్రీకరిస్తూ మాన్యువల్ మూల్యాంకనం కోసం ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు అభియోగాలు మోపడంలో నిజం లేదు’ అని పీఎస్ఆర్ ఆంజనేయులు కోర్టుకు నివేదించారు. -
పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్
-
ఈనాడు పేపర్నే కూటమి సర్కార్ ఫాలో అయ్యేది: ఉండవల్లి
తూర్పుగోదావరి, సాక్షి: సీనియర్ పోలీస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈనాడు పత్రికకు ఆంజనేయులిపై చాలా కక్ష ఉండి ఉండొచ్చని.. ఈ అరెస్ట్ పోలీస్ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలని అన్నారాయన. ఈ కేసులో అసలు ముంబై నటి ని రేప్ చేసారన్న వ్యక్తిపై ఏం చర్యలు తీసుకున్నారు?. ఆంజనేయులు లాంటి అధికారులను వేధించడం సరికాదు. ఇలా అయితే పోలీసులు ఎలా పని చేస్తారు?. ముంబైలో నమోదైన కేసులో ఏం జరుగుతుందో?. ఈనాడు పేపర్కు ఆంజనేయులిపై కక్ష చాలా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఈనాడు పేపర్లో ముందురోజు ఏమి వస్తుందో.. ఆ తర్వాతి రోజు ప్రభుత్వం అదే ఫాలో అవుతోంది అని ఉండవల్లి అన్నారు. ఆంధ్రా నుంచి ఎవరూ మాట్లాడరా?ఏపీ రీఆర్గనైజేషన్ చట్టానికి సంబంధించి 11 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేసిన రోజు ఇదేనని ఉండవల్లి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుటి వరకూ అఫిడవిట్ ఫైల్ చేయలేదు. 2023లో రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ ఫైల్ చేసింది. నేనే 43 సార్లు పార్టీ ఇన్ పర్సన్ గా కోర్టుకు హాజరయ్యాను. విభజన చట్టంలో ఆంధ్రా కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని ఒక ఆర్డర్ ఇవ్వండని కోర్టును కోరాం. ఆంధ్ర నుంచి ఈ విషయం ఎవరూ మాట్లాడరు. పబ్లిక్ మీటింగ్లో మాత్రం ఆంధ్రాకు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నారు.. కానీ ఎక్కడ మాట్లాడాలో అక్కడ ప్రజాప్రతినిధులు మాట్లాడటం లేదు. గతంలో పవన్ కళ్యాణ్ ఈ కేసుకు సంబంధించి అనుకూలంగా స్పందించారు.. అందుకే ఆయనకు లెటర్ రాశాను.. ఇప్పటికే స్టేట్ గవర్నమెంట్ వేసిన పిటిషన్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ ను తీసుకువచ్చి వాదన వినిపించమని కోరుతున్నా. ప్రజాస్వామ్యానికి అతి ప్రధానమైన ఆర్టికల్ 100 లోక్సభలో ఏపీ రిఆర్గనైజేషన్ చట్టం చేసే సమయంలో సక్రమంగా అమలు కాలేదు అని ఉండవల్లి ఆవేదన వ్యక్తం చేశారు. -
PSRపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
-
రెడ్బుక్ ఎఫెక్ట్: పీఎస్ఆర్ ఆంజనేయులిపై మరో కేసు
విజయవాడ, సాక్షి: వైఎస్సార్సీపీ హయాంలో పని చేసిన అధికారులపై కూటమి సర్కార్ రెడ్బుక్ ప్రయోగం మామూలుగా జరగడం లేదు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులిపై కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ముంబై నటి జత్వానీ కేసులో ఆయనకు బెయిల్ లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో.. ఆయన బయటకు రాకుండా ఉండేందుకు మరో కేసు నమోదు చేయించింది. గతంలో.. ఏపీపీఎస్సీ సెక్రటరీగా ఉన్న సమయంలో గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలకు పాల్పడ్డారంటూ కొత్త అభియోగాలను తెరపైకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో విజయవాడ సూర్యారావు పేట పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు అయ్యింది. సీఎస్తో ఆదేశాలు జారీ చేయించి మరీ విచారణ జరిపిస్తోంది. ఆంజనేయులిపై కూటమి కుట్రలను వైఎస్సార్సీపీ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ హయాంలో పని చేసిన అధికారులను లక్ష్యంగా చేసుకుని.. వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ మరీ వాళ్లపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ఇతర నేతలు ఖండిస్తూ వస్తున్నారు. ఇదీ చదవండి: ఫేక్న్యూస్ ఫ్యాక్టరీలతో చంద్రబాబు చేస్తోంది ఇదే! -
