Nandyala
-
నంద్యాల: పంటి నొప్పితో వెళ్తే.. ప్రాణం తీసిన ఆర్ఎంపీ వైద్యుడు
సాక్షి, నంద్యాల జిల్లా: పంటి నొప్పితో వెళితే ఓ వైద్యుడు ప్రాణం తీశాడు. సంజామల మండల కేంద్రంలో ఆర్ఎంపీ వైద్యుడి నిర్వాకంతో మహిళ మృతి చెందింది. సంజామల మండలం చిన్న కొత్తపేట గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి (52) రెండు రోజులుగా పంటి నొప్పి ఉండటంతో ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు వెళ్లింది. ఇంజెక్షన్ నరానికీ ఇవ్వగా ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.దీంతో 108 ద్వారా కోవెలకుంట్ల ఆసుపత్రికి ఆర్ఎంపీ వైద్యుడు తరలించగా, అప్పటికే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విషయం తెలుసుకున్న ఆర్ఎంపీ వైద్యుడు పరారిలో ఉన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. -
పొగాకు రైతుకు కంపెనీల కాటు
ఆత్మకూరు: అంతర్జాతీయంగా పేరొందిన కంపెనీలు నేరుగా రైతుల వద్దకు వచ్చాయి. పొగాకు సాగు చేయండి క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పాయి. ఆ మేరకు రైతులతో ఒప్పందం కూడా చేసుకున్నాయి. కంపెనీల మాటలు నమ్మి వేలాది ఎకరాల్లో రైతులు పొగాకు సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు ప్లేటు ఫిరాయించాయి. అధికంగా పొగాకు సాగు చేశారంటూ కొనుగోలు చేయకుండా మోసం చేశాయి. దీంతో కంపెనీల మాటలు నమ్మి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే తమ ఇళ్లు, పొలాలు, ఆస్తులన్నీ అమ్మినా అప్పులు తీరవని నంద్యాల జిల్లాకు చెందిన పొగాకు రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 20 రోజులుగా కొనుగోళ్లు నిలిపివేత గతేడాది పొగాకు సాగు తక్కువగా ఉండటంతో రైతులను ప్రోత్సహించేందుకు ఐటీసీ, చుక్కబర్రి కంపెనీలు ముందుకొచ్చాయి. క్వింటా రూ.15,500 చొప్పున కొనుగోలు చేస్తామని గతేడాది ఆగస్టు, సెపె్టంబర్ నెలల్లో రైతులతో ఒప్పందం చేసుకున్నాయి. దీంతో జిల్లాలో 17,215 ఎకరాల్లో పొగాకును సాగుచేశారు. ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి, నంద్యాల, పాణ్యం, ఓర్వకల్లు, నందికొట్కూరు, బేతంచెర్ల, నంద్యాల ప్రాంతాల్లోని రైతులు అత్యధికంగా పొగాకును సాగుచేశారు. కంపెనీల అగ్రిమెంట్ ఉండటంతో కొందరు రైతులు కౌలుకు తీసుకుని 50 ఎకరాలు కూడా సాగు చేశారు. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. రైతుల ఇళ్లు, కల్లాల వద్ద కుప్పలు కుప్పలుగా పొగాకు కనిపిస్తోంది. జిల్లా మొత్తం మీద 2,06,580 క్వింటాళ్ల పొగాకు దిగుబడి వచి్చంది. అయితే, తాము అగ్రిమెంట్ ఇచ్చిన దానికంటే రైతులు ఎక్కువగా పొగాకు సాగు చేశారని, దిగుబడి కూడా పెరిగిందని కంపెనీలు కొనుగోళ్లు నిలిపివేశాయి. సీజన్ ప్రారంభంలో కేవలం 20 నుంచి 40 శాతం పొగాకు మాత్రమే కొనుగోలు చేశాయి. దాదాపు 20 రోజులుగా కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేశాయి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో రైతుల వద్ద రూ.150 కోట్లకు పైగా విలువైన పొగాకు నిల్వలు ఉన్నాయి.మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది మా ఇంటి వద్ద 100 క్వింటాళ్ల పొగాకు ఉంది. లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పొగాకును సాగు చేశా. కంపెనీలు పొగాకు సాగు చేయాలని చెప్పాయి. అగ్రిమెంట్ కూడా చేసుకున్నాం. కానీ నేటికీ పొగాకును కొనుగోలు చేయలేదు. ఏమి చేయాలో తెలియడం లేదు. పొగాకును వర్షంలో తడవకుండా కాపాడుకోలేకపోతున్నాం. ప్రభుత్వం పొగాకు రైతులను ఆదుకోవాలి. – రామచంద్రుడు, రైతు, కొత్త రామాపురం నంద్యాల జిల్లాపొలం, ఇల్లు అమ్మినా అప్పులు తీరవు ఎనిమిది ఎకరాల్లో పొగాకు సాగుచేశాం. 80 క్వింటాళ్లకు పైగా పొగాకు నిల్వ ఉంది. కంపెనీలు ఎప్పుడు కొనుగోలు చేస్తాయో చెప్పడం లేదు. ఇప్పటికే లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాం. ఆ అప్పులు ఎలా తీర్చాలో కూడా తెలియడం లేదు. కంపెనీలు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేయపోతే మా పొలం, ఇల్లు అమ్ముకున్నా అప్పులు తీరే పరిస్థితి కనిపించడం లేదు. – శంకర్, రైతు, ఆత్మకూరు, నంద్యాల జిల్లాకంపెనీలపై ప్రభుత్వం ఒత్తిడి తేవాలి ప్రభుత్వ పెద్దలు తరచూ కంపెనీలు పొగాకు కొనుగోలు చేస్తాయని ప్రకటిస్తున్నారు. కానీ మా జిల్లాలో మాత్రం కంపెనీలు 20 రోజులుగా రైతుల నుంచి కిలో పొగాకు కొనలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం సీరియస్గా స్పందించాలి. కంపెనీలపై ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ ప్రకారం పొగాకు కొనుగోలు చేసేలా చూడాలి. – రవీంద్ర, రైతు, కొత్త రామాపురం, నంద్యాల జిల్లా -
సీఐపై దాడి కేసులో ఏడుగురికి జైలు, జరిమానా
కర్నూలు: స్థానిక బంగారుపేటలో కబ్జాకు గురైన ప్రభుత్వ భూమిలోని ఆక్రమణల తొలగింపు సమయంలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్న సీఐ పార్థసారధిరెడ్డిపై దాడి చేసిన ఏడుగురు నిందితులకు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధిస్తూ కర్నూలు అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి దివాకర్ బుధవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు 2021 నవంబర్ 30న అక్రమ కట్టడాలను తొలగించేందుకు బందోబస్తుగా అప్పటి రెండో పట్టణ సీఐ పార్థసారధిరెడ్డి, కోడుమూరు సీఐ శ్రీధర్ సిబ్బందితో బంగారుపేటలోకి వెళ్లారు. సాయంత్రం 4 గంటల సమయంలో జేసీబీతో ఆక్రమణలు తొలగిస్తుండగా కొంతమంది రాళ్లతో పోలీసులపై దాడి చేయగా సీఐకి గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్స అనంతరం టూటౌన్లో ఫిర్యాదు చేశారు. బంగారుపేటకు చెందిన లక్ష్మి, నీలిషికారి బెల్కీ, ఎన్.నరసింహులు, నీలిషికారి సుగుణ, ప్రసాద్, నీలి షికారి నాగమణి, నీలిషికారి బెగినిలపై అభియోగపత్రాలు దాఖలు చేశారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి నిందితులకు జైలు, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. రేపటి నుంచి క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పో కర్నూలు (టౌన్): ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు స్థానిక ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయనున్న క్రెడాయ్ ప్రాపర్టీ ఎక్స్ పోను మంత్రి టీజీ భరత్ ప్రారంభించనున్నట్లు క్రెడాయ్ కర్నూలు చైర్మన్ గోరంట్ల రమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కర్నూలు, నంద్యాల పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా, బొగ్గు ల దస్తగిరి, కలెక్టర్ పి.రంజిత్బాషా, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మేయర్ బీవై.రామ య్య, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొంటారన్నారు. ప్రాపర్టీ షోలో 60 మంది బిల్డ ర్లు, నిర్మాణ వస్తువుల సరఫరాదారులు, ఇంటీరియర్ డిజైనర్లు పాల్గొంటారన్నారు. ప్రధాన స్పాన్సర్గా రాగమయూరి బిల్డర్స్, కో స్పాన్సర్గా స్కందాన్షి ఇన్ ఫ్రా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఆటో పెవిలియన్ అదనపు ఆకర్షణగా నిలుస్తుందని, క్రెడాయ్ కన్వీనర్ ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, కోశాధికారి టీఏవీ ప్రకాష్, ఇతర క్రెడాయ్ సభ్యులు పాల్గొంటున్నట్లు తెలిపారు. -
వర్షానికి కూలిన బ్రిడ్జి
కల్లూరు: మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలోని గంజివాగు బ్రిడ్జి కూలిపోయింది. మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతోపాటు మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లక్ష్మిపురం గ్రామంలోని గంజివాగుపై ఉన్న బ్రిడ్జి కూలిపోవడంతో రైతులకు రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. అధికారులు స్పందించి బ్రిడ్జి మరమ్మతులకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు గ్రామంలో పర్యటించారు. గంజివాగుపై కూలిన బ్రిడ్జితోపాటు గ్రామంలోని కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. -
రేపు జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు
ఓర్వకల్లు: మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ఈనెల 23న జాతీయ స్థాయి ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. బుధవారం వారు మాట్లాడుతూ హనుమజ్జయంతి సందర్భంగా నిర్వహించే పోటీలలో మొదటి ఆరు స్థానాల్లో నిలిచిన ఎడ్ల యజమానులకు వరుసగా రూ.60 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలు, రూ.5 వేల చొప్పున నగదు బహుమతులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న ఎడ్ల యజమానులు అదే రోజు ఉదయం 7 గంటల్లోగా రూ.500 ప్రవేశ రుసుం చెల్లించి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9502653201, 9949865259, 9398283631 నంబర్లను సంప్రదించాలన్నారు. అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్ మద్దికెర: మండలంలోని బురుజుల వద్ద హంద్రీనీ వా కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. బుధవారం కాలువ వెంబడి మట్టిని తరలిస్తుండగా అదుపుతప్పి టిప్పర్ కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు స్పందించి వెంటనే డ్రైవర్ను బయటకు తీసి చికిత్స కోసం గుంతకల్లు వైద్యశాలకు తరలించారు. -
ముందే వచ్చిన వర్షాకాలం!
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● గూడూరులో 49.2 మిమీ వర్షపాతం నమోదు ● తగ్గిన ఉష్ణోగ్రతలు కర్నూలు(అగ్రికల్చర్): ఈ సారి వానాకాలం ముందే వచ్చినట్లుంది. కొద్ది రోజులుగా జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు హాలహర్వి, ఆస్పరి, దేవనకొండ, చిప్పగిరి, తుగ్గలి మండలాలు మినహా మిగిలిన అన్ని మండలాల్లో వర్షాలు కురిశాయి. గూడూరులో అత్యధికంగా 49.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కోడుమూరులో 47.6, కల్లూరులో 38.8, హొళగుందలో 19.4, గోనెగండ్లలో 16.4, సీ.బెళగల్లో 13.4, కౌతాళంలో 12.6, ఓర్వకల్లులో 12.4 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తం మీద సగటున 11 మి.మీ వర్షపాతం నమోదైంది. మే నెలకు సంబంధించి 21వ తేదీ వరకు సాధారణ వర్షపాతం 27.2 మి.మీ ఉండగా... 77.9 మి.మీ వర్షపాతం నమోదైంది. హంద్రీకి ఒక మోస్తరుగా నీరు వచ్చింది. కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. గరిష్టంగా 36 డిగ్రీల వరకు మాత్రమే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రానున్న రెండు, మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 17 వేల క్యూసెక్కుల వరదనీరు సి.బెళగల్: కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో దాదాపు 17 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నది పూర్తి స్థాయిలో రెండు దడులను తాకుతూ వరదనీరు ప్రవహిస్తుండటంతో నదికి జలకళ సంతరించుకుంది. కాగా మండల పరిధిలోని తుంగభద్ర తీర ప్రాంత గ్రామాల్లో రైతులు ముందస్తు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్డీఎస్ జళకళ కోసిగి: మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ (ఆర్డీఎస్) ఆనకట్టపై తుంగభద్ర నది జళకళ సంతరించుకుంది. మండలంతో పాటు నదితీర పై ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు వర్షపు నీరు నదికి చేరుకున్నాయి. దీంతో ఆర్డీఎస్ ఆనకట్టపై రెండు అడుగుల మేర ఎత్తులో ఎక్కి దిగువ ప్రాంతం కర్నూలు వైపు ప్రవహిస్తోంది. ముందస్తు వర్షాలు కురిసి నది పుష్కలంగా ప్రవహించడంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
బెస్తలకు రాజకీయగుర్తింపు ఇవ్వాలి
కర్నూలు(అర్బన్): బెస్తలకు రాజకీయ గుర్తింపు ఇవ్వాలని అఖిల భారత బెస్త మహాసభ రాష్ట్ర కోకన్వీనర్ టి.సాయిప్రదీప్ కోరారు. బుధవారం స్థానిక బిర్లా కాంపౌండ్ సమీపంలోని డాక్టర్ బ్రాహ్మారెడ్డి ప్రజా వైద్యశాల సమావేశ భవనంలో బెస్త ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ముందుగా భగవాన్ శ్రీ వ్యాస మహర్శి చిత్ర పటానికి నేతలు పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిప్రదీప్ మాట్లాడుతూ బెస్తలు రాజకీయ పదవులకు నోచుకోవడం లేదన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం రావాల్సిన రాజ్యాంగపరమైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు కోల్పోయినా, కనీసం రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవుల్లోనూ బెస్తలకు అవకాశం కల్పించకపోవడం దారుణమన్నారు. త్వరలో ప్రకటించనున్న మార్కెట్యార్డు, దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు, ఇతర పదవుల్లో బెస్తలను నియమించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. సమావేశంలో నాయకులు భాస్కర్రావు, ఉదయ్, పీజీ వెంకటేష్, ఆనంద్రాజు, జయన్న, ఎద్దుల వెంకటేశ్వర్లు, గ్యాస్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
వక్ఫ్ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి
● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కర్నూలు(సెంట్రల్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ముస్లింపర్సనల్ లా బోర్డు రాష్ట్ర కన్వీనర్ రఫిక్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ ఏక్యాంపులోని ఎంఎంఐ షాదీఖానాలో సయ్యద్ జాకీర్ మౌలానా రషీద్ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేవీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, న్యాయవాది సుబ్బయ్య, అవాజ్ కమిటీ కార్యదర్శి ఎస్ఎండీ షరీఫ్, మైనార్టీ నాయకుడు షేక్ హఫీజ్, ఇలియాజ్, సమాచారహక్కు నాయకులు జయన్న, ఎమ్మార్పీఎస్ నాయకుడు కిరణ్, కాంగ్రెస్ మీడియా ఇన్చార్జ్ అమానుఉల్లా తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఫిక్ అహ్మద్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం ముస్లింలపై వివక్ష చూపుతోందని, అందులో భాగంగానే వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 25 మానవహారం, 27న ఎస్టీబీసీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహిస్తామని, జూన్ 3న మహిళలతో సమావేశం ఉంటుందని తెలిపారు. -
వినిపిస్తుందో లేదో మిషన్ నిర్ధారిస్తుంది
కర్నూలు(హాస్పిటల్): పుట్టుకతో చెవుడు...మూగ సమస్యతో బాధపడుతుంటారు కొందరు. ఇలాంటి వారికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆడియోమెట్రి పరీక్షలు నిర్వహించి వినికిడి సామర్థ్యాన్ని నిర్ధారిస్తారు. ఇప్పటివరకు ఈ యంత్రాన్ని అమరిస్తే వినిపిస్తుందా లేదా అని రోగి సంజ్ఞలు చేస్తే దానిని బట్టి నివేదికలు ఇచ్చేవారు. దీనిని ఆసరగా చేసుకుని కొందరు ఎలాంటి సమస్య లేకపోయినా ఉన్నట్లు నటించి వికలాంగ సర్టిఫికెట్లు పొంది ప్రభుత్వ పథకాలు అందుకుంటున్నారు. ఇలాంటి వాటిని చెక్పెట్టేందుకు ఇప్పుడు బేరా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఈఎన్టీ విభాగం ఓపీ వద్ద ఏర్పాటు చేసిన బేరా పరీక్ష కేంద్రాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఎన్టీ హెచ్వోడి డాక్టర్ వీరకుమార్ మాట్లాడుతూ బేరా పరీక్ష ద్వారా రోగికి వినిపిస్తుందా లేదా అన్నది మిషనే నిర్ధారిస్తుందన్నారు. సదరం సర్టిఫికెట్లతో పాటు వినికిడి లోపం, శ్రవణ నాడీ రుగ్మతలు, వినికిడిని ప్రభావితం చేసే నాడీ సంబంధిత పరిస్థితులను నిర్ధారించడంలో ఈ బేరా టెస్ట్ మిషన్ సహాయపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎస్ఆర్ఎంవో డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్ శివబాలనాగాంజన్, ఈఎన్టి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ హరికృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ చిన్న లింగన్న, డాక్టర్ మమతాదేవి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్
● 16 మోటార్ బైక్లు స్వాధీనంఎమ్మిగనూరురూరల్: గత కొంత కాలంగా మోటార్ బైక్ల దొంగతనమే తన ప్రవృత్తిగా మార్చుకొని చోరీలకు పాల్పడుతున్న దొంగను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగ నుంచి 16 మోటార్ బైక్లను రికవరీ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక పట్టణ పోలీస్స్టేషన్ అవరణలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ మధుసుధన్రెడ్డి వివరాలు వెల్లడింఆచరు. సాంకేతిక పరిజ్ఞానం, సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించినట్లు చెప్పారు. సి.బెళగల్ మండలం పొలకల్ బీసీ కాలనీకి చెందిన ఉప్పరి వీరేష్, అదే గ్రామానికి చెందిన వర్థన్ అలియాస్ ఇక్బాల్, కోడుమూరుకు చెందిన అబ్దుల్ కలామ్ అలియాస్ మచ్చాలు ముఠాగా ఏర్పడి మోటార్ బైక్ల చోరీలకు చేయటం మొదలు పెట్టినట్లు చెప్పారు. మీరి ముగ్గురిపై పట్టణ పోలీస్స్టేషన్లో 11 , కర్నూల్ –2 టౌన్లో 2, కర్నూల్ తాలూకా స్టేషన్లో 1, సి. బెళగల్ స్టేషన్లో 1, కర్నాటక రాష్ట్రం బళ్లారి గాంధీనగర్ పోలీస్స్టేషన్లో 1 చొప్పున కేసులు ఉన్నాయన్నారు. ఏ1 నిందితుడు ఉప్పర వీరేష్ పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్ ఉప్పర కాలనీ కొట్టాల దగ్గర అనుమాన్పదంగా సంచరిస్తున్నట్లు సమాచారం రావటంతో వెళ్లి పట్టుకొన్నట్లు చెప్పారు. విచారణలో మోటార్ బైక్లను దొంగతనం చేసినట్లు అంగీకరించటంతో అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. బైక్ల కేసులో ఇప్పటికే కోడుమూరుకు చెందిన అబ్దుల్కలాం అలియాస్ మచ్చా కర్నూల్ తాలూకా పోలీస్స్టేషన్లో ఉన్నాడని, మరో నిందితుడు సి. బెళగల్ వర్థన్ అలియాస్ ఇక్బాల్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. పట్టబడిన 16 మోటార్ బైక్ల విలువ రూ. 16.50 లక్షలు ఉంటుందని తెలిపారు. -
నాటుసారా స్వాధీనం
కర్నూలు: ఎకై ్సజ్ అధికారులు 55 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ తన సిబ్బందితో కాల్వ గ్రామ సమీపంలో బుధవారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడుంబాయి తండాకు చెందిన మాలవత్ ధను నాయక్ ద్విచక్ర వాహనంపై 40 లీటర్ల సారా తీసుకెళ్తూ ఎకై ్సజ్ అధికారులను చూసి బైక్, 40 లీటర్ల సారాను వదిలేసి పారిపోయారు. సారాతోపాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని కర్నూలు ఎకై ్సజ్ స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి ధను నాయక్ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. గుమ్మితం తండాలో నాటుసారా బట్టీలపై దాడులు జరిపి వార్తే వీరాంజనేయ నాయక్ వద్ద 15 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని అతనిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి జైలుకు పంపారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ నవీన్బాబు, కానిస్టేబుళ్లు మురహరిరాజు, మధు, రామలింగయ్య, ఈరన్న, చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలను అప్రమత్తం చేయాలి
బొమ్మలసత్రం: భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు స్తంభాలు, చెట్ల కింద ఉండకుండా అప్రమత్తం చేయాలని పోలీస్ అధికారులకు ఎస్పీ అధిరాజ్సింగ్రాణా సూచించారు. బుధవారం తన కార్యలయంలో ఆయన మాట్లాడారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉన్న వారు వర్షం పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన విజిబుల్ పోలీసింగ్లో భాగంగా బహిరంగ ప్రదేశంలో మద్యం సేవిస్తున్న 94 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శ్రీశైలంలో తొట్టెల నిర్మాణం శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని పైకప్పుల నుంచి లీకేజీ అరికట్టేందుకు దేవస్థానం చర్యలకు ఉపక్రమించింది. ఇందుకోసం సున్నపు, జాజికాయ, బెల్లం తదితర వస్తువుల మిశ్రమాన్ని కలుపుకునేందుకు ఆలయంలో పలు ప్రదేశాలలో తొట్టెల నిర్మాణం చేపడుతున్నారు. పూణేలోని ఉత్తరాదేవి చారిటబుల్ట్రస్ట్ వారితో పురాతన పరిరక్షణ పద్ధతులను అనుసరించి ఆలయంలో పైకప్పుల నుంచి లీకేజీని అరికట్టే పనులు చేపడుతున్నారు. దేవాలయాల ప్రాంగణంలో పరిరక్షణ పనులు చేపట్టడం శుభపరిణామమని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. గతంలో (1965–70, 2013–14 సంవత్సరాల్లో) శ్రీశైల ఆలయంలో స్థానభ్రంశం చెందిన నిర్మాణాలను యథాతధం చేసిన తరువాత పరిరక్షణ పనులు చేపట్టాలని కోరారు. మందులపై తప్పుడు ప్రకటనలు ఇస్తే చర్యలు ● ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి కర్నూలు(హాస్పిటల్): ప్రజలను తప్పుదోవ పట్టించేలా మందుల వినియోగంపై ప్రకటనలు ఇస్తే చర్యలు తీసుకుంటామని ఔషధ నియంత్రణ శాఖ ఏడీ రమాదేవి హెచ్చరించారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ అధిక బరువు తగ్గిస్తామని, పలు రకాల వ్యాధులు నయం చేస్తామని సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చిన పలు సంస్థలపై ఇటీవల కేసులు నమోదు చేశామన్నారు. అందులో ఇండోర్కు చెందిన ఈమాన్ డ్రగ్స్, నందికొట్కూరుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి, బనగానపల్లి మండలం బానుముక్కల గ్రామంలోని పక్షవాత నివారణ కేంద్రాలపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కర్నూలు నగరంలోని గణేష్నగర్ సమీపంలోని పార్థగ్రాండ్లో ఫిజీషియన్ శాంపిల్స్ అక్రమంగా నిల్వ ఉంచుకున్న ఉదయ్కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఇతనిపై ఇప్పటికే పలుమార్లు కేసులు ఉన్నట్లు తెలిపారు. అలాగే నంద్యాలలో శ్రీ వైష్ణవి మెడికల్స్పై డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి మత్తును కలిగించే మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కర్నూలు(అర్బన్): సీ క్యాంప్లోని ప్రభుత్వ శారీరక వికలాంగుల వసతి గృహంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయో వృద్దుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా కోరారు. హాస్టల్లో 3వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇతర కోర్సులు చదివే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తామని పేర్కొన్నారు. నిబంధనల మేరకు వంద మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని ఒక ప్రకటనలో తెలిపారు. వివరాలకు కార్యాలయ ఫోన్ నంబర్ 08518–277864ను సంప్రదించాలన్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు ప్రారంభం కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. కర్నూలులో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో మొదటి రోజున ఉదయం 1,247 మందికి గాను 1,177 మంది, మధ్యాహ్న సెషన్లో 1,255 మందికి గాను 1,182 మంది హాజరయ్యారు. నంద్యాలలోని మూడు కేంద్రాల్లో మొదటి రోజు ఉదయం 544 మందికి గానూ 520 మంది, మధ్యాహ్నం 543 మందికి గానూ 523 మంది హాజరయ్యారు. ఈ నెల 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. -
దివ్యాంగులకు రీవెరిఫికేషన్ కష్టాలు
బనగానపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్ పొందుతున్న దివ్యాంగులు తమ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. బుధవారం బనగానపల్లె ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు కొలిమిగుండ్ల, బి ఉప్పలూరు, నాగశెట్టిపల్లి, హనుమంతుగుండం, ఎర్రగుడి గ్రామాలకు చెందిన సుమారు 70 మంది దివ్యాంగులు వచ్చారు. ఉదయం 8 గంటలకు వచ్చినా వైద్యాధికారులు మ ధ్యాహ్నం 12 వరకు అందుబాటులో లేరు. ఆ తర్వాత వచ్చిన వైద్యులు వచ్చినా సర్వర్ పని చేయలేదంటూ సంబంధిత సిబ్బంది సాయంత్రం 5 గంటల వరకు బయోమెట్రిక్ వేయించు కోలేదు. మళ్లీ గురు, శుక్రవారం రావాలంటూ సిబ్బంది పేర్కొనడంతో దివ్యాంగులు తీవ్ర ఆవేదన చెందుతూ వెనుతిరిగి పోయారు. -
ఇంటి వద్ద రేషన్ పంపిణీ బంద్
ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు పెంచలమ్మ. శిరివెళ్లకు మజరా గ్రామమైన వెంకటేశ్వరపురంలో నివాసం ఉంటున్నారు. రేషన్ బండి రాకపోతే గతంలో లాగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే శిరివెళ్లకు వెళ్లాలని ఈమె చెబుతున్నారు. వృద్ధాప్యంలో కాలినడకన ఎలా వెళ్లి తెచ్చుగోలనని ఈమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ● ఎండీయూ వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం ● 1 నుంచి రేషన్ దుకాణాల వద్దనే పంపిణీ ● కిలోమీటర్లు నడిచి వెళ్లి రేషన్ తెచ్చుకోవాల్సిన దుస్థితి ● ఆందోళనలో 5,41,804 మంది రేషన్ కార్డుదారులు ● రోడ్డున పడనున్న 702 మంది ఎండీయూ ఆపరేటర్లు, హెల్పర్లు ఆళ్లగడ్డ: రేషన్ కార్డుదారులకు ఐదేళ్లు దూరమైన రేషన్ కష్టాలు మళ్లీ పునఃప్రారంభం కానున్నాయి. ఇంటివద్దకే వచ్చి రేషన్ ఇచ్చే ఎండీయూ వాహనాల వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. జూన్ 1 నుంచి పాత పద్ధతిలో రేషన్ దుకాణాలవద్దనే సరుకులు పంపిణీ చేయనున్నారు. ఇక మీదట రేషన్ సరుకులు తెచ్చుకోవాలంటే తండాలు, గూడేలతో పాటు శివారు కాలనీల వాసులు రాళ్లు రప్పలు దాటుకుంటూ ఎంతదూరమైనా దుకాణం దగ్గరకు వెళ్లాల్సిందే. రోడ్డున పడనున్న ఆపరేటర్లు, హెల్పర్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2021లో ఇంటి వద్దనే రేషన్ సరుకులు అందించే ప్రక్రియను ప్రారంభించింది. జిల్లాలో 351 ఎండీయూ వాహనాలు ఉండగా 351 మంది ఆపరేటర్లు, 351 మంది హెల్పర్లను నియమించారు. ఒక్కో వాహనానికి నెలకు రూ. 21 వేలు అందిస్తున్నారు. రెండు, మూడు దుకాణాల పరిధిలో కార్డుదారులకు ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకు నిత్యావసరాలను అందిస్తూ వచ్చారు. అనేక మంది ఆపరేటర్లు, హెల్పర్లు దీన్నే జీవనాధరంగా చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎండీయూ వాహనాల నిలిపివేస్తే 702 కుటుంబాలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది. వీరి జీవనాధారం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తారని భావించి ఓటేసి అధికారం కట్టబెడితే తమ కడుపులు కొట్టడం భావ్యం కాదని ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని కోరుతున్నారు. 2027 వరకు ఒప్పందం ఇంటింటికీ రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా ఎండీయూ నిర్వాహకులకు 2027 వరకు ఒప్పందం ఉంది. వాహనాల కంతులు సైతం అప్పటివరకూ బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. ఎండీయూ వాహనం ధర రూ 5.80 లక్షలు కాగా అందులో 10 శాతం లబ్ధిదారులు చెల్లించాల్సి ఉండగా.. మిగిలింది ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఇందుకు గాను ఎండీయూ నిర్వాహకుడు రూ. 3 వేలు చెల్లిస్తుండగా మిగిలిన రూ. 8 వేలు ప్రభుత్వం ప్రభుత్వం నెలలా చెల్లిస్తోంది. ఇప్పుడు ఈ పథకాన్ని రద్దు చేస్తే ఈ ఒప్పందాన్ని ఏం చేస్తారని చర్చించుకుంటున్నారు. జిల్లాలోని తెల్ల రేషన్ కార్డులు 5,41,804ప్రతి నెలా కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం7,600 టన్నులుజిల్లాలోని రేషన్ దుకాణాలు 1,204ఎండీయూ హెల్పర్లు 351ఎండీయూ ఆపరేటర్లు 351ఎండీయూ వాహనాలు 351 -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో రెండు, మూడేళ్ల క్రితం కావేరి–జాదు రకం బీటీ పత్తి విత్తనాలు రైతులను నిండా ముంచేశాయి. 17 మండలాల్లో దాదాపు 2,400 ఎకరాల్లో పత్తి దెబ్బతినగా.. 1,899 మంది రైతులు నష్టపోయారు. ఎకరాకు 3 క్వింటాళ్ల వరకు నష్టం జరిగిందని, క్వింటాకు రూ.7,300 ప్
బీటీ పత్తి విత్తనాలకు సొంత ధ్రువీకరణ ● కంపెనీల తీరుపై వ్యవసాయ శాఖ మీనమేషాలు ● కో–మార్కెటింగ్ పేరిట బీటీ పత్తి విత్తన వ్యాపారం ● సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్ల పేరుతో దందా ● తరచూ విత్తనం కారణంగా దెబ్బతింటున్న పంట ● గతంలో నిండా ముంచిన ‘కావేరి–జాదు’ ● బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్లు బ్లాక్ విక్రయాలుకర్నూలు(అగ్రికల్చర్): ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రాష్ట్రం మొత్తం మీద పత్తి 5,28,361 హెక్టార్లలో సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా. ఇందులో ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే దాదాపు 50 శాతం వరకు సాగవుతోంది. కర్నూలు జిల్లాలో 2,34,409 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 18,827 హెక్టార్లలో పత్తి సాగయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నల్లరేగడి నేలలు ఎక్కువగా ఉండటం వల్ల దశాబ్దాలుగా పత్తి రైతుల పాలిట తెల్ల బంగారం అవుతోంది. ఇక్కడ హైబ్రిడ్ పత్తి, బీటీ పత్తి విత్తనోత్పత్తి కూడా ఎక్కువగా ఉంటోంది. విత్తన కంపెనీల దృష్టి కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాపైనే ఉండటం గమానార్హం. రాష్ట్రం మొత్తం మీద జరిగే మార్కెటింగ్ ఒక ఎత్తు అయితే, ఇక్కడి మార్కెటింగ్ మరో ఎత్తు. జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండటంతో పత్తి సాగుకు విత్తనాలు సిద్ధం చేసుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ఇక్కడ కో–మార్కెటింగ్, సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్.. ఇలా రకరకాల పేర్లతో పత్తి విత్తన ప్యాకెట్లను అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏది ఒరిజినల్, ఏది నకిలీ తెలుసుకోవడం రైతులకు కష్టంగా మారింది. వాస్తవానికి కో–మార్కెటింగ్ అనేది లేదు. కానీ అనధికారికంగా సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేర్లతో రైతులను దగా చేస్తున్నా వ్యవసాయ శాఖ చేష్టలుడిగి చూస్తోంది. జిల్లాలో 250 కంపెనీలు దాదాపు 1000 దాకా బీటీ పత్తి విత్తన రకాలను మార్కెట్లోకి విడుదల చేయడం గమనార్హం. పంట దెబ్బతింటే దేవుడే దిక్కు! పత్తి విత్తన నాణ్యతపై వ్యవసాయ శాఖకు ఎలాంటి సంబంధం లేదు. ఆయా కంపెనీలే సొంతంగా ధ్రువీకరించుకుంటున్నాయి. ఈ కారణంగా పంట దెబ్బతింటే ఆయా కంపెనీలదే పూర్తి బాధ్యత. అయితే పంట దెబ్బతిన్న సమయంలో వాతావరణ పరిస్థితులను కారణంగా చూపుతూ కంపెనీలు చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పంట దెబ్బతిన్నప్పుడు పరిహారం ఇవ్వకుండా తప్పించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 2024 ఖరీఫ్ సీజన్లో కూడా ఒక పేరొందిన కంపెనీ విత్తనంతో సాగు చేసిన పత్తి పలు చోట్ల దెబ్బతినింది. అయితే ఆ కంపెనీ వ్యవసాయ యంత్రాంగాన్ని ముడుపులతో లోబరుచుకొని ఇతర కారణాలతో పంట దెబ్బతిన్నట్లు రిపోర్టు ఇవ్వడం గమనార్హం. బ్లాక్లో పత్తి విత్తనాలు ఈ సారి పత్తి సాగు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నందున ఈ నెల చివరి వారం నుంచే పత్తి విత్తనాలు నాటుకునేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వందల కంపెనీలు, రకాలు మార్కెట్ను ముంచెత్తుతున్నా.. వీటికి అనుమతులు ఉన్నాయా, లేదా అని వ్యవసాయశాఖ పటించుకున్న పాపాన పోవడంలేదు. ప్రధానంగా రెండు కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్లను బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లాలోకి ఒకవైపు తెలంగాణ నుంచి, మరోవైపు కర్ణాటక నుంచి అనధికార పత్తి విత్తన ప్యాకెట్లు జిల్లాలోకి వెల్లువెత్తుతున్నాయి. పశ్చిమ ప్రాంతంలో పత్తి లూజు విత్తనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఆదోని, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో నకిలీలు, అనుమతి లేని విత్తనాలను జోరుగా అమ్మకాలు సాగిస్తున్నా వ్యవసాయ శాఖ నుంచి స్పందన కరువైంది. హెచ్టీ పత్తి సాగు ప్రమాదకరం పత్తిలో హెచ్టీ విత్తనాలకు కేంద్రం ఇంతవరకు అనుమతి ఇవ్వలేదు. పత్తిలో కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. హెచ్టీ పత్తిలో కలుపు నివారణకు గ్లైపోసేట్ మందును పిచికారి చేస్తే కలుపు నాశనం అవుతుంది తప్ప.. పత్తి పంటకు ఏమీ కాదు. హెర్బిసైడ్ టాలరెంట్(హెచ్టీ) బీటీ పత్తి విత్తనాలు జీవవైవిధ్యానికి ప్రమాదకరమనే ఉద్దేశంతో కేంద్రం వీటికి అనుమతివ్వలేదు. అయినప్పటికీ కొంతమంది రైతులు హెచ్టీ పత్తి సాగు చేస్తున్నారు. ఇటీవల వ్యవసాయ శాఖ నుంచి వచ్చిన ప్రత్యేక టీమ్ వచ్చి హెచ్టీ పత్తి విత్తనాలను గుర్తించేందుకు తనిఖీలు జరిపి పరీక్షలు నిర్వహించారు. అయితే తూతూమంత్రంగా పరీక్షలు నిర్వహించారనే చర్చ జరుగుతోంది. బీటీ టెక్నాలజీని మ్యాన్శ్యాంటో కంపెనీ తెచ్చింది. బీటీ టెక్నాలజీని పొంది విత్తనోత్పత్తి, ప్యాకింగ్, మార్కెటింగ్ చేసుకోవాలంటే మ్యాన్శ్యాంటో నుంచి లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ కంపెనీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో 45 కంపెనీలకు లైసన్లు ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే ఒక్క కంపెనీకి మాత్రమే లైసన్స్ ఉంది. కో–మార్కెటింగ్ పేరుతో ఉమ్మడి జిల్లాలో 10 వరకు కంపెనీలు ఉండగా.. సిస్టర్ కన్సల్టెన్సీ, సబ్ డీలర్స్ పేరుతో వందలాది కంపెనీల బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల మార్కెటింగ్లో నిమగ్నమయ్యాయి. 450 గ్రాముల బీటీ–2 పత్తి విత్తన ప్యాకెట్ ఎంఆర్పీ రూ.901. నూజివీడు కంపెనీ రేవంత్ రకం ప్యాకెట్లను రూ.1,300 పైబడిన ధరతో అమ్ముతున్నట్లు తెలుస్తోంది. యుఎస్ అగ్రీ కంపెనీకి చెందిన 7067 రకాన్ని రూ.1,200 వరకు బ్లాక్లో అమ్మకాలు సాగిస్తున్నట్లు సమాచారం. -
ఆళ్లగడ్డలో అడుగుపెట్టనివ్వను!
ఆళ్లగడ్డ: ‘పార్టీలో నా ప్రమేయం లేకుండా పదవులు ఇస్తున్నారు. నాకు తెలియకుండా ఎవరికైనా పదవి ఇస్తే ఊరుకోను. వారిని నియోజకవర్గంలో అడుగుపెట్టనిచ్చేది లేదు..’ అని ఆళ్లగడ్డలో సోమవారం రాత్రి జరిగిన మినీ మహానాడులో టీడీపీ అధిష్టానానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అల్టిమేటం జారీ చేశారు. ఆమె వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి. శిరివెళ్ల మండలానికి చెందిన నరసింహారావుకు టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయనకు జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వొద్దని ఎమ్మెల్యే అఖిలప్రియ అధిష్టానానికి చెప్పడంతోపాటు అదే మండలానికి చెందిన శ్రీకాంత్రెడ్డికి ఇవ్వాలని సూచించినట్లు తెలుస్తోంది. అయినా అధిష్టానం ఆమె మాట లెక్క చేయకుండా నరసింహారావుకే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతోనే మినీ మహానాడులో అధిష్టానానికి అఖిలప్రియ వార్నింగ్ ఇచ్చినట్లు టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు.అఖిలప్రియకు షాక్.. ఇన్చార్జిగా వాసు? ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న ఘటనలపై మీడియాలో వరుస కథనాలు రావడంతో పార్టీ పరువుపోతోందని అఖిలప్రియపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉన్నట్లు సమాచారం. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ను కలిసేందుకు ఆమె వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదనే చర్చ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. దీనికితోడు ఇటీవల అమరావతిలో ప్రధానమంత్రి సభకు అఖిలప్రియకు పాస్లు పంపకపోవడం, సీఎం కర్నూలుకు వచ్చినప్పుడు కూడా ఆమెకు ఆహ్వానం లేకపోవడంతో అక్కడకు వెళ్లలేదన్న అంశాలు సైతం చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో అధిష్టానంపై తిరుగుబాటు చేసేందుకైనా సిద్ధమని మినీ మహానడు వేదికగా అఖిలప్రియ హెచ్చరిక జారీ చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారని, ఆళ్లగడ్డకు టీడీపీ ఇన్చార్జిగా సీపీ వాసును నియమించేందుకు రంగం సిద్ధమైందనే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజర్
నంద్యాల(న్యూటౌన్): పదవ తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు 356 మంది గైర్హాజరైనట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. జిల్లాలో 35 పరీక్ష కేంద్రాల్లో 504 మంది విద్యార్థులకు గాను 148 మంది విద్యార్థులు (29.36) శాతం పరీక్షకు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్, 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే ఓపెన్ స్కూల్ పదవ తరగతి పరీక్షల్లో భాగంగా ఇంగ్లిష్ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 105 మంది విద్యార్థులకు గాను 86 మంది హాజరు కాగా 19 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలి నంద్యాల(న్యూటౌన్): తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్లో పని చేస్తున్న కెప్టెన్, డ్రైవర్స్కు కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి, అనంతరం కలెక్టర్ కార్యాలయ ఏఓ రవికుమార్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, బాలవెంకట్, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిషన్లు మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐదు నెలలకు ఒక సారి కాకుండా ప్రతి నెల జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీఐటీయూ అనుబంధ యూనియన్ అధ్యక్షుడు ఖాజా, రఫీ, ప్రధాన కార్యదర్శి రాజేంద్రప్రసాద్, ట్రెజరర్ సుభాన్, వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, రసూల్, ఖాదర్, బాషా, మనోహర్, తదితరులు పాల్గొన్నారు. తూనికలు, కొలతలపై అవగాహన నంద్యాల(వ్యవసాయం): పంచ కొలతల దినోత్సవం సందర్భంగా స్థానిక రిటైల్ మర్చంట్ వ్యాపారస్తుల కార్యాలయంలో మంగళవారం తూనికలు, కొలతలపై వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు ప్రకొలతల జిల్లా సహాయ అధికారి జిలాని బాషా ఆధ్వర్యంలో అవగామన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనాలన్నారు. ప్యాకేజీ వస్తువులపై ఎమ్మార్పీ, తయారీ తేదీలు తప్పక ప్రకటించి ఉండాలన్నారు.జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడు న్యాయవాది అమీర్బాషా ఆహార పదార్థాలు, పెట్రోలు, బంగారు వస్తువుల విక్రయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు అడ్డగాళ్ల మల్లికార్జున, అధికారులు అనిత, ఖాజా హుసేన్ నాగప్రసాద్ అల్లూరయ్య శ్రీనివాసు గుప్తా, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలం డిగ్రీ కళాశాలకు నాక్ గ్రేడ్ శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్ట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు నాక్ అక్రిడిటేషన్ కమిటీ ‘బి’ గ్రేడ్ను మంజూరు చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హుస్సేన్బాషా మంగళవారం తెలిపారు. కళాశాలలో బోధన, వసతులు, తరగతి గదులు, క్యాంటీన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, పచ్చదనం, పరిశుభ్రత అంశాలను అక్రిడిటేషన్ కమిటీ పరిశీలించింది. అలాగే కళాశాల డెవలెప్మెంట్ కమిటీ, అలూమినీ అసోషియేషన్ సహకారం పరిగణలోకి తీసుకొని ‘బీ’ గ్రేడ్ను మంజూరు చేసింది. ఈ సందర్భంగా అలూమిని అసోసియేషన్ అధ్యక్షుడు సాల్మన్ మాట్లాడుతూ భవిష్యత్లో ‘ఎ’ గ్రేడ్ సాధించేందుకు తమ వంతు కృషి చేస్తామని, అందుకు ప్రస్తుత విద్యార్థులు, పూర్వ విద్యార్ధులు సహకరించాలని కోరారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించండి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులును సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బాలనాగన్న, నాగరాజు, కాశన్న, దేవదానం, రవికాంత్ బాబు, రమేష్ నాయక్, వెంకటేష్ నాయక్, మురళీ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాలను ఎప్పటికపుడు విచారించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. కేసు వివరాలతో కూడిన నివేదికలను వారం రోజులకు ముందుగానే డీవీఎంసీ సభ్యులు అందజేయాలన్నారు. ఏప్రిల్ 2022 నుంచి మార్చి 2025 వరకు 287 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు కాగా 471 మంది బాధితులకు సంబంధించి రూ.6.27 కోట్ల పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు లేవనెత్తిన అంశాలు, గ్రామాల్లో శ్మశాన వాటికల ఏర్పాటుపై సంబంధిత ఆర్డీఓలు, అధికారులు దృష్టి పెట్టాలన్నారు. సఫాయి కర్మాచార్యులకు తగిన సౌకర్యాలు కల్పిస్తాం... సఫాయి కర్మాచారులు కాలువలు పరిశుభ్రం చేసేటప్పుడు తగిన మాస్కులు, గ్లౌజులు అందజేస్తామన్నారు. అదే విధంగా సఫాయి కర్మాచారులకు సకాలంలో వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నంద్యాల ఏఎస్పీ మంద జావలి అల్ఫోన్స్, నంద్యాల, డోన్, ఆత్మకూరు ఆర్డీఓలు విశ్వనాథ్, నరసింహులు, అరుణజ్యోతి, ఐటీడీఏ పీఓ వెంకట శివప్రసాద్, అదనపు మున్సిపల్ కమీషనర్ దాస్, డీఎంహెచ్ఓ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు. -
ఐఐటీ/నీట్ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష
కర్నూలు(అర్బన్): 2025–26 విద్యా సంవత్సరా నికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఐఐటీ/నీట్ అకాడమీ ల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్ఎంఎస్ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్ లోడ్ చేసుకున్న హాల్టికెట్ లేదా పాత హాల్టికెట్ తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామ న్నారు. సమాచారం కోసం http://apbragcet. apcfss.inను సందర్శించాలని డీసీఓ కోరారు. గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరి శీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్మెంట్ పనులు పూర్తి చేస్తేనే గోరు కల్లు రిజర్వాయర్లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్, డీఈఈలు జ్యోతి, గీతారాణి పాల్గొన్నారు. మైనారిటీలకు సబ్సిడీ రుణాలు ● దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్ ఈడీ ఎస్.సబీహా పర్వీన్ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూ రవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https:// apobmms. apcfss.in) వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219ను సంప్రదించవచ్చన్నారు. -
రైతు సంక్షేమానికి పెద్దపీట వేసి అన్నదాతకు అడుగడుగునా సాయమందించి అండగా నిలుస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. మొదటి ఏడాదిలో ఖరీఫ్, రబీ సీజన్లు ముగిసినా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. మరో పది రోజుల్లో మళ్లీ ఖరీఫ్ సీజన్ ప్రారంభంకానుండటంతో ఈ ఏడాద
● అన్నదాత సుఖీభవపై కూటమి సర్కారు ప్రకటనలకే పరిమితం ● రూ. 20 వేల సాయం మొదటి సంవత్సరం ఉత్తిదే! ● మళ్లీ పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభం ● ఈ ఏడాదైనా భరోసా దక్కేనానని అనుమానం సాగుకు పొలాన్ని సిద్ధం చేస్తున్న రైతు వైఎస్సార్సీపీ పాలనలో ఇలా.. కోవెలకుంట్ల: పంటల సాగుకు ఏటా పెట్టుబడి పెరిగిపోతుంది. విత్తనం, సేద్యం, రసాయన ఎరవులు, పురుగు మందులు, కూలీలు.. ఇలా ఎన్నో ఖర్చులు. పెట్టుబడికి అప్పులు చేయడం, పంటలు చేతికందక నష్టపోవడం రైతులకు పరిపాటిగా మారింది. అండగా నిలవాల్సిన కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి విస్మరిస్తోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో 2.51 లక్షల మంది రైతులు ఉన్నారు. ముందస్తు వర్షాలు ఆశాజనకంగా మారటంతో ఖరీఫ్ సాగుకు సమాయత్తమవుతున్నారు. గతేడాది వరి, మిరప సాగుతో తీవ్ర నష్టాలు చవిచూసిన రైతులు ఆ నష్టాన్ని ఈ ఏడాది పూడ్చుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. వరిసాగులో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడులు మాత్రమే రావడం, బస్తా రూ. 12 వందలు కూడా ధరలేకపోవడంతో నష్టపోయారు. మిరపలో ఎకరాకు 20 క్వింటాళ్లకు మించి దిగుబడులు రాకపోవడం, క్వింటా రూ. 8 వేలు ధర పలకపోవడంతో నష్టాల ఊబిలో కూరక పోయారు. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పేరుతో ఏటా రూ. 20 వేలు ఇస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర లేదు. జిల్లా వ్యాప్తంగా రబీ సీజన్లో అధిక విస్తీర్ణంలో పప్పుశనగ పంట సాగు చేయగా వర్షాభావం, తెగుళ్లు వెంటాడి దిగుబడులు తగ్గిపోగా మద్దతు ధర లేక పంట ఉత్పత్తులను ఇప్పటి వరకు గోదాముల్లో భద్రపరుచుకున్నారు. రెండు సీజన్లలో పంటలు నష్టపోయినా ప్రభుత్వసాయం దక్కలేదు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. రబీసీజన్లో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు దెబ్బతినడంతో జిల్లాలోని బనగానపల్లె, సంజామల, కొలిమిగుండ్ల, ఉయ్యాలవాడ, బేతంచెర్లను కరువు మండలాలుగా ప్రకటించినా ఇప్పటి వరకు ఆ మండలాలకు ఎలాంటి కరువు సాయం అందలేదు. కేంద్రబృందం పర్యటించినా అందని సాయం.. 2023–24 సంవత్సరంలో రబీ సీజన్లో ఆయా వర్షాభావ పరిస్థితుల్లో 38,801 హెక్టార్లలో శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర 16 రకాల పంటలు దెబ్బతిన్నట్లు అప్పట్లో అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాకు నష్టపరిహారం కింద రూ. 37.76 కోట్ల అవసరమవుతాయని ఆ నివేదికలో పేర్కొన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు కేంద్రబృందం గత ఏడాది జూన్ నెల 20వ తేదీన జిల్లాలో పర్యటించింది. కోవెలకుంట్ల మండలం భీమునిపాడు గ్రామంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటల్లో తీవ్ర నష్టం వాటిల్లి పెట్టుబడులు నేలపాలయ్యాయని రైతులు కేంద్రబృ ందం ఎదుట ఏకరువు పెట్టారు. శనగ, జొన్న, మినుము, కంది, మొక్కజొన్న, తదితర పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోయారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేలు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. వర్షాభావంతో రైతులకు జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, నివేదికలను ప్రభుత్వానికి పంపంచి అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్రబృందం హామీ ఇచ్చింది. జిల్లాలో కేంద్రబృందం పర్యటించి ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు పంటనష్ట పరిహారం ఊసే లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గత ఐదేళ్లలో రైతు భరోసా సాయం వివరాలు సంవత్సరం రైతులసంఖ్య అందిన సాయం (లక్షల్లో) (రూ. కోట్లలో) 2019-20 2.09 283.31 2020-21 2.15 291.51 2021-22 2.15 291.05 2022-23 2.21 298.67 2023-24 2.19 220.97 గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయం పండుగలా సాగింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులను అన్నివిధాలా ఆదుకున్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పంటల సాగుకు పెట్టుబడుల కోసం వడ్డీవ్యాపారులను ఆశ్రయించకుండా ప్రతి ఏటా పీఎం కిసాన్ నిధితో కలిపి వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద రూ. 13,500 అందించారు. విత్తనానికి ముందే పెట్టుబడిసాయం అందటంతో రైతులు విత్తనాలు, రసాయన ఎరువులు, క్రిమి సంహార మందులు కొనుగోలు చేసి వివిధ రకాల పంటలు సాగు చేసి ఆయా పంటల్లో అధిక దిగుబడులు సాధించారు. గ్రామ సచివాలయాలకు అనుసంధానంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి నాణ్యమైన ఎరువులు, క్రిమి సంహారక మందులు సరఫరా చేసి రైతన్నకు దన్నుగా నిలిచారు. పంటకు ముందే మద్దతు ధర ప్రకటించి మార్కెట్లో గిట్టుబాటు ధర లేని సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేసింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటనష్టం సంభవిస్తే అదే సీజన్లో నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకున్నారు. -
కొను‘గోడు’పట్టదా..?
● ఐదు రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద ఆగిన జొన్నల లారీలు, ట్రాక్టర్లు ● రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతులు ● పట్టించుకోని పాలకులు, అధికారులు ● ఆందోళనలో జొన్న రైతులు ఆళ్లగడ్డ: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు రైతన్న ఆపసోపాలు పడుతున్నాడు. కొను గోలు కేంద్రం నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఐదురోజులుగా జొన్న రైతుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ఓ వైపు వరుణుడు ఉరుముతుండగా.. మరో వైపు వాహనాల అద్దె భయపెడుతుండగా జొన్న రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం జొన్నలు మద్ధతు ధర రూ. 3,371తో కొనుగోలు చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. నంద్యాలలో కొనుగోలు కేంద్రం నిండిపోవడంతో అధికారుల సూచన మేరకు రైతులు తమ జొన్నలను లారీలు, ట్రాక్టర్లతో తీసుకుని ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి చేరుకుంటున్నారు. అయితే ఐదు రోజులుగా వచ్చిన రైతులకు ట్రక్ సీట్ ఇస్తున్నారే తప్ప అన్లోడ్ చేసే వారు లేక పోవడంతో రైతులు రాత్రి పగలు అక్కడే పడిగాపులు కాస్తున్నారు. సుమారు 100 మంది దాక రైతులు, డ్రైవర్లు అందరు మార్కెట్ యార్డులోనే ఉంటున్నామని అయినా ఎపుడు దించుకుంటారో, అస్సలు దించుకుంటారో లేదోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సిబ్బందిని అడిగితే ‘ట్రక్ సీట్ ఇచ్చేవరకే మాకు సంబంధం.. దించుకుంటారో లేదా అన్నది కొనుగోలు కేంద్రంలో ఉన్నవారు చూసుకోవాలి అని సమాధానమిస్తున్నారు. అక్కడ మాత్రం సమాధానం ఇచ్చే వారు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సమస్య ఏమిటో తెలియకపోవడంతో చివరకు కొందరు రైతు లు స్థానిక ఎమ్మెల్యే అఖిలప్రియకు సమస్యను విన్నవించగా. .‘మాట్లాడుదాం మిని మహానాడు దగ్గరకు రండి చెప్పారు. ఎంతో ఆశతో అక్కడకు వెళితే పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఐదు రోజులుగా అక్కడే! ఇక్కడ జొన్నల లోడు లారీ దగ్గర నిల్చున్న రైతు నంద్యాల మండలం కానాలకు చెందిన శివారెడ్డి. నంద్యాలలో గోడౌన్ ఫుల్ అయిందని ఆళ్లగడ్డ గోడౌన్కు వెళ్లమని చెప్పడంతో తన 340 సంచుల జొన్నలను లారీ బాడుగకు తీసుకుని ఆళ్లగడ్డకు వేసుకొచ్చాడు. ఐదు రోజులైనా దించుకోక పోవడంతో అక్కడే ఉంటున్నాడు. లారీ బాడుగ రూ. 18,000, ఇవ్వడంతో పాటు హాల్టింగ్కు రోజుకు రూ. 2 వేలు, బత్తా రూ. 100 ఇవ్వాల్సి వస్తోంది. దీంతో పాటు ఐదు రోజులుగా లోడు అలాగే ఉండటంతో లారీ టైర్లు దెబ్బతింటాయని, దానికి కూడా డబ్బులు ఇవ్వాలని డ్రైవరు భయపెడుతున్నాడు. మరోవైపు కురుస్తున్న వర్షానికి జొన్నలు తడిసిపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని రైతు శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.బాడుగ తడిసి మోపెడు.. ఇక్కడ ట్రక్ సీట్ (జొన్నలు దించుకోమని మార్క్ఫెడ్ సిబ్బంది ఇచ్చిన రసీదు) చూపుతున్న ఈ రైతు బండారు శ్రీనివాసులు. మండల కేంద్రం దొర్నిపాడుకు చెందిన ఈ రైతు తన 100 ప్యాకెట్ల జొన్నలు కొనుగోలు కేంద్రంలో విక్రయించేందుకు శనివారం రాత్రి ఆళ్లగడ్డ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే మార్క్ఫెడ్ సిబ్బంది ఆన్లైన్లో అన్నీ పరిశీలించి ట్రక్ సీట్ ఇవ్వడంతో సంతోషంతో కొనుగోలు కేంద్రం (ప్రభుత్వ మార్కెట్ యార్డు)కు తీసుకెళ్లాడు. అయితే అప్పటికే అక్కడ బారులుదీరి నిలుచున్న వాహనాలను చూసి ఏమైంది?.. అని ఆరా తీయడంతో తన కంటే ముందు నుంచే ఇక్కడ ఉన్నామని దించుకునే నాథుడే లేడని చెప్పడంతో తీవ్ర నిరాశకు లోనయ్యాడు. రోజుకు రూ. 3 వేలు ట్రాక్టర్ బాడుగతో పాటు ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయని రైతు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. -
దిగుబడులు అంతంతగానే
ఎకరాకు రూ. 12,500 కౌలు చెల్లించి ఎనిమిది ఎకరాల్లో రబీ సీజన్లో వరి సాగు చేశాను. పైరు పొట్టదశలో కుందరవాగుకు సాగునీరు నిలిచిపోయింది. ఎన్నో కష్టాలు పడి సాగునీరు మళ్లించుకున్నాను. ఎరువులు, పురుగు మందులు, కోత, నూర్పిడి, సాగునీరు మళ్లింపు, తదితర పెట్టుబడుల రూపంలో ఎకరాకు రూ. 35 వేల నుంచి 40 వేలు పెట్టాను. పెట్టుబడులు భారీగా పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. – ప్రతాప్రెడ్డి, రైతు, భీమునిపాడు, కోవెలకుంట్ల మండలం పెట్టుబడుల కోసం అప్పులు చేశాను గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో విత్తనానికి ముందే రైతు భరోసా పథకం ద్వారా ఏటా రూ. 13,500 సాయమందేది. ఆ మొత్తంతో విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకు ఎలాంటి డోకా ఉండేదికాదు. గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం అందలేదు. రబీ సీజన్లో జొన్న, శనగ పంటలు సాగు చేశాను. పెట్టుబడికోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సి వచ్చింది. – రామసుబ్బరాయుడు, రైతు, జోళదరాశి, కోవెలకుంట్ల మండలం ఈ ఏడాదైనా పెట్టుబడిసాయం ఇవ్వాలి ఈ ఏడాది నాకున్న మూడున్నర ఎకరాల పొలంతోపాటు మరో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని మిరప, మొక్కజొన్న పంటలు సాగు చేసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నాను. గత ఖరీఫ్, రబీసీజన్లలో పెట్టుబడిసాయం అందలేదు. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఖరీఫ్సీజన్ ప్రారంభంకానుంది. ఈ ఏడాదైనా పెట్టుబడిసాయం అందించి ఆదుకోవాలి. – కుళాయప్ప, రైతు, అమడాల, కోవెలకుంట్ల మండలం ● -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
బొమ్మలసత్రం: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించాలని జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజలు అడిషనల్ ఎస్పీకి 67 వినతులను అందించారు. కొన్ని సమస్యలను ఆయన ఫోన్లో సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులను త్వరగా విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఐ జయరాముడు పాల్గొన్నారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
ప్యాపిలి: మండల పరిధిలోని ఎస్ రంగాపురంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రామాంజనేయులు, సునీతల కుమారుడు చరణ్ (10) సోమవారం ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డాడు. స్థానిక పాఠశాలలో ఐదో తరగతి చదివిన చరణ్.. వేసవి సెలవులు కావడంతో తోటి మిత్రులతో కలసి ప్రతిరోజూ గ్రామ శివారులోని కుంటలో ఈత నేర్చుకునేవాడు. రోజులాగే సోమవారం కూడా ఈతకు వెళ్లాడు. నీటిలో మునిగిపోకుండా వీపునకు ప్లాస్టిక్ డబ్బా కట్టుకుని కాసేపు ఈత కొట్టాడు. తర్వాత ప్లాస్టిక్ డబ్బా తొలగించి కుంటలోకి దూకి బయటకు రాలేకపోయాడు. కొద్ది సేపటి తర్వాత అదే కుంటలో ఈత కొడుతున్న కొందరు అడుగున తమకు ఏదో తగులుతోందని గుర్తించారు. వెంటనే అందరూ కలిసి అడుగున ఉన్న చరణ్ను బయటకు తీశారు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బాలుడి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.బాలికపై లైంగికదాడికి యత్నం బేతంచెర్ల: మండల పరిధిలోని బుగ్గానిపల్లె తండాలో ఏడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు లైంగికదాడికి యత్నించిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన చిన్నారి ఆడుకుంటుండగా అదే గ్రామానికి చెందిన హరీష్ నాయక్ మాయమాటలు చెప్పి తన ఇంటిపైకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నంచాడు. చిన్నారి కేకలు వేస్తూ తప్పించుకుని వచ్చి తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించి నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య దేవనకొండ: అప్పుల బాధతో దేవనకొండకు చెందిన గిడ్డిగారి ప్రకాష్(48) అనే రైతుసోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంలో పంటలు పండిస్తూనే సెంట్రింగ్ పనులు చేస్తూ ప్రకాష్ జీవనం సాగించేవాడు. గత రెండు సంవత్సరాల నుంచి పంటలు సరిగా పండలేదు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి దాదాపు రూ.15 లక్షలు దాకా అప్పులపాలయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియక నిత్యం సతమతమవుతూ ఉండేవాడు. భార్య పిల్లలు బంధువుల శుభకార్యానికి వెళ్లగా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కిటికీలో నుంచి చూడగా శవమై వేలాడుతున్నాడు. దీన్ని గమనించిన స్థానికులు పోలీస్స్టేషన్కు ఫిర్యాదు ఇచ్చారు. పోలీసులు వచ్చి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా సమస్యలు పరిష్కరించండి
నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 213 మంది నుంచి ఫిర్యాదులను స్వీకరించి వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి పంపారు. అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. స్వీకరించిన ప్రతి అర్జీకి కచ్చితమైన పరిష్కార మార్గాలు చూపాలన్నారు. 49 దరఖాస్తులు రీఓపెన్ అయ్యాయని, వీటన్నింటినీ తక్షణమే పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న 62 వీఐపీ అర్జీలను కూడా త్వరగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్ఎస్ ఫిర్యాదుల పరిష్కారంపై అర్జీదారుల అభిప్రాయ సేకరణ 43.15 శాతం మాత్రమే జరిగిందన్నారు. పెండింగ్లో ఉన్న డేటాను త్వరితగతిన సేకరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సర్వేలలో భాగంగా మన మిత్ర క్యాంపెయిన్కు సంబంధించి ఇంకా 13,724 పెండింగ్ ఉందని, వర్క్ ఫ్రమ్ హోంకు సంబంధించి 2,367 పెండింగ్లో ఉన్నాయని, సంబంధిత సర్వేను వెంటనే పూర్తి చేయాలన్నారు. మిస్సింగ్ సిటిజన్స్కు సంబంధించి 712, సిటిజన్ ఈకేవైసీ 2,34,772 మందికి పెండింగ్లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ముట్టడికి తరలిరండి
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 21న ఉమ్మడి జిల్లా విద్యాశాఖ కార్యాలయం, 23న విజయవాడలోని విద్యాభవన్ ముట్టడి కార్యక్రమాలకు ఉపాధ్యాయులు తరలిరావాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నాయకులు సాంబశివుడు, రామపక్కీర్రెడ్డి, మహమ్మద్ కాశీం, రామచంద్రారెడ్డి, అబ్దుల్అజీజ్, వెంకటరమణ కోరారు. సోమవారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయ ఆవరణంలో ఏపీటీఎఫ్ 1938 జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాల పునర్వీభజన, క్రమబద్దీకరణకు ప్రభుత్వం జారీ చేసిన 19, 20, 21 ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, జీఓ నెం.117ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యా, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న ముట్టిడి కార్యక్రమాలకు ప్రతి ఉపాధ్యాయుడు తరలిరావాలన్నారు. సమావేశలలో ఐక్య ఉపాధ్యాయ సంఘం నాయకులు భాస్కరరెడ్డి, కృష్ణారావు, మౌలాలి, సుబ్బయ్య, కృష్ణార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
నేర్పిస్తున్నందుకు తృప్తిగా ఉంది
16 ఏళ్ల నుంచి ఆధునిక నృత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఈ శిబిరంలో శిక్షణ పొందిన వారు కొందరు డ్యాన్స్ అకాడమీలను స్థాపించుకున్నారు. మరికొందరు ప్రైవేటు విద్యాసంస్థల్లో డ్యాన్స్ మాస్టర్లుగా ఉపాధి పొందుతున్నారు. ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో తృప్తిగా ఉంది. – రాజాహుసేన్, డ్యాన్స్ మాస్టర్ నృత్యం నేర్చుకుంటున్నా ఆరేళ్ల నుంచి వేసవిలో నృత్యం నేర్చుకుంటున్నాను. ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. బాగా నేర్పుతున్నారు. జూన్లో ప్రదర్శన ఇచ్చే అవకాశం ఉంటుందంటా. అందుకే బాగా నేర్చుకుంటున్నాను. – గోవర్ధిని, శిక్షణ పొందుతున్న విద్యార్థిని భవిష్యత్తులోనూ నేర్పిస్తా ఎక్కువ మంది చిన్నారులు ఆధునిక నృత్యంపైనే ఆసక్తి చూపుతున్నారు. నాలుగైదేళ్ల చిన్నారులు కూడా హుషారుగా, ఎంతో జోష్తో పాల్గొంటున్నారు. ఫీజు లేకపోయినా సరే చిన్నారులకు నేర్పుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి మున్ముందు కూడా చిన్నారులకు డ్యాన్స్ నేర్పిస్తా. – డాక్టర్ లలితాసరస్వతి, భరతనాట్యం డ్యాన్స్ మాస్టర్ -
అరకొరగా విత్తన కేటాయింపులు
విత్తన పంపిణీలో అంతులేని నిర్లక్ష్యం ● వర్షాలు కురుస్తున్నా స్పందించని ప్రభుత్వం ● బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా అంటున్న కంపెనీలు ● ఇప్పటి వరకు మొదలుకాని ప్రాసెసింగ్ ప్రక్రియ ● గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మే 15 నుంచే పంపిణీ ● ఇప్పుడు అరకొర కేటాయింపులతో సరి ● వర్షాలు కురుస్తుండటంతో దిక్కుతోచని రైతులు కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ మంచుకొస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ విత్తనం అందుబాటులో లేకపోవడం రైతుల పాలిట శాపంగా మారుతోంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్లు మే నెల 15 నుంచే విత్తన పంపిణీ జరిగింది. వర్షాలు పడిన వెంటనే విత్తనాల కోసం ఎదురు చూడకుండా సకాలంలో విత్తుకునే అవకాశాన్ని కల్పించింది. 2024 ఖరీఫ్ సీజన్ సమయంలో కూడా అప్పటి ప్రభుత్వం ముందస్తు చర్యల వల్ల సకాలంలో విత్తన పంపిణీ సాధ్యమైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పూర్తి స్థాయిలో విత్తన పంపిణీపై దృష్టి సారించని పరిస్థితి. సబ్సిడీ పంపిణీలో వేరుశనగ, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ప్రధానమైనవి. ఈ విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేరుశనగ సరఫరాకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచి రేట్లు ఖరారు చేసినప్పటికీ సంబంధిత కంపెనీలు విత్తన సరఫరాకు సిద్ధంగా లేవని తెలుస్తోంది. ఇంతవరకు ప్రాసెసింగ్ ప్రక్రియనే మొదలు పెట్టలేదంటే పంపిణీ ఎలా సాధ్యమనే ప్రశ్న తలెత్తుతోంది. దీంతో రైతులు వేరుశనగ విత్తనం కాయల కోసం వ్యాపారులను ఆశ్రయించక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2024–25 బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరా రాష్ట్రం మొత్తం మీద ఏపీ సీడ్స్కు విత్తనాలు సరఫరా చేసే కంపెనీలు 45 వరకు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 3 కంపెనీలు సరఫరా చేయాల్సి ఉంది. 2024–25 ఖరీఫ్ సీజన్లో వేరుశనగ, రబీ సమయంలో సరఫరా చేసిన శనగ(బెంగాల్గ్రామ్), ఇతర విత్తనాలకు ఏపీ సీడ్స్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. సబ్సిడీ మొత్తం ప్రభుత్వం నుంచి ఏపీ సీడ్స్కు విడుదల కావాల్సి ఉంది. ప్రభుత్వం ఏపీసీడ్స్కు ఒక్క రూపాయి కూడా విదిల్చకపోవడం వల్ల సరఫరా చేసిన కంపెనీలకు నగదు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. బకాయిలు చెల్లిస్తేనే విత్తనాలు సరఫరా చేస్తామంటూ కంపెనీలు బీష్మించాయి. విత్తనాల కోసం రైతులకు తప్పని తిప్పలు ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నా విత్తన పంపిణీ విషయంలో కూటమి ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి సబ్సిడీ విత్తన పంపిణీ విషయమై కూటమి ప్రభుత్వం చేతులెత్తేసే అవకాశం ఉండటంతో రైతులు విత్తనాల కోసం దిక్కులు చూస్తున్నారు. ఇప్పటి వరకు వేరుశనగ క్వింటా ధర రూ.6,500 ఉండగా.. వ్యాపారులు ఉన్నట్లుండి ధరను పెంచేశారు. ఈ సారి విత్తనాల పంపిణీ దిశగా ప్రభుత్వ చర్యలు లేకపోవడం వ్యాపారులకు కలసి వస్తోంది. ధరలను అడ్డగోలుగా పెంచి దోపిడికి పాల్పడే ప్రమాదం ఏర్పడింది. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు సమస్య ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉన్నందున పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలకు డిమాండ్ ఉంది. నంద్యాల జిల్లాలో వరి ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో కూడా వరి సాగవుతోంది. వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలైన జీలుగ, పిల్లిపెసర, సన్హెంఫ్ విత్తనాలు విత్తుకొని 45 రోజుల సమయంలో దున్ని పొలంలో కలిపేస్తారు. ఇందువల్ల భూమికి అన్ని పోషకాలు కలిగిన ఎరువులు లభిస్తాయి. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు జిల్లాకు కనీసం 3,500 క్వింటాళ్లు అవసరం. అయితే ఏపీ సీడ్స్ వద్ద కేవలం 1000 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. కంపెనీలు విత్తన సరఫరా చేయడంలో చేతులెత్తేశాయి. ఇప్పటికే పచ్చిరొట్ట ఎరువుల విత్తనాల కోసం రైతులు వ్యవసాయ అధికారులు, ఏపీ సీడ్స్ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో విత్తనాలను అందుబాటులో పెట్టకపోతే రైతులు రోడ్డెక్కే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్లో వేరశనగ ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 54,170 హెక్టార్లు, నంద్యాల జిల్లాలో 11,943 హెక్టార్ల వరకు సాగయ్యే అవకాశం ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వేరుశనగ సాగు చేపట్టేందుకు 32,181 క్వింటాళ్ల విత్తన కాయలు అవసరమని మండల వ్యవసాయ అధికారులు, ఏడీఏలు నివేదించారు. ఆయా జిల్లాల అధికారులు వినతిని కూటమి ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. ఉమ్మడి జిల్లాకు తూతూమంత్రంగా 11,108 క్వింటాళ్లు మాత్రమే కేటాయించింది. సాధారణంగా గత ఏడాది ఏఏ విత్తనం ఏ మేర పంపిణీ అయిందో దానికి అనుగుణంగా విత్తనాలను కేటాయిస్తారు. గత ఏడాది ఖరీఫ్లో కర్నూలు జిల్లాకు 14,395 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 3,062.7 క్వింటాళ్ల ప్రకారం విత్తన పంపిణీ జరిగింది. కనీసం ఈ ప్రకారమైన కేటాయించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు కరువయ్యాయి. కర్నూలు జిల్లాకు 9,099, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లతో సరిపెట్టడం గమనార్హం. ఈ కేటాయింపులు చూసి అధికారులు పంపిణీ ఎలా చేపట్టాలోనని తలలు పట్టుకుంటున్నారు. -
పొగాకును కొనుగోలు చేయాలి
నంద్యాల(అర్బన్): రైతులు పండించిన పొగాకు దిగుబడులను కంపెనీలు కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి, జిల్లా కార్యదర్శి రాజశేఖర్ డిమాండ్ చేశారు. పొగాను కొనుగోలు చేసేలా కంపెనీలతో అధికారులు చర్చలు జరపాలన్నారు. జిల్లాలో రైతులు పండించిన పొగాకును ఒప్పందం మేరకు కంపెనీలు తక్షణమే కొనుగోలు చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆద్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నాణ్యత లోపం పేరుతో పొగాకు బేళ్లను వెనక్కు పంపకుండా ఒప్పందం మేరకు పండించిన దిగుబడులను క్వింటా రూ.18,500తో కొనుగోలు చేయాలన్నారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కంపెనీలతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. కార్యక్రమంలో సంఘం సహాయ కార్యదర్శి రామచంద్రుడు, సభ్యులు ప్రసాద్, నరసయ్య, రైతులు రఘురామిరెడ్డి, నారాయణ, వెంకటేశ్వరగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లు నిండిపోయాయి. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
వాల్మీకి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
ఆదోని సెంట్రల్: ఎమ్మిగనూరులో నిర్వహించిన కర్నూలు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సమావేశంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సోమవారం వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు మాట్లాడుతూ వాల్మీకి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తామని, వారు భవిష్యత్లో ఉన్నత స్థానానికి ఎదిగేలా చూస్తామన్నారు. వాల్మీకి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారు అభివృద్ధి వైపు నడిచేలా చూస్తామన్నారు. గౌరవాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన టి.బాలవెంకటేశ్వర్లు (రిటైర్డ్ ఉద్యోగి), అధ్యక్షుడిగా కర్నూలుకు చెందిన బి.మల్లన్న, (ఏడీ, వెటర్నరీశాఖ), ప్రధాన కార్యదర్శిగా ఆదోనికి చెందిన బి.సుధాకర్బాబు (ఉపాధ్యాయుడు), కోశాధికారిగా కోసిగికి చెందిన ఎస్.వెంకటరెడ్డి (ఉపాధ్యాయుడు), ఇతర సలహాదారులు, ఉపాధ్యక్షులు, అదనపు కార్యదర్శులు, కార్యనిర్వాహక సభ్యులను ఎన్నుకున్నట్లు చెప్పారు. వాల్మీకి ఉద్యోగ సంఘం గౌరవ సలహాదారుడు వెంకన్న, ఉపాధ్యక్షుడు హుసేని, ఇతర నాయకులు పులుసు నారాయణ, తిమ్మారెడ్డి, లక్ష్మీనారాయణ, రఘునాథ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బ్లాక్లో కొనాల్సి వస్తుందేమో
ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేస్తాం. గత ఏడాది వరకు మే 15 నుంచే వేరుశనగ సహా అన్ని రకాల విత్తనాల పంపిణీ చేశారు. ముందస్తుగా విత్తనాలు సిద్ధం కావడంతో వర్షాలు కురిసిన వెంటనే సకాలంలో విత్తుకు అవకాశం ఉండేది. ఈ సారి సబ్సిడీపై విత్తనాల పంపిణీ జరుగుతుందో, లేదో తెలియని పరిస్థితి. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాల కోసం దిక్కుతు చూడాల్సి వస్తోంది. మరో నాలుగైదు రోజుల్లో విత్తనాలు అందుబాటులోకి రాకపోతే బ్లాక్లో కొనాల్సిందే. – సత్యప్ప, మామిళ్లకుంట, తుగ్గలి మండలం ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియదు 13 ఎకరాల్లో వరి, వేరుశనగ 8 ఎకరాల్లో సాగు చేస్తున్నాం. మామూలుగా అయితే పచ్చి రొట్ట ఎరువుల విత్తనాలు వినియోగించం. మొదటిసారిగా వరి నాట్లకు ముందు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు విత్తుకోవాలనుకున్నాం. కానీ వ్యవసాయ శాఖ ఇంతవరకు విత్తనాల పంపిణీ చేపట్టలేదు. కేటాయింపులు అరకొరగా ఉన్నాయి. ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో చెప్పడం లేదు. వ్యవసాయ శాఖ అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితిని మొదటిసారి చూస్తున్నాం. – కెంచప్ప, గజ్జెహళ్లి, హొలగొంద మండలం -
వడ్ల వ్యాపారిపై కేసు నమోదు
అవుకు: నకిలీ రశీదులు సృష్టించి లారీలను చెక్పోస్టులు దాటిస్తూ సొమ్ము చేసుకుంటున్న వడ్ల వ్యాపారిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. పోలీసులు, బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపిన వివరాలు.. అవుకు పట్టణానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఈనెల 5న రాత్రి 10 గంటలకు వరి బస్తాల లోడ్ లారీని అవుకు నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా బేతంచెర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చెక్పోస్టు వద్ద మార్కెట్ కమిటీ అసిస్టెంట్ తనిఖీ చేశారు. కడప జిల్లా కమలాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీకి బిల్లు చెల్లించినట్లు ఉన్న రశీదులను లారీ డ్రైవర్ చూపించాడు. అసిస్టెంట్కు రశీదులపై అనుమానం వచ్చింది. లారీ డ్రైవర్ మార్కెట్ కమిటీ అసిస్టెంట్కు సుపరిచితుడు కావడంతో విషయాన్ని ఆరా తీశారు. దీంతో నకిలీ రశీదులని తెలియడంతో వెంటనే అధికారులకు సమాచారమిచ్చారు. బిల్లులు ఎవరిచ్చారని డ్రైవర్ను విచారించగా అవుకు గ్రామానికి చెందిన వడ్ల వ్యాపారి సాయి ఇచ్చినట్లు చెప్పడంతో బనగానపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ సెక్రటరీ వెంకటేశ్వర్ రెడ్డి అవుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. దీంతో సాయిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు. -
ఏపీ ఈఏపీ సెట్కు 94.04 శాతం హాజరు
కర్నూలు సిటీ: ఏపీ ఈఏపీ సెట్ సోమవారం ప్రారంభం కాగా 94.04 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో 9, నంద్యాల జిల్లాలో మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. మొత్తం 3,190 మందికిగాను 3,000 మంది (94.04 శాతం) హాజరయ్యారు. కర్నూలు నగరంలో 7 కేంద్రాలు, ఎమ్మిగనూరు, ఆదోనిలలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లాలో ఉదయం సెషన్ పరీక్షకు 1,597 మందికిగాను 1,492 మంది, మధ్యాహ్నం సెషన్లో జరిగిన పరీక్షకు 1,593 మందికిగాను 1,508 మంది హాజరయ్యారు. నంద్యాల జిల్లాలో 3 కేంద్రాలలో ఉదయం సెషన్లో 713 మందికి 659 మంది, మధ్యాహ్నం సెషన్లో 711 మందికిగాను 659 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. కర్నూలు నగర శివారులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ఇద్దరు విద్యార్థులు ఆలస్యంగా రావడంతో అనుమతించలేదు. సమయానికి చేరుకోలేక వెనుదిరిగిన ఇద్దరు విద్యార్థులు -
నేరాల నియంత్రణ కోసమే కార్డెన్ సెర్చ్
బొమ్మలసత్రం: జిల్లాలో నేరాల నియంత్రణకు ముఖ్యమైన ప్రాంతాల్లో సోమవారం కార్డెన్ సెర్చ్ జరిపామని ఎస్పీ అదిరాజ్సింగ్రాణా తెలిపారు. ఆత్మకూరు సబ్డివిజన్లోని పాములపా డు, ఇస్కాల, మండ్లెం, ఆళ్లగడ్డ పరిధిలోని చింతకుంట గ్రామాల్లో వేకువజామున సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు. ధ్రువపత్రాలు లేని 44 వాహనాలు, అక్రమంగా నిల్వ ఉంచిన 30 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రౌడీషీటర్లు, పలు అనుమానితుల ఇళ్లను సోదాలు చేసినట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించామన్నారు. కార్డెన్ సెర్చ్లో సీఐలు సురేష్కుమార్రెడ్డి, యుగంధర్, మురళీధర్రెడ్డి పాల్గొన్నారు. ప్రశాంతంగా ‘పది’ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 35 సెంటర్లలో ప్రశాంతంగా నిర్వహించినట్లు డీఈఓ జనార్దన్రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన తెలుగు పరీక్షకు 1,231 మంది గాను 729 మంది విద్యార్థులు హాజరు కాగా 502 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మూడు ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, 15 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. అలాగే సార్వత్రిక విద్యాపీఠం పదో తరగతి హిందీ పరీక్ష నాలుగు కేంద్రాల్లో నిర్వహించగా 16 మంది విద్యార్థులకు గాను 12 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఇంటర్ హిందీ పరీక్షకు రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా 68 మందికి గాను 56 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్లు డీఈఓ తెలిపారు. డీసీహెచ్ఎస్ బాధ్యతల స్వీకరణ గోస్పాడు: జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త(డీసీహెచ్ఎస్)గా డాక్టర్ ఓ లలిత సోమవారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ పని చేస్తున్న సివిల్ సర్జన్ ఆర్థోపెడిక్ డాక్టర్ జఫరుల్లాను ఉన్నతాధికారులు ఆళ్లగడ్డకు బదిలీ చేశారు. ఆ స్థానంలో బనగానపల్లె ఆసుపత్రి చిన్న పిల్లల విభాగం సివిల్ సర్జన్ డాక్టర్ ఓ లలితను ఇక్కడికి బదిలీ చేయడంతో ఆమె విధుల్లో చేరారు. ఐఎఫ్ఎస్కు డీటీఓ ఐశ్వర్యారెడ్డి ఎంపిక సాక్షి, నంద్యాల: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించిన ఐఎఫ్ఎస్ 2024 తుది ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. యూపీఎస్సీ గత ఏడాది నవంబర్, డిసెంబర్ మెయిన్ పరీక్షలు నిర్వహించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్సనాలిటీ టెస్ట్ నిర్వహించి తుది ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 143 మంది అభ్యర్థులు ఐఎఫ్ఎస్ సర్వీసులకు ఎంపికయ్యారు. అందులో డీటీఓ ఐశ్వర్యారెడ్డి 13వ ర్యాంకు సాధించి ఐఎఫ్ఎస్కు ఎంపికయ్యారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఐశ్వర్యారెడ్డి ఏడు నెలల క్రితం జిల్లాలో బాధ్యతలు చేపట్టారు. ఐశ్వర్యారెడ్డి ఎంపికపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం కోసం ధర్నా ఎమ్మిగనూరుటౌన్: ఈనెల 19 రోజులు గడిచినప్పటికీ రేషన్ బియ్యం ఇవ్వకపోవడంతో ఎమ్మిగనూరు పట్టణం లక్ష్మీపేట వాసులు సోమవారం ధర్నా చేశారు. ప్రతి నెలా మొదటి వారంలోనే రేషన్ బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈ నెల ఇప్పటి వరకు పంపిణీ చేయకపోవడంతో తాము పస్తులుండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకొని బతికే తమకు రేషన్ బియ్యం పంపిణీ చేయకుంటే ఎలా అని లక్ష్మి, నర్సమ్మ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలైన తమకు సత్వరం రేషన్ బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. -
తమ్ముడి మృతితో ఆగిన అక్క పెళ్లి
ఆలూరు రూరల్(కర్నూలు): అందరూ వివాహ వేడుకల్లో ఆనందంగా ఉన్నారు. మరి కొద్ది గంటల్లో కల్యాణ తంతు నిర్వహించాల్సి ఉంది. ఇంతలోనే విషాదం. వధువు తమ్ముడు రోడ్డు ప్రమా దంలో దుర్మరణం చెందడంతో అక్క వివాహం నిలిచిపోయింది. శనివారం రాత్రి హుళేబీడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆస్పరికి చెందిన ఆనంద్ (19) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అతని స్నేహితులు పూర్ణచంద్ర, తిమ్మప్ప తీవ్రంగా గాయపడ్డారు. ఆదోని ఆస్పత్రిలో పూర్ణచంద్ర, కర్నూలు ఆస్పత్రిలో తిమ్మప్ప చికిత్స పొందుతున్నారు. ఆస్పరికి చెందిన తిమ్మన్న, శుకుంతల కుమారుడు ఆనంద్.. కాగా అతని సోదరి వివాహం హొళగుంద మండలం వందవాగిలి గ్రామంలో ఆదివారం ఉదయం జరగాల్సి ఉంది. ఆనంద్, పూర్ణచంద్ర, తిమ్మప్ప గుంటూరులోని ఆర్వీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. పూర్ణచంద్ర స్వగ్రామం ప్రకాశం జిల్లా కంభం గ్రామం కాగా తిమ్మప్పది ఆస్పరి మండలం చిగిళి గ్రామం. శనివారం రాత్రి ఆనంద్ సోదరి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బైక్పై వెళ్తుండగా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఆనంద్ మృతితో అతని సోదరి పెళ్లి ఆగిపోయింది. అక్క పెళ్లికి వచ్చి తమ్ముడి అంత్యక్రియలు చేయాల్సి వచ్చిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.ఎమ్మెల్యే పరామర్శ.. ఆనంద్ మృతి బాధాకరమని ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. ఆదివారం ఆయన ఆలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆనంద్ మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
ఐదుగురితో విచారణ కమిటీ ఏర్పాటు
ఆత్మకూరు అటవీడివిజన్లో ఒక సామాన్య టైపిస్టుగా దినసరి వేతనంతో చేరిన చాంద్బాషా అంచెలంచెలుగా డిపార్ట్మెంట్లో పదోన్నతులు పొందుతూ చివరకు ఆఫీస్ సూపరింటెండెంట్గా రిటైరయ్యారు. ఈయన సర్వీస్ చివరి 15 సంవత్సరాలు ఆత్మకూరు అటవీ డివిజన్ ప్రధాన కార్యాలయంలోనే తిష్ట వేసి నిధులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. తిరుపతి తదితర ప్రాంతాలకు బదిలీ అయినా డిప్యూటేషన్పై ఇక్కడే పని చేయడంతో పైఅధికారులకు విషయం తెలియకుండా పెద్ద మొత్తంలో నగదు బదిలీ చేసుకోవడానికి అవకాశం లభించినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడటంతో ఒక ఐఎఫ్ఎస్ అధికారితో దర్యాప్తు చేయించి రిపోర్టు ఉన్నతాధికారులకు పంపిన తరువాతే ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొదట రూ.20లక్షలు ఖాతాలు మారినట్లు పేర్కొన్న అధికారులు ఆతరువాత ఇంకొంత నిశితంగా రికార్డుల పరిశీలన చేసి రూ.కోట్లలో అవినీతి జరిగిందని నిర్ధారించారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సహాయ కన్జర్వేటర్ సాయిబాబా అటవీదళాల ప్రధానాధికారి పీసీసీఎఫ్ ఏకే నాయక్కు సమగ్ర నివేదికను పంపారు. ఈ మేరకు ఆయన ఐదుగురితో కూడిన ఒక దర్యాప్తు కమిటీని నియమించారు. ఆధారాల సేకరణ అనంతరం కేసును సీఐడీకి అప్పగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమగ్ర నివేదిక అందజేశాం ఆత్మకూరు అటవీడివిజన్ ప్రధాన కార్యాలయంలో అకౌంట్స్ సూపరింటెండెంట్గా పని చేసి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చాంద్బాషా అక్రమాలపై అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి సమగ్ర నివేదికను అందజేశాం. ప్రభుత్వ సొమ్మును తన సొంత ఖాతాకు మళ్లించడంతో ఆత్మకూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అక్రమాలు రూ. కోట్లలో ఉండటంతో ఐదుగురి సభ్యులతో విచారణ కమిటీ దర్యాప్తు చేపడుతోంది. – వి. సాయిబాబా, ప్రాజెక్ట్ టైగర్, డిప్యూటీ డైరెక్టర్, ఆత్మకూరు -
అన్న ప్రసాద వితరణపై పర్యవేక్షణ
శ్రీశైలం టెంపుల్: భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణపై నిరంతరం పర్యవేక్షణ చేస్తుండాలని అధికారులను ఈఓ శ్రీనివాసరావు ఆదేశించారు. శనివారం రాత్రి అన్నప్రసాద వితరణ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈఓ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ అన్నప్రసాద వితరణలో ఆయా వంటకాలన్నీ రుచికరంగా ఉండేటట్లు శ్రద్ధ తీసుకోవాలన్నారు. ప్రతి హాలును కూడా ప్రత్యేకంగా సిబ్బంది ఒకరు నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. అన్నప్రసాద వితరణకు సంబంధించి సమయపాలనను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఉదయం వేళలో అన్నప్రసాదాలను, సాయంత్రం అల్పాహారాన్ని ఎటువంటి ఆలస్యం కాకుండా భక్తులకు అందజేస్తుండాలన్నారు. భక్తులతో మర్యాదతతో మెలగాలని అన్నప్రసాద వితరణ సిబ్బందిని ఆదేశించారు. చిట్టీల పేరుతో కుచ్చుటోపీ ● పోలీసులను ఆశ్రయించిన బాధితులు ప్యాపిలి: పైసా పైసా కూడబెట్టుకుని చిట్టీలు వేసుకున్న వారికి ఒ వ్యక్తి కుచ్చుటోపీ పెట్టాడు. దీంతో బాధితులు లబోదిబో అంటూ శనివారం ప్యాపిలి పోలీసులను ఆశ్రయించారు. దాదాపు రూ. 35 లక్షలకు పైగా మోసం చేసినట్లు తెలుస్తోంది. ప్యాపిలికి చెందిన సుభాన్ బాషా గత కొద్ది సంవత్సరాలుగా ప్యాపిలిలో పలు వ్యాపారాలు చేస్తూ ప్రజల వద్ద నమ్మకం కుదుర్చుకున్నాడు. దీంతో అతన్ని నమ్మిన పలువురు అతని దగ్గర భారీగా చిట్టీలు వేశారు. చిట్టీ ముగిసినా పలువురికి డబ్బులు ఇవ్వకుండా ఆ డబ్బుకు కూడా ప్రతి నెలా వడ్డీ ఇస్తానని నమ్మబలికాడు. మరి కొందరికి డబ్బులు ఇవ్వకుండా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చాడు. చిట్టీలతో పాటు పలువురి దగ్గర భారీ మొత్తంలో అప్పులు కూడా చేశాడు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజులుగా ప్యాపిలిలో సుభాన్బాషా కనిపించకపోవడం, ఫోన్లో అందుబాటులోకి రాకపోవడంతో బాధితులు తాము మోసపోయినట్లు గ్రహించారు. ఈ విషయమై సుభాన్ బాషా తండ్రి సిలార్ బాషాను బాధితులు నిలదీయగా తన కుమారుడు ఎక్కడ ఉన్నాడో తనకు తెలియదని చెప్పాడు. దీంతో బాధితులు బండి నరేంద్ర కుమార్, ఆలా ప్రభాకర్ రెడ్డి, షేక్ ఖాజా హుసేన్,వెంకటేశ్, మలికే సర్వర్ సాహెబ్, పలనాటి అంజనమ్మ, బండి నాగరాజు తదితరులు ఎస్ఐ మధుసూదన్కు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ముగిసిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నంద్యాల(న్యూటౌన్): ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభమైన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శనివారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా 42 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మొదటి సంవత్సరం 10,192 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా 9,103 మంది పరీక్షలకు హాజరయ్యారని డీఐఈఓ సునిత తెలిపా రు. 1,089 మంది గైర్హాజరయ్యారయ్యారన్నా రు. అలాగే రెండో సంవత్సరం పరీక్షలకు 2,959 మంది విద్యార్థులకు గాను 2,779 మంది హాజరు కాగా 180 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. శనివారం కామర్స్, కెమిస్ట్రీ పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు డీఐఈఓ సునిత తెలిపారు. మహానందిలో వీకెండ్ సందడి మహానంది: మహానందిలో శనివారం వీకెండ్ సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. వేలాది మంది భక్తులు ఆలయానికి చేరుకుని స్థానిక రుద్రగుండం, బ్రహ్మగుండం, విష్ణుగుండం కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కామేశ్వరీదేవి, మహానందీశ్వరస్వామి వార్లను దర్శించుకున్నారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కొనసాగింది. స్థానిక అలంకార మండపంలో వేదపండితులు బ్రహ్మశ్రీ రవిశంకర అవధాని ఆధ్వర్యంలో ఆలయ పండితులు, అర్చకులు శ్రీ గంగ, శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి దంపతులకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం చేపట్టారు. రాత్రి ఏకాంతసేవ పూజ లు నిర్వహించారు. యాగశాలలో స్వామి, అమ్మవారి దంపతులను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా ఏకాంత సేవ పూజలు చేపట్టారు. -
పర్యావరణాన్ని కాపాడుకుందాం
పాణ్యం: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. శనివారం పాణ్యంలో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యార్డులో చెత్తను సేకరించారు. స్థానిక మహిళలకు పరిసరాల శుభ్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నానాటికీ కాలుష్యం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందన్నారు. అందరూ మొక్కలు నాటి పెంచాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. అనంతరం ప్లాస్టిక్ బాటిళ్లతో తయారు చేసి బెంచ్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీపీఓ శివారెడ్డి, ఎంపీపీ ఉసేన్బీ, తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి, ఎంపీడీఓ ప్రవీణ్కుమార్, ఐసీడీఎస్ సూపర్వైజర్ నాగసుంకమ్మ ఈఓఆర్డి చంద్రమౌళేశ్వర్గౌడ్, ఎంఈఓ కోటయ్య, ఏపీఓ శేషన్న, ఆర్డబ్ల్యుఏస్ ఏఈ మధుశేఖర్ పాల్గొన్నారు. -
ఆర్భాటాలతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు
డోన్: సంపద సృష్టించి రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర ప్రదేశ్గా నిర్మిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆడంబరా లు, ఆర్భాటాలకు పోయి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశారని ఆర్ధిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. శనివారం చిన్న మల్కాపురంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరైన ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త దొంతిరెడ్డి కృష్ణారెడ్డి ఇంటిలో పాత్రికేయులతో మాట్లాడారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కడా కూడా అమలు చేయకుండా ఏడాది కాలంగా ప్రజలను మభ్యపెడుతున్న ఘన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి నేతలు ఏడాదిగా రాష్ట్రమంతట హెలికాప్టర్లలో గాలికి తిరుగుతూ ప్రజా ధననాన్ని వృథా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం అనంతరం ప్రజలను మభ్యపెట్టేందుకు డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా నేరవేర్చకుండానే ఏడాది కాలంలోనే రూ. లక్షల కోట్ల అప్పు చేయడం కూటమి ప్రభుత్వానికి చెల్లిందన్నారు. పోరాటాలకు సిద్ధం కండి రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయిస్తున్న కూటమి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు బుగ్గన పిలుపునిచ్చారు. అక్రమ కేసులు, దాడు లు ప్రజాస్వామ్య పరిరక్షణకు విఘాతం కల్గిస్తాయన్నారు. రాబో యే కాలంలో కూటమి ప్రభుత్వం ఆరాచక, అవినీతి పాలనకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులు ఉద్యమాలు నడిపేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అన్యాయంగా అమాయకులపై అక్రమంగా కేసులు బనాయించి అధికారంలో స్థిరంగా ఉండాలనుకోవడం భ్రమ అన్న సంగతిని కూటమి నేతలు గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు గోపాల్రెడ్డి, మాహానందరెడ్డి, మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షుడు సోమేష్యాదవ్, మల్లికార్జునరెడ్డి, వైస్ ఎంపీపీ ఎర్రిస్వామి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏడాదిగా సంక్షేమం, అభివృద్ధి లేదు సంపద సృష్టి అంటూ కూటమి నేతలు హెలికాప్టర్లలో పర్యటనలు డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకే చెల్లు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
చంద్రబాబు మాటలన్నీ అబద్ధాలే!
