
సార్.. మంచినీటిని సరఫరా చేయండి
● ఆరేళ్ల బాలుడి అభ్యర్థన సోషల్ మీడియాలో వైరల్
కోవెలకుంట్ల: పట్టణంలోని వివిధ కాలనీల్లో కుళాయిల ద్వారా ఉప్పునీరు సరఫరా అవుతోందని ఆరేళ్ల బాలుడు గురువారం లేఖ ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. స్థానిక సాయినగర్ కాలనీకి చెందిన షాజిల్ హుస్సేన్ అనే బాలుడు ‘మాకు ఉప్పునీరు వద్దు.. కుందూనది నీరు సరఫరా చేయండి’ అనే సందేశాన్ని లేఖ ద్వారా ఇన్చార్జ్ ఈఓ ప్రకాష్నాయుడుకు తెలియజేశాడు. బాలుడు రాసిన లేఖ కోవెలకుంట్ల పట్టణంలోని స్థానిక వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.