ఐఐటీ/నీట్‌ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష | - | Sakshi
Sakshi News home page

ఐఐటీ/నీట్‌ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష

May 21 2025 1:45 AM | Updated on May 21 2025 1:45 AM

ఐఐటీ/నీట్‌ అకాడమీ   ప్రవేశాలకు 25న పరీక్ష

ఐఐటీ/నీట్‌ అకాడమీ ప్రవేశాలకు 25న పరీక్ష

కర్నూలు(అర్బన్‌): 2025–26 విద్యా సంవత్సరా నికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఐఐటీ/నీట్‌ అకాడమీ ల్లో ప్రవేశానికి రెండవ దశ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఐ.శ్రీదేవి తెలిపారు. మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో 1:3 నిష్పత్తిలో ఎంపిక చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికై న అభ్యర్థులకు సమాచారం ఎస్‌ఎంఎస్‌ రూపంలో పంపించామన్నారు. చిన్నటేకూరు కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు తాజాగా డౌన్‌ లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్‌ లేదా పాత హాల్‌టికెట్‌ తో ఈ నెల 25న ఉదయం 11 గంటల్లోపు హాజరు కావాలన్నారు. పరీక్ష సమయం ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహిస్తామ న్నారు. సమాచారం కోసం http://apbragcet. apcfss.inను సందర్శించాలని డీసీఓ కోరారు.

గోరుకల్లు కట్ట పనులకు ప్రణాళిక రూపొందించండి

పాణ్యం: గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశంలో త్వరగా పనులు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించాలని ఎస్సార్బీసీ ఎస్‌ఈ పునర్ధనరెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన గోరుకల్లు కట్ట కుంగిన ప్రదేశాన్ని పరి శీలించి మాట్లాడారు. ఇటీవల ఎక్స్‌ఫర్ట్‌ కమిటీ సభ్యు లు గోరుకల్లును సందర్శించారని చెప్పారు. జలాశయంలో 3.5 టీఎంసీల నీరు ఉండడంతో పనులు చేసేందుకు వీలుపడదన్నారు. నీటి నిల్వను తగ్గించడంపై ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందన్నారు. రివిట్‌మెంట్‌ పనులు పూర్తి చేస్తేనే గోరు కల్లు రిజర్వాయర్‌లో వరదనీటిని నిల్వ చేసేందుకు వీలుంటుందన్నారు. కార్యక్రమంలో ఈఈ సుభకుమార్‌, డీఈఈలు జ్యోతి, గీతారాణి పాల్గొన్నారు.

మైనారిటీలకు సబ్సిడీ రుణాలు

దరఖాస్తుకు ఈ నెల 25 ఆఖరు

కర్నూలు(అర్బన్‌): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మైనారిటీ, క్రిష్టియన్‌ వర్గాల ప్రజలు సబ్సిడీ రుణాలకు ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోవాలని మైనారిటీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌.సబీహా పర్వీన్‌ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మైనారిటీ వర్గాలకు చెందిన వారికి రూ. లక్ష నుంచి రూ.8 లక్షల వరకు, క్రిస్టియన్‌ మైనారిటీలకు రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. దరఖాస్తు చేసుకొని ఎంపికై న వారికి 50 శాతం సబ్సిడీ మంజూ రవుతుందన్నారు. అర్హులు తమ వివరాలను ( https:// apobmms. apcfss.in) వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు ఈడీ, మైనారిటీ కార్పొరేషన్‌ కార్యాలయంలో, లేదా 9848864449, 9440822219ను సంప్రదించవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement