breaking news
Telangana Local Body Elections 2025
-
ప్రమాణం చేయకుండానే సర్పంచ్ మృతి
న్యాల్కల్ (జహీరాబాద్): సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని మిర్జాపూర్ (ఎన్) గ్రామ సర్పంచ్గా ఎన్నికైన ఎర్రోళ్ల అక్కమ్మ బుధవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల నిర్వహించిన మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కమ్మ (58) కాంగ్రెస్ పార్టీ మద్దతుతో విజయం సాధించారు. అయితే ఆమె కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె పదవీ ప్రమాణం చేయలేకపోయారు. కాగా, పరిస్థితి విషమించడంతో బుధవారం రాత్రి ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మిర్జాపూర్ (ఎన్) గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అక్కమ్మ సర్పంచ్గా గెలిచారన్న సంతోషంలో ఉన్న ఆ కుటుంబం ఆమె మరణంతో విషాదంలో మునిగిపోయింది.ఓటేయలేదని బెదిరింపులు.. యువకుడి ఆత్మహత్యశంకర్పల్లి: ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని బెదిరించడంతో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగా రెడ్డి జిల్లా శంకర్పల్లిలో బుధవారం జరిగిన ఈ సంఘటనపై మోకిల సీఐ వీరబాబు, మృతుని తల్లి పద్మ తెలిపిన వివరాలివి. గోపులారం గ్రామానికి చెందిన వెంకటేశ్, పద్మలకు ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు అనిల్ (28).. దొంతాన్పల్లిలోని ఇక్ఫాయ్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆఫీస్ బాయ్గా పని చేస్తున్నాడు. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో చీర సాయికుమార్ అనే వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. తనకు మద్దతు తెల పలేదంటూ మంగళవారం రాత్రి అనుచరులతో కలిసి అనిల్ను బెదిరించా డు. దీంతో మనస్తాపానికి గురైన అనిల్ ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పా డు. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనిల్ బెదిరింపుల వల్లే తన కుమారుడు మృతి చెందాడని ఆరోపిస్తూ పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘ఒక్క ఓటుతో ఓడినా.. సర్పంచ్ నేనే’
నార్కట్పల్లి: మండల పరిధిలోని చిన్ననారాయణపురం గ్రామంలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ రోజు కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మెరుగు అనితకు, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనితకు సమాన ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు టాస్ వేసి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి జంగిలి అనిత గెలుపొందినట్లు ప్రకటించారు. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తిరిగి రీకౌంటింగ్ నిర్వహించగా.. కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి మెరుగు అనిత ఒక ఓటుతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిపై గెలిచినట్లు ధ్రువీకరణ చేశారు. అయితే సోమవారం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా గ్రామంలో ఒక్క ఓటుతో ఓడిపోయినా.. సర్పంచ్ నేనే అంటూ బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ఎంపీడీఓ ఉమేష్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గ్రామ పంచాయతీ సిబ్బందితో ఫ్లెక్సీలను తొలగించారు. కాగా గ్రామ పంచాయతీలో 8 వార్డులకు గాను ఐదు వార్డులు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందగా.. ముగ్గురు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. సోమవారం ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఉప సర్పంచ్, బీఆర్ఎస్ బలపర్చిన వార్డు సభ్యులు హాజరు కాలేదు. దీంతో కేవలం సర్పంచ్తోపాటు ముగ్గురు కాంగ్రెస్ వార్డు సభ్యులతో మాత్రమే ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. -
ప్రమాణ స్వీకారానికి ముందే అభివృద్ధి బాట..
నల్గొండ జిల్లా: రెండేళ్లుగా గుంతలమయంగా మారిన రోడ్డుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని గుర్తించిన ఎర్రబెల్లి గ్రామ నూతన సర్పంచ్ అయితగోని మధు, ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యకు పరిష్కారం చూపారు.ముషంపల్లి నుంచి ఎర్రబెల్లి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు అడ్డంకిగా మారింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎర్రబెల్లి సర్పంచ్గా అయితగోని మధు భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల అనంతరం గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి, తన సొంత ఖర్చులతో ఆ రోడ్డుపై మొరం మట్టి వేయించి తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు.ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ, అధికారికంగా బాధ్యతలు స్వీకరించేలోపే అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషకరమని గ్రామస్తులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అయితగోని మధు తెలిపారు. -
నాడు ఒక్క ఓటుతో భర్త ఓటమి.. నేడు భార్య ఘన విజయం
సిద్దిపేట జిల్లా: గత ఎన్నికల్లో మండలంలోని చల్లాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి పాలయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో అతని భార్య రోజా భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2019లో చల్లాపూర్ సర్పంచ్ స్థానాన్ని బీసీ జనరల్కు కేటాయించారు. అప్పట్లో రమేష్ పోటీ చేసి ఒక్క ఓటుతో ఓటమి చెందారు. ప్రస్తుతం ఈ జీపీని బీసీ మహిళకు కేటాయించారు. దీంతో రమేష్ తన భార్య రోజాను కాంగ్రెస్ మద్దతుతో బరిలో దింపారు. ఆమె సమీప ప్రత్యర్థిపై 558 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. గ్రామస్తులు రమేష్ దంపతులను ఘనంగా సన్మానించారు. గోపాల్ ‘తీన్’మార్! దోమ: మండలంలోని పెద్దతండాచిన్నతండా పంచాయతీలో బుధ వారం నిర్వహించిన సర్పంచ్ ఓట్ల కౌంటింగ్ నువ్వా..నేనా.. అన్నట్లగా సాగింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన నేనావత్ లక్ష్మణ్, బీఆర్ఎస్ మద్దతుతో ఆంగోత్ గోపాల్ బరిలో ఉన్నారు. వీరి మధ్య సాగిన ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్ష్మణ్పై మూడు ఓట్ల స్వల్ప తేడాతో గోపాల్ విజయం సాధించారు. -
అక్క సర్పంచ్.. చెల్లె కలెక్టర్ !
ఖమ్మం జిల్లా: మండలంలోని తెట్టెలపాడు సర్పంచ్గా ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన చిర్రా నర్సమ్మ గెలిచారు. ఆమె చెల్లె (పిన్ని కుమార్తె), కర్ణాటక రాష్ట్రంలోని గుల్బ ర్గా కలెక్టర్ హెప్సిబారాణి బుధవారం నర్సమ్మను అభినందించారు. గ్రామాభివృద్ధికి కృషి చేస్తూ ఆదర్శవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. తొలుత నర్సమ్మ విజయంపై గ్రామంలో బీఆర్ఎస్ ఆధ్వర్యాన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నాయకులు బిల్లగిరి ధనుంజయ్, గుంటి పుల్లయ్య, చిర్రా కృష్ణయ్య, రెడ్డిమల్ల నరేందర్, కొమ్ము శ్రీను, రెడ్డిమల్ల నరేందర్, పగిడిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ అభిమానుల సంబురాలు
ఖమ్మం జిల్లా: తల్లాడ మండలం రామానుజవరం సర్పంచ్గా బుధవారం జరిగిన ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి కిన్నెర వెంకటకృష్ణవేణి గెలుపొందారు. ఆమెకు దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి అభిమానుల మద్దతు ఉండడంతో ఫలితం వెలువడగానే సంబురాలు చేసుకున్నారు. ఈక్రమాన జగన్ ఫొటోతో సంబురాల్లో పాల్గొని తమ కృతజ్ఞత చాటుకున్నారు. -
మూడో విడతలో 85.77%
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తుది విడతలో 85.77 శాతం పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 84.28%, రెండో విడతలో 85.86% ఓటింగ్ రికార్డయిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రాల వద్ద ఓటర్లు బారులుదీరారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ సమయం ముగియగా, ఒంటి గంటలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అధికారులు అనుమతినిచ్చారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, అది పూర్తయ్యాక విజేతలను ప్రకటించారు. బుధవారం రాత్రికల్లా దాదాపుగా కొన్నిచోట్ల మినహా ఉపసర్పంచ్ ఎన్నిక కూడా పూర్తయింది.తుది విడతలో ఇలా....182 మండలాల్లో మొత్తం 4,159 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 11 సర్పంచ్లు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. 3,752 గ్రామ పంచాయతీలు, 28,410 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా.. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డులకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. రెండు పంచాయతీలు, 18 వార్డులకు ఎన్నికలు జరగలేదు. ఈ దఫాలో మొత్తం 50,56,344 మంది ఓటర్లు ఉండగా.. 43,37,024 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పోలింగ్ యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.56% కాగా, ఆ తర్వాతి స్థానాల్లో మెదక్ 90.68%, సూర్యాపేట 89.25%, ఖమ్మం 88.84%, నల్లగొండ జిల్లా 88.72% నిలిచాయి. ఇక మిగిలిన జిల్లాలతో పోలిస్తే నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువైంది. వలసలు ఎక్కువగా ఉండే ఈ జిల్లాల్లో పురుష ఓటర్లు తక్కువగా ఉండటం కొంత వరకు ప్రభావం చూపింది. అత్యల్పంగా నిజామాబాద్ 76.45%, రాజన్న సిరిసిల్ల 79.14%, జగిత్యాల 79.64% నమోదైంది. మూడు విడతలోనూ కొన్నిచోట్ల చెదురుమదురు ఘటనలు, అక్కడకక్కడ ఉద్రికత్తలు మినహా మిగిలినచోట్ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ విడతలో 3,547 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహించారు.వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ను విరివిగా వినియోగిస్తాం : సీఎస్ రామకృష్ణారావు మూడవ విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీకుముదినితో కలిసి సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డి పరిశీలించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరును గమనించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వెబ్ కాస్టింగ్ టెక్నాలజీని మరింత విరివిగా ఉపయోగించి ఎన్నికలను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసినట్టు డీజీపీ శివధర్రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్, డైరెక్టర్ డా.జి. సృజన, అడిషనల్ డీజీపీ మహేశ్ భగవత్, ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరందం ఉన్నారు. -
సర్పంచ్గిరీకి ఓ సలాం.. ఇప్పుడు గులాం
‘ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రం. జిల్లాలో మేజర్ గ్రామపంచాయతీ. 12 వేలకుపైగా జనాభాతో 8,633 ఓటర్లతో ఉన్న రుద్రంగి రెండు దశాబ్దాల కిందట కల్లోల పల్లె. అక్కడ ఎన్నికలను మూడు తుపాకులు శాసించేవి. ఒకటి సీపీఐ(ఎంఎల్) జనశక్తి, మరోటి సీపీఐ మావోయిస్టు పార్టీ, ఇంకోటి పోలీసుల తుపాకీ. మూడు తుపాకుల నీడలో పల్లె అల్లకల్లోలంగా ఉండేది. ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టు పార్టీ, ఓట్లు వేసి తమ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని జనశక్తి నక్సలైట్లు, ఎవరికైనా ఓటేయండి.. నక్సలైట్ల మద్దతుతో పోటీలో ఉన్న అభ్యర్థికి మాత్రం ఓట్లు వేయొద్దని పోలీసులు.. ఇలా మూడు తుపాకుల నీడలో పల్లె జనం వణికిపోయేవారు. రుద్రంగికి చెందిన మాజీ ఎంపీపీ ఇప్ప గంగారెడ్డి, ఇదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్లు చెల్కల గంగరాజయ్య, ఆకుల గంగారెడ్డిని ఇన్ఫార్మర్ పేరిట నక్సలైట్లు హత్య చేశారు. అటు పోలీసులు చేతుల్లోనూ అనేక మంది ఎన్కౌంటర్ కాబడ్డారు. ఇలా ఒక్క రుద్రంగిలోనే కాదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అనేక గ్రామాల ఒకప్పటి దృశ్యం. పల్లెల్లో అనేక మంది ప్రజాప్రతినిధులను, మాజీ సర్పంచ్లను నక్సలైట్లు చంపేశారు. పలువురు సర్పంచులపై భౌతికదాడులు చేసిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి ఘటనల నేపథ్యంలో సర్పంచ్ పదవికి పోటీ చేయాలంటేనే వణుకుపుట్టేది. ఆ సర్పంచ్ గిరీకి ఓ సలాం అంటూ.. పోటీకి దూరంగా ఉండేవారు సామాన్యులు. ఇదంతా.. గతం..’సిరిసిల్ల: ఉమ్మడి జిల్లాలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలో సర్పంచ్ పదవికి ఎంతో మంది నామినేషన్లు వేసి పోటీలో ఉన్నారు. చదువుకున్న విద్యావంతులు, సమీప బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు బంధాలను మరిచి బరిలో నిలిచారు. ఎన్నికల్లో పోటాపోటీగా నీళ్ల ప్రాయంలా డబ్బు ఖర్చు చేస్తూ.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఎన్నెన్నో వ్యూహాలు అమలు చేశారు. మందు విందులు, నోట్ల పంపిణీ, చీరల పంపిణీ ఇలా అభ్యర్థులు చేయని ప్రలోభాలు లేవు. ఆఖరికి ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామాల్లోనూ వేలం పాటలు, భూమిని విరాళంగా ఇవ్వడం, ఊరందరికీ అక్కరకు వచ్చే పనులు చేసేందుకు నగదు ఇవ్వడం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో సర్పంచ్ బరిలో నిలిచిన అభ్యర్థులు ఒక్కోక్కరు రూ.70 లక్షల నుంచి రూ.1.20 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ ఒక్క ఊరిలోనే వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి రూ.3 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన పదవీ కాంక్ష ఏమేరకు ప్రభావం చూపిందో అర్థమవుతుంది.ఇవీ గ్రామాల్లో గతానుభవాలుశాసించే తుపాకుల మధ్య గ్రామాల్లోని సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, ఆఖరికి ఎంపీపీలు, జెడ్పీటీసీలు సైతం బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలున్నాయి. గ్రామాల్లో చీకటి పడిందంటే చాలు పోలీసుల బూట్ల చప్పుడు, నక్సలైట్ల తుపాకుల మోతలతో తెల్లవారేది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అధికార పార్టీకి చెందిన వ్యక్తులు ఊరికి దూరంగా పట్టణాల్లో నివాసం ఉండేవారు. కొందరైతే రాత్రి అయితే ఊరు విడిచి వెళ్లేవారు. అనేక సందర్భాల్లో నక్సలైట్లు ప్రజాప్రతినిధులను పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ.. టార్గెట్ చేసి భౌతికదాడులు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. గ్రామాభివృద్ధికి వచ్చే జవహర్ రోజ్గార్ యోజన(జేఆర్వై) నిధులను మింగారంటూ, అనేక మంది సర్పంచులపై దాడులు జరిగాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చాలా మంది ‘సర్పంచ్ గిరీకి ఓ సలాం.. మాకు వద్దు ఆ పదవి’ అంటూ దూరంగా ఉండేవారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయి. అందుకు ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ ఎన్నికలే తాజా ఉదాహరణగా నిలుస్తాయి.గతం గాయాలు ఇవీ..ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది సర్పంచులు, మాజీ సర్పంచ్లను మావోయిస్టు, జనశక్తి నక్సలైట్లు పోలీస్ ఇన్ఫార్మర్లు అంటూ హత్య చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సర్పంచ్ రాధాకిషన్రావును నక్సలైట్లు హత్య చేశారు. ఇదే మండలం సుద్దాల మాజీ సర్పంచ్ ఏనుగు ప్రభాకర్రావు అలియాస్ వేణుగోపాల్రావును మారుపాక శివారులో చంపేశారు.చందుర్తి మండలం రామారావుపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ పోతుగంటి భాస్కర్ను చంపేశారు.ఎల్లారెడిపేట మండలం కంచర్లకు చెందిన మాజీ సర్పంచ్ సూర వెంకటిని, ఇదే మండలం సింగారంకు చెందిన మాజీ సర్పంచ్ బాలయ్య ను, ఎల్లారెడ్డిపేట మాజీ జెడ్పీటీసీ, మాజీ సర్పంచ్ ఎల్సాని మల్లయ్యను నక్సలైట్లు చంపేశారు.గంభీరావుపేట మండలం గజసింగారంకు చెందిన మాజీ సర్పంచ్ వెంకట్రెడ్డిని కాల్చి చంపారు.జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబారిపేటకు చెందిన మాజీ సర్పంచ్ బచ్చు నందంను హత్య చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం కుక్కలగూడూరుకు చెందిన మాజీ సర్పంచ్ శ్రీపతి రాజయ్య, కాల్వ శ్రీరాంపూర్ మండలం మొట్లపల్లికి చెందిన మాజీ సర్పంచ్ తుల సుధాకర్రావును, ఇదే మండలం పెద్దరాతిపల్లి మాజీ సర్పంచ్ ప్రతాపరెడ్డిని చంపేశారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అనేక మంది నక్సలైట్ల తూటాలకు బలి అయ్యారు. నక్సలైట్లు చేసిన భౌతికదాడులకు లెక్కే లేదు. ఇలాంటి పరిస్థిల్లో రెండు దశాబ్దాల కిందట సర్పంచ్ పదవి ముళ్ల కిరీటంలా భావించి తమకు వద్దు అనేవారు. కానీ, నక్సలైట్ల కదలికలు క్షీణించడంతో పల్లెల్లో ఎన్నికల స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. స్వేచ్ఛగా పోటీ చేసే పరిస్థితులు వచ్చాయి. -
ప్చ్.. ఈ ఏడు గ్రామాలలో ఎన్నికలే లేవు!
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ పలు సిత్రాలు కనిపిస్తున్నాయి. పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు.. అయిన వాళ్ల మధ్యే పోరు.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏడు గ్రామాలకు ఎన్నికలే లేకుండా పోయాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 563 సర్పంచ్.. 5,016 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఇందులో 52 జీపీలు ఏకగ్రీవం కాగా.. ఏడు పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాకపోవడం గమనార్హం. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం లక్ష్మాపురం (బీకే), వంగురోనిపల్లె, కల్ములోనిపల్లె, ప్రశాంత్నగర్ పంచాయతీలకు మూడో విడతలో నిర్వహించే ఎన్నికలను ప్రజలు బహిష్కరించారు. కారణం ఆ పల్లెల్లో గిరిజనులు లేకున్నా.. ఏజెన్సీ నిబంధనల ప్రకారం సర్పంచి స్థానాలను గిరిజనులకే కేటాయించాల్సి రావడం. ఇక చారగొండ మండలం ఎర్రవల్లి గ్రామస్తులు గోకారం రిజర్వాయర్ ముప్పు తగ్గించాలంటూ ఎన్నికలను బహిష్కరించారు. జడ్చర్ల మండలం శంకరాయపల్లిలో ఓటర్లు లేకున్నా ఎస్టీ రిజర్వేషన్ రావడంతో సర్పంచ్ స్థానానికి ఎన్నికలు లేకుండా పోయాయి.ఇవి పోనూ 504 గ్రామపంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. 504 సర్పంచ్ స్థానాలకు 1,652 మంది పోటీ పడుతున్నారు. అదేవిధంగా 942 వార్డులు ఏకగ్రీవం కాగా.. 58 వార్డు స్థానాల్లో నామినేషన్లు వేయలేదు. ఇవి పోనూ మిగిలిన 4,016 వార్డుల్లో పోలింగ్ జరగనుండగా.. 10,436 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఒక్కో సర్పంచ్, ఒక్కో వార్డుకు సగటున ముగ్గురు చొప్పున పోటీపడుతున్నారు. -
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే
సాక్షి, హైదరాబాద్: ‘ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఇంకో రెండేళ్లే. మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మీరు ఐదేళ్ల కోసం గెలిచారు, మిగిలిన సగం కాలం మన ప్రభుత్వంలోనే అభివృద్ధి పనులు చేసుకుంటారు. ఖానాపూర్, షాద్నగర్ గడ్డపై మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖాయం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఐకమత్యంతో కలిసి పనిచేయాలని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణభవన్లో ఖానాపూర్, షాద్నగర్ నియోజకవర్గాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికల కోసం సీఎం స్వయంగా జిల్లాలు తిరుగుతూ ప్రచారం చేయడం చరిత్రలో ఎన్నడూ లేదని విమర్శించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్, కేసీఆర్ వంటి నాయకులు ఏనాడూ సర్పంచ్ ఎన్నికల కోసం రోడ్ల మీద పడలేదన్నారు. రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే విజయోత్సవాల పేరుతో పరోక్ష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలు, ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరి తెగించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బెదిరింపులకు సర్పంచ్లు లొంగొద్దుఎవరి బెదిరింపులకు సర్పంచ్లు లొంగవద్దని కేటీఆర్ సూచించారు. ‘ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోవడానికి ఈ ఎమ్మెల్యేలు ఎవరు? అవి మీ అబ్బ సొత్తు కాదు.. మీ అత్త సొత్తు కాదు’అన్నారు. రేవంత్రెడ్డి ఏమైనా తన భూములు అమ్మి గ్రామాలకు నిధులిస్తు న్నారా అని ప్రశ్నించారు. ప్రజల పైసలతో కడుతున్న ఇళ్లకు అర్హులను ఎంపిక చేసే పూర్తి అధికారం గ్రామ సభలకు, సర్పంచ్లకే ఉంటుందన్నారు.ఎవడైనా అడ్డు తగిలితే తాట తీసి లైన్లో పెట్టాలని కార్యకర్తలకు తెలిపారు. రెండేళ్లైనా ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం..ఇప్పుడు ఎలా గ్రామాలకు నిధులు ఇస్తుందని ప్రశ్నించారు. ‘కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నుంచి రావా ల్సిన రూ.3,500 కోట్ల నిధుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసి, రిజర్వేషన్లను 24% నుంచి 17%కి తగ్గించి హడావుడిగా ఎన్నికలు జరిపిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, జాజుల సురేందర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఖానాపూర్ ఇన్చార్జ్ జాన్సన్నాయక్ పాల్గొన్నారు. -
తుదివిడత పంచాయతీ నేడే..
సాక్షి, హైదరాబాద్: తుదివిడత పల్లె పోరుకు సర్వం సిద్ధ మైంది. బుధవారం జరగనున్న మూడోవిడత పంచాయతీ ఎన్నికలతో రాష్ట్రంలో పల్లెపోరు ముగియనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట దాకా పోలింగ్ ఉంటుంది. పోలింగ్ ముగియగానే ఏజెంట్ల సమక్షంలో బాక్సులకు సీల్ వేస్తారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి ఎన్నికైన సర్పంచ్, వార్డు సభ్యులను ప్రకటిస్తారు. అదేరోజు ఉపసర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. ఏదైనా కారణం వల్ల వాయిదా పడితే మరుసటిరోజు ఆ ఎన్నికను నిర్వహిస్తారు. మూడో దశ ఎన్నికల్లో భాగంగా.. 3,752 సర్పంచ్ పదవులకు 12,652 మంది, 28,410 వార్డులకు 75,725 మంది (నామినేషన్లు దాఖలు కాని, ఏకగ్రీవమైన స్థానాలు మినహాయించి) పోటీపడుతున్నారు. మంగళవారం పోలింగ్కేంద్రాలకు ఎన్నికల సామగ్రి చేరుకుంది. సాయంత్రంకల్లా పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల నుంచి బందోబస్తు వరకు అన్నీ పక్కాగా ఉండేలా ఆయా జిల్లాల్లో అధికార యంత్రాంగం ’జీరో ఎర్రర్’ విధానాన్ని అనుసరిస్తోంది. మంగళవారం సాయంత్రంకల్లా మొత్తం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేసినట్టు ఎస్ఈసీ వెల్లడించింది. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణలో ఎక్కడ లోపాలు తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. -
పల్లెల్లో దాడులపర్వం
పంచాయతీ ఎన్నికల వేళ... పచ్చని పల్లెలు భగ్గుమంటున్నాయి. ఓటు వేయలేదనే నెపంతో కొందరు... తమకు సహకరించలేదనే కారణంతో మరికొందరు దాడులకు పాల్పడుతున్నారు.బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ శ్రేణుల దాడినర్సంపేట/దోమ/శంకరపట్నం: వరంగల్ జిల్లా చెన్నారా వుపేట మండలం చెరువుకొమ్ముతండాకు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో సోమవారం అర్ధ రాత్రి తండాలోని దుర్గమ్మ గుడి వద్ద కాంగ్రెస్ బలపరిచిన ఎనిమిదో వార్డు అభ్యర్థి కొర్ర మోహన్, కార్యకర్తలు సుమన్, రమేశ్, బోడ రాందాస్, పవన్, అజయ్, బాలు, రమేశ్, రాజేంద్రప్రసాద్ తదితరులు చలిమంట కాగు తున్నారు. ఈ సమయంలో బోడతండాకు చెందిన బీఆర్ ఎస్ కార్యకర్తలు బోడరెడ్డి, వెంకన్న, శ్రీను, ప్రసాద్, శ్రీనివా స్ అదే దారి గుండా వెళుతుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డగించారు. అంతేకాక తీవ్ర పదజాలంతో దూషిస్తూ చలిమంట కాగుతున్న వారిపై కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. తండావాసులు గమనించి గాయాల పాలైన వారిని చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం కాంగ్రెస్ నాయకులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.సర్పంచ్ అభ్యర్థిపై కత్తితో దాడిమూడోవిడత ఎన్నికల్లో వికారాబాద్ జిల్లా రాకొండ సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా అర్జున్ బరిలో ఉన్నాడు. సోమవారం సాయంత్రం దాటిన తర్వాత ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలిసి, మద్దతు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ సమయంలో మాస్క్ ధరించిన ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో అర్జున్కు గాయాలవ్వగా, స్థానికులు వెంటనే అతడిని పరిగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎస్పీ స్నేహమెహ్ర ఆరా తీశారు. బాధితుడి తండ్రి నర్సింలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఓటెయ్యలేదని బాలింతపై...కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్కు చెందిన ఖమురున్నిసా పంచాయతీ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి పోటీ చేసి ఓటమి పాలైంది. దీంతో కలత చెందిన ఆమె కుటుంబసభ్యులు యాస్మిన్, హకీంలు.. దాసరి పద్మ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులపై దాడి చేశారు. పద్మ కూతురు ప్రియాంక బాలింత అయినా, ఆమెపై విచక్షణారహితంగా దాడి చేయగా, తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108లో ఆస్పత్రికి తరలించారు.అక్కడ సర్పంచ్ ఎన్నిక నామమాత్రమే..దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం లకావత్తండా(తూర్పు) సర్పంచ్ పదవికి లకావత్ భాగ్యనాయక్ పోటీ చేయగా, ప్రత్యర్థులు ఏకగ్రీవానికి అంగీకరించారు. అయితే స్వతంత్ర అభ్యర్థి లకావత్ శ్రీను తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. మరుసటి రోజు తాను పోటీలో నుంచి తప్పుకుంటానని ప్రకటించి ప్రచారం చేయలేదు. దీంతో అక్కడ సర్పంచ్ ఎన్నికకు పోటీ లేదని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ పరిధిలో 8 వార్డులుండగా, 3 ఏకగ్రీవమయ్యాయి.సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్యాయత్నంరఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హరియాతండా సర్పంచ్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గుగులోత్ చింతామణి భర్త రంగా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ గ్రామంలో మొదటి విడతలో ఎన్నికలు జరగ్గా..పంచాయతీ పరిధిలోని సుకినీతండా పోలింగ్బూత్లో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ మూడు రోజుల క్రితం రాంబాబు సెల్టవర్ ఎక్కగా స్థానికులు, అధికారుల చొరవతో దిగొచ్చాడు. అయితే రంగా మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ సందర్భంగా చింతామణి మాట్లాడాడుతూ పలువురు దొంగ ఓట్లు వేశారని, చనిపోయిన వారి పేరిట ఉన్న ఓట్లు కూడా పోల్ అయ్యాయని ఆరోపించారు.సార్లరావులపల్లి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయండిహైకోర్టును ఆశ్రయించిన పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థులు కందుకూరు: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం సార్లరావులపల్లి సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ.. బరిలో నుంచి తప్పుకున్న అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ పదవికి ఇస్లావత్ శ్రీకాంత్, జర్పుల ప్రవీణ్, ఇస్లావత్ శ్రీను, నేనావత్ గణేశ్, బానావత్ బాలు నామినేషన్లు వేయగా, నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇస్లావత్ శ్రీను ఒక్కరే బరిలో ఉండగా, ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే అధికార పార్టీకి చెందిన పలువురు తమను భయభ్రాంతులకు గురిచేసి, నామినేషన్లు విత్డ్రా చేయించారని ఆరోపిస్తూ ప్రవీణ్, గణేశ్, శ్రీకాంత్ సోమవారం హైకోర్టును ఆశ్రయించారు.ఇంట్లో కూర్చున్నా 208 ఓట్లు తాండూరు రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంద్రవంచ సర్పంచ్ స్థానానికి పటేల్ సుదర్శన్రెడ్డి, పటేల్ విజయ్కుమార్రెడ్డి నామినేషణ్లు దాఖలు చేశారు. విజయ్కుమార్రెడ్డిని విత్డ్రా చేయించి, సుదర్శన్రెడ్డిని ఏకగ్రీవం చేయాలని గ్రాబపెద్దలు నిర్ణయించారు. అప్పటికే వార్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకు న్నారు. అయితే విజయ్కుమార్రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. దీంతో తాండూరులో ఉండే విజయ్కుమార్రెడ్డిని గ్రామస్తులు ఊర్లోకి రానీయలేదు. దీంతో ఆయన ప్రచారానికి దూరంగా తాండూరులోనే ఉండిపోయారు. 11వ తేదీన తొలివిడత పంచాయతీ ఎన్నిక లు జరగ్గా, విజయ్కుమార్రెడ్డికి 208, సుదర్శన్రెడ్డికి 469 ఓట్లు వచ్చాయి.పైసలిస్తారా.. ప్రమాణం చేస్తారా..! చింతలమానెపల్లి(సిర్పూర్): రెండోవిడత జరిగిన ఎన్నికల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం బాలజీఅనుకోడ సర్పంచ్ పదవికి వగాడి శంకర్ పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. వగాడి శంకర్కు 338 ఓట్లు రాగా, విజేతగా నిలిచిన వ్యక్తికి 361 వచ్చాయి. శంకర్ కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని మంగళవారం గ్రామంలోని ఓటర్లను డిమాండ్ చేశారు. పళ్లెంలో పసుపు కలిపిన బియ్యాన్ని వేసి తనకే ఓటేసినట్టు పసుపు బియ్యం పట్టాలంటూ ఓటర్ల వద్దకు వెళ్లారు. ఎన్నికల్లో రూ.8 లక్షలు పంచినా గెలువలేదని, తనను ఓటర్లు మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అక్కడ 69 ఏళ్ల తర్వాత పంచాయతీ ఎన్నికలుతలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం బరంపూర్ గ్రామ పంచాయతీకి 69 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగనున్నాయి. మొట్టమొదటిసారి ఈ పంచాయతీకి 1956లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత నుంచి ప్రతిసారీ గ్రామస్తులు సర్పంచ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అయితే ఈసారి సర్పంచ్ బరిలో ఇద్దరు ఉండడంతో ఎన్నిక అనివార్యమైంది. పంచాయతీ పరిధిలో 10 వార్డులుండగా, రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత గ్రామస్తులు బుధవారం పంచాయతీ ఓట్లను వినియోగించుకోనున్నారు. -
కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడమే వరంగా మారింది..!
నల్గొండ జిల్లా: నిడమనూరు మండలం ఎర్రబెల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో అయితగోని మధు గౌడ్ కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగి, 439 ఓట్ల మెజార్టీతో గెలుపొందుతూ యువ నాయకుడిగా తన సత్తాను చాటుకున్నారు.కొన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ గ్రామాభివృద్ధి, ప్రజాసేవ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మధు గౌడ్కు ఈ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించారు. దీంతో ప్రజల కోరిక మేరకు రెబల్ అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్న ఆయన, ఇంటింటి ప్రచారం చేస్తూ గ్రామస్తుల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.యువత, మహిళలు, పెద్ద సంఖ్యలో మధు గౌడ్కు మద్దతుగా నిలిచారు. పారదర్శక పాలన, గ్రామ అభివృద్ధి, తన ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లిన ఆయనకు ప్రజలు ఘన విజయాన్ని అందించారు.ఈ ఎన్నికల్లో ఎర్రబెల్లి గ్రామ ఉపసర్పంచిగా కందుకూరి నవీన్ ఎన్నికయ్యారు. నూతన సర్పంచ్, ఉపసర్పంచ్ల విజయంతో గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. యువ నాయకుడి విజయం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. -
వరంగల్: పొలిటికల్ చిచ్చు రాజేసిన చలిమంట!
వరంగల్: చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో చలిమంట కాగుతున్న కాంగ్రెస్ కార్యకర్తల వద్దకు అటుగా వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాటామాట పెరిగింది. సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై వాగ్వాదం తీవ్రమై, చివరకు ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చలిమంటల కర్రలతో దాడి చేసుకున్నారు.ఈ ఘర్షణలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు వారిని నర్సంపేట ఏరియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. -
నాడు ఎంపీటీసీలు.. నేడు సర్పంచులు
నిర్మల్ జిల్లా: పంచాయతీ ఎన్నికల్లో మాజీ ఎంపీటీసీలు సర్పంచ్గా పోటీ చేసి గెలుపొందారు. దహెగాం పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో బరిలో నిలిచి సమీప అభ్యర్థి తుమ్మిడె మల్లీశ్వరిపై 242 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచ్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయగా గజ్జెల జయలక్ష్మి కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారు పొన్న కళావతిపై 109 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలిచారు. ముత్యాల కుటుంబానికి మూడోసారి..లోకేశ్వరం: మండలంలోని బాగాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్గా ముత్యాల శ్రీవేద ఒకే ఓటుతో ఎన్నికల్లో విజయం సాధించింది. 1972లో లోకేశ్వరం, నగర్, భాగాపూర్ గ్రామాలకు ఆమె తాత ముత్యాల నారాయణ్రెడ్డి సర్పంచ్గా ఐదేళ్ల పాటు పని చేశారు. నారాయణ్రెడ్డి చిన్న కోడలు ముత్యాల రజిత 2013లో సర్పంచ్గా గెలుపొందారు. 2018లో డీఎస్సీలో రజిత స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. ప్రస్తుతం ముధోల్ మండలం ఎడ్బిడ్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్నారు. ఇప్పుడు బీటెక్ చదివిన శ్రీవేద గెలుపుతో ముత్యాల కుటుంబానికి మూడోసారి సర్పంచ్ పదవి దక్కినట్లయింది. -
మామ వేసిన ఓటుతో.. విజయం సాధించిన కోడలు
నిర్మల్ జిల్లా: లోకేశ్వరం మండలం బాగాపూర్ సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించారు. సర్పంచ్గా ముత్యాల శ్రీవేద బరిలో నిలిచారు. దీంతో అమెరికాలో ఉంటున్న ఆమె మామ ఇటీవల వచ్చి ఓటేశాడు. ఈ పంచాయతీ పరిధిలో 426 ఓట్లుండగా ఇందులో 378 ఓట్లు పోలయ్యాయి. ముత్యాల శ్రీవేదకు 189 ఓట్లు రాగా, మరో అభ్యర్థి హర్ష స్వాతికి 188 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు చెల్లకపోవడంతో అధికారులు పోస్టల్ బ్యాలెట్ ఓటు రావడంతో శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. శ్రీవేద ఒక్క ఓటు తేడాతో గెలుపొందగా, ఆమె మామ ఓటే ఆమెకు కీలకమైందని అంతా చర్చించుకున్నారు. -
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డికి షాక్
హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో.. తొలి విడత పలితాలే పునరావృతం అయ్యాయి. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్నారు. అయితే మహబూబ్ నగర్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి తన సొంతూరులోనే షాక్ తగిలింది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారు. రంగారెడ్డిగూడ సర్పంచ్గా బీజేపీ అభ్యర్థి రేవతి ఆనంద్ విజయం సాధించారు. మరోవైపు.. నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డికీ ఇదే తరహా అనుభవం ఎదురైంది. ఆమె ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసిన సొంతూరు ధన్వాడలో బీజేపీ అభ్యర్థి జ్యోతి రామచంద్రయ్య ఘన విజయం సాధించారు. ధన్వాడ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు కూడా సొంతూరు కావడం, పైగా పర్ణికారెడ్డికి అత్తాకోడళ్ల వరుస.. దీనికి తోడు ధన్వాడలో పోటీ పడింది కూడా అత్తాకోడళే కావడం.. ఈ ఎపిసోడ్కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటు ఖమ్మంలోనూ కాంగ్రెస్కు ఎదురుగాలి తప్పలేదు. అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆది నారాయణ ప్రచారం చేసిన వాటిల్లో కేవలం రెండు చోట్ల (ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి) మాత్రమే కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచ్లుగా నెగ్గారు.రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో.. 55% స్థానాల్లో అధికార పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులదే విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థుల్లో 29% మంది గెలుపొందగా.. తర్వాతి స్థానంలో బీజేపీ నిలిచింది. అదే సమయంలో స్వతంత్రులు కూడా సత్తా చాటారు. రెండో విడతకు సంబంధించి 416 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.తెలంగాణలోని 193 మండలాల్లోని 3911 పంచాయతీలకు ఆదివారం ఎన్నికలు నిర్వహించగా..కాంగ్రెస్-2,112 బీఆర్ఎస్-1,025 బీజేపీ-225ఇతరులు(స్వతంత్రులు.. సీపీఐ-సీపీఎం బలపర్చినవాళ్లు)-549 గెలుపొందారు. రెండో విడతలో 85.86% పోలింగ్ నమోదు కాగా.. ఇది తొలి విడత కంటే 1.58% ఎక్కువ. ఇప్పటి వరకు రెండు విడతల్లో ఇప్పటివరకు 8,567 పంచాయతీల ఎన్నికలు పూర్తైంది. రెండు విడతల్లో కలిపి కాంగ్రెస్ బలపర్చగా గెలిచిన వారి సంఖ్య 5,195, బీఆర్ఎస్ మద్దతుదారులు 2,338, బీజేపీ 440గా ఉన్నారు. బీజేపీ కంటే ఇతరులు సాధించిన స్థానాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన తుది దశ పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
రెండో విడతలో 85.86% ఓటింగ్
సాక్షి, హైదరాబాద్: రెండో దఫా పంచాయతీ ఎన్నికల్లో మరింత భారీగా పోలింగ్ నమోదైంది. తొలివిడత ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్నమోదు కాగా.. రెండో విడతలో 1.58 శాతం ఎక్కువగా 85.86% ఓటింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం మీద రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్కేంద్రా ల వద్ద ఓటర్లు బారులు తీరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ముగియగా, ఆలోపు క్యూలైన్లో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతించారు. పోలింగ్ముగిశాక కౌంటింగ్ప్రారంభించి విజేతలను ప్రకటించారు. ఏకగ్రీవాలను మినహా యిస్తే రెండు విడతల్లో కలిపి 7,745 పంచాయతీలకు ఎన్నికలు ముగియగా, మూడో దఫాలో భాగంగా ఈ నెల 17న మరో 3,759 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. మహిళా ఓటర్లే ఎక్కువ.. రెండో దఫాలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరగగా.. మొత్తం 54,40,339 మంది ఓటర్లకు గాను 46,70,972 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్ నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్జిల్లాలో 76.71%, జగిత్యాలలో 78.34% ఓటింగ్ నమోదైంది. పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 416 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. యాదాద్రి జిల్లా టాప్ రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయడానికి పట్నం ప్రజలు పల్లె బాట పట్టారు. పెద్ద ఎత్తున సొంతూళ్లకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ సరళిని పరిశీలిస్తే ఈసారి 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. పురుష ఓటర్లు 22,77,902 మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా 2,02,716 మంది ఓటర్లకు గాను..1,8,5937 మంది ఓటింగ్తో (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 2,38,838 ఓటర్లు ఉండగా.. 1,83,219 మంది ఓటింగ్ (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాలో 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్88.74%, నల్లగొండ జిల్లాలో 88.74% నమోదు కాగా.. జగిత్యాల (78.34%), భద్రాద్రి కొత్తగూడెం (82.65%), నిర్మల్ (82.67%), వికారాబాద్ (82.72%)లో వరుసగా అత్యల్ప ఓటింగ్ నమోదైంది. తగ్గిన పోస్టల్ బ్యాలెట్లు: పోలింగ్ ముగిసిన తర్వాత మ ధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. గతంతో పోలి స్తే ఈసారి పోస్టల్బ్యాలెట్ఓట్లు భారీగా తగ్గినట్లు అధికారు లు పేర్కొన్నారు. కాగా వార్డుల వారీగా ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్లను ఎన్నుకున్నారు. రెండో విడత ఎన్నికలు మొత్తం మీద ప్రశాంతంగా ముగిశాయి.పోటెత్తిన మహిళలు ఈ విడతలో మొత్తం మహిళా ఓటర్లు 27,82,494 మంది ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్ 89.28% అత్యధికంగా ఓటింగ్ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి (91.83%), ఖమ్మం (91.56%) జిల్లాలే ముందంజలో ఉన్నాయి.రాష్ట్రంలో ఎన్నికలు నోటిఫై అయిన పంచాయతీలు: 12,723ఏకగ్రీవమైనవి: 1205తొలిదశలో ఎన్నికలు జరిగినవి: 3,834రెండో విడతలో జరిగినవి: 3,911మూడో విడతలో జరిగేవి: 3,759(మిగిలిన వాటిలో కొన్నిచోట్ల నామినేషన్లు దాఖలు కాకపోగా, మరికొన్ని కోర్టు కేసులు ఇతర కారణాలతో ఎన్నికలు జరగడం లేదు) -
పల్లెల్లో ‘పైసా వసూల్’!
పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు పొందేందుకు పల్లెల్లో నగదు పంచిన అభ్యర్థుల్లో ఓటమిపాలైన వారు తిరిగి వసూళ్లకు తెరతీస్తున్నారు. తమను గెలిపిస్తారని డబ్బు పంచామని.. కానీ ఓడగొట్టినందున ఆ సొమ్మును తిరిగి చెల్లించాల్సిందేనని ఓటర్లను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు రెండో దశ పంచాయతీ ఎన్నికలు ఆదివారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు నగదు పంపకాల జోరు పెంచారు. ఓ గ్రామంలో నలుగురు అభ్యర్థులు కలిపి ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేల చొప్పున ముట్టజెప్పారు.రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఖర్చు చేసినా ఓడా.. నా డబ్బిచ్చేయండి నార్కట్పల్లి: నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం ఔరవాణి గ్రామంలో ఓడిపోయిన బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కల్లూరి బాలరాజు తన భార్యతో కలిసి దేవుడి ఫొటో, పురుగుల మందు డబ్బా పట్టుకొని ఇంటింటికీ తిరిగాడు. తనకు ఓటు వేయనివారు తాను పంచిన డబ్బు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ‘మా డబ్బు తీసుకొని మమ్మల్నే ఓడించారు. అందుకే మేం పంచిన డబ్బు తిరిగి ఇవ్వండి’ అని పట్టుబట్టారు. మీకే ఓటు వేశామని ఓటర్లు చెప్పగా దేవుడిపై ప్రమాణం చేయాలని కోరారు. తాము పేదవాళ్లమని, రూ. 10 లక్షలు అప్పు తెచ్చి ఎన్నికల్లో ఖర్చు చేసినా గ్రామస్తులు ఓట్లు వేయలేదని బాలరాజు దంపతలు కన్నీటిపర్యంతమయ్యారు. అయితే ఓటర్లు మాత్రం ‘మేము డబ్బు పంచాలని అడగలేదు కదా.. మీరే ఇచ్చారు’ అని బాలరాజును తిరిగి ప్రశ్నించారు.కాంగ్రెస్ నేతకు బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతు కారేపల్లి: ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) గ్రామ పంచాయతీ సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతుతో ఈ నెల 17న మూడో విడత ఎన్నికల్లో బరిలోకి దిగనున్న షేక్ గౌసుద్దీన్ పోటీ నుంచి తప్పుకున్నాడు. అంతేకాకుండా పోటీలో ఉన్న కాంగ్రెస్ నేత పోలగాని శ్రీనివాసరావుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటానని లేఖ రాసిచ్చాడు. ఈ లేఖపై గౌసుద్దీన్తోపాటు బీఆర్ఎస్ కారేపల్లి గ్రామశాఖ పేరిట పలువురి సంతకాలు ఉన్నాయి. దేశ్ముఖిలో ఓటుకు రూ. 33 వేల చొప్పున పంపిణీ సాక్షి, యాదాద్రి: భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం దేశ్ముఖి గ్రామంలో పంచాయతీ బరిలో ఉన్న అభ్యర్థులు భారీగా డబ్బు పంపిణీ చేశారు. ఒక్కో ఓటుకు ఏకంగా రూ. 33 వేలు ముట్టచెబుతున్నట్లు సమాచారం. ఈ గ్రామంలో 1,367 ఓట్లు ఉండగా సర్పంచ్ స్థానానికి ఒకే సామాజిక వర్గానికి చెందిన నలుగురు పోటీ చేస్తున్నారు. ఇద్దరు అభ్యర్థులు ఒక్కో ఓటుకు రూ. 10 వేల చొప్పున ఇస్తుండగా మూడో అభ్యర్థి రూ. 8 వేలు, నాలుగో అభ్యర్థి రూ. 5 వేల చొప్పున పంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో ఓటరుకు రూ. 33 వేలు ముడుతున్నాయన్నమాట.వయసు, మెజారిటీ 71 యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండాకు చెందిన ధీరావత్ గాశీరాంనాయక్ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసి గెలిచాడు. గాశీరాంనాయక్ వయసు 71 ఏళ్లుకాగా సమీప ప్రత్యర్థిపై ఆయనకు లభించిన మెజారిటీ ఓట్లు కూడా 71 కావడం విశేషం.ఎన్నికల సిబ్బంది ఆకలి కేకలు జగిత్యాల రూరల్: జగిత్యాల జిల్లాలో ఎన్నికల విధుల కోసం వచి్చన అధికారులు, సిబ్బందికి భోజనం లేకపోవడంతో నిరసన వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్న 100–150 మంది ఉద్యోగులకు భోజనం లేకపోవడంతో తాము ఎక్కడ భోజనం చేయాలంటూ వాపోయారు. అధికారులపై మండిపడ్డారు.ఓట్ల రద్దీ.. ఆదివారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనుండటంతో హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ప్రాంతవాసులు స్వగ్రామాలకు పయనమయ్యారు. దీంతో శనివారం సాయంత్రం ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ ఇలా కిటకిటలాడింది. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు జగ్గారెడ్డి సన్మానం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను సన్మానించడం మామూలే. కానీ ఓడిన సర్పంచ్ అభ్యర్థులకు శాలువాలు కప్పి సన్మానించిన ఘటన సంగారెడ్డిలో శనివారం జరిగింది. తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు 87 మంది పోటీ చేయగా వారిలో 45 మంది గెలిచారు. ఓటమి పాలైన 42 మంది సర్పంచ్ అభ్యర్థులను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శాలువాలతో సన్మానించారు. వారిలో కొండాపూర్ మండల కేంద్ర సర్పంచ్ పదవికి పోటీ చేసి ఓడిన మస్కు అవినేని నర్సింహారెడ్డిని సదాశివపేట మార్కెట్ కమిటీ చైర్పర్సన్గా నియమిస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. ఓట్లేయలేదుగా.. నా సొమ్ము తిరిగివ్వండి వర్గల్ (గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో వార్డుసభ్యునిగా ఓడిపోయన అభ్యర్థి ఓటర్ల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వీడియో వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డబ్బు పంచినప్పటికీ తనకు ఓట్లు పడలేదనే భావనతో ఓటర్ల నుంచి తిరిగి డబ్బు వసూలు చేసుకున్నాడు. అలా వెనక్కి తీసుకున్న నగదును లెక్కపెట్టుకుంటున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ఓటు కోసం సౌదీ టు మిరుదొడ్డి మిరుదొడ్డి (దుబ్బాక): పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు విదేశాల నుంచి తరలివచ్చి ఓ వ్యక్తి ఓటు విలువను చాటిచెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన ఎల్ముల బాల్రాజు నాలుగేళ్ల క్రితం బతుకుదెరువు కోసం సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు. ఆదివారం జరగనున్న రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు సౌదీ నుంచి మిరుదొడ్డికి చేరుకున్నాడు. -
సర్పంచ్ ఎన్నికల చరిత్రలో కొత్త అధ్యాయం..!
రాజన్న సిరిసిల్ల జిల్లా: చింతల్ఠాణా ఓటర్లు ఎన్నికల చరిత్రలోనే కొత్త అధ్యాయానికి తెరలేపారు. ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తి ప్రచార సమయంలోనే గుండెపోటుతో మరణించాడు. అయితే ఎన్నికల్లో మరణించిన వ్యక్తికే ఓట్లు వేసి గ్రామస్తులు గెలిపించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడంలో అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ఠాణా ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన చెర్ల మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఇంట్లో నిద్రిస్తుండగా ఈనెల 3న గుండెపోటుతో మరణించాడు. కానీ ఈనెల 11న జరిగిన ఎన్నికల్లో ఆ ఊరి ఓటర్లు భారీ మెజార్టీతో చనిపోయిన వ్యక్తి మురళిని గెలిపించారు. దీంతో సర్పంచ్ ఎన్నికపై సందిగ్ధం నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థులు వచ్చిన ఓట్లు..చింతల్ఠాణా గ్రామపంచాయతీకి ఐదుగురు అభ్యర్థులు పోటీ చేశారు. కాంగ్రెస్ బలపరిచిన కొలపురి రాజమల్లుకు 358 ఓట్లు, బీఆర్ఎస్ బలపరిచిన చెర్ల మురళి(చనిపోయిన వ్యక్తి)కి 745 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి బడుగు శ్రీనివాస్కు 40, ఇండిపెండెంట్ మంత్రి రాజలింగంకు 160, బీజేపీ బలపరిచిన సురువు వెంకటికి 367 ఓట్లు వచ్చాయి. నోటాకు 5, చెల్లని ఓట్లు 44 పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి సురువు వెంకటిపై 378 ఓట్ల మెజార్టీతో మరణించిన మురళి గెలిచాడు. ఉపసర్పంచ్గా గొట్ల కుమార్యాదవ్ ఎన్నికయ్యారు. అయోమయంలో అధికారులుపోటీ చేసిన వ్యక్తి మరణిస్తే.. శాసనసభ ఎన్నికలు అయితే వాయిదా పడుతుంది. ఇది స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో ఎన్నికల ప్రక్రియను ముందుకు సాగించారు. అప్పటికే ఎన్నికల గుర్తులు అభ్యర్థులకు ఇవ్వడంతో ఎవరికి వారు ప్రచారంలో ఉన్నారు. దీంతో చనిపోయిన వ్యక్తి గుర్తును మార్పు చేసే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు ముందుగానే ముద్రించిన బ్యాలెట్ పత్రాలు కావడంతో ఏమీ చేయలేక అధికారులు నోటాతో కలిపి ఆరు గుర్తులున్న బ్యాలెట్పత్రంతో ఎన్నికలు నిర్వహించారు. కానీ ఎన్నికల ఫలితాల్లో సానుభూతి పవనాలు వీచి చనిపోయిన వ్యక్తిని సర్పంచ్గా ఎన్నుకోవడంతో అధికారులు అయోమయంలో పడ్డారు.దీనిపై క్లారిటీ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్కు రాశారు. సర్పంచ్ స్థానానికి మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తారా? ఉన్న అభ్యర్థుల్లో రెండో స్థానం పొందిన వ్యక్తికి సర్పంచ్గా అవకాశం ఇస్తారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జిల్లా అధికారులు చెబుతున్నారు. -
కంగ్రాట్స్ డాడీ..
సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా గెలుపొందిన గుంటకండ్ల రామచంద్రారెడ్డికి తన కుమారుడైన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్రెడ్డి శుక్రవారం నాగారంలోని తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపారు. జగదీష్రెడ్డి తన తండ్రి రామచంద్రారెడ్డికి పుష్పగుచ్చాలు అందించి, శాలువాతో సన్మానించారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్కుమార్తో పాటు స్థానిక బీఆర్ఎస్ నాయకులు రామచంద్రారెడ్డిని సన్మానించారు. -
ఓటరు మహాశయులకు సాష్టాంగ నమస్కారం!
రంగారెడ్డి జిల్లా: తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సర్పంచ్ అభ్యర్థి రాయికంటి భిక్షపతి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలో ఉన్నానని, తనను ఆశీర్వదిస్తే స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో నిధులు తెస్తానని తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రచార సభలో ఓటర్లకు సాష్టాంగ నమస్కారం చేసి ఓటు వేయమని అభ్యర్థించారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు. -
Sarpanch Election: నా డబ్బులు నాకు ఇచ్చేయండి..!
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది. సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు. బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
పంచాయతీ ఎన్నికలతో కాంగ్రెస్ పతనం షురూ
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలు అధికార కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయని ప్రచారం జరిగినా రేవంత్ పాలనా వైఫల్యంతో ప్రజలు పూర్తిగా విసిగిపోయినట్లు గురువారం వెలువడిన తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ఈ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయన్నారు. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా అనేక మంది బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలబడ్డారు. పంచాయతీ ఎన్నికల కోసం సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేశారు. పోటీ చేసిన స్థానాల్లో కనీసం 44 శాతం సర్పంచ్ పదవులు కూడా కాంగ్రెస్కు అనుకూలంగా రాకపోవడం రేవంత్ ప్రభుత్వంపై పెరిగిన ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం.మరో మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగనున్నా గ్రామాల్లో అభివృద్ధి జరగదని గ్రామీణ ఓటర్లు నిర్ధారణకు వచి్చనందునే కాంగ్రెస్కు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు స్వల్ప ఓట్ల తేడాతో గెలవడం ఆ పార్టీ పతనాన్ని సూచిస్తోంది. పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయం. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యం’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
కమలదళంలో మిశ్రమ స్పందన
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఫలితాలపై కమల దళంలో మిశ్రమ స్పందన వ్యక్తమౌతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 200 సర్పంచ్ స్థానాల్లో విజయం సాధించడంపై బీజేపీ నాయకులు ఒకవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నా.. పార్టీ బలం పెరుగుతోందని ప్రస్తుతం ఉన్న భావనకు అనుగుణంగా, ఆశించిన ఫలితాలు రాలేదనే అభిప్రాయం మరోవైపు విన్పిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే, లోక్సభ ఎన్నికల్లో 8 ఎంపీ, కౌన్సిల్ ఎన్నికల్లో మూడింట్లో రెండు సీట్లు గెలుపొందాక.. ప్రజల్లో పార్టీ పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోందని రాష్ట్ర నేతలు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులకు తగ్గట్టుగా గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణ జరుగుతోందా లేదా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమౌతున్నాయి.ప్రస్తుత ఫలితాలను బట్టి చూస్తే వివిధ ఎన్నికల్లో గెలిచినంత స్థాయిలో గ్రామాల్లో పార్టీకి ఆశించిన ప్రాతినిధ్యం రాలేదని అంటున్నారు. సానుకూలంగా చూడాలి.. గ్రామ పంచాయతీ ఎన్నికలనేవి పార్టీ రహితంగా, రాజకీయ పార్టీల ఎన్నికల చిహ్నాలు లేకుండా జరిగేవే అయినా, గ్రామాల్లో మద్దతుదారులను, కార్యకర్తలు, నాయకులను పార్టీలు వెనుకనుంచి బలపరుస్తాయనే విషయం తెలిసిందే. కాగా పార్టీలు క్షేత్రస్థాయిలో బలపడేందుకు, విస్తరణకు ఈ ఎన్నికలు కీలకమనే విషయం కూడా ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా బీజేపీ ఈ విషయాన్ని కాస్త తేలిగ్గా తీసుకుందని, ముఖ్యంగా నామినేషన్ల దాఖలుకు ముందు జిల్లా, మండల నాయకులతో రాష్ట్ర నాయకత్వం పెద్దగా సమన్వయంతో వ్యవహరించిన దాఖలాలు లేవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.అయితే ఈ ఎన్నికల బాధ్యత అంతా స్థానిక నేతలకే అప్పగించడంతో రాష్ట్ర పార్టీ నుంచి సమన్వయం, పర్యవేక్షణ అనేది నామమాత్రమై పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే అన్ని చోట్లా పోటీ చేస్తామని బీజేపీ అధ్యక్షుడు ప్రకటించారు. స్థానిక నేతలను సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలిపించుకోవాలని, అన్ని స్థాయిల్లో సమన్వయంతో పని చేయాలని సూచించారు. అయితే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదనే విమర్శలు అప్పట్లోనే పార్టీ నాయకుల నుంచే వచ్చాయి.ఇలాంటి పరిస్థితుల్లో మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 200 దాకా సర్పంచ్ పదవులు గెలుచుకోవడాన్ని సానుకూల దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉందని కొందరు ముఖ్య నేతలంటున్నారు. గ్రామ రాజకీయాల్లో పెరుగుతున్న పార్టీ పట్టుకు ఇది నిదర్శనమని అంటున్నారు. ఇదే తీరున 2,3 దశల పంచాయతీ ఎన్నికల్లోనూ మంచి ప్రదర్శన కనబరిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మరింత పట్టు బిగించేందుకు వీలవుతుందని నేతలు విశ్లేషిస్తున్నారు. సమన్వయం లోపించకపోతే మరింత మెరుగైన ఫలితాలు! అదే సమయంలో అన్ని జిల్లాల్లో అన్ని స్థానాలకు పార్టీ పోటీ చేయాలంటూ స్థానిక నేతలకు ఆదేశాలైతే ఇచ్చారు కానీ దాని అమలు గురించి ఏమాత్రం పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పోటీచేసి బలం చాటాలనే పార్టీ ఉద్దేశానికి అనుగుణంగా నామినేషన్లు దాఖలయ్యాయా ? ఆ మేరకు క్షేత్రస్థాయిలో గట్టి ప్రయత్నమేదైనా జరిగిందా అని కొందరు నిలదీస్తున్నారు.పార్టీలో పోటీకి ఆసక్తి చూపేవారిని ప్రోత్సహించడం, అభ్యర్థులను గుర్తించి పోటీకి నిలపడం, పోల్ మేనేజ్మెంట్లో సమన్వయం వంటి అంశాలపై నిర్లక్ష్యం వహించారని అంటున్నారు. పంచాయతీల్లో పోటీకి ఆసక్తి, ఉత్సాహం కనబరిచే వారిని ప్రోత్సహించేందుకు ఈ ఎన్నికలను వినియోగించుకోవాల్సి ఉండగా అది అంతగా జరగలేదని చెబుతున్నారు. ఇవన్నీ సక్రమంగా జరిగి ఉంటే పార్టీ మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదని బీజేపీ నేతలు కొందరంటున్నారు. -
గులాబీ జోష్..
సాక్షి, హైదరాబాద్: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించడంతో బీఆర్ఎస్లో జోష్ కనిపిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ను దీటుగా ఎదుర్కొన్నామనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో నామమాత్ర ఫలితాలు సాధించిన నేపథ్యంలో.. గురువారం వెలువడిన గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అధికార పార్టీగా కాంగ్రెస్కు ఉన్న అనుకూలతలను పరిగణనలోకి తీసుకుంటే తమ పార్టీ బలపరిచిన సర్పంచ్లు అభ్యర్థులు ఏకంగా 1,345 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించడం గొప్ప విషయమేనని పార్టీ నేతలు అంటున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో కోల్పోయిన పట్టు తిరిగి సాధించామనే అభిప్రాయం పార్టీ యంత్రాంగంలో వ్యక్తమవుతోంది. కలిసివచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండేళ్ల పాలనోత్సవాల పేరిట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేసినా పెద్దగా ప్రభావం చూపలేదని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నికలు జరిగిన 31 జిల్లాల్లో తొలి విడతలో నల్లగొండ, జగిత్యాల, హనుమకొండ వంటి రెండు మూడు జిల్లాలు మినహా మిగతా చోట్ల కాంగ్రెస్కు దీటుగా సర్పంచ్, వార్డు సభ్యుల పదవులు గెలుచుకున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు వెల్లడించాయి. శాసనసభ, లోక్సభ ఎన్ని కల్లో పార్టీ ఓటమి చెందినా క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ చెక్కుచెదరలేదనే విషయాన్ని పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల ద్వారా వెల్లడైందని బీఆర్ఎస్ అంటోంది.పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్చార్జిలు చేసిన కృషితో పాటు అభ్యర్థుల ఎంపిక, రిజర్వేషన్లకు అనుగుణంగా అవకాశం ఇవ్వడం కలిసి వచ్చిందనే భావన వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం, రైతుబంధు, కళ్యాణలక్ష్మి, సామాజిక పింఛన్ల పెంపు వంటి అంశాలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ప్రతికూలంగా మారాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది.క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగం పటిష్టంగా ఉండటం, ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వచ్చినట్టుగా తొలి విడత ఫలితాల సరళి వెల్లడించిందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరిగే మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత మరింత స్పష్టంగా బయట పడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల 14, 17 తేదీల్లో జరిగే రెండు, మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ నడుమ సమన్వయం పెంచడం ద్వారా.. మొత్తంగా ఐదు వేలకు పైగా పంచాయతీల్లో పార్టీ బలపరచిన అభ్యర్థులు గెలుస్తారనే ధీమా బీఆర్ఎస్ శిబిరంలో కనిపిస్తోంది.ఎన్నికలు ముగిసిన తర్వాత సదస్సు.. సన్మానంగ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత మండల, జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికలు లక్ష్యంగా సన్నద్ధతను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులతో సదస్సు నిర్వహించి వారిని సన్మానించాలని భావిస్తోంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఈ సదస్సుకు హాజరయ్యే అవకాశమున్నట్లు సమాచారం. తొలి విడతలో గ్రామ పంచాయతీల వారీగా గెలుపొందిన పార్టీ మద్దతుదారుల వివరాలను సేకరించి, క్రోడీకరించే పనిలో తెలంగాణ భవన్ వర్గాలు నిమగ్నమయ్యాయి. -
అత్యధికమే.. అనుకూలమేనా?
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్ని కల ఫలితాలపై అధికార కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణలు చేసుకుంటోంది. పార్టీలకతీతంగానే జరిగినా పక్కాగా రాజకీయ మద్దతుతోనే జరిగే ఈ ఎన్నికల్లో తమకు రాష్ట్రవ్యాప్తంగా మంచి ఆదరణే లభించిందని, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉందనే భావనకు ఈ ఫలితాలు చెక్ పెడతాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది.సంఖ్యాపరంగా మిగిలిన రాజకీయ పక్షాలు మద్దతిచ్చిన వారి కంటే తాము మద్దతిచ్చిన వారే ఎక్కువ సంఖ్యలో గెలిచినా, తొలి విడత ఫలితం తమకు అనుకూలమేనా అనే కోణంలోనూ ఆ పార్టీ నేతలు లెక్కలు క డుతున్నారు. ఆశించిన మేరకు 90% పంచాయతీ లు దక్కలేదని అంటున్నారు. జిల్లాలు, ఉమ్మ డి జి ల్లాలు, అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలతో పాటు మండలాలు, గ్రామాల వారీగా ఫలితాలను విశ్లే షిస్తూ ప్రస్తుతం తమకు చట్టసభల్లో ఉన్న బలానికి, తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితానికి మధ్య తేడాను గుర్తించే పనిలో ఆ పార్టీ నేతలు పడ్డారు. బీఆర్ఎస్ పోటీపై నిశితంగా..... ముఖ్యంగా తొలి విడత ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి ఎదురైన పోటీని కాంగ్రెస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ప్రధానంగా మహబూబ్నగర్, వనపర్తి, మహబూబాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో గట్టి పోటీ ఎదురవడంపై కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినా ఈ నాలుగు జిల్లాల్లో బీఆర్ఎస్ నుంచి కొంత ప్రతిఘటన ఎదురుకావడంపై పోస్టుమార్టం జరుగుతోంది. భవిష్యత్తులో ఈ జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేయాలని, తొలి విడతలో కొంత మేరకు జరిగిన నష్టాన్ని 2, 3 విడతల్లో పూడ్చుకోవాలని యోచిస్తోంది.సంఖ్యాపరంగా చూస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు వెయ్యికి పైగా పంచాయతీల్లో గెలవడంపై కూడా పార్టీ అంతర్గత విశ్లేషణల్లో నిమగ్నమైంది. దీనిపై టీపీసీసీ నేత ఒకరు మాట్లాడుతూ ‘గ్రామ స్థాయి ఎన్నికల్లో పార్టీల కంటే ప్రత్యర్థుల పనితీరు ఎక్కువగా ఫలితాలనిస్తుందని అన్నారు. బీఆర్ఎస్కు 1000 పంచాయతీలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదని, రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండోసారి గెలిచిన తర్వాత ఆ పార్టీ అత్యంత పటిష్టంగా ఉన్నప్పుడు జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు 2,700 మంది గెలిచారని గుర్తు చేశారు.గ్రామాల్లో అనేక సమీకరణలుంటాయని, ఆ నేపథ్యంలో కొన్నిచోట్ల ప్రతిపక్షాలకు కూడా ఎక్కువగా అవకాశాలుంటాయని, ఆ కోణంలోనే బీఆర్ఎస్ గెలిచి ఉంటుంది తప్ప తమ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకతతో కాదని ఆయన విశ్లేషించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో తొలివిడత ఫలితాల విషయంలో కాంగ్రెస్ పార్టీలో సంతోషం కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయానికి ఆశించిన మేరకు బలం పుంజుకున్నామని, ఈ జోరును భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని నేతలంటున్నారు. రెండు దశలకు మరింత పకడ్బందీగా.. తొలివిడత పోలింగ్ సరళి, ఫలితాలను బేరీజు వేసుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం రానున్న రెండు దశల ఎన్నికలకు మరింత జాగ్రత్తగా, పకడ్బందీగా ముందుకెళ్లాలని భావిస్తోంది. తొలి విడత ఫలితాలపై ఆరా తీసిన సీఎం రేవంత్రెడ్డి 2, 3వ విడత ఎన్నికలపై మరింత దృష్టి సారించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. తొలి విడతలో మంచి ఫలితాలు సాధించామని, రెండు, మూడు విడతల్లో కూడా ఇంతకుమించి ఫలితాలు సాధించేలా ప్రత్యేక దృష్టితో పనిచేయాలని కోరారు. పార్టీ శ్రేణులను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను ఆయన ఆదేశించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఓటు వేయలేదని..