కర్నూలు(సెంట్రల్): రాయలసీమలోని తాగునీటి ప్రాజెక్టులన్నీ టీడీపీ చేపట్టినవేనని సీఎం చంద్రబాబునాయుడు అబద్ధాలు ఆడుతున్నారని, ఆయన హయాంలో ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి అన్నారు. దివంగత నేద వైఎస్ రాజశేఖరరెడ్డి చలువతో రాయలసీమలోని చాలా ప్రాజెక్టులు ఏర్పాటయ్యాయని పేర్కొన్నారు. కల్లూరులోని తన నివాసంలో శనివారం కాటసాని విలేకరులతో మాట్లాడారు. గోరుకల్లు రిజర్వాయర్కు ప్రధానమంత్రి ఉన్న సమయంలో పీవీ నరసింహారావు భూమి పూజ చేశారని తెలిపారు. 1994 ముందే కోట్ల విజయభాస్కరరెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కాలువలను పూర్తి చేశారన్నారు. 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు అధికారంలో ఉన్నా నీళ్లు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. 2004లో సీఎంగా వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి గోరుకల్లు రిజర్వాయర్తో ప్రజలకు నీళ్లు ఇచ్చారన్నారు. హాస్యాస్పదం ఎస్ఆర్బీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులను టీడీపీ హయాంలో చేపట్టినట్లు సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కాటసాని అన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. కర్నూలు పర్యటనకు సీఎం చంద్రబాబు ఎందుకు వచ్చినట్లో అర్థం కావడం లేదన్నారు. స్వచ్ఛాంద్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేయడానికి ఎక్కడి నుంచైనా సందేశం ఇస్తే సరిపోతుందన్నారు. అయితే ఆయన మాత్రం ఆ పనిమీదనే జిల్లా పర్యటనకు వచ్చారని, ఆయన రాకతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఖర్చు వచ్చిందన్నారు. ఎక్కడైనా ముఖ్యమంత్రి పర్యటిస్తే ఆ జిల్లాకు ఏదైనా ప్రాజెక్టు లేదా ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేయడానికి వస్తారన్నారు. చంద్రబాబు మాత్రం రైతు బజార్ను శుభ్రం చేయడానికి రావడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే చంద్రబాబునాయుడు జిల్లాల్లో పర్యటిస్తున్నారని, సంక్షేమ పథకాలను ఎవరూ అడగకూడదని ఆగస్టు, జూన్ అంటూ చెప్పుకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. రాయలసీమలో ఒక్క సాగుప్రాజెక్టును నిర్మించలేదు గోరుకల్లును నిర్వీర్యం చేశారు ఆయన పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమిటి? వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి -
కమనీయం.. పాండురంగడి చక్రస్నానం
కోవెలకుంట్ల: పట్టణంలోని రంగరాజుపేటలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో శనివారం వసంతోత్సవం, స్వామివారి చక్రసాన్న కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో చివరి రోజున ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యులు పాండురంగడికి పంచామృతాభి షేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, తదితర పూజా కార్యక్రమాలు జరిపారు. అనంతరం స్వామివారి వసంతోత్సవాన్ని నిర్వహించి భక్తులు రంగులు చల్లుకున్నారు. వేసవికాలంలో వైశాఖ మాసాన్ని పురస్కరించుని 11 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో కల్యాణం, వాహన సేవలు, రథోత్సవ కార్యక్రమాల్లో స్వామివారి వేడిని చల్లార్చేందుకు, ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో జీవించాలని కోనేటిలో చేపట్టిన చక్రస్నాన కార్యక్రమం కమనీయంగా కొనసాగింది. రాత్రి ధ్వజారోహణ, కంకణ నిమజ్జనం, నాకబలితో ఈ నెల 7వ తేదీన ప్రారంభమైన పాండురంగడి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. చివరిరోజు నిర్వహించిన కార్యక్రమాలను తిలకించేందుకు పట్టణంతోపాటు చుక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో కోనేటి ప్రాంగణం జనసంద్రమైంది. -
కక్ష సాధింపుతోనే అక్రమ అరెస్ట్లు
బొమ్మలసత్రం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షసాధింపులో భాగంగానే రిటైర్డ్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డిని అరెస్ట్ చేయించారని మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకిషోర్రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా ఆరోపించారు. శిల్పా నివాసంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కూట మి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా ప్రజలకు చెప్పుకోదగిన మేలు ఏమి చేయలేదన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేశారన్నారు. సూపర్సిక్స్ పథకాల గురించి ఎవరైనా మాట్లాడితే వారిపై తప్పుడు కేసులు నమోదు చేయటం దౌర్భాగ్యమన్నారు. సూపర్సిక్స్ పథకాల అమలుపై ప్రజలు ఎక్కడ ప్రశ్నిస్తారోనని ఏదో ఒక సమస్యలు చూపించి మభ్యపెడుతున్నారని వివరించారు. అసలు స్కామ్లే లేనిచోట లిక్కర్స్కామ్ల పేరుతో డ్రామా మొదలు పెట్టి కక్ష సాధింపు కోసం ఇద్దరు రిటైర్డ్ అధికారులను అరెస్ట్ చేసి దాన్ని భూతద్దంలో ప్రజలకు చూపించటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుతో పాటు స్కిల్ స్కామ్లో నిందితులను కేంద్రప్రభుత్వమే గతంలో అరెస్ట్లు చేపట్టిందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బెల్టు షాపులు లేకుండా చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం ఆదాయం కోసం పల్లెల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు సాగిస్తుందని విమర్శించారు. ఆధారాలు లేకపోయినా వేధింపులు అధికారులపై కూడా కూటమి ప్రభుత్వం రాజకీయ రంగుపులిమి కేసుల నమోదుతో పాటు సరైన పోస్టింగ్లు ఇవ్వకుండా వేధింపులకు గురిచేయటం మంచిదికాదన్నారు. సోషల్మీడియాలో ఆక్టివ్గా ఉన్నవారిపై ఒక్కొ వ్యక్తిపై 17 కేసులు నమోదు చేసి చిత్రహింసలకు గురిచేయటం దారుణమన్నారు. సమావేశంలో జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, మాజీ బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్లు బషీద్, మజీద్లు పాల్గొన్నారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అరెస్ట్ అన్యాయం మాజీ ఎమ్యెల్యే శిల్పారవి, ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
సర్దుబాటుతో చతికిల‘బడి’
● ఒకే పాఠశాలలో మాయమైన 10 ఉపాధ్యాయ పోస్టులు పత్తికొండ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన సర్దుబాటు ప్రక్రియ పత్తికొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలను దెబ్బతీసింది. పాఠశాలకు 40 ఉపాధ్యాయ పోస్టులు మంజూరవగా ఇక్కడ 31మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను కుదించారు. దీంతో 10 పోస్టుల వరకు ఇతర ప్రాంతాలకు కేటాయించారు. ఇప్పుడు 21మంది ఉపాధ్యాయులు మాత్రమే ఇక్కడ ఉండనున్నారు. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ ఉంది. మొత్తం 1,300 మంది విద్యార్థులు ఇక్కడ ఉంటున్నారు. తరగతుల వారీగా సెక్షన్లు విభజించి బోధన కొనసాగిస్తూ వచ్చారు. ఈ ఏడాది కరువు పరిస్థితులు ఏర్పడటంతో తల్లిదండ్రులు వలసబాట పట్టి పిల్లలను కూడా తీసునకెళ్లారు. దీంతో విద్యార్థుల సంఖ్య 800కు తగ్గింది. దీంతో పాఠశాలలో 10 ఉపాధ్యా పోస్టులు మాయమయ్యాయి. -
వార్షిక ప్రణాళికలను రూపొందించండి
నంద్యాల(న్యూటౌన్): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు అన్ని శాఖలు వార్షిక ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ప్రణాళికల రూపకల్పనపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 50 ఎకరాల్లో సాగవుతున్న ప్రకృతి వ్యవసాయాన్ని అదనంగా మరో 25 ఎకరాలకు పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని చేపట్టేందుకు ఇదివరకే 40 డ్రోన్స్ వినియోగించారని, మరో 40 డ్రోన్ల వినియోగానికి చర్యలు చేపట్టాలన్నారు. మత్స్య శాఖకు సంబంధించి 63వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తితో పాటు సీడ్ ఉత్పత్తిపై దృష్టి సారించాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల నుంచి ఎంఎస్ఎంఈ పార్క్లు ఏర్పాటు చేయాలన్నారు. ఏపీ టూరిజం స్టార్ హోటల్ నిర్మాణానికి రెండు ఎకరాల స్థలం కేటాయించామని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో సీపీఓ వేణుగోపాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. సైనికులకు జోహార్లు కర్నూలు(సెంట్రల్): ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులు తోక జాడించారని, భవిష్యత్లో టెర్రరిస్టులు భారత్ వైపు చూడాలంటే భయపడేలా చేసిన సైనికులకు జోహార్లు అని మాజీ సైనికుల జిల్లా అధ్యక్షుడు నర్రా పేరయ్య చౌదరి అన్నారు. శుక్రవారం జిల్లా మాజీ సైనికుల సంఘం ఆధ్వర్యంలో రాజ్విహార్ నుంచి కలెక్టరేట్ వరకు జై భరత్ మాతాకి జై అంటూ వందలాది మంది మాజీ సైనికులు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆపరేషన్ సింధూర్తో భారత్ సైనిక బలమేమిటో ప్రపంచానికి తెలిసిందన్నారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలుకోల్పోయిన సైనికులకు నివాళులు అర్పించారు. రూటు, గడ్డం రామకృష్ణ, కె.రాముడు, మనోహర్రాజు, మున్నీర్, రవీంద్ర, సూర్య నారాయణ పాల్గొన్నారు. 75శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలుకర్నూలు(అగ్రికల్చర్): పశుగ్రాసం విత్తనాలు 75 శాతం సబ్సిడీపై పంపిణీ చేస్తున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. జిల్లాకు పశుగ్రాసాల సాగుకు జొన్న విత్తనాలు 9 టన్నులు కేటాయించినట్లు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 5 కిలోల బ్యాగుల్లో లభిస్తాయని, పూర్తి ధర రూ.460 ఉండగా.. సబ్సిడీ రూ.345 ఉంటుందని, రైతులు రూ.115 చెల్లించాలని సూచించారు. ఏకవార్షిక రకానికి చెందిన జొన్న విత్తనాల కోసం రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలన్నారు. ● అదేవిధంగా జిల్లాకు సమీకృత దాణా కూడా కేటాయించారన్నారు. 50 కిలోల బస్తా ధర రూ.1,110 ఉండగా.. 50 శాతం సబ్సిడీ రూ.555 పోను రైతులు రూ.555 చెల్లించాలన్నారు. -
రైతుల ఆశలపై ‘నీళ్లు’
● ఆయకట్టుకు అందని సాగునీరు ఆలూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వర్షాలు సరిగ్గా కురవలేదు. కాలువలకు సక్రమంగా సాగు నీరు కూడా రాలేదు. దీంతో అన్నదాతలకు కన్నీరే మిగిలింది. హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ నుంచి ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు నీరు ఇవ్వాలనే ప్రతిపాదన ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పట్టించుకోకుండా రైతుల ఆశలపై ‘నీళ్లు’ చల్లింది. ఇదీ ప్రతిపాదన.. ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి నీరు వస్తుంది. మొత్తం 14,555 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం కాలువకు 650 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నారు. అయితే 150 నుంచి 200 క్యూసెక్కులు సాగునీరు (హెచ్ఎల్సీ మెయిన్ కాలువ నుంచి) మించి విడుదల కావడం లేదని రైతులు వాపోయారు. చిప్పగిరి గ్రామానికి రెండు కిలోమీటర్ల సమీపంలో ప్రవహిస్తున్న హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము (డీపీ)ను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ తూము ఏర్పాటు చేస్తే దాదాపు 80 వేల ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పట్టించుకోని ప్రభుత్వం కాలువకు నీరు రాక, పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువకు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలనే అధికారుల ప్రతిపాదనను పక్కన పెట్టారు. దీంతో ఆయకట్టు రైతులకు పంటలు పండటం లేదు. హామీలను గాల్లోకి వదిలేశారు ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు ఇచ్చిన హామీలను గాల్లోకి వదిలేశారు. ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదు. సాగు ప్రాజెక్టులు నిర్మించాలని, కాలువలకు తూములు ఏర్పాటు చేయాలని ఆలోచన చేయడం లేదు. హెచ్ఎన్ఎస్ నుంచి ఏబీసీకి సాగునీరు విడుదల చేయాలి. నగరడోణ గ్రామ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు కూడా పూర్తిచేయాలి. – బి. విరూపాక్షి, ఆలూరు ఎమ్మెల్యే అనుమతులు రాలేదు ఆలూరు సబ్ బ్రాంచ్ కాలువకు సాగుటిని విడుదల చేసేందుకు హెచ్ఎన్ఎస్కు ప్రత్యేకంగా తూము ఏర్పాటు చేయాలని గతంలో రూ. 3 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు అనుమతులు రాలేదు. వాటర్ యూజర్స్ కమిటీ పర్యవేక్షణ చేయాల్సి ఉంది. – చంద్రశేఖర్, హెచ్ఎల్సీ ఆలూరు ఏబీసీ డీఈ -
రాష్ట్రంలో వ్యవస్థలన్నీ సర్వనాశనం
● ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ‘కూటమి’ పాలన ● తప్పుడు కేసులు, అసత్య ప్రచారమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం ● హామీలు అమలు చేయని సీఎం చంద్రబాబు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని వ్యవస్థలన్నీ సర్వనాశనం అయ్యాయని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. డోన్ పట్టణంలోని తన స్వగృహంలో శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా అరెస్టులు చేయించి శునకానందం పొందుతున్నారని ధ్వజమెత్తారు. మోసం బాబు నైజం అధికార దాహంతో నోటికి వచ్చిన హామీలనిచ్చి విస్మరించడం సీఎం చంద్రబాబు నాయుడు నైజ మని బుగ్గన ఆరోపించారు. సూపర్సిక్స్ పథకాలంటూ అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. చంద్రబాబు గత చరిత్ర సమస్తం అబద్ధపు వాగ్దానాలు, అసత్య ప్రచారాలతో నిండిపోయిందన్న విషయం ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. కక్ష సాధింపు చర్యలతో, అక్రమ అరెస్టులతోనే ప్రస్తుతం రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోందని బుగ్గన ధ్వజమెత్తారు. సమావేశంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, ఎంపీపీ రేగటి రాజశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బద్దల రాజ్కుమార్, మున్సిపల్ వైస్చైర్మన్ జాకీర్హుసేన్, సింగిల్విండో మాజీ అధ్యక్షులు తిరునాంపల్లె తిరుమలరెడ్డి, పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు సోమేష్ యాదవ్, మల్లికార్జునరెడ్డి, మార్కెట్యార్డు మాజీ చైర్మన్ మల్లెంపల్లె రామచంద్రుడు, క్లస్టర్ యూనిట్ మాజీ సభ్యులు నాగభూషణంరెడ్డి, జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పోసు్ట్రపసాద్, పార్టీ నాయకులు కురుకుందు హరి, గజేంద్రారెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి, చంద్ర, ధారా ప్రతాప్రెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం..కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రతి వైఎస్సార్సీపీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని బుగ్గన అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కూటమి ప్రభుత్వం డొల్లతనాన్ని జానాలకు అర్థమయ్యేరీతిలో వివరించాలని తెలిపారు. తల్లికి వందనం, రైతు భరోసా, విద్యాదీవెన, వసతిదీవెన లాంటి పథకాలకు మంగళం పాడి కూటమి ప్రభుత్వం తల్లి, పిల్లల ఉసురు పోసుకుందని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుపరిపాలన చేస్తే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రాక్షస పాలన సాగిస్తుందనే విషయం అందరికీ తెలిసేందనన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కులం, మతం, ప్రాంతీయ, రాజకీయ పార్టీల భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక హామీ కూడా అమలు చేయలేదని, వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. -
మోసం చేసి పర్యటనా?
● ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు బి.గిడ్డమ్మ కర్నూలు(సెంట్రల్): ఎన్నికల సమయంలో మహిళలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబు మోసం చేశారని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గిడ్డమ్మ విమర్శించారు. మోసం చేసిన వ్యక్తి ఏ ముఖం పెట్టుకొని కర్నూలుకు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500, తల్లికి వందనం కింద ఎంత మందిపిల్లలు ఉంటే అందరికీ రూ.15,000 ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారనప్నారు. సంపద సృష్టించి మహిళలను లక్షాధికారులను చేస్తానని చెప్పి బిచ్చగాళ్లను చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి భారతి, పావని పాల్గొన్నారు. -
ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. అయితే వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. జీతాలు రాక గ్రామీణ ఉపాధి హామీ పథకంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కుటుంబాలు ప
ఆళ్లగడ్డ: జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణలో ఉపాధి హామీ పథకంలో ఏపీఓ, ఈసీ టీఏ, ఎఫ్ఏ, కంప్యూటర్ ఆపరేటర్లు 677 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా సమన్వయంతో పనులు చేస్తున్నారు. దాదాపు 60 వేల కుటుంబాలకు ఉపాధి పనులు కల్పిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో పనులు గుర్తించడం, ప్రతి రోజు కూలీలతో చేయించడం, సకాలంలో వేతనాలు అందిస్తున్నారు. కాంపోటెంట్ పనులకు బిల్లులు చెల్లించడంలో వీరందరి పాత్ర కీలకం. అయితే వీరే సుమారు మూడు నెలలుగా వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం! ఉపాధి కూలీలకు ఎక్కువ పనిదినాలు కల్పించే బాధ్యతలో అధికారులు, సిబ్బంది కీలక భాగస్వాములు. ఉపాధి పనుల్లో పండ్ల తోటల పెంపకం, సాగునీటి కాల్వలు, చెరువులు, నీటి కుంటలు, డంపింగ్ యార్డ్లు, గోకులాల నిర్మాణాలు, నర్సరీల నిర్వహణ ఉంటాయి. ‘ఉపాధి’ కూలీలకు వారవారం వేతనం బ్యాంకు ఖాతాలో జమ అయ్యేలా అధికారులు, సిబ్బంది చూడాలి. అయితే వీరికి సకాలంలో జీతాలు అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. వచ్చే వేతనాలు తెచ్చిన అప్పులకు వడ్డీలకే సరిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపు ఏదీ? ఉపాధి హామీలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న వారిని రెండు సంవత్సరాలు దాటితే ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయ్గా గుర్తించాలి. అయితే ఏళ్లు గడుస్తున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానే చాలీచాలని వేతనాలు అందజేస్తున్నారని మండి పడుతున్నారు. లక్ష్యాలు విధిస్తూ పనిభారం పెంచుతున్న ప్రభుత్వం ఫిక్స్ టెన్యూర్ ఎంప్లాయ్గా గుర్తించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. పెండింగ్ బిల్లులు రూ. 100 కోట్లు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో చేసిన వివిధ పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు జిల్లాలో సుమారు రూ. 100 కోట్లకు చేరుకున్నాయి. సుమారు ఆరు నెలలుగా చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా మొదలు పెట్టిన పనులన్నీ సంపూర్తిగా నిలిచిపోయాయి. 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చేసిన పనులకే బిల్లుల రాని కారణంగా కొత్తవి చేపట్టెందుకు వెండర్లు ఎవరూ ముందుకు రావడంలేదు. ‘ఉపాధి’ సిబ్బందికి మూడు నెలలుగా అందని జీతాలు కుటుంబాల పోషణకు ఆపసోపాలు రూ. 1.30 కోట్లకు పైగా వేతన బకాయిలు జీతాల కోసం 677 మంది ఉద్యోగుల ఎదురు చూపు -
బాబు మాట.. నీటి మూట!
హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చాక దానిని మరచిపోవడం సీఎం చంద్రబాబుకు అలవాటేనని పలువురు ఆరోపిస్తున్నారు. శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఇచ్చిన వాగ్దానాలే ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. శ్రీశైలం నీటిముంపు నిర్వాసితుల సమస్యను పరిష్కరిస్తానని 2003, 2016, 2019, 2024లో టీడీపీ అధినేత మాట ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. నాలుగు సార్లు హామీలు ఇచ్చినా.. ఇప్పటి వరకు ఉద్యోగాలు రాలేదని నీటిముంపు బాధితులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.నందికొట్కూరు: శ్రీశైలం వద్ద కృష్ణానదిపై జలాశయం నిర్మాణానికి 1963లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు కింద సుమారు 12 వేల కుటుంబాలు సర్వం కోల్పోయాయి. మొత్తం 66 గ్రామాల్లో లక్ష ఎకరాల భూమి ముంపునకు గురైంది. 44 రెవెన్యూ గ్రామాలు, 22 మజరా గ్రామాలకు చెందిన ప్రజలు నిర్వాసితులయ్యారు. వీరు నాలుగు దశాబ్దాలుగా ఉద్యోగం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. వీరి సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. సాగునీరు, విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టుతో ఇరు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు కలుగుతోంది. నిర్వాసితులు మాత్రం న్యాయం కోసం నేటికీ పోరాడాల్సి వస్తోంది. ఏం జరిగిందంటే.. శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు ఉద్యోగాల కోసం 1982లో ఉద్యమ బాటపట్టారు. అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు.. శ్రీశైలం ముంపు బాధిత ఇంటింటికీ ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా 1986లో జీఓ 98 జారీ అయ్యింది. దీంతో అప్పట్లో 1,200 మంది ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన జీవోను టీడీపీ అధినేత చంద్రబాబు తుంగలో తొక్కేశారు. ఉద్యోగాలు ఇస్తామని పలుమార్లు హామీ ఇచ్చినా అమలు చేయలేదు. న్యాయం కోసం ఎదరు చూపు శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు మొదటి జాబితాలో 965 మందిని అర్హులుగా ప్రకటించారు. 2012లో కేవలం 120 మందికి మాత్రమే తాత్కాలిక పద్ధతిలో లష్కర్ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం ఉన్న సయమంలో రెండో జాబితాను తయారు చేయించినా ఉద్యోగాలు ఇవ్వలేదు. దీంతో నీటిముంపు నిరుద్యోగులు మళ్లీ పోరాటం కొనసాగించారు. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూనే ఇప్పటికీ చాలా మంది పెళ్లిళ్లు కూడా చేసుకోలేదు. కొందరు ఆనార్యోగాల కారణంగా మృతి చెందారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణానికి భూములిచ్చి 45 సంవత్సరాలు అవుతున్నా నిర్వాసితులకు ఉద్యోగం కలగానే మిగిలింది. ధర్నాలు, దీక్షలు చేసి నిర్వాసితులు అలసిపోయారు. న్యాయం చేయాలని కోరుతున్నారు. హామీని ఇలా ‘నీరు’గార్చారు.. ● శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని 2003లో సీఎం హోదాలో నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో హామీ ఇచ్చారు. ● సీఎం హోదాలో 2016లో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం వద్ద జలహారతి కార్యక్రమంలో ఇదే హామీ ఇచ్చారు. ● సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 2019లో నందికొట్కూరుకు వచ్చి నీటిముంపు నిరుద్యోగులకు న్యాయం చేస్తామని వాగ్దానం చేశారు. ● 2024లో జరిగిన ఎన్నికల్లో నందికొట్కూరు పటేల్ సెంటర్లో టీడీపీ అధినేతగా చంద్రబాబు ప్రసంగించారు. శ్రీశైలం నిర్వాసితులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఇచ్చిన హామీని అమలు చేయలేదు. ● నిర్వాసితులు గత ఏడాది ఆక్టోబర్ 28న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు వినతి పత్రం అందజేశారు. ఆరు నెలల దాటినా డిప్యూటీ సీఎం సమస్యకు మార్గం చూపించలేదు. అమలు కాని సీఎం చంద్రబాబు హామీ న్యాయం చేయాలంటున్న శ్రీశైలం నీటిముంపు నిరుద్యోగులు శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన 66 గ్రామాలు అప్పట్లో భూములు కోల్పోయిన 12 వేల కుటుంబాలు -
నేటి నుంచి ఆటోమేటిక్ ఫిట్నెస్ పరీక్షలు
కర్నూలు: రవాణా శాఖ పరిధిలో సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ టెస్ట్) సులభతరం కానున్నాయి. జిల్లాలో భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్నెస్ టెస్ట్(ఏటీఎస్) స్టేషన్ వసుధ ఇండస్ట్రీస్ ఏజెన్సీ దక్కించుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు (ఎంవీఐ) ప్రత్యక్షంగా తనిఖీ చేసి ధృవపత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఏటీఎస్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ధృవపత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్లు స్వయంగా ఎంవీఐలే జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు నేటి నుంచి (16వ తేదీ) ఫిట్నెస్ సేవలు రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేశారు. నంద్యాల జిల్లాలో చాబోలు వద్ద ఈనెల మొదటి వారంలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ను ప్రారంభించగా.. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏటీఎస్ ద్వారా 54 రకాల పరీక్షలు చేస్తారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు కేంద్రాలే ఏర్పాటు చేయడం, మిగిలిన ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లాలంటే అవస్థలు తప్పేలా లేవు. ఆదోనికి చెందిన వాహనదారులు చిన్నటేకూరు వద్దకు, డోన్కు చెందిన వాహనదారులు చాబోలు కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్నెస్ సేవలు నిలిపివేయడంతో రెండు రోజుల ముందే ఆన్లైన్లో స్లాట్ పొందిన గూడ్స్ వాహన యజమానులు అయోమయంలో పడ్డారు. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రయివేట్ స్టేషన్ రవాణా శాఖ కార్యాలయాల్లో ఎఫ్సీ సేవలు నిలుపుదల -
శ్రీమఠంలో భక్తుల సందడి
మంత్రాలయం: శ్రీ రాఘవేంద్రస్వామి మఠంలో భక్తుల సందడి నెలకొంది. గురువారం ప్రత్యేకం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రుల మూల బృందావనం దర్శనాలు చేసుకున్నారు. రాఘవేంద్రుల బృందావన దర్శనానికి రెండు గంటలకుపైగా సమయం పట్టింది. భక్తుల రాకతో దర్శన క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళప్రసాదం కౌంటర్లు కిటకిటలాడాయి. నిత్య వేడుకల్లో భాగంగా రాయరు ప్రతిమకు ఊంజల మంటపంలో ప్రత్యేక ఆర్జిత సేవలు చేశారు. అనంతరం బంగారు పల్లకీలో రాయరు బృందావన ప్రతిమను రమణీయంగా ఊరేగించారు.శ్రీమఠం ప్రాంగణంలో భక్తులు -
తడిసిన ధాన్యం.. అన్నదాత దైన్యం
వర్షపాతం వివరాలు.. మండలం వర్షపాతం (మి.మీ) ఆత్మకూరు 51.4 రుద్రవరం 50.8 కొత్తపల్లి 50.4 డోన్ 26.8 గడివేముల 22.2 దొర్నిపాడు 20.4 మహానంది 19.2 పాములపాడు 17.4 కోవెలకుంట్ల/బేతంచెర్ల 16.6 అవుకు 15.2 గోస్పాడు 13.2 ప్యాపిలి 13.0 వెలుగోడు 10.6 పాణ్యం 10.0నంద్యాల(అర్బన్): జిల్లాలో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయం ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయి రైతులకు దైన్యమే మిగిలింది. ఆత్మకూరు, కొత్తపల్లి, రుద్రవరం, చాగలమర్రి మండలాల్లో నష్టం ఎక్కువగా ఉంది. అనేక ప్రాంతాల్లో స్తంభాలు నేలకొరిగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆత్మకూరు మండలం కరివేన, నల్లకాల్వ, సిద్ధాపురం, బాపనంతపురం గ్రామాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసి పోయింది. కొత్తపల్లి మండలం వీరాపురం, సంగమేశ్వరం, లింగాపురం గ్రామాల్లో వర్షపునీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ● చాగలమర్రి మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున పిడుగుపాటుతో మేకల కాపరి చంద్రశేఖర్ మృతి చెందారు. మూడు మేకలు కూడా మృత్యువాత పడ్డాయి. ● రుద్రవరం మండలంలో రోడ్లు జలమయమయ్యాయి. గ్రామాల్లో అక్కడక్కడ చెట్లు విరిగి రహదారులకు అడ్డంగా పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోవడంతో వాటిని దాచేందుకు రైతులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ● డోన్, గడివేముల, మహానంది, పాములపాడు, కొలిమిగుండ్ల, బేతంచెర్ల అవుకు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. -
యాగంటిలో జిల్లా కలెక్టర్ దంపతులు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరస్వామికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఈఓ చంద్రుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ బండి మౌలీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నాటుసారా నివారణకు టోల్ఫ్రీ నంబరు 14405 నంద్యాల(న్యూటౌన్): నాటుసారా నివారణకు 14405 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ తెలిపారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం నవోదయం 2.0 కార్యక్రమ పటిష్ట అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 3,474 లీటర్ల నాటు సారా సీజ్ చేశామన్నారు. ఎకై ్సజ్ శాఖ వారి తరఫున 198 , పోలీసు సహకారంతో 47 కేసులను నమోదు చేశామన్నారు. ప్రాహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డీఎంహెచ్ఓ వెంకటరమణ, డీఈఓ జనార్దన్రెడ్డి, డీఎఫ్ఓ నాగమునేశ్వరి పాల్గొన్నారు. ఏపీ ఈసెట్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్కి చెందిన పెరుమళ్ల రాజేష్ 6వ ర్యాంకు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్ ముబారక్ నగర్కి చెందిన షేక్ ముస్కాన్ 6వ ర్యాంకు, షేక్ తజ్మీన్ 10వ ర్యాంకు సాధించారు. -
కిలో చికెన్కు రూ.20 కమిషన్ ఇవ్వాల్సిందే.. ఆళ్లగడ్డలో రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
సాక్షి, నంద్యాల: చంద్రబాబు రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం సృష్టిస్తుంటే, టీడీపీ ప్రజాప్రతినిధులు సైతం రెండడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో ఆక్రమ ఆదాయ మార్గాలను అన్వేషించడంలో ఒకరిని మించి మరొకరు పోటీ పడుతున్నారు.ఇటీవల,నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో కిలో చికెన్కు రూ.10 మామూళ్లు ఇవ్వాల్సిందేనని టీడీపీ ఎమ్మెల్యే అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ హుకుం జారీ చేయడం విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు తామేం తక్కువేం తినలేదంటూ టీడీపీ నేతలు, ఎమ్మెల్యే అఖిల ప్రియ మహిళా అనుచరులు రెచ్చిపోతున్నారు.చికెన్ కోళ్లను తమవద్దే కొనాలంటూ వ్యాపారస్తులకు హూకుం జారీ చేస్తున్నారు. చికెన్ కోళ్లను తమ వద్ద కొనుగోలు చేయకపోతే చికెన్ సెంటర్లను మూసేస్తామని బెదిరిస్తున్నారు. కేజీ చికెన్ మీద రూ.20 రూపాయిలు కమీషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు.ఈ క్రమంలో తాము చిరు వ్యాపారులమని, కమిషన్లు ఇచ్చుకుంటూ పోతే..తమ కుటుంబ పోషణ భారమవుతుందటూ చికెన్ షాపు వ్యాపారస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేతల ఆగడాలపై వ్యాపారస్తులు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. కేజీకి రూ.20 రూపాయలు కమిషన్ ఇవ్వాలని, కోళ్లను తమ దగ్గరే కొనుగోలు చేయాలంటూ టీడీపీ నేతల ఆగడాలపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల బెదిరింపులు దౌర్జన్యాలు భరించలేక జిల్లా ఎస్పీని కలిసిని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమరి చికెన్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భర్త మరణాన్ని జీర్ణించుకోలేక భార్య ఆత్మహత్య
ఉయ్యాలవాడ: విధి ఆటలో ఓ చిన్నారి అనాథగా మారింది. అభంశుభం తెలియని పసిపాప తొమ్మిది రోజుల వ్యవధిలో తల్లిదండ్రులను కోల్పోయింది. ఈ విషాద ఘటన ఆర్. పాంపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పొగాకు నారాయణ కూలీ పనులకు వెళుతూ జీవనం కొనసాగించేవాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 6వ తేదీన గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి చెందిన మట్టి మిద్దె పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ప్రమాదవశాత్తూ మిద్దె కూలి శిథిలాలు నారాయణపై పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటి నుంచి అతని భార్య లలిత (40) తీవ్ర మనోవేదనకు గురైంది. మనస్తాపంతో వారం రోజులుగా ఆహారం తీసుకోకుండా భర్త గురించే ఆలోచించింది. తన 45 రోజుల చిన్నారికి కూడా పోతపాలు తాపింది. చివరకు జీవితంపై విరక్తి చెంది బుధవారం ఉదయం లలిత రసాయన పౌడర్ను నీళ్లలో కలుపుకుని అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన బంధువులు, స్థానికులు చికిత్స నిమిత్తం 108లో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో లలిత మృతి చెందింది. తల్లిదండ్రుల మృతి చెంద డంతో 45 రోజుల చిన్నారి అనాథగా మిగిలింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పసిపాపకు తల్లిదండ్రులు లేకపోవడంతో నాయనమ్మ శివమ్మ దిక్కైంది. అమ్మపాల కోసం ఏడస్తున్న చిన్నారిని చూసి పలువురు కంటతడి పెట్టారు. కాగా నారాయణ మొదటి భార్య విజయలక్ష్మి ఐదేళ్ల క్రితం కుటుంబ కలహాలతో క్రిమి సంహారక మందు తాగి మృతి చెందింది. రెండేళ్ల క్రితం లలితను రెండవ వివాహం చేసుకున్నాడు. మృతురాలి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్.. ఇటీవల జిల్లాలో పలువురు ఆత్మహత్యకు కల్లాపికి ఉపయోగించే పేడ రంగును నీళ్లలో కలుపుకుని తాగి మృతి చెందుతుండటంతో కలెక్టర్ రాజకుమారి నెల క్రితం పేడ రంగు విక్రయాలను నిషేధించారు. అయినా కొందరు కిరాణ దుకాణ వ్యాపారులు విక్రయిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పేడ రంగు విక్రయించకుండా అధికారులు దుకాణాలపై దాడులు చేయా లని గ్రామస్తులు కోరుతున్నారు. -
ధరల పతనం.. జీరో వ్యాపారం!