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్ఆర్ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్లో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
పక్కా ప్లాన్ తోనే అరెస్ట్.. బట్టబయలైన కూటమి సర్కార్ కుట్ర
-
పక్కా కక్షే... అక్రమ కేసే
సాక్షి, అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులుపై టీడీపీ కూటమి సర్కారు పక్కా పన్నాగంతో అక్రమ కేసు నమోదు చేసింది. సీఐడీ దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ కుట్రలను బహిర్గతం చేసింది. వలపు వల విసిరి బడాబాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబై నటి కాదంబరి జత్వానీతో అబద్ధపు ఫిర్యాదు ఇప్పించేందుకు ఎంతటి పన్నాగంతో వ్యవహరించారో బయటపడింది. ఆమెపై గతంలో నమోదైన క్రిమినల్ కేసులు దర్యాప్తు ఉండగానే వాటిని వక్రీకరిస్తూ... భారత సాక్ష్యాధారాల చట్టానికి విరుద్ధంగా కక్ష పూరితంగా అక్రమ కేసు నమోదు చేసినట్లు స్పష్టమైంది. తాను ఎలాంటి తప్పూ చేయలేదని... జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న తనకు ఎలాంటి సంబంధం లేదని పీఎస్ఆర్ ఆంజనేయులు తన వాదనలను న్యాయస్థానంలో స్వయంగా వినిపించారు. ఈ కేసులో ఆయనకు న్యాయస్థానం 14 రోజులు రిమాండ్ విధించింది. మరోవైపు ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గతంలో చేసిన ఫిర్యాదుతో నమోదు చేసిన అక్రమ కేసులోనూ పీఎస్ఆర్ పేరును చేరుస్తూ సీఐడీ మెమో దాఖలు చేయడంతోపాటు మరిన్ని అక్రమ కేసులకు ప్రభుత్వం సిద్ధమైంది.జత్వానీ అబద్ధపు ఫిర్యాదు.. అక్రమ కేసుటీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకు ఉపక్రమించింది. అందుకోసం కాదంబరీ జత్వానీని సాధనంగా చేసుకుంది. విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్కు చెందిన భూములను ఫోర్జరీ పత్రాలతో విక్రయించేందుకు యత్నించిన కేసులో ఆమె నిందితురాలు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాదంబరి జత్వానీ ఒక్కసారిగా రాష్ట్ర ప్రభుత్వ గౌరవ అతిథిగా మారిపోయారు. అక్రమ కేసు నమోదుకు రంగం సిద్ధం చేస్తూ ముందుగా 2024 ఆగస్టులో టీడీపీ అనుకూల చానల్తో ఆమెను మాట్లాడించారు. వెంటనే విజయవాడ పోలీసులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమెను 2024 సెప్టెంబరు 5న విజయవాడకు రప్పించడంతో ఏసీపీతోపాటు విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబును కలిశారు. వారం రోజులు ఆమె విజయవాడలోనే ప్రభుత్వ అతిథి హోదాలో ఉన్నారు. ఈ కేసులో విచారణ అధికారిగా నియమించాలని అప్పటికే నిర్ణయించిన ఉమామహేశ్వరరావు ఆమెకు కుట్ర కేసు నమోదు కథను వివరించారు. అనంతరం 2024 సెప్టెంబరు 13 అర్ధరాత్రి కాదంబరీ జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిరా>్యదు చేయడం... వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చకచకా జరిగిపోయాయి.జత్వానీ ఫోర్జరీ పత్రాలపై కేసు విచారణలో ఉండగానే పోలీసులపై ఫిర్యాదా..!పీఎస్ఆర్ ఆంజనేయులుపై అక్రమ కేసు నమోదు చేసేందుకే కాదంబరీ జత్వానీతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదు చేయించినట్లు సీఐడీ నివేదిక ద్వారా స్పష్టమవుతోంది. కుక్కల విద్యా సాగర్కు చెందిన భూములను విక్రయించేందుకు వాటిని 2018లో కొనుగోలు చేసినట్టు ఆమె 2023లో ఫోర్జరీ పత్రాలు సృష్టించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆ కేసు ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉంది. కానీ తనపై అక్రమ కేసు పెట్టారని జత్వానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఫిర్యాదు చేయడం గమనార్హం. అవి ఫోర్జరీ పత్రాలో.. కావో అన్నది పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలుతుంది. అంతిమంగా న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వాలి. అంతేగానీ ఇంకా దర్యాప్తులో ఉన్న కేసులోని అభియోగాలు తప్పని చెబుతూ నిందితులు పోలీసులపైనే ఫిర్యాదు చేస్తే వెంటనే కేసు నమోదు చేయడం నిబంధనలకు విరుద్ధం. అదే విధానంగా మారితే దేశంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్న అన్ని క్రిమినల్ కేసుల్లోనూ నిందితులు తిరిగి పోలీసులపై ఫిర్యాదు చేసి అక్రమ కేసులు పెట్టేందుకు అనుమతించినట్టే అవుతుంది. తప్పు చేయలేదు... జత్వానీ ఎవరో తెలియదుతనపై నమోదు చేసిన అక్రమ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు న్యాయస్థానంలో స్వయంగా వాదనలు వినిపించారు. కాదంబరి జత్వానీపై గతంలో విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని విస్పష్టంగా ప్రకటించారు. సివిల్ పోలీసులు పర్యవేక్షించే క్రిమినల్ కేసులు, ఇతర దర్యాప్తులతో ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న తనకు ఎలాంటి సంబంధం ఉండదని పోలీసు సర్వీసు నియమావళిని ఉటంకిస్తూ వివరించారు. జత్వానీ తనపై చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా అవాస్తవాలన్నారు. అందుకే తాను కనీసం ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదని న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. తనపై అబద్ధపు అభియోగాలతోనే పోలీసులు, సీఐడీ అధికారులు అక్రమ కేసు నమోదు చేశారన్నారు. ఈ కేసులో మరో నిందితుడు ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇవ్వలేదనే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. పోలీసుల ఒత్తిడితో ఆయన నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన వాంగ్మూలాన్ని పరిగణలోకి తీసుకోకూడదని కోరారు. తాను సదా అందుబాటులో ఉన్నానని... దర్యాప్తునకు పూర్తిగా సహకరించేందుకు సిద్ధమని చెప్పినా సరే సీఐడీ అధికారులు తనను అక్రమంగా అరెస్టు చేశారన్నారు.అబద్ధపు వాంగ్మూలం కోసం పీఎస్ఆర్పై ఒత్తిడిఈ కేసులో అబద్ధపు వాంగ్మూలాల కోసం సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయులపై ఒత్తిడి తేవడం గమనార్హం. ఆయన్ను హైదరాబాద్లో అరెస్టు చేసే సమయంలో తన వద్ద ఉన్న ఒకే ఒక్క ఫోన్ను సీఐడీ అధికారులకు అప్పగించారు. అదే విషయాన్ని అధికారులకు చెప్పడంతో వారు సమ్మతించారు. కానీ పీఎస్ఆర్ను విజయవాడకు తీసుకువచ్చిన తరువాత సీఐడీ అధికారులు మధ్యవర్తుల నివేదిక పేరుతో ఓ పత్రాన్ని తెచ్చి సంతకం చేయాలని పేర్కొన్నారు. అందులో ఆయన వద్ద ల్యాప్టాప్, ఐప్యాడ్, మరో సెల్ ఫోన్ ఉన్నాయని అంగీకరించినట్లుగా పొందుపరిచారు. దీనిపై పీఎస్ఆర్ ఆంజనేయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తన వద్ద లేని ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నట్టుగా రాసేందుకు నిరాకరించారు. హైదరాబాద్లో తన ఇంటి వద్దే అన్ని విషయాలు చెప్పానని, ఇప్పుడు ఇలా అబద్ధపు వాంగ్మూలం రాయమని చెప్పడం ఏమిటని నిలదీశారు. తమపై ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి ఉందని సీఐడీ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేయడం గమనార్హం. ఇదే విషయాన్ని పీఎస్ఆర్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.సాక్ష్యాధారాల చట్టం వక్రీకరణ...పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టి వెంటనే స్వాధీనం చేసుకున్నారని కాదంబరి జత్వానీ తన ఫిర్యాదులో పేర్కొనడం మరో అబద్ధపు అభియోగం. విచారణ జరుగుతున్న కేసులో భారత సాక్ష్యాధారాల చట్టాన్ని వక్రీకరించేందకు తెగించడం గమనార్హం. డ్రగ్స్, గంజాయి, ఇతర స్మగ్లింగ్ నిరోధక కేసుల్లో దేశవ్యాప్తంగా పోలీసులు, కస్టమ్స్ అధికారులు అనుసరించే విధానాన్నే నాడు విజయవాడ పోలీసులు పాటించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా ఫోర్జరీ పత్రాలు లభించాయి. పోలీసులే తన చేతిలో ఫోర్జరీ పత్రాలు పెట్టారని ఆమె ప్రస్తుతం తప్పుడు అభియోగాలు మోపడం వెనుక కూటమి ప్రభుత్వ పెద్దల పన్నాగం ఉంది.