పంచాయతీ ఎన్నికల్లో ఓటమి పాలైన వారిలో కొందరు ఏదో ఒక రూపంలో తమ అక్కసును వెళ్లగక్కారు. ఓటమిని జీర్ణించుకోలేని ఓ సర్పంచ్ అభ్యర్థి రైతులు పొలాలకు వెళ్లే దారిని మూయించాడు. మరోచోట సర్పంచ్ అభ్యర్థి ఓడిపోగా, ఆమె భర్త ఓటర్లతో ప్రమాణం చేయించడం, ఇచ్చిన డబ్బు తిరిగి ఇమ్మని అడగడం వైరల్ అయింది.సాక్షి, మహబూబాబాద్: ‘మీరు నా వద్ద డబ్బులు తీసుకున్నారు. కానీ ఓటు వేయలేదు. దీంతో నేను ఓడిపోయాను. నిజంగా నాకు ఓటు వేసినవారు దేవుడి జెండాపై ప్రమాణం చేయండి. లేదంటే నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి’అంటూ సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ఓ అభ్యర్థి తాను ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకుంటున్న ఘటన మహబూబాబాద్ జిల్లా సోమ్లాతండాలో చోటుచేసుకుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సోమ్లాతండా సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ అన్న దళ్సింగ్ భార్య కౌసల్య పోటీ చేశారు. అదే తండాకు చెందిన ఇస్లావత్ సుజాత కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఎన్నికల్లో రెబల్ అభ్యర్థి సుజాత గెలిచారు. దీంతో ఆగ్రహానికి గురైన కౌసల్య భర్త దళ్సింగ్ శుక్రవారం తండావాసుల ఆరాధ్య దైవమైన అమర్సింగ్ మహరాజ్ జెండా పట్టుకొని.. ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేసినట్టు ప్రమాణం చేయాలని. లేకపోతే.. నా డబ్బులు నాకు ఇవ్వాలని అడిగిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తండాకు తాగునీటి సరఫరా అయ్యే ప్లాంట్ పైపులు పగులగొట్టడం, దేవుడి గుడికి తాళం వేసిన సన్నివేశాలు కూడా వైరల్ అయ్యాయి. అయితే తమ వద్దకు వచ్చి కాళ్లు పట్టుకొని బతిమిలాడి ఓటు వేయాలని డబ్బులిచ్చారని.. ఇప్పుడు దౌర్జన్యంగా రికవరీ చేస్తున్నారంటూ తండావాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా.. పోలీసులు వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశారు.బాట బంద్ చేయించాడుధరూరు: గ్రామస్తులు తనకు ఓటు వేయలేదని...తన పొలం మీదుగా వెళ్లడానికి వీలు లేదంటూ ఓటమి పాలైన ఓ సర్పంచ్ అభ్యర్థి రోడ్డుకు అడ్డంగా మట్టి పోయించాడు. జోగుళాంబ గద్వాల జిల్లా ధరూరు మండలంలోని కోతులగిద్ద గ్రామానికి చెందిన బోయ రంగస్వామి సర్పంచ్ పోటీ చేశాడు. ఆయనతో కలిసి వార్డులకు పోటీచేసిన వారిలో కూడా ఒక్కరూ గెలవలేదు. దీనిని జీర్ణించుకోలేని రంగస్వామి శుక్రవారం తన పొలం పక్క నుంచి రైతుల పొలాలకు వెళ్లే బాటను బంద్ చేయించారు. దీంతో అటుగా నిత్యం రాకపోకలు సాగించే పలువురు రైతులు రేవులపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని తరాలుగా తాము అటుగా వెళ్లి వ్యవసాయం చేసుకుంటున్నామని, తమకు న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.మురికికాల్వలో బ్యాలెట్ పేపర్లు చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు మురికికాల్వలో కనిపించడం స్థానికంగా కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ఆవుల సుందరయ్య కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేయగా సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ మద్దతుదారు రుద్రారపు బిక్షంపై 455 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అయితే, శుక్రవారం పోలింగ్ కేంద్రం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మురికికాల్వలో.. బీఆర్ఎస్ అభ్యర్థి బిక్షం ఎన్నికల గుర్తు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఉన్న బ్యాలెట్ పేపర్లను స్థానికులు గుర్తించారు. దీంతో కత్తెర గుర్తు బ్యాలెట్లను లెక్కించకుండానే మురికి కాల్వలో వేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అభ్యర్థి రుద్రారపు బిక్షంతో పాటు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. విష యం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, ý ంచర్ల భూపాల్రెడ్డిలు చిన్నకాపర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ లభ్యమైన బ్యాలెట్ పేపర్లను వారు పరిశీలించారు. అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్కు పాల్పడినట్లు ఆరోపించారు. నల్లగొండ ఆర్డీఓ అశోక్రెడ్డి చిట్యాల తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీడీఓ, అసిస్టెంట్ ఎన్నికల అధికారి జయలక్ష్మితో మాట్లాడి జరిగిన సంఘటనపై వివరాలను సేకరించారు. మురికి కాల్వలో లభ్యమైన బ్యాలెట్ పేపర్లను ఆర్డీఓ అశోక్రెడ్డి స్వా«దీనం చేసుకున్నారు. ఈ ఘటన లో స్టేజ్–2 రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసినట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. విచారణ అధికారిగా నల్లగొండ ఆర్డీఓను నియమించామని తెలిపారు. పెదవీడు సర్పంచ్ బరిలో 18 మంది బ్యాలెట్ పేపర్పై మూడు వరుసల్లో గుర్తులుమఠంపల్లి: సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పెదవీడు పంచాయతీ సర్పంచ్ స్థానానికి 18 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో నిలిచారు. బ్యాలెట్ పేపరులో మొదటి వరుసలో 8 గుర్తులు, రెండో వరుసలో 8 గుర్తులు, మూడో వరుసలో ఇద్దరు అభ్యర్థుల గుర్తులతోపాటు నోటా గుర్తు ముద్రించారు. ఓటు కోసంపంచాయతీ ఎన్నికల వేళ దశాబ్దల తర బడి పరిష్కారానికి నోచుకోని బాట సమస్యకు లైన్ క్లియర్ అయింది. మరోవైపు ఓట్ల కోసం ఓ వార్డు అభ్యర్థి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టపైకి ఎక్కాడు. ఓట్ల కోసం గుట్ట ఎక్కిన మొదటి వ్యక్తి వినోద్ కావడం గమనార్హం.‘పంచాయతీ’తో పరిష్కారం » పోలింగ్కు ముందే రోడ్డు నిర్మాణం పూర్తి » నెరవేరిన హన్వాడ రైతుల దశాబ్దాల కలఇది మహబూబ్నగర్ జిల్లా హన్వాడ–బుద్ధారం నుంచి వ్యవసాయ పొలాలకు వెళ్లే దారి. దీని కోసం దాదాపు 100 కుటుంబాలకు చెందిన రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వారు చేయని ప్రయత్నం లేదు.. కలవని నేతలు లేరు. కానీ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఎందుకంటే అది ప్రభుత్వ భూమి కాదు.. ఇస్నాతి వంశస్తులకు సంబంధించిన పక్కా పట్టా స్థలం. అందులోనూ సాగులో ఉన్న భూమి. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని ఆ అన్నదాతల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఆ వంశానికి చెందిన సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలో నిలబడడం ఆ రైతులకు వరమైంది. తమ పొలాలకు రహదారి వదిలితే వంద మంది రైతు కుటుంబాలు మీకు మద్దతుగా నిలుస్తాయని ప్రతిపాదించడం.. ఇన్నాళ్లూ అంగీకరించని సదరు యజమాని తమ దాయాదులతో మాట్లాడి ఒప్పించడం.. ఆ వెంటనే రైతులు సొంత డబ్బులతో కిలోమీటర్కు పైగా (సుమారు ఎకరా) మట్టి రోడ్డు వేయడం చకచకా జరిగింది. వెతుకుతున్న తీగ కాలుకు తగిలినట్టు సర్పంచ్ ఎన్నికలకు ముందే రైతుల సమస్య తీరింది. రోడ్డును ఆనుకునే 36 ఎకరాల్లో ఇస్నాతి వంశస్తుల వ్యవసాయ భూమి ఉండగా.. దానికి ఆనుకొని వెనుకవైపు 400 ఎకరాల వరకు పంటలు సాగవుతాయని రైతులు చెబుతున్నారు. ఇన్నాళ్లు రోడ్డు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఎకరా భూమి రూ.50 లక్షలు పలుకుతోంది. హన్వాడలో రెండో విడతలో ఎన్నికలు జరుగుతుండగా.. తనకు మద్దతుగా నిలవాలని సదరు సర్పంచ్ అభ్యర్థి వేడుకుంటున్నాడు. – సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్సర్పంచ్గా గెలిపిస్తే.. పంచాయతీకి రూ.30 లక్షలు ఇస్తా మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వెల్ది గ్రామ సర్పంచ్ అభ్యర్థి కోరుకంటి మధుసూదన్రావు తన సొంత డబ్బులు రూ.30లక్షలు వెచ్చిస్తున్నట్టు బాండ్ పేపర్ రాసివ్వడం చర్చనీయాంశమైంది. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయని, తనను గెలిపిస్తే ప్రభుత్వ నిధులు వచ్చే వరకు ఎదురు చూడకుండా గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇస్తానని చెక్కుతో కూడిన బాండ్ పేపర్ జీపీకి రాసిచ్చాడు. రెండో విడతలో ఆదివారం ఇక్కడ పోలింగ్ జరగనుంది.20 కిలోమీటర్లు నడిచి.. ఓటు అభ్యర్థించి..పెనుగోలు గుట్టపైకెళ్లి ప్రచారం చేసిన వార్డు అభ్యర్థి వినోద్వాజేడు: ములుగు జిల్లా వాజేడు మండలంలోని కొంగాల గ్రామ పంచాయతీ పరిధిలోని పెనుగోలు గ్రామంగుట్టలపై ఉంటుంది. కొంగాలనుంచి మూడవ వార్డుకు పోటీ చేస్తున్న లేగల వినోద్.. పెనుగోలు గ్రామస్తుల ఓట్లు తన వార్డులో ఉండటంతో 20 కిలోమీటర్లు కాలి నడకన గుట్టలపైనున్న పెనుగోలుకు చేరుకున్నాడు. ఓటర్లను తనకు ఓటు వేయాలని కోరాడు. ఈ గ్రామానికి మూడవ విడత ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.సర్పంచ్గా గెలిపిస్తే ఎకరం భూమి ఇస్తాంబాండ్పేపర్పై అగ్రిమెంట్ రాసిచ్చిన ఇద్దరు అభ్యర్థులు భూదాన్పోచంపల్లి : సర్పంచ్గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని సర్పంచ్ బరిలో దిగిన అభ్యర్థులు హామీ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలంలోని అంతమ్మగూడెం చిన్న గ్రామపంచాయతీ. ఇక్కడ మొత్తం 546 ఓటర్లు ఉన్నారు. పంచాయతీ ఎన్నికలలో సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వు అయ్యింది. పంచాయతీ పరిధిలో రసాయన పరిశ్రమలు ఉండటంతో సర్పంచ్ స్థానానికి తీవ్ర పోటీ ఏర్పడింది. ఇక్కడ కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి గుమ్మి జంగారెడ్డి, బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి గుమ్మి నరేందర్రెడ్డితోపాటు బీజేపీ నుంచి వస్పరి రాకేశ్ పోటీపడుతున్నారు. తమను సర్పంచ్గా గెలిపిస్తే కోటి రూపాయల విలువైన ఎకరం భూమి గుడి నిర్మాణం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని గుమ్మి జంగారెడ్డి, గుమ్మి నరేందర్రెడ్డిలు పోటాపోటీగా బాండ్పేపర్లపై అగ్రిమెంట్ రాసి ఇచ్చారు.నాలుగుసార్లు ఆ కుటుంబానికే సర్పంచ్ పదవిమెట్పల్లిరూరల్ (కోరుట్ల): జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వెల్లుల్ల మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవి నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబానికి వరించింది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గూడూరు తిరుపతి ఎన్నికయ్యారు. తిరుపతి భార్య రజిని 2019లో పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ స్థానానికి పోటీ చేసి, గెలుపొందారు. తిరుపతి తండ్రి అప్పట్లో రెండుసార్లు సర్పంచ్గా పనిచేశారు.తమ్ముడి ఓటమి తట్టుకోలేక..అక్క మృతికథలాపూర్(వేములవాడ): జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం గంభీర్పూర్ సర్పంచ్గా పోటీ చేసిన పోతు శేఖర్ ఓటమిపాలయ్యారు. శేఖర్ గెలవాలని కోరుట్లకు చెందిన అతడి అక్క కొక్కుల మమత(40) కొన్నిరోజులు ప్రచారం చేశారు. తమ్ముడు ఓటమి పాలయ్యాడని తెలియగానే గుండెపోటుకు గురైంది. చికిత్స నిమిత్తం తరలిస్తుండగా శుక్రవారం మార్గమధ్యలోనే మమత మృతి చెందింది. ‘వార్డు’ అభ్యర్థి మృతిధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలం ధర్మాపూర్ పంచాయతీలోని రెండోవార్డుకు సమ్మని రామయ్య(62) పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం వరకూ తన వార్డులో ప్రచారం చేశారు. అనంతరం పొలం పనులకు వెళ్లి తిరిగి వస్తుండగా, ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. ఓడిపోయి.. సెల్టవర్ ఎక్కి రఘునాథపాలెం: పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యాతండాకు చెందిన సర్పంచ్ అభ్యర్థి రంగా శుక్రవారం ఉదయం సెల్టవర్ ఎక్కాడు. సమాచారం అందుకున్న రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్, రెవెన్యూ అధికారులు రంగాతో ఫోన్లో మాట్లాడి నచ్చచెప్పగా, మధ్యాహ్నం రెండు గంటలకు కిందకు దిగొచ్చాడు.గ్రీన్ మ్యాట్తో పోలింగ్ బూత్ బచ్చన్నపేట: జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని పలు పాఠశాలల్లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలకు సరిపడా తరగతి గదులు లేవు. దీంతో అధికారులు గ్రీన్మ్యాట్లతో డేరాలు కట్టి పోలింగ్ బూత్లు మార్చారు. -
84.28% పోలింగ్ నమోదు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. 84.28 శాతం ఓటింగ్ నమోదైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. మొదటి దశకు మొత్తం 53,57,277 మంది ఓటర్లు ఉండగా, వారిలో 45,15,141 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. మహిళా ఓటర్లు 84.40%, పురుష ఓటర్లు 84.16%, ఇతరులు 41.27 % ఓటు హక్కు వినియోగించుకున్నారు. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88%, అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79% ఓటింగ్ నమోదయ్యింది. మధ్యా హ్నం 1 గంటకు పోలింగ్ పూర్తి కాగానే ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యింది. కౌంటింగ్ పూర్తయ్యాక గెలిచిన సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించి ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. ఈ ప్రక్రియ ముగిశాక ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహించారు. అక్కడక్కడ స్వల్ప ఉద్రిక్తతలు, చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ సాఫీగా సాగినట్టుగా ఎస్ఈసీకి నివేదికలు అందాయి. ఉదయం నుంచే బారులు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం పోలింగ్ మొదలు పెట్టడానికి గంట ముందు మాక్ పోలింగ్ నిర్వహించి గ్రీన్పేపర్తో బ్యాలెట్ బాక్స్లను సీల్ చేశారు. ఉదయం 9 గంటలకు 21.07%, 11 గంటలకు 53.04%, పోలింగ్ ముగిసే ఒంటిగంట సమయానికి 79.17% పోలింగ్ జరిగింది. అయితే అప్పటికే పోలింగ్ బూత్లలో క్యూలైన్లలో ఉన్నవారు కూడా ఓట్లు వేశారు. మొత్తంగా పోలింగ్ ప్రక్రియ ముగిసేసరికి 84.28% పోలింగ్ నమోదైనట్టు ఎస్ఈసీ వెల్లడించింది. కాగా ఓటింగ్ సరళిని ఎస్ఈసీ కార్యాలయం నుంచి లైవ్ లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల కమిషనర్ ఐ.రాణీ కుముదిని పర్యవేక్షించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ డాక్టర్ జి.సృజన, ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు కూడా పోలింగ్ పరిశీలించారు. ఓటింగ్ ప్రక్రియ పర్యవేక్షణతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందేలా ఎస్ఈసీ ఏర్పాట్లు చేసింది. అర్థరాత్రి దాటినా కౌంటింగ్ ఓటింగ్ శాతం భారీగా నమోదుతో పాటు క్యూలైన్లలో ఉన్న ఓటర్లు ఓటు వేసేందుకు సమయం పట్టడంతో.. మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు ఎక్కువ ఓట్లు ఉన్న చోట్ల కౌంటింగ్ ప్రక్రియ నెమ్మదిగా సాగింది. దీంతో అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా కొన్ని పంచాయతీల్లో కౌంటింగ్ కొనసాగింది. -
పంచాయతీ ముచ్చట్లు
తొలి విడత పంచాయతీ ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగాయి. కొన్ని చోట్ల చనిపోయిన అభ్యర్థులపైనా గ్రామస్తులు తమ అభిమానం చాటుకున్నారు. మరికొన్ని చోట్ల ఓట్లు సమానంగా రాగా, టాస్లో పలువురిని అదృష్టం వరించింది. ఇంకొన్ని చోట్ల ఎన్నో ప్రయాసలు పడి ఓటు వేసి తమ బాధ్యత ఏంటో తెలియజెప్పారు.టెంట్ల కిందే ఓటింగ్..దుద్యాల్ /దండేపల్లి: పాఠ శాల గదుల్లోనో, పంచాయతీ భవనంలోనో నిర్వహించే సర్పంచ్ ఎన్నికలను ఈసారి టెంట్ల కింద పూర్తిచేశారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సట్రకుంటతండాలో ఒక్క ప్రభుత్వ భవనం కూడా లేకపోవడమే ఇందుకు కారణమని తెలిసింది. ఇటీవల స్కూల్, జీపీ భవనాలు మంజూరైనా, ప్రస్తుతం అవి నిర్మాణ దశలోనే ఉన్నాయి. దీంతో చేసేదేమీ లేక టెంట్ల కింద పోలింగ్ జరిపించారు.మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం చెల్కగూడెంలో ప్రభుత్వ పాఠశాల లేదు. పైగా పంచాయతీకి పక్కా భవనమూ లేదు. అంగన్వాడీ కేంద్రం కూడా ఓ అద్దె భవనంలో కొనసాగుతోంది. దీంతో కేంద్రం ఆవరణలోనే టెంట్లు వేసి పోలింగ్ నిర్వహించారు.ఫ్యామిలీ పాలిటిక్స్తల్లిపై కూతురు విజయంకోరుట్లరూరల్/ ఉట్నూర్రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మాయి పల్లె సర్పంచ్ పదవికి తల్లి శివరాత్రి గంగవ్వ, కూతురు పల్లపు సుమలత పోటీ పడగా, కూతురు 91 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఆరుగురు బరిలో ఉన్నా, ఇద్దరి మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది.భార్య సర్పంచ్.. భర్త ఉప సర్పంచ్ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం లింగోజీతండా సర్పంచ్గా జాదవ్ మాయ 88 ఓట్ల మెజారిటీతో సమీప అభ్యర్థి జాదవ్ విమల బాయిపై గెలుపొందారు. ఇదే పంచాయతీలో వార్డు సభ్యుడిగా ఎన్నికైన మాయ భర్త జాదవ్ హరినాయక్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. గత ఎన్నికల్లో ఇదే గ్రామ పంచాయతీకి జాదవ్ హరినాయక్ సర్పంచ్గా ఎన్నికయ్యారు.మద్యం మత్తులో బ్యాలెట్ పేపర్ మింగాడుకోరుట్లరూరల్/ శంషాబాద్ రూరల్: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామ పోలింగ్ బూత్కు పిట్టల వెంకటి ఓటు వేసేందుకు వచ్చాడు. పోలింగ్ సిబ్బంది ఆయనకు సర్పంచ్, వార్డు సభ్యుడికి సంబంధించిన బ్యాలెట్ పేపర్లు ఇచ్చి ఓటు వేసి తీసుకురమ్మన్నారు. అయితే మద్యం మత్తులో ఉన్న వెంకటి తెలుపు కలర్ బ్యాలెట్ పేపర్ నమిలి మింగాడు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్ నములుతుండగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈలోగా పోలీసులు వచ్చి పిట్టల వెంకటిని జీపులో ఎక్కించుకొని పోలింగ్ స్టేషన్కు దూరంగా తీసుకెళ్లి వదిలేశారు.తప్పు జరిగిందని బ్యాలెట్ పేపరు చించివేత రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బుర్జుగడ్డతండాలోని పోలింగ్ స్టేషన్లోకి ఓటు వేసేందుకు ముడావత్ సత్యనారాయణ వెళ్లాడు. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అయితే మరో అభ్యర్థికి వేసినట్టు గుర్తించి, ఆ బ్యాలెట్ పేపరును చించివేశాడు. గమనించిన ఎన్నికల అధికారి రాజశేఖర్రెడ్డి ఫిర్యాదు మేరకు సత్యనారాయణపై కేసు నమోదు చేసినట్టు ఇన్స్పెక్టర్ కె.నరేందర్రెడ్డి తెలిపారు. సత్యనారాయణ పోలింగ్ ఏజెంటుగా తన పేరు నమోదు చేసుకోవడం గమనార్హం.బ్యాలెట్లో వార్డు అభ్యర్థి గుర్తు గల్లంతునాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలోని కుప్పగండ్ల పంచాయతీ అనుబంధ గ్రామం గొల్లోనిపల్లి(10వ వార్డు) పోటీచేసిన అభ్యర్థి గుర్తు బ్యాలెట్ పేపర్లలో లేకపోవడంతో కలకలం రేపింది. దీంతో గంటపాటు పోలింగ్ నిలిపివేయించి.. కొత్త బ్యాలెట్స్ తెప్పించి ఓట్లు వేయించడంతో వివాదం ముగిసింది.నాగారంలో మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తండ్రి విజయంనాగారం: మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి గుంటకండ్ల రామచంద్రారెడ్డి నాగారం సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారుపై 136 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 95 ఏళ్ల వయసులో రామచంద్రారెడ్డి తన స్వగ్రామానికి సర్పంచ్గా సేవ చేయాలన్న కల సాకారమైంది. తండ్రి గెలుపు కోసం కుమారులు జగదీశ్రెడ్డి, సురేష్రెడ్డి, కుటుంబ సభ్యులు కృషి చేశారు. యువతతో పోటీ పడుతూ ఈ వయసులో రామచంద్రారెడ్డి విజయం సాధించడంపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభినందనలు తెలిపారు.సర్పంచ్గా గెలిచిన 80 ఏళ్ల వృద్ధురాలుమంథనిరూరల్: పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల సర్పంచ్ బరిలో ముగ్గురు నిలిచారు. వీరిలో 80 ఏళ్ల వృద్ధురాలు కాసిపేట వెంకటమ్మ 200 పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో సంబరాలు జరుపుకున్నారు.చెక్కు చెదరని అభిమానంచనిపోయిన వ్యక్తికి మెజారిటీ ఓట్లు సర్పంచ్గా గెలిచినట్టు ధ్రువీకరించిన అధికారులు వేములవాడఅర్బన్: రాజన్నసిరిసిల్ల జిల్లా వేము లవాడ మండలం చింతాల్ ఠాణా సర్పంచ్ పదవికి 1,717 ఓట్లు పోలయ్యాయి. ఇందులో చెర్ల మురళికి 739 ఓట్లు, సమీప ప్రత్యర్థులు సురువు వెంకటికి 369, కొలాపూరి రాజమల్లయ్యకు 357 ఓట్లు వచ్చాయి. అయితే ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఈ నెల 4వ తేదీన చెర్ల మురళి గుండెపోటుతో మృతి చెందాడు. అయినా గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమానంతో ఓట్లు వేశారు. అయితే సర్పంచ్ పదవికి పోటీ చేసిన మురళికి ఎక్కువ ఓట్లు వచ్చిన విషయమై రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు చెప్పారు.ఆయనకు 160 ఓట్లు..మహబూబా బాద్ రూరల్ : మహబూబా బాద్ జిల్లా నడి వాడ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్ద తుతో రాగిపాటి బుచ్చిరెడ్డి పోటీ చేశాడు. ఈ నెల 9న గుండెపోటుతో ఆయన మృతి చెందారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బుచ్చిరెడ్డి భార్య సావిత్రమ్మ గ్రామ ప్రజల కోరిక మేరకు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇదే సమయంలోనూ గ్రామస్తులు ఆయనపై ఉన్న అభిమా నాన్ని చాటుకుంటూ ఓటేశారు. దివంగత బుచ్చిరెడ్డికి 160 ఓట్లు వేశారు.ఓటు.. బాధ్యతకొడుకు చనిపోయిన బాధలో ఉన్నా...దుద్యాల్/బోధన్ /ఇబ్రహీంపట్నం: వికారాబాద్ జిల్లా దుద్యాల మండల పరిధిలోని హకీంపేట్కు చెందిన భూకల వెంకటయ్య–పద్మమ్మల కొడుకు మల్లేశ్యాదవ్ అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందాడు. ఇంట్లో మృతదేహం ఉండగానే, రోదిస్తూనే వెళ్లి ఓటు వేశారు. అనంతరం కుమారుడి అంత్యక్రియలు నిర్వహించారు.అంబులెన్స్లో వచ్చి.. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం జాడి జమాల్పూర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి మల్లవరపు ఆరోగ్యరాజు అంబులెన్స్లో వచ్చి ఓటు వేశారు. కొద్ది రోజుల క్రితం ఆయన రోడ్డు ప్రమాదానికి గురికాగా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. నడవలేని స్థితిలో ఉండటంతో అంబులెన్స్లో తీసుకొచ్చారు.ఓటమిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నంకొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజాఅహ్మద్పల్లి సర్పంచ్ అభ్యర్థి లక్ష్మి తన ఓటమి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం లక్ష్మి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వీఐపీ విలేజ్ ఆ ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో... మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరు«ద్రెడ్డి (కాంగ్రెస్) స్వగ్రామం రంగారెడ్డిగూడెం (రాజాపూర్) గ్రామపంచాయతీలో బీజేపీ మద్దతుదారు కాటేపాగ రేవతి విజయం సాధించారు. తొలుత రేవతికి 6 ఓట్ల మెజార్టీ రాగా.. అధికార పార్టీ నాయకుల డిమాండ్తో రీకౌంట్ చేయడంతో రేవతి మెజారిటీ 31 ఓట్లకు పెరిగింది. \వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి (కాంగ్రెస్) సొంతూరు సల్కెలాపురంలో బీఆర్ఎస్‡ మద్దతుదారు గుళ్ల గిరమ్మ ఏడు ఓట్లతో గెలుపొందింది. జోగుళాంబ గద్వాల జిల్లా గట్ట మండలం గంగిమాన్దొడ్డి పంచాయతీలో బోయపద్మ (ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి వర్గం) ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం గుట్టల్లపల్లిలో ఇండిపెండెంట్ అభ్యర్థి కొలను ప్రశాంత్రెడ్డి కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందారు. ఊరు తరలినా.. ఓట్లు అక్కడే.. కడెం: నిర్మల్ జిల్లా కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రాంపూర్, మైసంపేట్ వాసులను పునరావాసంలో భాగంగా ధర్మాజీపేట్ సమీపంలోని పునరావాస గ్రామా నికి తరలించారు. అయినా వీరి ఓట్లు ఉడుంపూర్ పరిధిలోనే ఉన్నాయి. దోసండ్ల లచ్చన్న గ్రామస్తుడి సహాయంతో మోటారుసైకిల్పై 32 కిలోమీటర్ల దూరంలోని ఉడుంపూర్ వెళ్లి తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. లచ్చన్నకు కళ్లు సరిగ్గా కనబడకపోయినా ఓటేసేందుకు అంత దూరం వెళ్లడం విశేషం.ఓటేసిన శతాధిక వృద్ధుడు జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పంచాయతీ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధుడు లాడే లింగన్న ఓటేశాడు. హుషారుగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేసిన లింగన్నను చూసి పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.హరిత పోలింగ్ కేంద్రం వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హరిత పోలింగ్ కేంద్రంలో వీల్ చైర్పై వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్న వృద్ధురాలు. ఓటరు దేవుళ్లకు దండాలు..వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం వద్ద తమ అభ్యర్థికి ఓటేయాలని ఓటర్లకు రెండు చేతులు ఎత్తి మొక్కుతున్న మద్దతుదారులు.. లక్కీ.. లక్కీచాన్స్..చీటీ తీసి... సర్పంచ్ ఎంపిక టేక్మాల్/రఘునాథపల్లి /రాజాపేట/కొందుర్గు /మంథనిరూరల్: మెదక్ జిల్లా టేక్మాల్ మండలం సూరంపల్లి సర్పంచ్ స్థానానికి 558 ఓట్లు పోలయ్యాయి. అందులో 3 ఓట్లు నోటాకు పడగా, 3 ఓట్లు చెల్లలేదు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న మైలారం పోచయ్య, కాంగ్రెస్ బలపరి చిన రామచంద్రయ్యకు 276 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. రెండుసార్లు కౌంటింగ్ చేసినా, మళ్లీ ఇద్దరికీ సమాన ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరు అభ్యర్థుల సమ్మతితో ఒక్కొక్కరి పేర ఐదైదు చీటీలు రాశారు. ఆ పది చీటీల నుంచి ఒక చీటీ తీయగా, అందులో మైలారం పోచయ్య పేరు ఉంది. దీంతో ఆయన్ను సర్పంచ్గా ఎన్నికైనట్టు ప్రకటించారు.టాస్తో స్వతంత్ర అభ్యర్థికి అదృష్టం..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో గంపల నర్సయ్య, స్వతంత్ర అభ్యర్థిగా గడ్డం జోజి బరిలో నిలిచారు. పంచాయతీ పరిధిలో 474 ఓట్లు ఉండగా, 420 ఓట్లు పోలయ్యాయి. అందులోనూ ఇద్దరికి సమానంగా 210 చొప్పున ఓట్లు రావడంతో అధికారులు రెండుమార్లు రీకౌంటింగ్ చేశారు. అయినా ఓట్లు సమానంగానే వచ్చాయి. దీంతో టాస్ వేయగా అదృష్టం స్వతంత్ర అభ్యర్థిని జోజి వరించింది.లక్ష్మక్కపల్లిలో...యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండ లం లక్ష్మక్కపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ మద్దతు దారుడు ఇండ్ల రాజయ్య టాస్ ద్వారా గెలుపొందారు. ఓట్ల లెక్కింపులో మొదట ఇండ్ల రాజ య్యకు 147 ఓట్లు, వేముల సురేందర్రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేయ డంతో ఇండ్ల రాజయ్యకు ఒక్క ఓటు వచ్చింది. దీంతో ఇద్దరి ఓట్లు సమానం అయ్యాయి. ఎన్ని కల అధికారులు టాస్ వేయగా, రాజయ్యను అదృష్టం వరించింది. ఇదే పంచాయతీ పరిధి లోని 3వ వార్డులో బీమనపల్లి కృష్ణకుమార్, అయిల కిరణ్లకు చెరి 27 ఓట్లు రాగా, టాస్ వేయగా, కృష్ణకుమార్ను గెలిచాడు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాకర్లపల్లి సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు తెలిపిన అభ్యర్థులకు సమానంగా 392 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ నుంచి మెండే రాజ య్య, బీఆర్ఎస్ నుంచి కనవేన కొమురయ్య బరిలో నిలిచారు. డ్రాలో కనవేన కొమురయ్య గెలిచినట్టు అధికారులు ప్రకటించారు.కోటినాయక్ తండాలో... ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం కోటినాయక్ తండాలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ధరావత్ చిట్టి టాస్లో విజేతగా నిలిచింది. ధరావత్ చిట్టికి, ఆమె ప్రత్యర్థి కాంగ్రెస్ మద్దతుదారు ధరావత్ తులసికి 315 చొప్పున ఓట్లు సమానంగా రాగా.. అధికారులు టాస్ నిర్వహించారు. టాస్లో ధరావత్ చిట్టి గెలుపొందింది. పోస్టల్ ఓటుతో సమానం..ఆపై టాస్తో గెలుపు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చిన్న ఎల్కిచర్ల సర్పంచ్ స్థానానికి 616 ఓట్లు పోలయ్యాయి. మరాఠి రాజ్ కుమార్కు 211, గోపి రాములుకు 212, వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా, రాజ్కుమార్కు ఒక ఓటు వచ్చింది. దీంతో రాజ్కుమార్, రాములుకు ఓట్లు సరిసమానం అయ్యాయి. టాస్ వేయగా, రాజ్కుమార్ను విజయం వరించింది. వాసాలమర్రిలో... తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మాట అనురాధకు, బీఆర్ఎస్ బలపరిచిన పలుగుల ఉమారాణికి ఓట్లు 615 చొప్పున సమానంగా వచ్చాయి. దీంతో అధికారులు టాస్నిర్వహించగా దొమ్మాట అనురాధను విజయం వరించింది. డ్రా ఫలితంపై అభ్యంతరం.. లాఠీచార్జ్ సాక్షి, సిద్దిపేట: మర్కూక్ మండలం గంగాపూర్–యూసుఫ్ఖాన్పల్లి సర్పంచ్గా పోటీ చేసిన ఇద్దరు బీఆర్ఎస్ మద్దతుదారులే. ఐతం శ్యామల, జంపల్లి లక్ష్మి కి 194 ఓట్ల చొప్పున వచ్చాయి. డ్రా తీయగా శ్యామల గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు. డ్రా తీసినప్పుడు ఎవరి పేరు వచి్చందో పూర్తిగా చూపించకుండానే శ్యామల గెలుపొందారని ప్రకటించారని ఆరోపిస్తూ లక్ష్మి తన అనుచరులతో కలిసి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. ఈ ప్రకటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని లక్ష్మి తెలిపారు. ఒక్క ఓటుతో విజయం..గూడూరు/ రేగోడ్ /మంథనిరూరల్: మహబూ బాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుదారు సనుప సుజాత ఒక్క ఓటు మెజారిటీతో గెలిచారు. పంచాయతీ పరిధిలో 1,140 ఓట్లు పోలవ్వగా, బీఆర్ఎస్ మద్దతుదారు నూనావత్ స్వాతి 3 ఓట్ల మెజారిటీతో గెలిచినట్టు అధికారులు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ మద్దతుదారు సుజాత అభ్యంతరం చెబుతూ రీకౌంటింగ్ చేయాలని అధికారులను కోరారు. రీ కౌంటింగ్లో సుజాతకు 550 రాగా, స్వాతికి 549 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ రీకౌంటింగ్ చేయాలని కోరగా, మరోసారి రీ కౌంటింగ్ చేశారు. అయినా కాంగ్రెస్ అభ్యర్థికి ఒక ఓటు ఎక్కువగా రావడంతో రిటర్నింగ్ అధికారులు సుజాతను విజేతగా ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు కౌంటింగ్ హాల్ గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కొండాపూర్లో...: మెదక్ జిల్లా రేగోడ్ మండలం కొండాపూర్ సర్పంచ్గా బేగరి పండరి ఒకే ఒక్క ఓటుతో గెలిచారు. ఓట్ల కౌంటింగ్లలో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సత్తయ్యకు 287 ఓట్లు రాగా.. కాంగ్రెస్ మద్దతులో పోటీలో ఉన్న బేగరి పండరికి 288 ఓట్లు వచ్చాయి. ఇదే మండల పరిధిలో గజ్వాడ సర్పంచ్గా మున్నూరి సరోజన 570 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. మంథని మండలం గద్దలపల్లి సర్పంచ్గా ఒక్క ఓటుతో బీఆర్ఎస్ మద్దతుదారు తోంబూరపు సుజాత విజయం సాధించారు. ప్రత్యర్థి కోరవేన వైష్ణవికి 559 ఓట్లు రాగా సుజాతకు 560 ఓట్లు వచ్చాయి. వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం సోళీపురంలో ఒక్క ఓటుతో కాంగ్రెస్ మద్దతుదారు సింధూజ విజయం సాధించింది.ఓటు కోసం పల్లెబాటచౌటుప్పల్: మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటేసేందుకు జనం పెద్ద సంఖ్యలో పట్నం నుంచి పల్లెబాట పట్టారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. ఈ క్రమంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులుదీరాయి. గురువారం ఉదయం నుంచి ప్రారంభమైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరుగుపయనమయ్యారు. దీంతో హైదరాబాద్ మార్గంలోనూ రద్దీ అర్ధరాత్రి వరకు కొనసాగింది. -
సర్పంచ్ ఎన్నికలు: ఒక్క ఓటుతో గెలిచిందోచ్!
సాక్షి, కొమరం భీమ్: తెలంగాణ వ్యాప్తంగా తొలి విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు వెల్లడి అవుతున్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. తర్వాతి స్థానంలో బీఆర్ఎస్, ఇతరులు, ఆ తర్వాతే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. ఈ తరుణంలో.. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ గ్రామంలో ఆసక్తికర ఎన్నిక జరిగింది. ఒక్క ఓటు తేడాతో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించిందక్కడ. కెరమెరి మండలంలోని పరందోలి గ్రామ సర్పంచిగా స్వతంత్ర అభ్యర్థి రాథోడ్ పుష్పలత.. కేవలం ఒక్క ఓటు తేడాతో ప్రత్యర్థి అభ్యర్థి దిలీప్ కాటేపై గెలిచారు. దీంతో ఆమె కుటుంబ సభ్యల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. రంగులు చల్లుకుంటూ.. స్వీట్లు పంచుకుంటూ సంబురాలు చేసుకుంటున్నారక్కడ. -
సీఎం‘కోడ్’ ఉల్లంఘన ఫిర్యాదు ఎంసీసీ కమిటీకి పంపాం
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్రెడ్డిపై వచ్చిన పంచాయతీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదును ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) కమిటీకి పంపించినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకు ముదిని వెల్లడించారు. ఈ కమిటీ నుంచి నివేదిక అందాక, దానిపై తదుపరి చర్యలు ఉంటాయని తెలి పారు. దీనికి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్య క్షురాలు కల్వకుంట్ల కవిత నుంచి ఎస్ఈసీకి ఫిర్యాదు అందిందన్నా రు. రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, విజయో త్సవాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కోరిన అనుమతికి ఆమోదం తెలిపా మని చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వానికి పలు సూచనలు చేశామన్నారు. ఎంసీసీ పర్యవేక్షణకు సీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా కమిటీలు పనిచేస్తు న్నాయని చెప్పారు. ప్రధాని మోదీ నిర్వహిస్తున్న ‘మన్కీబాత్’కార్యక్రమం తాము రెగ్యులర్గా నిర్వహిస్తున్నామని, ఇది గ్రామీణ ప్రాంతాల్లోనూ రేడియోలో ప్రసారం అవుతున్నందున ఆకాశవాణి అధికారు లు అనుమతి కోరారని చెప్పారు. బుధవారం ఎస్ ఈసీ కార్యాలయంలో అదనపు డీజీపీ మహేశ్భగ వత్, పీఆర్ఆర్డీ డైరెక్టర్, రాష్ట్ర ఎన్నికల అధికారి డా.జి.సృజన, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం. మకరందుతో కలిసి రాణీ కుముదిని మీడియాతో మాట్లాడారు. గురువారం జరగనున్న తొలివిడత ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించినట్టు, ఈ ప్రాంతాల్లో డబుల్ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. సర్పంచ్, వార్డుల ఏకగ్రీవాలకు సంబంధించి సమీక్ష, అభ్యర్థుల డిక్లరేషన్ల ఆధారంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా ఉదంతాల్లో కేసులు నిరూపితమైతే ఆ ఎన్నికలు రద్దు అవుతాయని, ఏకగ్రీవాలపై ఆరోపణలు వచ్చిన చోట నివేదికలు కోరినట్టు చెప్పారు. నోటాను అభ్యర్థిగా పరిగణించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) ఇచ్చిన వినతిపత్రంపై ఎస్ఈసీ స్పందన ఏమిటని ఓ విలేకరి కోరగా.. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఏమి చేయాలి, సింగిల్ నామినేషన్ వస్తే ఏమి చేయాలి తదితరాలపై వేసిన పిల్పై విచారణ సుప్రీంకోర్టులో ఉందని రాణీకుముదిని తెలిపారు. దానిపై వచ్చే తీర్పు లేదా ఆదేశాలకు అనుగుణంగా తాము కూడా నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. పోలింగ్ రోజు ఓటింగ్ తీరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన వెబ్కాస్టింగ్ విధానాన్ని ఆమె పరిశీలించారు. మహేశ్భగవత్ మాట్లాడుతూ నగదు, మద్యం, వస్తువులు, డ్రగ్స్ ఇలా అన్ని కలిపి రూ.7,54 కోట్ల విలువ గల వాటిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఏకగ్రీవాలకు సంబంధించి సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో వచ్చిన ఫిర్యాదులపై అక్కడి పోలీస్ కమిషనర్లు చర్యలు తీసుకున్నారని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలపై 3,214 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి చెల్లించాల్సిన పారితోషికం రేట్లను పెంచుతూ పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎం రేవంత్పై ఫిర్యాదును పరిశీలిస్తున్నాం: ఎస్ఈసీ రాణి కుమిదిని
సాక్షి, హైదరాబాద్: రేపటి మొదటి దశ సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లన్నీ జరిగినట్లు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుమిదిని దేవి ప్రకటించారు. పంచాయితీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను ఆమె బుధవారం మీడియాకు వెల్లడించారు. రేపు మొదటి దశ సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2గంటల నుంచి కౌటింగ్ ఉంటుంది. రేపు సాయంత్రం ఉప సర్పంచ్ ఎన్నిక లేదంటే ఎల్లుండి ఉంటుంది. ఇప్పటికే అబ్జర్వర్ల, మైక్రో అబ్జార్వుల నియామకం జరిగింది. ఓటర్ స్లిప్ల్ లు పంపిణి దాదాపు పూర్తి అయింది. సిబ్బందికి శిక్షణ ఇప్పటికే పూర్తి అయిందని వెల్లడించారామె. సీఎం రేవంత్ రెడ్డిపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు పైనా ఆమె స్పందించారు. ఆ ఫిర్యాదును ఎన్నికల సంఘం ఎంసీసీ(Model Code of Conduct) కమిటీకి పంపాం. ఆ కమిటీ నివేదిక తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి. రెండు సంవత్సరాల ప్రజా పాలన ఉత్సవాల కోసం అనుమతి అడిగారు. మేం అనుమతి ఇచ్చాం అని అన్నారామె. 👇మొత్తం మండలాలు నోటిఫై: 189గ్రామ పంచాయతీలు నోటిఫై: 4236వార్డులు నోటిఫై: 37,440పోలింగ్ స్టేషన్లు: 37,562ఫేజ్–1 ఓటర్ల సంఖ్య: 56,19,430పురుషులు: 27,41,070మహిళలు: 28,78,159ఇతరులు: 201👇పోలింగ్కు వెళ్లే GPలు: 3,834పోలింగ్కు వెళ్లే వార్డులు: 27,628సర్పంచ్ అభ్యర్థులు: 12,960వార్డ్ మెంబర్ అభ్యర్థులు: 65,455ROలు నియామకం: 3,591పోలింగ్ సిబ్బంది: 93,905మైక్రో ఆబ్జర్వర్లు: 2,489 (మూడూ దశలకు)వెబ్కాస్టింగ్ కోసం గుర్తించిన పోలింగ్ స్టేషన్లు: 3,461బ్యాలెట్ బాక్సులు అందుబాటులో: 45,086 👉ఇక ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు.. సీజ్లు తదితర వివరాలను ఏడీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.. ఎన్నికల మోడల్ కోడ్ ఉల్లంఘన కేసులు నమోదు: 3,214 FIRలుప్రివెంటివ్ యాక్షన్లో బౌండ్ ఓవర్ వ్యక్తులు: 31,428డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ ఆయుధాలు: 902సీజ్ చేసిన నగదు: ₹1,70,58,340సీజ్ చేసిన మద్యం: ₹2,84,97,631డ్రగ్స్ / నార్కోటిక్స్: ₹2,22,91,714విలువైన లోహాలు / ఆభరణాలు: ₹12,15,500ఇతర వస్తువులు: ₹64,15,350మొత్తం సీజ్ విలువ: ₹7,54,78,535రేపు తెలంగాణ రాష్ట్రంలో మొదటి దశ గ్రామ పంచాయితీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్ర వ్యాప్తంగా 243 సమస్యత్మాక ప్రాంతాలను గుర్తించామని.. అక్కడ డబుల్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఏడీజీ మహేష్ భగవత్ తెలిపారు. -
వైఎస్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి..!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: సమత్ భట్టుపల్లి గ్రామానికి చెందిన పోలెబోయిన తిరుపతయ్య కుటుంబం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి ప్రవేశించి దాదాపు 20 ఏళ్లుగా ప్రజా సేవలో నిలకడగా కొనసాగుతున్నారు. ఈసారి ఎన్నికల్లోనూ తిరుపతయ్య కాంగ్రెస్ తరఫున సమత్ భట్టుపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. 2001 గ్రామపంచాయతీ ఎన్నికల్లో తిరుపతయ్య తల్లి సర్పంచ్గా గెలుపొందారు. ఆపై 2006 ఎన్నికల్లో తిరుపతయ్య గెలిచారు. ఇక 2013లోనూ వైసీపీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా విజయం సాధించారు. అలాగే, 2019లో పంచాయతీ స్థానం ఎస్టీ మహిళకు రిజర్వ్ కావడంతో ఆయన భార్య పోలెబోయిన శ్రీవాణి పోటీ చేసి గెలిచారు. ఇలా రెండు దశాబ్దాలుగా పంచాయతీ అధికారం నిరంతరం పోలెబోయిన కుటుంబం చేతుల్లోనే ఉంటుండగా.. తిరుపతయ్య మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలో నిలిచారు. -
Panchayat Elections : జర.. ఆగరాదే
దేవరకద్ర రూరల్: మండలంలోని లక్ష్మీపల్లిలో సర్పంచ్ రోజా అభ్యర్థి గ్రామంలోని ఓటర్లును ఆకట్టుకునేలా సర్పంచ్గా తనను ఎన్నుకుంటే చేసే పనులపై ఓ మేనిఫెస్టో చేసి బాండ్పేపర్తో ప్రచారం నిర్వహిస్తున్నారు. మ్యానిఫెస్టోకు సంబంధించిన బాండ్పేపర్ను గురువారం లక్ష్మీపల్లిలో బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ప్రశాంత్రెడ్డి చేతులమీదుగా గ్రామస్తుల సమక్షంలో విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా శివాజీ విగ్రహ ఏర్పాటు, గ్రంథాలయం, హెల్త్క్యాంప్లు, గ్రామంలో మౌలిక వసతులు కలిపి 20 వరకు ఉన్నాయి. ఇచ్చిన హామీలలో 70 శాతం పనులు మూడేళ్లలో పూర్తి చేస్తానని.. లేదంటే రాజీనామా చేస్తానని పేర్కొంటూ ఓట్లు అభ్యరి్థంచారు.గిన్నెలు ఇప్పిస్తా.. ఓటేయండి ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజులయ్యతండాలో ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రచారం నిర్వహిస్తుండగా గిన్నెల వ్యాపారి అటుగా వచ్చాడు. దీంతో వెంటనే సర్పంచ్ అభ్యర్థి ఒక్కొక్క మహిళకు గిన్నెలు ఇప్పించి.. ఓట్లు వేయాలని విన్నవించాడు. – మరికల్జర.. ఆగరాదే స్నానం చేస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానని.. రిమోట్ కంట్రోల్ గుర్తుకు ఓటేయండి అంటూ అమరచింత మండలంలోని చంద్రనాయక్తండాలో సర్పంచ్ అభ్యర్థి కోరగా.. సదరు వ్యక్తి స్పందిస్తూ జర.. ఆగరాదే అనడంతో నవ్వులు పూశాయి. – అమరచింత -
Local Body Elections: ఎవ్రీడే 90 ఎంఎల్..!