● మార్కెట్ఫీజు లేకుండానే సరిహద్దులు దాటుతున్న ధాన్యం ● ముడుపుల వసూళ్ల కోసం చెక్పోస్టుల్లో అనధికార వ్యక్తులు కర్నూలు(అగ్రికల్చర్): రైతులు పండించిన పంటలకు ధరలు పతనం కావడంతో వ్యాపారుల లాభం కోసం, స్వప్రయోజనాల కోసం కొన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీలు జీరో వ్యాపారానికి గేట్లు ఎత్తాయి. ముడుపుల వసూళ్ల కోసం చెక్పోస్టుల్లో అనధికార వ్యక్తులను నియమించినట్లు విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రబీలో సాగైన వరి నెల రోజుల నుంచి రైతుల ఇంటికి వస్తోంది. ధర లేకపోవడంతో రైతుల నుంచి ధాన్యాన్ని దళారులు, వ్యాపారులు కొనుగోలు చేసి ‘జీరో’ పై సరిహద్దులు దాటిస్తున్నారు. మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ముట్టచెబుతూ.. యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఆదాయం కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులు కోవడం లేదని, ఇందులో భాగంగానే ధాన్యం జీరోపై తరలించేందుకు గేట్లు తెరిచారనే విమర్శలు వస్తున్నాయి. వ్యాపారుల అక్రమాలు ఇలా.. ధాన్యం క్రయవిక్రయాలపై 2 శాతం మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. రైతులే స్వంతంగా ఇతర ప్రాంతాల్లో విక్రయించుకోవడానికి తరలిస్తే ఎటువంటి ఫీజు ఉండదు. వ్యాపారుల నుంచి మాత్రమే ఫీజు వసూలు చేస్తారు. ధాన్యం క్వింటాలు ధర రూ.2,000 వరకు ఉంటోంది. లారీ సామర్థ్యాన్ని బట్టి 300 క్వింటాళ్ల వరకు లోడ్ చేస్తారు. లారీ ధాన్యం విలువ రూ.6 లక్షలు ఉంటుంది. నిబంధనల ప్రకారం 2 శాతం ప్రకారం రూ.12 వేలు మార్కెట్ ఫీజు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో ఎక్కడైనా సరే ఒక్కచోట ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. వ్యాపారులు లారీకి రూ.12 వేలు ఫీజు చెల్లించడం మనసొప్పక మార్కెట్ కమిటీ అధికారులకు ముడుపులు ఇచ్చుకొని తరలిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అక్కడక్కడ ముడుపుల కింద రూ.6000 పోయినా రూ.6000 మిగులు ఉంటుందనేది వ్యాపారుల ఉద్దేశం. కర్ణాటకకు తరలుతున్న ధాన్యం... పాణ్యం, నంద్యాల, శిరువెళ్ల, రుద్రవరం, బండిఆత్మకూరు తదితర మండలాల్లో పండించిన ధాన్యం కర్ణాటక రాష్ట్రానికి తరలుతోంది. ప్రధానంగా కర్ణాటకలోని సిరుగుప్పకు వెళ్తున్నట్లు సమాచారం.హైదరాబాద్కు కూడా కొంతమేర ధాన్యం వెళ్తోంది. ప్రధానంగా రాత్రి వేళల్లోనే రోజుకు 20 నుంచి 30 లారీల వరకు ధాన్యం ఎలాంటి మార్కెట్ ఫీజుల చెల్లించకుండా వెళ్తోంది. పాణ్యం, కర్నూలు మార్కెట్ కమిటీలకు చెందిన చెక్పోస్టుల్లో ఎక్కడో ఒక చోట మార్కెట్ ఫీజు వసూలు చేయాల్సి ఉన్నా.. మామూళ్లు తీసుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కర్నూలులోని చౌరస్తా చెక్పోస్టులో అనధికార వ్యక్తిని నియమించి ముడుపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక దృష్టి సారించాం మార్కెట్ ఫీజు ఫీజు చెల్లించకుండా వ్యాపారులు ధాన్యాన్ని జిల్లా సరిహద్దు దాటించకుండా ప్రత్యేక స్క్వాడ్ల ఏర్పాటు చేశాం. జీరో వ్యాపారం నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాం. – నారాయణమూర్తి, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు కిట్ల పంపిణీ
నంద్యాల(న్యూటౌన్): వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు అవసరమైన కిట్లను పంపిణీ చేశామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం, శాప్ ఆధ్వర్యంలో 50 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ శిబిరాల్లో 8 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారన్నారు. ప్రతి శిక్షణ శిబిరానికి రూ. 5 వేల విలువ చేసే క్రీడా కిట్లు ఇచ్చామన్నారు. క్యాంపు ఇన్చార్జ్ కు గౌరవ వేతనం రూ.1,500, క్యాంపు నిర్వహణకు రూ. 500 చొప్పున మొత్తంగా 50 క్రీడా శిక్షణ శిబిరాలకు రూ.3.50 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. శిబిరాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారన్నారు. జిల్లా క్రీడా అభివృద్ధి శాఖ అధికారి ఎంఎన్వీ రాజు, శిక్షకులు, క్యాంపు కోచ్లు పాల్గొన్నారు.265 మంది విద్యార్థుల గైర్హాజరునంద్యాల(న్యూటౌన్): జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు 265 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ సునీత తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 7,071 మందికి గాను 6,852 మంది హాజరు కాగా 219 మంది గైర్హాజరయ్యారన్నారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు రెండో సంవత్సరం విద్యార్థులు 1,407 మందికి గాను 1,361 మంది హాజరు కాగా 46 మంది గైర్హాజరయ్యారన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు.విజిబుల్ పోలీసింగ్కు ప్రాధాన్యంబొమ్మలసత్రం: నేరనివారణ లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. గడిచిన 48 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 38 మందిపై, బహిరంగంగా మద్యం సేవించిన 136 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నైట్బీట్లలో భాగంగా ప్రతిరోజు సిబ్బంది వారి పరిధిలో గస్తీ నిర్వహిస్తున్నారని, అనుమానితుల వివరాలు సేకరించి వారి వేలిముద్రలు తీసుకుని దొంగతనాలు, అల్లర్లు, గొడవలు జరుగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. గడిచిన 48 గంటల్లో ర్యాష్ డ్రైవింగ్ చేసిన 599 మంది పై రూ.4.62 లక్షల జరిమానా విధించామన్నారు. మద్యం సేవించి వాహనం నడుపుతున్న 38 మంది పై కేసులు నమోదు చేశామన్నారు.టెండర్ దశలో డీఎంఎఫ్, నాబార్డు పనులుకర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో డీఎంఎఫ్(2024–25), నాబార్డు ఆర్ఐడీఎఫ్(2025–26) నిధులతో చేపట్టనున్న రోడ్ల పనులు టెండర్ దశలో ఉన్నాయని పంచాయతీరాజ్ పర్యవేక్షక ఇంజనీరు వి.రామచంద్రారెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజలకు పూర్తి ఇబ్బందిగా ఉన్న రోడ్లను ఎంపిక చేసి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామన్నారు. ఈ నేపథ్యంలోనే కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 29 రోడ్లు, ఒక బిల్డింగ్ పనికి సంబంధించి రూ.42.58 కోట్లతో పాలనా అనుమతులు వచ్చాయన్నారు. పనులను ప్రారంభించేందుకు ఈ నెల 9నుంచి 23వ తేది మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఆన్లైన్లో టెండర్లు దాఖాలు చేసేందుకు సమయం ఇచ్చారన్నారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే 23వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు టెక్నికల్ బిడ్స్ను.. 26న ఉదయం 11 గంటలకు ఫైనాన్సియల్ బిడ్స్ను ఓపెన్ చేస్తామన్నారు. టెండర్ ప్రాసెస్ పూర్తయిన అనంతరం పనులను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామన్నారు.జాతీయ వైద్య కమిషన్ సభ్యులుగా డాక్టర్ చంద్రశేఖర్కర్నూలు(హాస్పిటల్):జాతీయ వైద్య కమిషన్ మెడికల్ అడ్వయిజరీ కౌన్సిల్ సభ్యులుగా రాష్ట్రం తరపున కర్నూలుకు చెందిన డాక్టర్ పి.చంద్రశేఖర్ను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టిఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ఉన్న ఆయనకు జాతీయ వైద్య కమిషన్ సభ్యులుగా నామినేట్ చేయడం పట్ల స్థానిక వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
లైసెన్స్ ఫీజు 20వ తేదీలోగా చెల్లించాలి
కర్నూలు: జిల్లాలోని మద్యం దుకాణాల ఐదో విడత లైసెన్స్ ఫీజు ఈనెల 20లోపు చెల్లించేలా చూడాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ నోడల్ డిప్యూటీ కమిషనర్ పి.శ్రీదేవి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు. బుధవారం తన కార్యాలయంలో నంద్యాల, కర్నూలు జిల్లాల ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎకై ్సజ్ స్టేషన్ల వారీగా నమోదైన నేరాలు, దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు, నాటుసారాను సమూలంగా నిర్మూలించేందుకు తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. కర్నూలు జిల్లాలో 40 శాతం గ్రామాలను నెలాఖరుకు సారా రహిత ప్రాంతాలుగా ప్రకటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లాలో 430 మంది, నంద్యాల జిల్లాలో 352 మంది పాత నేరస్థులు ఉన్నారని, వారందరినీ నెలాఖరు లోపు తహసీల్దార్ల ఎదుట బైండోవర్ చేయాలన్నారు. ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడి జైలుకు వెళ్లినప్పటికీ వృత్తిని మానుకోని వారిపై ఒక్కో స్టేషన్ పరిధిలో ఒకరిపై నెలాఖరులోపు పీడీ కేసులు నమోదు చేయాలన్నారు. నవోదయం 2.0 అమలులో భాగంగా సారా నిర్మూలనకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి కానిస్టేబుల్కు బీట్ పరిధిని నిర్ణయించి సారా నిర్మూలనకు పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ కమిషనర్ రావిపాటి హనుమంతరావు, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు మచ్చ సుధీర్ బాబు, రవికుమార్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు రామకృష్ణారెడ్డి, రాముడు, రాజశేఖర్ గౌడ్తో పాటు ఉమ్మడి జిల్లాల ఇన్స్పెక్టర్లు సమావేశంలో పాల్గొన్నారు. -
అనుకున్నట్లే జరిగింది. మంత్రి టీజీ భరత్ కుటుంబానికి చెందిన ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణపై చేపట్టిన ప్రజాభిప్రాయసేకరణ పూర్తి ఏకపక్షంగా సాగింది. పక్కా స్క్రిప్ట్ ప్రకారం ఎవరు మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని ముందే కొంతమందిని ప్రత్యేకంగా ఎంపిక చేసి వారితో అను
పోలీస్, రెవెన్యూ శాఖ అధికారుల సమక్షంలోనే దాడి కాలుష్య కారకాలు వెదజల్లకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓకు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించా. ఇంతలోనే కర్నూలుకు చెందిన కొందరు గూండాలు నన్ను ఎత్తుకొని వెనుక వైపు తీసుకెళ్లారు. విచక్షణరహితంగా కొట్టారు. చివరకు కింద పడేసి గొంతుపై చెప్పుల కాళ్లతో తన్నారు. పోలీసులు చూసినా పట్టించుకోలేదు. ఇది ప్రజాస్వామ్యమా, లేదంటే టీజీ వెంకటేష్స్వామ్యమా. ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేసి మళ్లీ కలెక్టర్ సమక్షంలో నిర్వహించాలి. – రాఘవేంద్ర, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ప్రైవేట్ గూండాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణా? టీజీవీ గ్రూపు ఏర్పాటు చేయనున్న ప్రమాదకర పీటీఎఫ్ఈ, సీపీవీసీ పరిశ్రమ విస్తరణకు సంబంధించి బుధవారం గొందిపర్లలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణ పూర్తిగా ప్రైవేట్ గూండాల కనుసన్నల్లో జరిగింది. ప్రజా సంఘాల నాయకులపై ప్రైవేట్ సైన్యం విచ్చలవిడిగా దాడి చేసింది. అభ్యంతరాలను ఇవ్వడానికి వెళితే తీసుకోకుండా దాడులు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కలుగజేసుకొని పరిశ్రమ విస్తరణను అడ్డుకోవాలి. లేదంటే పోరాటాలకు దిగుతాం. – వై.నగేష్, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నా సెల్ఫోన్ను లాక్కున్నారు నేను నాకున్న అభ్యంతరాలను ఇవ్వాలని ముందుగానే సభకు వెళ్లాను. అయితే నన్ను కొందరు ప్రైవేట్ గూండాలు గుర్తించి మధ్యలో బయటకు లాక్కెళ్లి పడేశారు. అప్పుడే నా సెల్ఫోన లాక్కున్నారు. అందులో ఏమీ లేవన్నా వినలేదు. ఇంతవరకు నా సెల్ను ఎవరిని అడిగినా ఇవ్వడంలేదు. రేపు టూటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తా. – ఎండీ ఆనందబాబు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీకర్నూలు(రూరల్)/కర్నూలు(సెంట్రల్): రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీలో టెఫ్లాన్(పీటీఎఫ్ఈ) తయారీ పరిశ్రమ కోసం బుధవారం గొందిపర్లలో ప్రజాభిప్రాయసేకరణ సభ నిర్వహించారు. కాలుష్యనియంత్రణ మండలి ఈఈ కిషోర్కమార్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆర్డీవో సందీప్కుమార్, తహసీల్దార్ రమేశ్బాబుతో పాటు యాజమాన్యం తరఫున మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ పాల్గొన్నారు. సభలో 30మంది దాకా తమ అభిప్రాయాలు చెప్పారు. అయితే గొందిపర్లతో పాటు టీజీ వెంకటేశ్కు అనుకూలంగా ఉన్న వ్యక్తులు భారీ సంఖ్యలో సభకు హాజరయ్యారు. ఫ్యాక్టరీ నిర్మాణం, పీటీఎఫ్ఈ తయారీకి వాడే పీఎఫ్ఓఏతో కలిగే కాలుష్యం తదితర అంశాలపై కొన్ని రోజులుగా పలువురు శాస్త్రవేత్తలు, పౌరసంఘాలు, వామపక్షాలు ఆందోళన చేపడుతున్నాయి. ఈక్రమంలో వారెవ్వరినీ సభలోకి రాకుండా యజమాన్యం కట్టడి చేసింది. వచ్చిన కొద్దిమందిపై కూడా టీజీ ప్రైవేటు సైన్యం భౌతికదాడులు చేసి గెంటేసింది. కవరేజీకి వెళ్లిన పత్రికా విలేకరుల సెల్ఫోన్లు సైతం లాక్కోవడం గమనార్హం. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర, కార్యదర్శి నగేశ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఎండీ ఆనంద్బాబు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామకృష్ణలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే ప్రైవేటు సైన్యం, పోలీసులు వారిని అక్కడి నుండి లాక్కుని బయటకు తీసుకెళ్లారు. టీజీ ప్రైవేటు సైన్యం రాఘవేంద్ర గొంతుపై కాలుతో తొక్కేశారు. ఎండీ ఆనంద్బాబుపై పిడిగుద్దలు గుద్ది మొబైల్ఫోన్ కూడా లాక్కున్నారు. నగేశ్, రామకృష్ణను కూడా బయటకు లాగేసి విచక్షణా రహితంగా దాడి చేశారు. ఓవైపు ఆర్డీవో సందీప్కుమార్ మాట్లాడేందుకు అందరికీ అవకాశం ఇస్తామని చెబుతుంటే మరోవైపు టీజీ ప్రైవేటు సైన్యం ప్రజా సంఘాలు, వామపక్షాల ప్రతినిధులను విచక్షణారహితంగా లాక్కెళ్లి దాడి చేయడం గమనార్హం. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరుగుతున్నా వారు ప్రేక్షక పాత్ర పోషించడంతో పాటు ప్రైవేటు సైన్యానికి అనుకూలంగా వ్యవహరించారు. దీంతో ప్రజాసంఘాలు, వామపక్షాలు తీవ్ర ఆవేదనకు గురయ్యాయి. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయసేకరణ జరుగుతుంటే కనీసం అభిప్రాయాలు వినేందుకు కూడా యాజమాన్యం అంగీకరించకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పీటీఎఫ్ఈ వాడకానికి వాడే రసాయనం ఏంటో స్పష్టత ఇవ్వని వైనం పీటీఎఫ్ఈ తయారీకి పీఎఫ్ఓఏ వాడుతున్నారని శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నాయి. అయితే టీజీ వెంకటేశ్ పీఎఫ్ఓఏ వినియోగించబోమని, దానికి ప్రత్యామ్నాయం వాడతామని మంగళవారం ప్రకటించారు. ప్రత్యామ్నాయంగా ఏ రసాయనం వాడతారో స్పష్టత ఇవ్వలేదు. బుధవారం జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ఈ అంశంపై స్పష్టత ఇవ్వలేదు. ఏ రసాయనాలు వాడతారు? ఏ టెక్నాలజీ వాడతారు అనేది ప్రభుత్వానికి సమర్పించిన ఈఐఏ(పర్యావరణ ప్రభావ అంచనా నివేదిక)లోనూ పేర్కొనలేదు. అసలు టెక్నాలజీ, ఏ రసాయనాలు వాడుతారో యజమాన్యానికి స్పష్టత లేకుండా, ప్రజలకు స్పష్టం చేయకుండా గోప్యంగా ఉంచాల్సిన అవసరమేంటని ప్రజాసంఘాలు ప్రశ్నిస్తున్నాయి. టీజీ గ్రూపు ఆల్కలీస్ ఫ్యాక్టరీ విస్తరణపై ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ ఫ్యాక్టరీపై అభ్యంతరాలు చెప్పిన వారిపై భౌతిక దాడులకు దిగిన యాజమాన్యం డీవైఎఫ్ఐ, కేవీపీఎస్ అధ్యక్ష, కార్యదర్శులపై విచక్షణారహితంగా దాడి వార్తలు కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరుల మొబైల్ఫోన్లు లాగేసుకున్న భద్రతా సిబ్బంది తమకు అనకూలంగా మినిట్స్ నమోదు చేసి ప్రభుత్వానికి సిఫారసు ఫ్యాక్టరీకి అనుకూలంగా మినిట్స్ పంపేందుకు సిద్ధమైన అధికారులుజీవనోపాధి కోల్పోతాం కెమికల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇవ్వొద్దు రాయలసీమ ఆల్కలిస్ (ఎస్ఆర్ఎఎిసీ) ఫ్యాక్టరీకి అనుబంధంగా రసాయనాల తయారీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వొద్దని అధికారులకు ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారులు సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్ వినతిప త్రం ఇచ్చారు. ఫ్యాక్టరీ చుట్టూ పది గ్రామాల్లో చేతివృత్తులపై ఆధారపడి జీవించే వారు జీవన ఉపాధి కోల్పోతారని ఆయన వినతిపత్రంలో పేర్కొన్నారు. టీజీవీ ఆల్కలిస్ ఫ్యాక్టరీలో బుధవారం ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కెమికల్ ఫ్యాక్టరీ వద్దని అధికారులకు పలువురు వినతిపత్రాలు అందజేశారు. ఇ.తాండ్రపాడు గ్రామాన్ని టీజీ వెంకటేష్ దత్తత తీసుకొని ధోబీఘాట్ నిర్మిస్తామని హామీ ఇచ్చి మూడు సంవత్సరాలు అవుతున్నా అమలు చేయలేదని గుర్తు చేశారు.కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ప్రజాభిప్రాయ సేకరణలో మొత్తంగా 30మంది అభిప్రాయాలను కమిటీ సేకరించింది. దీని మినిట్స్పై నివేదికను కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వశాఖకు పంపనున్నారు. అధికారులు పూర్తిగా యజమాన్యానికి లొంగిపోయి నిజాలు దాచి వారికి అనుకూలంగా నివేదికను ప్రభుత్వానికి పంపనున్నట్లు వామపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ప్రజాభిప్రాయసేకరణ అప్రజాస్వామిక నిర్వహించడం, ప్రతినిధులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ ప్రజాసంఘాల ఐక్య వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఎదుట భారీ నిరసన చేపట్టనున్నట్లు ప్రజాసంఘాల ఐక్య వేదిక కన్వీనర్ రామకృష్ణ తెలిపారు. సభలో ప్రాతినిధ్యానికి అవకాశం కల్పించకపోవడం, విద్యార్థి, ప్రజా, యువజన సంఘాలపై దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. నిరసనకు ప్రజాస్వామ్య వాదులు తరలిరావాలన్నారు. -
సీఎం పర్యటనలో మార్పు
కర్నూలు(సెంట్రల్)/(అగ్రికల్చర్)/కల్లూరు/పాణ్యం: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన మారింది. ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న పాణ్యంలో సీఎం పర్యటించాల్సి ఉంది. అయితే ఈ కార్యక్రమాన్ని కర్నూలుకు మార్చారు. దీంతో గత రెండు రోజుల నుంచి పాణ్యంలో ఉన్న అధికారులు ఏర్పాట్లను విరమించారు. ప్రతినెలా మూడో శనివారం నిర్వహించే స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటున్నారు. ఈ నెల 17న కర్నూలులో సీఎం పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్లోని కాన్ఫరెన్స హాలులో అఽధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కర్నూలులోని సీక్యాంపు రైతుబజార్లో జరిగే స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని, ఇద్దరు పారిశుద్ధ్య కార్మికులు, ఇద్దరు రైతులతో మాట్లాడతారని తెలిపారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో ఏర్పాటు చేసే ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొంటారని, మూడు వేల మందికి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. అంతకముందు జిల్లా కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి రైతు బజార్, ప్రజా వేదిక ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించి సీఎం పర్యటనను విజయవంతం చేద్దామన్నారు. ● స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమానికి జేసీ నవ్య ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సహాయకులుగా ఉంటారు. ప్రజావేదిక ఇన్చార్జిగా జెడ్పీ సీఈఓ వ్యవహరిస్తారు. 17న కర్నూలు రానున్న ముఖ్యమంత్రి -
నా బిడ్డ జొలికొస్తే వదిలేదేల్యా..
నంద్యాల: బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు. మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యతి్నంచాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి. -
ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్
ఒక బిడ్డకు జన్మనివ్వాలన్నది ప్రతి మహిళ కల. ఆ కలను సాకారం చేసుకునే క్రమంలో సంతానలేమితో బాధపడే వారి వేదన అంతా ఇంతా కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు మాత్రం కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలియగానే చేతులారా అబార్షన్ చేయించుకుంటున్నారు. ఆడ బిడ్డ పుడితే అత్తింటకర్నూలు(హాస్పిటల్): ‘భ్రూణ హత్యలు వద్దు.. ఆడ పిల్లలను బతకనిద్దాం.. లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు’.. అంటూ అధికారులు పలు వేదికలపైఈ అంశంపై అవగాహన కల్పిస్తున్నా ఇంకా కొందరిలో మార్పు రావడం లేదు. జిల్లాలో భ్రూణ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 240 స్కానింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇంకా కొత్తగా దరఖాస్తు చేసుకున్నవి 8, రెన్యువల్ కోసం వచ్చినవి మరో 15 దాకా ఉన్నాయి. వీటికి జిల్లా కమిటీ పరిశీలించి అనుమతులు జారీ చేయాల్సి ఉంది. అధికారికంగా ఉన్న స్కానింగ్ కేంద్రాలే గాక అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల అనుమతులు లేకుండా స్కానింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకుని స్కానింగ్ చేస్తున్నట్లు సమాచారం. వీటిలో కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబ్లలో కొందరు వైద్యులు స్కానింగ్ ద్వారా లింగనిర్ధ్దారణ చేస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో కడుపులో ఉన్నది ఆడబిడ్డ అని తెలిస్తే చాలు నిర్ధ్దాక్షిణ్యంగా అబార్షన్(భ్రూణహత్య)లు చేయించుకుంటున్నారు. ఇందుకు సాక్ష్యంగా అప్పుడప్పుడూ కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్, ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిసర ప్రాంతాలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని శివారు ప్రాంతాల్లో మృతశిశువులు వెలుగు చూస్తుంటాయి. ఇలా లభించిన వాటి గురించి ఏ ఒక్క అధికారి కూడా విచారణ చేసి చర్యలు తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు జిల్లాలో నమోదు కాలేదు. అంతెందుకు గత పదేళ్లలో ఒక్క స్కానింగ్ కేంద్రం, వైద్యులపై కూడా స్కానింగ్ అక్రమాల గురించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గత ఏప్రిల్ నెలలో జిల్లాలో వైద్యుల బృందం 40 స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు వెళ్లింది. అన్ని స్కానింగ్ కేంద్రాల్లో రికార్డులు, రిపోర్టులు, మిషన్లు, వైద్యుల వివరాలు, గర్భిణిల వివరాలు అన్నీ సక్రమంగా ఉన్నాయని అధికారులకు రిపోర్టు ఇవ్వడం గమనార్హం.ఆర్ఎంపీలకు నజరానాలుజిల్లాలో డోన్, కృష్ణగిరి, ఆదోని, పత్తికొండ, కోసిగి, హొళగుంద, పెద్దతుంబళం, చిన్నతుంబళం, మంత్రాలయం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కౌతాళం వంటి వెనుకబడిన ప్రాంతాలే గాక తెలంగాణా, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి సైతం స్కానింగ్ కోసం గర్భిణులు కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరుకు వస్తుంటారు. ఇందులో కొందరికి అప్పటికే ఆడపిల్లలు జన్మించి ఉండటంతో మళ్లీ ఆడబిడ్డ జన్మిస్తే కుటుంబంలో పెద్దలు ఒప్పుకోరని భావించి స్కానింగ్లో ఆడబిడ్డ అని తేలితే అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధపడి వస్తారు. ఈ మేరకు కర్నూలులోని కొత్తబస్టాండ్, గాయత్రి ఎస్టేట్, బుధవారపేట, ఎన్ఆర్ పేట, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోనిలోని కొన్ని ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలకు గర్భిణులను తీసుకొస్తారు. లింగ నిర్ధారణతో పాటు అవసరమైతే భ్రూణహత్య(అబార్షన్) చేయడానికి కూడా వెనుకాడటం లేదు. ఈ తతంగంలో మొత్తం సూత్రధారులు ఎక్కువగా ఆర్ఎంపీలే ఉంటున్నారు. లింగనిర్ధారణకు రూ.4వేల నుంచి రూ.5వేలు, అబార్షన్కు రూ.15వేల నుంచి రూ.20వేల దాకా తీసుకుంటున్నారు. ఇందులో ఆర్ఎంపీలకు 20 నుంచి 40 శాతం వరకు కమీషన్ ముట్టజెబుతున్నారు. -
తిరిగి దాడులు, తనిఖీలు నిర్వహిస్తాం
జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీలు నిర్వహిస్తున్నాము. ఈ మేరకు ఐదుగురు వైద్యులతో బృందాలను ఏర్పాటు చేశాం. ఈ బృందాలు గత ఏప్రిల్లో 40 స్కానింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. అయితే ఆయా కేంద్రాలను తిరిగి తనిఖీ చేసి వాస్తవ పరిస్థితులను నిగ్గు తేలుస్తాం. ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారి పేరు, వివరాలు బహిర్గతం గాకుండా చేసి, సదరు స్కానింగ్ కేంద్రంపై దాడులు నిర్వహిస్తాం. రెగ్యులర్గా ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై దాడులు ముమ్మరం చేస్తాం. లింగనిర్ధారణ, అబార్షన్లు చేసే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ పి.శాంతికళ, డీఎంహెచ్వో, కర్నూలు ● -
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు
● జిల్లా కలెక్టర్ రాజకుమారినంద్యాల(న్యూటౌన్): డ్రోన్ టెక్నాలజీతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కిసాన్ డ్రోన్స్ వినియోగంపై గ్రూప్ కన్వీనర్, కో–కన్వీనర్, అధికారులు, ఎఫ్పీఓలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతు గ్రూపులకు కూడా డ్రోన్లు పంపిణీ చేశామని, జిల్లాలో ఇప్పటి వరకు 40 డ్రోన్ల వరకు వినియోగించడం జరుగుతోందన్నారు. రాను న్న రోజుల్లో అధునాతన సాంకేతికత డ్రోన్లు రాను న్నాయన్నారు. డ్రోగో కృషి 3ప్రో అనే డ్రోన్ సుమా రు 9.8 లక్షల వరకు ఖర్చు అవుతుందని అందులో 80 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీటిని ఆటోమేటిక్, మాన్యువల్ పద్ధతి ద్వారా వినియోగించే అవకాశం ఉంటుందన్నారు. నానో యూరియా వినియోగానికి డ్రోన్లను ఉపయోగించుకోవచ్చునన్నారు. రసాయన ఎరువుల విచ్చల విడిగా వినియోగిస్తే భూసారం తగ్గిపోయి దిగు బడులు తగ్గుపోతాయన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలైన నువ్వులు, బ్లాక్ గ్రామ్, సోయా, కొర్ర తదితర పంటలు వేసేలా రైతులను ప్రోత్సాహించాలన్నారు. అంతకుముందు పలువురు కిసాన్ డ్రోన్స్ సాంకేతిక వినియోగం, ఉపయోగాలు, బ్యాంకు రుణం తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు, రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, ఎల్డీఎం రవీందర్ కుమార్, ఆర్ఆర్ఎస్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రామకృష్ణా రావు, నాబార్డు డీడీఎం, డ్రోన్ నిర్వాహకులు చైతన్య, రైతులు, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
12 మండలాల్లో అకాల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్లో 32.2, కర్నూలు అర్బన్లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. వాము వ్యాపారులు సిండికేట్ ● తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్ హాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ హాల్లో కంప్యూటర్ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది. హ్యాండ్లూమ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు నంద్యాల(న్యూటౌన్): వెంకటగిరిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ నందు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఓఎస్డీ గిరిధర్రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల డిప్లోమా కోర్సులకు హ్యాండ్లూమ్ టెక్నాలజీ 53 సీట్లు, తమిళనాడులో 12 సీట్లు, కర్ణాటకలోని గడగ్ నందు నాలుగు సీట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన వారు www.iihtvgr.com వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరింత సమాచారం కోసం సెల్ నంబర్ 93999 36872ను సంప్రదించవచ్చన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 1వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు -
మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలి
ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను ఏమాత్రం పరిగణనలోనికి తీసుకోకుండా విద్యా శాఖాధికారులు ఏక పక్షంగా నిర్ణయాలతో ప్రభుత్వ విద్యారంగంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతి గ్రామంలో 1 నుంచి 5 తరగతులతో ప్రాథమిక పాఠ శాలలను తప్పనిసరిగా కొనసాగించాలి. 1 నుంచి 10 తరగతుల విధానాన్ని ఉపసంహరించు కోవాలి. ప్రాథమికోన్నత పాఠశాలలకు అన్ని రకాల సబ్జెక్టు టీచర్లను నియమించాలి. – నగరి శ్రీనివాసులు, ఏపీటీఎఫ్ జిల్లా సెక్రటరీ, నంద్యాల అధిక సంఖ్యలో ఉండే ఎస్జీటీ ఉపాధ్యాయులకై నా మాన్యువల్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించాలి. బదిలీల ప్రక్రియకు ముందే ప్లస్–2 ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియెట్ తరగతులు బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులను నియమించాలి. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించి అదనంగా పోస్టులను కేటాయించాలి. –శివయ్య, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, నంద్యాలఏకపక్ష నిర్ణయాలతో గందరగోళం -
● గోరుకల్లు జలాశయాన్ని పరిశీలించిన నిపుణుల బృందం
పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వ పాణ్యం: గోరుకల్లు జలాశయం పెండింగ్ పనులు పూర్తి చేస్తేనే నీటి నిల్వకు అవకాశం ఉంటుందని నిపుణుల బృందం సభ్యులు అధికారులకు సూచించారు. జలాశయం కట్ట కుంగిపోతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఎక్స్ఫర్ట్ కమిటీ సభ్యు లు సందర్శించారు. కమిటీలోని సీడీఓ సీఈ విజయభాస్కర్, సీఈ కబీర్బాషా, ఎస్ఈ శివకుమార్రెడ్డి, ఈఈ మనోహరెడ్డి, సుభకుమార్, డీఈలు రీనా, కేధారేశ్వరరెడ్డి, క్వాలిటీ కంట్రోల్ ఈఈ ప్రసూనాదేవి తదితరులు జలాశయాన్ని సందర్శించారు. ముందుగా డ్యామ్ డిజైన్, కట్ట కుంగిన ప్రాంతం, జారుతున్న రాతిపరుపు, లీకేజీలు తదితర అంశాలను పరిశీలించారు. ఒకే చోట కట్ట కుంగడంపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం కట్ట కుంగిన చోటా ఎత్తు 259 మీటర్లు మాత్రమే ఉందని, 265.06 మీటర్లు ఎత్తు నిర్మిస్తే సమస్య పరిష్కారమవుతుందన్నారు. కట్ట పూర్తి స్థాయిలో నిర్మించి కాంక్రీట్ చానెళ్లు ఏర్పాటు చేస్తే వర్షపు నీరు కట్టలోకి వెళ్లకుండా నేరుగా జలాశయంలోకి వెళ్తుందన్నారు. భూమి లోపల పొరల వల్ల కూడా కట్ట కుంగే ప్రమాదం ఉందన్నారు. కట్టలోని 7 ప్యానెళ్లలో రాతి పరుపు దెబ్బతిన్నట్లు గుర్తించి లూస్ సాయిల్ను తొలగించాలన్నారు. కొత్తగా కంకర, ఇసుకతో ఫిల్ చేసి కట్టను పటిష్టం చేయాలని సూచించారు. జలాశయంలో పరిశీలించిన అంశాలపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామన్నారు. వారి వెంట డీఈఈలు జ్యోతి, గీతా, శివప్రసాద్, ఏఈలు, జేఈఈలు పాల్గొన్నారు. -
● ఉపాధ్యాయుల బదిలీలకు రంగం సిద్ధం ● త్వరలో వెలువడనున్న నోటిఫికేషన్? ● జిల్లాలో 3 వేల మందికి పైగా అర్హులు ● బదిలీలపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ● తమ సూచనలను పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్
నంద్యాల(న్యూటౌన్): ఉపాధ్యాయ బదిలీలకు పాఠశాల విద్యాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే వెలవడనుంది. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, జీఓ 117 రద్దు మార్గదర్శకాల విడుదలకు సంబంధించి ఉపాధ్యాయ సంఘాలు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం, విద్యాశాఖ ఏకపక్షంగా నిర్ణయా లు తీసుకోవడంపై ఉపాధ్యాయ సంఘాలు గుర్రుగా ఉన్నాయి. ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించిన దరఖాస్తు, స్థానాల ఎంపిక, కేటాయింపు ఇలా మొత్తం ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. నంద్యాల జిల్లా ప్రాతిపదికన నిర్వహించే బదిలీలకు సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 2023 జూన్లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు చేపట్టింది. గతేడాది ఎన్నికల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను చేపట్టలేదు, రెండేళ్ల తర్వాత తిరిగి నిర్వహిస్తున్న ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి జూన్ 1 నుంచి మే 31వ తేదీ వరకు విద్యా సంవత్సరం ప్రాతిపదికన తీసుకోనున్నారు. ఇందులో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు కనీస సర్వీసు రెండు సంవత్సరాల నుంచి ఎనిమిదేళ్ల వరకు తీసుకోనున్నారు. గ్రేడ్–2 హెచ్ఎంలకు ఐదేళ్లుగా నిర్ణయించారు. ఖాళీల వివరాలు డిస్ప్లే ఆయా పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించి బదిలీ కోరుకునే ఉపాధ్యాయులకు డిస్ప్లే చేస్తారు. ఈ ఏడాది మే నెలాఖరు వరకు ఉన్న అన్ని ఖాళీలను బదిలీల్లో చూపుతారు. ● 2020 మే 31కు ముందు పాఠశాలల్లో చేరిన హెచ్ఎంలకు ఐదేళ్లు అదే పాఠశాలల్లో విద్యా సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ● 2017 మే 31కి ముందు పాఠశాలల్లో చేరిన ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లకు ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నందున తప్పని సరిగా బదిలీ కావాలి. ● 2027 మే నెలాఖరులోపు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయులకు బదిలీల నుంచి మినహాయింపు ఉండే అవకాశం ఉంది. ● జిల్లా వ్యాప్తంగా అన్ని క్యాడర్లకు సంబంధించి 4,927 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో తప్పని సరి బదిలీలకు సంబంధించి 3 వేల మంది దాకా ఉండవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునః ప్రారంభం నాటికి బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. జిల్లాలో ఉపాధ్యాయుల వివరాలు.. చర్చలలో ఒక తీరు, నిర్ణయాలు మరో తీరు ఉపాధ్యాయుల బదిలీలు, పదో న్నతులకు సంబంధించిన విధి విధానాల పై ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపినప్పుడు ఒక తీరుగా, నిర్ణయాలను అమలు చేసేటప్పుడు మరో తీరుగా వ్యవహరిస్తోంది. జీఓ 117ను బేషరతుగా రద్దుచేసి, దాని స్థానంలోనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి దాని ఆధారంగా మాత్రమే పాఠశాలలను పునః వ్యవస్థీకరించాల్సి ఉండగా అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ల స్థాయిని దిగజార్చి మోడల్ ప్రైమరీ స్కూళ్లకు హెడ్మాస్టర్గా నియమిస్తామనడం సరికాదు. – సుబ్బన్న ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నాయకులు, నంద్యాల -
పాతూరు తిప్ప కరిగిపోతోంది!
పగిడ్యాల: అక్రమార్జనే ధ్యేయంగా అధికార పార్టీ నేతలు సహజ వనరుల లూటీకి తెగబడ్డారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం రిజర్వాయర్ మునక భూముల్లోని బింగ గ్రావెల్ను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నెహ్రూనగర్ పాతూరు తిప్పలో వేల టన్నుల విస్తారమైన బింగ గ్రావెల్ నిక్షిప్తమై ఉంది. ఈ గ్రావెల్ను కొల్లగొట్టేందుకు అధికార పార్టీ నాయకుల కన్ను తిప్పపై పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ రవాణా చేస్తున్నారు. ఒక ట్రిప్పు బింగ గ్రావెల్ను రూ. 1,600 ప్రకారం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సుమారు పది ట్రాక్టర్లలో రోజుకు 120 ట్రిప్పులకు పైగా గ్రావెల్ను తరలిస్తున్నారు. గ్రావెల్ దందాపై తహసీల్దార్ శివరాముడును వివరణ కోరగా.. గ్రావెల్ అక్రమ తరలింపును నిలిపివేయాలని ఆదేశించామన్నారు. అయితే గ్రావెల్ కోసం అర్జీ ఇవ్వగా దానిని భూగర్భ, గనుల శాఖ అధికారులకు పంపామని తహసీల్దార్ పేర్కొనడం గమనార్హం. అధికార పార్టీ నేతల అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా బింగ గ్రావెల్ తరలింపు రోజూ వందకు పైగా ట్రిప్పులు లూటీ -
● అమ్మ ప్రేమ గెలిచింది!
బిడ్డలంటే తల్లికి పంచ ప్రాణాలు. మనుషులైనా.. జంతువులైనా అమ్మ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆకలి తీర్చడంతో పాటు ఆపదలో ప్రాణాలను సైతం అడ్డేస్తుంది. ఇందుకు నిదర్శనమే గోమాత ఘటనే. తోడేళ్ల గుంపులా కుక్కలు ఆవు దూడపై దాడికి యత్నించగా, తల్లి ఆవు గంట పాటు దూడను కాపాడుకునేందుకు కుక్కలతో చేసిన పోరాటం చూసినా వారు ఎవరైనా ‘ఇది కదా తల్లి ప్రేమ’ అని అనక మానరు. మంగళవారం మండలంలోని డబ్ల్యూ గోవిందిన్నెలో ఈ ఘటన చోటుచేసుకుంది. పొలాల్లో మేత కోసం ఆవుల మంద వారం రోజులుగా తిరుగుతోంది. ఓ ఆవుకు దాహం వేయడంతో తన బిడ్డతో కలిసి తాగునీటి కోసం ఊళ్లోకి వచ్చింది. గమనించిన కుక్కలు దూడపై మూకుమ్మడిగా దాడికి యత్నించాయి. దీంతో ఆవు తన బిడ్డను కాపాడుకోవడానికి సుమారు గంటపాటు వీరోచిత పోరాటం చేసింది. చివరికి అలసిన కుక్కలు తోక మూడిచి వెళ్లిపోయాయి. – దొర్నిపాడు -
భ్రామరీకి లక్ష కుంకుమార్చన
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల శ్రీభ్రమరాంబాదేవికి పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం లక్ష కుంకుమార్చన సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలానికి స్వయంగా రాలేని భక్తులు వారి గోత్ర నామాలతో లక్ష కుంకుమార్చనలో పరోక్ష సేవగా పాల్గొనే అవకాశం దేవస్థానం కల్పించింది. ఈ మేరకు వివిధ ప్రాంతాల నుంచి 26 మంది భక్తులు పరోక్షసేవ ద్వారా పాల్గొన్నారు. మంగళకరమైన ద్రవ్యాలలో కుంకుమకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కుంకుమతో అమ్మవారిని అర్చించడం విశేష ఫలదాయకమని పండితులు చెబుతున్నారు. లక్ష కుంకుమార్చన సేవను జరిపించుకోవడం వలన కష్టాలు తొలగిపోతాయని, సర్వశుభాలు కలుగుతాయని సంతాన సౌఖ్యం కలుగుతుందన్నారు. మార్కుల జాబితాను డౌన్లోడ్ చేసుకోండినంద్యాల(న్యూటౌన్): పదో తరగతి మార్కుల జాబితాను www. bsc.ap.gov.in అందు బాటులో ఉందని, విద్యార్థులు డోన్లోడ్ చేసుకోవాలని డీఈఓ జనార్దన్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరిగాయన్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఫలితాలు వచ్చాయన్నారు. ఈనెల 8వ తేదీ నుంచి వెబ్సైట్లో మార్కుల జాబితాను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఏవైనా దిద్దుబాట్లు ఉన్నట్లు అయితే ఒరిజినల్ పాస్ సర్టిఫికెట్లలో సవరణలు అమలు చేయడానికి ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దృష్టికి తెలియజేయాలన్నారు. అడ్మిషన్కు సక్రమంగా పాఠశాలల రికార్డులను జోడించాలన్నారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సంక్షిప్తం మార్కుల జాబితా పత్రం ఈనెల 25వ తేదీలోగా సమర్పించాలని డీఈఓ తెలిపారు. 17న పాణ్యంకు సీఎం రాక పాణ్యం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 17వ తేదీన పాణ్యం రానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం నిర్వహించే ‘స్వర్ణాంధ్ర.. స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై సోమవారం నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ మండల రెవెన్యూ అధికారులతో సమీక్ష చేపట్టారు. సీఎం పర్యటన షెడ్యూల్డ్ అధికారకంగా రావడంతో ఆర్డీఓ, తహసీల్దార్ నరేంద్రనాథ్రెడ్డి కలిసి హెలిపాడ్ స్థలాన్ని పరిశీలించారు. పాణ్యం హైవేలోని చందమామ హోటల్ ఎదురుగా ఉన్న ప్రయివేట్ వెంచర్ను పరిశీలించారు. మరో స్థలాన్ని పరిశీలించనున్నారు. పాణ్యం ప్రభుత్వ పాఠశాలలో బహిరంగ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు గురించి ఆర్డీఓ అడిగి తెలుసుకున్నారు. అధికారికంగా సీఎం పర్యటన ఖరారైనట్లు ఎంపీడీఓ ప్రవీణ్కుమార్ తెలిపారు. 67 మందికి గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలో 67 మంది గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–2 కార్యదర్శులుగా పదోన్నతి లభించినట్లు జిల్లా పంచాయతీ అధికారి జి.భాస్కర్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో 31 మందికి, నంద్యాల జిల్లాలో 36 మందికి పదోన్నతి లభించిందన్నారు. వీరిలో కర్నూలు జిల్లాకు 10 మందిని, నంద్యాల జిల్లాకు 10 మందిని కేటాయించి మిగిలిన వారిని ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు కేటాయిస్తు సీపీఆర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి జిల్లాలో గ్రేడ్–3 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి పొందేందుకు 34 మంది జూనియర్ అసిస్టెంట్లకు అర్హత ఉందన్నారు. ఈ మేరకు అనుమతి కోరుతున్నామని డీపీఓ వెల్లడించారు. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత కర్నూలు(అగ్రికల్చర్): భానుడి భగభగలు పెరిగాయి. కొద్ది రోజులుగా 40 డిగ్రీల వరకు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు సోమవారం పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. దొర్నిపాడులో 41.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పాణ్యంలో 40.5, రుద్రవరంలో 40.2, శిరువెళ్లలో 40, గూడూరులో 39.3, కోడుమూరులో 39.2, వెల్దుర్తిలో 39.1 డిగ్రీల ప్రకారం నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అనుపమ తెలిపారు. -
ఫైల్పై ఆరా తీస్తున్నాం
ఎన్ఎస్టీఎఫ్డీసీ రుణాలకు సంబంధించిన ఫైల్ కనిపించకుండా పోయిన విషయంపై ఆరా తీస్తున్నాం. ఎవరైనా కావాలని ఫైల్ను మాయం చేశారా? లేక కార్యాలయంలోనే ఎక్కడైనా మిస్ అయ్యిందా? అనే కోణంలో విచారణ చేయిస్తున్నాం. అప్పట్లో కార్యాలయంలో విధులు నిర్వహించిన ఉద్యోగులు ఫైల్ను తమ ప్లేస్లోకి వచ్చిన వారికి అప్పగించారా, లేదా అనే విషయాలను కూడా తెలుసుకుంటున్నాం. ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఈ పథకం కింద తీసుకున్న రుణాల రికవరీ కష్టతరమవుతోంది. – కె.తులసీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారిణి● -
గిరిజన సంక్షేమ శాఖలో రుణాల ఫైల్ గల్లంతు
● 2018–19లో 11 మందికి రూ.1.57 కోట్ల రుణాలు ● ఇందులో 7 ఇన్నోవా, 2 బొలేరో వాహనాలు ● కార్పొరేషన్కు చెల్లించాల్సిన రుణం రూ.96.86 లక్షలు ● ఇప్పటి వరకు చెల్లించింది రూ.10.45 లక్షలు ● రికవరీ తక్కువగా ఉందని ఉన్నతాధికారుల అసహనం ● షూరిటీ ఇచ్చిన వారికి నోటీసులు పంపేందుకు కనిపించని ఫైల్ -
ఉద్యోగులు తలుచుకుంటే ఏమైనా చేయగలరనేందుకు సబ్సిడీ రుణాలే నిదర్శనం. అర్హులు రుణాలు అందక కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అడ్డదారిలో రుణాలు దక్కించుకున్న వాళ్లు ఎంచక్కా షి‘కారు’ చేస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగులను బుట్టలో వేసుకొని రుణాలు తిరిగి చెల్లించకుండా
రూ.16,58,300లకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.9,94,980 కాగా, ట్రైకార్ సబ్సిడీ రూ.5,80,405లుగా నిర్ణయించారు. అలాగే లబ్ధిదారుని వాటా రూ.82,915 చెల్లించిన వారికి వాహనాలు కేటాయించారు. రూ.10.60 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో ఎన్ఎస్టీఎఫ్డీసీ లోన్ రూ.6.36 లక్షలు, సబ్సిడీ రూ.3.71 లక్షలు కాగా.. లబ్ధిదారుని వాటా రూ.53 వేలు చెల్లించిన వారికి బొలెరో వాహనాలను అందించారు. ఇన్నోవా కారు రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. ఇందులో లోన్ రూ.6 లక్షలు కాగా, సబ్సిడీ రూ.3.50 లక్షలు. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి ట్రాక్టర్లు మంజూరైంది. ఇన్నోవా కారురెడిమేడ్ గార్మెంట్ యూనిట్ యూనిట్ ఏర్పాటుకు రూ.10 లక్షలను మంజూరు చేశారు. ఇందులో లోన్ 8.50 లక్షలు, సబ్సిడీ రూ.లక్ష. లబ్ధిదారుని వాటా రూ.50 వేలు చెల్లించిన వారికి రుణం మంజూరు చేశారు. బొలెరో వాహనం -
మద్యం దుకాణానికి దరఖాస్తుల ఆహ్వానం
బొమ్మలసత్రం: పగిడ్యాల మండలానికి చెందిన మద్యం దుకాణానికి గీత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి రవికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 15వ తేదీలోగా జిల్లాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. నాన్ రీఫండబుల్ ఫీజు రూ. 2 లక్షలు చలానా రూపంలో సమర్పించాలని సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కావొద్దు బొమ్మలసత్రం: పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పునరావృతం కాకుండా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా పోలీసుల అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 84 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అందిన ఫిర్యాదుల్లో అధికంగా అన్నదమ్ముల ఆస్తి తగాదాలు, అత్తింటి వేధింపులు, ఉద్యోగాల పేరుతో మోసాలు, తప్పుడు పత్రాలతో ఆస్తుల రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ సూర్యమౌళి పాల్గొన్నారు. పీహెచ్సీల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలి ఉయ్యాలవాడ: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ రాజకుమారి గణియా అధికారులను ఆదేశించా రు. సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో పీహెచ్సీల్లో వైద్య సేవలు అందడం లేదని కలెక్టర్ ఆగ్ర హం వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో కనీస మౌలిక వసతులు, తాగునీరు, మరుగుదొడ్లు దుస్థితిపై, రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో వున్నాయా లేవా వైద్యాధికారులు, సిబ్బంది ఆసుపత్రులకు వస్తున్నారా లేదా సమయ పాలనపై ఆరా తీయాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. తహసీల్దార్ శ్రీనివాసులు, ఇన్చార్జ్ ఎంపీడీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మండల పరిధిలోని పెద్దయమ్మనూరు, ఉయ్యాలవాడ, మాయలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వసతుల కల్పనపై నివేదిక అందజేస్తామన్నారు. -
పొగాకు కంపెనీలపై చర్యలు తీసుకోండి
నంద్యాల(న్యూటౌన్): ఒప్పందానికి అనుగుణంగా పొగాకు కొనుగోలు చేయకుండా రైతులను వేధిస్తున్న ప్రైవేటు కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ, రుద్రవరం, శిరివెళ్ల, మహానంది, పాణ్యం, కొత్తపల్లి, ఆత్మకూరు మండలాల్లో పలు రైతుల నుంచి ప్రైవేటు కంపెనీ లు ముందుగానే అగ్రిమెంట్ చేసుకుని పంట చేతికొచ్చిన తర్వాత అగ్రిమెంట్ చేసుకున్న ధరకు కొనుగోలు చేయడం లేదన్నారు. పొగాకు రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, సహాయ కార్యదర్శి రామచంద్రుడులు మాట్లాడుతూ.. అలయన్స్ వన్, జీపీఐ, ఎంఎల్ గ్రూప్, ఐటీసీ లాంటి కంపెనీలు జిల్లా రైతులతో క్వింటా రూ.18,500 మేర కొనుగోలు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకొని పొగాకు కొను గోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇళ్లలో పొగాకు నిల్వ చేసుకోవడంతో రంగుమారి నాణ్యత దెబ్బతినడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వసుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు కంపెనీలతో చర్చించి న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ రాజకుమారికి వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో ఏపీ రైతు సంఘం నాయకు లు సుబ్బరాయుడు, సురేష్, పొగాకు రైతులు బుజ్జయ్య, రఘురామిరెడ్డి, సుబ్బు, నారాయణ, థామస్, శివనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కంపెనీలతో కలెక్టర్ చర్చలు జరిపి న్యాయం చేయాలి అగ్రిమెంట్ ధర ఇప్పించాలని డిమాండ్ -
రాష్ట్రంలో రాక్షస పాలన
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పేరుతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తుందని ఎమ్మెల్సీ ఇసాక్బాషా విమర్శించారు. సోమవారం స్థానిక మాజీ ఎమ్యెల్యే శిల్పారవి చంద్రకిషోర్రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి విడదల రజిని పట్ల చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బనాయుడు ప్రవర్తించిన తీరు అమానవీయమన్నారు. కూటమి నేతల మెప్పు కోసం పోలీసులు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. మాజీ మంత్రి, ఒక మహిళ అని చూడకుండా ఆమైపె సీఐ దురుసుగా ప్రవర్తించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మాజీ మంత్రి విడదల రజిని అనుచరుడు శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన సీఐ సుబ్బనాయుడును సీఐ గారు..అని సంభోదించినప్పటికీ ఆమెను కారులో నుంచి బైటికి లాగి కిందకు దింపటం ఎంత దుర్మార్గమన్నారు. ఇటీవల గుంటూ రు జిల్లాలో కల్పన అనే దళిత ఎంపీటీసీ సభ్యురాలిని అర్ధరాత్రి అరెస్ట్ చేయడం, నైటీ మార్చుకుని చీరతో వస్తానని ఆమె బ్రతిమాలినా వినకుండా.. చీర కారులోనే మార్చుకోమని పోలీసులు చెప్పడం ఎంతటి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ పాలన రాక్షసపాలనను తలపిస్తుందని, ఇలాగే కొనసాగితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్థాయిలో నిరసనలు తెలపాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కూటమి నేతలు రెడ్ బుక్ పాలనను మాత్రం సజావుగా సాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార పత్రినిధి అనిల్ అమృతరాజ్, మాజీ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, కౌన్సిలర్ కృష్ణమోహన్, నాయకులు లక్ష్మీనారాయణ, సాయిరామ్రెడ్డి, రహంతుల్లా, భాస్కర్రెడ్డి, శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఇసాక్బాషా -
‘మీ కోసం’లో అర్జీల సమాచారం
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల(న్యూటౌన్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల (తాజా పరిస్థితిని) సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్సైట్లో తెలుసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి సూచించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. దరఖాస్తుదారులు అర్జీల నమోదు, ప్రస్తుత స్థితికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నంబర్ను కూడా సంప్రదించవచ్చునన్నారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే మాత్రమే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలన్నారు. వినతులలో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులు అధిక శాతం వస్తున్నాయన్నారు. వినతులను సక్రమంగా పరిష్కరించని కారణంగా 47 రీఓపెన్ అయ్యాయని, వీఐపీ అర్జీలు 7 పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించేలా చూడాలన్నారు. జిల్లాలో బంగారు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు 975 మార్గదర్శులను గుర్తించామని, ఆళ్లగడ్డ మండలం నుంచి ఇంకా మార్గదర్శుల నివేదిక రావాల్సి ఉందని వెంటనే పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు. 203 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, డీఆర్ఓ రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
గరుడ వాహనంపై గోవిందుడి అభయం!