టిఫిన్ కూడా పెట్టకుండా.. సీఐడీ అధికారులు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు పట్ల మానవత్వం లేకుండా, అగౌరవంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆయన్ని బుధవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన అనంతరం న్యాయస్థానానికి తరలించారు. ఆయనకు కనీసం టిఫిన్ కూడా పెట్టలేదు. అనంతరం మధ్యాహ్నం రిమాండ్ కోసం విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. పీఎస్ఆర్పై మరిన్ని అక్రమ కేసులు నమోదు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.⇒ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు గతంలో ఇచ్చిన అబద్ధపు ఫిర్యాదులో పీఎస్ఆర్ ఆంజనేయులును ఇరికించేందుకు కుట్ర పన్నుతున్నారు. తనను సీఐడీ అధికారులు హింసించారని రఘురామ గతంలో ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు దీన్ని తోసిపుచ్చినప్పటికీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పటి సీఐడీ డీజీ పీవీ సునీల్కుమార్తోపాటు ఇతర అధికారులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులును కూడా చేరుస్తూ న్యాయస్థానంలో సీడీఐ బుధవారం మెమో దాఖలు చేయడం గమనార్హం. అసలు ఆయనకు సీఐడీతో ఎలాంటి సంబంధం లేదు. ఆ సమయంలో ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా లేరు. ఏసీబీ డీజీగా ఉన్నారు. అయినా సరే పీఎస్ఆర్ను ఆ కేసులో నిందితుడుగా చేర్చడం విస్మయం కలిగిస్తోంది.⇒ పీఎస్ఆర్ ఆంజనేయులు గతంలో ఏపీపీఎస్పీ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ సమయంలో కొన్ని ఫైళ్లు కనపడకుండా పోయాయంటూ దాదాపు నాలుగేళ్ల తరువాత ఏపీపీఎస్పీ కార్యదర్శితో తాజాగా ఫిర్యాదు ఇప్పించడం కూటమి సర్కారు కుట్రలకు నిదర్శనం.⇒ గతంలో పీఎస్ఆర్ ఆంజనేయులు తనను బెదిరించారంటూ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణతో టీడీపీ ప్రభుత్వం ఇటీవల అబద్ధాలతో ఫిర్యాదు ఇప్పించింది. ఆ ఫిర్యాదును సీఐడీకి తాజాగా పంపించడం ప్రభుత్వ కుటిల పన్నాగానికి నిదర్శనం. -
జత్వానీ కేసుతో నాకేం సంబంధం లేదు: పీఎస్ఆర్ స్వీయ వాదనలు
విజయవాడ, సాక్షి: ముంబై నటి జత్వానీ కాదంబరి కేసుతో తనకేం సంబంధం లేకపోయినా ఇబ్బంది పెడుతున్నారని సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు(PSR Anjaneyulu) అన్నారు. బుధవారం ఉదయం ఆయన్ని సీఐడీ పోలీసు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. రిమాండ్ కోసం వాదనలు జరగ్గా.. తన కేసులో తానే పీఎస్ఆర్ వాదనలు వినిపించారు.ముంబయి నటి జెత్వానీ కాదంబరిని వేధించారంటూ ఏపీ సీఐడీ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులును మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ బేగంపేటలోని నివాసం నుంచి ఆయన్ని అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. ఈ ఉదయం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. జత్వానీ కేసులో ఏం జరిగిందనేది జడ్జి ముందు స్వయంగా వాదనలు వినిపించారు. తన పాత్ర లేకపోయినా కేసు పెట్టారని వాదించారు. అసలు ఈ కేసులో ఏం జరిగిందనే అంశాలను జడ్జికి వివరించారు. మాజీ డీసీపీ విశాల్ గున్నీని ప్రొటెక్ట్ చేస్తామని ప్రభుత్వం నుంచి హామీ రావడంతో అప్రూవర్గా మారారు. 164 స్టేట్ మెంట్ ఇవ్వమని విశాల్ గున్నీని అడిగినా.. ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. ఈ కేసులో తనకు సంబంధం లేని విషయాలను చెప్పించారు అని జడ్జి ముందు పీఎస్ఆర్ వాపోయారు. అయితే వాదనలు ముగిసిన అనంతరం పీఎస్ఆర్కు సీఐడీ కోర్టు వచ్చే నెల 7వ తేదీదాకా రిమాండ్ విధించారు. దీంతో విజయవాడ సబ్ జైలుకు ఆయన్ని తరలించనున్నారు.ఇదీ చదవండి: పీఎస్ఆర్ అరెస్ట్పై వైఎస్ జగన్ ఏమన్నారంటే..