వరంగల్ జిల్లా: గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం ఆసక్తి కలిగిస్తోంది. ఓటర్లకు మద్యం పంపిణీ చేసేందుకు అభ్యర్థులు ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. పోలింగ్ జరిగే రెండు, మూడు రోజుల ముందు నుంచి గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికి, వ్యతిరేకులకు మద్యం తాగిస్తున్నారు. తమ గెలుపు కోసం రోజూ ప్రచారం చేసే బ్యాచ్తో పాటు.. తమకు తప్పకుండా ఓటు వేస్తారనే నమ్మకం ఉన్నవారికి, తమకు ఓటు వేయరేమో అనే అనుమానంతో ఉన్న వారికి ప్రతీ రోజు 90 ఎంఎల్ మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని వైన్ షాపుల నిర్వాహకులు 90 ఎంఎల్ మద్యం బాటిళ్లను ఎక్కువ స్టాక్ చేసుకుంటున్నారు. ఇలా ప్రతీ రోజూ 90 ఎంఎల్ మద్యం అభ్యర్థులు ఇంటికే పంపిస్తుండడంతో కొందరు ఓటర్లు ఆనంద పడుతున్నారు. వాళ్ల దావత్కు పోయివస్తా.. ఓటు మాత్రం నీకేసంగెం: గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటర్ల విచిత్రాలు సర్పంచ్ అభ్యర్థులను ఖంగుతినిపిస్తున్నాయి. పోటీలో ఉన్న అభ్యర్థులు దావత్లు ఏర్పాటు చేసి ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో ఓటర్లు ఎవరి మాట కాదనలేక పిలిచిన ప్రతీ అభ్యర్థి దావత్కు, విందులకు వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యర్థి తారసపడి గా దావత్కు ఎందుకు పోయినవే అడితే పిలిస్తే పోకపోతే బాగుండదని వెళ్లిన గాని ఓటు మాత్రం నీకే వేస్తా అంటూ మభ్యపెట్టుతున్నారు. ఇంకాకొందరైతే ముందుగానే అభ్యర్థితో గా అభ్యర్థి దావత్కు పిలిచిండు పోయి వస్తా ఏమి అనుకోవద్దు అంటూ వెళ్లొస్తున్నారు. అంతేగాక అక్కడ గా మందు బ్రాండ్ పెట్టారని, ఇక్కడ ఈ మందు బ్రాండ్ పెట్టుతున్నారని విమర్శలు సైతం చేస్తూ దావత్లు ఇచ్చిన వారినే మాటలు అంటున్న పరిస్థితి గ్రామాల్లో కొనసాగుతుందని పలువురు అభ్యర్థులు వాపోతున్నారు. -
పంచాయతీ ప్రచారంలో మహిళలు...ఖాళీగా పల్లె వెలుగు బస్సులు
సూర్యాపేట జిల్లా: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కాలు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు. -
ఓట్లప్పుడే వస్తారా?
పంచాయతీ ఎన్నికల వేళ.. అభివృద్ధి నోచుకోని గ్రామాలు, తండాల ప్రజలు ఓటుకు దూరంగా ఉంటామని ఎన్నికల బహిష్కరణకు పిలుపు ఇస్తున్నారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్నికలు అనగానే వాలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సౌకర్యాలు కల్పించేవరకు ఓటెయ్యంరాయపర్తి/ ఇంద్రవెల్లి: ‘అరవై ఏళ్లుగా తండాలో అన్నీ ఇబ్బందులే.. సౌకర్యాలు వచ్చే వరకు ఓటు వేయం ’అంటూ వరంగల్ జిల్లా రాయపర్తి మండలకేంద్రం శివారులోని గుబ్బెడుబోడుకింది తండావాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లకోసం ఓటు అడగడానికే వస్తున్నారు కానీ ఆ తర్వాత మా తండాను పట్టించుకున్నవారే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలో 45 ఓట్లు, 60 మంది జనాభా ఉంటుందని, సరైన రోడ్డు, తాగునీటి సౌకర్యం, వీధిస్తంభాలు, విద్య, వైద్యం అందుబాటులో లేవని చెప్పారు. తెలిపారు తండాను రాయపర్తి నుంచి వేరు చేసి జేతురాంతండాలో కలపాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళన విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం తండాకు చేరుకొని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని, అంతా ఓటింగ్లో పాల్గొనాలని ప్రతిజ్ఞ చేయించారు. అయినా, తాము ఓటింగ్లో పాల్గొనబోమని తండావాసులు తేల్చిచెప్పారు. ఎన్నికలకు దూరం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోపాల్పూర్, గోపాల్పూర్గూడ గ్రామస్తులు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. మంగళవారం గ్రామ సమీపంలోని వాగు వద్దకు వచ్చిన నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామానికి రోడ్డు వేస్తామని, అభివృద్ధి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యేలతోపాటు సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత ఎవరూ ఇటువైపు రావడం లేదన్నారు. సర్పంచ్ అభ్యర్థి కుటుంబానికి పోలీస్ భద్రతచింతలమానెపల్లి: కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రణవెల్లి సర్పంచ్ అభ్యర్థిని జాడి దర్శన కుటుంబానికి పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. దర్శన సర్పంచ్ పదవికి నామినేషన్ వేయగా, ఉపసంహరించుకోవాలని గుర్తుతెలియని వ్యక్తులు దళం పేరిట గురువారం తుపాకీతో బెదిరించి లేఖ అందజేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ డీఎస్పీ వహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోశ్కుమార్, చింతలమానెపల్లి ఎస్సై ఇస్లావత్ నరేశ్ విచారణ చేపట్టారు. అనంతరం దర్శన కుటుంబానికి రక్షణగా రణవెల్లిలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇంటి వద్ద ప్రతినిత్యం ఒక ఏఎస్సై లేదా హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. గుండెపోటుతో సర్పంచ్ అభ్యర్థి మృతిమహబూబాబాద్ రూరల్ /ములకలపల్లి: కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మహబూబాబాద్ మండలం నడివాడ సర్పంచ్గా రాగిపాటి బుచ్చిరెడ్డి (70) బరిలో ఉన్నాడు. సోమవారం రాత్రి వరకు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటికి వచ్చిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను చికిత్స నిమిత్తం మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. గుండెపోటుతో వార్డు అభ్యర్థి మృతి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు ఇనుగంటి నాగప్రసాద్ (57) నర్సా పురం పంచాయతీలోని 8వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. మంగళవారం ఉదయం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబీకులు ఆస్పత్రికి తరలించేలోగా మృతి చెందాడు. పంచాయతీ ప్రచారంలో మహిళలు...ఖాళీగా పల్లె వెలుగు బస్సులు కోదాడ: నిత్యం రద్దీతో ఉండే పల్లె వెలుగు బస్సు లకు పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రయాణి కుల సంఖ్య తగ్గింది. పది రోజుల క్రితం వరకు కా లు పెట్టడానికి కూడా స్థలం ఉండేది కాదు. గ్రామా ల్లో ఎన్నికల ప్రచారంలో మహిళలు ముమ్మరంగా పాల్గొంటుండటంతో బస్సుల్లో ప్రయాణించేవారు బాగా తగ్గిపొయారు. ప్రచారానికి వెళ్లేవారికి రోజు కు రూ.500 వరకు ఇస్తుండడం కూడా ఓ కారణం. పంచాయతీ ఎన్నికల హడావుడి ప్రారంభం కాక ముందు సూర్యాపేట జిల్లా కోదాడ ఆర్టీసీ డిపోలో ఉన్న పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో వంద శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉండేదని.. ప్రస్తుతం అది సగానికి పడిపోయిందని ఆర్టీసీ వర్గాలు అంటు న్నాయి. ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో ఆర్టీసీ అధికారులు రోజువారి ట్రిప్పుల సంఖ్యను కూడా కుదించారు.అవినీతి కన్నా.. అడుక్కు తినడం మిన్నవరంగల్లో యాచకులతో వినూత్న ర్యాలీహన్మకొండ చౌరస్తా: ‘అవినీతి కన్నా.. అ డుక్కు తినడం మి న్న ’అంటూ జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ, లోక్సత్తా ఉద్యమ సంస్థ సంయుక్త ఆధ్వ ర్యంలో మంగళవారం వరంగల్లో యాచకుల తో కలిసి ర్యాలీ నిర్వ హించారు. వేయిస్తంభాల ఆలయం నుంచి హనుమకొండలోని అంబేడ్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగింది. లోక్సత్తా ఉభయ తెలుగు రాష్టాల అధ్యక్షుడు బండారు రామ్మోహన్రావు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జ్వాల సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిఘా వేదిక కన్వీనర్ వీవీ రావు, లోక్సత్తా సంస్థ సభ్యు డు శ్రీనివాసరెడ్డి, ఎల్బీ కళాశాల ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.ఫ్యామిలీ పంచాయతీ హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం సూద న్పల్లి సర్పంచ్ పదవికి పోటీలో తల్లీకూతురుతోపాటు అల్లుడి అన్న కోడలు రంగంలో ఉన్నారు. సూదన్పల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయ్యింది. అయితే ఆరుగురు పోటీలో ఉన్నారు. వీరిలో తల్లీకూతురు ఆకారపు లచ్చమ్మ, తిక్క శైలజతోపాటు తిక్క మాధవి (శైలజ భర్త సోదరుడి కోడలు) కూడా నామినేషన్ దాఖలు చేశారు. కాగా, ఆకారపు లచ్చమ్మ 2006–2011 వరకు సర్పంచ్గా పనిచేశారు.పంపిణీకి కాదేది అనర్హం పర్వతగిరి/సంగెం: పంచాయతీ ఎన్నికల ప్రలోభాల్లోనూ చిత్ర విచిత్రాలు జరుగు తున్నాయి. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో మహిళలను ఆకట్టు కునేందుకు ముగ్గు, చాయ్పత్త ఉచితంగా ఇస్తున్నారు. చేపలు కూడా పంపిణీ చేస్తున్నారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్లవాయి నుంచి రేషన్ బియ్యాన్ని తన సొంత ట్రాక్టర్లో తీసుకొచ్చి గ్రామంలో పంపిణీ చేసేలా చూస్తానని వరంగల్ జిల్లా సంగెం మండలం ముమ్మడివరం సర్పంచ్ అభ్యర్థి ఇజ్జగిరి అశోక్ ఓటర్లకు హామీ ఇస్తూ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. -
తెలంగాణ: ఎల్లుండి దాకా మందు బంద్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆ ప్రాంతాల్లో ఎల్లుండి సాయంత్రం దాకా మందు బంద్ కానుంది. మొదటి విడత పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడమే అందుకు కారణం. ఇందుకు సంబంధించి ఎన్నికల ప్రచారం.. నేటి సాయంత్రంతో ముగిసింది. తెలంగాణ వ్యాప్తంగా .. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం నేటితో (మంగళవారం, డిసెంబర్ 9)ముగిసింది. సాయంత్రం నుంచి మైకులు మూగబోగా.. ఎల్లుండి సాయింత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బెల్ట్ షాపులు బంద్ కానున్నాయి. కాదని తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. బ్లాకుల్లో అమ్మడం, మద్యం పంపిణీపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎల్లుండి(గురువారం, డిసెంబర్ 11న) మొదటి విడత 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతర ఓటర్లు ఉన్నారు. మొదటి విడతలో 37వేల 562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వెల్లడించింది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, అనంతరం ఫలితాలు వెల్లడించనున్నారు. -
415 సర్పంచ్లు ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, 415 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ విడతలో 38,322 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా, 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మొత్తంగా 78,158 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఏకగ్రీవాల్లో కామారెడ్డి టాప్ రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల్లో కామారెడ్డి జిల్లా అగ్ర స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 197 పంచాయతీలుండగా, అత్యధికంగా 44 ఏకగ్రీవమయ్యాయి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాలో 196 పంచాయతీలకు 38, నల్లగొండ జిల్లాలో 282 పంచాయతీలకు 38 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లానే టాప్లో నిలిచింది. ఈ జిల్లాలో 1,654 వార్డులుండగా, 776 ఏకగ్రీవమయ్యాయి.నిజామాబాద్ జిల్లాలో 1,760 వార్డులకు 674, నల్లగొండ జిల్లాలో 2,418 వార్డులకు 553 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కాగా, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా కేవలం ఒక సర్పంచ్, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో కేవలం 2 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. \రెండో విడతలో 10 శాతం పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. మిగిలిన చోట్ల హోరాహోరీ పోరు నెలకొంది. సర్పంచ్ స్థానానికి ముగ్గురు నుంచి నలుగురు, వార్డుకు సగటున ఇద్దరు నుంచి ముగ్గురు పోటీ పడుతున్నారు. రెండో విడత పోలింగ్ 14వ తేదీన జరగనుండగా, అదే రోజు విజేతలను ప్రకటిస్తారు. మూడోవిడత నామినేషన్ల లెక్క తేలగా.. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయ్యింది. 9న ఉపసంహరణ ఉంటుంది. సండే స్పెషల్.. చికెన్ టోకెన్స్ లింగాలఘణపురం: జనగామ జిల్లా లింగాలఘణపురం మండల కేంద్రంలోని ఓ వార్డు అభ్యర్థి తమ ఓటర్లకు ఆదివారం స్పెషల్గా చికెన్ టోకెన్స్ అందజేశాడు. రెండు చికెన్ సెంటర్లను ఎంచుకొని శనివారం రాత్రే వారికి టోకెన్లు అందజేశాడు. దీంతో ఆ వార్డు ఓటర్లు ఉదయం చికెన్ సెంటర్లకు వెళ్లి అభ్యర్థి రాసి ఇచి్చన టోకెన్ చూపించి చికెన్ తెచ్చుకున్నారు.ఇదీ ఎన్నికల సండే స్పెషల్ చికెన్ అంటూ ఆరగించారు. జనాభా కన్నా ఓటర్లే ఎక్కువట గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని పలు గ్రామాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎన్నికల సందర్భంగా అధికారులు విడుదల చేసిన జనాభా, ఓటర్ల వివరాలు విస్మయాన్ని కలిగిస్తున్నాయి. సూర్యతండా గ్రామ జనాభా 498 మంది, ఓటర్లు 499 మందిగా ఉంది. అంటే అధికారుల లెక్కల ప్రకారం జనాభా కన్నా ఓటర్లే ఎక్కువ అన్నమాట. అలాగే కొనాయమాకుల గ్రామపంచాయతీ జనాభా 850, ఓటర్లు 916 మంది, గంగదేవిపల్లి జనాభా 1,080, ఓటర్లు 1,118 మంది ఉన్నట్టు అధికారులు రూపొందించిన క్లస్టర్ల వారీ జనాభా, ఓటర్ల జాబితాలో నమోదై ఉంది. గెలిపిస్తే.. ఐదేళ్లు కేబుల్ కనెక్షన్ ఉచితం నర్సాపూర్ రూరల్: సర్పంచ్గా గెలిపిస్తే ఐదేళ్లు కేబుల్ టీవీ కనెక్షన్ ఉచితంగా ఇస్తానని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నత్నయ్యపల్లి సర్పంచ్గా పోటీ చేస్తున్న కేబుల్ టీవీ ఆపరేటర్ నీలి బిక్షపతి ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసి ప్రచారం ప్రారంభించాడు. మహిళలకు కుట్టు మెషీన్ల పంపిణీతో పాటు టైలరింగ్ శిక్షణ ఇప్పిస్తానని, ప్రతి వీధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తానని చెప్పాడు. ఏకగ్రీవ సర్పంచ్గా ఎమ్మెల్యే కౌసర్ భార్య వెల్దుర్తి: కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహినొద్దీన్ సతీమణి, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్ నజ్మాసుల్తానా సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ స్థానానికి నజ్మాసుల్తానాతోపాటు కాసాల ఇందిర నామినేషన్ వేశారు. అయితే కాసాల ఇందిర తన నామినేషన్ను విత్ డ్రా చేసుకోవడంతో నజ్మా సుల్తానా సర్పంచ్గా ఏకగ్రీవం కానున్నారు. ఎమ్మెల్యే పెద్ద కుమారుడు అప్సర్ 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బస్వాపూర్ నుంచి సర్పంచ్గా పోటీ చేసి 63 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అదే గ్రామంలోనే ఇప్పుడు తల్లి ఏకగ్రీవ సర్పంచ్ అయ్యారు. -
చిన్న భార్య విత్డ్రా...పెద్ద భార్య ఏకగ్రీవ సర్పంచ్
మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవికి నర్సింహారెడ్డి ఇద్దరు భార్యలు లావణ్య, రజిత నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా. శనివారం రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండటంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. పంచాయతీ పరిధిలోని 10 వార్డులు కూడా ఏకగ్రీవమయ్యాయి.భర్త నామినేషన్ రిజెక్ట్.. భార్య అభ్యర్థిత్వానికి ఓకేస్కూల్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు వదిలి... ఇబ్రహీంపట్నం రూరల్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ బింగి రాములయ్య ఓ రాజకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. మరో పది నెలల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 30న తన రాజీనామా పత్రాన్ని డీఈఓ సుశీందర్రావుకు అందజేశారు. రాములయ్య సతీమణి బింగి గీత సైతం ఇదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఈనెల 5న తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పీడీకి లేఖ అందజేశారు. అనంతరం ఆమె కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గీత రాజీనామాకు సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసీ జారీ కాగా, ఆమె అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. కానీ, విద్యాశాఖ నుంచి రాములయ్యకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
చెప్పులు మెడలో వేసుకుంటా..!
మానకొండూర్: ‘తాను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకపోతే ప్రతీకులానికో చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతా’అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి అభయం ఇచ్చారు. ఇందుకోసం రూ.వంద విలువైన బాండ్పేపర్పై హామీలను రాసిచ్చారు. డబ్బులు, మద్యం పంచకుండా తనలాగే మేనిఫెస్టో విడుదల చేసి కేవలం ఓట్లు అడగాలని తన ప్రత్యర్థులను వేడుకున్నారు.ఆడబిడ్డ పుడితే రూ.10,016 వేములవాడ అర్బన్: గ్రామస్తులకు ఆడబిడ్డ పుడితే రూ.10,016 కట్నంగా అందిస్తానని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు హామీ ఇస్తున్నాడు. తనను గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్నాడు.ఓటరులో చైతన్యంబొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పలువురు మహిళలు.. ‘మా ఓట్లను మద్యానికి, డబ్బులకు, బహుమతులకు అమ్ముకోము. నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకుంటాం’అని పలకలపై రాసి తమ ఇంటి గేటుకు పెట్టుకున్నారు. -
మూడో విడతలోనూ భారీగా నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: మూడో విడతలో 4,158 సర్పంచ్లు, 36,442 వార్డులకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే 11 చోట్ల సర్పంచ్ పదవులకు ఆయా జిల్లాల్లో 100 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నాగర్కర్నూల్ జిల్లాలోని 158 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా ఆరు చోట్ల, 1,364 వార్డులకు 44 చోట్ల అభ్యర్థులెవరూ నామినేషన్ వేయలేదు. కొమురంభీం జిల్లాలో రెండు సర్పంచ్, 6 వార్డుల్లో నామినేషన్లు, ఖమ్మం జిల్లాలో ఒక సర్పంచ్, 9 వార్డులకు నామినేషషన్లు పడలేదు. వీటిని మినహాయించగా, 4,147 సర్పంచ్ పదవులకు 27,277 నామినేషన్లు, 36,342 వార్డులకు 89,603 నామినేషన్లను అభ్యర్థులు సమర్పించారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే మూడోవిడతలో ఒక్కో సర్పంచ్ స్థానానికి ఆరున్నర మంది పోటీపడుతున్నారు. వార్డుల విషయానికొస్తే పోటీ కొంత తక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ ముగిశాక పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు గ్రామపంచాయతీల్లోని నోటీస్ బోర్డుల్లో ప్రదర్శిస్తారు. ఈ విడతలోనూ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 269 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా 1,962 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఇదే జిల్లాలోని 2,206 వార్డులకు 5,606 మంది నామినేషన్లు సమర్పించారు. ముగిసిన రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ఈ నెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణల గడువు ముగిసింది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాకు సంబంధించి ఇంకా పూర్తిస్పష్టత రాలేదు. ఉపసంహరణలు ముగిశాక ఈ విడతలో ఏకగ్రీవమైన సర్పంచ్ పదవులు, వార్డులకు సంబంధించిన సమీక్ష నిమిత్తం జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) సమయం ఇచ్చింది. ఈ ఉపసంహరణలు ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర ఒత్తిళ్లు లేకుండా జరిగాయా లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే ఏకగ్రీవాలను ప్రకటించనున్నారు. దీంతో ఏకగ్రీవమైన సర్పంచ్, వార్డు సభ్యుల సంఖ్య, వివరాలు ఆదివారమే వెల్లడవుతాయని ‘సాక్షి’కి ఎస్ఈసీ అధికారులు వెల్లడించారు. -
పంచాయతీలో ఫ్యామిలీ స్కెచ్
స్థానికంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఫ్యామిలీ స్కెచ్లు అనేకం ఉంటాయి. ప్లాన్ ఏ, ప్లాన్ బీ అన్నట్టుగా పక్కా ప్రణాళికతో ఎన్నికల బరిలో నిలుస్తారు. నామినేషన్లు ఎక్కడా రిజెక్ట్ కాకుండా పెద్ద కసరత్తే చేస్తారు. ఒకవేళ నామినేషన్ రిజెక్ట్ అవుతుందోనని భావించి తమ కుటుంబసభ్యులతో కూడా ఒకటి రెండు నామినేషన్లు వేయిస్తారు. అన్నీ పక్కాగా ఉంటే మరొకరి నామినేషన్ విత్ డ్రా చేయిస్తారు. ఒకవేళ రిజెక్ట్ అయితే మరొకరు పోటీలో ఉంటారు.బండి కాని...బండి దుబ్బాకటౌన్: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓ మహిళ సర్పంచ్ అభ్యర్థి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా ఆటోకు రెండు బండి చక్రాలను జోడించి ఎడ్ల బండి మాదిరిగా తయారు చేయించారు. ముందు రెండు ఎడ్ల బొమ్మలను, వెనకాల ఆవు దూడలను జోడించి అందరినీ ఆకట్టుకునేలా తయారు చేయించారు.ఓటరులో చైతన్యంబొమ్మలరామారం: యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని జలాల్పూర్ గ్రామంలో పలువురు మహిళలు.. ‘మా ఓట్లను మద్యానికి, డబ్బులకు, బహుమతులకు అమ్ముకోము. నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకుంటాం’అని పలకలపై రాసి తమ ఇంటి గేటుకు పెట్టుకున్నారు.మాజీమంత్రి తండ్రి సర్పంచ్గా పోటీతిరుమలగిరి: మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి సూర్యాపేట జిల్లా నాగారం గ్రామ సర్పంచ్గా పోటీలో ఉన్నారు. 95 సంవత్సరాల వయసున్న రామచంద్రారెడ్డి బీఆర్ఎస్ మద్దతుతో బరిలో నిలిచారు. గతంలో జగదీశ్రెడ్డి సోదరుడు రమేశ్రెడ్డి భార్య మాణిమాల నాగారం మండలం డి.కొత్తపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది నాగారం వైస్ ఎంపీపీగా పనిచేశారు.హామీలు పూర్తి చేయకపోతే చెప్పులు మెడలో వేసుకుంటాబాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్థి మానకొండూర్: ‘తాను సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామాభివృద్ధి కోసం వాగ్దానం చేసిన హామీలను నెరవేర్చకపోతే ప్రతీకులానికో చెప్పు నా మెడలో వేసుకొని బహిరంగంగా రాజీనామా చేసి వెళ్లిపోతా’అని కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల సర్పంచ్ అభ్యర్థి గుమ్మడవెల్లి రాజేశ్వరి అభయం ఇచ్చారు. ఇందుకోసం రూ.వంద విలువైన బాండ్పేపర్పై హామీలను రాసిచ్చారు. డబ్బులు, మద్యం పంచకుండా తనలాగే మేనిఫెస్టో విడుదల చేసి కేవలం ఓట్లు అడగాలని తన ప్రత్యర్థులను వేడుకున్నారు.ఆ ముంపు గ్రామాలకు ఇవే చివరి ఎన్నికలుసాక్షి, యాదాద్రి: భువనగిరి మండలం పరిధిలో నిర్మిస్తున్న నృసింహ సాగర్ (బస్వాపురం) రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న భువన గిరి మండలంలోని బీఎన్ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్తండా, తుర్కపల్లి మండలం చౌక్లాతండా గ్రామ పంచాయ తీలకు ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. ప్రభుత్వం సకాలంలో పరిహా రం చెల్లించకపోవడంతో ప్రజలు ఆ గ్రామాలను ఇంకా ఖాళీ చేయలేదు. దీంతో అక్కడే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. లప్పానాయక్తండా సర్పంచ్ పదవితో పాటు 8 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. చౌక్లాతండా సర్పంచ్గా రాజారాంనాయక్తోపాటు 6 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. తిమ్మాపురం సర్పంచ్గా ఎడ్ల వెంకట్రెడ్డి, 1,3, 4, 7, 9 వార్డులు ఏకగ్రీవంగా కాగా, 5 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.చట్టప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాంముంపు గ్రామాలకు చట్ట ప్రకారం పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తాం. ముంపు తర్వాత గ్రామాన్ని ఎక్కడకు మార్చాలన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఐదేళ్ల కాలానికి సర్పంచ్, వార్డు సభ్యులను ప్రజలు ఓట్ల ద్వారా ఎన్నుకుంటారు. ముంపు గ్రామాల్లో పక్కా నిర్మాణాలు కొత్తగా చేపట్టం. – విష్ణువర్ధన్ రెడ్డి, డీపీఓభర్త నామినేషన్ రిజెక్ట్.. భార్య అభ్యర్థిత్వానికి ఓకేస్కూల్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు వదిలి... ఇబ్రహీంపట్నం రూరల్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. దీంతో గ్రామానికి చెందిన స్కూల్ అసిస్టెంట్ బింగి రాములయ్య ఓ రాజకీయ పార్టీ మద్దతుతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేశారు. మరో పది నెలల సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ కోసం ప్రయత్నించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 30న తన రాజీనామా పత్రాన్ని డీఈఓ సుశీందర్రావుకు అందజేశారు. రాములయ్య సతీమణి బింగి గీత సైతం ఇదే గ్రామంలో అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నారు. ఈనెల 5న తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇబ్రహీంపట్నం ఐసీడీఎస్ పీడీకి లేఖ అందజేశారు. అనంతరం ఆమె కూడా సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గీత రాజీనామాకు సంబంధిత శాఖ నుంచి ఎన్ఓసీ జారీ కాగా, ఆమె అభ్యర్థిత్వానికి మార్గం సుగమమైంది. కానీ, విద్యాశాఖ నుంచి రాములయ్యకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అందకపోవడంతో ఆయన నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
సర్పంచ్ బరిలో సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని
సిద్ధిపేట జిల్లా: హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పంచాయతీ రాజకీయాల్లో అరుదైన పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా గ్రామ సర్పంచ్ పదవికి రైతులు, స్థానిక నాయకులు పోటీ చేస్తుంటే, ఈసారి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని బరిలోకి దిగడం గ్రామంలో చర్చనీయాంశమైంది. జిల్లెలగడ్డ పంచాయతీకి చెందిన లావుడ్య రవీందర్ సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్నారు. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీని నడుపుతున్నారు. బీటెక్, ఎంబీఏ చదివిన రవీందర్.. కొన్నాళ్ల పాటు విదేశాల్లో ఉద్యోగం చేశారు. హైదరాబాద్ వచ్చి సొంతంగా కంపెనీ పెట్టారు.ప్రస్తుతం కంపెనీ బాధ్యతలు చూస్తోన్న రవీందర్ సర్పంచ్ బరిలో నిలవాలని భావించారు. జిల్లెలగడ్డ గ్రామ సర్పంచ్ పదవిని.. ఈ సారి ఎస్టీ జనరల్కు కేటాయించారు. ఉన్నత చదువులు చదివి.. విదేశాల్లో కొలువు చేసి.. ఇప్పుడు సొంతంగా కంపెనీ నడుపుతున్న లావుడ్య రవీందర్.. సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. రవీందర్ శుక్రవారం తన నామినేషన్ను డప్పుల చప్పుళ్లతో, కుటుంబ సభ్యులు, మద్దతుదారులతో కలిసి దాఖలు చేశారు. ఉన్నత చదువులు చదివి, విదేశాల్లో ఉద్యోగం చేసి, ఇప్పుడు గ్రామ అభివృద్ధి కోసం రాజకీయ రంగంలోకి రావడం గ్రామస్తుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి సర్పంచ్గా వస్తే గ్రామానికి కొత్త ఆలోచనలు, అభివృద్ధి అవకాశాలు వస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.అప్పుడే కండువాలు కప్పుతాం..హుస్నాబాద్: సర్పంచ్ ఎన్నికల్లో ఎవరు గెలిచి వస్తే వారే మావాళ్లు.. అధికార పార్టీ కండువ కప్పుకోవాలని వెళ్లిన అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ పెడుతున్న షరతులివి. ‘గెలిచి రండి.. అప్పుడే కండువాలు కప్పుతాం’ అని కాంగ్రెస్ అధిష్టానం చెబుతోంది. అధికార పార్టీ మద్దతు ఉంటే ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. మూడో విడత సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల స్వీకరణకు శుక్రవారం చివరి రోజు కావడంతో నామినేషన్ కేంద్రాల వద్ద పోటీదారుల సందడి నెలకొంది. హుస్నాబాద్ మండలంలో 17 జీపీలు, 140 వార్డులు, అక్కన్నపేట మండలంలో 38 జీపీలు, 306 వార్డులు, కోహెడ మండలంలో 27 జీపీలు, 244 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. పోటీదారులు తమ బలాన్ని నిరూపించుకునేందుకు భారీ ర్యాలీలతో వచ్చి నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని పల్లెల్లో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ఇద్దరు, ముగ్గురు సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారే ప్యానల్ను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వర్గాలుగా విడిపోయింది. నచ్చిన వారికి మద్దతు తెలుపుతున్నారు. ఎవరు అధికార పార్టీ వారో తెలియక కార్యకర్తలు అయోమయోంలో పడుతున్నారు. ఎవరు గెలిచినా మా వద్దకే వస్తారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. పలాన వ్యక్తి మా అభ్యర్థి అని ప్రకటిస్తే మిగతా వారు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే అధికార పార్టీ కండువా కప్పడానికి సమ్మతించడం లేదు. -
వదిన, మరిది మధ్య పంచాయతీ పోరు
మంచిర్యాలరూరల్(హాజీపూర్): హాజీపూర్ గ్రామ పంచాయతీలో ఈ నెల 11న జరగనున్న పంచా యతీ ఎన్నికల్లో వదిన, మరిది మ ధ్య రసవత్తర పోరు సాగుతోంది. హాజీపుర్కు చెందిన మాధవరపు రామారావు భార్య శ్రీలత బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా రామారావు సోదరుడు వెంకటరమణారావు బీజేపీ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వదిన, మరిది మధ్య జరుగుతున్న పోరులో ప్రజలు ఎవరిని ఆదరిస్తారో వేచి చూడాల్సిందే.బరిలో తోడికోడళ్లు...మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.సర్పంచ్గా నాడు భర్త.. నేడు భార్యదండేపల్లి: 2019 పంచాయతీ ఎన్నికల్లో మండలంలోని మామిడిపల్లి సర్పంచ్గా ఎల్తపు శ్రీనివాస్ గెలుపొందాడు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో సర్పంచ్స్థానం జనరల్ మహిళకు రిజర్వు కావడంతో శ్రీనివాస్ తన భార్య ఎల్తపు వైష్ణవిని బరిలో నిలిపాడు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ రోజున సమీప ప్రత్యర్థి గుర్రాల మాధవి తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో వైష్ణవి ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. -
సర్పంచ్ కుర్చీ డ్రామా: చివరికి సర్పంచ్గా రాణి
గద్వాలటౌన్ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా.. ఒకరు పాటపాడితే.. పదవి మరొకరు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గద్వాల మండలం ఈడిగోనిపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలోని ఆలయ అభివృద్ధికి గ్రామస్తులంతా కలిసి సర్పంచ్ స్థానానికి గత వారం వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన రాఘవేంద్ర తన భార్య సరస్వతిని సర్పంచ్ చేయడానికి రూ.9.80 లక్షలు పాట పాడి దక్కించుకోవడమేగాక అడ్వాన్స్గా రూ.లక్ష గ్రామస్తులకు అందజేశారు. వేలం ముగిసిన తర్వాత సరస్వతి సర్పంచ్ అంటూ సంబరాలు నిర్వహించి సన్మానాలు చేశారు. ఉపసర్పంచ్ ఎంపిక విషయంలో కొంత బేధాభిప్రాయాలు తలెత్తి నామినేషన్ల పర్వంలో గందరగోళం నెలకొంది. మరుసటి రోజే నామినేషన్కు తుది గడువు ఉండటంతో వేలం పాడిన వారితో పాటు వార్డు సభ్యులకు వారి ప్యానల్ నుంచి ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీన్ని గమనించి గ్రామానికి చెందిన రమేష్ తన భార్య రాణి పేరుతో సర్పంచ్ పదవికి, వారి ప్యానల్ నుంచి వార్డు సభ్యులకు నామినేషన్లు వేయించారు. సింగిల్ నామినేషన్ దాఖలు కావడంతో రాణి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేశా రు. వేలం డబ్బులు ఎన్నికైన సర్పంచ్ చెల్లించా లని కొందరు గ్రామస్తులు పట్టుబడుతున్నా రు. అనుకున్నది ఒక్కటి.. అయినదొక్కటి అంటూ గ్రామస్తులు కూనిరాగాలు తీస్తున్నారు. -
సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన ట్రాన్స్ జెండర్
జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఇదే పంచాయతీ పరిధిలోని దుబ్బపల్లికి చెందిన ట్రాన్స్జెండర్ కుమ్మరి వైశాలి పోటీ చేస్తోంది. జనరల్ మహిళకు రిజర్వు అయిన ఈ స్థానం నుంచి గురువారం జైపూర్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేసింది. ప్రజలు తనను సర్పంచ్గా గెలిపిస్తే ప్రభుత్వ నిధులతో ఆదర్శగ్రామాలుగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చింది. బరిలో తోడికోడళ్లు...మంచిర్యాలరూరల్(హాజీపూర్): మండలంలోని టీకానపల్లి పంచాయతీలో తోడికోడళ్లు సర్పంచ్ పదవికోసం పోటీ పడుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన బద్రి రమేశ్ భార్య సౌజన్య బీఆర్ఎస్ పార్టీ బలపరుస్తున్న సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలవగా అతని సోదరుడు బద్రి వేణు భార్య లక్ష్మి బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీలో ఉంటోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిగా మాధవరపు శైలజ పోటీలో ఉంది. మరి ముగ్గురిలో విజయం ఎవరిని వరిస్తుందోనని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వార్డుసభ్యుల బరిలో దంపతులులక్ష్మణచాంద: దంపతులిద్దరూ వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారు. మండల కేంద్రంలోని 4 వార్డు సభ్యురాలిగా ఆప్క వనజ పోటీ చేస్తుండగా ఆమె భర్త ఆప్క సంతోష్ 8వ వార్డు సభ్యుడిగా బరిలో నిలిచారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకేసారి వేరువేరు వార్డుసభ్యులుగా పోటీ చేయడం మొదటిసారి అని పలువురు చర్చించుకుంటున్నారు. -
భారీ ర్యాలీ: 22 ఫార్చ్యూనర్లతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్
కార్ల కాన్వాయ్తో హల్చల్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్నగర్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవియాదవ్ హల్చల్ చేశారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మహ్మద్నగర్ నుంచి కౌడిపల్లి వరకు 22 ఫార్చ్యూనర్ కార్లతో పాటు మరికొన్ని కార్లతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఇది మండలంలో చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధికి కట్టుబడతానంటూ.. ‘అక్రమాలకు పాల్పడితే ఆస్తి జప్తు చేసుకోవచ్చ ని బాండ్ పేపర్ మీ చేతిలో పెడు తున్నా ..’ అని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణిఅన్నీ ఏకగ్రీవమే.. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని 8 వార్డులకు గాను 1నుంచి 3 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో..ఈ మూడు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్లు వేశారు. అయితే ఒకరు అభ్యర్థి కులం ధ్రువీకరణ పత్రం (ఎస్టీ) జత పరచలేదు. మరో ఆరుగురు ప్రకటనదారు (అభ్యర్థి) స్థానంలో సాక్షి సంతకాలు చేయడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో మిగిలిన ఐదు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. -
గెలిపిస్తే.. ప్రతి ఇంటికి వైఫై
సంగారెడ్డి టౌన్: ఒకప్పుడు పల్లెల్లో రాజకీయాలంటే పెద్దల పెత్తనాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆ రోజులు పోయాయి. గ్రామ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసేందుకు యువత ముందుకు వస్తున్నారు. ఇది ఎన్నికల ఉత్సాహం మాత్రమే కాదు, గ్రామాల్లో నాయకత్వ మార్పునకు, అభివృద్ధిలో భాగస్వామ్యానికి యువత ముందుకు వస్తున్నామని చెబుతున్నారు. సంగారెడ్డి మండలంలోని 11 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులుగా అక్కడక్కడ యువకులు పోటీ పడుతున్నారు. మండలంలోని పసల్వాది గ్రామంలో 27 ఏళ్ల యువకుడు హరి ప్రసాద్ ముదిరాజ్ ఎంబీఏ పూర్తి చేశాడు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. పంచభూతాల సాక్షిగా ఐదు హామీలు అంటూ మ్యానిఫెస్టో విడుదల చేశాడు. పట్టణాలకు దీటుగా తన గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని సరికొత్తగా ఎన్నికల వ్యూహాన్ని రచించి ముందుకు వెళుతున్నాడు. తాను గెలిస్తే గ్రామంలో ఇంటింటికి ఉచిత వైఫై, విద్యార్థులకు ట్యాబ్లు, యువతకు ఉపాధి, మహిళలకు ఉపాధి శిక్షణ, గ్రామంలో బస్సులు ఆగేలా బస్ స్టాప్, వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తానని సరికొత్త మ్యానిఫెస్టోను రూపొందించుకొని ప్రచారం నిర్వహిస్తున్నాడు. దీంతో మండల వ్యాప్తంగా ఈ యువకుడి ప్రచారం ఆసక్తిని కలిగిస్తోంది. -
పల్లె ప్రచారం కొత్త పుంతలు
సాక్షి, నెట్వర్క్: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులు వినూత్న రీతుల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ‘ఉచితం’ ఎరలు తెరపైకి వస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు కొందరు అభ్యర్థులు ‘ఫ్రీ’ అంటూ గాలం వేస్తున్నారు. మరికొందరు తమ వాగ్దానాలకు సంబంధించి బాండ్లు సైతం రాసిస్తుండటం విశేషం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ప్రచారం సాగిన తీరు, తాజా పరిణామాలకు సంబంధించిన కొన్ని ముఖ్యాంశాలు.. సోలార్ ప్యానెల్..డిజిటల్ స్క్రీన్ సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో సర్పంచ్ అభ్యర్థి చిల్లంచర్ల విద్యాసాగర్.. ప్రత్యేకంగా సైకిల్కు డిజిటల్ స్క్రీన్, సోలార్ ప్యానల్ బిగించి లైటింగ్ ఏర్పాటు చేసుకుని మరీ ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం అర్వపల్లిలోని వై జంక్షన్లో డిజిటల్ స్క్రీన్ ద్వారా ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం సాగించారు. ఫ్రీ వైఫై, టీవీ చానల్స్.. బాండ్ రాసి మరీ.. నిన్న ఒకాయన నా భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానంటూ ఇచ్చిన హామీ చూసి స్ఫూర్తి పొందాడో..ఏమో.. ములుగు జిల్లా ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా గెలిపిస్తే ఐదేళ్ల పాటు గ్రామంలోని ప్రజలకు వైఫై, టీవీ ఛానల్స్ను ఉచితంగా ఇస్తానంటూ.. బీజేపీ బలపర్చిన అభ్యర్థి వినుకోలు ధనలక్ష్మి చక్రవర్తి హామీ ఇచ్చారు. ఈ మేరకు బాండ్ పేపర్ సైతం రాసి ప్రజలకు ఇచ్చారు. ఉచితంగా ఇస్తాననడంతో పాటు బాండ్ కూడా రాసివ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అభివృద్ధికి కట్టుబడతానంటూ.. ‘అక్రమాలకు పాల్పడితే ఆస్తి జప్తు చేసుకోవచ్చ ని బాండ్ పేపర్ మీ చేతిలో పెడు తున్నా ..’ అని సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట సర్పంచ్ అభ్యర్థి చేర్యాల వాణి గ్రామ ప్రజలకు చెప్పారు. గ్రామానికి సేవకురాలిగా పని చేస్తానని, ఏ పార్టీకి కొమ్ము కాయకుండా గ్రామాభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని ఆ బాండ్ పేపర్లో వాణి పేర్కొన్నారు. 100 రోజుల్లో అన్నీ.. లేకుంటే రాజీనామా పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను.. సర్పంచ్గా గెలిచిన తర్వాత వంద రోజుల్లో నెరవేర్చకుంటే పదవికి రాజీనామా చేస్తానంటూ ఓ అభ్యర్థి బాండ్ పేపర్పై సంతకం పెట్టి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్ అభ్యర్థి బిట్ల విజయలక్ష్మి మహేశ్ బాండ్ పేపర్ పై సంతకం చేసి మరీ ఓటర్లను ఆకర్షించేలా ప్రచారం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు 100 రోజుల్లో అమలు చేయకుంటే సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేయడం స్థానికుల్ని ఆకట్టుకుంటోంది. ఈ మేరకు వాల్ పోస్టర్లు సైతం ప్రింట్ చేశారు. అన్నీ ఏకగ్రీవమే.. జనగామ జిల్లా నర్మెట మండలం సూర్యబండ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని 8 వార్డులకు గాను 1నుంచి 3 వార్డులకు ఒక్కో నామినేషన్ దాఖలు కావడంతో..ఈ మూడు వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 5 వార్డులకు 12 మంది నామినేషన్లు వేశారు. అయితే ఒకరు అభ్యర్థి కులం ధ్రువీకరణ పత్రం (ఎస్టీ) జత పరచలేదు. మరో ఆరుగురు ప్రకటనదారు (అభ్యర్థి) స్థానంలో సాక్షి సంతకాలు చేయడంతో ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో మిగిలిన ఐదు వార్డు స్థానాలు కూడా ఏకగ్రీవమయ్యాయి. కార్ల కాన్వాయ్తో హల్చల్ మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మహ్మద్నగర్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రవియాదవ్ హల్చల్ చేశారు. శుక్రవారం తన మద్దతుదారులతో కలిసి మహ్మద్నగర్ నుంచి కౌడిపల్లి వరకు 22 ఫారŠూచ్యనర్ కార్లతో పాటు మరికొన్ని కార్లతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఇది మండలంలో చర్చనీయాంశంగా మారింది. పొంగులేటి స్వగ్రామం.. మళ్లీ అంతా ఏకగ్రీవంరాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని నారాయణపురం గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది. నామినేషన్ల దాఖలు గడువు శుక్రవారంతో ముగియగా సర్పంచ్ సహా పది వార్డుసభ్యుల స్థానాలకు ఒక్కో నామినేషనే దాఖలైంది. సర్పంచ్గా గొల్లమందల వెంకటేశ్వర్లును గ్రామస్తులు, అన్నివర్గాల ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. గ్రామానికి చెందిన పొంగులేటి మహేందర్రెడ్డి, పొంగులేటి ప్రసాద్రెడ్డి సమక్షంలో గ్రామస్తులంతా సర్పంచ్గా వెంకటేశ్వర్లుతో పాటు పది మంది వార్డుసభ్యులను ఎంపిక చేయగా..వారు చివరిరోజు నామినేషన్లు దాఖలు చేశారు. నారాయణపురం గ్రామ పంచాయతీ పాలకవర్గాలు గత 25 ఏళ్లుగా ఏకగ్రీవంగా ఎన్నికవుతుండటం గమనార్హం..కాగా ఈ ఆనవాయితీని గ్రామస్తులు ఈసారి కూడా కొనసాగించారు. -
ఏ జిల్లాలో ఎంతమంది ఏకగ్రీవమంటే..