గరుడ వాహన సేవ నిర్వహిస్తున్న దృశ్యం ఆళ్లగడ్డ: అహోబిల నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్స వాల సందర్భంగా ఎగువ అహోబిలంలో చివరి రోజు జ్వాలా నరసింహస్వామి గరుడోత్సవం వైభవోపేతంగా నిర్వహించారు. ఆదివారం రాత్రి నిత్యపూజలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని గరుడ వాహనంపై కొలువుంచి ఆస్థాన విద్వాంసుల మంగళకరమైన వాయిద్యాలు, వేద పండితుల మంత్ర పఠనములు.. భక్తుల గోవిందా నామస్మరణల నడుమ ఊరేగించారు. ఈ వేడుకలు సోమవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. అనంతరం బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా శాస్త్రోక్తంగా ధ్వజావ రోహణం చేపట్టారు. దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లావరదస్వామి ఉభయ దేవేరులతో పుష్ప పల్లకీలో కొలువై భక్తులను కనువిందు చేశారు. వైభవోపేతంగా గరుడోత్సవం -
గ్రామం నుంచి పారా మిలటరీలో మొట్టమొదటి మహిళను
మాది వ్యవసాయం కుటుంబం. అమ్మ ప్రమీల, నాన్న జయరాముడు. తొమ్మిదేళ్ల క్రితం నాన్న చనిపోయారు. నాకు అక్క పద్మావతి, తమ్ముడు వేణు ఉన్నారు. డిగ్రీ వరకు చదువుకున్నా. మా ఊరి నుంచి మిలిటరీకి వెళ్లిన వాళ్లను చూసి నేను కూడా సైన్యంలో చేరాలనుకున్నా. ఆ దిశగా చేసిన ప్రయత్నంతోనే న్యూ ఢిల్లీలో సీఐఎస్ఎఫ్ జవాన్గా పనిచేసేందుకు అవకాశం దక్కింది. మా గ్రామం పారా మిలటరీలో చేరిన మొట్టమొదటి మహిళను కావడం ఎంతో గర్వంగా ఉంది. తల్లి, అక్క, తమ్ముడుతో పాటు భర్త ప్రోత్సాహం మరువలేనిది. దేశం కోసం పని చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. – జరగల స్వాతి, సీఐఎస్ఎఫ్, అమినాబాద్ -
మద్దిలేటి క్షేత్రం.. భక్తజనసంద్రం
బేతంచెర్ల: శ్రీ మద్దిలేటి నరసింహస్వామి పుణ్యక్షేత్రం శనివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, కుంకుమార్చన, ఆకుపూజ చేశారు. స్వామి వారికి ప్రీతి పాత్రమైన వరపూజతో పాటు మహా మంగళహారతి నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించారు.ఇసుక అక్రమ రవాణాపై నిఘాబొమ్మలసత్రం: రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక, రేషన్ బియ్యం తరలించే వారిపై నిఘా ఉంచామని ఎస్పీ అదిరాజ్ సింగ్రాణా తెలిపారు. తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాల నివారణ కోసం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశామన్నారు.గడిచిన 24 గంటల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 30 మందిపై , బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే 61 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులకు రూ.2,02,712 జరిమానా విధించామన్నారు.సినీ నిర్మాత ఆర్థిక సాయండోన్: ప్రధానమంత్రి సహాయ నిధితో పాటు ఆపరేషన్ సింధూర్లో మృతి చెందిన సైనికుడికి, పహల్గాంలో మృతి చెందని కశ్మీర్ యువకుడికి సినీ నిర్మాత మహేష్ఖన్నా రూ.33 వేల ఆర్థిక సాయం ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును శనివారం జిల్లా కలెక్టర్ రాజకుమారికి అందజేశారు. పహల్గాం టూరిస్టు ప్రదేశానికి పర్యాటకులను గుర్రపు స్వారీపై తీసుకువెళ్లిన కశ్మీర్ యువకుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ను తీవ్రవాదులు చంపడం ఆవేదన కలిగించిందన్నారు. పీఎం సహాయనిధికి రూ.11వేలు, ఆదిల్హుసేన్ కుటుంబానికి రూ.11వేలు, ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి రూ.11వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ను మహేష్ఖన్నా కోరారు.ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అదృశ్యం● అప్పులవాళ్ల వేధింపులే కారణం?బండిఆత్మకూరు: ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇమిడి తేజ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్ఐ జగన్మోహన్ తెలిపారు. ఆయన తెలినపిన వివరాల ప్రకారం ... బండిఆత్మకూరు నుంచి విధులకు వెళ్తున్నానని ఇంటిలో చెప్పి శనివారం ఉదయం బయలుదేరారు. అయితే విధులకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్లారో తెలియక కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికారు. అయినా ఆచూకీ కనిపించలేదు. అప్పులవాళ్ల నుంచి వేధింపులు అఽధికం కావడంతోనే తన భర్త అదృశ్యమయ్యారని భార్య ఇమిడి శ్వేత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
మనం బాగుంటే చాలు.. అవతల ఎవరేమైపోతేనేం అనుకునే రోజులివి. ప్రపంచం అరచేతిలోకి వచ్చి చేరడంతో బద్దకం ఎవరి గురించీ ఆలోచించని పరిస్థితి. నా కొడుకు డాక్టర్.. నా కూతురు ఇంజినీరు.. మా అల్లుడు ఫారిన్లో ఉద్యోగం.. మా కోడలు సాఫ్ట్వేర్.. అని చెప్పుకోవడం ఆ కుటుంబానిక
తుగ్గలి: ఆపరేషన్ సింధూర్. దేశమంతటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పదం. ఉగ్రమూకలు చెలరేగుతున్న వేళ.. అమాయకులను పొట్టున పెట్టుకుంటున్న తరుణంలో సైన్యం ఎక్కుపెట్టిన తుపాకీ ప్రతి ఒక్కరిలో దేశభక్తిని రగిల్చింది. మనమంతా గుండెల మీద చేయి వేసుకుని హాయిగా నిద్రపోతున్నామంటే.. సరిహద్దులో సైనికులు నిద్రలేని రాత్రులు గడుపుతుండటంతోనే సాధ్యమవుతోంది. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఎలా ఉంటున్నారో.. ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటో.. కదనరంగం దృశ్యాలను చూస్తుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. బుల్లెట్ల మోత.. విరుచుకుపడే మిసైళ్లు.. దూసుకొచ్చే డ్రోన్లు.. అత్యాధునిక ఆయుధాలకు ఎదురొడ్డి నిలుస్తున్న సైనికులను చూస్తే కన్నీళ్లతో సెల్యూట్ చేయాలనిపిస్తోంది. సరిహద్దులో ఉద్రిక్తతల వేళ అమినాబాద్ గ్రామం నిద్రలేని రాత్రులను గడుపుతోంది. ఇందుకు కారణం ఆ చిన్న గ్రామం నుంచి ప్రస్తుతం 15 మంది దాకా ఆర్టీలో పని చేస్తుండటమే. ఈ గ్రామంలో ఇప్పుడు ఎవరిని పలుకరించినా మా పిల్లలు సైన్యంలో ఉండటం తమకెంతో గర్వకారణం అనడం ఎంతో స్ఫూర్తినిస్తోంది. తుగ్గలి మండలంలోని గిరిగెట్ల పంచాయతీ మజరా గ్రామమైన అమినాబాద్లో 201 కుటుంబాలు ఉండగా.. 873 మంది జనాభా ఉన్నారు. గత 30 ఏళ్లలో 25 మంది ఆర్మీలో చేరారు. యువకులే కాకుండా యువతులు మేము సైతమని దేశసేవకు తమ జీవితాలను అంకితం చేస్తుండటం విశేషం. ఒకరి నుంచి మరొకరు స్ఫూర్తి పొందుతూ గ్రామం తలెత్తుకునేలా సైన్యంలో సేవలందిస్తుండటం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయం. దేశభక్తికి మారుపేరు కుటుంబాలకు దూరంగా సైన్యంలో సేవలు ప్రస్తుతం వివిధ విభాగాల్లో 15 మంది మేముసైతం అని ఇద్దరు యువతులు గర్వంగా ఉందంటున్న సైనిక కుటుంబాలు ఇప్పటికై నా యుద్ధానికి సిద్ధమంటున్న మాజీలు -
దేశ సేవలో హెబ్బటం యువకులు
హొళగుంద: మండల పరిధిలోని హెబ్బటం గ్రామానికి చెందిన యువకులు దేశం రక్షణకు తమవంతు సేవలందిస్తున్నారు. మండలంలో ఈ గ్రామం నుంచే అధిక సంఖ్యలో యువకులు సైన్యంలో చేరి దేశభక్తిని చాటుకుంటున్నారు. బావిదొడ్డి రామాంజనేయులు, లింగన్న, వెంకటేశ్వర్లు, అంజి, టి.రాము, లక్ష్మన్న, సతీష్, మునేష్, గంగాధర్, శ్రీనివాసులు, తిమ్మప్ప, ప్రకాష్, విజయ్, వీరేశ్తో కలిపి మొత్తం 13 మంది ఆర్మీలో కొనసాగుతున్నారు. వీరిలో బావిదొడ్డి రామాంజనేయులు అమరుడు కాగా.. లింగన్న, వెంకటేశ్వర్లు పదవీ విరమణ పొందారు. బీఎస్ఎఫ్ జవాను బావిదొడ్డి రామాంజనేయులు 2008 మే 15న పశ్చిమ బెంగాల్లో ఎన్నికల విధి నిర్వహణలో ఉండగా నక్సలైట్లు జరిపిన బాంబు పేలుడులో మరణించాడు. ప్రస్తుతం గ్రామానికి చెందిన 11 మంది సైన్యంలో సేవలు అందిస్తుండగా.. ప్రస్తుత యుద్ధ వాతావరణం నేపథ్యంలో వీరిని గుర్తు చేసుకొని ప్రతి ఒక్కరూ సెల్యూట్ చేస్తున్నారు. -
దేశ రక్షణకు ఇప్పటికై నా సిద్ధమే
నేను 1992లో బీఎస్ఎఫ్లో చేరా. జమ్మూకశ్మీర్, గుజరాత్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, మణిపూర్, రాజస్థాన్, ఢిల్లీలో పనిచేశా. 2013లో రిటైర్డ్ అయ్యాను. కార్గిల్ యుద్ధంలో రాత్రింబవళ్లు అక్కడే ఉంటూ శత్రువులను దీటుగా ఎదుర్కొన్నాం. మా గ్రామం నుంచి ఏటా కొందరు సైన్యంలో చేరి దేశరక్షణలో పాల్గొంటుండటం గర్వకారణం. అమాయకులైన పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదుల స్థావరాలను తుద ముట్టడించడమే లక్ష్యంగా భారత సేనలు ముందుకు వెళ్లడం గొప్ప విషయం. ఆ దేశ పౌరులకు ఎలాంటి నష్టం కలిగించకుండా ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఆపరేషన్ సింధూర్ విజయవంతమైంది. భారత సైన్యంలో 21 ఏళ్లపాటు పని చేసిన అనుభవం ఉంది. దేశ భద్రత కోసం బాధ్యతలు చేపట్టేందుకు ఎప్పుడూ సిద్ధమే. – మండపాటి వెంకటేశ్వర్లు, రిటైర్డ్ జవాన్, అమినాబాద్ -
ఈ విద్యా సంవత్సరమే డోన్లో కేంద్రీయ విద్యాలయం
డోన్ టౌన్: పట్టణంలో ఈ విద్యా సంవత్సరం (2025–26) నుంచే నూతన కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి తగిన చర్యలు చేపట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఐటీఐ కళాశాలలో భవనాలను శనివారం పరిశీలించారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించాలన్నారు. అనంతరం కేంద్రీయ విద్యాలయం శాశ్వత భవనాల నిర్మాణానికి వెంకటాపురం రోడ్డులోని పేరంటాలమ్మ గుడి వద్ద 9.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ వెంట కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ప్రియదర్శిని, ట్రాన్స్కో ఏఈ నాగేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రత్యేక చొరవతో రాష్ట్రానికి మంజూరైన కేంద్రీయ విద్యాలయాల్లో డోన్కు ఒక్కటి మంజూరైన విషయం తెలిసిందే. హౌసింగ్ కాలనీలో మౌలిక వసతులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేదల కోసం ఏర్పాటు చేసిన జగనన్న కాలనీలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. కాలనీలో 1,554 గృహాలు మంజూరు చేయగా 766 మంది గృహాలు పూర్తి చేసుకున్నారని హౌసింగ్ అధికారులు చెప్పారు. ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు. డోన్ ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్గౌడ్, తహసీల్దార్ నాగమణి, జిల్లా విద్యాధికారి జనార్దన్రెడ్డి, డిప్యూటీ డీఈఓ సుధాకర్రెడ్డి, హౌసింగ్ డీఈ కృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
ఇప్పుడు విధుల్లో 15 మంది..
అమినాబాద్ గ్రామంలో అన్నీ వ్యవసాయ కుటుంబాలే. గ్రామం నుంచి మచ్చా రంగనాయకులు, సురేంద్ర, కురవ వంశీ, దాసరి ప్రభాకర్, ఎంబాయి విజయ్కుమార్, రమేష్, పురిమెట్ల హరి, దండు రామాంజిని, రాజు, తిమ్మాపురం హనుమేష్, బాలకృష్ణ, కె.హరినాథ్, సుద్దాల మురళి, జరగల స్వాతి, గొల్ల రాధ(ఆర్మీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఎస్ఎస్బి, ఎయిర్ఫోర్స్, ఐటీబీపీ) విభాగాల్లో పని చేస్తున్నారు. ఇక దివాకర్చౌదరి, లక్ష్మినారాయణ, మండపాటి వెంకటేశ్వర్లు, దాసరి రంగడు, మచ్చా నాగరాజు, హరినాథ్, మోటుపల్లి కరుణాకర్, రాము, నవీన్, నాగరాజు ఆర్మీ, బీఎస్ఎఫ్, ఎయిర్ఫోర్స్లో పనిచేసి పదవీ విరమణ పొందారు. గ్రామం నుంచి పలువురు యువకులు దేశ రక్షణకు సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ ఊరికి వన్నె తెచ్చారని గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నారు. వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న వీరిలో పలువురిని ప్రస్తుతం భారత్–పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ పరిసర ప్రాంతాలకు తరలిస్తున్నట్లు సమాచారం. -
యుద్ధ సమయంలో అండగా ఉంటాం
నిజమైన హీరో మురళీనాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పాకిస్తాన్తో పోరాడుతూ అమరుడైన మురళీనాయక్ను తెలుగు రాష్ట్రాలు ఎన్నటికీ మరచిపోలేవని కర్నూలు విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రంగారెడ్డి తెలిపారు. శనివారం కర్నూలు అబ్బాస్ నగర్లోని కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆర్మీ జవాన్ మృతికి ప్రగాఢ సంతాపం ప్రకటించారు. యుద్ధంలో అసువులు బాసిన ఆర్మీజవాన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిముషాలు మౌనం పాటించారు. దేశ రక్షణకు అమరుడైన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మురళీ నాయక్ ప్రజలందరి దృష్టిలో నిజమైన హీరో అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో పలువురు విశ్రాంత ఉద్యోగుల సంఘం నేతలు పాల్గొన్నారు.పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి అత్యంత దారుణం. దీనికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలను నిర్మూలించేందుకు భారత్ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. యుద్ధ సమయంలో దేశానికి అండగా ఉంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 7 వేలకుపైగా మాజీ సైనికులు ఉన్నాం. ఐదేళ్లలోపు పదవీ విరమణ పొందిన వారి వివరాలను డిఫెన్స్ అధికారులు అడిగారు. 60 ఏళ్లలోపు వయస్సు ఉన్న మాజీ సైనికులు దేశం కోసం పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాం. – నర్రా పేరయ్య చౌదరి, జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు, కర్నూలు -
ఎమ్మెల్యే జయసూర్య Vs ఎంపీ శబరి.. మరోసారి రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో వర్గ విభేదాలు.. టీడీపీ నాయకులు మధ్య చిచ్చురేపుతున్నాయి. నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఎంపీ శబరిల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందికొట్కూరులో అగ్నిమాపక శాఖ నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేను అధికారులు ఆహ్వానించారు.అయితే, ఎంపీ శబరి రాక ముందే.. ఎమ్మెల్యే జయసూర్య భూమి పూజ చేసి వెళ్లిపోయారు. పంతం కొద్ది ఎమ్మెల్యే భూమి పూజ చేసిన భవనాన్నికి ఎంపీ శబరి మరోసారి భూమి పూజ చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే ఎవరికి వారు భూమి పూజలు చేసి వెళ్లిపోవడంతో ఎమ్మెల్యే, ఎంపీల ప్రొటోకాల్ అధికారులకు తలనొప్పిగా మారింది. -
యువకుడిని మింగిన బావి!
ఉయ్యాలవాడ: స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉండే యువకుడిని ఓ బావి మృత్యువు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన శుక్రవారం సాయంత్రం గోవిందపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ బాబ్జాన్ అలియాస్ రిజ్వాన్(25) అనే యువకుడు తోటి స్నేహితులతో ఈత కొట్టేందుకు గోవిందపల్లె గ్రామంలో బావికి వెళ్లాడు. ఈత రాకపోయిన నడుముకు ఖాళీ 5 లీటర్ల క్యాన్లు నాలుగు కట్టుకుని బావిలో దూకాడు. నడుముకు కట్టుకున్న క్యాన్లు తెగి పోవడంతో నీటిలో మునిగి పోయాడు. గమనించిన తోటి స్నేహితులు బావిలో గాలించగా యువకుడు లభ్యం కాలేదు. స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి బావిలో దూకి అతడిని బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో కోవెలకుంట్ల పట్టణానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్వలి కుటుంబ సభ్యులు అందరూ గోవిందపల్లె గ్రామంలోని అచ్చుకట్ల బుడ్డే సాహెబ్ ఇంటికి వచ్చారు. షేక్ ఖాదర్వలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో ఒక కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
‘బానకచెర్ల’కు నూతన గేట్లు
పాములపాడు: మండలంలోని బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నూతన గేట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఏఈ దేవేంద్ర శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెగ్యులేటర్ వద్ద వీబీఆర్, పాత ఎస్ఆర్బీసీ, కేసీసీ ఎస్కేప్ చానల్ల నూతన గేట్ల ఏర్పాటు కోసం రూ.15కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుతం కేసీసీ ఎస్కేప్ ఛానల్ గేట్లను రూ. 5 కోట్లతో నిర్మాణం పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక్కడ ఏర్పాటు చేసేందుకు సిద్ధం చేసిన నూతన గేట్లను హైదరాబాదులో సీఈ కబీర్ బాషా స్వయంగా పరిశీలించారన్నారు. జూన్ చివరి నాటికి నూతన గేట్లను అమర్చి ఖరీఫ్కు నీటిని విడుదల చేయాలని కాంట్రాక్టర్కు సీఈ నుంచి ఆదేశాలు అందాయన్నారు. -
12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు
నంద్యాల(న్యూటౌన్): ఇంటర్మీడియెట్ మొదటి, ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో పరీక్షల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటలకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఉంటాయన్నారు. ఇందుకోసం మొత్తం 42 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నంద్యాల(అర్బన్): డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి ఓబులేసు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరిలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. టెట్ అర్హత సాధించిన అభ్యర్థులే సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా వెనుకబడిన తరగతులు, సాధికారత అధికారి కార్యాలయంలో దరఖాస్తులు పొంది అక్కడే సమర్పించాలని తెలిపారు. దరఖాస్తుతో పాటుగా విద్యాఅర్హత, క్యాస్ట్, ఇన్కం, ఆధార్, టెట్ హాల్టికెట్, టెట్ మార్కిలిస్ట్ జిరాక్స్ కాపీలను జతపరచాలన్నారు. శ్రీశైలంలో భద్రత కట్టుదిట్టం శ్రీశైలంప్రాజెక్ట్: భక్తులతో నిత్యం రద్దీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సాక్షిగణపతి, హఠకేశ్వరం, ఫాలధార–పంచధార, శిఖరేశ్వరం తదితర ప్రాంతాల్లో నిత్యం పోలీసులు బందోబస్తు ఉండే ఏర్పాట్లు చేశారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో శ్రీశైలంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. శ్రీశైలంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని ముఖద్వారం వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో, స్వంత వాహనాల్లో, కాలినడకన వచ్చే భక్తులను,ల గేజీలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంయి దేవస్థానం టోల్గేట్ వద్ద ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దేవస్థాన సెక్యూరిటీ సిబ్బందికి పలు అంశాలపై శిక్షణ ఇచ్చారు. -
మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ
నంద్యాల(న్యూటౌన్): మాదక ద్రవ్యాల నియంత్రణకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసైతే కలిగే దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల్లో వీడియోలు ప్రదర్శించాలన్నారు. ప్రముఖ కూడళ్లలో హోర్డింగులు ఏర్పాటు చేయాలని, వాల్ పోస్టర్లు ప్రదర్శించాలని సూచించారు. కళాజాతా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల నివారణ కోసం జూన్ 1నుండి జూన్ 26వ తేదీ వరకు సంబంధిత అధికారులు బృందాలుగా వెళ్లి నిర్దేశించిన కార్యక్రమాలను చేపట్టాలన్నారు.. మత్తు పదార్థాల నియంత్రణపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు గాను వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలను నిర్వహించాలన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు రయిజ్ ఫాతిమా, ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ రవికుమార్, డీఈఓ జనార్దన్ రెడ్డి, డీఐఈఓ సునీత, ఐసీడీఎస్ పీడీ లీలావతి, జువైనల్ హోం సూపరింటెండెంట్ హుస్సేన్బాషా తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి -
ఒక్క పరిశ్రమ లేదు.. ఉద్యోగం రాదు
జూపాడుబంగ్లా: అంతన్నారు.. ఇంతన్నారు.. పదేళ్లు గడుస్తున్నాయి. అయినా ఒక్క పరిశ్రమ రాలేదు. ఒక్క ఉద్యోగం దక్కలేదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటలకు.. చేతలకు పొంతన ఉండదు అనేందుకు నిదర్శనం తంగడంచ భూములు. ఎంతో సారవంతమైన భూములు నిరుపయోగంగా మారాయి. నాణ్యమైన విత్తనాలు ఉత్పిత్తి చేయాల్సిన భూములు ముళ్లకంపలతో దర్శనమిస్తున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో వందలాది ఎకరాలు కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారే కానీ.. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం లేదు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం జిల్లాలోని తంగడంచ ఫారం భూముల్లో జిల్లాలో అల్ట్రామెగా ఫుడ్పార్కింగ్ చేసి జిల్లాలో 10 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ మేరకు గుజరాత్ అంబుజా పరిశ్రమకు 211.10 ఎకరాలను ఎకరా రూ.4.50 లక్షల చొప్పున విక్రయించేందుకు ఏపీఐఐసీ ఒప్పందం కుదుర్చుకున్నారు. 2015 ఏప్రిల్ 30న టీడీపీ ప్రభుత్వం జీవో నెంబర్ 152ను విడుదల చేసింది. పరిశ్రమల నిబంధనల ప్రకారం పరిశ్రమల స్థాపన కోసం పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో ఆరు మాసాల్లోగా కంపెనీ స్థాపన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అయితే భూములను కేటాయించి మూడేళ్లు గడిచినా గుజరాత్ అంబుజా పరిశ్రమ స్థాపించకపోవటంతో ఒప్పందాన్ని రద్దు చేసి వారికి కేటాయించిన భూములను రద్దు చేసి ఏపీఐఐసీకి అప్పగించారు. వారు చిన్న, మధ్య తరహా పరిశ్రమలను స్థాపించేందుకుగాను రూ.7.5కోట్లు వెచ్చించి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు రాకపోవటంతో ప్రస్తుతం ఏపీఐఐసీ అధ్వర్యంలోని 211 ఎకరాలు ముళ్లపొదలతో నిండి అడవిని తలపిస్తున్నాయి. ప్రస్తుతం కంపెనీలకు కేటాయించిన భూములు నిరుపయోగంగా మారగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఇప్పటికై నా సీఎం చంద్రబాబునాయుడు పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులైన యువతీ, యువకులను, రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. జైన్ ఇరిగేషన్ అంతే.. తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలోని బంగారు పంటలు పండే నల్లరేగడి భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వం జైన్ఇరిగేషన్ కంపెనీకి 624.54 ఎకరాలు కేటాయించింది. 2017లో జైన్ కంపెనీని స్థాపించినా ఇప్పటి దాకా 50 మందికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించిన దాఖలాల్లేవు. కేవలం ఎక్కడో పెంచిన మొక్కలు ఇక్కడికి తెచ్చి విక్రయిస్తోంది. కేవలం స్టాక్ పాయింట్గా భూములను వినియోగించుకుంటోంది. తంగడంచ విత్తనోత్పత్తిక్షేత్రంలో అల్ట్రామెగా ఫుడ్పార్కింగ్ ఏర్పా టు కోసం పైలాన్ ప్రారంభించే సమయంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆరు మాసాల్లోగా గుజరాత్ అంబుజా పరిశ్రమతో పాటు జైన్ పరిశ్రమలను స్థాపించి ప్రత్యక్షంగా, పరోక్షంగా 10వేల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. పదేళ్లు గడిచినా స్థానికులకు ఒక్క ఉద్యోగం రాలేదు. సీడ్ హబ్ పేరుతో మరో 600 ఎకరాలు కేటాయించినా ఇప్పటి వరకు ఒక విత్తనం నాటలేదు. ఒక మొక్క పెంచలేదు. నిరుపయోగంగా తంగడంచ ఫారం భూములు పదేళ్ల క్రితం అల్ట్రామెగా ఫుడ్పార్క్కు చంద్రబాబు శంకుస్థాపన అంబుజా భూములు ఏపీఐఐసీకి అప్పగింత స్థానికులకు ఒక్క ఉద్యోగం ఇవ్వని జైన్ ఇరిగేషన్ కంపెనీ సీడ్ హబ్ పేరుకే పరిమితంరూ.7కోట్ల నిధులు వృథా.. గుజరాత్ అంబుజా పరిశ్రమ స్థాపిస్తారని హడావుడిగా ఏపీఐఐసీ రూ.7.09 కోట్ల నిధులను వెచ్చించి కేజీ రోడ్డు నుంచి అంబుజా పరిశ్రమ స్థాపన భూముల వరకు 1.304 కిలోమీటర్ల మేర రెండులైన్లతో కూడిన బీటీరోడ్డును నిర్మించింది. అలాగే సుద్దవాగుపై వంతెనను ఏర్పాటు చేసింది. కేటాయించిన భూములను సర్వేచేయించి సరిహద్దులు ఏర్పాటు చేయటంతోపాటు కంపచెట్లను తొలగించేందుకు మరో రూ.కోటి నిధులను వెచ్చించారు. ఇప్పటిదాకా ఆభూముల్లో ఒక్క పరిశ్రమలను స్థాపించ లేదు. దీంతో రూ.7 కోట్ల ప్రజాధనం వృథా అయింది. ఇప్పటికై నా నిరుపయోగంగా ఉన్న భూముల్లో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
వర్షాలు కురిస్తే ఈనెల 20 తర్వాత పత్తి సాగు
● మొదలైన బీటీ పత్తి విత్తన ప్యాకెట్ల అమ్మకాలు ● పల్లెలకు చేరుతున్న నకిలీ, లూజు విత్తనాలు ● రాష్ట్రంలోనే ఉమ్మడి జిల్లాలో పత్తి సాగు అధికం ● తమ ఆధీనంలోని కంపెనీల్లో వ్యవసాయ శాఖ తనిఖీలు ● ప్రత్యేక ఏజెంట్ల ద్వారా అమ్మకాలు గత ఏడాది నకిలీ పత్తి విత్తనాల వల్ల జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతినింది. బనగానపల్లి, దొర్నిపాడు, ఎమ్మిగనూరు ప్రాంతల్లో నకిలీ విత్తనాలతో రైతులు కోలుకోలేని విధంగా నష్టపోయారు. 2023–24 సంవత్సరంతో పోలిస్తే 2024–25లో నకిలీ విత్తనాలు, లూజు విత్తనాల అమ్మకాలు, అనధికార విత్తనాలు, స్టాప్ సేల్స్ తదితరాలకు సంబంధించి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. రూ.2.40 కోట్ల విలువ చేసే పత్తి, ఇతర విత్తనాలు 100.79 క్వింటాళ్లు సీజ్ చేశారు. ఐదు 6ఏ కేసులు కూడా నమోదయ్యాయి. -
ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేశాం
నకిలీ విత్తనాలు, లూజు విత్తనాలు, అనుమతి లేని విత్తనాల కోసం తనిఖీలు చేస్తున్నాం. ఇందుకోసం ప్రత్యేక టీమ్లు కూడా ఏర్పాటు చేశాం. వీటితో పాటు హెచ్టీ పత్తి విత్తనాల కోసం తనిఖీలు నిర్వహిస్తూ ఎక్కడికక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాదికి సంబంధించి ఇంతవరకు అనధికార విత్తనాలు, నకిలీలు పట్టుబడలేదు. ఎక్కడైన అనుమతి లేని విత్తనాలు అమ్ముతుంటే సంబంధిత వ్యవసాయ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు -
దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు
దేశంలో ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న అధ్వాన పరిస్థితులు లేవు. పత్రికలపై దాడులు చేయడం విలేకరులను బెదిరించడం ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ దినపత్రిక ఎడిటర్ ఇంట్లోకే ఎలాంటి అనుమతులు లేకుండా పోలీసులు వెళ్లడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజల గొంతు నొక్కేయాలనుకోవడం సిగ్గుచేటు. ఇటీవల కాలంలో జర్నలిస్టులకు రక్షణ లేకుండా పోతోంది. – శంకర్, సీపీఐఎంఎల్ న్యూ డెమొక్రసీ పార్టీ కార్యదర్శి, నంద్యాల పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటు సాక్షి పత్రిక సంపాదకులను ప్రభుత్వం టార్గెట్ చేయడం శోచనీయం. పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు సిగ్గుచేటు. అసలు రాష్ట్రంలో పత్రికలు, మీడియాకు స్వేచ్ఛ ఉందో లేదో అర్థం కావడం లేదు. ఉన్నది ఉన్నట్లు రాస్తే ప్రభుత్వ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని పరిస్థితులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలోనే చూడాల్సి వస్తోంది. – ఆకుమల్ల రహీమ్, ఆల్మదర్ ఫౌండేషన్ అధ్యక్షుడు, నంద్యాల -
చంపడాలు, చావడాలు ఎవరికీ మంచివి కావు
చెరుకులపాడు నారాయణరెడ్డిని హతమార్చే సమయంలో అడ్డుపడిన బోయ సాంబశివుడును సైతం దారుణంగా మట్టుబెట్టారు. ఇతనికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు పిల్లలు సంతానం. నారాయణరెడ్డి కుటుంబీకుల ఆశీస్సులతో సాంబశివుడి తల్లి బోయ రాములమ్మ ప్రస్తుతం చెరుకులపాడు గ్రామ సర్పంచ్గా సేవలందిస్తున్నారు. ఆయన తండ్రి జయరాముడు కాలం చేయడంతో.. తల్లి, భార్య, ఇద్దరు పిల్లలు గంగాధర్, మురళీకృష్ణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో ‘సాక్షి’ వాళ్లను పలుకరించగా.. ‘సాంబశివుడిని అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారు. మేము అష్టకష్టాలతో నారాయణరెడ్డి కుటుంబం చలువతో జీవనం నెట్టుకొస్తున్నాం. చంపడాలు, చావడాలు, జైలుకు పోవడాలు ఎవరికీ మంచివి కావు. మా కుటుంబం పడిన వేదన భవిష్యత్లో మరొకరికి రాకూడదు.’’ అని కన్నీళ్లు పెట్టుకున్నారు. -
జంట హత్యల కేసులో తుది తీర్పు
● సంచలనం రేపిన చెరుకులపాడు నారాయణరెడ్డి, సాంబశివుడు హత్యోదంతాలు ● ఎనిమిదేళ్ల తర్వాత నిందితులకు యావజ్జీవ శిక్ష ● 11 మందికి శిక్ష ఖరారు, ఐదుగురు విడుదల ● కుటుంబ సభ్యుల్లో కట్టలు తెంచుకున్న కన్నీళ్లు అప్పుడు వాళ్లను ఏడ్పించి.. ఇప్పుడు వీళ్లు ఏడుస్తూ! (యావజ్జీవ శిక్ష పడటంతో రోదిస్తున్న ముద్దాయిలు) ఎవరికోసమైతే ఇద్దరిని చంపారో వాళ్లు కాపాడుతారనుకున్నారు. అడిగినంత డబ్బు ఇచ్చాం కాదా, ఎంచక్కా బయటకు రావచ్చునుకున్నారు. ఎనిమిదేళ్లు ఇలా గడిచిపోయింది.. ఇక కోర్టు మెట్లు ఎక్కే పని లేదనుకున్నారు.. గురువారం ఉదయం జిల్లా కోర్టు వద్ద ఉద్విగ్న వాతావరణం నెలకొంది. జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది. ఎలాంటి తీర్పు వస్తుందోనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో కనిపించింది. 11 గంటల సమయంలో 11 మంది నిందితులకు యావజ్జీవ శిక్ష విధిస్తూ కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు వెలువరించింది. విషయం క్షణాల్లో బయటకు రావడంతో కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. నెత్తీనోరు కొట్టుకుంటూ, ఇక మాకు దిక్కెవరంటూ రోదిస్తున్న తీరు ప్రతి ఒక్కరినీ కంటతడిపెట్టించింది. ఇదిలా ఉంటే కోర్టు నుంచి బయటకు వచ్చిన ముద్దాయిలు కూడా తమ వాళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. చంపినప్పుడు ఆ కుటుంబాల్లో ఎంతటి క్షోభకు గురై ఉంటాయో, ఇప్పుడు వారి కుటుంబ సభ్యులను చూసి వాళ్లు కూడా అంతకు రెట్టింపు వేదనను అనుభవించడం కనిపించింది. – కర్నూలు(సెంట్రల్)/వెల్దుర్తి -
జిల్లా కలెక్టర్కురెడ్క్రాస్ అవార్డు
నంద్యాల(న్యూటౌన్): రెడ్ క్రాస్ సొసైటీల ద్వారా అత్యుత్తమ సేవలందించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి రెడ్ క్రాస్ అవార్డు దక్కింది. ఈ క్రమంలో గురువారం విజయవాడలో గవర్నర్ అబ్దుల్ నజీర్ నుంచి కలెక్టర్ అవార్డుతో పాటు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల అధునాతన వసతులతో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను ప్రారంభించామన్నారు. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు లభ్యమయ్యేలా జనరిక్ మెడికల్ షాప్ను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రక్తదానానికి యువత స్వచ్ఛందంగా ముందుకొచ్చేలా అవగాహన కల్పిస్తామన్నారు. మత్స్యకారులు, చెంచులకు రెడ్ క్రాస్ సంస్థ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ సురేఖగోస్పాడు: నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్గా డాక్టర్ సురేఖ గురువారం బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడి మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ శ్రీదేవి ఇటీవల ఉద్యోగ విరమణ పొందారు. ఆమె స్థానంలో కడప ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్ సురేఖను ఉన్నతాధికారులు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు అడ్డుకట్టబొమ్మలసత్రం: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేరగాళ్లను గుర్తించి నేరాల కట్టడికి అడ్డుకట్ట వేయాలని జిల్లా ఎస్పీ అధిరాజ్సింగ్రాణా పోలీసు అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక రామకృష్ణా పీజీ కళాశాల ఆడిటోరియమ్లో ఫోరెన్సిక్ సైన్స్ ఎవిడెన్స్ మేనేజ్మెంట్పై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. కేసుల దర్యాప్తులో ఆధారాలు, సాక్ష్యాలు కీలకమన్నారు. కేసు దర్యాప్తు తప్పుదోవ పట్టకుండా ఆధునిక సాంకేతిక ద్వారా నేరస్తులను గుర్తించే అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ మందా జావళి ఆల్ఫోన్స్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఫోరెన్సిక్ వైద్య నిపుణులు అసిమ్బాషా, కృష్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు ఇంకెప్పుడు పూర్తి చేస్తారు
డోన్: కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిని విస్మరిస్తుందని, పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఇంకెప్పుడు పూర్తి చేస్తారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. కొత్తకోట గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన రూ. 18.50 కోట్లతో నిర్మిస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ అండ్ ట్రైనింగ్ రీసర్చ్ (ఐడీటీఆర్) భవనంతో పాటు దేవరబండ, వెంగళాంపల్లి చెరువులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనులు పూర్తి చేయడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. సకాలంలో హంద్రీ నీవా కాలువ నుంచి నీరు అందించలేక పోయిన ఘనత కూటమి ప్రభత్వానికే దక్కుతుందన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలకు తాగేందుకు మంచి నీరు, పశువులకు నీరు లభించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోట్లాది రూపాయలతో ప్రారంభించిన అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేసి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. మాజీ మంత్రి వెంట మీట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీరాములు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రామచంద్రుడు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ బద్దల రాజ్కుమార్, పార్టీ మండల అద్యక్షులు సోమేశ్ యాదవ్, నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మల్యాల శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి -
ఆదర్శనీయులు దామోదరం సంజీవయ్య
● సంజీవయ్య వర్ధంతి సభలో వక్తలుకర్నూలు(అర్బన్): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి దళిత ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య కుల, మతాలకు అతీతంగా బడుగు, బలహీన వర్గాలకు విశేషమైన సేవలు అందించి అందరికి ఆదర్శంగా నిలిచారని మాల గెజిటెడ్ అధికారుల సంఘం నేతలు కొనియాడారు. సంజీవయ్య 53వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక నంద్యాల చెక్పోస్టు సర్కిల్లో ఉన్న ఆయన విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం విగ్రహం సమీపంలోనే సంఘం రాష్ట్ర గౌరవ సలహాదారు గోన నాగరాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్, శరత్బాబు, చైర్మన్ సోమన్న, కన్వీనర్ చంద్రశేఖర్, కోశాధికారి రాజశేఖర్, రాష్ట్ర కమిటీ సభ్యులు హెచ్డీ ఈరన్న, ఎస్సీ, ఎస్టీ, లాయర్స్ ఫోరం అధ్యక్షుడు ఎగ్గోని జయరాజ్, దామోదరం రాధాక్రిష్ణ హాజరయ్యారు. ముందుగా సభకు అధ్యక్షతన వహించిన గోన నాగరాజు మాట్లాడుతూ రాయలసీమలోని బోయ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చారని, కోస్తా ప్రాంత కాపు ( తెలగ ), రాయలసీమ బలిజలను బీసీ జాబితాలో చేర్చారని గుర్తు చేశారు. మండల్ కమిషన్ కంటే ముందే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారని, ఎస్టీ, ఎస్టీలకు ఉద్యోగాలతో పాటు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలయ్యేలా 1961లోనే ఉత్తర్వులు ఇచ్చారన్నారు. కోర్ కమిటీ సభ్యులు రామకృష్ణ, రత్నప్రసాద్ మాట్లాడుతూ కుల, మతాలకు అతీతంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంజీవయ్య సేవలు అందించారన్నారు. భూమి లేని నిరుపేదల కోసం 6 లక్షల ఎకరాలను పంచారన్నారు. వ్యవసాయానికి కూడా పెద్ద పీట వేసి రాయలసీమలోని కర్నూలు జిల్లాలో హంద్రీ నదిపై గాజులదిన్నె ప్రాజెక్టు, ఆత్మకూరు అటవీ ప్రాంతంలో వరదరాజ స్వామి ప్రాజెక్టు ప్రారంభించారన్నారు. మరో సభ్యులు శరత్బాబు మాట్లాడుతూ మాల గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రూపుగా ఏర్పడి బ్యాంకుల ద్వారా రుణాలను పొంది పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించేందుకు బ్యాంకుల సహకారాన్ని తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కోశాధికారి రాజశేఖర్, నాయకులు డా.వై ప్రవీణ్కుమార్, ఇరిగేషన్ డీఈఈ ఎన్ ప్రసాదరావు, రిటైర్డు అడిషనల్ ఎస్పీ వేల్పుల జయచంద్ర, మాధవస్వామి, డీఆర్ రాజు, సోగరాజు మునెయ్య, రాజీవ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కండువాలు కప్పి.. ప్రజాతీర్పునకు మసిపూసి!