సాక్షి, హైదరాబాద్: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్లు, వార్డుల సభ్యుల వివరాలను గురువారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ప్రకటించింది. వికారాబాద్ జిల్లాలో అత్యధికంగా 39 సర్పంచ్లు పోటీ లేకుండా ఎన్నిక కాగా, ఆ తర్వాత జాబితాలో వరుసగా... ఆదిలాబాద్ జిల్లాలో 166 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నోటిఫై చేయగా 33 చోట్ల ఏకగ్రీవ ఎన్నిక జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 184 స్థానాలకు 29, నల్లగొండ జిల్లాలో 318 స్థానాలకు 22, యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 సర్పంచ్లకు 16, సిద్దిపేటలో 163 స్థానాలు 16, నిర్మల్లో 136 స్థానాలకు 16, మెదక్ జిల్లాలో 160 స్థానాలకు 16 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.జోగుళాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు 15, భద్రాద్రి కొత్తగూడెంలో 159 స్థానాలకు 14, నాగర్ కర్నూల్లో 151 స్థానాలకు 14, నారాయణపేట జిల్లాలో 67 పంచాయతీలకు 14, వరంగల్ జిల్లాలో 91 స్థానాలకు 11, కామారెడ్డిలో 167 స్థానాలకు 11, జనగామలో 110 స్థానాలకు 10 సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి.రాజన్న సిరిసిల్లలో 85 సర్పంచ్లకు 9, ములుగు జిల్లాలో 48 స్థానాలకు 9, మహబూబాబాద్లో 155 స్థానాలకు 9, జయశంకర్ భూపాలపల్లిలో 82 స్థానాలకు 9, సంగారెడ్డి జిల్లాలో 136 స్థానాలకు 7, సూర్యాపేట జిల్లాలో 159 సర్పంచ్లకు 7, కొమురంభీం జిల్లాలో 114 స్థానాలకు 7, మంచిర్యాల జిల్లాలో 90 స్థానాలకు 6, రంగారెడ్డి జిల్లాలో 174 స్థానాలకు 6చోట్ల, వనపర్తిలో 87 సర్పంచ్లకు 5, హనుమకొండ జిల్లాలో 69 స్థానాలకు 4, జగిత్యాలలో 122 స్థానాలకు 4, పెద్దపల్లిలో 99 స్థానాలకు 4, కరీంనగర్ జిల్లాలో 92 సర్పంచ్లకు 3 స్థానాల్లో పోటీలేకుండా ఎన్నికయ్యారు.ఏకగ్రీవ వార్డులు ఇలా...ఆదిలాబాద్లో అత్యధికంగా 953 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా... ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 2,198 వార్డులకు 652 మంది పోటీ లేకుండా గెలిచారు. ఇక వరుసగా చూస్తే... నిజామాబాద్ జిల్లాలో 1,642 వార్డులకు 575, నిర్మల్ జిల్లాలో 1,072 వార్డులకు 471 మంది, కామారెడ్డిలో 1,520 వార్డులకు 433 మంది, నల్లగొండ జిల్లాలో 2,870 వార్డుసభ్యులకు 375 మంది, జగిత్యాల జిల్లాలో 1,172 వార్డులకు 349, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,436 వార్డులకు 336, మెదక్లో 1,402 వార్డులకు 332 మంది చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 323 మంది, కరీంనగర్ జిల్లాలో 866 స్థానాలకు 276, మంచిర్యాలలో 816 వార్డులకు 268, మహబూబాబాద్లో 1,338 స్థానాలకు 266, మహబూబ్నగర్ జిల్లాలో 1,188 వార్డులకు 264, యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,286 వార్డులకు 243, జనగామలో 1,024 వార్డులకు 228, రాజన్న సిరిసిల్లలో 748 వార్డులకు 227, సిద్దిపేట జిల్లాలో 1,432 వార్డులకు గాను 224, వరంగల్లో 800 స్థానాలకు 215 చోట్ల, పెద్దపల్లి జిల్లాలో 896 వార్డులకు 211 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.చదవండి: మూడు తరాల సర్పంచ్లునారాయణపేట జిల్లాలో 572 వార్డులకు 210, నాగర్కర్నూల్లో 1326 వార్డులకు 208, సూర్యాపేటలో 1,442 వార్డులకు 198, రంగారెడ్డిలో 1530 వార్డులకు 190, హనుమకొండ జిల్లాలో 658 వార్డులకు 153, జయశంకర్ భూపాలపల్లిలో 712 స్థానాలకు 151, ములుగులో 420 వార్డులకు 128, సంగారెడ్డి జిల్లాలో 1,246 వార్డులకు 113, వనపర్తి జిల్లాలో 780 వార్డులకు 104, జోగుళాంబ గద్వాలలో 974 వార్డులకు 79 చోట్ల పోటీ లేకుండా ఎన్నికయ్యారు.ఉపసర్పంచ్ ఎన్నికకు...ఏదైనా గ్రామపంచాయతీలోని వార్డులన్నీ ఏకగ్రీవమైన పక్షంలో పోటీచేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించిన రోజునే ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, డీపీఓలు, ఎంపీడీఓలకు ఎస్ ఈసీ సూచించింది. దీనికి సంబంధించి ముందుగా జిల్లా కలెక్టర్ల నుంచి ‘నిరభ్యంతర సర్టిఫికెట్’ తీసుకోవాలని, నిబంధనలకు అనుగుణంగా ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయాలని తెలిపింది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి, రెండు వార్డుల్లోనూ ఎన్నికలు జరగాల్సి ఉంటే, ఆ ఎన్నిక పూర్తయ్యాక ఓట్లు లెక్కించాక ఉప సర్పంచ్ ఎన్నికను చేపట్టాలని పేర్కొంది. -
'పొత్తు' విభేదాలు చిత్తు
సాక్షి నెట్వర్క్: పంచాయతీ ఎన్నికలు పార్టీలకతీతంగా జరిగేవే అయినా.. స్థానిక రాజకీయాల దృష్ట్యా పొత్తులు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. ఢిల్లీలో శత్రువులు.. గల్లీలో మిత్రులు అన్నట్టు ఉంది పంచాయతీ ఎన్నికల్లో పొడిచిన పొత్తుల పరిస్థితి.. » మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కొత్తపల్లిలో బీఆర్ఎస్ మద్దతుతో బరిలో ఉన్న అభ్యర్థిని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు చేయి కలిపారు. » ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం అనాసాగరంలో సీపీఎంకు కాంగ్రెస్ మద్దతు ఇస్తోంది. కొన్ని గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్, సీపీఎం జత కట్టాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో కొన్నిచోట్ల బీఆర్ఎస్, సీపీఐలు కలిసి నడుస్తున్నాయి. » జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గా లుగా విడిపోయింది. పాత కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు కలి సి సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టారు. నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ, నారాయణపేట జిల్లా రాకొండ, సింగారం, వనపర్తి జిల్లా పాన్ గల్ మండలంలోని రేమద్దుల, చిక్కపల్లి, షాగాపూర్, మదనా పురం మండలంలోని కొత్తపల్లి, నర్సింగాపురం, అమరచింత మండలం చంద్రగడ్లో బీఆర్ఎస్, బీజేపీ ఏకమయ్యాయి. నారాయణ పేట జిల్లా ఎక్లాస్పూర్, గోటూర్.. వనపర్తి జిల్లా అమరచింత మండలం కిష్టంపల్లిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్దతుదారులు ఏకమై పోరులో నిలిచారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలంలోని గుంటిపల్లిలో కాంగ్రెస్ మద్దతుదారు సర్పంచ్గా.. బీజేపీ మద్దతుదారు ఉప సర్పంచ్గా ఏకగ్రీవమయ్యారు. » నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పొత్తుతో పోటీ చేస్తుండగా మరికొన్ని గ్రామాల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మధ్య పోటీ నెలకొంది. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్– ఎస్ మండల కేంద్రంలో కాంగ్రెస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, సీపీ ఎం, బీజేపీ పొత్తు పెట్టుకోగా, గట్టికల్లు గ్రామంలో బీజే పీ,బీఆర్ఎస్, సీపీఎం, కందగట్ల, పాత సూర్యాపేట గ్రామాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలో ఉన్నాయి. » మంచిర్యాల జిల్లా భీమిని మండలం లక్ష్మీపూర్, కేస్లాపూర్లో కాంగ్రెస్, బీజేపీ మద్దతుదారులు అంతా కలిసే పోటీ చేస్తున్నారు. తాండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య సఖ్యత కోసం పావులు కదుపుతున్నారు.ప్రాణం తీసిన పంచాయతీ ఎన్నికలు?ఒత్తిడి తట్టుకోలేక సర్పంచ్ అభ్యర్థి భర్త ఆత్మహత్య ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం ఎర్వ చింతల్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతుతో పుష్ప పోటీలో ఉంది. అయితే ఆమె భర్త రవీందర్ (54) గురువారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై రాహుల్ గైక్వాడ్ తెలిపారు. రవీందర్ గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా కూడా చేశాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పుష్ప పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీందర్కు ఇద్దరు కుమారులు ఉన్నారు.సర్పంచ్ ఓట్లు.. కోతులకు పాట్లుచిగురుమామిడి: సర్పంచ్ ఎన్నికలు కోతులకు తిప్పలను తెచ్చిపెడుతున్నాయి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో సర్పంచ్ పదవికి పోటీ చేస్తున్న ఓ వ్యక్తి కోతుల బెడద నుంచి గ్రామస్తులను రక్షించే చర్యలకు ఉపక్రమించాడు. గురువారం గ్రామంలో దాదాపు 500 కోతులను పట్టించి, బోనులో బంధించాడు. వాటిని మంథని, మహదేవ్పూర్ అడవులకు ప్రత్యేక వాహనంలో తరలించాడు.మూడు తరాల సర్పంచ్లుపాపన్నపేట(మెదక్): 3 తరాలుగా సర్పంచ్ పదవులు చేపట్టి పట్లోల్ల కుటుంబం రాజకీయాధిపత్యాన్ని చాటుకుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం యూసుఫ్పేట గ్రామానికి చెందిన పట్లోల్ల శివరాంరెడ్డి 1959లో గ్రామ మొదటి సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1964లో ఆయన అన్న బలరాంరెడ్డి కొడుకు రామచంద్రారెడ్డి సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం రామచంద్రారెడ్డి కోడలు అనిత సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలరాంరెడ్డి సొంత తమ్ముడు నారాయణరెడ్డి 1970 నుంచి 1981 వరకు సర్పంచ్గా పని చేశారు. అనంతరం 1981లో మెదక్ సమితి ప్రెసిడెంట్గా ఎన్ని కయ్యారు. ఆపై 1989 నుంచి 1994 వరకు మెదక్ ఎమ్మెల్యేగా పనిచేశారు. అనంతరం నారాయణరెడ్డి కుమారుడు పట్లోల్ల శశిధర్రెడ్డి 2004లో మెదక్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.సర్పంచ్ బరిలో కార్వాన్ ఎమ్మెల్యే సతీమణివెల్దుర్తి(తూప్రాన్): కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియొద్దీన్ సతీమణి, పాతబస్తీలో రెండుసార్లు కార్పొరేటర్గా పనిచేసిన నజ్మా సుల్తానా సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్ సర్ప ంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. బస్వాపూర్ కౌసర్ మొహియొద్దీన్ స్వగ్రా మం కాగా, నజ్మాసుల్తానా గురువారం తన కుమారుడితో కలిసి వెళ్లి నామినేషన్ వేశారు.కుల సంఘం ఓట్ల కోసం రూ.10 లక్షలకు వేలంకల్హేర్(నారాయణఖేడ్): సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం ఫత్తేపూర్లో సర్పంచ్ పదవి ఎస్సీ జనరల్కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి తనకే గంపగుత్తగా మెజారిటీ ఓట్లు పొందేందుకు ఓ కుల సంఘం నేతలతో కలిసి వేలం పాట జరిపారని సమాచారం. కాంగ్రెస్ బలపర్చిన మరో అభ్యర్థి ఇతర కుల సంఘాలను ప్రసన్నం చేసుకునేందుకు రూ.9 లక్షల వరకు వేలం జరిపారు. దీంతో గ్రామంలో మెజారిటీ ఓట్లు ఉన్న కుల సంఘం, ఇతర కుల సంఘాల మధ్య గొడవకు దారితీసింది. పోలీసులు గ్రామాన్ని సందర్శించి పరిస్థితిని చక్కదిద్దారు.సర్పంచ్ పదవి .. రూ.75 లక్షలు!చేర్యాల(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం జనరల్కు రిజర్వ్ అయ్యింది. దీంతో పోటీ పెరిగి అభ్యర్థులు తమ సొంత డబ్బుతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టారు. ఇంతటితో ఆగకుండా పదవికి వేలం నిర్వహించారు. ఈ వేలంలో ముగ్గురు వ్యక్తులు పోటీ పడగా ఓ అభ్యర్థి రూ.75లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడని ప్రచారం.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలో..పోతిరెడ్డిపల్లికి చెందిన వేణుమోహన్పై మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు అయ్యింది. ఓటర్లను ప్రలోభపెట్టేలా సోషల్ మీడియాలో వేణుమోహన్ పోస్టు చేశారు. దీంతో అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నవీన్ తెలిపారు.నా భార్యను గెలిపిస్తే కటింగ్, షేవింగ్ ఫ్రీదుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లిలో తన భార్యను గెలిపిస్తే ఐదేళ్లు కటింగ్, షేవింగ్ ఫ్రీగా చేస్తానంటూ ఓ భర్త వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. 6వ వార్డు నుంచి శ్రీకాంత్ భార్య శివాని బరిలో ఉన్నారు. నాయీ బ్రాహ్మణుడైన శ్రీకాంత్ తన భార్య గెలుపు కోసం ఇలా ప్రచారం చేస్తున్నాడు.11 రోజుల పసికందుతో నామినేషన్ కేంద్రానికి..వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర సర్పంచ్ స్థానానికి జాలపల్లి సౌందర్య తన 11 రోజుల చంటి పాప, భర్తతో కలిసి గురువారం నామినేషన్ దాఖలు చేసింది.ఆడబిడ్డ పెళ్లికి రూ. 25 వేలు.. గృహ ప్రవేశానికి రూ. 10 వేలుసర్పంచ్గా గెలిపిస్తే అమలు చేస్తానని హామీపత్రంకల్లూరురూరల్: ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ సర్పంచ్గా పోటీ చేస్తున్న కొండపల్లి శ్రీనివాసరావు(వాసు) ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నాడు. సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామంలోని పేదింటి ఆడబిడ్డ పెళ్లికి 25,116, పేదల గృహప్రవేశానికి రూ.10,116 అందచేస్తానని ప్రకటించాడు. పేదిళ్లలో ఆడబిడ్డ ప్రసవానికి రూ.10,116 ఇవ్వడంతోపాటు పురుషులు, మహిళా వ్యవసాయ కూలీలకు సొంత డబ్బుతో ప్రమాద బీమా చేయిస్తానని, అనారోగ్యంతో అత్యవసర చికిత్స అవసరమైన వారికి రూ.5 వేల నుంచి రూ.10వేలు అందిస్తానని ప్రకటించారు. రూ.100 బాండ్పై హామీపత్రం తయారు చేయించి పంపిణీ చేస్తున్నాడు. -
రూ.కోట్లు ఉన్నాయి.. సర్పంచ్ పదవి ఇవ్వండి..
ఖమ్మం జిల్లా: ‘డబ్బు ఎన్నికోట్లయినా ఖర్చుపెడదాం.. ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్ పదవి ఇవ్వండి.. నాకు రాష్ట్ర స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నా యి.. గ్రామాన్ని అభివృద్ధిలో ముందుంచుతా.. కాదని ఎవరైనా పోటీకి దిగితే మా ముందు తట్టుకోలేరు’ అంటూ ప్రగల్భాలు పలికిన ఓ వ్యక్తి పోలీసుల వేట ముమ్మరం కావడంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. కల్లూరు మండలంలో ఎర్రబోయినపల్లి పంచాయతీ సర్పంచ్ పదవి జనరల్ కేటగిరీకి రిజర్వ్ అయింది. దీంతో అదే గ్రామానికి చెందిన పోట్రు ప్రవీణ్ సర్పంచ్ పదవి ఆశించగా.. ఆయనతో పోటీ పడటానికి అధికార పార్టీలో ఎవరూ ఆసక్తి చూపించలేదు. ధనబలం, కండబలం ఉన్న వ్యక్తి కావడంతో ఆయన సర్పంచ్ కావడం ఖాయమని వారం క్రితం వరకు అంతా భావించారు. అంతేకాక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి స్థానం జనరల్ అయితే బీఆర్ఎస్ నుంచి పోటీకి సిద్ధమేనని చెప్పుకున్న ప్రవీణ్ సైబర్ నేరాలకు పాల్పడినట్లు బయటపడడం కల్లూరు మండలంలో సంచలనంగా మారింది. ఎస్ఓటీ పోలీసుల విచారణతో..కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాశ్ వరుసకు అన్నదమ్ములు. హైదరాబాద్ హైటెక్సిటీ కేంద్రంగా ఆస్ట్రేలియా దేశ పౌరులను మోసగించేందుకు రిట్జ్ ఐటీ సొల్యూషన్ పేరుతో 2024లో నకిలీ కాల్సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు ఇటీవల గుర్తించారు. ప్రధాన నిందితులైన పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్ కల్లూరు మండలం లింగాలకు చెందిన ఏపూరి గణేష్, వేంసూరు మండలం లింగపాలెంకు చెందిన మోరంపూడి చెన్నకేశవను సెంటర్లో విధులకు నియమించినట్లు తేల్చారు. ఆస్ట్రేలియా పౌరుల ఈమెయిల్ ఐడీలు, ఫోన్నంబర్లు సేకరించి తన వద్ద పని చేసే వారితో ‘మీ కంప్యూటర్ హ్యాక్ అయింది.. దీన్ని పరిష్కరించాలంటే కస్టమర్ కేర్ను సంప్రదించండి’ అంటూ ఆస్ట్రేలియా యాసలో మాట్లాడేలా ఇంకొందరిని నియమించుకుని ఫోన్ చేయించినట్లు బయటపడింది. ఆపై వారి ఖాతాల నుంచి రూ.కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.కీలకమైన ల్యాప్టాప్గత శనివారం ఎర్రబోయినపల్లికి వచ్చిన హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు.. పోట్రు ప్రవీణ్, పోట్రు ప్రకాష్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ప్రవీణ్ ఇంట్లో కీలక ఆధారాలు ఉన్న ల్యాబ్టాప్ను స్వాధీనం చేసుకుని ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అంతేకాక పోట్రు ప్రవీణ్ పరారీలో ఉన్నాడని పోలీసులు ప్రకటించారు. కాగా, స్వగ్రామంలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకునే ఆయన సైబర్ నేరాలకు పాల్పడినట్లు తెలియడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. సైబర్ నేరాలతో పాటు హవాలా, క్రిప్టో కరెన్సీ పేరుతో మోసాలు చేసి సంపాదించిన డబ్బుతో హైదరాబాద్, కల్లూరు, ఎర్రబోయినపల్లిలో భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, ప్రవీణ్ తనకు ఆంధ్రాలో టీడీపీ.. తెలంగాణలో బీఆర్ఎస్ ముఖ్య నేతలతో సంబంధాలు ఉన్నట్టు వారి ఫొటోలతో సోషల్ మీడియా, ఫ్లెక్సీలతో హోరెత్తిస్తుంటాడు. రెండేళ్ల నుంచి కల్లూరు, తల్లాడ మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ కార్యక్రమం చేపట్టినా ఫ్లెక్సీలు, మోటారు సైకిల్ ర్యాలీతో హోరెత్తిస్తున్న ఆయనపై గతంలోనూ కేసులు నమోదైతే కొందరు నేతల సహకారంతో బయటపడినట్లు సమాచారం. -
బరిలో విద్యావంతులు, దంపతులు
ఖమ్మం జిల్లా: కొణిజర్ల సర్పంచ్ అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన గూదె పుష్పావతి పోటీలో నిలిచా రు. ఆమె ఎం.ఫార్మసీ చదివి కొద్దిరోజులు ఉద్యోగం చేశారు. కొణిజర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి గూదె ఉపేందర్తో వివా హం జరిగింది. కొణిజర్ల పంచా యతీ రిజర్వేషన్ బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో సర్పంచ్గా పోటీలో నిలిచింది. కూసుమంచిలో.. కూసుమంచి: మండలంలో పలువురు విద్యావంతులు సర్పంచ్, వార్డు స్థానాల్లో బరి లో దిగారు. నేలపట్ల గ్రా మానికి చెందిన అలవాల లింగయ్య ఆర్జేసీ డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా పనిచేస్తుండగా ఆయన బీఆర్ఎస్ మద్దతుదారుడిగా నేలపట్ల సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచారు. కూసుమంచి నుంచి కొండా కృష్ణవేణి కాంగ్రెస్ మద్దతుదారుగా సర్పంచ్ బరిలో దిగగా డిగ్రీ చదివిన ఆమె ఎంపీడీఓ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నారు. ఇదే పంచాయతీలో ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్యాకలీ్టగా పనిచేస్తున్న గుండా ఉపేందర్రెడ్డి 8వ వార్డు నుంచి బీజేపీ మద్దతుదారుడిగా బరిలో దిగారు. సీపీఎం మద్దతుదారుగా డిగ్రీ చదివిన సల్వాది బేబీరాణి సర్పంచ్గా బరిలో ఉన్నారు. కూసుమంచి 12వ వార్డుకు బీఆర్ఎస్ తరఫున అర్వపల్లి ఉపేందర్ నామినేషన్ దాఖలు చేయగా ఆయన భార్య రేణుక నాలుగో వార్డు నుంచి బరిలో ఉన్నారు. గట్టుసింగారం గ్రామానికి చెందిన వాచేపల్లి హనుమారెడ్డి కాంగ్రెస్ తరఫున 2వ వార్డులో బరిలో నిలవగా అతడి భార్య స్వరూప 6వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేశారు. -
ఒక్కఓటు.. తలకిందులు
కథలాపూర్(వేములవాడ): పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో క్షణక్షణం ఉత్కంఠ. ఓటర్లు ఒక్కరోజులోనే ఎవరివైపు ప్రచారం చేస్తారో.. ఎటూ మద్దతు ఇస్తారో తెలియని పరిస్థితులుంటాయి. అభ్యర్థులు మద్దతుదారుల మెప్పుపొందుతూనే కొత్తవారిని కూడగట్టుకోవడంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తుంటారు. ఇలా ఒకటి, రెండు ఓట్ల తేడాతో జయపజయాలు పొందిన వారున్నారు. ఇలా 2013లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో మండలంలోని పెగ్గెర్లలో సర్పంచ్ అభ్యర్థులు ఒక్క ఓటుతో గెలుపోటములు పొందారు. పెగ్గెర్లలో అప్పట్లో 967 మంది ఓటర్లున్నారు. 2013లో సర్పంచ్ ఎన్నికల్లో కనగందుల దేవక్కకు 432 ఓట్లు వచ్చాయి. మరో అభ్యర్థి మోత్కురి గంగుకు 431 ఓట్లు వచ్చాయి. దీంతో రీకౌంటింగ్కు అభ్యర్థులు పట్టుబట్టారు. అధికారులు రీకౌంటింగ్ చేసి ఒక్క ఓటు తేడాతో దేవక్కనే విజయం సాధించారని అధికారులు ప్రకటించారు. అందులోనూ ఒకేఒక్క పోస్టల్ బ్యాలెట్ ఓటు తీర్పును మార్చేసింది. రిజర్వేషన్ ఏదైనా.. ఆ కుటుంబానిదే విజయంమల్యాల: ఆయనది సాధారణ కుటుంబం. ఒగ్గు కథకుడిగా ప్రజలకు సుపరిచితుడు. ఆయన మంచితనమే ఆయనతోపాటు ఆయన కుటుంబానికి 30ఏళ్లుగా పంచాయతీ పగ్గాలు అప్పగిస్తోంది. రిజర్వేషన్ ఏదైనా.. ఆయన కుటుంబానికే ప్రజలు మద్దతు తెలుపుతున్నారు. మల్యాల మండలం గొల్లపల్లె గ్రామానికి చెందిన మోత్కు కొమురయ్య ఒగ్గుకథలు చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు ఇద్దరు భార్యలు. దేవమ్మ, యాదమ్మ. నిజాయితీ, నిబద్ధతగల వ్యక్తి కావడంతో 1995లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొమురయ్య విజయం సాధించాడు. 2005 వరకు సర్పంచ్గా కొనసాగాడు. మొదటి భార్య దేవమ్మ ఐదేళ్లు సర్పంచ్గా పనిచేశారు. అనంతరం కొమురయ్య మరోసారి సర్పంచ్గా విజయం సాధించారు. రెండో భార్య యాదమ్మ ఐదేళ్లు సర్పంచ్గా బాధ్యతలు చేపట్టారు. కొమురయ్య మొదటిసారి బరిలో నిలిచినప్పుడు రిజర్వేషన్ బీసీ జనరల్, రెండోసారి జనరల్, మూడోసారి బీసీ మహిళ, నాలుగోసారి బీసీ జనరల్, ఐదోసారి బీసీ మహిళకు రిజర్వ్ అయ్యింది. ఆరోసారి కూడా రిజర్వేషన్ జనరల్ కావడంతో కొమురయ్య సర్పంచ్ బరిలో నిలుస్తున్నాడు. రిజర్వేషన్ ఏదైనా పోటీ చేసేది ఎస్సీలే.. ఉప్పట్ల పంచాయతీ విచిత్రం మంథనిరూరల్: సాధారణంగా ఎన్నికల్లో రిజర్వేషన్లకు అనుకూలంగా అభ్యర్థులు పోటీ చేస్తుంటారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఓసీలకు జనరల్ కేటగిరీ ఉంటుంది. కానీ అక్కడ రిజర్వేషన్లకు భిన్నంగా ఎన్నికలు జరుగుతున్నాయి. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్ల అది. ఆ గ్రామంలో స్థానిక ఎన్నికల సందర్భంగా సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. అయితే సర్పంచ్ అభ్యర్థులుగా బీసీ, ఓసీల నుంచి ఒక్కనామినేషన్ కడా దాఖలు కాలేదు. అందరూ ఎస్సీలే నామినేషన్లు వేశారు. అలాగే ఎనిమిది వార్డుల్లో నాలుగు ఎస్సీ, నాలుగు జనరల్ కాగా వాటిలో సైతం ఎస్సీలే నామినేషన్లు దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. మొత్తం 1,161 మంది ఓటర్లు ఉండగా ఎస్సీలదే మెజారిటీ. అయినా, ఓసీలు, బీసీలు కలిస్తే ఎస్సీలకన్నా ఎక్కువగా ఉంటారు. కానీ, ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడం, వెంటనే నామినేషన్ల స్వీకరణ జరుగడంతో గడువు లేక నామినేషన్లు దాఖలు చేయలేకపోయామని పలువురు ఆశావహులు తెలిపారు. అంతేకాకుండా జనరల్ మహిళగా రిజర్వేషన్ రావడంతో ఓసీ, బీసీల్లోమహిళలు ఆసక్తి చూపకపోవడం కూడా మరో కారణమని చెబుతున్నారు. ఏదిఏమైనా జనరల్ స్థానంలోసైతం ఎస్సీలకు అవకాశం రావడం ఇదే ప్రథమం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
కోతుల పేరుతో ప్రచారాలు ఇంట్లోనే పంచాయతీలు
ఏ గ్రామంలో చూసినా కోతుల బెడద తీవ్రంగా ఉంది. దీనినే కొందరు సర్పంచ్ అభ్యర్థులు తమ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. ఒకరు కొండముచ్చుతో ప్రచారం చేయగా, మరోచోట ఇద్దరు ఎలుగుబంటి, చింపాంజీ వేషధారణలతో ప్రచారం చేయించారు. తమను గెలిపిస్తే.. కోతులు లేని గ్రామాలను తయారు చేస్తామని హామీల వర్షం కురిపిస్తున్నారు.చింపాంజీ, ఎలుగుబంటి వేషంతో ప్రచారంకమలాపూర్: హనుమకొండ జిల్లా నేరెళ్ల పంచాయతీలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. దీంతో తమను గెలిపిస్తే కోతుల బెడద నివారణకు కృషి చేస్తామంటూ సర్పంచ్ అభ్యర్థులు జెట్టి నాగలక్ష్మి, గోల్కొండ శ్రీరాం అనుచరులు చింపాంజీ, ఎలుగు బంటి వేషధారణ వేసి గ్రామంలో వేర్వేరుగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా కోతులను వెంబడించి వాటిని ఊరి బయటకు తరుముతున్నారు.కొండముచ్చుతో ప్రచారం దండేపల్లి: మంచిర్యాల జిల్లా దండేపల్లి సర్పంచ్ అభ్యర్థి పోటీ చేస్తున్న రాజేశ్వర్ బుధవారం కొండముచ్చుతో ప్రచారం చేశాడు. గ్రామంలో దానిని తిప్పుతూ కోతుల బెడద తీర్చేందుకు కొండముచ్చును తీసుకొచ్చానని, ఓటు తనకే వేయాలని కోరాడు. గెలిచిన తర్వాత మరో మూడింటిని తీసుకొచ్చి కోతులను తరిమేస్తానని హామీ ఇచ్చాడు.స్వామి కాలు రాతలో అభ్యర్థుల భవిత దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం పంచాయతీ పరిధిలో ధారావత్తండా, ధర్మగడ్డతండాలు ఉన్నాయి. ఈ రెండు తండాల నుంచి సర్పంచ్, వార్డు బరిలో నిలిచేందుకు పలువురు సిద్ధమయ్యారు. వీరిలో కొందరి నామినేషన్ పత్రాలను «ధారావత్తండాకు చెందిన ధారావత్ స్వామి కాలుతో రాశారు. తలరాత చేతిరాతతో కాకుండా.. మా గిరిజన బిడ్డ కాలురాత మాకు కలిసొస్తుందని పలువురు కితాబు ఇచ్చారు.నామినేషన్ పత్రాలు చోరీతాండూరు రూరల్: క్లస్టర్ సెంట ర్లో భద్రపర్చిన నామినేషన్ పత్రాలను దుండగులు ఎత్తుకె ళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా హన్మాపూర్, గొట్లపల్లి, గిర్మాపూర్, జైరాంతండా(ఐ) జీపీలకు సంబంధించిన నామినేషన్లను గొట్లపల్లిలో స్వీకరించారు. ఆయా గ్రామాల నుంచి 20 మంది సర్పంచ్గా, 68మంది వార్డు సభ్యుల పదవుల కోసం నామినేషన్లు వేశారు. ఈ పత్రాలను గదిలో భద్రపర్చిన రిటర్నింగ్ అధికారి అంజయ్య మంగళవారం సాయంత్రం తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. బుధవారం ఉదయం 10 గంటలకు వచ్చి చూడగా తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి పరిశీలించగా, గొట్లపల్లి గ్రామానికి సంబంధించిన నామినేషన్ పత్రాలు కనిపించలేదు. మిగిలిన నామినేషన్లన్నీ అలాగే ఉన్నాయి. విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ఘటనా స్థలానికి వెళ్లి, విచారణ ప్రారంభించారు. నామినేషన్లకు సంబంధించిన పూర్తి డేటా ఆన్లైన్లో అందుబాటులో ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు.కేసీఆర్ దత్తత గ్రామాల్లో ఏకగ్రీవాలు మర్కూక్(గజ్వేల్): మాజీ సీఎం కేసీఆర్ దత్తత గ్రామాలైన ఎరవ్రల్లి, నరసన్నపేటలో సర్పంచ్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎర్రవల్లిలో నారన్న గారి కవిత రామ్మోహన్రెడ్డిని, నరసన్నపేటలో గిలుక బాల్ నర్సయ్యను సర్పంచ్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎరవ్రల్లిలో 8 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నరసన్నపేటలోనూ నాలుగు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.పోటీకి ఒక్కరూ లేరుపేరూర్లో సర్పంచ్, వార్డు స్థానాలకు దాఖలుకాని నామినేషన్లు హాలియా: నల్లగొండ జిల్లా హాలియా మండలం పేరూర్ గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీ మహిళకు రిజర్వు అయ్యింది. అయితే ఆ సామాజికవర్గానికి చెందిన మహిళా ఓటరు ఒక్కరు కూడా లేరు. 8 వార్డులుండగా, 4 ఎస్టీలకు, 4 బీసీలకు రిజర్వు అయ్యాయి. వార్డుల్లోనూ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రిజర్వేషన్ ప్రక్రియలో తమ గ్రామానికి తీరని అన్యాయం జరిగిందని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు.సర్పంచ్ బరిలో తండ్రీకొడుకురామాయంపేట(మెదక్): మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ సర్పంచ్ స్థానానికి తండ్రీకొడుకు నామినేషన్లు వేశారు. మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య ఆయుర్వేద వైద్యుడిగా సుపరిచితుడు. సర్పంచ్ పదవి జనరల్కు రిజర్వ్ కాగా, పది మంది నామినేషన్లు వేశారు. వీరిలో రామకిష్టయ్యతోపాటు ఆయన కుమారుడు వెంకటేశ్ కూడా ఉన్నారు.అన్నదమ్ముల మధ్య ఆసక్తికర పోరు..వైరా: ఖమ్మం జిల్లా వైరా మండలం ముసలిమడుగు పంచాయతీలో సర్పంచ్ స్థానానికి అన్నదమ్ములే ప్రత్యర్థులుగా నిలిచారు. తడికమళ్ల నాగేశ్వరరావు 2014లో వైఎస్సార్సీపీ తరఫున ఎంపీటీసీగా గెలిచాడు. 2019లో బీఆర్ ఎస్ మద్దతుతో సర్పంచ్గా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరాడు. ప్రస్తుతం ఆ పార్టీ మద్దతుతో బరిలో నిలిచాడు. అయితే అన్న నాగార్జున, నాగేశ్వరరావుల మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. దీంతో తమ్ముడిపై తాను పోటీకి సై అంటూ నాగార్జున బరిలోకి దిగాడు. అక్కాచెల్లి మధ్యనే పోటీ నేలకొండపల్లి: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొంగర గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్ మద్దతుతో చిట్టూరి రంగమ్మ నామినేషన్ వేశారు. అదే గ్రామానికి చెందిన ఆమె చెల్లి మల్లెంపూడి కృష్ణకుమారి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు.ఒకే ఇంట్లో ముగ్గురు..పాల్వంచరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం తవిశలగూడెంలో గ్రామంలో ఒకే ఇంటి నుంచి ముగ్గురు పోటీలో ఉన్నారు. తవిశలగూడెం సర్పంచ్గా కాలం జయ నామినేషన్ వేశారు. ఆమె భర్త కాలం సురేశ్, ఆతయన తల్లి సత్తెమ్మ వార్డు సభ్యులుగా బరిలో ఉన్నారు. అదే పంచాయ తీలో దంపతులు కోరం ఎర్రయ్య, ఎర్రమ్మ కూడా వార్డు సభ్యులుగా పోటీలో ఉన్నారు. -
రెండో విడత పంచాయతీకి భారీగా నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్ : రెండో విడత పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు పడ్డాయి. 4,332 సర్పంచ్ పదవులకు 28,278 నామినేషన్లు, 38,342 వార్డులకు 93,595 నామినేషన్ల సమర్పణతో అభ్యర్థుల నుంచి అనూహ్య స్పందన వ్యక్తమైంది. ఈ నెల 14న జరగనున్న రెండోవిడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. రాత్రి పొద్దుపోయేదాకా పలు పంచాయతీల్లో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పెద్దసంఖ్యలో బారులుదీరారు. వివిధ జిల్లాల్లో పడిన నామినేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, సమాచారం బుధవారం మధ్యాహ్నం రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) చేరాయి. దీంతో రెండోవిడత నామినేషన్ల వివరాలను ఎస్ఈసీ సాయంత్రం వెల్లడించింది. నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్: రెండో విడతలోనూ సర్పంచ్, వార్డులకు దాఖలైన నామినేషన్ల సంఖ్య విషయంలో నల్లగొండ జిల్లా టాప్ప్లేస్లో నిలిచింది. ఈ జిల్లాలోని 282 సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా 2,116 నామినేషన్లు, 2,418 వార్డులకు 6,120 నామినేషన్లు పడ్డాయి. ఆ తర్వాతి స్థానంలో నిలిచిన సూర్యాపేట జిల్లాలో 181 పంచాయతీలకు 1,447 నామినేషన్లు దాఖలయ్యాయి. అంటే ఇక్కడ సగటున ఒక్కో సర్పంచ్ సీటుకు 8 మందికి పైగా పోటీ పడుతున్నారు. అదే నల్లగొండ జిల్లాలో సగటున 7.5గా పోటీ ఉంది. సూర్యాపేట జిల్లాలో 1,628 వార్డులకు 4,378 మంది నామినేషన్లు వేశారు. ఖమ్మం జిల్లాలో 183 సర్పంచ్ స్థానాలకు 1,055 నామినే షన్లు పడగా, 1,686 వార్డులకు 4,160 నామినేషన్లు అనూహ్యంగా దాఖలయ్యాయి. ఏజెన్సీలో తగ్గిన జోరు: మైదాన ప్రాంతాలతో పోలిస్తే ఏజెన్సీ ప్రాంతాల్లో సర్పంచ్, వార్డులకు పోటీ కాస్త తక్కువగానే ఉంది. ములుగు జిల్లాలోని 52 పంచాయతీలకు అత్యల్పంగా 288 నామినేషన్లు వచ్చాయి. ఆదిలాబాద్, ములుగు వంటి జిల్లాల్లో సగటున ఒక్కో సీటుకు 5 నుంచి 6 నామినేషన్లు మాత్రమే నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, హనుమకొండ జిల్లాల్లో కూడా నామినేషన్ల సంఖ్య తక్కువగానే ఉంది. ఇంకా తేలని తొలివిడత అభ్యర్థుల లెక్క సాక్షి, హైదరాబాద్ : తొలి విడత జరిగే పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలు ఆయా జిల్లాల నుంచి ఇంకా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కు చేరలేదు. 31 జిల్లాల పరిధిలోని 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డులకు 11న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు సంబంధించి బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో.. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులకు సంబంధించిన జాబితాలను పంచాయతీలలోని నోటీస్ బోర్డులపై ప్రచురించారు. పలు గ్రామ పంచాయతీల్లో అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన వారిని ప్రకటించారు. అయితే ఏ జిల్లాలో ఎంత మంది సర్పంచ్ లు ఏకగ్రీవమయ్యారనే దానిపై సమాచారం రాత్రి వరకూ ఎస్ఈసీకి అందలేదు. దీంతో అధికారికంగా ఏకగ్రీవమైన సర్పంచ్ల వివరాలు ప్రకటించలేదు. వివరాలను నేడు ఎస్ఈసీ ప్రకటించే అవకాశాలున్నాయి. మొదటిదశ ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు ప్రక్రియ మొదలైంది. -
సర్పంచ్ ఎన్నికల బరిలో అత్తాకోడళ్లు
ఆదిలాబాద్ జిల్లా: ఇంద్రవెల్లి మండలంలోని ఏమాయికుంటకు చెందిన జాదవ్ కిషన్, దేవ్కబాయి దంపతులకు ప్రతాప్సింగ్, కుబేర్సింగ్, అనార్సింగ్, రామ్లఖన్సింగ్ నలుగురు కు మారులు సంతానం. గతంలో జాదవ్ కిషన్ ఒకసారి సర్పంచ్గా, ముత్నూర్ ఎంపీటీసీగా, తల్లి ఏమాయికుంట సర్పంచ్గా సేవలందించారు. తండ్రి మరణానంతరం నాలుగో కుమారుడు లఖ న్సింగ్ గత ఎన్నికల్లో ఏమాయికుంట సర్పంచ్గా పోటీచేసి గెలుపొందాడు. ప్రస్తుత ఎన్నికల్లో కూడా రిజర్వేషన్ అనుకూలంగా రావడంతో నామినేషన్ దాఖలు చేశాడు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న సోదరులు జాదవ్ కుబేర్సింగ్, అనార్సింగ్ సర్పంచ్ పదవికి పోటాపోటీగా నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఓటర్లు అయోమయస్థితిలో పడిపోయారు. అదేవిధంగా మండలంలోని హీరాపూర్ గ్రామపంచాయతీలో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేయడం మండలంలో చర్చనీయాంశమైంది. ముగ్గురు అన్నదమ్ములు, అత్తా కోడళ్లలో ఎవరు గెలుస్తారోనని మండల ప్రజలు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. -
40ఏళ్లు ఒక్కరే సర్పంచ్!
సాక్షి, మహబూబాబాద్ : ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారో లేదో తెలియని పరిస్థితి. కానీ, ఏకంగా నాలుగు దశాబ్దాలపాటు తిరుగులేని స ర్పంచ్గా రికార్డు సృష్టించారు మహబూబాబాద్ జి ల్లా నర్సింహులపేట గ్రామ మాజీ సర్పంచ్ నాయి ని∙మనోహర్ రెడ్డి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952లో జరిగిన ఎన్నికల్లో గ్రామ తొలి సర్పంచ్గా చెక్కల చంద్రారెడ్డి గెలిచారు. ఆయన మూడేళ్లు పని చేసిన తర్వాత 1955లో నాయిని మనోహర్ రెడ్డి సర్పంచ్గా నియమితులయ్యారు. అప్పటినుంచి వ రుసగా గెలుస్తూ.. 1995 వ రకు ఆయనే సర్పంచ్గా పనిచేశారు. పోటీ చేసిన ప్రతీసారి మనోహర్ రెడ్డి గెలుపొందారు. చివరకు వయస్సు మీద పడడంతో పోటీనుంచి తప్పుకుని మరో నాయకుడికి సర్పంచ్గా అవకాశం కల్పించారు ఆ గ్రామస్తులు. సౌమ్యుడిగా పేరున్న మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో తప్ప.. మిగిలిన సమయంలో అన్ని వర్గాలతో మమేకమే ఉండటం.. గ్రామంలో ఎలాంటి గొడవలకు తావులేకుండా చూడడం ఆయన ప్రత్యేకత. అందుకోసమే ఇప్పటికీ ఆ గ్రామంనుంచి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టేందుకు గ్రామస్తులు ఇష్టపడరని.. అది ఆయన గ్రామస్తులకు నేర్పించిన మంచితనంగా గ్రామస్తులు చెప్పుకుంటారు. -
ఇద్దరు భార్యలతో నామినేషన్లు
మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉన్నత విద్యావంతులైన ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ దాఖలు వేయించారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో మంగళవారం రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవమవుతుంది. గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తామని ఈ కుటుంబం చెప్పడంతో ఇతరులు పోటీలో లేరు. -
సర్పంచ్ బరిలో అత్తాకోడలు
పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్(ఘనశ్యాందాస్నగర్) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో ఆదివారం నామినేషన్ వేయించారు. మంగళవారం నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకేఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచినట్టయ్యింది. గతంలో జీడీనగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా, సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ)ను సర్పంచ్గా గెలుపొందించుకున్నారు. జీడీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. ఆయన వదిన కూడా పోటీ చేయడం గమనార్హం. -
పంచాయతీ పదనిసలు
గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ...చిత్ర విచిత్రాలెన్నో చోటుచేసుకుంటున్నాయి. రిజర్వేషన్ మార్చలేదని ఒక గ్రామంలో ఎవరూ నామినేషన్ వేయలేదు. మరో చోట కుటుంబ సభ్యులు సహకరించడం లేదని ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగాడు. డబ్బులు, మద్యం ఎన్నికల్లో పంచవద్దని గ్రామస్తులు సర్పంచ్ అభ్యర్థులతో ఇంకో చోట ప్రమాణం చేయించారు. అమెరికా నుంచి సర్పంచ్ పదవికి నామినేషన్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపిన రిటైర్డ్ ఎస్ఐ లక్ష్మారెడ్డి దుగ్గొండి: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బంధంపల్లి గ్రామ సర్పంచ్ పదవి జనరల్కు రిజర్వు అయ్యింది. ములుగు ఎస్ఐగా పనిచేసిన పోరెడ్డి లక్ష్మారెడ్డి కొన్ని నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. తన పిల్లలు అమెరికాలో ఉండడంతో కొద్ది రోజుల క్రితం అమెరికా వెళ్లారు. ఇంతలోనే సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. పోటీ చేయాలని అనుకున్న లక్ష్మారెడ్డి సర్పంచ్ నామినేషన్ ఫామ్ను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని సంతకం చేసి స్పీడ్ పోస్టు ద్వారా పంపించారు. ఆ నామినేషన్ను బలపరిచిన పోరెడ్డి శరత్ లక్ష్మీపురం క్లస్టర్లో రిటరి్నంగ్ అధికారి భద్రమ్మకు అందించారు. అమెరికాలో ఉండి సర్పంచ్ పదవికి లక్ష్మారెడ్డి నామినేషన్ వేయడం చర్చనీయాంశమైంది. 2013 నుంచి 2018 వరకు లక్ష్మారెడ్డి భార్య సుభద్ర బంధంపల్లి సర్పంచ్గా పనిచేశారు. కుటుంబ సభ్యుల మద్దతు లేదని.. పురుగుల మందు తాగిన సర్పంచ్ అభ్యర్థి నంగునూరు(సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ఘణపూర్ సర్పంచ్ పదవి ఎస్సీ రిజర్వు అయ్యింది. మాజీ ఉపసర్పంచ్ ఘనపురం ఎల్లయ్య (ఎల్లం) తోపాటు అతని అన్న బాల్నర్సయ్య, చిన్నాన్న కుమారుడు సాయిలు పోటీలో ఉండాలని అనుకున్నారు. అయితే ఒకే కుటుంబానికి చెందినవారు పోటీలో ఉండడం మంచిది కాదని బాల్ నర్సయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. ఒక్కరే పోటీలో ఉండాలని చెప్పినా వినకుండా ఎల్లంతోపాటు సాయిలు కూడా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కుటుంబ సభ్యులు సహకరించడంలేదని మనస్తాపం చెందిన ఎల్లయ్య మంగళవారం పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరి్పంచారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. పాండురంగాపురం..నామినేషన్లు నిల్ ఎస్టీలు లేకున్నా రిజర్వ్ చేయడంపై గ్రామస్తుల నిరసన పాల్వంచరూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం సర్పంచ్ పదవి ఎస్టీలకు రిజర్వు అయ్యింది. 1,202 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేరు. ఈ పంచాయతీ పరిధిలో 8 వార్డులు ఉండగా, రెండు వార్డు స్థానాలు ఎస్టీ జనరల్కు, ఇంకో రెండు వార్డు స్థానాలు ఎస్టీ మహిళలకు, మిగతా నాలుగు జనరల్, జనరల్ మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో మొదటి నుంచి రిజర్వేషన్లు మార్చాలని కోరుతున్న గ్రామస్తులంతా ఏకమై ఎవరూ నామినేషన్లు దాఖలు చేయొద్దని నిర్ణయించుకున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే మంగళవారం సాయంత్రం వరకు ఒక్కరు కూడా నామినేషన్ వేయలేదు. ఈ విషయమై ఎంపీడీఓ కె.విజయభాస్కర్రెడ్డిని వివరణ కోరగా పాండురంగాపురంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని చెప్పారు. సర్పంచ్గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగురిజాల గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్న గోమాస శ్యామలత శ్రీకాంత్ ఓటర్లకు 20 వాగ్దానాలతో కరపత్రం విడుదల చేశారు. సర్పంచ్గా గెలిపిస్తే ఇంటిపన్ను మాఫీ చేస్తానని, అర్హులైన వారికి నెల రోజుల్లో పింఛన్ మంజూరు చేయిస్తానని, గ్రామస్తులందరికీ మినరల్ వాటర్, ఎవరైనా చనిపోతే మృతుని కుటుంబానికి రూ.10వేలు ఆర్థికసాయం, ఇంటి ఆడబిడ్డ పెళ్లికి రూ.5 వేలు కట్నం, కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, కేవీకే సోలార్ పవర్ప్లాంటులో నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం తదితర హామీలు ఇచ్చారు. రంగపేట శివారులోని 200 ఎకరాల ప్రభుత్వ భూమిని అటవీ, రెవెన్యూ శాఖల అధికారులతో జాయింట్ సర్వే చేయించి నిరుపేదలకు పంపిణీ చేయిస్తానని హామీ కూడా ఇచ్చారు.ఈ కరపత్రం వాట్సాప్ గ్రూప్ల్లో వైరల్ అయ్యింది. ఒకటోసారి..రెండోసారి..మూడోసారి సర్పంచ్ పదవులకు కొనసాగుతున్న వేలం పాటలు పాల్వంచరూరల్/నేలకొండపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెంలో రామాలయ నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చే వారినే సర్పంచ్, ఉపసర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని గ్రామస్తులు నిర్ణయించినట్టు తెలిసింది. దీంతో సర్పంచ్ పదవి ఆశిస్తున్న కేలోతు సునీత రూ.6 లక్షలు, ఉప సర్పంచ్ పదవి కోసం నాగేశ్వరరావు రూ.2.90 లక్షలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు తెలిసింది. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ఆచార్లగూడెం జీపీలోనూ ఆలయ అభివృద్ధి కోసం సర్పంచ్ అభ్యర్థి రూ.8 లక్షలు, ఉప సర్పంచ్ అభ్యర్థి రూ.4లక్షలు, వార్డు సభ్యులు రూ.10 వేల నుంచి రూ.50 వేలు ఇచ్చేలా అంగీకరించినట్టుతెలిసింది. దీంతో వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని అన్ని పార్టీల నేతలు ఓ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. తండా ఒక్కటే.. పంచాయతీలు రెండు మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఇటుకలగడ్డ తండాలో రెండు గ్రామ పంచాయతీల పరిధిలో ఉంది. ఇటుకల గడ్డతండాలో ప్రధాన రహదారికి ఓ వైపు ఎలమంచిలితండా పరిధిలో, మరో వైపు గిరిపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది. అన్ని రోజులు కలిసి ఉండే తండావాసులు పంచాయతీ ఎన్నికల వేళ రెండు గుంపులుగా విడిపోయి రాజకీయాలు చేస్తారు. ఎమ్మెల్యే గండ్ర స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం గణపురం: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామమైన గణపురం మండలం బుద్దారంలో సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ విడిదినేని శ్రీలతను బలపరచగా, బీఆర్ఎస్ తరఫున కొంరాజు అమృత నామినేషన్ వేశారు. మంగళవారం అమృత నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో శ్రీలత ఎన్నిక ఏకగ్రీవమైంది. వరంగల్ జిల్లా సంగెం మండలం పెద్దతండా సర్పంచ్ అభ్యర్థిగా గుగులోత్ వినోదతోపాటు 8 వార్డులకు 8 మందే నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో పంచాయతీ ఎన్నిక ఏకగీవ్రం కానుంది. ఇద్దరు భార్యలతో నామినేషన్లు మిరుదొడ్డి(దుబ్బాక): సిద్దిపేట జిల్లా అక్బర్పేట–భూంపల్లి మండలం జంగపల్లి సర్పంచ్ పదవి జనరల్ మహిళకు రిజర్వు అయ్యింది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఉన్నత విద్యావంతులైన ఇద్దరు భార్యలు ఉన్నారు. నవంబర్ నెల 30న తన మొదటి భార్యతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు వేయించారు. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులు ఉంటే స్రూ్కటినీలో ఎక్కడ తొలగిస్తారోనన్న భయంతో మంగళవారం రెండో భార్యతో మరో నామినేషన్ వేయించారు. నామినేషన్ల దాఖలు ముగిసే సమయానికి ఈ ఇద్దరే పోటీలో ఉన్నారు. వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే సర్పంచ్ పదవి ఏకగ్రీవమవుతుంది. గ్రామాభివృద్ధికి ఆర్థిక సహకారం అందిస్తామని ఈ కుటుంబం చెప్పడంతో ఇతరులు పోటీలో లేరు.జెండాలన్నీ ఒక్కటయ్యాయి కోదాడ: పంచాయతీ ఎన్నికల్లో పలు పార్టీల నేతలు తమ ఎజెండాలను పక్కన పెట్టి జెండాలను కలిపేశారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో ఈ విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. బేతవోలులో కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం అభ్యర్థికి బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ నాయకులు మద్దతునిస్తూ ఆయా పార్టీల జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఇదే గ్రామంలో కాంగ్రెస్లోని మరో వర్గం అభ్యర్థి సీపీఎంతో కలిసి పోటీకి నిలబడింది. చిలుకూరు మండల కేంద్రంలో సీపీఐ అభ్యర్థికి బీఆర్ఎస్లోని ఒక వర్గం మద్దతుగా ఇస్తుండగా.. కాంగ్రెస్ అభ్యర్థికి బీఆర్ఎస్లో మరో వర్గంతోపాటు టీడీపీ మద్దతుగా నిలుస్తున్నాయి. సర్పంచ్ బరిలో అత్తాకోడలు పాలకుర్తి(రామగుండం): పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని జీడీనగర్(ఘనశ్యాందాస్నగర్) పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా అత్తాకోడలు నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్ స్థానం బీసీ మహిళకు రిజర్వు కాగా, మాజీ సర్పంచ్ సూర సమ్మయ్య తన తల్లి సూర నర్సమ్మతో ఆదివారం నామినేషన్ వేయించారు. మంగళవారం నర్సమ్మ పెద్దకోడలు సూర రమాదేవి సైతం నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఒకేఇంటి నుంచి అత్తాకోడలు సర్పంచ్ స్థానంలో బరిలో నిలిచినట్టయ్యింది. గతంలో జీడీనగర్ కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. అప్పుడు ఎస్సీలకు రిజర్వు కాగా, సమ్మయ్య తన భార్య సునీత (ఎస్సీ)ను సర్పంచ్గా గెలుపొందించుకున్నారు. జీడీనగర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటైన అనంతరం 2018లో జరిగిన ఎన్నికల్లో సూర సమ్మయ్య సర్పంచ్గా గెలుపొందారు. ప్రస్తుతం బీసీ మహిళకు రిజర్వు కావడంతో సమ్మయ్య తన తల్లి నర్సమ్మను బరిలో నిలిపారు. ఆయన వదిన కూడా పోటీ చేయడం గమనార్హం.సాఫ్ట్వేర్ టు సర్పంచ్ వార్ మల్యాల: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రానికి చెందిన వీరబత్తిని మాలతి సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ ఎన్నికల బరిలో దిగారు. ఆమె హైదరాబాద్లోని విప్రో సంస్థలో సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేశారు. ఆర్మీ జవాన్ కూడా...: ఇదే మండల పరిధిలోని నూకపల్లి సర్పంచ్గా రిటైర్ట్ ఆర్మీ జవాన్ చెవులమద్ది శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.17 ఏళ్లు ఆర్మీలో జవాన్గా దేశానికి సేవలందించానని, ఇప్పుడు స్వగ్రామానికి సేవలందించాలనే లక్ష్యంతో తాను బరిలో ఉన్నట్టు తెలిపారు. అక్రమంగా సంపాదిస్తే జప్తు చేసుకోండి బాండ్ పేపర్ రాసిచ్చిన సర్పంచ్ అభ్యర్ధి తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జైపాల్నాయక్ సర్పంచ్గా పోటీ చేస్తున్నాడు. ప్రచారంలో భాగంగా గ్రామంలో ఇప్పుడు తనకు ఉన్న ఆస్తి కన్నా ఒక్క రూపాయి అక్రమంగా ఎక్కువ సంపాదించినా.. ఆ ఆస్తిని గ్రామపంచాయతీ జస్తు చేసుకొని ప్రజలకు పంచొచ్చని బాండ్ పేపర్ రాసి ప్రజలకు పంచుతూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాడు. అవినీతికి పాల్పడితే పదవి నుంచి దించేస్తాం చేర్యాల(సిద్దిపేట): ‘గ్రామ సర్పంచ్గా గెలిచిన వ్యక్తి అవినీతికి పాల్పడినా, స్వార్థ ప్రయోజనాలకు పదవిని దురి్వనియోగం చేసినా ఏసీబీ, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం. పదవి నుంచి దింపేందుకు వెనుకాడం’అని జయశంకర్ ఫౌండేషన్ సభ్యులు సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లిలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంచం భీంపల్లిలో సర్పంచ్ అభ్యర్థులతో గ్రామస్తుల ముఖాముఖి కమలాపూర్: ఈ నెల 11న మొదటి విడతలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తాము డబ్బులు, మద్యం పంచబోమని హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు ప్రమాణం చేశారు. జవ్వాజి కనుకయ్య, తోట శంకరయ్య, వాసాల శ్రీనివాస్, సముద్రాల మొగిలిలతో గ్రామస్తులు మంగళవారం ఉమ్మడి ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత ఎన్నికల్లో తాము సర్పంచ్గా గెలిస్తే చేసే అభివృద్ధి పనుల ఎజెండాను సర్పంచ్ అభ్యర్థులు గ్రామస్తులకు వివరించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంచబోమని అభ్యర్థులు హామీ ఇవ్వాలని గ్రామస్తులు కోరగా, సర్పంచ్ అభ్యర్థులు హామీ ఇచ్చారు. -
నేటి నుంచి మూడో విడత ‘పంచాయతీ’
సాక్షి, హైదరాబాద్: మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 182 మండలాల్లోని 4,159 పంచాయతీల్లోని సర్పంచ్ పదవులకు 36,452 వార్డులకు ఈ నెల 17న ఎన్నికలు జరుగుతాయి. శుక్రవారం వరకు నామినేషన్ల స్వీకరణ ఉంంటుంది. 6వ తేదీన నామినేషన్లను పరిశీలించి చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితాను రూపొందిస్తారు. ఈ నామినేషన్ల తిరస్కరణపై 7న వినతులు స్వీకరించి, 8న వాటిని పరిష్కరిస్తారు. 9న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ నెల 11వ తేదీన తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఎన్నికల అధికారులను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణీకుముదిని ఆదేశించారు. ఆయా జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, అధికారుల సన్నద్ధతపై వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షించారు. మంగళవారం ఎస్ఈసీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముగిసిన రెండో విడత నామినేషన్లు రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు మంగళవారంతో ముగిసింది. రాత్రి వరకు కూడా పలు జిల్లాల్లోని పంచాయతీల్లో నామినేషన్ల సమర్పణ కొనసాగినట్టుగా ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. మొత్తం మూడు రోజులకు సంబంధించిన నామినేషన్ల వివరాలను బుధవారమే వెల్లడించే అవకాశాలున్నాయి. రెండో విడతలో నోటిఫై చేసిన 4,332 సర్పంచ్ పదవులకు రెండు రోజులు కలిపి మొత్తం 12,479 మంది నామినేషన్లు వేశారు. వార్డు సభ్యుల విషయానికొస్తే 38,350 వార్డులకు 30,040 నామినేషన్లు పడ్డాయి. జిల్లాల వారీగా చూస్తే.. సర్పంచ్ నామినేషన్లలో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఇక్కడ అత్యధికంగా 883 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో సిద్ధిపేట, సంగారెడ్డి జిల్లాలు నిలిచాయి. ఇక వార్డు సభ్యుల విషయానికి వస్తే.. రంగారెడ్డి జిల్లాలో ఆశావహులు క్యూ కట్టారు. ఇక్కడ అత్యధికంగా 2,070 నామినేషన్లు వచ్చాయి. ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో నామినేషన్లు తక్కువగానే పడ్డాయి. -
కాళ్లలో కట్టెలు పెట్టడం.. రాజకీయాల్లో గేమ్ రూల్: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ఫుట్బాల్ ఆడుతుంటే కాళ్లతో తంతారు. అలా తంతారని, కాళ్లు తగులుతాయని ఫుట్బాల్ ఆడకుండా ఉంటామా? అలా కాలితో తన్నడమే ఫుట్బాల్ గేమ్ రూల్. అలాగే రాజకీయాల్లో కూడా కాళ్లలో కట్టెలు పెడుతుంటారు. అదే రాజకీయాల గేమ్రూల్. ఆ కట్టెలను తీసి పక్కన పెట్టి ముందుకెళుతుండాలి. నా కాళ్లలో కట్టెలు పెట్టారు. నేను బోర్లా పడిపోతాను. ఎవరో ఒకరు వచ్చి నన్ను లేపాలి అంటే కుదరదు. రాజకీయాల్లో మనమే లేవాలి.’ అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంటుందని, రాహుల్గాంధీ లాంటి వారిని ఇబ్బంది పెట్టాలని జీ–23 పేరుతో లేఖలు వస్తుంటాయని చెప్పారు. అలాంటి స్వేచ్ఛ ఉంది కాబట్టే పార్టీ 140 ఏళ్ల తర్వాత కూడా బతికి ఉందని, లేదంటే జనతా పార్టీలాగానో, ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనో కనుమరుగయ్యేదని అన్నారు. మంగళవారం గాందీభవన్లో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్కుమార్గౌడ్ అధ్యక్షతన టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం.. కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. డీసీసీ పదవికి సమయస్ఫూర్తి ముఖ్యం ‘కాంగ్రెస్ పార్టీలో సీఎం, మంత్రులు కావడం కంటే పార్టీ అధ్యక్షుడు కావడమే కష్టం. డీసీసీ అధ్యక్షుడు అంటే పార్టీ కుటుంబానికి పెద్దలా వ్యవహరించాలి. ఈ పదవికి వయసు ముఖ్యం కాదు. అందరినీ సమన్వయంతో ముందుకు నడిపించే సమయస్ఫూర్తి ముఖ్యం. కాంగ్రెస్ పార్టీలో కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. ఏకాభిప్రాయం సాధ్యమయ్యే పనికాదు. డీసీసీ అధ్యక్షుల విషయంలోనూ అంతే. మన సమాజంలో దాదాపు మూడు కోట్ల మంది దేవుళ్లు ఉన్నారు. దేవుళ్లు ఎంత మంది ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల మనస్తత్వాలుంటాయి. దేవుడి మీదనే ఏకాభిప్రాయం లేదు. డీసీసీ అధ్యక్షుల విషయంలో ఎలా సాధ్యమవుతుంది? మీరు డీసీసీ అధ్యక్షులు అవడం కొందరికి ఇబ్బంది కావచ్చు. మీరే వెళ్లి వారితో మాట్లాడండి. సీనియర్ల దగ్గరికెళ్లి కలిసి పనిచేద్దామని అడగండి. పదవి రాకముందు అనేక సమస్యలుంటాయి. పదవి వచి్చన తర్వాత అవన్నీ అధిగమించుకుంటూ పోవాలి. పనిచేసే క్రమంలో వచ్చే సమస్యలను పార్టీ పెద్దలతో మాట్లాడి పరిష్కరించుకోవాలి..’ అని ముఖ్యమంత్రి చెప్పారు.ఆరు నెలలే మీకు సమయం ‘కొత్తగా డీసీసీ అధ్యక్షులుగా నియమితులైన వారికి ఆరునెలలు మాత్రమే ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఈ సమయంలో అందరూ కష్టపడి పనిచేయాల్సిందే. ప్రతి నెలా రిపోర్టు తెప్పించుకుంటారు. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత రాహుల్గాం«దీని ప్రధానిని చేసే దిశలో ఎవరు పనిచేయకపోయినా అధ్యక్ష పదవి ఉండదు..’ అని రేవంత్ అన్నారు. అభివృద్ధిపై చర్చ పెట్టండి ‘రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయడం ఎంత ముఖ్యమో, చేసింది చెప్పుకోగలగడం కూడా అంతే ముఖ్యం. అందరి కృషితో రాష్ట్రంలో ప్రజాపాలన ఏర్పడింది. సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమం దిశలో నడిపించడమే కాకుండా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళుతున్నాం. సంక్షేమ పథకాల గురించి ప్రతి ఇంటికీ చేరవేయండి. అభివృద్ధి ప్రణాళికలను ప్రతి వేదికపై చర్చ పెట్టండి. పెళ్లి, చావు, దావత్, కల్లు కాంపౌండ్లు.. ఇలా ఎక్కడైనా నాటి, నేటి పాలన గురించి చర్చ పెట్టండి. రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు సారె కింద కోటి చీరలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని ఆడబిడ్డల దగ్గరికి చేర్చడం డీసీసీ అధ్యక్షులుగా మీ టాస్క్. ఏ ఆడబిడ్డా మాకు చీర రాలేదని చెప్పొద్దు. అలా చెపితే డీసీసీ అధ్యక్షులుగా మీరు పనిచేయనట్టే..’ అని సీఎం అన్నారు.మోదీ, అమిత్షాకు భయపడేవారెవరూ లేరు.. ‘నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియాగాంధీ, రాహుల్గాం«దీలపై కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ భయపడబోదు. మోదీ, అమిత్షాలకు భయపడేవారు ఇక్కడెవరూ లేరు. తమ ప్రాణాలనే కాదు ఆస్తులను కూడా త్యాగం చేసింది గాంధీ కుటుంబం. అలాంటి కుటుంబాన్ని కష్టపెడితే దేశ ప్రజలను కష్టపెట్టినట్టే. ఓట్ చోరీ అంశం దృష్టి మరల్చేందుకే ఈ కేసులు పెడుతున్నారు. ఇలాంటి చర్యలను దేశం సహించదు. గాంధీ కుటుంబానికి మనం అండగా నిలబడదాం. ఎందాకైనా పోరాడదాం. రావాల్సినవి ఇవ్వకపోతే కేంద్రాన్ని నేలమట్టం చేస్తాం మోదీ గుజరాత్కు ప్రధానిలా కాదు..దేశానికి ప్రధానిలా వ్యవహరించాలి. బుల్లెట్ ట్రైన్ ఆయన రాష్ట్రానికి తీసుకెళ్లినట్టే మన రాష్ట్రానికి కూడా ఇవ్వాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినవి ఒకటికి పదిసార్లు అడుగుతాం. ఇస్తే సరి..ఇవ్వకపోతే నేల మట్టం చేస్తాం. తెలంగాణ ప్రజల వ్యవహారం ఎలా ఉంటుందో బీజేపీ రుచి చూస్తుంది..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. కాగా సోనియా, రాహుల్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. 2029లో రాహుల్ను ప్రధానిని చేయాలి మీనాక్షి మాట్లాడుతూ.. గుజరాత్ డీసీసీ అధ్యక్షుల పనితీరును ప్రతి వారం సమీక్షిస్తున్నారని తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. ఇది మనకు పరీక్ష. ఈ పరీక్షలో పాస్ అయితేనే 2028లో జరిగే పరీక్షలో గెలుస్తాం. ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో రాహుల్ను ప్రధానిని చేసుకోగలం. అలా చేసుకోలేకపోతే మీరు నేను ఉండి ప్రయోజనం లేదు.’ అని వ్యాఖ్యానించారు. మహేశ్గౌడ్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసుకుంటూ వెళుతుంటే ఎవరో ఒకరు ఏదో ఒకరోజు గుర్తిస్తారని చెప్పారు. ఈ రోజు పనిచేసి రేపే ఫలితం రావాలంటే కుదరదని అన్నారు. డీసీసీ అధ్యక్షులు క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతకు కృషి చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, మహ్మద్ అజహరుద్దీన్, ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, డీసీసీల కొత్త, పాత అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఎన్ఎస్యూఐ, యూత్కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, సేవాదళ్ చైర్మన్లు పాల్గొన్నారు. కొందర్ని గదిలో వేసి కొట్టాలనిపించేది – సీఎం రేవంత్రెడ్డి నాకు ముఖ్యమంత్రి కాక ముందు చాలామంది మీద కోపంగా ఉండేది. కొంతమందిని గదిలో వేసి కట్టె తీసుకుని అలసి పోయేంతవరకు కొట్టాలని అనిపించేది. కానీ కొట్టే అవకాశం వచ్చినప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టా. మన శక్తినెందుకు వేస్ట్ చేసుకోవాలనుకున్నా. అందుకే ప్రజలకు సేవ చేసే పని మీద ఉన్నా. -
ఒక కుటుంబంలో ముగ్గురు సర్పంచ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా: మండలంలోని చీకటిమామిడి గ్రామానికి చెందిన మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబ సభ్యులు నాలుగు పర్యాయాలు సర్పంచ్గా ఎన్నికయ్యారు. మచ్చ చంద్రమౌళి తొలిసారిగా 1995లో చీకటిమామిడి గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైయ్యారు. ఐదేండ్లు ప్రజలతో మమేకమై పని చేయడంతో 2001లో సైతం రెండో సారి ఆయనను సర్పంచ్గా ఎన్నుకున్నారు. 2007లో చంద్రమౌళిగౌడ్ మాతృమూర్తి కళావతి సర్పంచ్గా పోటీ చేసి విజయం సాధించారు. 2013లో చంద్రమౌళి గౌడ్ సోదరుడు శ్రీనివాస్గౌడ్ ఎంపీటీసీగా గెలుపొందగా 2019లో మచ్చ శ్రీనివాస్గౌడ్ సతీమణి మచ్చ వసంత సర్పంచ్గా గెలిచారు. దాదాపు 20 సంవత్సరాల పాటు మచ్చ చంద్రమౌళిగౌడ్ కుటుంబం గ్రామానికి నిస్వార్థంగా సేవలందించి ప్రశంసలు పొందారు.సర్పంచ్గా 30 ఏళ్లు..కొండమల్లేపల్లి : రాష్ట్రంలో అత్యధిక ఆదాయం వస్తున్న గ్రామపంచాయతీల జాబితాలో కొండమల్లేపల్లి పేరు ఉటుంది. దానిని ఆస్థాయిలో తీర్చి దిద్దిన ఘనత గ్రామ మొదటి సర్పంచ్ కుంభం పుల్లారెడ్డికే దక్కుతుంది. 1959లో కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ ఏర్పడింది. మొదటి సర్పంచ్గా కుంభం పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఆ తరువాత 1964లో రెండో సర్పంచ్గా నాయిని పుల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1969 నుంచి 2000 సంవత్సరం వరకు సుమారు వరుసగా 30 సంవత్సరాల పాటు కుంభం పుల్లారెడ్డి సర్పంచ్గా వ్యవహరించారు. ఆయన హయాంలోనే కొండమల్లేపల్లి పశువుల సంతను అభివృద్ధి చేశారు. దాంతో ప్రస్తుతం సంత నుంచి ప్రతి ఏటా రూ. 1.23కోట్ల ఆదాయం గ్రామపంచాయతీకి సమకూరుతోంది.మేము డబ్బులు తీసుకోము..ఆత్మకూర్(ఎస్) (సూర్యాపేట) : ఎన్నికల్లో డబ్బులు, మద్యం ప్రభావం అధికం. పోటీ చేసే అభ్యర్థులు ఓటుకు ఇంత అంటూ రేటు నిర్ణయించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన యల్లంకొండ వెంకట్రెడ్డి తన ఇంటి గోడపై రాయించిన వాల్ పేయింటింగ్ గ్రామంలో చర్చనీయాంశమైంది. ‘మేము డబ్బులు తీసుకొని ఓటు వెయ్యం.. ప్రభావితం చేసేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటాం’ అని తన ఇంటి ప్రహరీపై రాయించాడు. -
పోటీకి కలిసొచ్చిన ప్రేమపెళ్లిళ్లు..