నందికొట్కూరు: కేవలం ఒకే ఒక్క కౌన్సిలర్ ఉన్న టీడీపీ.. నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ కుర్చీతో రాజకీయ చదరంగం ఆడుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలోని ఇరు వర్గాలు కౌన్సిలర్లతో రాయ‘బేరాలు’ నడుపుతూ ప్రజాతీర్పును అపహాస్యం చేస్తున్నారు. టీడీపీ పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి తమ రాజకీయ ఉనికి కోసం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ గిరిని వేదికగా మార్చుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చైర్మన్గా కొనసాగుతున్న ఎంపీ వర్గీయుడు దాసి సుధాకర్రెడ్డిపై మాండ్ర వర్గం అవిశ్యాస తీర్మానం పెట్టింది. ఈ మేరకు అధికారులు గురువారం తీర్మానం ప్రవేశపెడుతుండటంతో ఇరువర్గాలు బలనిరూపణకు సిద్ధమయ్యాయి. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించింది. మొత్తం 29 స్థానాల్లో వైఎస్సార్సీపీ 21 గెలుచుకుంది. ఏడుగురు ఇండిపెండెంట్లు వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో వారి బలం 28కి చేరింది. టీడీపీ కేవలం ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమైంది. అయితే గత సార్వత్రిక ఎన్నికల తర్వాత 15 మంది కౌన్సిలర్లకు పచ్చ కండువా కప్పారు. మాండ్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీడీపీ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మిగిలిన కౌన్సిలర్లు చైర్మన్తో పాటు 9 మంది కౌన్సిలర్లు ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో చేరారు. ప్రస్తుతం ముగ్గురు కౌన్సిలర్లు మంగళి అల్లూరి కృష్ణ, చెరుకు సురేష్, షేక్ నాయబ్ వైఎస్సార్సీపీలోనే కొనసాగుతూ కీలకంగా మారారు. మాండ్ర, ఎంపీ క్యాంప్ రాజకీయాలు నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లతో మంతనాలు మొదలు పెట్టి కొంత మేరకు సఫలం అయినట్లు సమాచారం. మాండ్ర వర్గంలో 16 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు సైకిలెక్కి తిరుగుతుండగా ముగ్గురు వైఎస్సార్సీపీ జెండాను వీడేది లేదని తేల్చి చెప్పారు. ఎంపీ బైరెడ్డి శబరి వర్గంలో 10 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఉన్నారు. కోరం లేకపోయినా మాండ్ర వర్గం అవిశ్వాసానికి తెరలేపారు. ఇరువర్గాలు క్యాంపు రాజకీయాలకు తెరతీశాయి. ఎంపీ వర్గం ఊటికి, మాండ్ర వర్గం గోవాకు కౌన్సిలర్లను తరలించారు. చైర్మన్గిరి కోసం ఎంపీ వర్గంలోని మరో ముగ్గురు, నలుగురు కౌన్సిలర్లను మెజార్టీ కోసం కొనుగోలు చేసేందుకు మాండ్ర సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఈనేపథ్యంలో చైర్మన్ కుర్చీ ఎవరినీ వరిస్తుందో వేచి చూడాల్సిందే. మున్సిపాలిటీలో టీడీపీకి ఒకే కౌన్సిలర్ మారిన రాజకీయాలతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు కండువాలు నేడు నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాసం పట్టు నిలుపుకునేందుకు ఎంపీ, పైచేయి సాధించేందుకు మాండ్ర యత్నం చర్చనీయాంశంగా మారిన నీచ రాజకీయాలు ఏర్పాట్లు పరిశీలన మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్రెడ్డిపై గురువారం అవిశ్వాసం తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్థానిక మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏర్పాట్లను ఆర్డీఓ నాగజ్యోతి బుధవారం పరిశీలించారు. కాగా అవిశ్వాస తీర్మానం విధి విధానాల గురించి విలేకరుల కోరగా కమిషనర్ బేబీ చెబుతారని వెళ్లిపోయారు. అయితే అవిశ్వాస తీర్మానం కార్యక్రమం కవరేజీకి పాత్రికేయులు రానీయవద్దని టౌన్ సీఐ ప్రవీణ్కుమార్రెడ్డికి కమిషనర్ సూచించడం ఎంత వరకు సమంజసమని జర్నలిస్ట్ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. -
ప్రాణదాన ట్రస్ట్కు రూ.5 లక్షల విరాళం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్ట్కు బుధవారం గుంతకల్లుకు చెందిన వంకదారి రామకృష్ణయ్య రూ.5 లక్షల విరాళాన్ని దేవస్థాన ఏఈవో జి.స్వాములకు అందజేశారు. విరాళాన్ని అందించిన దాతకు దేవస్థానం తరుఫున స్వామివారి శేషవస్త్రాన్ని, లడ్డూప్రసాదాలు, జ్ఞాపికను అందించి సత్కరించారు. టీబీ డ్యామ్కు కొనసాగుతున్న ఇన్ఫ్లోహొళగుంద: కర్ణాటక రాష్ట్రం హోస్పేట్లోని తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో కొనసాగుతోంది. అకాల వర్షాలతో అడపాదడపా జలాశయానికి వరద నీరు చేరుతుంది. ప్రస్తుతం డ్యామ్లో 7.5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే ఇన్ఫ్లో 2,950 క్యూసెక్కులుంది. గత నెల 24న ఇన్ఫ్లో జీరో ఉండి 6.871 టీఎంసీల నీరు ఉండగా.. అకాల వర్షాలతో రెండు వారాలుగా వరద నీటి చేరిక మొదలై బుధవారానికి 7.5 టీఎంసీలకు చేరింది. గతేడాది ఇదే సమయానికి 1577.79 అడుగుల వద్ద 3.489 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాలు ఆశాజనకంగా కురిస్తే జూలై నెలాఖరుకు డ్యాం పూర్తి మట్టానికి నీరు చేరి ఎల్లెల్సీతో పాటు వివిధ కాల్వకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐకి గాయాలు కర్నూలు: కర్నూలు శివారు డోన్ రోడ్డులో మిస్టర్ ఇడ్లీ సర్కిల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఐడీ ఎస్ఐ శ్రీనివాసులుతో పాటు ఆయన కూతురికి గాయాలయ్యాయి. బుధవారం ఉదయం ఎస్ఐ కుటుంబ సభ్యులతో కలసి నడుచుకుంటూ వెళ్తుండగా దొర్నిపాడు పీఎస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ కారులో వెళ్తూ ఎస్ఐ శ్రీనివాసులును ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆయనను తప్పించే క్రమంలో కూతురికి కూడా గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కర్నూలు అర్బన్ తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 8 నుంచి ఆర్యూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిఽధిలో ఈనెల 8 నుంచి జూన్ 3వ తేదీ వరకు డిగ్రీ 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ, 6వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 55 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామని బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పరీక్షలను ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్టికెట్, ఐడీ కార్డుతో పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాలన్నారు. -
మన్యం వీరుడి పోరాటం స్ఫూర్తిదాయకం
నంద్యాల(న్యూటౌన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం స్ఫూర్తిదాయకమని జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకొని కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో అల్లూరి చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ రామునాయక్ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర పోరాటంలో అల్లూరి పాత్ర ఎనలేనిదన్నారు. బ్రిటీషుయులను ఎదురించి మన్యం గిరిజనులను కాపాడిన వీరుడన్నారు. ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ రవికుమార్, జిల్లా పర్యాటక అధికారి సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో క్రాష్కోర్సు శిక్షణ కర్నూలు(అర్బన్): జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు ఉచిత మెగా డీఎస్సీ క్రాష్ కోర్సులో శిక్షణను విజయవాడలో నిర్వహిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు రయిస్ఫాతిమా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధులు, బధిరులు, శారీరక విభిన్న ప్రతిభావంతులైన ఎస్జీటీ టీచర్ పోస్టులకు అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఈ శిక్షణను ఏర్పాటు చేశారన్నారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా mdfc.apcfss.in వెబ్సైట్ను సందర్శించి ఈ నెల 11లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కనీసం 40 శాతం వికలత్వం ఉన్న వారు మాత్రమే అర్హులని, శిక్షణ కోసం టెట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారన్నారు. -
జెడ్పీలో అల్లూరికి ఘన నివాళి
కర్నూలు(అర్బన్): మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు నిబద్ధత, త్యాగం ఉంటే ఎలాంటి అణచివేతనైనా ఎదుర్కోగలమని జిల్లా పరిషత్ సీఈఓ జి. నాసరరెడ్డి అన్నారు. బుధవారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక జెడ్పీలోని మినీ సమావేశ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులోనే వీర మరణం పొందారన్నారు. భారత స్వాతంత్ర చరిత్రలో అల్లూరి బ్రిటీష్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నారు. సమాజం కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతను అలవరచుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎల్డీఓ అనురాధ, జెడ్పీలోని వివిధ విభాగాలకు చెందిన పరిపాలనాధికారులు సి. మురళీమోహన్రెడ్డి, రాంగోపాల్, జితేంద్ర, సరస్వతమ్మ, పుల్లయ్య, బసవశేఖర్తో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఆటో బోల్తా .. డ్రైవర్ మృతి
బేతంచెర్ల: మండల పరిఽధిలోని గూటుపల్లె గ్రామ సమీపాన ఆటో బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. బాధిత కుటుంబసభ్యులు, స్థానికుల వివరాల మేరకు.. గూటుపల్లె గ్రామానికి చెందిన రామచంద్రుడు (42)ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. బుధవారం హుసేనాపురం సమీపాన భవన నిర్మాణానికి సెంట్రింగ్ చెక్కల బాడుగ ఉండటంతో వెళ్లి వస్తున్నాడు. గూటుపల్లె సుంకులమ్మ ఆలయం సమీపాన ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న సీఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ రమేష్ సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య లక్ష్మి, కుమార్తె ఉదయ లక్ష్మి ఉన్నారు. -
ఒకే రోజు గుడి నిర్మాణం
బేతంచెర్ల: సాధారణంగా ఒకే రోజు ఆలయ నిర్మాణం పూర్తికాదు. అయితే, మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో ఓ భక్తుడు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాన్ని నిర్మించారు. బుధవారం స్వామి ఆరాధన మహోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆలయ నిర్మాణ పనులు ప్రారంభించి సాయంత్రం నాలుగు గంటల్లోగా పూర్తి చేశారు. సుమారు 30 మంది కూలీలతో ఈ పనులు చేపట్టారు. నెలరోజుల తర్వాత స్వామి విగ్రహ ప్రతిష్ఠోత్సవం ఉంటుందని ఆలయ నిర్మాణ దాత బ్రహ్మయ్య తెలిపారు. 13 ఏళ్ల క్రితం ఇదే మాదిరిగా బేతంచెర్ల పట్టణంలో స్వామి మందిరం నిర్మించినట్లు వెల్లడించారు. -
విత్తనోత్పత్తికి మంగళం
● వ్యవసాయ శాఖ ఫామ్లు ఉన్నా లేనట్లే ● తంగడంచె ఫామ్లో బీళ్లుగా 350 ఎకరాలు ● పత్తి విత్తనాలకు దళారీలే ఆధారం ● ఖరీఫ్ సీజన్ వస్తుందంటే దళారీలు, అధికారులకు పండగే.. ● ముడుపులతో తనిఖీలు నామమాత్రంతంగడంచె ఫామ్లో బీడుగా మారిన భూములుకర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ సీజన్ వస్తుందంటే విత్తన సమస్య రైతులను ముప్పుతిప్పలు పెడుతోంది. విత్తనోత్పత్తికి పేరొందిన ఉమ్మడి కర్నూలు జిల్లా విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సి వస్తోంది. రెండు సీజన్లకు అవసరమైన విత్తనాలను ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేస్తోంది. నిబంధనల ప్రకారం రైతులకు ఫౌండేషన్ సీడ్ ఇచ్చి విత్తనోత్పత్తి చేయించాలి. ఆ విత్తనాలను రైతుల నుంచి సేకరించి సర్టిఫైడ్ సీడ్గా సరఫరా చేయాలి. అలాంటిది విత్తనాల కోసం ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖ దళారీలపై ఆధారపడటం ఆశ్చర్యం కలిగిస్తోంది. విత్తనాలను సరఫరా చేసే దళారీలకు ఏపీసీడ్స్, వ్యవసాయ శాఖలు పెట్టుకున్న ముద్దుపేరు ‘ఆర్గనైజర్లు’. ఈ ఏడాది కూడా దళారీలు కాసుల పంట పండించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 10 లక్షల హెక్టార్లలో సాగు భూములు ఉండగా ఉమ్మడి జిల్లాకు పత్తి విత్తన ప్యాకెట్లు 25 లక్షల వరకు.. ఇతర విత్తనాలు 40వేల క్వింటాళ్లు అవసరం. దళారీలే దిక్కు విత్తనోత్పత్తికి దేశంలోనే కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వేరుశనగ, పత్తి, జొన్న, శనగ, మొక్కజొన్న, కందులు, మినుములు, కొర్రలు తదితర విత్తనాలతో పాటు కూరగాయల విత్తనోత్పత్తి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేపట్టారు. నేడు కర్నూలు జిల్లాలోనే విత్తనాల కోసం దళారీలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖలు కనీసం తమ ఆధ్వర్యంలోని ఆర్గనైజర్ల(దళారీలు)తో విత్తనోత్పత్తి చేయించి సబ్సిడీపై పంపిణీకి సరఫరా చేయాలి. ఆ దిశగా కూడా చర్యలు శూన్యం. మామూళ్ల బంధం.. అంతా సవ్యం 2024–25లో సీడ్ విలేజ్ పోగ్రామ్ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ క్వింటా ధర కేవలం రూ.6,500 నుంచి రూ.7వేలు పలుకుతోంది. రబీలో పండిన వేరుశనగను దళారీలు ఈ ధరతో కొనుగోలు చేసి తూతూ మంత్రంగా ప్రాసెసింగ్ చేసి ఏజెన్సీలకు సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికారులు కూడా వీటినే నాణ్యమైన విత్తనమని ధ్రువీకరిస్తూ రైతులకు పంపిణీ చేయనున్నారు. అధికారులు, ఆర్గనైజర్లకు మామూళ్ల బంధం ఉండటంతో అంతా సవ్యమే అన్నట్లు వ్యవహారం సాగుతోంది. దీంతో ఖరీఫ్ రైతులకు నాణ్యమైన విత్తనం ప్రశ్నార్థకమవుతోంది. తనిఖీలు నామమాత్రమే.. ● దళారీలు సిద్ధం చేసిన వేరుశనగను వ్యవసాయ శాఖతో పాటు ఏపీ సీడ్స్ అధికారులు తనిఖీ చేయాలి. ● అయితే ఈ ప్రక్రియ కాగితాలపై కనిపిస్తుందే తప్ప క్షేత్ర స్థాయిలో జరగని పరిస్థితి. ● తనిఖీలకు వెళ్లిన వాళ్లు మామూళ్లు పుచ్చుకొని వస్తున్నట్లు తెలుస్తోంది. ● వ్యవసాయ అధికారులు కూడా తూతూ మంత్రంగానే తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. ● ప్రస్తుతం విత్తనాల ప్రాసెసింగ్తో పాటు ప్యాకింగ్ జరుగుతోంది. ● ఈ నేపథ్యంలో విత్తనాల నాణ్యతను సమగ్రంగా పరిశీలించాల్సి ఉంది. ● ఆ దిశగా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మందగించిన విత్తనోత్పత్తివ్యవసాయ శాఖకు కర్నూలు జిల్లాలో ఎదురూరు, ఎమ్మిగనూరు మండలం బనవాసి, నంద్యాల జిల్లా తంగడంచె ఫామ్లు ఉన్నాయి. ఎదురూరు ఫామ్లో 45 ఎకరాలు, బనవాసిలో 55 ఎకరాలు, తంగడంచెలో దాదాపు 600 ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఎదురూరులో తూతూమంత్రంగా ఖరీఫ్లో కంది, రబీలో శనగ.. బనవాసి ఫామ్లో వరి, తంగడెంచెలో కంది విత్తనోత్పత్తి చేస్తున్నారు. తంగడంచె ఫామ్లో 600 ఎకరాల భూములు ఉన్నప్పటికీ 250 ఎకరాల్లోనే విత్తనోత్పత్తి జరుగుతోంది. మిగిలిన 350 ఎకరాల్లో కంపచెట్లు పేరిగి అడవిని తలపిస్తోంది. వందలాది ఎకరాల భూములు వృథాగా మిగిలిపోవడంతో కూటమి ప్రభుత్వం వీటిని ఇతర అవసరాలకు తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2024–25 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పంపిణీ చేసిన వేరుశనగ నాణ్యతపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏపీసీడ్స్ సరఫరా చేసిన వేరుశనగలో రాళ్లు, మట్టిపెళ్లలు ఉండటం, విత్తనాలు నాసి రకం, పుచ్చులు ఉండటంతో రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఏర్పడింది. ఈసారైనా తగిన జాగ్రత్తలు తీసుకుంటారనుకుంటే ఆ ఊసే కరువైంది. ఈ ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాల కోసం వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ దళారీలపైనే ఆధారపడటం గమనార్హం. వ్యవసాయ శాఖ, ఏపీ సీడ్స్ విత్తనోత్పత్తి చేసి రైతులకు పంపిణీ చేస్తేనే రైతులకు నాణ్యమైన వేరుశనగ లభిస్తుంది. ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా తగ్గుతుంది. అయితే దళారీలు ఇచ్చే కమీషన్లు పైనుంచి కింది స్థాయి వరకు ఉండటంతో విత్తనోత్పత్తి అటకెక్కినట్లు చర్చ జరుగుతోంది. -
పాండురంగడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
కోవెలకుంట్ల: పట్టణంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సహిత పాండురంగ విఠలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యులు, సుదర్శనాచార్యుల ఆధ్వర్యంలో స్వామికి ప్రాత:కాల పూజ, పంచామృతాభిషేకం, సీ్త్రసూక్త, భూసూక్త విధానేన అభిషేకాలు, విష్ణు అష్టోత్తర శతనామావళి, మంత్రపుష్పం, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, తదితర కార్యక్రమాలు నిర్వహిచారు. పట్టణంలోని వివిధ కాలనీలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి కోట తిరుణాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ద్వాదశ కుంభహారతి, పేట, కోనేటి తిరుణాల కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
వేణుగోపాలా.. ఆపద్బాంధవా!
ఆళ్లగడ్డ: నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలం క్షేత్రంలో జ్వాలా నరసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున నిత్య పూజల్లో భాగంగా సుప్రభాత సేవతో స్వామిని మేల్కొపిన అనంతరం అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం జ్వాలా నరసింహుడిని వేణుగోపాల స్వామి అలంకారంలో, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను రుక్మిణీ, సత్యభామలుగా అలంకరించి కొలువుంచి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆతర్వాత ఉభయ దేవేరులతో ఉత్సవ పల్లకీని అధిరోహించిన స్వామివారు మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కనువిందు చేశారు. రాత్రి ఉభయ దేవేరులతో స్వామి వారు పొన్నచెట్టు వాహనంపై కొలువై భక్తులను అనుగ్రహించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో ఎగువ, దిగువ అహోబిల క్షేత్రాలు కళకళలాడాయి. వైభవంగా కొనసాగుతున్న నారసింహుడి జయంతి బ్రహ్మోత్సవాలు శ్రీ వేణుగోపాల స్వామి అలంకరణలో జ్వాలా నరసింహుడు వైభవంగా పొన్నచెట్టు వాహన సేవ -
డీఎస్సీ ప్రిపరేషన్ గడువు పెంచాలి
కర్నూలు సిటీ: డీఎస్సీకి ప్రిపరేషన్ గడువు పెంచాలని, లేకపోతే తాము తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ సరిగా లేదని అందులోని పలు అంశాల్లో మార్పులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వారు డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం బిర్లా కాంపౌండ్ దగ్గర రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ మాట్లాడుతూ అనేక ఉద్యమాల ద్వారా డీఎస్సీ నోటిఫికేషన్ సాధించుకున్నామని, అయితే అందులో అనేక అంశాల్లో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందన్నారు. నెల రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు జరపరాదని, ఒక జిల్లా ఒకే పేపర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 90 రోజుల గడువు ఇవ్వడంతో పాటు వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచాలని కోరారు. ఇంటర్మీడియేట్, డిగ్రీ మార్కులు 40 శాతానికి తగ్గించాలన్నారు. ఈ న్యాయమైన డిమాండ్లపై సర్కారు స్పందించకపోతే డీఎస్సీ అభ్యర్థులతో కలిసి చలో విజయవాడ కార్యక్రమ చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి ఉదయ్, కర్నూలు మండల కార్యదర్శి ప్రకాష్, హరికిషన్ రెడ్డి, విశ్వనాథ్, తదితరులు పాల్గొన్నారు. సర్కారు తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించిన అభ్యర్థులు -
రహదారిపై ‘పచ్చ’ కక్ష
● డ్రెయినేజీ ఉన్నా కాల్వపేరుతో తవ్వకాలు ● మట్టిని తవ్వి రోడ్డుపై వేసి రాకపోకలకు అడ్డంకి ● వైఎస్సార్సీపీ సానుభూతి పరులంటూ కక్ష సాధింపు ● అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం కోవెలకుంట్ల: కూటమి నేతల రాజకీయ కక్ష సాధింపు చర్యలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. కంపమల్ల గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకుల తీరుతో బీసీ కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు ఎదురయ్యా యి. కాలనీలో 75 కుటుంబాలు జీవనం సాగిస్తున్నా యి. ఎక్కువ శాతం వైఎస్సార్సీపీ సానుభూతి పరులున్నారనే దురుద్దేశంతో కాలనీ ప్రజలకు రహదారి కష్టాలు తెచ్చిపెట్టారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రూ. 1.30 లక్షలతో గ్రామ పంచాయతీ నిధులు వెచ్చించి 150 మీటర్ల మేర కాలనీలో డ్రెయినేజీ ఏర్పాటు చేశారు. ఈ రహదారి వెంటే గ్రామానికి చెందిన రైతు లు, కాలనీ ప్రజలు పొలాలు, ఊరకుంట, మెయిన్ రోడ్డుకు వెళుతున్నారు. డ్రెయినేజీ ఉన్నా ఆరు నెలల క్రితం టీడీపీ నాయకులు ఆ డ్రెయిన్ పక్కనే ప్రొక్లెయిన్తో కాల్వ పేరుతో తవ్వకాలు చేపట్టారు. తవ్విన మట్టిని రోడ్డుపైనే కుప్పలుగా పోయడంతో రహదారిలో రాకపోకలు స్తంభించి పోయాయి. ఆరు నెలలు గడిచినా రోడ్డుపై మట్టిని తొలగించకపోవడంతో పొలాలకు వెళ్లేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచ్ సోముల లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని గ్రామ టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆ కుటుంబ సభ్యుల వాహనాలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా కాల్వ పేరుతో మట్టిని తవ్వి ఇంటి ముందు అడ్డంగా పోశారు. మట్టి కట్టలు ఉండటంతో ఆరు నెలల నుంచి లోకేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి వాహనాల్లో బయటకు రావడానికి వీలు లేకుండా పోయింది. రోడ్డుపై మట్టి వేసి రాకపోకలకు అంతరాయం కల్గించిన విషయాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినా ఇంత వరకు అధికారులు పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. అంతటితో ఆగక టీడీపీ నేతలు లోకేశ్వరరెడ్డి కుటుంబాన్ని అంతమొందించేందుకు కుట్రలు పన్ని ఈ ఏడాది మార్చి 12వ తేదీన హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకుల దాడిలో లోకేశ్వరరెడ్డి తీవ్రంగా గాయపడి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఆయన తండ్రి వెంకట్రామిరెడ్డి, సోదరుడు వెంకటేశ్వరరెడ్డి గాయాలపాలయ్యారు. దాడి కుట్రలో భాగంగానే ప్రణాళికాబద్ధంగా ఇంటి చుట్టూ మట్టికట్టలు వేసినట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికై నా సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని రోడ్డుపై అడ్డుగా ఉన్న మట్టికట్టలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. -
పీఠాధిపతికి తులాభారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు తులాభారం వేడుక కనుల పండువగా సాగింది. బుధవారం కర్ణాకటలోని మాండ్యకు చెందిన మాజీ ఎమ్మెల్సీ రామకృష్ణ దంపతులు మొక్కుబడిలో భాగంగా బియ్యం, బేడలు, బాదంతో తులాభారం చేపట్టారు. శ్రీమఠం ప్రాంగణంలోని తులాభారం కౌంటర్లో జరిగిన ఈ కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఇంగ్లిషులో మాట్లాడేలా తీర్చిదిద్దాలికర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ సులభంగా తెలుగు మాట్లాడినట్లు ఇంగ్లిషులో కూడా మాట్లాడగలిగేలా ఉపాధ్యాయులు తీర్చిదిద్దాలని విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ డైరెక్టర్ రామేశ్వర్ గౌడ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల ఇంగ్లిషు ఉపాధ్యాయులకు 40 రోజుల ఉచిత ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాన్ని డీఈఓ శామ్యూల్పాల్తో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శిక్షణకు జిల్లాలో దాదాపు 450 మంది ఆంగ్ల ఉపాధ్యాయులు హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వారికి ఇంగ్లిషు బోధనలో పలు మెళకువలు, సూచనలు ఇస్తున్నట్లు చెప్పారు. వాటి ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థులను ఇంగ్లిషులో పూర్తి నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నారు. డీఈఓ మాట్లాడుతూ.. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో విల్ టు కేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లిషు సంస్థ ప్రతినిధులు వేణుగోపాల్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.బైక్ దొంగను పట్టుకుంటే.. బంగారు నగలు లభ్యంసి.బెళగల్: స్కూటర్ ఎత్తుకెళ్లిన దొంగను పట్టుకుంటే... బంగారు నగలు లభించిన ఘటన మండల కేంద్రం సి.బెళగల్లో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలు.. బుధవారం సి.బెళగల్ చెందిన కొందరు యువకులు గ్రామ శివారులోని కంబదహాల్ గ్రామ రోడ్డులో వ్యవసాయ పొలం దగ్గర తమ స్కూటర్లను నిలిపి పొలంలో ఉన్న ఉపరితల ట్యాంక్లో స్నానం చేస్తున్నారు. అయితే వారితో పాటు ఓ కొత్త యువకుడు సైతం ట్యాంక్లో స్నానం చేశాడు. కొద్ది సేపటికే ట్యాంక్ నుంచి బయటకు వచ్చిన ఆ యువకుడు సి.బెళగల్కు చెందిన శివ స్కూటర్ను ఎత్తుకెళ్లాడు. అనుమానంతో సదరు యువకుడి కోసం గాలిస్తుండగా కంబదహాల్ సమీపంలో స్కూటర్తో కనిపించాడు. వెంటనే ఆ యువకుడిని పట్టుకొని సి.బెళగల్లో పోలీసులకు అప్పగించేందుకు వెళ్తుండగా నిందితుడి దగ్గర బంగారు ఆభరణాలున్న ప్యాకెట్ గుర్తించారు. స్కూటర్తో పాటు బంగారు దొంగతనం బయటకు వస్తుందని భయపడి కొటారుమిట్ట దగ్గర ఉన్న వంకలోకి దూకాడు. నిందితుడిని వెంబడించిన స్థానికులు వంక నీటి నుంచి బయటకు లాగి పోలీసులకు అప్పగించారు. నిందితుడి దగ్గర దాదాపు ఏడు తులాల బంగారు, వెండి ఆభరణాలన్నాయి. అతడిని విచారిస్తున్నామని ఎస్ఐ పరమేష్నాయక్ తెలిపారు. -
పోలీసులైతేనేం.. మేము ట్యాక్స్‘బాబు’లం!
దేశమంతా యుద్ధ భయం.. ఎప్పుడు ఎలాంటి ఉపద్రవం ముంచుకొస్తుందోనని అధికార యంత్రాంగం సర్వ సన్నద్ధమవుతోంది. ప్రజలను అప్రమత్తం చేస్తూ, యుద్ధం వస్తే ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో తెలియజేసేందుకు బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో మాక్ డ్రిల్ నిర్వహించారు. రోడ్డు పొడవునా పోలీసు వాహనాలు, ఖాకీ డ్రస్సు వేసుకున్న అధికారులు కలియతిరుగుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ మందు బాబు పోలీసులైతేనేమి, ఎవరేమైతే నాకేంటి అన్నట్లు నడి రోడ్డులో మద్యం సేవించడం మొదలుపెట్టాడు. పక్క నుంచే పోలీసు వాహనాలు వెళ్తున్నా.. తాను ట్యాక్స్‘బాబు’ అనే ధీమాతో ఎంచక్కా మందు కలుపుకొని గుటకేసిన దృశ్యాలు కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దిన మద్యాంధ్రప్రదేశ్కు అద్దం పట్టాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు -
పైసాచికం
ఇసు‘కాసు’రులు బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలో అక్కజమ్మ చెరువులో మట్టిని తరలిస్తున్న దృశ్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ నాయకుల అక్రమాలు పెచ్చుమీరాయి. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలిస్తున్నారు. అనుమతి లేకుండా చెరువుల్లో మట్టి సైతం దోపిడీ చేస్తున్నారు. వీరికి అధికారులు అండగా ఉంటూ ‘పక్ష’ పాత ధోరణి ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు చేస్తూ విమర్శలపాలవుతున్నారు. ఒక వైపు టీడీపీ నాయకుల పైశాచికాన్ని చూస్తూ.. మరో వైపు అధికారులు నిశ్చలంగా ఉండటాన్ని గమనిస్తూ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఽటీడీపీ నాయకులు ఇసుక, మట్టి, గ్రా వెల్ తవ్వకాలు జరుపుతున్నారు.వీరి అక్రమాలకు కొందరు అధికారులు రెడ్ కార్పెట్ వేస్తున్నారు. కోవెలకుంట్ల పట్టణ శివారులో ప్రవహిస్తున్న కుందూనది తీరంలో ఇసుక,నదిఒడ్డున ఏర్పాటు చేసిన కరకట్టను సైతం వదలకుండా టీడీపీ నాయకులు కొల్లగొడుతున్నారు. బెలుకు.. అవినీతి పలుకు! కుందూనది విస్తరణ పనుల్లో భాగంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నది ఒడ్డున కరకట్ట ఏర్పాటు చేశారు. వర్షాకాలంతో నదికి వరద నీరు అధికంగా చేరినా తీర గ్రామాలు, పొలాలను ముంచెత్తకుండా ఈ కరకట్ట అడ్డుకట్ట వేసింది. అయితే టీడీపీ నేతలు కరకట్టను సైతం వదలకుండా తవ్వకాలు జరిపి బెలుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రొక్లెయిన్లు ఏర్పాటు చేసుకుని కట్టను తవ్వి యథేచ్ఛగా బెలుకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ బెలుకును రూ. 500 నుంచి రూ. 800 చొప్పున అమ్ముకుంటున్నారు. ప్రతి రోజు పెద్ద ఎత్తున బెలుకు తరలిపోవడంతో కరకట్ట బలహీన పడింది. వర్షాకాలంలో నదికి వరదనీరు చేరితే పంటపొలాలు, గ్రామాల్లోకి వరదనీరు చేరే ఆస్కారం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చెరువులో మట్టి దందా బనగానపల్లె మండలం చెరువుపల్లి సమీపంలోని అక్కజమ్మ చెరువులో టీడీపీ నేత అక్రమ మట్టిదందా కొనసాగిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. టీడీపీ నేత అండదండలతో మట్టిని తరలిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అనుమతితోనే మట్టిని తరలిస్తున్నానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. చెరువు నుంచి వందలాది ట్రాక్టర్ల ద్వారా మట్టి తరలిపోస్తున్నా రెవెన్యూ అధికారులు చూసీచూడనట్లు వ్యవహిస్తున్నారు. కక్ష సాధింపు ఇలా.. వైస్సార్సీపీ నాయకులపై టీడీపీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అధికారులను బెదిరించి తనిఖీలు, దాడులు చేయిస్తున్నారు. మూడు రోజుల క్రితం కోవెలకుంట్ల మండలం జోళదరాశిలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు ఉప్పరి సుబ్బరాయుడు తన సొంత పొలంలోని మట్టిని మరో పొలానికి తరలించుకునేందుకు ప్రొక్లెయిన్, ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు తహసీల్దార్ పవన్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన మరుక్షణమే తహసీల్దార్ తమ సిబ్బందితో హుటాహుటినా అక్కడికి చేరుకుని మట్టిని తరలించవద్దని హుకూం జారీ చేశారు. నిబంధనల ప్రకారం తన సొంత పొలంలోని మట్టిని మరొక పొలా న్ని చదును చేసేందుకు తోలుకుంటున్నానని చెప్పినా వినకుండా అడ్డుకున్నారు. టీడీపీ పెద్దల ఆదేశాలతో ప్రొక్లెయిన్, రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ శాఖ అధికారులు వాహనాలకు రూ.25 వేలు జరిమానా విధించా రు.అంతటితో కక్ష సాధింపు ఆగలేదు. జరిమానా చెల్లి ంచి రిలీజ్ కాపీని సమర్పించినా తిరిగి ఆర్టీఓ అధికారులకు మరో రిపోర్టు పంపించారు. వాహనాలకు సరై న రికార్డులు లేవని ఆర్టీఓ అధికారులు రూ. 19, 500 జరిమానా విధించడంతో ఆమొత్తాన్ని చెల్లించి వాహనాలను రిలీజ్ చేయించోవాల్సి వచ్చింది. టీడీపీ నాయకుల కొమ్ముకాస్తూ అధికారులు పచ్చపాత ధోరణి ప్రదర్శిస్తున్నారనడానికి ఈ సంఘటనే నిదర్శనం. విమర్శలు ఇవీ.. కోవెలకుంట్ల తహసీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక, బెలుకును ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ నాయకులు సొంతపొలాల్లోని మట్టిని తోలుకుంటున్నట్లు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకుని అడ్డుకుని కేసులు పెడుతున్నారు. కళ్లెదుటే ఇసుక, మట్టి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలిపోతున్నా రెవెన్యూ అధికారులు కాని, కేసీ కెనాల్, మైనింగ్ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. సహజ వనరులను అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులకు సమాచారం ఇచ్చినా చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇసుకను తరలిస్తున్న టీడీపీ నాయకులు చెరువులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు సహజ వనరులను కొల్లగొడుతున్న వైనం అక్రమార్కులకు రెడ్ కార్పెట్ పరుస్తున్న అధికారులు వైఎస్సార్సీపీ సానుభూతి పరులే లక్ష్యంగా దాడులు అధికారుల తీరుపై విమర్శల వెల్లువ కుందూతీరంలో ఇసుకను ట్రిప్పు రూ. వెయ్యి నుంచి రూ. 1,200, మట్టిని రూ. 500 నుంచి 600 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ అమల్లోకి తెచ్చినా టీడీపీ నాయకులు ఇసుక దందా కొనసాగిస్తున్నారు. రైతులు, ఇళ్ల నిర్మాణాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసుకోవచ్చు అన్న నిబంధనను తుంగలో తొక్కి ఇసుక తువ్వను సైతం విక్రయిస్తున్నారు. ప్రొక్లెయిన్లతో కుందూతీరంలో ఇసుకను తవ్వుతుండటంతో తీరం వెంట పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వర్షాకాలం నది ఉప్పొంగితే ఈ గుంతల్లో భారీగా నీరు చేరే అవకాశం ఉంది. ప్రజలు అందులో పడితే తమ విలువైన ప్రాణాలను కోల్పోవచ్చు. జిల్లా అధికారు లు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి బనగానపల్లె నియోజకవర్గంలో ఎలాంటి అనుమతులు లేకుండా కుందూ నదిలోని, కుంటల్లోని, చెరువుల్లోని ఇసుక, మట్టిని టీడీపీ నాయ కులు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం సొంత పొలాలకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మట్టిని తోలుకుంటే అడ్డుకుని కేసులు నమోదు చేసి జరిమానా విధిస్తున్నారు. అధికారులు టీడీపీ నాయకులకు కొమ్ము కాయకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. – కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె -
‘మోహినీ’ అలంకరణలో సింహరూపుడు
ఆళ్లగడ్డ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎగువ అహోబిలంలో సింహరూపుడైన లక్ష్మీనృసింహస్వామి జగన్మోహినీ అలంకరణతో భక్తులను కనువిందు చేశారు. వేకువజామున సుప్రభాతసేవతో స్వామి అమ్మవార్లను మేలుకొలిపి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత జ్వాలా నరసింహ స్వామిని యాగశాలలో కొలువుంచి నవకలశ స్థాపన గావించారు. ప్రహ్లాదవరదుడిని నూతన పట్టుపీతాంభరాలతో మోహినీగా అలంకరించి పల్లకీలో కొలువుంచి భక్తుల గోవింద నామస్మరణలు, మంగళవాయిద్యాల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. రెక్కల కష్టాన్ని దోచేస్తారా? ● ఏపీఓను నిలదీసిన ‘ఉపాధి’ కూలీలు పగిడ్యాల: దినసరి వేతనాలు తక్కువ వేస్తున్నారని ‘ఉపాధి’ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రెక్కల కష్టాన్ని దోచేస్తారా’ అంటూ ఏపీఓ మద్దిలేటిని నిలదీశారు. స్థానిక కార్యాలయానికి మంగళవారం ఉపాధి కూలీలు వచ్చారు. సంకిరేణిపల్లె, ముచ్చుమర్రి, నెహ్రూనగర్ గ్రామాల్లో ఆరు రోజులకు వేతనాలు వేస్తున్నారని, పగిడ్యాల, బీరవోలు, పాలమర్రి గ్రామాల్లో మాత్రం నాలుగు రోజులకే వేతనాలు వేసి కూలీలకు కోత విధిస్తున్నారని మండిపడ్డారు. ఆరు రోజులు పనిచేస్తే నాలుగు రోజులకు మాత్రమే డబ్బులు ఎలా వేస్తున్నారని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా చేస్తున్నందునే అలా వేస్తున్నారని ఏపీఓ మద్దిలేటి వెల్లడించారు. 12 నుంచి ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 12 నుంచి 20వ తేది వరకు నిర్వహించనున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మద్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఇయర్, మద్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 21,342 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో మొదటి సంవత్సరం విద్యార్థులు 15,292.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 5,032 మంది ఉన్నారు. పరీక్షల నిర్వహణకు 52 పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రాక్టికల్స్ ఫెయిల్ అయిన విద్యార్థులకు, గైర్హాజరైన వారికి ఈ నెల 28వ తేది నుంచి జూన్ 1వ తేది వరకు కేవలం జిల్లా కేంద్రంలో మాత్రమే వీటిని నిర్వహించనున్నారు. కొత్తిమీర అ‘ధర’హోగోనెగండ్ల: ఒక్కసారిగా కొత్తిమీర ధర పెరిగిపోయింది. ఒక మడి ధర రూ. వెయ్యి నుంచి రూ. 1,200 వరకు పలుకుతోంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొత్తిమీరకు డిమాండ్ పెరిగింది. గోనెగండ్ల మండలంలో బోర్లు,బావుల కింద 1,500 ఎకరాల్లో రైతులు కొత్తిమీర పంటను సాగుచేశారు. ఈ ఏడాది ఉల్లి, మిరప తదితర పంటలు సాగుచేసిన రైతులు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం కొత్తిమీర పంటకు రెండు రోజుల నుంచి ధరలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
జొన్న రైతుకు ‘వ్యయ’ప్రయాస
కష్టాలు అన్నీఇన్నీ కావు ఈ ఏడాది జొన్న సాగు చేసిన రైతులకు దిగుబడులు అంతంత మాత్రంగానే వచ్చాయి. మార్కెట్లో సరైన ధర లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించడంతో కొంత మేరకు ఉపశమనం వచ్చినా కష్టాలు అన్నీఇన్నీ కావు. బాడుగలు భారంగా మారుతున్నాయి. – ప్రతాపరెడ్డి, ఎం.చింతకుంట్ల, గోస్పాడు మండలం. అర్థం కావటం లేదు నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ వద్ద ఉన్న మమ్మల్ని తిరిగి దీబగుంట్లకు తీసుకెళ్లాలని చెప్పడంతో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చాక తిరిగి గోపవరం వద్దకు తీసుకెళ్లాలని చెప్పారు. మాకేం అర్థం కావటం లేదు. ఒకసారి కుదుర్చుకున్న బాడుగలకు తిరిగి క్వింటాకు రూ. 50 వరకు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. – వలి, పెసరవాయి, గడివేముల మండలం గోస్పాడు: జొన్నలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడం లేదు. ఇందుకు కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రతి రోజూ తికమక పెడుతోంది. దీంతో రైతులకు ఖర్చులు తడిసి మోపెడుతున్నాయి. ముందుగా నంద్యాలలోని సెంట్రల్ వేర్ హౌస్ గోడౌన్ వద్దకు జొన్నలను తీసుకెళ్లేందుకు రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజుకు ట్రాక్టర్కు అయితే రూ. 1,300నుంచి రూ. 1,800 వరకు, లారీకి అయితే రూ. 2వేల నుంచి రూ. 2,500 వరకు ఖర్చు చేశారు. జొన్నలు అమ్ముకోవడానికి క్యూలో నిల్చొని నాలుగైదు రోజులు గడిచాక నంద్యాల సెంట్రల్ వేర్హౌస్ నుంచి దీబగుంట్ల లోని గోడౌన్కు పంపించారు. మంగళవారం దీబగుంట్లకు వచ్చిన తర్వాత గోపవరం సమీపంలోని గోడౌన్కు తరలించాలని అధికారులు చెప్పడంతో రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ ఖాళీగా ఉన్నా ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. రోజుల తరబడి క్యూలో నిలపాల్సి వస్తోందని, ఖర్చులు మరింత పెరిగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు రైతులు ట్రాక్టర్ల వద్ద నిద్రిస్తూ కనిపించారు. మరికొందరు పొలాల్లో వేచి చూశారు. మద్దతు ధరతో కొనుగోలు చేయని ప్రభుత్వం రోజుకొక గోడౌన్కు తిరగాల్సిందే! -
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్లు నంద్యాల న్యూటౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్క్ల ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతాల్లో 50, డోన్ మండలం ఉంగరాలగుట్ట ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. సంబంధిత ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలన్నారు. రిలయన్స్ కంప్రెస్సెడ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో 5 వేల ఎకరాలను గుర్తించి నివేదికలు ఇవ్వగా అందులో 765 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ నుంచి అంగీకారం వచ్చిందన్నారు. అందులో గడివేములలో 300, చాగలమర్రిలో 105, రుద్రవరంలో 190, ఆళ్లగడ్డలో 170 ఎకరాలు ఉన్నాయన్నారు. పీఎం కుసుమ్ సంబంధించి పాణ్యం, నంద్యాల, గోస్పాడు, జూపాడుబంగ్లా, భానుముక్కల, ప్యాపిలి మండలాల్లో 10 ఎకరాల మేరకు ప్రభుత్వ భూములు పరిశీలించి సబ్ స్టేషన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్ఓ రాము నాయక్, నంద్యాల, ఆత్మకూర్, డోన్ ఆర్డీఓలు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
‘సూచనల’ మూగ నోము!