కాజీపేట : పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. ఎంతో కాలంగా గ్రామానికి మొదటి పౌరుడిగా ఎంపిక కావాలని ఎదురు చూస్తున్న కొందరికి ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లు నిరాశను మిగిల్చాయి. ఇదే రిజర్వేషన్లు మరికొంత మందికి తాము పోటీచేసే అవకాశం లేకున్నా తమ జీవిత భాగస్వాములకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయని సంబుర పడుతున్నారు. ధర్మసాగర్ మండల కేంద్రం ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గాలకు చెందిన యువతులను ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు యువకులు తమ భార్యలతో పోటీ చేయించేందుకు సమయత్తమయ్యారు. ముగ్గురు ఒకే రోజు తమ శ్రీమతులతో నామినేషన్ దాఖలు చేయించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఓటరు దేవుళ్లు ఎవరి పక్షాన నిలబడి ఆశీర్వదిస్తారో వేచిచూడాల్సిందే. -
జాక్పాట్ మల్లమ్మకు భారీ షాక్..!
వరంగల్ జిల్లా: మండలంలోని ఆశాలపల్లి జాక్పాట్ సర్పంచ్గా పిలుచుకునే ఒకే ఒక ఎస్సీ మహిళ కొంగర మల్లమ్మ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మాజీ సర్పంచ్ బొల్లెబోయిన కిశోర్ యాదవ్, నాయకులు కొంతం దశరథంతో కలిసి ఆమె గవిచర్ల కేంద్రంలో నామినేషన్ వేశారు. గ్రామంలో ఎస్సీ జనాభా లేకపోవడం.. ఉన్న ఒకే ఒక్క మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కావడం ఖాయమని అందరూ భావిస్తున్న తరుణంలో గ్రామానికి చెందిన ఇతర కులానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన యువతిని రంగంలోకి దింపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నట్లు గ్రామంతో పాటుగా మండలంలో చర్చ జరుగుతోంది. నామినేషన్లకు ఒక్క రోజే గడువు ఉండడంతో మంగళవారం నామినేషన్ల ప్రక్రియ ముగిసే సమయానికి ఉత్కంఠకు తెరపడనుందని ఊహగానాలు వినవస్తున్నాయి. జాక్పాట్ (Jackpot) సర్పంచ్గా మల్లమ్మ ఎన్నిక కానుందా లేక ప్రేమవివాహం యువతి తెరపైకి వస్తే, పోటీ పడి మల్లమ్మ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుందా అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. -
తొలి విడత పంచాయతీ లెక్క తేలింది
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఐదు సర్పంచ్ స్థానాలతోపాటు, 133 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) తెలిపింది. అయితే ఇక్కడ నామినేషన్లే పడకపోవడంతో ఎన్నికలు జరిగే అవకాశం లేకుండా పోయింది. బుధవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత ఏకగ్రీవమయ్యే సర్పంచ్, వార్డు స్థానాలతోపాటు ఎంతమంది బరిలో ఉంటారనే దానిపై స్పష్టత వస్తుందని ఎన్నికల అధికారులు చెప్పారు. మొత్తంగా చూస్తే తొలివిడత ఎన్నికల్లో...4,236 గ్రామపంచాయతీల్లో (5 మినహాయించి) 4,231 సర్పంచ్ పదవులకు 22,330 నామినేషన్లు, 37,440 వార్డు స్థానాల్లో 37,179 (133 మినహాయించి) స్థానాలకు 85,428 నామినేషన్లు దాఖలైనట్టుగా స్పష్టత వచ్చింది. నామినేషన్లలో నల్లగొండ జిల్లా టాప్ నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,950 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. సగటున ఒక్కో పదవికి 6 గురు పోటీ పడుతున్నారు. ములుగు జిల్లాలో అత్యల్పంగా నమోదయ్యాయి. ఇక్కడ 48 పంచాయతీలకు కేవలం 273 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. రాష్ట్రంలోనే ఇది అత్యల్పం. వార్డుల్లోనూ నల్లగొండే... వార్డు సభ్యుల నామినేషన్లలోనూ నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లాలోని 2,870 వార్డులకు 7,893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత సంగారెడ్డిలో 4,311 మంది, సూర్యాపేటలో 4,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వార్డుల విషయంలోనూ ములుగు జిల్లా చివరిస్థానంలో ఉంది. ఇక్కడ 420 వార్డులకు కేవలం 959 మంది మాత్రమే., ఆ తర్వాతి స్థానంలో నారాయణపేట 1,183 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. నామినేషన్ల దాఖలు కానిది ఎక్కడంటే... మంచిర్యాల జిల్లాలోని 3 పంచాయతీలతోపాటు 34 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఎస్ఈసీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. కొమురంభీమ్ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంతోపాటు 30 వార్డులకు, నిర్మల్ జిల్లాలో ఒక పంచాయతీతోపాటు 7 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. వికారాబాద్ జిల్లాలో 19, జనగామ జిల్లాలో 10 వార్డులకు, మరికొన్ని జిల్లాల్లో కూడా కొన్ని వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదని ఎస్ఈసీ తెలిపింది. -
విద్యావంతులు.. ఉన్నత ఉద్యోగాలు వదిలి..
డిగ్రీ, పీజీలు పూర్తి చేసినవారు..సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్న వారు కూడా ఈసారి పంచాయతీ బరిలో నిల్చున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తలంపుతో రాజకీయాల్లోకి వస్తున్నట్టు వారు చెబుతున్నారు. కథలాపూర్/రామగుండం/పుల్కల్: జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామానికి చెందిన బాసారపు నాగరాణి 2021లో బీటెక్ పూర్తిచేశారు. సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ⇒ ఇదే మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన గడ్డం అనూష 2020లో బీటెక్ పూర్తి చేశారు. సర్పంచ్ స్థానం జనరల్ మహిళకు కేటాయించడంతో ఆమె బరిలో ఉన్నారు. ⇒ పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం టీటీఎస్ అంతర్గాం గ్రామానికి చెందిన అంగోతు రవికుమార్ సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలి సర్పంచ్ స్థానం కోసం నామినేషన్ దాఖలు చేశారు. ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ ఎన్ఐటీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారు. తన స్వగ్రామాన్ని డిజిటల్ గ్రామంగా, వందశాతం అక్షరాస్యులుగా, మౌలిక సదుపాయాల కల్పనలో ఆధునికంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ⇒ సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని ముద్దాయిపేట పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో ఎంబీఏ చదివిన కొల్లూరు జ్యోష్న సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. జగ్గాసాగర్ సర్పంచ్ పదవికి వేలంరూ.28.60 లక్షలకు పాడిన ఓ వ్యక్తి మెట్పల్లి: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్లో సోమవారం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సర్పంచ్ పదవికి వేలం నిర్వహించినట్టు తెలిసింది. ఈ గ్రామంలో మొదటివిడత ఎన్నిక జరగాల్సి ఉండగా.. సర్పంచ్ స్థానానికి 12 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఓ వ్యక్తి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.20 లక్షలు గ్రామ అభివృద్ధికి ఇస్తానని వీడీసీ సభ్యులకు తెలిపారు. దీంతో బహిరంగ వేలం వేస్తే మరింత ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశముందని భావించి వారు వేలం నిర్వహించారు. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.28.60 లక్షలు చెల్లించడానికి ముందుకొచ్చాడు. అతడినే ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని వీడీసీ సభ్యులు నిర్ణయించి.. మిగతా వారంతా తమ నామినేషన్లను ఉపసంహరించుకోవాలని చెప్పినట్టు సమాచారం. ఉద్యోగికి ఓటు భయం ! సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వందల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీంతో ఎవరు ఏ అభ్యర్థికి లేదా ఏ పారీ్టకి ఓటు వేశారో తెలిసే అవకాశాలు ఉండవు. అయితే ఆయా పంచాయతీల పరిధిలో తక్కువ సంఖ్యలో పోస్టల్ ఓట్లు ఉంటాయి. కొన్నిచోట్ల ఒక్కరో, ఇద్దరో ప్రభుత్వ ఉపాధ్యాయులు/ఉద్యోగులు ఉంటారు. వారు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని అనుకున్నప్పుడు.. దరఖాస్తు చేసుకొని బ్యాలెట్ పత్రంలో తమకు నచి్చన వ్యక్తికి పెన్నుతో టిక్ చేస్తారు. అయితే కౌంటింగ్ సమయంలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.ఆ ఊళ్లో ఒకే ఉద్యోగి/ఉపాధ్యాయుడు ఉండి, ఆయన ఎవరో ఒకరికి ఓటు వేసినప్పుడు తన ఓటు ఎవరికి వేశారో బహిర్గతమవుతుంది. తద్వారా తమకు ఓటు వేయలేదని ఇతరులు ఆ ఉద్యోగిపై కక్ష పెంచుకునే అవకాశం ఉంటుంది. గతంలో పలుచోట్ల ఓటు రహస్యం బహిర్గతమై వివాదాలు ఎదురయ్యాయని ఓ ఉపాధ్యాయుడు ‘సాక్షి’తో తన ఆవేదన వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో పోస్టల్ బ్యాలెట్లను సాధారణ బ్యాలెట్ పత్రాల్లో కలిపితే ఏ సమస్యా ఉండదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల అధికారులు తక్షణమే దీనిపై చర్యలు తీసుకొని పోస్టల్ బ్యాలెట్ వల్ల ఎదురయ్యే ఇబ్బందులను తొలగించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. నామినేషన్లు తీసుకున్నాక.. రిజర్వేషన్ మారిందన్నారు ! ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు పంచాయతీలోని 11వ వార్డును జనరల్ (అన్రిజర్వ్డ్)కు కేటాయిస్తూ కలెక్టర్ సర్క్యులర్ జారీ చేశారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ వార్డుకు జనరల్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ మద్దతుదారుడు మైతాబ్కు ఫోన్ చేసిన ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది.. ‘మీ వార్డును జనరల్ మహిళకు కేటాయించారు, మీ భార్యను తీసుకొచ్చి మళ్లీ నామినేషన్ వేయమని చెప్పడంతో కంగుతిన్నారు. అయితే, తమకు ఇచి్చన రిజర్వేషన్ ప్రకారమే నామినేషన్లు వేశామని, వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఈ విషయమై ఎంపీడీఓ నర్సింలును వివరణ కోరగా తాను జారీచేసిన రిజర్వేషన్ జాబితానే నామినేషన్ అధికారికి ఇచ్చామని తెలిపారు.రూపాయి నాణేలతో నామినేషన్ డిపాజిట్ మిరుదొడ్డి: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన మొగుళ్ల లావణ్య సర్పంచ్ పదవికి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ డిపాజిట్ కింద తాను దాచుకున్న రూపాయి నాణేలను అందజేశారు.మా తండాకు అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాంధర్పల్లి(నిజామాబాద్ రూరల్): తమ తండా వారికి సర్పంచ్గా అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం చెరువు తండావాసులు పేర్కొన్నారు. సోమవారం ఎంపీడీఓ లక్ష్మారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోబిన్సాబ్ తండా, చెరువు తండాలను కలిసి కొత్త గ్రామపంచాయతీగా ఏర్పాటు చేశారని, ఒకసారి మోబిన్సాబ్ తండాకు మరోసారి చెరువు తండాకు సర్పంచ్ అవకాశం ఇవ్వాలని అప్పట్లో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు.ఒప్పందం ప్రకారం మొదటిసారి మోబిన్సాబ్ తండాకు చెందిన అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు. ఈసారి తమ తండాకు అవకాశం ఇవ్వాల్సి ఉండగా, మోబిన్సాబ్ తండావాసులు ఒప్పందాన్ని ఉల్లంఘించి సర్పంచ్ అభ్యర్థిని పోటీలో నిలబెడుతున్నారన్నారు. ఒప్పందం ప్రకారం తమ తండాకు చెందిన వ్యక్తికే సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని లేకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.ఏం చేయాలో చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటుఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో సర్పంచ్గా పోటీచేసే అభ్యర్థులు చేయాల్సిన పనుల జాబితాతో ఆ గ్రామ యువత ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గ్రామానికి అవసరమైన రోడ్లు, ప్రభుత్వం పాఠశాలలో అడ్మిషన్లు పెంపు, యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ ఫ్లెక్సీ ద్వారా స్పష్టం చేశారు. గెలిపిస్తే శుభకార్యాలకు టెంట్హౌస్ సామగ్రి ఉచితంఇల్లంతకుంట: రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సోమారంపేట గ్రామానికి చెందిన భారతమ్మ కుటుంబానికి టెంట్హౌస్ ఉంది. సర్పంచ్గా పోటీ చేస్తున్న ఆమె.. తనను గెలిపిస్తే ఐదేళ్లపాటు గ్రామస్తులు చేసుకునే అన్ని శుభకార్యాలకు టెంట్హౌస్ సామగ్రిని ఉచితంగా సరఫరా చేస్తానని ప్రచారం చేస్తున్నారు. -
నేటితో రెండో విడత నామినేషన్లకు తెర
సాక్షి, హైదరాబాద్: మంగళవారం సాయంత్రం 5 గంటలకు గ్రామ పంచాయతీ రెండో విడత ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది. రెండోదశ ఎన్నికల్లో భాగంగా తొలిరోజు (ఆదివారం)..మొత్తం 4,332 సర్పంచ్ పదవులకు గాను 2,975, 38,342 వార్డులకు గాను 3,608 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) వర్గాల సమాచారం. అయితే సోమవారం సర్పంచ్, వార్డు సభ్య స్థానాలకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యే దానిపై మాత్రం రాత్రి పొద్దుపోయే వరకు ఎస్ఈసీకి పూర్తి సమాచారం అందలేదు. దీంతో మంగళవారమే రెండురోజుల్లో దాఖలైన నామినేషన్ల సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ‘పోస్టల్ బ్యాలెట్’ వీరికే.. పంచాయతీ ఎన్నికల్లో పోలీసులు, సైన్యం, రక్షణ దళాలు, ప్రభుత్వ ఉద్యోగులు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు ‘పోస్టల్ బ్యాలెట్’ను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత రిటర్నింగ్ అధికారికి ఫారం–12 లేదా ఫారం–12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దీనికి పోస్టల్ చార్జీలు ఉండవు. కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటల లోపు రిటరి్నంగ్ అధికారికి ఇవి చేరాలి. -
లక్కంటే మల్లమ్మదే.. వద్దన్నా సర్పంచైతుంది!
సాక్షి, వరంగల్: మండలంలోని ఆశాలపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు కేటాయించడం చర్చనీయాంశమైంది. గ్రామంలో ఉన్న ఒకేఒక ఎస్సీ మహిళ సర్పంచ్గా ఏకగ్రీవంగా కానుంది. వివరాలిలా ఉన్నాయి. ఆశాలపల్లిలో ఎస్సీ కుటుంబాలు లేవు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం రామారం నుంచి కొంగర మల్లమ్మ, వెంకటయ్య దంపతులు 10 సంవత్సరాల కిత్రం బతుకుదెరువు కోసం పాలేరు పనికి ఆశాలపల్లికి వచ్చారు. వారికి ముగ్గురు కూతుళ్లు ఉండగా పెళ్లి చేశారు. మల్లమ్మ, వెంకటయ్య ఇద్దరే ఎస్సీ ఓటర్లుగా నమోదయ్యారు. కాగా, మూడు నెలల క్రితం వెంకటయ్య గేదెలను మేపడానికి వెళ్లి కుంటలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడు.మల్లమ్మ ఒక్కరే ఎస్సీ ఓటరుగా గ్రామంలో నమోదై ఉంది. ఇప్పుడు ప్రకటించిన ఆశాలపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క ఎస్సీ మహిళ మల్లమ్మ ఏకగ్రీవంగా సర్పంచ్ కానుంది. దీంతో సర్పంచ్ రిజర్వేషన్ మార్చాలని కోరుతూ మాజీ సర్పంచ్ కిశోర్యాదవ్తో పాటు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మాధవరెడ్డి, నాయకులు రమేశ్, నాగరాజు, సంపత్, నరహరి తదితరులు డీపీఓ రాంరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కాగా, ఒక్కసారి రిజర్వేషన్ ప్రకటించిన తర్వాత మార్చడానికి వీలు లేదని, మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్ కావడం ఖాయమని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు.అధికారులు లెక్కలు సరిచేయకపోవడంతోనే..2011 జనాభా లెక్కల ప్రకారం 1,807 జనాభా ఉంది. 350 మంది ఎస్సీలు ఉన్నట్లుగా అధికారులు లెక్కలు తేల్చారు. కానీ, వాస్తవంగా ఆ గ్రామంలో ఎస్సీలు లేరు. అధికారులు ఆ లెక్కలను సరిచేయకపోవడంతోనే రిజర్వేషన్ ఎస్సీ మహిళకు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. దీంతో మల్లమ్మ ఏకగ్రీవ సర్పంచ్గా ఎన్నికై జాక్పాట్ కొట్టనుంది. -
సర్పంచ్ బరిలో భార్య.. వార్డు మెంబర్గా భర్త
డిచ్పల్లి మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ ఈ సారి తన భార్యను బరిలోకి దించుతున్నా రు. సర్పంచ్గా కాకుండా తన భార్యతో కలిసి వార్డు మెంబర్గా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇద్దరూ గెలిస్తే ఉప సర్పంచ్ పదవి దక్కించుకునేలా ప్రణాళి క రూపొందిస్తున్నాడు. అందుకోసం తన కు అనుకూలమైన వార్డును వెతుక్కుని ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించాడు.రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్గా పోటీ చేసే అవకాశం కోల్పోయిన చోట ఉప సర్పంచ్ పదవినైనా కైవసం చేసుకోవాలనే యోచనలో కొందరు నాయకులు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లు ఉన్న గ్రామాల్లో ఉప సర్పంచ్గా ఎన్నికైతే ఆ పంచాయతీల్లో ఎంతోకొంత పెత్తనం కొనసాగుతుందనే ఆలోచనతో వార్డు సభ్యుల మద్దతును కూడగట్టుకుంటున్నారు.డిచ్పల్లి/మోర్తాడ్: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉప సర్పంచ్ పదవికి డిమాండ్ పెరిగింది. సర్పంచ్ రిజర్వేషన్ తమకు అనుకూలంగా రాని గ్రామాల్లో చక్రం తిప్పే నాయకులంతా ఇప్పుడు ఉప సర్పంచ్ పదవిపై దృష్టి సారించారు. రిజర్వేషన్లు అనుకూలంగా రాకపోవడంతోపాటు మహిళలకు 50శాతం సర్పంచ్ స్థానాలు రిజర్వ్ కావడంతో చాలా మంది కీలకనాయకులకు పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. సర్పంచ్ స్థానం మహిళలకు రిజర్వు అయిన చోట్ల తమ భార్యలను బరిలోకి దింపి తాము వార్డు సభ్యులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు ఇలా.. జిల్లాలో 545 సర్పంచ్ స్థానాలు ఉండగా.. 129 – అన్రిజర్వ్డ్ (జనరల్), 113 – అన్ రిజర్వ్డ్ (మహిళ), 70 – బీసీ (జనరల్), 55– బీసీ (మహిళ), 47 – ఎస్సీ (జనరల్), 35 – ఎస్సీ (మహిళ), 55 – ఎస్టీ (జనరల్) (వందశాతం ఎస్టీ జనాభా క లుపుకుని), 41 – ఎస్టీ (మహిళ) (వందశాతం ఎస్టీ జనాభా కలుపుకుని) రిజర్వ్ అయ్యాయి. ఎస్సీ, ఎస్టీ స్థానాలతోపాటు మహిళలకు రిజర్వ్ అయిన స్థానాల్లో ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చోటామోటా నేతలంతా ఉప సర్పంచ్ పదవి కోసం రంగంలోకి దిగుతున్నారు. బీసీలకు 125 స్థానాలుండగా వాటిలో 55 మహిళలకు కేటా యించారు. ఇన్నాళ్లు ఆశలు పెంచుకున్న బీసీ జనరల్ అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం లేకుండా పో యింది. దీంతో ఉప సర్పంచ్ పదవిపై కన్నేసిన నాయకులు గెలుపు కోసం బరిలోకి దిగుతున్నారు. అలాగే జిల్లాలో 113 స్థానాలు మహిళ (అన్ రిజ ర్వుడ్)కు కేటాయించడంతో ఆయా స్థానాల్లో సైతం ఉప సర్పంచ్ పదవులకు డిమాండ్ పెరిగింది. చెక్పవర్ ఉంటే పెత్తనం చెలాయించవచ్చనే..! ఉప సర్పంచ్లకు సైతం చెక్ పవర్ ఉండడంతో ఈ పదవికి డిమాండ్ పెరిగింది. మహిళలు సర్పంచ్లుగా ఉన్నచోట్ల పెత్తనం చలాయించడానికి ఉప సర్పంచ్ పదవి ఎంతో అనుకూలమనే భావనలో కొందరు నాయకులు ఉన్నారు. దీంతో సర్పంచ్ పదవికి పోటీ చేసే అవకాశం దక్కని వారు ఉప సర్పంచ్ పదవిపై కన్నేసి పావులు కదుపుతున్నారు. -
నాడు సర్పంచ్... నేడు దినసరి కూలీ
కామారెడ్డి రూరల్: కుల వృత్తి చేసుకుంటూ జీవించే వ్యక్తి ఓ గ్రామానికి ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికయ్యాడు. ప్రజాసేవే ధ్యేయంగా పనిచేసి ఉన్న కుల వృత్తిని వదిలేసి నేడు దినసరి కూలీగా మారాడు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో ఏకగ్రీవంగా ఎన్నికైన ఓ సర్పంచ్ దీనగాథ. ప్రస్తుతం డబ్బులు లేనిదే రాజకీయాల్లోకి రావడం సాధ్యంకాదు. డబ్బు లేకపోతే ఆ నాయకునికి విలువే లేదు. ఇక ఒక పదవి వచ్చాక ఆ నాయకుడు సంపాదించుకునే తీరే వేరు. ఒకసారి సర్పంచ్ అయితే ఒక తరం బతికేయొచ్చు అనుకుంటున్న నేతలున్న ఈ రోజుల్లో ఐదేళ్లు సర్పంచ్గా కొనసాగినా చిల్లి గవ్వ కూడా వెనకేసుకోకుండా ప్రభుత్వం కట్టించిన డబుల్ బెడ్రూంలో ఉంటూ రోజువారీ కూలి పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. నర్సన్నపల్లిలో 2014లో ఎస్టీ సామాజిక వర్గానికి సర్పంచ్ స్థానం రిజర్వేషన్ వచ్చింది. గ్రామానికి చెందిన కుర్ర ఎల్లయ్య అనే వ్యక్తి పందులను మేపుతూ జీవనాన్ని సాగిస్తుండేవాడు. గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఐదేళ్లు సర్పంచ్ పదవిలో ఉన్నాడు. నిజా యితీగా ప్రజల కోసం పనిచేశాడు. పదవీకాలం సమయంలో చిల్లి గవ్వ కూడా సంపాదించుకోలేదు. అంతేకాకుండా సర్పంచ్గా పని చేస్తూ పందులను మేపుతుండడంతో అధికారులు(హోదా) హుందాగా బతకాలని సూచించడంతో ఉన్న పందులను అమ్మి వేశాడు. నివసించడానికి పూరి గుడిసెలోనే ఐదేళ్లు జీవనం సాగించాడు. అప్పటి సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పేదవారికి కట్టించగా ఎల్లయ్యకు కూడా ఇచ్చారు. ఈ ఒక్కటి తప్ప తన పదవిలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు కానీ ఏదీ సంపాదించుకోలేదు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనతో పాటు పని చేసిన సర్పంచ్లు అందరూ ఎంతో కొంత కూడబెట్టుకొని నేడు దర్జాగా బతుకుతున్నారని, తాను మాత్రం సర్పంచ్ కంటే ముందు ఎలా ఉన్నానో సర్పంచ్ పదవి అయిపోయాక కూడా అలాగే ఉన్నానని పేర్కొన్నారు. ఉపాధి చూపించి ఆదుకోవాలని ఆయన వేడుకున్నారు. -
వీపు రుద్దుతా.. నా భార్యకు ఓటేయండి
మంచిర్యాల జిల్లా: పంచాయతీ ఎన్నికల వేళ కొందరు నామినేషన్ వేసిన మరుక్షణమే ప్ర చారం మొదలు పెట్టారు. మండలంలో ని ముత్యంపేట పంచాయతీలో 6వ వా ర్డులో పోటీచేస్తున్న కొండా రజిత, తన భర్తతో కలిసి ఆదివారం ప్రచారం మొదలు పెట్టింది. ఓ ఇంటికి వెళ్లగా నర్సయ్య అనే ఓటరు ఆరుబయట స్నానం చేస్తుండగా, అభ్యర్థి భర్త అతని వీపు రుద్దుతూ, నీ ఓటు నా భార్యకు వేయాలని అభ్యర్థించాడు. ఈ దృశ్యాన్ని నరేశ్ వీడియోలో చిత్రీకరించి వాట్సాప్ స్టేటస్ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నాడు. నామినేషన్ వేసిన మరుసటి రోజే గుండెపోటు మహిళ మృతి..పొన్కల్లో ఘటనమామడ: వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు నామినేషన్ వేసిన మరుసటి రోజే మహిళ గుండెపోటుతో మృతిచెందింది. మండలంలోని పొన్కల్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో 12వ వార్డు మెంబర్గా పోటీ చేసేందుకు దుబాక జమున (50) శనివారం నామినేషన్ వేసింది. మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇంతలోనే ఆదివారం జమునకు గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
సర్పంచ్ పోటీకి లవర్తో నామినేషన్
సంగారెడ్డి టౌన్: ప్రేమించిన యువతితో సర్పంచ్ ఎన్నికల్లో నామినేషన్ వేయించి, ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడో యువకుడు. జిల్లావ్యాప్తంగా హాట్టాపిక్గా మారిన ఈ సంఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్గౌడ్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే తాళ్లపల్లి సర్పంచ్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు అయ్యింది. దీంతో తన ప్రేమించిన శ్రీజతో నామినేషన్ వేయించాలని అనుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదంటూ శ్రీజ తల్లిదండ్రులు సంగారెడ్డి రూరల్ పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేశాడు.దీంతో చంద్రశేఖర్గౌడ్ శ్రీజతో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయించి, తర్వాత ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ ప్రేమ జంటకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతుగా నిలిచాడు. వారితో కలిసి నేరుగా పోలీస్స్టేషన్కు వచ్చి పోలీసులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్గౌడ్, శ్రీజ మాట్లాడుతూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నామని తెలిపారు. ఇందులో ఎవరి బలవంతం లేదని తాము ఇష్ట పూర్వకంగా పెళ్లి చేసుకున్నామని చెప్పారు. అయితే తాళ్లపల్లి గ్రామపంచాయతీని ఏకగ్రీవంగా చేయడానికి చేసిన ప్రయత్నాలకు ఈ పెళ్లితో బ్రేక్ పడింది. -
సర్పంచ్: 5,654 వార్డులు: 82,276
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భారీ సంఖ్య లో నామినేషన్లు దాఖలయ్యాయి. శనివారం సాయంత్రం 5 గంటల్లోపు అభ్యర్థులు భారీ సంఖ్యలో క్యూలైన్లో ఉండటంతో అర్ధరాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. దీంతో ఆదివారం తొలివిడత నామినేషన్ల సంఖ్య తేలింది. మొదటి విడతలో 4,236 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 25,654 మంది, 37,440 వార్డులకు 82,276 మంది నామినేషన్లు వేశారు. ⇒ సూర్యాపేట జిల్లాలో సర్పంచ్ పదవుల కోసం అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు సమరి్పంచారు. ఇక్కడ 159 పంచాయతీలకుగాను అత్యధికంగా 1,387 నామినేషన్లు దాఖలయ్యాయి. వికారాబాద్ జిల్లాలో 262 పంచాయతీల్లో సర్పంచ్ల కోసం1,383 నామినేషన్లు వేయగా, మహబూబాబాద్లో 155 పంచాయతీలకుగాను 1,239, కామారెడ్డి 167 జీపీలకు 1,224, రంగారెడ్డిలో 174 జీపీలకు 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి. ⇒ వార్డు సభ్యుల విషయానికి వస్తే సీన్ మారింది. పంచాయతీలు ఎక్కువగా ఉన్న రంగారెడ్డి జిల్లాలో వార్డు స్థానాలకు నామినేషన్లు వెల్లువలా వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కూడా వార్డుల్లో గట్టి పోటీ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 1,530 వార్డులకుగాను 4,540, వికారాబాద్ 2,198 వార్డులకుగాను 4,379 నామినేషన్లు, ఆ తర్వాత ఖమ్మం జిల్లాలో 1,740 వార్డులకు 4,041, కామారెడ్డిలో 1,520 వార్డులకు 3,832, సూర్యాపేటలో 1,442 వార్డులకు 3,791 నామినేషన్లు వచ్చాయి. 3న నామినేషన్లు ఉపసంహరణ.. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం అధికారులు నామినేషన్లను పరిశీలించారు. స్రూ్కట్నీ చేసి అభ్యర్థుల జాబితా రూపొందించారు. తిరస్కరించిన నామినేషన్లపై సోమవారం సా యంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. మంగళవారం ఈ అప్పీళ్లను పరిష్కరిస్తారు.బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు మధ్యా హ్నం 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. 11వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రెండో విడత నామినేషన్లు షురూ రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం నుంచి మొదలైంది. అయితే అర్ధరాత్రి వరకూ దాఖలైన నామినేషన్ల సంఖ్యపై స్పష్టత రాలేదు. రెండో విడతలో 4,333 సర్పంచ్, 38,350 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 2వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. 6న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. 14న పోలింగ్, అదే రోజు ఫలితాల ప్రకటన ఉంటుంది. -
చిత్ర విచిత్ర పంచాయతీలు
పంచాయతీ ఎన్నికల వేళ...గ్రామాల్లో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు వేయడం లేదని కొందరు...భూ సమస్య పరిష్కరించడం లేదంటూ మరికొందరు పంచాయతీ ఎన్నికలు బహిష్కరించేందుకు సిద్ధమయ్యారు. కొన్ని గ్రామాలకు చెందిన యువకులు తాము నోట్లకు అమ్ముడుపోమని, రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కు నిస్వార్థంగా వినియోగించుకుంటామని చెప్పారు. ‘నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు’ హసన్పర్తి: హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మడిపల్లి గ్రామంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాందారి రమేశ్ తన ఇంటి వద్ద ఈ ఫ్లెక్సీ ప్రదర్శించాడు. ‘నేను మడిపల్లివాసిని.. నోట్లకు అమ్ముడు పోయే ఓట్లు మా ఇంట్లో లేవు’అని అందులో రాసి ఉంది. ‘మా ఓట్లు అమ్మబడవు’ హుస్నాబాద్ రూరల్: ‘రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ఎంతో విలువైనది. మేము అమ్ముకోం’అని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గాం«దీనగర్ గ్రామ యువకులు ఆదివారం తమ ఇళ్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బోజ అనిల్కుమార్, కొడముంజ అనిల్కుమార్, ఎర్రవెల్లి సంపత్లు పట్టభద్రులు. వీరు గ్రామాభివృద్ధి కమిటీని బలోపేతం చేసి స్వచ్ఛందంగా ఓటుహక్కు వినియోగించుకొనేలా యువతను చైతన్యం చేస్తున్నారు. రిజర్వు ఓటరు ఒక్కరే...ఆమెనే సర్పంచ్ మాడుగులపల్లి: నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం గజలాపురం గ్రామపంచాయతీ సర్పంచ్ పదవి ఎస్టీకి మహిళకు రిజర్వు అయ్యింది. అయితే గ్రామంలో బ్రాహ్మముల రోజా ఒక్కరే ఎస్టీ మహిళా ఓటరు. రోజా ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆమె ఎన్నిక ఏకగీవ్రం అయ్యే అవకాశముంది. 2014 పంచాయతీ ఎన్నికల్లోనూ గజలాపురం ఎస్టీకి రిజర్వ్ అయ్యింది. ఆ ఎన్నికలో ఆమె 16 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎస్టీకి రిజర్వ్ కావడం ఆమెకు అదృష్టంగా మారింది. గతంలో ఇక్కడ ఉన్న కుటుంబం వెళ్లిపోవడంతో.. గ్రామంలో ఇప్పుడు ఒకే ఎస్టీ ఓటు ఉంది. జైలు నుంచి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేములవాడ అర్బన్: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన బూర బాబు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. బూర బాబు ఇటీవల జరిగిన ఓ కేసు విషయంలో జైలుకు వెళ్లాడు. సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్కు రిజర్వు కావడంతో బూర బాబు జైలు నుంచి నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసి పంపించగా, వారి బంధువులు శనివారం నామినేషన్ దాఖలు చేశారు. నువ్వే పోటీ చేయాలంటూ కాళ్లు పట్టుకున్న ఓటరు దంతాలపల్లి: మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల సర్పంచ్ పదవి బీసీ మహిళకు రిజర్వు అయ్యింది. దాట్ల ఎంపీటీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీశ్ తల్లి రాములమ్మ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆదివారం ఓ ఓటరు ఆమె కాళ్లపై పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీఎం ఇలాకాలో టీడీపీ మద్దతుదారు ఏకగ్రీవం నారాయణపేట/ మద్దూరు: సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని అప్పారెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు బుడ్డోళ్ల శ్రీనివాస్ సతీమణి మల్లీశ్వరి ఏకగ్రీవంగా ఎన్నిక కానుంది. పంచాయతీ ఎన్నికల్లో పాఠశాల భవనం కోసం 20 గుంటల భూమిని ఇచ్చేందుకు పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకుంది. ఎనిమిది వార్డులుండగా, వారు అవి కూడా తను చెప్పిన వారినే ఓకే చేసేందుకు పెద్దలు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కరే సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. త్వరలో ఆమె సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సర్పంచ్గా గెలిపిస్తే 22 గ్యారంటీలు అమలు చేస్తా గద్వాల టౌన్: పంచాయతీ ఎన్నికల్లో తనను సర్పంచ్గా గెలిపిస్తే 22 గ్యారంటీలను అమలు చేస్తానని రూ.100 బాండ్ పేపర్ను ఓ అభ్యర్థి హామీ పత్రంగా విడుదల చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపురం సర్పంచ్ పదవికి ఆంజనేయులు నామినేషన్ వేశారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే ఎవరూ చేయని విధంగా అభివృద్ధి చేస్తానంటూ ఏకంగా బాండ్ పేపర్ను విడుదల చేయడం చర్చనీయాంశమైందితన కుల ఓట్ల కోసం.. తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువనేత తన కులం కాకుండా వేరే కులానికి చెందిన యువతిని ప్రేమించి ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆ గ్రామంలో తన కులం ఓట్లు మెజారిటీగా ఉండడం.. వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు తెలిస్తే ఓట్లు పడవు అనుకున్నాడో ఏమో గానీ ఆమెను ఎవరికీ తెలియకుండా దాచేశాడు. ఆమెను వేరే ఊరిలో పెట్టి కాపురం చేస్తూ గ్రామంలో మాత్రం తనకు పెళ్లి కానట్టు చెబుతూ సర్పంచ్ ఎన్నికలకు ప్రచారం చేసుకుంటున్నాడు. రోడ్డు విస్తరణ చేపట్టకుంటే ఎన్నికలు బహిష్కరిస్తాం వెల్దుర్తి(తూప్రాన్): వెల్దుర్తి నుంచి జిల్లా కేంద్రమైన మెదక్ వెళ్లే ప్రధాన రహదారిని రెండు లేన్లుగా విస్తరించకుంటే పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తామని మండల పరిధిలోని పలు గ్రామాల ప్రజలు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం బండపోసాన్పల్లి, శెట్టిపల్లి కలాన్, రామాయిపల్లి, కొత్తపల్లి గ్రామాలకు చెందిన యువకులు ఆయా గ్రామాల గుండా బైక్ ర్యాలీ చేపట్టి శెట్టిపల్లికలాన్లో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. రోడ్డు విస్తరణ చేపట్టాలని పాదయాత్ర, సంతకాల సేకరణ చేపట్టి కలెక్టర్కు అందజేసినా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. మా భూ సమస్య పరిష్కరిస్తేనే... అక్కన్నపేట(హుస్నాబాద్): సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కపూర్నాయక్ తండాలో రైతులు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. తండాలో ఆదివారం ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము ముత్తాతల నుంచి సాగు చేసుకుంటున్న భూముల రిజిస్ట్రేషన్లు కావడం లేదని అనేకసార్లు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల ఎదుట మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదన్నారు. ధరణిలో సీలింగ్ భూమి కింద నమోదు కావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. -
పల్లె పోరులో ఏఐ.. పంచాయతీ ఎన్నికల్లో ఓట్లకు గాలం
టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పంచాయతీ ఎన్నికల్లోనూ హల్చల్ చేస్తోంది. పల్లె పోరులో తలపడుతున్న అ భ్యర్థులు ఈ సాంకేతికతను వినియోగించుకుంటూ ప్రచార పర్వంలో సరికొత్త పంథా తో దూసుకెళుతున్నారు. ఓటరు నాడి పట్టే వీడియోలు.. ప్రత్యర్థిపై విరుచుకుపడే సెటై ర్లు.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మీమ్స్.. పల్లె జనం మనసును హత్తుకునే అభివాద సందేశాలు.. ఓటర్ల సెల్ ఫోన్లలో చక్కర్లు కొడుతున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్.. అన్ని సామాజిక మాధ్యమాలను ఏఐ జనరేటెడ్ వీడియోలతో మోత మోగిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ కృత్రిమ మేధ ఆధారంగా సృష్టించిన వీడియోల్లో ఉంటున్నాయి. సాక్షి, హైదరాబాద్: టింగ్ మంటూ వాట్సాప్ గంట మోగిందంటే చాలు అది ఓటు గురించి అభ్యర్థి అభ్యర్థన వీడియోనే. సెల్కు వచ్చే మెసేజ్ను క్లిక్ చేస్తే యూట్యూబ్కో, ఇన్స్టాకో కనెక్టయ్యే లింకులే. గెలిస్తే ఊరునే అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చే ఏఐ ఆధారిత వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి. ఊరు ఊరంతా తనకే మద్దతునిచి్చనట్టు తెలిపే జనరేటెడ్ వీడియో, ఆడియోల సాంకేతికత పంచాయతీ పోరులో కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఫొటో దొరికితే చాలు ఏఐ టెక్నాలజీతో రాజకీయ మైండ్గేమ్ మొదలవుతోంది. ప్రత్యర్థి అనుయాయులు వచి్చనట్టు, తనకు మద్దతు ఇచ్చినట్టు, కండువా కప్పినట్టు.. ఇలా రకరకాల వీడియోలను ఏఐతో సృష్టిస్తున్నారు. కొన్ని వర్గాలను కలిసినట్టు, మాటామంతీ చేసినట్టు, వారు తమవైపు తిరిగినట్టుగా.. పాత పోటోలను సరికొత్త టెక్నాలజీ సాయంతో మార్చేస్తున్నారు. చాలామంది అభ్యర్థులు వార్డుకో వ్యక్తిని సోషల్ మీడియా ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. ఏఐ ఆధారంగా అభ్యరి్థకి అనుకూలమైన ట్రెండ్ ఉందని వీడియోలు క్రియేట్ చేయడం, ఆ వీడియోలకు లైక్లు వచ్చేలా చేయడం వీళ్ళ బాధ్యత. ఇతర పక్షాలను దెబ్బతీసే వీడియోలు, ఫోటోల సృష్టిలోనూ ఏఐ పాత్ర కీలకంగా మారింది. ఐదేళ్ళుగా సర్పంచ్గా ఉన్నా రోడ్లు, నీళ్ళు, విద్యుత్ పరిస్థితి దయనీయంగా ఉందనే సాధారణ ప్రచారానికి బదులు ఏఐ వీడియో సృష్టితో విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు. మరోవైపు తమ పరపతి పెరుగుతుందనే భావనతో మంత్రులను కలిసినట్టు, స్థానిక ఎమ్మెలేతో పాటు రాజకీయ ప్రముఖులతో ముచ్చటిస్తున్నట్టుగా ఉన్న ఏఐ జనరేటెడ్ వీడియోలు రూపొందించి ప్రచారంలో పెడుతున్నారు. పెరుగుతున్న యాప్ల వాడకం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్లే స్టోర్లో ఏఐ యాప్లు డౌన్లోడ్, సబ్ప్క్రైబ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల రోజుల్లోనే ఫిల్మోరా, ఏఐ జనరేటెడ్ చాట్ జీపీటీ, యానిమేటర్స్ వంటి ఏఐ యాప్ల వాడకం పెరిగిందని డిజిటల్ స్టూడియో నిర్వాహకుడు నందగోపాల్ వర్మ తెలిపారు. ఏఐ జనరేటెడ్ వీడియో కోసం పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారు అనేక రకాల ఆప్షన్లు ఇస్తున్నారని చెప్పాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు చేస్తున్న విద్యార్థులు కూడా ఏఐ జనరేటెడ్ వీడియోల సృష్టిలో కీలక భూమిక పోషిస్తున్నారు. సొంత ఊళ్ళో తమ అభ్యర్థి తరపున డిజిటల్ ప్రచారం చేసేందుకు, తమ విద్యను స్థానికుల ముందు ఆవిష్కరించేందుకు ఒక అవకాశంగా దీన్ని ఎంచుకుంటున్నారు. మరోవైపు సంపాదనకు సైతం ఇది ఉపకరిస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. బరిలో ఉండే అభ్యర్థి ప్రసంగాలను అందంగా గ్రామస్తుల ముందుకు తీసుకెళ్ళే వాయిస్, లిప్ సింక్ వంటి అప్లికేషన్లను వెతికి మరీ పట్టుకుంటున్నారు. కొన్ని యాప్లు ఇండియాలో పనిచేయవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వీపీఎన్ కనెక్షన్కు లింక్ అవుతున్నారు. పార్లమెంట్ దాకా ఇదే ట్రెండ్! ఇక మీదట పల్లె నుంచి పార్లమెంట్ దాకా ఎన్నికల ప్రచారంలో ఏఐదే హవా అని తాజాగా చేసిన పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2022 వరకూ ఏఐ ఆధారిత జరేటెడ్ అప్లికేషన్లు 56,682 రూపొందాయని, మరో పదేళ్ళల్లో వీటి సంఖ్య లక్ష దాటుతుందని ఇంపీరియల్ ఏఐ స్టడీ సంస్థ స్పష్టం చేసింది. ప్రజలను డిజిటల్ ఏఐ వీడియోలు మరింత ప్రభావితం చేస్తాయని, ఎన్నికల ప్రచార బడ్జెట్ను ఇది భారీగా పెంచుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ జరిపిన పరిశోధనలో వెల్లడైంది. ఏఐ ఆధారిత ప్రచారం కోసం అభ్యర్థులు ప్రత్యేక ఆర్థిక వనరులు సమకూర్చుకునే వీలుందని వెంచర్ క్యాపిటల్ ఏఐ రిపోర్టు పేర్కొంది. ఏఐ విస్తృత వినియోగం నేపథ్యంలో డీప్ఫేక్, సమాచార భద్రత తదిర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఏఐ సెక్యూరిటీ రీసెర్చ్ సెంటర్ పరిశీలనలో తెలిపింది. ఇదో రకమైన ఇంటర్న్షిప్హైదరాబాద్లో ఏఐ ఎంఎల్ కోర్సు చేస్తున్నా. మరోపక్క మా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం కోసం పనిచేస్తున్నా. పుస్తకాల్లో చదవిన కోర్సు, ప్రాక్టికల్గా నేర్చుకున్నది కలిసి ప్రచార వీడియోలు రూపొందించి ఇస్తున్నాం. దీన్ని ఓ రకమైన ఇంటర్న్షిప్గా మారుస్తున్నాం. ఓటర్లను మా వీడియోలు ఆకట్టుకుంటున్నాయి. – మద్దిని తేజాకుమార్ (ఏఐఎంఎల్ విద్యార్థి) కొత్తదనం కోసం కొత్త అప్లికేషన్లు ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు ప్రతీ రోజు కొత్తదనం కోరుకుంటున్నారు. కాన్సెప్ట్ చెబుతున్నారు. వారికి నచ్చేలా వాటిని అందించేందుకు కొత్త ఏఐ అప్లికేషన్లను నిత్యం వెతుకుతున్నాం. అవసరమైతే రూ.వేలు ఖర్చు చేసైనా వాటిని కొంటున్నాం. జనం ఆసక్తిగా చూసేలా ఈ అప్లికేషన్లు ఉపయోగపడుతున్నాయి. – విష్ణువర్థన్ రెడ్డి (వరంగల్ డిజిటల్ స్టూడియో) -
వార్డుమెంబరే ఆ ఊరి ‘చివరి సర్పంచ్’?