● శ్రీశైలంలో ఆగిపోయిన ‘డయల్ యువర్ ఈఓ’ ● నామమాత్రంగా సూచనల బాక్సుల ఏర్పాటు శ్రీశైలం టెంపుల్: దేశ నలుమూలల నుంచి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ కష్టాలను ఎవరి చెప్పుకోవాలో తెలియక మూగు నోము పాటిస్తున్నారు. గతంలో భక్తుల సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అధికారులు ఎగనామం పెట్టారు. దీంతో భక్తుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం లేదు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి.. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి.. తదితర వివరాలు తెలుసుకునేందుకు శ్రీశైలంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న ప్రారంభించారు. ఇందుకోసం 08524–287111 నంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేవారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఎత్తివేశారు. ఉపయోగంలేని బాక్స్లు డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలనా భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద వీటిని ఉంచారు. భక్తులు వీటిని వినియోగించడం లేదు. పునఃప్రారంభించేందుకు చర్యలు శ్రీశైల దేవస్థానంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. ఆయా విభాగాల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – ఎం. శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
భద్రతా లోపం.. పర్యవేక్షణ శూన్యం
త్వరలో భద్రతాధికారిని నియమిస్తాం శ్రీశైల ఆలయంలో చోరీ సంఘటన జరగడం దురదృష్టకరం. దేవస్థానంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవలే ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. దేవస్థాన సీఎస్వో పోస్టుకు అనేకసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే రిటైర్డ్ డీఎస్పీ స్థాయి అధికారిని, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ని శ్రీశైలం సీఎస్వోగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి నలుగురికి రిమాండ్ హుండీ నగదు చోరీ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. తెలంగాణకు చెందిన సంగనమోని రమేష్, అతనితో సహ జీవనం చేసే కె.లక్ష్మీ, మరో ఇద్దరు మైనర్లను ఉచిత క్యూలైన్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. వీరి నుంచి రూ.10,150 స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించాం. – జి.ప్రసాదరావు, శ్రీశైలం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం టెంపుల్: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త దేవాలయాల పర్యవేక్షణ గాలికి వదిలేసింది. ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న తొక్కిసలాట, సింహాచలంలో గోడకూలిన ఘటన, శ్రీశైల దేవస్థానంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. కొన్ని నెలల క్రితం శ్రీశైలం టోల్గేట్లో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణం, అలాగే టికెట్ల మార్ఫింగ్, ప్రస్తుతం హుండీ చోరీ ఘటనలు మల్లన్న సన్నిధిలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతోంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు కానుకలను సమర్పిస్తారు. ఇందుకోసం ఇనుప హుండీలు, క్లాత్ (గుడ్డ) హుండీలను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీన ఇద్దరు వ్యక్తుల సహకారం, ప్రోత్సాహంతో మరో ఇద్దరు మైనర్లు భక్తుల రూపంలో ఉచిత క్యూలైన్ ప్రవేశమార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్దగల క్లాత్ (గుడ్డ)తో ఏర్పాటు చేసిన హుండీని బ్లేడ్తో కోసి అందులో నుంచి రూ.10,150 దొంగతనం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందని తెలిసి కూడా అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గర్భగుడిలో చోరీ ఘటనపై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టెంపుల్ ఇన్స్పెక్టర్ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి సస్పెండ్ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ గార్డులు కూడా నిర్లక్ష్యం వహించారని ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు. శ్రీశైలం పర్యవేక్షణ గాలికి.. శ్రీశైలక్షేత్ర భద్రతను, పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది మహోత్సవాల్లో సైతం భక్తులకు అరకొర సౌకర్యాలు కల్పించారని భక్తులు విమర్శించారు. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శివస్వామిపై వ్యాపారస్తులు దాడిచేసి గాయపరచిన ఘటన చోటుచేసుకుంది. టోల్గేట్లో అవినీతి కుంభకోణం చోటుచేసుకుంది. అంతేకాకుండా వీఐపీ బ్రేక్ స్పర్శదర్శనం టికెట్లను మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయించిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం గర్భగుడిలో హుండీ చోరీ ఘటన కలకలం రేపుతోంది. రెగ్యులర్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ లేని వైనం శ్రీశైల దేవస్థాన భద్రతను పర్యవేక్షించేందుకు, ఉభయ దేవాలయాల్లోకి అసాంఘిక శక్తులు, నిషేధిత పదార్థాలు తీసుకెళ్లకుండా క్షేత్ర భద్రతను దేవస్థాన ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. అయితే గత కొన్ని నెలల నుంచి దేవస్థానం సీఎస్వో పోస్టు ఖాళీగా ఉంది. దేవస్థాన పర్యవేక్షకులకే ఇంచార్జి సీఎస్వోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అలాగే దేవస్థానంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యండ్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు, లగేజి స్కానర్లు ఉన్నప్పటికీ అలంకారప్రాయంగానే ఉండిపోయాయి. మల్లన్న సన్నిధిలో భద్రత డొల్ల ఏకంగా గర్భగుడిలోని క్లాత్ హుండీని కోసి డబ్బు దొంగతనం ఇద్దరు మైనర్లకు మరో ఇద్దరి సహకారం ఈఓ ఆదేశాలతో శ్రీశైలం పీఎస్లో సీఎస్ఓ ఫిర్యాదు నిందితులు రిమాండ్కు తరలింపు విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టెంపుల్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ -
శేష వాహనంపై అహోబిలేశుడు
ఆళ్లగడ్డ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూలమూర్తులను సోమవారం ఉదయం సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి, శ్రీ లక్ష్మీనరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించి పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉభయ దేవేరులతో శేషవాహనంపై మాడ వీధుల్లో వివహరిస్తూ భక్తులను కటాక్షించారు. రాత్రి చంద్రప్రభ వాహనంపై కొలువైన జ్వాలా నరసింహస్వామి మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. -
రైతులకు డీనోటిఫై పత్రాలు
నంద్యాల(న్యూటౌన్): చుక్కల, 22ఏ1 కింద నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను పరిష్కరించి 11 మంది రైతులకు డీనోటిఫై పత్రాలను ఇచ్చామని జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. మొత్తం 11 మంది రైతులకు 32.71 ఎకరాల భూములకు డీ నోటిఫై పత్రాలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓలు కృషి చేశారన్నారు. బాధిత సర్వే నంబర్ల రైతులను ఐజీఆర్ఎస్ నిషేధిత జాబితాలో డీనోటిఫై చేయాలని, వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పుకు చర్యలు తీసుకోవాలన్నారు. మలేరియా, డెంగీ రాకుండా పటిష్ట చర్యలు గోస్పాడు: మలేరియా, డెంగీ వ్యాధులు రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్య సిబ్బందిని డీఎంఅండ్హెచ్ఓ వెంకటరమణ ఆదేశించారు. పట్టణంలోని తన కార్యాలయంలో సోమవారం నంద్యాల జిల్లా సబ్ యూనియన్ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్హెచ్ఓ మాట్లాడుతూ.. జ్వరం కేసులను త్వరగా గుర్తించి రక్తనమూనాల సేకరించి మలేరియా నిర్ధారణ అయితే వెంటనే ఏఎల్ఓ, పోగింగ్ స్ప్రేయింగ్ నివారణ చర్యలు చేపట్టాలన్నారు. మలేరియా, డెంగీ నివారణ చర్యలపై ఏఎన్ఎం, ఆశా, సీహెచ్ఓలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు, ఇన్చార్జి ఏఎంఓ రామవిజయారెడ్డి, సబ్ యూనిట్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయాలతో పాఠశాల విద్యకు నష్టం నంద్యాల(అర్బన్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఏపీటీఎఫ్(275) జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ, ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు కోరుతూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్ ప్రియదర్శినికి అందజేశారు. కార్యక్రమంలో నాయకులు నాయకులు తిమ్మారెడ్డి, రమేష్, నాగేంద్ర, ప్రసాద్, నౌమాన్బాషా తదితరులు పాల్గొన్నారు. హంద్రీనీవా ఎస్ఈగా పాండురంగయ్య కర్నూలు సిటీ: హంద్రీనీవా సుజల స్రవంతి పథకం సర్కిల్–1 పర్యవేక్షక ఇంజనీర్గా పాండురంగయ్యను నియమిస్తూ ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎల్ఎల్సీ ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్గా పాండురంగయ్య పని చేస్తున్నారు. హంద్రీనీవా సర్కిల్–1కి రెగ్యులర్ ఎస్ఈ లేరు. గత నెల 30న ఇన్చార్జిగా ఉన్న సురేష్ పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం హంద్రీనీవా విస్తరణ పనులు జరుగుతుండడంతో ఖాళీగా ఉన్న ఎస్ఈ పోస్టుకు పాండురంగయ్యను నియమించారు. ● కర్నూలు సర్కిల్ ఎస్ఈగా బాల చంద్రారెడ్డిని నియమించారు. ఈ ఏడాది జనవరి నెల లో రెగ్యులర్ ఎస్ఈలుగా పదోన్నతులు ఇవ్వడంతో ద్వారకనాథ్ రెడ్డి ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించారు. గత నెల 30న పదవీ విరమణ పొందారు. ఖాళీగా ఉన్న ఈ స్థానంలో బాల చంద్రారెడ్డిని ఎస్ఈగా నియమితలయ్యారు. -
సాగులో లేని వాళ్లు ఉన్నట్లు చూపిస్తున్నారు. అసలు ప్రాణాలతో లేని వ్యక్తులు పరిహారం కోసం కోర్టుకు వెళ్లినట్లు సృష్టించారు. ఈ విషయంలో ఓ టీడీపీ నేత చక్రం తప్పారు. ఇప్పటికే కొంతమందికి పరిహారం మంజూరు కాగా, మిగిలిన వారికీ పరిహారం మంజూరు చేయాలని సదరు నేత అధికారుల
అయ్యన్న సంతకాలు ఫోర్జరీ సర్వేనెంబర్ 232లో అయ్యన్న అనే వ్యక్తికి రెండు ఎకరాల పొలం ఉంది. ఇతనికి కూడా రూ.8.60లక్షలు పరిహారం రావాలి. ఇతను 2008 జూలై 8న చనిపోయారు. ప్రభుత్వం మరణధ్రువీకరణ పత్రం కూడా జారీ చేసింది. అయితే ఇతని పొలాన్ని 2013లో సేకరించారు. పరిహారం కోసం చనిపోయిన అయ్యన్న 2018 నవంబర్ 5న కోర్టులో రిట్(40116/2018) దాఖలు చేశారు. 2002లో చనిపోయిన వ్యక్తి 2018లో కోర్టును ఎలా ఆశ్రయించారో అధికారులకే తెలియాలి. 2002లో చనిపోతే.. 2018లో కోర్టుకు ఎలా వెళ్లారు? పాలకొలనులోనే కలగొట్ల నాగమ్మ అనే మహిళకు 2 ఎకరాల పొలం ఉంది. ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున ఈమెకు రూ.8.60లక్షలు పరిహారం రావాలి. అయితే నాగమ్మ 2002లో చనిపోయారు. భూమిని 2013లో సేకరించారు. కానీ పరిహారం కోసం నాగమ్మ పేరుతో ఓ టీడీపీ నేత 2018లో రిట్ (డబ్ల్యూపీ 42989/2018)దాఖలు చేశారు. అందులో నాగమ్మ వేలిముద్రలను ఫోర్జరీ చేశారు. నాకు తెలీకుండానే నా పేరుతో కోర్టుకు.. నాకు అరెకరా ఉంది. నాకు రూ.2.15లక్షలు రావాలి. నేను బతికే ఉన్నా. నాకు తెలియకుండా నా పేరుతో టీడీపీ లీడర్ కోర్టుకు వెళ్లారు. నాకు సంతకం రాదు. నేనైతే ఎక్కడా వేలిముద్రలు వేయలేదు. కానీ నేను వేసినట్లు వేలిముద్రలు వేశారట. లేదంటే డ్వాక్రా గ్రూపులోని వేలిముద్రలను తీసుకున్నారేమో తెలీదు. ఇది చాలా అన్యాయం. నా పరిహారం నాకు ఇప్పించాలి. – శేషమ్మ నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు మా మానాన్న మద్దిలేటికి 4.38 ఎకరాల పొలం ఉంది. ఇప్పటికీ పాసుపుస్తకాలు మా నాన్న పేరుతో ఉన్నాయి. అయితే మా ఆడపిల్లలతో పాటు మా సోదరుడు వెంకటేశ్వర్లు భార్య భాగమ్మ, ఆమె పిల్లలు బతికే ఉన్నారు. వారికి తెలియకుండా భూమి భాగ పరిష్కారాలు కాకుండా మొత్తం భూమి రామాంజనేయులు తీసుకున్నట్లు నకిలీ పాసుపుస్తకాలు సృష్టించారు. మా వద్ద మా నాన్న పాసుపుస్తకాలు ఉన్నాయి. దీనిపై అధికారులు విచారణ చేయాలి. అప్పటి వరకూ పరిహారం ఆపాలి. – మద్దిలేటి వారసులుఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ భూసేకరణ కుంభకోణం ● పరిహారం కోసం రైతులకు తెలియకుండా కోర్టుకు ● చనిపోయిన వారి పేరిట రిట్ పిటిషన్లు దాఖలు ● ఇప్పటికే 120 మందికి పరిహారం.. త్వరలో మరో 70 మందికి ● ఈ విషయంలో చక్రం తిప్పుతున్న ఓ టీడీపీ నేత ● మంజూరైన పరిహారంలో 50శాతం ఇచ్చేలా ఒప్పందం సాక్షి ప్రతినిధి కర్నూలు: ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్లో డీఆర్డీఓ(డిఫెన్స్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్) కోసం 3,250 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ప్రభుత్వం సేకరించింది. పట్టా భూము లకు, అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎకరాకు రూ.4.30లక్షల చొప్పున పరిహారం ఇచ్చింది. అయితే ఈ పరిహారం మంజూరులో కొందరు రైతుల పేర్లతో టీడీపీ నేతల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. 15–20 ఏళ్ల కిందట చనిపోయిన వారి పేర్లతో ఫోర్జరీ సంతకాలు చేసి పరిహారం పొందేందుకు సిద్ధమ య్యారు. ఇప్పటికే 120మందికి పరిహారం అందింది. మరో 70మందికి పరిహారం మంజూరు కాగా, ఖా తాల్లో జమ కావల్సి ఉంది. అయితే ఈ పరిహారం మంజూరులో అక్రమాలు జరిగాయని ఇటీవలే బాధిత రైతు కుటుంబాలతో పాటు పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట సాని రాంభూపాల్రెడ్డి కలెక్టర్ను కలిసి విన్నవించారు. నిజమైన బాధితులకు న్యాయం చేయాలని కోరారు. వేలిముద్రలు ఫోర్జరీ చేసి కోర్టులో రిట్ పాలకొలనులో మాదిగ శేషమ్మకు అరెకరా పొలం ఉంది. ఈమె భూమిని డీఆర్డీఓ కోసం సేకరించారు. అయితే పొలంలో శేషమ్మ సాగులో లేదని పరిహారం తిరస్కరించారు. దీనిపై శేషమ్మకు తెలియకుండానే ఆమె పేరుతో హైకోర్టులో 2022లో రిట్(పిటిషన్ నెం.25654) దాఖలు చేశారు. పిటిషన్లో శేషమ్మ పేరుతో వేలిముద్రలు వేసి ఆమె పేరు రాశారు. నిజానికి ఈ విషయం ఆమెకు ఏమాత్రం తెలీదు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు తప్పుడు వేలిముద్రలతో శేషమ్మ పేరుతో రిట్ దాఖలు చేశారు. లేదంటే డ్వాక్రా సంఘంలో ఉన్న శేషమ్మ రుణాల లావాదేవీలలో గతంలో వేసిన వేలిముద్రలను ఫోర్జరీ చేసి ఉండొచ్చని శేషమ్మ అనుమానిస్తున్నారు. ఇప్పుడు ఈమె పేరుతో మంజూరైన పరిహారం శేషమ్మకు తెలియకుండానే టీడీపీ నేత ఖాతాలో జమ కానుంది. వచ్చిన పరిహారంలో ఫిఫ్టీ.. ఫిఫ్టీ పాలకొలనులో డీఆర్డీఓ కోసం వందల ఎకరాల భూమి సేకరించారు. ఇందులో కొందరు నిజమైన అర్హులు ఉంటే కొందరు భూమి లేకుండా కేవలం నకిలీ పట్టాలు సృష్టించి పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్న వారున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎవరైతే ప్రభుత్వం నుంచి అసైన్డ్భూములు పొంది, సాగులో లేకుండా ఉన్నారో వారికి పరిహారం నిరాకరించారు. ఇదే అదునుగా ఓ టీడీపీ నేత పరిహారం నిరాకరించిన కొందరి పేర్లతో వారికి తెలీకుండా వారి పేర్లతో కోర్టులో రిట్దాఖలు చేశారు. ఇది చూసి ఇంకొందరు రైతులు కూడా టీడీపీ నేతతో కలిసి వెళ్లి తమకూ పరిహారం ఇప్పించాలని కోరారు. దీంతో ఆ టీడీపీ నేత వచ్చే పరిహారంలో సగం తనకు ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. తనకు వచ్చే సగంలో అధికారులకు వాటా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఫ్యామిలీకి తెలీకుండా దోపిడీ నక్కల మద్దిలేటికి సర్వేనెంబర్ 199లో 3.50 ఎకరాలు, సర్వేనెంబర్ 243/5లో 0.88 ఎకరాలు మొత్తంగా 4.38 ఎకరాలు ఉంది. మద్దిలేటి చనిపోయి 20 ఏళ్లు దాటింది. ఈయనకు ఐదుగురు ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. వీరిలో మొదటి, రెండో కుమారులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు చనిపోయారు. అలాగే ఓ ఆడపిల్ల కూడా చనిపోయింది. చిన్నోడు రామాంజనేయులుతో పాటు నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మద్దిలేటి పేరుతో ఉన్న పొలాన్ని రెండో కుమారుడు వెంకటేశ్వర్లు భార్య భాగ్యమ్మకు మగపిల్లోడు ఉన్నారు. ఈమెతో పాటు తక్కిన నలుగురు ఆడపిల్లలకు సంబంధం లేకుండా మొత్తం పొలం దాన విక్రయం కింద తండ్రి తనకు రాసిచ్చినట్లు పాస్బుక్కులు సృష్టించారు. పరిహారం కోసం కోర్టులో 2018లో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే రామాంజనేయులు మినహా తక్కిన మద్దిలేటి వారసులు పాస్బుక్కులు తమ తండ్రి పేరుతోనే ఉన్నాయని, నకిలీ పాసుపుస్తకాలు సృష్టించుకుని రామాంజనేయులు తమకు పరిహారం ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీని వెనుక గ్రామానికి చెందిన టీడీపీ నేత ఉన్నారని చెబుతున్నారు. -
అన్నదాతలకు తీవ్ర అన్యాయం
● రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశారు ● టీడీపీ నాయకుల ఇళ్లలోకి ఎరువుల బస్తాలు ● వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం: దేశానికి అన్నం పెట్టే రైతులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్రెడ్డి మండిపడ్డారు. అన్నదాతలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వంపై పోరాడతామని చెప్పారు. పాణ్యం మండలం ఆలమూరు గ్రామంలో రైతులతో సోమవారం ముఖాముఖి నిర్వహించారు. పెట్టుబడి వ్యయం, గిట్టుబాటు ధర, సాగు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో కాటసాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులను టీడీపీ నాయకుల ఇళ్లలో ఉంచుతున్నారన్నారు. చేసేదేమి లేక రైతులు వేరే ప్రాంతానికి వెళ్లి యూరియా బస్తా రూ. 400 ప్రకారం కొనాల్సి వస్తోందన్నారు. కనీస మద్దతు ధర లేకపోవడంతో ధాన్యం కల్లాలు దాటడడం లేదన్నారు. సాగు నీరు అందలేదు ‘పది రోజులుగా కల్లాల్లో ధాన్యం ఉంచినా కొనుగోలు చేసేందుకు ఎవరూ రావడం లేదు’ అని కన్నీటితో తమ కష్టాలను కాటసానికి రైతులు వివరించారు. ‘సాగు నీరు సరిగ్గా రాలేదని, తెగుళ్లు ఎక్కువయ్యాయని, మందు బస్తాల రేటు చాలా పెరిగిందని.. ఇలా ఉంటే రైతులు ఏమి చేయాలి’ అని వాపోయారు. గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో బుకింగ్ చేస్తే ఊర్లోనే మందులు, విత్తనాలు, పనిముట్లు ఇచ్చేవారని, నాటి పరస్థితులు నేడు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు అన్నదాత సుఖీభవ కింద రూ. 20వేలు రైతులకు ఇస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చి మోసం చేశారని కాటసాని అన్నారు. అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతో రైతులు నష్టపోతే ఒక్క పైసా పరిహారం ఇవ్వలేదన్నారు. మోసం చేస్తే ప్రభుత్వానికి రైతులే బుద్ధి చెబుతారన్నారు. జెట్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మల్లు జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు రామలక్ష్మయ్య, గోపాల్రెడ్డి, ఉపేంద్రారెడ్డి, దేవేంద్రరెడ్డి, శ్రీనాథ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీశైలం.. భక్తజనసంద్రం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన భ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే గాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మల్లన్న దర్శనానికి భారీగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లికార్జునస్వామివారి దర్శనానికి క్యూలైన్ వద్దకు చేరుకున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్ల ద్వారా భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆన్లైన్ ద్వారా టికెట్లు పొంది స్వామివారి స్పర్శదర్శనం నిర్వహించుకున్నారు. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. భక్తుల రద్దీతో క్షేత్ర పురవీధులన్నీ కిటకిటలాడాయి. -
మల్లన్న ఆలయంలోని హుండీకి కన్నం?
● కానుకలు చోరీచేసిన నలుగురు ● ఓ ఉద్యోగిపై సస్పెన్షన్ వేటు శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని మల్లికార్జున స్వామి గర్భగుడిలో ఉన్న హుండీకి నలుగురు మైనర్లు కన్నం వేసినట్లు సమాచారం. ఈనెల 1న ఉచిత దర్శన క్యూలైన్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మైనర్లు గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్ద ఉన్న (క్లాత్)హుండీని బ్లేడ్తో కోసి, అందులో కొంత డబ్బు తీస్తుండగా దేవస్థాన సూపరింటెండెంట్ పట్టుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పది రోజుల నుంచి నలుగురు మైనర్లు దర్శనం పేరుతో ఉచిత క్యూలైన్ల ద్వారా ఆలయంలో తరచూ తిరిగినట్లు వెల్లడైంది. ఈఓ ఆదేశాలతో దేవస్థాన సీఎస్ఓ ఫిర్యాదు మేరకు శ్రీశైలం ఒకటో పట్టణ స్టేషన్ ఆఫీసర్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సమాచారం. చోరీ విషయమై విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీనియర్ అసిస్టెంట్ను బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాలుడి కుటుంబానికి ఆర్థికసాయం బేతంచెర్ల: స్థానిక హనుమాన్ నగర్కు చెందిన నాలుగేళ్ల బాలుడు షేక్ మొహిద్దీన్ ఈనెల 2న కుక్కల దాడిలో మృతిచెందిన విషయం విదితమే. బాలుడి తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డోన్ ఆర్డీఓ నరసింహులు, మండల ప్రత్యేక అధికారి బషీరున్నీసా బేగం, తహసీల్దార్ ప్రకాశ్బాబు, నగర పంచాయతీ కమిషనర్ హరిప్రసాద్ రూ.3 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మధు, తేజ పాల్గొన్నారు. భగీరథుడిని స్మరించుకోవాలి నంద్యాల(అర్బన్): భగీరథుడిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని రాష్ట్ర న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు. భగీరథ మహర్షి జయంతిని ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ భగీరథుడు వారి పూర్వ పితామహులకు స్వర్గ ప్రాప్తి కల్పించేందుకు దివి నుంచి గంగను భువికి తెచ్చేలా చేశారన్నారు. కార్యక్రమంలో సగర సంఘం జిల్లా నాయకులు సురేష్కుమార్, శివయ్య, బాలరాజు, బాలాజీ, చిన్నయ్య, జిల్లా సంక్షేమ అధికారి ఓబులేసు, తదితరులు పాల్గొన్నారు. నేడు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నంద్యాల(న్యూటౌన్): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉదయం 9.30 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12.30 గంటలకు ముగించనున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిల్లోనూ పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నీట్కు 1,144 మంది హాజరు నంద్యాల(న్యూటౌన్): నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్(నీట్) ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. నంద్యాలలో నాలుగు కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్ష జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,176 మందికి గాను 1,144 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామన్నారు. దివ్యాంగ విద్యార్థులకు అన్ని పరీక్ష కేంద్రాల ఎదుట వీల్చైర్లను అందుబాటులో ఉంచామన్నారు. పరీక్ష కేంద్రాలను ఆర్డీఓ విశ్వనాథ్, డీఎస్పీ మందా జావలి ఆల్ఫోన్స్ తమ సిబ్బందితో పర్యవేక్షించారు. -
కొనుగోళ్లు మూరెడు..కష్టాలు బారెడు
నంద్యాల(అర్బన్): కొనుగోళ్లు మూరెడు.. కష్టాలు బారెడులా తయారైంది జొన్న రైతుల పరిస్థితి. ఒకపక్క అరకొర కొనుగోలు కేంద్రాలు.. మరోపక్క సరుకు బాగోలేదంటూ వెనక్కు పంపుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 30 వేల మెట్రిక్ టన్నుల జొన్నలను మద్దతు ధర రూ.3,371తో కొనుగోలు చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా నందికొట్కూరు, ఆళ్లగడ్డ, గడివేముల, నంద్యాలలో రెండు కేంద్రాల్లో కొనుగోళ్లకు జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రస్తుతానికి రైల్వే స్టేషన్ సమీపంలోని సీడబ్ల్యూసీ గోడౌన్లో కొనుగోళ్లను చేపట్టారు. ఒకే గోడౌన్లో కొనుగోళ్లు జరుగుతుండటంతో జిల్లావ్యాప్తంగా వస్తున్న జొన్న పంట దిగుబడులను కొనుగోలు చేయడం సిబ్బందికి ఇబ్బందిగా మారింది. మరోవైపు రైతులు రోజుల తరబడి వేసిచూడాల్సి వస్తోంది. ఈక్రమంలో శనివారం నుంచి సెంట్రల్ వేర్హౌస్కు సరుకు తీసుకు రావద్దని, దీబగుంట్ల గోడౌన్కు తీసుకెళ్లాలని గోడౌన్ అధికారులు హడావుడిగా సమాచారం ఇవ్వడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి ఇక్కడికి తిప్పుతూ ఉంటే వాహనాల రవాణ బాడుగలు రెండింతలు భరించాల్సి వస్తుందంటూ అన్నదాతలు నిట్టూర్చారు. నాణ్యత లేవంటూ వెనక్కి.. జొన్నలు జల్లెడ పట్టలేదని, నాణ్యత లేవంటూ సిబ్బంది కొంత మంది రైతులను వెనక్కిపంపుతున్నారు. గోడౌన్లు, సంచుల కొరత తీవ్రంగా వేధిస్తుండటం, కొనుగోళ్లు ఆలస్యమవుతుండటంతోపాటు నాణ్యత లేవంటూ వెనక్కి పంపుతుండటంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇదే సమయంలో కొందరు సిఫార్స్ ఉన్న రైతుల నుంచి మాత్రమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ట్రాక్టర్ను లోపలికి అనుమతించే గోడౌన్ సిబ్బందికి రూ.500, సెక్యూరిటీకి రూ.50 ఇచ్చుకోవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సకాలంలో కొనుగోళ్లు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జొన్నలను అధికారులు సకాలంలో కొనుగోలు చేసేవారు. జనవరి నుంచి ప్రారంభించి మార్చి చివరిలోపే జిల్లాలోని రైతులందరితో కొనుగోళ్లు పూర్తి చేసేవారు. మొదట కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జొన్న కొనుగోళ్లు జరిగాక.. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెచ్చిన ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల వద్ద ఉన్న మొత్తం జొన్నల కొనుగోళ్లు జరిగేవి. గ్రామాలు, మండలాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడమే గాకుండా మరికొన్ని ప్రాంతాల్లో కల్లాల వద్దే రైతుల నుంచి కొనుగోళ్లు జరిగేవి. కూటమి ప్రభుత్వం మాత్రం రైతన్నలను ముప్పుతిప్పలు పెడుతోంది. బాడుగ ఖర్చు పెరుగుతోంది రోజుకు ట్రాక్టర్ బాడుగ రోజుకు రూ.2 వేలు. వారం రోజుల క్రితం జొన్నలను విక్రయించేందుకు తెచ్చాను. ఇంకా కొనుగోలు చేయలేదు. ఎన్నిరోజులవుతుందో తెలియదు. అధికారులు రేపుమాపు అంటున్నారు. ట్రాక్టర్ బాడుగలు పెరిగిపోతున్నాయి. కేంద్రాలను మరిన్ని పెంచి త్వరగా కొనుగోలు చేయాలి. – వెంకటేశ్వరరెడ్డి, కరిమద్దెల, గడివేముల(మం) రోజుకు 15వేల టన్నులు కొంటున్నాం జిల్లాకు సంబంధించి 30వేల మెట్రిక్ టన్నుల జొన్న కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పటి వరకు 5వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. వరుస క్రమంలోనే కొనుగోళ్లు చేస్తున్నాం. అవినీతికి ఆస్కారమే లేదు. హమాలీలు, గోడౌన్లు, గన్నీ బ్యాగ్ల కొరత ఉంది. కొనుగోలు కేంద్రాల సంఖ్య పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. కేంద్రాలు పెంచితే రైతులు వేచి చూడాల్సిన పని ఉండదు. – రాజునాయక్, సివిల్ సప్లయ్ డీఎం, నంద్యాల జొన్న కొనుగోలు కేంద్రాలు అస్తవ్యస్తం సరుకు బాగోలేదంటూ వెనక్కి పంపుతున్న సిబ్బంది నత్తనడకన కొనుగోలు ప్రక్రియ.. రోజుల తరబడి రైతుల నిరీక్షణ ట్రాక్టర్ల బాడుగలు అధికమవుతు న్నాయంటూ అన్నదాత ఆందోళన -
ఆర్బీకేలు ఉన్నా లేనట్టే!
మాకు ఆరు ఎకరాల భూమి ఉంది. ఇందులో కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేస్తున్నాం. ఆర్బీకే మాకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్బీకేలు లేనట్లుగా ఉన్నాయి. ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందులకు కోడుమూరుకు, వెల్దుర్తికి వెళ్లాల్సి వస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకేలను నిర్వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. – ఎం.మాదన్న, ఎస్హెచ్ ఎర్రగుడి, కృష్ణగిరి మండలం ప్రభుత్వం చొరవ తీసుకోవాలి గత ఏడాది మే నెల వరకు రైతుభరోసా కేంద్రాలతో అన్ని రకాల సేవలు పొందాం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆర్బీకేలు పనిచేయడం లేదు. గత ఏడాది వరకు ఎరువులు/ పురుగు మందులు ఏదీ అవసరమైనా నిమిషాల వ్యవధిలోఆర్బీకే ద్వారా పొందువారం. నేడు బస్తా ఎరువు కావాలన్నా... నీళ్ల మందులు కావాలన్నా డోన్కు, పత్తికొండకు పోవాల్సి వస్తోంది. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. – నౌనేపాటి, ముక్కెళ్ల, తుగ్గలి మండలం -
వైఎస్సార్సీపీ హయాంలో ఇలా..
దేశానికే రోల్ మోడల్గా గుర్తింపు పొందిన రైతు భరోసా కేంద్రాలు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడుతోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వీటిని రైతుసేవా కేంద్రాలుగా మార్చడంతో నీలినీడలు అలుముకున్నాయి. ప్రస్తుతం రేషనలైజేషన్ పేరుతో వందలాది రైతుసేవా కేంద్రాలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి కర్నూలు జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది.● రైతు సేవా కేంద్రాలకు ఉరి వేసిన రాష్ట్ర ప్రభుత్వం ● రేషనలైజేషన్ పేరుతో కొన్ని కేంద్రాల తొలగింపు ● రెండు, మూడు రోజుల్లో రానున్న ఉత్తర్వులు ● వైఎస్సార్సీపీ హయాంలో 188 ఆర్బీకేల మనుగడ ● ఇక పోస్టుల భర్తీ, ఆర్బీకేల మనుగడ లేనట్లే ఆర్బీకేలో పనిచేయని డిజిటల్ కియోస్క్ కర్నూలు(అగ్రికల్చర్): రైతుభరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామ స్థాయిలోనే అన్నదాతలకు అన్ని రకాల సేవలు అందించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామస్థాయిలో రైతులకు సేవలు అందించే రైతుభరోసా కేంద్రాలు నిర్వీర్యం అయ్యాయి. వీటిని రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారే తప్ప ఎలాంటి సేవలు అందించడం లేదు. వాటికి అన్నదాతలకు దూరం చేసేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించారు. గతంలో విత్తనం వేసే సమయం నుంచి మద్దతు ధరతో పంటను అమ్ముకునే వరకు అనేక సేవలు పొందిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కర్షకుల కష్టం రెట్టింపు అయ్యింది. ఎక్కడి పనులు అక్కడే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు) ఉన్నాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 849, అర్బన్ ప్రాంతాల్లో 28 పనిచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు సేవలు అందిస్తున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో ఆర్బీకేలకు సొంత భవనాలు ఏర్పాటు చేసింది. కర్నూలు జిల్లాలో 328, నంద్యాల జిల్లాలో 156 ప్రకారం 484 ఆర్బీకేలకు అపురూపమైన సొంత భవనాలు ఉన్నాయి. మిగిలిన 393 ఆర్బీకేలకు కూడా సొంత భవనాలు నిర్మితం అవుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. పోస్టుల భర్తీ లేనట్టే ఆర్ఎస్కే పరిధిలో ఉద్యాన పంటలు ఉంటే గ్రామ ఉద్యాన సహాయకుడు(వీహెచ్ఏ) ఉండాలి. మల్బరీ సాగైతే గ్రామ పట్టు పరిశ్రమ సహాయకుడు(వీఎస్ఏ) పనిచేయాల్సి ఉంది. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటే గ్రామ వ్యవసాయ సహాయుడు( వీఏఏ) విధులు నిర్వర్తించాలి. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గ్రామ పట్టుపరిశ్రమ సహాయకులందరికీ పదోన్నతులు లభించాయి. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వీఏఏలు 474, వీహెచ్ఏలు 215 ప్రకారం మొత్తం 689 మంది పని చేస్తున్నారు. మిగిలిన 188 పోస్టులను భర్తీ చేయడంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించే అవకాశం లేకుండా పోయింది. ఈ పోస్టులన్నీ రద్దయినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మూతపడినట్లే! ఉమ్మడి కర్నూలు జిల్లాలో 877 ఆర్బీకేలు(ఆర్ఎస్కేలు)ఉండగా రేషనలైజేషన్తో వీటిలో 188 కేంద్రాలు మూతపడినట్లే అని వ్యవసాయశాఖ వర్గాలే పేర్కొంటున్నాయి. పోస్టుల భర్తీ లేనందున ఆర్ఎస్కేలు కూడా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఏకంగా 188 ఆర్ఎస్కేలు మూత పడే పరిస్థితి ఉత్పన్నం అవుతుందంటే రైతులకు సేవలు ఏ స్థాయికి దిగజారి పోతాయో ఊహించుకోవచ్చు. 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏ! ప్రతి 2,600 ఎకరాలకు ఒక వీఏఏ/వీహెచ్ఏలు ఉండే విధంగా రేషనలైజేషన్ జరుగుతోంది. ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ ప్రక్రియ జరుగుతోంది. దీనిపై వ్యవసాయ, ఉద్యాన శాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. మిగిలిన భూములకు వ్యవసాయ శాఖలో ఎంపీఈవోలుగా పనిచేస్తున్న వారిని నియమిస్తారు. వీఏఏ, వీహెచ్ఏ పోస్టులను భర్తీ చేయకుండా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న ఎంపీఇవోలను వినియోగించుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇవీ కష్టాలు..● విత్తనం మొదలు పండించిన పంటను మద్దతు ధరతో అమ్ముకునే వరకు రైతుకు ఆర్బీకేలు అండగా నిలిచాయి. ● ఖరీఫ్, రబీ సీజన్లలో ఆర్బీకేల ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేసేవారు. ● వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, ఏపీఎంఐపీ, ఫిషరీష్, మార్కెటింగ్ తదితర శాఖలకు సంబంధించిన అన్ని రకాల కార్యాక్రమాలు ఆర్బీకేల ద్వారానే అమలయ్యాయి. ● ఆర్బీకేల్లో వ్యవసాయ విజ్ఞానానికి సంబంధించిన దాదాపు 50 పుస్తకాలతో మినీ లైబ్రరీ ఉండేది. ● ఆర్బీకేల్లోనే రైతుల సందేహాలను నివృత్తి చేసేవారు. ఏ ఎరువు ఎందుకు ఉపయోగపడుతుందనే దానిపై అవగాహన కల్పించేవారు. ● డిజిటల్ కియోస్క్ల ద్వారా తమకు అవసరమైన రైతులు ఆర్డర్ చేస్తే 48 గంటల్లోనే సరఫరా అయ్యేవి. ● ఆడియో, వీడియోలతో వ్యవసాయానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇచ్చేవారు. రేషనలైజేషన్ జరుగుతోంది ఉమ్మడి జిల్లా యూనిట్గా రేషనలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రైతులకు ఎలాంటి నష్టం ఉండదు. ఉమ్మడి జిల్లాలో 877 ఆర్బీకేలు ఉన్నాయి. ప్రస్తుతం వీఏఏలు, వీహెచ్ఏలు కలిపి 689 మంది పనిచేస్తున్నారు. ఇందువల్ల ఆర్బీకేలు తగ్గే అవకాశం లేదు. వీఏఏలు, వీహెచ్ఏలు స్థానంలో ఎంపీఇవోలను వినియోగించుకుంటాం. రైతులకు సేవలు యథావిధిగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. – పీఎల్ వరలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి, కర్నూలు 2014నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ హయాంలో రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అవే కష్టాలు ఎదురవుతున్నాయి. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందడం లేదు. కల్తీ విత్తనాలు విజృంభిస్తున్నాయి. గతేడాది డిసెంబర్ నెలలో నకిలీ కంది విత్తనాలతో నష్టపోయిన రైతులు పత్తికొండలో ఆందోళన చేపట్టారు. అలాగే గతేడాది ఖరీఫ్ సీజన్లో జూపాడుబంగ్లా, గడివేముల, మిడుతూరు మండలాల్లోని రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారు. పురుగుమందులు, ఇతరత్రా సేవలు పొందడానికి పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబందించిన సేవలను పొందడానికి కియోస్క్లను వినియోగిస్తారు. అయితే ఇవి నిరుపయోగంగా మారాయి. రైతుల నుంచి పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేసే ఆర్బీకేలు అసలు లేవు. పంటలు పండకపోయినా రైతులను పలకరించే వారు కరువయ్యారు. -
సమయం లేదు మిత్రమా!
● రిజిస్ట్రేషన్లలో టైమ్ స్లాట్ ● బుక్ చేసుకున్న స్లాట్ సమయానికి వెళ్లకపోతే అంతే సంగతులు ● అదనంగా రూ.200 చెల్లించి మరోస్లాట్ బుక్ చేసుకోవాలి ● ఇబ్బంది పడుతున్న క్రయ, విక్రయదారులుకర్నూలు(సెంట్రల్): స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైమ్ స్లాట్ విధానంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో రోజులో ఎన్ని డాక్యుమెంట్లు అయినా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఒకనొక సమయంలో సిబ్బంది రాత్రిళ్లు ఉండి నూరు డాక్యుమెంట్లకుపైగా రిజిస్ట్రేషన్లను జరిపే వారు. నూతన విధానంతో ఎస్ఆర్ఓల్లో (సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో) రోజుకు కేవలం 39, ఆర్ఓ కార్యాలయంలో 78 స్లాట్లే బుకింగ్ అవుతున్నాయి. దీంతో ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి దూర ప్రాంతాల నుంచి రిజిస్ట్రేషన్ పని మీద వచ్చిన వారు రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. అన్లిమిటెడ్ నుంచి లిమిటెడ్కు... ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఇందులో 22 ఎస్ఆర్ఓ, కర్నూలు, నంద్యాల ఆర్ఓ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, కల్లూరు, ఎమ్మిగనూరు, కోడుమూరు తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలాయల్లో రోజులో ఎన్ని డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లైనా జరిగేవి. ఒకనొక రోజులో 100కు పైగా డాక్యుమెంట్లు జరిగేవి. డాక్యుమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్ కార్యాలయ సిబ్బంది అర్ధరాత్రి వరకు పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తెచ్చిన టైం స్లాట్తో అనేక అవస్థలు ఉన్నాయి. వాటిని సరిచేయకపోతే క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడాల్సిందే. డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ సంఖ్య టైమ్ స్లాట్తో బాగా తగ్గిపోతోంది. గతంలో అన్లిమిటెడ్గా జరిగే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నూతన విధానంలో లిమిటెడ్గా మారిపోయింది. ఇప్పుడు రోజులో సబ్ రిజిస్ట్ట్రార్ కార్యాలయం(ఎస్ఆర్ఓ)లో అయితే కేవలం 39, ఆర్ఓ కార్యాలాయల్లో అయితే 78 డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి టైమ్ స్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి ఇబ్బందిగా మారింది. వారు మరుసటి రోజు ఉండే టైం స్లాట్లను బుక్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ రోజు కూడా ఆన్లైన్ సైట్ పనిచేయకపోతే వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. రెండో సారి స్లాట్బుక్ చేసుకుంటే రూ.200 వసూలు ఒకసారి రిజిస్ట్రేషన్ కోసం టైం స్లాట్ను బుక్ చేసుకుంటే కచ్చితంగా అదే సమయానికి వెళ్లాల్సి ఉంటుంది. వారికి ఇచ్చిన 10 నిమిషాల సమయంలో వెళ్లకపోతే ఆ స్లాట్ ముగిసిపోతుంది. వారు మళ్లీ స్లాట్ను బుక్ చేసుకోవాలంటే అదనంగా రెండో సారి అయితే రూ.200, మూడోసారి అయితే రూ.500 చెల్లించాలనే నిబంధనలు ఉన్నాయి. ఫలితంగా విక్రయదారులపై మరింత ఆర్థిక భారం పడుతుంది. ఇప్పటికే పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు, డాక్యుమెంట్ రైటర్ల ఫీజు, చలానాల మొత్తాలతో వినియోగదారులపై తీవ్ర రుణ భారం పడుతోంది. గతంలో ఎప్పుడైనా అందుబాటులో టైం స్లాట్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో టైం స్లాట్ విధానం 2020 నుంచే వినియోగదారులకు అందుబాటులో ఉంది. గత ప్రభుత్వ హయాంలో క్రయ, విక్రయదారులే తమ డాక్యుమెంట్ను తయారు చేసుకొని వారికి అనువైన సమయంలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లేలో పీడీఈ(పబ్లిక్ డేటా ఎంట్రీ) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతనంగా టైం స్లాట్ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఎప్పుడైనా టైం స్లాట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా..ప్రస్తుతం వాటిని కుదించారు. దీంతో క్రయ, విక్రయదారులు ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందిగా ఉంది టైమ్స్లాట్ విధానంలో అనేక లోపాలు ఉన్నాయి. వాటిని సరిచేయడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. గతంలోనూ స్లాట్లు అన్లిమిటెడ్గా బుక్ చేసుకునేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం లిమిటెడ్ చేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చి వారికి ఇబ్బంది మారింది. ప్రభుత్వం పునరాలోచనచేయాల్సిన అవసరం ఉంది. – చంద్రశేఖర్, డాక్యుమెంట్ రైటర్ -
హంస వాహనంపై దివ్య తేజం
ఆళ్లగడ్డ: నృసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉదయం హంస వాహనం, రాత్రి సూర్య ప్రభ వాహనాలను అధిరోహించి భక్తులను కటాక్షించారు. ఎగువ అహోబిలం క్షేత్రంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జయంతి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం మూలమూర్తులు స్వామి అమ్మవారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వాములను యాగశాలలో కొలువుంచి అర్చన, అభిషేకం, తిరుమంజనం నిర్వహించారు. అనంతరం పట్టు పీతాంబారలతో అలంకరించి కొలువుంచారు. నారసింహ స్వామిని విశేషంగా అలంకరించిన హంస వాహనంపై కొలువుంచి మాడ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. రాత్రి సూర్యప్రభ వాహనం అధిరోహించి మాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులను కటాక్షించారు. ఘనంగా సూర్య ప్రభ వాహనోత్సవం అహోబిలంలో వైభవంగా నారసింహ జయంతి బ్రహ్మోత్సవాలు -
‘పది’ సంతోషం.. దారిలోనే మాయం!
గోనెగండ్ల: పదో తరగతి పాసైన సంతోషంలో శ్రీశైలానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో విద్యార్థి మృత్యువాతపడ్డాడు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, విద్యార్థి కురువ కుమార్ చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. వివరాలివీ.. ఎర్రబాడు గ్రామానికి చెందిన సునిల్కు భార్య సునిత, ఇద్దరు కుమారులు సంతానం. సునిల్కు బొలెరో వాహనం ఉంది. భార్య గ్రామంలో కూలీ పనులు చేస్తోంది. పెద్ద కుమారుడు కుమార్ సున్నిపెంటలోని గురుకుల పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశాడు. చిన్న కుమారుడు గ్రామంలోనే ఎనిమిదవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో కుమార్ 514 మార్కులు సాధించాడు. ఎర్రబాడు గ్రామానికి చెందిన చంద్రమ్మకు ఆదోనికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఈ నేపథ్యంలో సునీల్ బొలెరో వాహనాన్ని ఆదోని చెందిన వారు శ్రీశైలానికి వెళ్లేందుకు బడుగకు మాట్లాడుకున్నారు. తన కుమారుడు కూడా పదిలో మంచి మార్కులు సాధించడంతో కుమార్ను కూడా తండ్రి సునీల్ తన వెంట తీసుకెళ్లాడు. శ్రీశైలంలో స్వామి అమ్మవార్లను దర్శించుకొని శుక్రవారం తిరిగి ఆదోనికి పయనమయ్యారు. మార్గమధ్యంలో ఆత్మకూరు మండలం సిద్దాపురం చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోగా బొలెరో టైరు జారింది. వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీకొట్టింది. ప్రయాణికులంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన కుమార్ కోలుకోలేక శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన కుమారుడు కళ్ల ముందే చనిపోవడంతో తల్లిదండ్రుల రోదన మిన్నంటింది. శనివారం ఉదయం ఎర్రబాడు గ్రామంలో కుమార్ అంత్యక్రియలు నిర్వహించారు. బొలెరో బోల్తా ఘటనలో ఐదుకు చేరిన మృతులు ఎర్రబాడు గ్రామంలో అలుముకున్న విషాదం -
షెడ్యూలింగ్ ఉంటేనే జొన్నల కొనుగోలు
● జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ నంద్యాల(అర్బన్): రైతు సేవా కేంద్ర పరిధిలో వ్యవసాయ సిబ్బందితో షెడ్యూలింగ్ చేస్తేనే జొన్నలు కొనుగోలు చేయాలని, లేదంటే వద్దని అధికారులకు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సూచించారు. షెడ్యూల్ లేకుండా రైతులు జొన్నలను అన్లోడింగ్ గోడౌన్కి తీసుకొని వచ్చి రెండు మూడు రోజులు నిరీక్షించవద్దని సూచించారు. కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో శనివారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. మద్దతు ధరతో జిల్లాలో 30 వేల టన్నుల జొన్నల కొనుగోలుకు అనుమతి ఉందన్నారు. ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల జొన్నలు కొనుగోలు చేశారని, ఇంకా 25 వేల టన్నులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. 5 వరకు ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు నంద్యాల(న్యూటౌన్):ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఈనెల 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని డీఐఈఓ సునీత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆయా కళాశాలల్లోనే విద్యార్థులు ఫీజులు చెల్లించాలని పేర్కొన్నారు. పవన్ వ్యాఖ్యలపై ముస్లింల ఆగ్రహం ● నేడు కర్నూలులో ధర్నా కర్నూలు(సెంట్రల్): ‘ముస్లమాన్లందరూ టెర్రరిస్టులే’ అన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల చరిత్ర తెలియక లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఆయనకు భావ్యం కాదన్నారు. డిప్యూటీ సీఎం మాట లను నిరసిస్తూ ఆదివారం ఉదయం 10 గంటలకు కర్నూలులోని జమ్మిచెట్టు దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు ముస్లిం సంఘాల జేఏసీ నాయకుడు ఎస్ఎండీ షరీఫ్ తెలిపారు. ఎంపీహెచ్ఏల కౌన్సెలింగ్ వాయిదా కర్నూలు(హాస్పిటల్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్(మేల్)ల కౌన్సెలింగ్ వాయిదా పడింది. శనివారం నిర్వహించాల్సిన రీ డిప్లాయ్మెంట్ కౌన్సెలింగ్లో పలువురు హెల్త్ అసిస్టెంట్లు కొన్ని సందేహాలను లేవనెత్తారు. అన్ని జిల్లాల్లో ఉమ్మడి జిల్లాగా జాబితాను వేసి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, ఇక్కడ మాత్రమే కేవలం కర్నూలు జిల్లా జాబితాను తయారు చేశారని చెప్పారు. దీంతో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ వివరణ తీసుకుని డీఎంహెచ్వో డాక్టర్ పి.శాంతికళ కౌన్సెలింగ్ను వాయిదా వేశారు. ముగ్గురికి జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కర్నూలు(అర్బన్): జిల్లాలోని వివిధ జెడ్పీ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు రికార్డు/లైబ్రరీ/ ల్యాబ్ అసిస్టెంట్లకు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి లభించింది. వీరిని మండల పరిషత్ కార్యాలయాలు, పాఠశాలలకు కేటాంచినట్లు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి తెలిపారు. ఎన్.కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్లో రికార్డు అసిస్టెంట్గా పనిచేస్తున్న ఎస్.వీరశేఖర్రాజును జెడ్పీహెచ్ఎస్ బలపనూరుకు, దేవనకొండ నుంచి ఎం.అన్వర్సాదత్ను జూపాడుబంగ్లా ఎంపీపీ కార్యాలయానికి, బనగానపల్లె నుంచి ఎస్.జాకీర్హుసేన్ను ఎంపీపీ కోవెలకుంట్లకు పదోన్నతిపై బదిలీ చేసినట్లు సీఈఓ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్రమ కుళాయి కనెక్షన్ తొలగింపు ఆలూరు: మొలగవెల్లి గ్రామంలో దేవాలయ నీటిని టీడీపీ నాయకుడు ఇంటికి తరలిస్తుండగా అధికారులు స్పందించారు. మంచినీటి కుళాయి కనెక్షన్ను శనివారం తొలగించారు. భక్తులకు ఇచ్చే నీటిని అక్రమ కనెక్షన్తో టీడీపీ నాయకుడు తన ఇంటికి తరలిస్తున్నాడు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా, డివిజనల్ పంచాయతీ అధికారులు స్పందించారు. వెంటనే కుళాయి కనెక్షన్ తొలగించాలని పంచాయతీ కార్యదర్శి వెంకటనాయుడిని ఆదేశించారు. పంచాయతీ సిబ్బంది రామాంజనేయులుతో కలసి కుళాయి కనెక్షన్ తొలగించారు. -
రైతుల కష్టం నేలపాలు!
నంద్యాల(అర్బన్): జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం ఉదయం వరకు ఓ మోస్తరు వర్షంతో పాటు గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ స్తంభాలు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. జిల్లాలోని దొర్నిపాడు, బేతంచెర్ల మండలాల్లో వరి ధాన్యం తడిసిపోయింది. అంతే కాకుండా పెనుగాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిసి పడ్డాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టోపోవాల్సి వచ్చింది. నంద్యాల, డోన్, ప్యాపిలి, మహానంది, బండిఆత్మకూరు తదితర మండలాల్లో దాదాపు వందలాది ఎకరాల్లో అరటి చెట్లు నేలకొరిగాయి. దొర్నిపాడు, ఆళ్లగడ్డ, శిరివెళ్ల, చాగలమర్రి తదితర మండలాల్లో బొప్పాయి, కర్బుజా పంటలకు నష్టం వచ్చింది. జిల్లాలో దాదాపు రూ.50లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. -
‘పది’ విద్యార్థులకు అభినందన
నంద్యాల(న్యూటౌన్): పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజకుమారి అభినందించారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో శనివారం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో రాయలసీమ జోన్లో నంద్యాల జిల్లాను మొదటి స్థానంలో నిలిచిందన్నారు. జిల్లాలో ఇంకా 19 శాతం విద్యార్థులు 10వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయారని, సప్లిమెంటరీలో వారు పాస్ అయ్యే విధంగా చేయాలని ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఈఓ జనార్దన్ రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చింతామణి, డీసీఓ శ్రీదేవి పాల్గొన్నారు. భూసార పరీక్షలకు మట్టి నమూనాల సేకరణ కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో 2025–26 సంవత్సరానికి 25,942 భూసార పరీక్షలు నిర్వహించేందుకు వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించి మట్టి నమూనాల సేకరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి శనివారం కర్నూలు, వెల్దుర్తి మండలాల్లో మట్టి నమూనాలు ఏ విధంగా సేకరించాలనే విషయమై అవగాహన కల్పించారు. ప్రతి రైతుభరోసా కేంద్రం నుంచి 55 మట్టి నమూనాలు సేకరించే విధంగా లక్ష్యాలను కేటాయించారు. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులోని భూసార పరీక్ష కేంద్రంలో 12931, ఎమ్మిగనూరు భూసార పరీక్ష కేంద్రంలో 13,011 మట్టి నమూనాలను పరీక్షిస్తారు. మొత్తం 13 మండలాలకు చెందిన మట్టి నమూనాలను కర్నూలులో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. మిగిలిన అన్ని మండలాలకు చెందిన మట్టి నమూనాలను ఎమ్మిగనూరులో పరీక్షిస్తారు. ● కాగా నంద్యాల జిల్లాలో 22,880 భూసార పరీక్షలు నిర్వహిస్తారు. ఈ సారి నంద్యాల జిల్లా మట్టి నమూనాలను నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డులోని ల్యాబ్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారు. -
నేడు ఆఫ్లైన్లో నీట్ పరీక్ష
కర్నూలు(సిటీ): వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి ఎన్టీఏ ఆదివారం నిర్వహించనున్న జాతీయస్థాయి అర్హత ప్రవేశ పరీక్ష(నీట్)కు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 4,466 మంది, నంద్యాల జిల్లాలో 1,172 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. విద్యార్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేందుకు సమయానికి బస్సులు, ప్రతి కేంద్రంలో దివ్యాంగుల కోసం వీల్చైర్లు ఏర్పాటు చేశారు. కర్నూలు నగర శివారులోని ట్రిపుల్ఐటీడీఎంలో ఏర్పాటు చేసిన కేంద్రానికి ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎన్టీఏ నిబంధనల మేరకు ప్రతి ఒక్క విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉండటంతో విద్యార్థులు కనీసం రెండు గంటల ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించబోమని పరీక్ష నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ప్రకటించింది. వస్త్రధారణపై ఆంక్షలు ● నీట్కు హాజరయ్యే విద్యార్థుల వస్త్రధారణపై ఎన్టీఏ కఠినమైన ఆంక్షలు విధించింది. విద్యార్థినులు జీన్స్ ప్యాంట్లు వంటి వస్త్రాలను ధరించకూండా, సాధారణ దుస్తుల్లోనే రావాల్సి ఉంటుంది. తలకు టోపీ, కళ్లకు బ్లాక్ సన్గ్లాసెస్ ధరించకూడదు. విద్యార్థినులు ముక్కుపుడక సహా చెవులకు దిద్దులు, చేతులకు గాజులతో పాటు ఎలాంటి ఆభరణాలను ధరించరాదు. ● చేతికి స్మార్ట్, సాధారణ వాచీలను సైతం ధరించరాదు. సమయాన్ని తెలుసుకునేందుకు వీలుగా పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో గడియారాలను ఏర్పాటు చేశారు. ● బ్లూటూత్ వాచీలు, సెల్ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు, పెన్నులు సహా ఇతర ఎలాంటి వస్తువులను విద్యార్థులు తమ వెంట తీసుకురాకూడదు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి నాలుగు బస్సులు జగన్నాథగట్టులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు కర్నూలు కొత్త బస్టాండ్ నుంచి నాలుగు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులు ఉదయం 10.30, 11.15, 11.45, 12.15 గంటల సమయంలో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ● ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా నంద్యాల(న్యూటౌన్): ‘నీట్’ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ అదిరాజ్సింగ్ రాణా తెలిపారు. నీట్ కేంద్రాలు ఏర్పాటు చేసిన నంద్యాల ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ ప్రభుత్వ కశాళాలలను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్ కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించేది లేదన్నారు. విద్యార్థులు ఆధార్, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు గుర్తింపు పొందిన ఫొటో తప్పనిసరిగా తెచ్చుకోవాలని సూచించారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ, పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాప్రసాద్, సీఐ కంబగిరి రాముడు, సూర్యమౌళి పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలు -
4న మహానందిలో వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు
మహానంది: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో ఈ నెల 4వ తేదీన వైశాఖ శుద్ధ సప్తమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ వేదపండితుడు రవిశంకర అవధాని, ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ సప్తమి రోజున గంగాదేవి స్వయంగా మహానంది రుద్రగుండం కోనేరులో స్నానమాచరించి భక్తుల పాపాలను పోగొడుతుందన్నారు. ఆ రోజు స్నానం చేయడం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే గంగానది పుష్కరస్నానంతో సమానమన్నారు. వేడుకల్లో భాగంగా గంగాదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని చెప్పారు. ఐటీఐలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ(ఐటీఐ)లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.రవీంద్రబాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు సంవత్సరాల ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్ కోర్సులు, ఒక సంవత్సరం మెకానికల్ డీజిల్, వెల్డర్ కోర్సులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నెల 24లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు 9703395091, 9440748448, 08524–286055లను సంప్రదించాలన్నారు. నేటి నుంచి మహానందీశ్వరుడి నిరంతర దర్శనం మహానంది: వేసవి సెలవుల దృష్ట్యా మహానంది ఆలయంలో నేటి నుంచి జూన్ 15 వరకు నిరంతర దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ సూపరింటెండెంట్ అంబటి శశిధర్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శనివారం నుంచి భక్తులకు అసౌకర్యం కలుగకుండా నిరంతరంగా మహానందీశ్వరుడి దర్శనం కల్పిస్తున్నట్లు ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ప్రస్తుతం ఉదయం నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు దర్శనం కొనసాగుతోందన్నారు. తాజా నిర్ణయంతో జూన్ 15 వరకు ఎలాంటి విరామం లేకుండా నిరంతరాయంగా దర్శన భాగ్యం లభిస్తుందన్నారు. శ్రీశైలంలో భారీ వర్షం శ్రీశైలం టెంపుల్: శ్రీశైలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి భారీ ఈదురు గాలులు వీచాయి. అనంతరం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. భారీ వర్షానికి శ్రీశైలం రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం ధాటికి పలువురు భక్తులు వసతి గృహాలకే పరిమితమయ్యారు. ఈదురు గాలులకు క్షేత్ర పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హుండీ ఆదాయం రూ.1.14 కోట్లు కౌతాళం: ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. మొత్తం 56 రోజులకు భక్తులు నగదు రూపంలో రూ.1,14,68,836 సమర్పించినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు, హుండీ పర్యవేక్షణ అధికారి వెంకటేశ్ తెలిపారు. -
టీడీపీ నాయకుడి ఇంటికి ఆలయ నీరు!
ఆలూరు: దేవస్థానంలో భక్తులకు అందాల్సిన నీరు టీడీపీ నాయకుడి ఇంటికి నేరుగా వెళ్తోంది. ఇందుకు అక్రమంగా పైప్లైన్ వేసుకున్నారు. అధికారుల అనుమతి కూడా తీసుకోలేదు. ఆలూరు మండలంలోని మొలగవెల్లి గ్రామంలో కాశీవిశ్వేశ్వరస్వామి దేవాలయం ఉంది. ఆలయానికి వచ్చే భక్తులకు తాగునీటి వసతి కల్పించాలని పంచాయతీ అధికారులకు గ్రామపెద్దలు విన్నవించారు. ఇదే అదునుగా భావించిన గ్రామ టీడీపీ నాయకుడు దేవాలయంలో భక్తుల తాగు నీటికోసం ఇచ్చిన మంచినీటి పైపులకు అదనంగా వాల్ను బిగించుకున్నారు. ప్లాస్టిక్ పైపులైన్ వేసుకుని తన ఇంటికి దేవాలయ నీటిని తరలించుకుంటున్నారు. ఈ నీటితో తన వాహనాలను శుభ్రం చేస్తున్నారు. టీడీపీ నాయకుడి దౌర్జన్యాన్ని చూసి గ్రామ ప్రజలు ఇదేమి చోద్యం అని చర్చించుకుంటున్నారు. అంతటితో ఆగకుండా పంచాయతీ అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పీఎస్ వెంకటనాయుడి దృష్టికి తీసుకెళ్లగా.. అక్రమ మంచినీటి కుళాయి కనెక్షన్ను తీసుకున్న విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
భూ వివాదాలతోనే లక్ష్మినారాయణ హత్య
ఆలూరు రూరల్: కాంగ్రెస్ నేత, ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు లక్ష్మినారాయణ హత్యకు భూ వివాదాలు, పంచాయతీలే కారణమని అడిషనల్ ఎస్పీ హుసేన్ పీరా తెలిపారు. ఆలూరులోని పోలీసు సర్కిల్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. లక్ష్మినారాయణ హత్య కేసులో 14 మందిపై కేసు నమోదు చేశామన్నారు. అయితే పది మందిని నిందితులుగా గుర్తించామన్నారు. లక్ష్మినారాయణ కుమారుడు వినోద్ ఫిర్యాదు చేసినట్లు వైకుంఠం ప్రసాద్, వైకుంఠం మల్లికార్జున, మల్లేష్, చికెన్ రామాంజిలపై కేసు దర్యాప్తులో ఉందని, వీరి పాత్ర ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణానికి చెందిన ప్రధాన నిందితులైన పూనుగొండ్ల రాజేష్, బేపర్ గౌసియా, కత్రిమల సౌభాగ్యలను పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డితో కలిసి శుక్రవారం హైవే 167లోని నక్కనదొడ్డి గ్రామం వద్ద అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇదే కేసులో ముద్దాయిలుగా ఉన్న పెద్దన్న, బోయ మేకల శ్రీనివాసులు, బోయ గోవిందు, బోయ రాము, వడ్డే నవీన్, ధర్మ, మనోహర్లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. హత్యకు కారణమైన వివాదాలు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆలూరు రోడ్డులో ఉన్న 1.10 ఎకరాల ఇంటి స్థలాల భూమి, సిద్ధార్థ కాలనీలోని 9 ఎకరాల దేవదాయ భూమి పంచాయతీ విషయంలో గుంకతల్లుకు చెందిన గౌసియా, రాజేష్లతో లక్ష్మినారాయణకు వివాదం నడుస్తోంది. ఈ భూమిలోని 4 ఎకరాల్లో లక్ష్మినారాయణ ప్లాట్లు వేసి విక్రయించాడు. గుంతకల్లు మండలం కొనకొండ్ల చెందిన ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం విషయంలోనూ ఆయన పంచాయతీ చేసినట్లు తెలిసింది. అలాగే పెద్దన్నకు చెందిన 8 ఎకరాల భూమికి ఏడేళ్ల క్రితం లక్ష్మినారాయణ తన అత్త పేరిట నకిలీ పాసు పుస్తకాలు సృష్టించాడు. ఈ భూమి వివాదం కోర్టులో ఉంది. ఈ విషయంలో వివాదంతో పాటు పెద్దన్నపై లక్ష్మినారాయణ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించారు. అదేవిధంగా నాలుగు నెలల క్రితం పెద్దన్న, రాజేష్, గౌసియాలను లక్ష్మినారాయణ బహిరంగంగా దూషించడంతో వారంతా ఆయనను అంతమొందించాలని నిర్ణయించుకున్నారు. పథకం ప్రకారమే హత్య ● రెండు నెలల క్రితం హిందూపురంలో టిప్పర్ కొనుగోలు చేశారు. ● గత నెల 27న ఉదయం పెద్దయ్య ఇంటి వద్ద సమావేశమయ్యారు. ● అదే రోజు మధ్యాహ్నం లక్ష్మినారాయణ గుంతకల్లు నుంచి తన స్వగ్రామమైన చిప్పగిరికి ఇన్నోవా కారులో బయలుదేరాడు. ● రాజేష్ అతన్ని మరో కారులో అనుసరించి టిప్పర్ డ్రైవర్ మేకల శ్రీనివాసులు, మరో వ్యక్తి ధర్మన్నకు సమాచారం ఇస్తూ వచ్చాడు. ● మరో నిందితుడు రాము మార్గమధ్యంలో ఉండి టిప్పర్ డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. ● లక్ష్మినారాయణ కారు గుంతకల్లు సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్దకు రాగానే డ్రైవర్ శ్రీనివాసులు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టాడు. ● పక్కనే వేచి ఉన్న పెద్దన్న కొడవలితో లక్ష్మినారాయణ తలపై నరికాడు. ● మరో వ్యక్తి వడ్డే నవీన్ వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో ఆయన తలపై కొట్టాడు. ● మిగిలిన నిందితులు రహదారిలో ఎవరూ రాకుండా జాగ్రత్త వహించారు. ● లక్ష్మినారాయణపై దాడి అనంతరం అందరూ కలిసి పరారయ్యారని ఏఎస్పీ హుసేన్ పీరా విలేకరులకు వెల్లడించారు. ● విలేకరుల సమావేశంలో పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య, ఆలూరు సీఐ రవి శంకర్ రెడ్డి, హొళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్, ఆలూరు ఎస్ఐ మహబూబ్ బాషా, చిప్పగిరి ఎస్ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
రమణీయం.. స్వర్ణ రథోత్సవం
శ్రీశైలంటెంపుల్: ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీశైల మహాక్షేత్రంలో శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు స్వర్ణరథోత్సవం నిర్వహించారు. వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం చేశారు. లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకులు సంకల్పాన్ని పఠించారు. అనంతరం రథారూఢులైన శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషపూజలు జరిపించారు. ఉదయం 7.30గంటలకు స్వర్థరథోత్సవం ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం ముందుభాగం గంగాధర మండపం నుంచి నందిమండపం వరకు రథోత్సవాన్ని జరిపించారు. రథోత్సవంలో కోలాటం, చెక్కభజన మొదలైన జానపద కళారూపాలు అలరించాయి. శ్రీశైల దేవస్థాన డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రమణమ్మ, సహాయ కమిషనర్ ఇ.చంద్రశేఖరరెడ్డి, పలు విభాగాల అధికారులు, భక్తులు పాల్గొన్నారు. -
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పడిన కరువు పరిస్థితులు ‘క్షీర’ క్షోభానికి దారితీశాయి. వేసవి కాలం పాల ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. శిశువులు ఏడుస్తున్నా సీసాలో నింపి కాసిన్ని పాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇంట్లో ఉన్న వృద్ధులకు సైతం పాలు వేడి చేసి ఇవ్వడం కష
పాల ఉత్పత్తి తగ్గింది మాకు 14 ముర్రా గేదెలు ఉన్నాయి. అన్నీ పాలు ఇస్తాయి. డిసెంబరులో రోజుకు 90 నుంచి 100 లీటర్ల వరకు పాలు ఉత్పత్తి అయ్యేవి. ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. రోజుకు 50 నుంచి 55 లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. దాణా ఖర్చులు పెరిగాయి. వేసవిలో పచ్చిమేత తగినంత లేదు. నీటి సమస్య, ఎండల తీవ్రతతో పాల ఉత్పత్తి బాగా తగ్గింది. వర్షాలు కురిసి పచ్చి మేత అందుబాటులోకి వస్తే ఆగష్టు నుంచి పాల ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది. – వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్, మల్లెపల్లి, వెల్దుర్తి మండలం త్వరలో దాణామృతం ఇస్తాం వేసవిలో పాల ఉత్పత్తి 20 నుంచి 30 శాతం వరకు తగ్గుతుంది. వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఒక్కో జిల్లాకు 250 టన్నుల సమీకృత దాణాను ప్రభుత్వం కేటాయించింది. త్వరలోనే పాడి రైతులకు సరఫరా చేస్తాం. పశుగ్రాసాల సాగుకు గడ్డి విత్తనాలను కూడా సబ్సిడీపై ఇస్తాం. వేసవిలో పశువుల కోసం ఉపాధి నిధులతో గ్రామాల్లో నీటితొట్లు కూడా ఏర్పాటు చేయనున్నాం. – డాక్టర్ జి.శ్రీనివాస్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి ఉమ్మడి జిల్లాలో ‘క్షీర’ క్షోభం ● వేసవిలో తగ్గిపోయిన పాల ఉత్పత్తి ● రోజుకు 13 లక్షల లీటర్లు అవసరం ● లభించేది 5 లక్షల లీటర్లు మాత్రమే ● ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి దిగుమతి కర్నూలు(అగ్రికల్చర్): అసలే వేసవి కాలం.. ఒక వైపు పచ్చిమేత కొరత.. మరోవైపు నీటి సమస్య.. దీంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు. ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అంటూ హడావుడి చేసినప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్ పాలు తీసుకోవాల్సి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. వీరి ప్రతి రోజూ 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో అన్ని పాలు అందుబాటులో లేవు. నీరు లేదు.. పచ్చిమేత కరువు ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2,55,747 పశువులు ఉన్నాయి. వీటిలో 1,61,228 ఆవులు, గేదెల నుంచి మాత్రమే పాల దిగుబడి ఉంది. మిగిలినవి చూలు(ప్రెగ్నెంట్)తో, గొడ్డుబోతు పశువులుగా ఉన్నాయి. ఆగస్టు నుంచి జనవరి వరకు పచ్చిమేత నీరు పుష్కలంగా ఉండటంతో 10 లక్షల పాలు ఉత్పత్తి అయ్యేవి. కరువు పరిస్థితుల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫిబ్రవరి నుంచి పాల ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం పశువులకు పచ్చి మేత లేదు.. నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. దీంతో వేసవిలో పాల దిగుబడి 50 శాతానికి పైగా పడిపోయింది. కేవలం 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాలపొడికి డిమాండ్ డెయిరీల్లో వెన్న పూర్తి తీసి పాలపొడి తయారు చేస్తారు. పాల కొరత ఉన్నసమయంలో పాల పొడిని ఉపయోగించి పాలు తయారు చేస్తారు. పాలపొడితో టోన్డ్ మిల్క్ తయారు అవుతాయి. టోన్డ్ మిల్క్లో వెన్న 3 శాతం ఉంటుంది. గేదె పాలల్లో వెన్న 6.50 శాతం నుంచి 8 శాతం ఉంటుంది. ఆరు శాతంపైన ఉన్న వెన్నను తీసి 6 శాతం వెన్నతో గోల్డ్ మిల్క్ తయారు చేస్తారు. పాల పొడిపాలల్లో వెన్న ఉండదు. 50 శాతం పాలపొడి పాలు, మరో 50 శాతం 6 శాతం వెన్న ఉన్న పాలు కలిపితే మొత్తంగా పాలల్లో వెన్న మూడు శాతం ఉన్నట్లు అవుతోంది. వీటితో టోన్డ్ మిల్క్ ప్యాకెట్లు తయారు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్న టోన్డ్మిల్క్ పాలు పాలపొడితో తయారు చేసినవేనని స్పష్టమవుతోంది. ఉత్తుత్తి హడావుడే వేసవిలో పాల ఉత్పత్తి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాణామృతం (టీఎంఆర్), సమీకృత దాణా వంటి వాటిని సరఫరా చేయాలి. అయితే దాణామృతం లేదు.. దాణా సరఫరా లేకుండా పోయింది. ‘ఉపాధి’ నిధులతో ఊరూర పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటు అంటూ హడావుడి చేసింది.. ఇంతవరకు కార్యరూపమే దాల్చలేదు. 10 సెంట్ల నుంచి 50 సెంట్ల వరకు భూమిలో ఉపాధి నిధులతో పశుగ్రాసక్షేత్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 600 ఎకరాల్లో పశుగ్రాస క్షేత్రాలు ఏర్పాటుకు అనుమతులు లభించాయి. కాని ఒక్క సెంటులో పశుగ్రాస క్షేత్రం ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. వేసవిలో పశువుల దాహర్తి తీర్చేందుకు ఉపాధి నిధులతో ఇదుగో నీటితొట్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఆచరణలో సాధ్యం కాలేదు. అక్కడక్కడ నీటితొట్లు నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపే వారు కరువయ్యారు. రైతుల చేతికి పంటలే చేతికి అందలేదు. దీంతో రైతులు పాడిగేదెలకు మేతను సర్దుబాటు చేయలేక కబేళాలకు తరలిస్తున్నారు. దిగుమతి ఇలా.. ఉత్పత్తి తగ్గిపోవడంతో డెయిరీ నిర్వాహకులు పక్క జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి పాలు దిగుమతి చేసుకుంటున్నారు. కొన్ని ప్రయివేటు డెయిరీలు మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మరికొన్ని డెయిరీలు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఆశ్రయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 లక్షల కుటుంబాలు ఉండగా... దాదాపు 40 శాతం కుటుంబాలు లూజు పాలు వినియోగిస్తున్నాయి. 60 శాతం కుటుంబాలు ప్యాకెట్ పాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. నేడు గ్రామాల్లో పశుసంపద తగ్గిపోయింది. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాలే వినియోగిస్తున్నారు. -
నంద్యాలలో నాలుగు ‘నీట్’ కేంద్రాలు
● జిల్లా కలెక్టర్ రాజకుమారి నంద్యాల న్యూటౌన్: మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈనెల 4వ తేదీన నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్టు (నీట్) కోసం నంద్యాలలో నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. జిల్లాలో ప్రథమంగా ‘నీట్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం చీఫ్ సూపరింటెండెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల, నంద్యాల బస్టాండ్ సమీపంలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్, టెక్కె జూనియర్ కళాశాల, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ‘నీట్’ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 1,172 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆఫ్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల తరువాత విద్యార్థులకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి లేదన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రతి పరీక్ష కేంద్రంలో రెండు వీల్ చైర్లను ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రాన్రిక్ పరికరాలను అనుమతించకూడదన్నారు. నంద్యాల పట్టణంలో విద్యార్థులకు ట్రాఫిక్తో సమస్య లేకుండా చూడాలన్నారు. ‘నీట్’పై పాటించాల్సిన నియమ నిబంధనలపై జిల్లా కోఆర్డినేటర్ సత్యనారాయణ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో చీఫ్ సూపరింటెండెంట్లకు వివరించారు. నీట్ పరీక్షల సిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
మరణించింది టైగర్ 123
నిర్ధారించిన అటవీశాఖ నాడు ఉచ్చుకు చిక్కి.. నేడు అర్ధంతరంగా మృతిచెందిన పెద్దపులి నంద్యాల జిల్లా, ఆత్మకూరు అటవీ డివిజన్ ముసలిమడుగు సెక్షన్లో ఇటీవల కుళ్లిపోయిన స్థితిలో కనిపించిన పెద్దపులిది తొలుత సహజ మరణమని అధికారులు భావించారు. అయితే పులి చర్మంపై ఉన్న చారల ఆధారంగా శ్రీశైలం బయో లాబ్లో పరిశీలించగా అది టి123(ఎఫ్)గా నిర్ధారించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నాలుగేళ్ల వయసున్న ఈ ఆడపులి గతేడాది వేటగాళ్ల ఉచ్చులోపడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న విషయం తెలిసిందే. - ఆత్మకూరు రూరల్టైగర్ 123కి ఏం జరిగిందంటే పూర్తి ఆరోగ్యంగా ఉన్న ఈ టి123 ఆడపులి హఠాత్తుగా మరణించడం వెనక ఏడాది క్రితం ఉచ్చుకు బిగుసుకుని తప్పించుకున్న ప్రభావమేనని భావిస్తున్నారు. అప్పట్లో ఉచ్చు నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఈ ఆడపులి నడుముకు ఉచ్చుకు సంబంధించిన ఇనుప తీగ ఉన్నట్టు ఇన్ఫ్రారెడ్ కెమెరాల్లో గుర్తించారు. దీంతో అప్రమత్తమైన అటవీ అధికారులు పులిని ట్రాంక్విలైజర్ గన్తో అపస్మారక స్థితిలోకి చేర్చి, ఆ తీగను తొలగించారు. వన్యప్రాణి వైద్యులు చికిత్స చేసి, పూర్తిగా నయమైన తర్వాత అడవిలో వదిలిపెట్టారు. అదే పులి సంవత్సరం తరువాత చనిపోవడం వెనుక నాటి ఉచ్చు గాయమే కారణమని తెలుస్తోంది. గాయం పైపైన నయమైనప్పటికీ అంతర్గత అవయవాలైన గర్భాశయం(గర్భ సంచి), కాలేయం వంటి వాటికి ఇన్ఫెక్షన్ సోకి అది క్రమేపి విస్తరించి పులి మరణానికి కారణమైనట్లు భావిస్తున్నారు.మరణాన్ని ముందే ఊహించే పులి పెద్దపులి జీవనశైలిలో ప్రత్యేకత ఏంటంటే... అది తన మరణాన్ని ముందే ఊహించడం. వృద్ధాప్యంలో వేటాడలేని స్థితిలో కొండ అంచుకు చేరుకుంటుంది. అక్కడ ఏ ఇతర జంతువులు గమనించలేని ప్రదేశంలో విశ్రమించి మరణం కోసం వేచి చూస్తూ... అలాగే మరణిస్తుంది. మరణించిన పులి కళేబరం ఎవరి కంటా పడకపోవడానికి కారణం అదే. ఈ కోవలోనే టి123 పులి కూడా తన చావు సమీపించే కొద్దీ ఒంటరి ప్రదేశానికి వెళ్లి తనువు చాలించినట్లుగా అనుమానిస్తున్నారు. అది ఎవరి కంటాపడని ప్రదేశం కాబట్టే చనిపోయిన 20 రోజులకు గానీ గుర్తించలేక పోయారని సమాచారం. -
రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
నంద్యాల: జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. -
మూగ వేదన.. అరణ్య రోదన!
ఆళ్లగడ్డ: మండే ఎండలతో ప్రజలే దాహంతో అల్లాడుతున్నారు. నల్లమల అడవిలో వన్యప్రాణులదీ ఇదే పరిస్థితి. అటవీ ప్రాంతంలో నీటి నిల్వలు తగ్గడంతో జనావాస ప్రాంతాలకు వస్తూ ప్రాణాలను కోల్పోతున్నాయి. వేసవిలో సాసర్ పిట్లు( నీటి తొట్టెలను) నింపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. నల్లమలలో జంతువులు ఇవీ.. దేశంలోనే అతి పెద్ద అభయారణ్యం నల్లమల. ఇక్కడ ఎన్నో రకాల వన్యప్రాణులు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో అటవీ భూభాగం 1.60 లక్షల హెక్టార్లలో ఉంది. గుండ్లబ్రహ్మేశ్వరం, బండిఆత్మకూరు, నంద్యాల, చెలమ, రుద్రవరం, ఆత్మకూరు, బైర్లూటి, నాగలూటి, శ్రీశైలం, వెలుగోడు అటవీ రేంజ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 65 బీట్లు, 44 సెక్షన్లు ఉన్నాయి. అడవిలో చిరుతలు, పెద్దపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే రేసు కుక్కలు, అడవి పిల్లులు, చుక్కల దుప్పులు, అడవి పందులు, కృష్ణ జింకలు, కుందేళ్లు, అడవి గొర్రెలు, నక్కలు కనిపిస్తాయి. బట్టమేక, అడవికోళ్లు, నెమళ్లతో పాటు వందలాది పక్షి జాతులకు నల్లమల ఆవాసం. వర్షాభావం వెంటాడటం, ఎండ తీవ్రత పెరగడంతో కుంటలు, వాగులు ఎండిపోయాయి. జలవనరుల్లో నీటి జాడ కనుమరుగైంది. అడవిలో చాలా చోట్ల తేమ సైతం ఆవిరైంది. ఇదే వన్యప్రాణుల పాలిట శాపమవుతోంది. సాసర్లు నింపరు! నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో వన్యప్రాణుల దాహం తీర్చేందుకు 450కి పైగా సాసర్ పిట్లు ఏర్పాటు చేశారు. ఏటా ఫిబ్రవరి నుంచి జూన్ వరకు 5 నెలలు నిరంతరం పర్యవేక్షిస్తూ సాసర్ పిట్లలో నీరు నింపాల్సి ఉంది. అయితే ఈ ఏడాది నిధుల కొరతతో చాలాకాలంగా నీరు నింపడంలేదన్నట్లు తెలుస్తోంది. కొందరు క్షేత్ర స్థాయి అధికారులు అడపాదడపా అక్కడక్కడా దాతల సాయంతో, సొంతంగా ఖర్చు చేసుకొని వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో దప్పిక తీరడంలేదు. అనేక చోట్ల సాసర్ పిట్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. చెత్తాచెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఇలా చేస్తే ఎంతో మేలు.. బండిఆత్మకూరు, చెలమ, రుద్రవరం రేంజ్ పరిధిలో సాసర్ పిట్లకు ప్రతి రోజూ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలి. కొన్ని ప్రాంతాల్లో చెలమలను తవ్వి మూగజీవాలకు నీటి సౌకర్యాన్ని అందించాలి. అదేవిధంగా చెక్ డ్యామ్స్ ఏర్పాటు చేసి వాటి వద్ద నీటి నిల్వలను ఉంచాలి. సాసర్ పిట్ల వద్దకు నీటి కోసం వచ్చిన జంతువుల కోసం ఉప్పు ముద్దలను ఏర్పాటు చేయాలి. మూగ జంతువులు ఉప్పు ముద్దను నాకడంతో వడదెబ్బ బారి నుంచి కాపాడుకునే అవకాశం ఉంది.నీటి కోసం వచ్చి.. ప్రాణాలు విడిచిఅడవిలో నీటి వనరులు ఎండిపోవడం, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాసర్ పిట్లలో నీరు నింపకపోవడంతో మూగ జీవాలు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఈ సమయంలో వాహనాలు ఢీకొని ప్రాణాలు వదులుతున్నాయి. అలాగే విద్యుదాఘాతానికి గురై, వేటగాళ్ల ఉచ్చులో చిక్కి మృత్యువాత పడుతున్నాయి.» ఈ మధ్య కాలంలో నీటికోసం వస్తున్న మూగజీవాలను వేటగాళ్లు నీటిలో విషపు గుళికలు వేసి చంపేస్తున్నారు. » రుద్రవరం, చెలమ అటవీ రేంజ్ల పరిధిలో వేటగాళ్లు పెట్రేగి పోతున్నారు. ఉచ్చులు వేసి వణ్యప్రాణులను వేటాడి వాటి మాంసాన్ని, శరీర భాగాలను విక్రయిస్తున్నారు. » ఇటీవల పెద్దకంబలూరు సమీపంలో వేటగాళ్లు వేసిన ఉచ్చులో చిక్కుకుని పెద్దపులి మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. » మూడు నెలల క్రితం అహోబిలం సమీపంలో కారుపై పెద్దపులి దాడి చేసింది. ఆ సమయంలో గాయాలై అడవిలోకి వెళ్లి పోయింది. » ఈ నెల 6వ తేదీ రుద్రవరంలో ఇద్దరు వ్యక్తులు వన్యప్రాణుల మాంసం విక్రయిస్తుండగా అట వీ అధికారులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. » 2019లో బాచిపల్లె తండా సమీపంలో పెద్దపులి కళేబరం కనిపించింది. అదే సంవత్స రం ఓ పెద్ద పులి మిట్టపల్లె సమీపంలోని ఎర్రచెరువు కాల్వలో మృతి చెంది కనిపించింది. » గండ్లేరు రిజర్వాయరులో వేర్వేరు సంఘటనల్లో రెండు చిరుత కళేబరాలు కనిపించాయి. » 2018లో బాచిపల్లె తండా, అహోబిలం మధ్యన రెండు ఎలుగుబంట్ల కళేబరాలు కనిపించాయి. » ఆళ్లగడ్డ సమీపంలో కృష్ణజింక వేటకు బలైంది. » రుద్రవరం సమీపంలో ఐదు నెమళ్లు వేటగాళ్ల ఉచ్చుకు బలయ్యాయి. » గాజులపల్లి – బొగద మధ్య రైలు పట్టాలపై రెండు చిరుత పులులు మృతి చెందాయి. చర్యలు తీసుకుంటాం సాసర్ పిట్లలో నీరు నింపుతున్నాం. ఎక్కడైనా నీరు లేదంటే సిబ్బంది చూడక పోవడమో, మరచిపోవడమో ఉంటుంది. వెంటనే నీటిని నింపేలా చర్యలు తీసుకుంటాం. – శ్రీపతి నాయుడు, రుద్రవరం అటవీ రేంజ్ అధికారి కుంటలు ఎండిపోయాయి అహోబిలం అటవీ పరిధిలో చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు నీటి కోసం పొలాల్లోకి, గ్రామాల్లోకి వస్తున్నాయి. అవి దాడి చేస్తాయోనని ప్రజలు భయపడుతున్నారు. – నాసారి వెంకటేశ్వర్లు, ఏకలవ్య ఎరుకలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అందరి బాధ్యత నల్లమల అభయారణ్యం రాయలసీమకు మాణిక్యం లాంటింది. అందులోని వన్యప్రాణులను కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉంది. సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి మూగజీవాల దాహార్తి తీర్చేందుకు ఏర్పాట్లు చేయాలి. – గజ్జల రాఘవేంద్రారెడ్డి, ఎంపీపీ -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ఆలూరు రూరల్: పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయని మనస్తాపానికి చెందిన పదో తరగతి విద్యార్థి సిద్ధార్థ్ (15) ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఆలూరులోని కొట్టాల వీధికి చెందిన శ్రీనివాసులు, దానమ్మ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. మూడో సంతానమైన సిద్ధార్థ్ (15) స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల–1 పదో తరగతి చదివారు. గత ఏప్రిల్ 23న వెలువడిన ఫలితాల్లో సిద్ధార్థ్ ఫెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెంది ఇంట్లో ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బంధువులు గమనించి ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. సిద్ధార్థ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు బళ్లారి ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేశారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ గురువారం కోలుకోలేక మృతి చెందాడు. సిద్ధార్ మృతికి ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. బాలికపై పందుల దాడి కల్లూరు: ఆటలు ఆడుకుంటున్న బాలికపై పందులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం మధ్యాహ్నం కల్లూరు అర్బన్ 32వ వార్డు పరిధిలోని పోలీస్ కాలనీలో చోటుచేసుకుంది. గురువారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కలవారు గమనించి పందులను తోలడంతో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు చిన్నారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. కాలనీలో పందుల బెడద ఎక్కువగా ఉందని, అధికారుల స్పందించి సమస్యను పరిష్కరించాలని కాలనీ వాసులు కోరుతున్నారు. బెల్లం ఊట ధ్వంసం ఆత్మకూరు: సిద్ధాపురం గ్రామానికి రెండు కి.మీ. దూరంలోని అటవీ ప్రాంతంలో నాటుసారా తయారీకి ఉపయోగించే 600 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సీఐ కిషోర్కుమార్ గురువారం తెలిపారు. పీటల రాంప్రసాద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా, విక్రయించినా అలాంటి వారిపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు. నాటుసారా తయారు చేసే వారి వివరాలను 9440902585, 9177299067, 8328307774కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. -
సార్.. మంచినీటిని సరఫరా చేయండి
● ఆరేళ్ల బాలుడి అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్ కోవెలకుంట్ల: పట్టణంలోని వివిధ కాలనీల్లో కుళాయిల ద్వారా ఉప్పునీరు సరఫరా అవుతోందని ఆరేళ్ల బాలుడు గురువారం లేఖ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన షాజిల్ హుస్సేన్ అనే బాలుడు ‘మాకు ఉప్పునీరు వద్దు.. కుందూనది నీరు సరఫరా చేయండి’ అనే సందేశాన్ని లేఖ ద్వారా ఇన్చార్జ్ ఈఓ ప్రకాష్నాయుడుకు తెలియజేశాడు. బాలుడు రాసిన లేఖ కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.