స్టేషన్ఘన్పూర్: ప్రస్తుత స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని గత శివునిపల్లికి వార్డుమెంబరే చివరి సర్పంచ్. ఇదేంటి వార్డుమెంబర్ సర్పంచ్ కావడమేంటి? చివరి సర్పంచ్ ఏమిటి? అనే సందేహాలు రావొచ్చు. అసలు ఏం జరిగిందంటే.. 2019 జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో శివునిపల్లి ఎస్టీ రిజర్వ్ అయ్యింది. అంతకుముందూ ఎస్టీ రిజర్వేషనే. దీంతో గ్రామ జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఎన్నికలకు బహిష్కరించడంతో ఎవరూ సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు వేయలేదు. గ్రామంలో ఎన్నికలు జరగలేదు. దీంతో ఎన్నికల అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని తిరిగి 2019 ఫిబ్రవరిలో ఎస్టీ రిజర్వేషన్తోనే ఎన్నికలు నిర్వహణకు సన్నద్ధమయ్యారు. జేఏసీ నాయకులు మరోసారి ఎన్నికలను బహిష్కరించాలని పిలు పునివ్వడంతో ఒక్కరూ కూడా ముందుకురాలేదు. సర్పంచ్కు ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో గ్రామానికి చెందిన బూర్ల విష్ణు 8వ వా ర్డు నుంచి నామినేషన్ వేశారు. చేసేదేంలేక జేఏసీ నాయకులు అదే వార్డులో జేఏసీ నుంచి మరొకరిని బరిలో ఉంచగా విష్ణు గెలుపొందారు. 2019 నుంచి 2024 వరకు వార్డు సభ్యుడిగా ఉన్న విష్ణు హైకోర్టును ఆశ్రయించి.. తాను ఒక్కడే గ్రామంలో ప్రజాప్రతినిధిగా ఉన్నానని, తనను సర్పంచ్గా ప్రకటించాలని కోరారు. కోర్టు ఆదేశాలతో చివరి 54 రోజులు విష్ణు సర్పంచ్గా విధులు నిర్వహించారు. జేఏసీ నాయకులు తిరస్కరించినా ఆయన చివరి 54 రోజులు సర్పంచ్గా పనిచేశారు. ఇదిలా ఉండగా 2025 ఎన్నికల్లోనైనా రిజర్వేషన్ తప్పక మారుతుందని, ఎలాగైనా సర్పంచ్ పదవికి పోటీ చే యాలని చాలా మంది ఎదురుచూశారు. తీరా ఏడా ది క్రితం స్టేషన్ఘన్పూర్ మున్సిపాలిటీగా కావడం, అందులో శివునిపల్లి, ఛాగల్లు గ్రామాలను కలుపడంతో అందరి ఆశలు అడియాశలయ్యాయి.చివరి సర్పంచ్గా పనిచేయడం సంతోషంగా ఉందిగ్రామ జేఏసీ నాయకులను కాదని ఎన్నికల నిబంధనల మేరకు అధికారుల సహకారంతో ధైర్యంగా వార్డు స్థానానికి పోటీ చేసి గెలుపొందా. హైకోర్టును ఆశ్రయించి చివరి 54 రోజులు సర్పంచ్గా పనిచేశా. వార్డు సభ్యుడిగా, సర్పంచ్గా గ్రామాభివృద్ధికి కృషి చేశా. ప్రస్తుతం శివునిపల్లి.. ఘన్పూర్ మున్సిపాలిటీలో విలీనం కావడంతో గ్రామ చివరి సర్పంచ్ నేనే కావడం సంతోషంగా ఉంది. –బూర్ల విష్ణు, మాజీ సర్పంచ్,శివునిపల్లి -
ఏకగ్రీవ నిర్ణయంతో సుజాత నాయక్ విజయం
రంగారెడ్డి జిల్లా: స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని.. తండాను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. సర్పంచ్తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సిద్ధమయ్యారు. మండల పరిధిలోని దేవునిగుడితండా పంచాయతీకి సుజాత హన్మంత్ నాయక్ను సర్పంచ్గా, రవి, శ్రీను, లక్ష్మి, దేవి, రుక్మణ్, నీల, శంకర్, అంజమ్మను వార్డు సభ్యులుగా ఎంపిక చేసుకున్నారు. సర్పంచ్ అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్, వార్డు సభ్యులు ఒక్క సెట్ నామినేషన్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుజాత మాట్లాడుతూ.. గ్రామస్తులు తనపై నమ్మకంతో ఏకగ్రీవానికి కృషి చేశారని, అందరి సహకారంతో గ్రామంలో మౌలిక వసతులను కల్పించడంతో పాటు ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని తెలిపారు.కన్హా పంచాయతీ ఏకగ్రీవంషాద్నగర్: నందిగామ మండల పరిధిలో ప్రఖ్యాతి గాంచిన ధ్యాన మందిరం ఉన్న కన్హా పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది. సర్పంచ్ కోసం ఒకరు, 8 వార్డుల్లో ఒక్కొక్కరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలన తర్వాత అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. -
చివరి రోజు భారీగా నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ తొలివిడత ఎన్నికల్లో నామినేషన్ల దాఖలు చివరిరోజైన శనివారం భారీ స్పందన కనపడింది. గురు, శుక్రవారాల్లో అంతంత మాత్రంగానే నామినేషన్లు దాఖలు కాగా, చివరిరోజు పోటాపోటీగా నామినేషన్లు వేశారు. ఆఖరు రోజు సమర్పించిన నామినేషన్లకు సంబంధించి అన్ని జిల్లాల నుంచి శనివారం అర్ధరాత్రి వరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కి పూర్తిస్థాయి సమాచారం చేరలేదు. సర్పంచ్, వార్డు సభ్యస్థానాలకు రాత్రి 8, 9 గంటల దాకా కూడా అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సాగింది. శనివారం మంచిరోజు కావడంతోపాటు మధ్యాహ్నం తర్వాత శుభముహూర్తం ఉండడంతో నామినేషన్ల సమర్పణకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు పంచాయతీ కార్యాలయాలకు చేరుకున్నారు. శనివారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసేందుకు క్యూలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చి కూర్చోబెట్టినట్టు అధికారవర్గాల సమాచారం. అర్ధరాత్రి వరకు కూడా మొత్తం ఎన్ని నామినేషన్లు పడ్డాయనే దానిపై స్పష్టమైన సంఖ్య తెలియరాలేదు. చివరిరోజు సర్పంచ్ పదవికి 20వేలకు పైగా, వార్డు సభ్యుల పదవికి 50వేలకు పైగా నామినేషన్లు దాఖలైనట్లు అంచనా. దీనిపై ఆదివారం స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు. వచ్చేనెల 11న మొదటి దశలో 4,236 పంచాయతీల్లోని సర్పంచ్పదవులు, 37,440 వార్డు సభ్య స్థానాలకు గాను ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఆదివారం ఈ నామినేషన్ల పరిశీలనకు జిల్లా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై సోమవారం అప్పీలు చేసుకునే వీలు కల్పించారు. డిసెంబర్3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నేటి నుంచి రెండో విడత నామినేషన్లు డిసెంబర్ 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల కోసం ఆదివారం నుంచి మూడురోజుల పాటు నామినేషన్ల స్వీకరణకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ విడతలో 4,333 సర్పంచ్ పదవులకు, 38,350 వార్డుసభ్యస్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్లు ఇలా..పదవి జీపీలు తొలిరోజు రెండోరోజు సర్పంచ్ 4,236 3,242 4,901వార్డులు 37,440 1,821 9,643 -
ఎన్నికల్లేకుండా.. ఏకగ్రీవం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో నామినేషన్ల పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. ఎన్నికల్లోకి వెళ్తే అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోవాల్సి వస్తుందని గ్రామ పెద్దల సహకారంతో పలుచోట్ల ప్రజలంతా ఏకమయ్యారు. రాజకీయ పార్టీ లకు అతీతంగా సర్పంచ్తో పాటు ఉపసర్పంచ్, వార్డులను ఏకగ్రీవం చేసుకుంటూ తీర్మానం చేసుకున్నారు. దీంతో ఆయా స్థానాల్లో ఆయా పదవులకు ఒకే నామినేషన్ దాఖలైంది. దాంతో అక్కడ ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవం కానున్నాయి. సర్పంచ్ బరిలో అన్నదమ్ములు సొంత అన్నదమ్ములు సర్పంచ్ బరిలో నిలిచారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు టౌన్ సర్పంచ్గా కాంగ్రెస్ మద్దతుతో అన్న పులి వెంకన్న, బీఆర్ఎస్ నుంచి తమ్ముడు పులి రామచంద్రు నామినేషన్ వేశారు. సర్పంచ్ పదవి ఎవరిని వరిస్తుందోనని స్థానికంగా వేచి చూస్తున్నారు. ఖాకీ నుంచి ఖద్దర్కు.. సర్పంచ్గా పోటీ చేయాలనుకున్న ఓ పోలీస్ అధికారి మరో ఐదు నెలలు సర్వీస్ ఉండగానే తన ఉద్యోగానికి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పని చేస్తున్న పులి వెంకటేశ్వర్లు స్వగ్రామం కోదాడ మండలం గుడిబండ. తాజా రిజర్వేషన్లలో ఆ గ్రామం ఎస్సీ జనరల్ కావడంతో వెంకటేశ్వర్లు బరిలోకి దిగాలనుకున్నారు. పోటీకి ప్రభుత్వ ఉద్యోగులు అనర్హులు కావడంతో వెంకటేశ్వర్లు వారం క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామాను జిల్లా ఎస్పీ ఆమోదించినట్లు తెలిసింది. సర్పంచ్ పదవికి సోమవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. 30 ఏళ్ల నుంచి ఏకగ్రీవమే! ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలోని దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకట్రెడ్డి స్వగ్రామమైన పాతలింగాల వాసులు గత ఆనవాయితీని కొనసాగిస్తూ సర్పంచ్ అభ్యరి్థని ఏకగ్రీవంగా ప్రకటించుకున్నారు. సర్పంచ్ను గత 30 ఏళ్ల నుంచి ఏకాభిప్రాయంతో ఎంపిక చేస్తుండడంతో ఎన్నికలు జరగడం లేదు. » జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలం జిట్టెగూడెంతండా గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేసుకున్నారు. సర్పంచ్గా బానోతు బాలు, అలాగే, ఎనిమిది వార్డు స్థానాలకు ఒక్కొక్కరే నామినేషన్లు వేశారు. రఘునాథపల్లి మండలంలోని రామన్నగూడెంలో సర్పంచ్, 8 వార్డు స్థానాల్లో ఒకటి చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి. » జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం రాజారాంతండా గ్రామంలో సర్పంచ్, వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇబ్రహీంపట్నం మండలం మూలరాంపూర్ గ్రామ సర్పంచుతో పాటు 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. » బొంరాస్పేట మండల పరిధిలో 6 గ్రామపంచాయతీల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పోటీలేకుండా ఏకగ్రీవమయ్యారు. » మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాతతండాజీపీలో సర్పంచ్ స్థానానికి (ఇస్లావత్ నరే‹Ù), 8 వార్డు స్థానాలకు ఒకటి చొప్పున నామినేషన్ దాఖలైంది. » నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని దాసరిగూడెం గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, 8 మంది వార్డు సభ్యులను గ్రామస్తులు ఏకగ్రీవం చేశారు. » వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని మొరిపిరాల గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. » దుద్యాల్ మండల పరిధిలోని సంగాయిపల్లిలో గ్రామస్తులంతా కలిసి వెంకట్రెడ్డిని సర్పంచ్గా ఎన్నుకున్నారు. » దౌల్తాబాద్ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన శానమ్మ సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికైంది. » చొప్పదండి మండలంలోని దేశాయిపేటలో సర్పంచ్ పదవితో పాటు, ఎనిమిది వార్డుస్థానాలకు ఒక్కో నామినేషన్ పడింది.రోడ్డు వేస్తామని హామీ ఇస్తేనే ఓట్లు రోడ్డు వేస్తామని స్పష్టమైన హామీ ఇస్తేనే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తాం, లేదంటే ఎన్నికలను బహిష్కరిస్తామని ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రేగులగూడెం గ్రామపంచాయతీ శివారు గ్రామాల ప్రజలు వెల్లడించారు. దీనిపరిధిలో ఐదు గ్రామాలు ఉండగా, రేగులగూడెం, అనంతారం, రామకృష్ణాపురం గ్రామాలకు వెళ్లే మార్గంలో 2004లో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసినా కంకర పరిచి వదిలేశారు. కంకర రోడ్డుపైనే ఆ గ్రామాలవాసులు ఆరు కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రమైన కారేపల్లికి రాకపోకలు సాగిస్తున్నారు. రహదారి మరింత దెబ్బతినడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి స్వగ్రామంలో... ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచి్చన మల్లెపాకుల వెంకటయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, పదిమంది వార్డుసభ్యులను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పోలీస్ శాఖలో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటయ్య అలియాస్ మోహన్ ఇటీవల తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. పొద్దున పరీక్ష.. మధ్యాహ్నం నామినేషన్ కరీంనగర్ మండలం చెర్లభూత్కూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి మాడిశెట్టి అఖిల్(21) అనే డిగ్రీ విద్యార్థి నామినేషన్ దాఖలు చేశాడు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకామ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం ఉదయం అకౌంట్స్ పరీక్షకు హాజరై మధ్యాహ్నం సర్పంచ్ పదవికి నామినేషన్ వేశాడు. వేలంలో పీఠం కైవసం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని చిన్నఅడిశర్లపల్లి గ్రామంలో సర్పంచ్ పీఠాన్ని పందుల వెంకటయ్యగౌడ్ రూ.51 లక్ష 30 వేలకు వేలం ద్వారా దక్కించుకున్నారు. గ్రామపెద్దలు ఈ వేలం నిర్వహించారు. ఈ మొత్తాన్ని గ్రామంలోని ఆలయ నిర్మాణానికి, బొడ్రాయి ప్రతిష్టకు వినియోగించాలని నిర్ణయించారు. కార్మికుల చొక్కా ధరించి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని మొండికుంట గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మర్రి సంధ్య నామినేషన్ దాఖలు చేశారు. ఈమెను బీఆర్ఎస్ బలపరిచింది. అయితే, ఆమె పారిశుధ్య కార్మికుల మాదిరి ఖాకీ చొక్కా ధరించి నామినేషన్ సమర్పించారు. -
చిత్తశుద్ధి లేని అరకొర ప్రయత్నాలు
తెలంగాణలోని వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వే షన్లు ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్లపాటు నమ్మబలికి ఇప్పుడు నట్టేట ముంచింది. స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్య, ఉద్యోగాల్లో కూడా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ ఎంతో ఆర్భాటం చేసింది. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా ఇదివరకు అమలు చేసిన రిజర్వేషన్ల శాతం కంటే మరింత తగ్గించి బీసీలను నిలువునా ముంచేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచన ఉన్నప్పుడు... వ్యూహాత్మక కార్యాచరణ ఏమైంది? కేవలం ఆర్భాటం చేస్తూ బిల్లులు రూపొందించి అసెంబ్లీలో ఆమో దింపజేయడం, ఆ తర్వాత హడావిడిగా ఆర్డినెన్స్ ఇవ్వడం, వాటికి దిక్కులేకపోవడంతో జీఓ జారీ చేయడం అంతా ఒక కల్పనగానే ఉంది. ఇప్పుడు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇవ్వకుండా... పార్టీ పరంగా ఇస్తామంటూ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం చూస్తుంటే నాటకీయంగా తప్పించుకున్నట్లు స్పష్టమైంది. పంచాయతీ ఎన్ని కలు పార్టీ గుర్తుతో జరగనప్పుడు, పార్టీ అభ్యర్థులుగా ఎలా ఎంపిక చేస్తారు?ఉత్తుత్తి ప్రయత్నం...రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రచార అస్త్రంగా వాడుకున్నారు. తొలి వంద రోజుల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, మూడు నెలల తర్వాత కుల సర్వేపై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్లో ప్రణాళికా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత రాష్ట్ర బీసీ కమిషన్ ఆధ్వర్యంలో కుల సర్వే అని, ఆ తర్వాత డెడికేటెడ్ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని, చివరకు వన్ మ్యాన్ కమిషన్ను ఏర్పాటు చేసింది. సమగ్ర సర్వే చేసి వాటి వివరాలను లోతుగా అధ్యయనం చేసేందుకు ముందుగా డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఆ కమిషన్ పూర్తిగా అధ్యయనం చేయడం, లోతుగా సర్వే చేపట్టిన నివే దికల ఆధారంగా చర్యలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ ప్రమాణాలు పాటించలేదు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించి రాష్ట్రపతికి పంపాలి. అక్కడ ఆమోదం పొందితేనే అవి చెల్లుబాటు అవుతాయి. తమిళనాడు నమూనా ప్రకారం 9వ షెడ్యూల్లో చేర్చినప్పుడే రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుంది. ఇందుకు కేంద్రంపైన ఒత్తిడి తీవ్రతరం చేయాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపైన ఒత్తిడి చేయకుండా ‘జంతర్మంతర్’లో ధర్నా చేసి చేతులు దులుపుకొంది.కేంద్రంలో 243 మంది ఎంపీలున్న ఇండియా కూటమి పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి చర్చకు ప్రయత్నం చేయలేదు. కనీసం తెలంగాణ ఎంపీలు సైతం పార్లమెంటులో ఈ ఊసే ఎత్తలేదు. ముఖ్యమంత్రి ఎన్నోసార్లు ప్రధానమంత్రి మోదీని కలిశారు. మరి బీసీ రిజర్వేషన్ల గురించి ప్రధానితో సంప్రదింపులు ఎందుకు చేయలేదు? తమిళనాడు తరహా అఖిలపక్ష పార్టీలతో సమావేశాలు నిర్వహించలేదు. ఢిల్లీకి అఖిలపక్ష పార్టీలను తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయలేదు. కేంద్ర స్థాయిలో పరపతి లేని అనామకులు మాత్రమే ‘జంతర్మంతర్’ వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తారు. అన్ని రకాల అధికారాలున్న కాంగ్రెస్... బీసీ రిజర్వేషన్ల పట్ల కపటప్రేమను ప్రదర్శించింది. ఆర్డినె¯Œ ్స జారీ చేసి గవర్నర్ ఆమోదించలేదంటూ... చివరకు ఎలాంటి ఆధారాలూ లేకుండా జీఓలు జారీ చేసి బీసీ రిజర్వే షన్లు పెంచుతున్నామని చెప్పుకొంది. కానీ ఆ ఉత్తర్వులు న్యాయవ్యవస్థ ముందు నిలవలేదు.ఐక్యతే అసలు మంత్రం...కామారెడ్డిలో నిర్వహించిన బీసీ ఆక్రోశ సభలో మూడు తీర్మానాలు చేయించాను. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చొరవ తీసుకొని రానున్న పార్లమెంట్ సమావేశాల్లో 42% బీసీ రిజర్వేషన్ల బిల్లులను తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలనీ; కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమా వేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులను పార్లమెంట్లో పాస్ చేసి రాష్ట్రపతి ఆమోదంతో తొమ్మిదో షెడ్యూల్లో చేర్పించాలనీ; స్థానిక రిజర్వేషన్ బిల్లును తొమ్మిదో షెడ్యూ ల్లో చేర్చి, చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనీ తీర్మానాలు చేయించాను.ఇప్పుడు గ్రామపంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతి పదికన ఖరారు చేశారో ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. గతంలో 20 శాతానికి పైగా రిజర్వేషన్లు దక్కితే ఇప్పుడు అందులోనూ కోత పెట్టారు. శాస్త్రీయత లేకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా ఉత్తర్వులు ఇస్తే అవి చెల్లుబాటు కావు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను హర్షిస్తూ బీసీ సంఘాలు పాలాభిషేకాలు, పూలాభిషే కాలు చేస్తున్నాయి. ప్రభుత్వ చర్యలపై కనీసం ఆలోచన చేయలేని స్థితిలో సంఘాలున్నాయి. బీసీ రిజర్వేషన్లకు కోతపెట్టి మరీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోంది. ఈ అంశంపై ఉద్యమాలు, ఆందోళనలు చేయాల్సిందే! రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు అన్నీ ఒక్కతాటిపైకి వచ్చి వ్యూహా త్మకంగా పంచాయతీలను విభజించుకుని దళిత, గిరిజన, బీసీలను సర్పంచులుగా గెలిపించుకోవాలి.జస్టిస్ వి. ఈశ్వరయ్యఉమ్మడి ఏపీ హైకోర్టు యాక్టింగ్ సీజే, ఎన్సీబీసీ మాజీ చైర్మన్ -
నేటితో ముగియనున్న తొలివిడత నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ శనివారంతో ముగియనుంది. ఆదివారం నామినేషన్ల పరిశీలనకు అధికార యంత్రాంగం ద్వారా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఆ రోజు సాయంత్రం 5 తర్వాత నామినేషన్ల స్క్రూటినీ పూర్తయ్యాక చెల్లుబాటయ్యే అభ్యర్థుల జాబితా రూపొందిస్తారు. తిరస్కరణ నామినేషన్లపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించారు. సర్పంచ్/వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైన పక్షంలో సదరు అభ్యర్థి సంబంధిత రెవెన్యూ డివిజనల్ / సబ్ కలెక్టర్ వద్ద రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల పరిశీలన తేదీ మరుసటి రోజు నామినేషన్ల తిరస్కరణపై అప్పీలు దాఖలు చేసుకోవచ్చు. అప్పీలు దాఖలు చేసిన మరుసటి రోజే ఆ అప్పీలును సంబంధిత అధికారి పరిష్కరిస్తారు. అసంపూర్తి సమాచారం, అవసరమైన పత్రాలు జతచేయకపోవడం, ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలు జోడించని కారణంగా గతంలో పలువురు సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణ గురైన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో నామినేషన్ల పరిశీలనకు ప్రాధాన్యం ఏర్పడింది. నామినేషన్ల తిరస్కరణ అవకాశాలు తగ్గించుకునేందుకు వీలుగా నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులు వివిధ డాక్యుమెంట్లు తమ వద్దే ఉంచుకుంటే శ్రేయస్కరమని అధికారులు చెబుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు అభ్యర్థులు పోటీ నుంచి ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పోటీలో ఉన్న సర్పంచ్ /వార్డుల అభ్యర్థుల జాబితాను ప్రచురిస్తారు. ఇవి తప్పనిసరి ఉండాల్సిందే... » గ్రామ పంచాయతీ తాజా ఓటరు జాబితా లేదా అభ్యర్థి, ప్రతిపాదకుడు (ప్రపోజర్) పేరు ఓటరు జాబితాలో రికార్డయినట్టుగా జారీ చేసిన సర్టిఫికెట్ » అభ్యర్థి వయసు ధ్రువీకరణకు సంబంధించిన ఆధారం » డిపాజిట్ చెల్లింపునకు సంబంధించిన రశీదు » నామినేషన్ పత్రం సమరి్పంచినట్టుగా రిటరి్నంగ్ అధికారి నుంచి పొందిన రశీదు » ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ అయిన సీట్లలో పోటీ చేసేవారు ఆయా కేటగిరీలకు చెందినవారిగా ఆధారాలు చూపాలి నామినేషన్ తిరస్కరణకు ముఖ్య కారణాలివే... » నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం నామినేషన్ పత్రం లేకపోతే » నామినేషన్లో సంతకాల కోసం కేటాయించిన చోట అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు లేదా ఇద్దరూ సంతకాలు చేయకపోడం» చట్ట ప్రకారం నిర్దేశిత డిపాజిట్ మొత్తాన్ని చెల్లించకపోతే » నామినేషన్ పత్రంపై అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు చేసిన సంతకం సరైనది కాకపోతే » ఎస్టీ, ఎస్సీ, బీసీలకు కేటాయించిన స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసినా, సంబంధిత రిజర్వేషన్కు చెందినవారు కాకపోతే లేదా మహిళల కోసం రిజర్వ్ చేసిన స్థానాల్లో నామినేషన్ దాఖలు చేస్తే.. » వార్డు మెంబర్ అభ్యర్థి ప్రపోజర్ సంబంధిత వార్డులో ఓటరుగా నమోదు కాకపోతే... » నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని ఎస్ఈసీ నిర్దేశిత నమూనాలో ఇద్దరు సాక్షుల ధ్రువీకరణలతోపాటు డిక్లరేషన్ పత్రాన్ని అభ్యర్థి సమర్పించకపోతే నామినేషన్లను సంబంధిత అధికారులు తిరస్కరిస్తారు -
మొదటిరోజు ‘పంచాయతీ’ అంతంతే
సాక్షి, హైదరాబాద్: తొలి విడతగా ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణ మొద లైంది. మొత్తంగా 4,236 సర్పంచ్ పదవులకు 3,242 నామినేషన్లు, 37,440 వార్డులకు 1,821 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం చివరిరోజు కావడంతో ఎక్కువ మంది నామి నేషన్లు వేసే ఆలోచనలో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. సర్పంచ్ నామినేషన్లు ఎక్కువ... తక్కువ ఇలా» నల్లగొండ జిల్లాలో 318 సర్పంచ్ పదవులకు తొలిరోజు అత్యధికంగా 421 నామినేషన్లు దాఖలయ్యాయి. యాదాద్రి జిల్లాలో 153 సర్పంచ్ పదవులకు 209, సూర్యాపేట జిల్లాలో 159 పదవులకు 207, వరంగల్లో 91 పదవులకు 101, సంగారెడ్డిలో జనగామ జిల్లాలో 110 సర్పంచ్ పదవులకు 108 మంది నామినేషన్లు వేశారు. » కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 114 సర్పంచ్ పదవులకుగాను 15 మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 166 సర్పంచ్ పదవులకు 32, మెదక్ జిల్లాలో 160 పదవులకు 55, మంచిర్యాలలో 90 పదవులకు 25, జగిత్యాలలో 122 సర్పంచ్ పదవులకు 48 నామినేషన్లు, భద్రాద్రి కొత్తగూడెంలో 159 పదవులకు 83, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 85 పదవులకు 42, ములుగు జిల్లాలో 48 పదవులకు 22, కామారెడ్డిలో 167 సర్పంచ్ పదవులకు 115 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వార్డులకు మందకొడిగానే.. తొలి విడతలోనూ వార్డులకు నామినేషన్లు దాఖలు చేసిన వారి సంఖ్య స్వలంగానే ఉంది. » మెదక్ జిల్లాలో160 పంచాయతీల్లోని 1,402 వార్డులుండగా, కేవలం 4 నామినేషన్లే దాఖలు అయ్యాయి. కొమురం భీం జిల్లాలోని 114 పంచాయతీ పరిధిలోని 944 వార్డులుండగా, ఇక్కడా నలుగురే నామినేషన్లు వేశారు. » ఆదిలాబాద్ జిల్లాలో 166 పంచాయతీల్లో 1,390 వార్డులు ఉండగా 15, జోగులాంబ గద్వాల జిల్లాలో 106 పంచాయతీల్లో 974 వార్డులకు 13, మంచిర్యాల జిల్లాలో 90 పంచాయతీల్లోని 816 వార్డులు ఉండగా 14 మందే నామినేషన్లు దాఖలు చేశారు. » నల్లగొండ జిల్లాలో 318 పంచాయతీల్లోని 2,870 వార్డులుండగా 212 నామినేషన్లు, రంగారెడ్డి జిల్లాలో 174 పంచాయతీల్లోని 1,530 వార్డులకు 119 మంది, సంగారెడ్డి జిల్లా 136 పంచాయతీల్లోని 1,246 వార్డులకు 149 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 153 పంచాయతీల్లోని 1,286 వార్డులకు 143 నామినేషన్లు దాఖలయ్యాయి.టీ–పోల్ యాప్లో ఓటర్ స్లిప్ స్థానిక ఎన్నికలకు సంబంధించి సేవలను మరింత సులభతరం చేసేందుకు టీ–పోల్ (Te-Poll)లో కొత్త మొబైల్ అప్లికేషన్ యాప్)ను ఎస్ఈసీ విడుదల చేసింది. ఈ యాప్ ఓటర్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి, తమ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, సులభంగా ఫిర్యాదు చేయడానికి, ఫిర్యాదుల పరిష్కార ప్రగతిని (ట్రాకింగ్) తెలుసుకోవడానికి ఉపయోగపడు తుందని ఎస్ఈసీ కార్యదర్శి మందా మకరంద్ తెలిపారు. మొబైల్లో ప్లేస్టోర్ నుంచి ఈ లింకు ద్వారా https:// play. google. com/ store/ apps/ details? id= com. cgg. gov.in.te & poll & telugu> టీ–పోల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. -
సర్పంచ్ ఎన్నికలు.. బంపరాఫర్ ప్రకటించిన బండి సంజయ్!
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ బంపరాఫర్ ప్రకటించారు. తమ పార్టీ బలపరిచే అభ్యర్థులను ఏకగ్రీవం చేస్తే.. రూ.10 లక్షల ప్రోత్సాహక నిధులిస్తానంటూ ప్రకటించారాయన. మాట ఇస్తే... తప్పే ప్రసక్తే లేదు. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.5 లక్షల ఇన్సెంటివ్ ఇస్తానని బీఆర్ఎస్ మాట తప్పింది. కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయాపైసా నిధుల్లేవు. నిధులు తెచ్చేది, ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. ఎన్నికలు జరిగేది కూడా కేంద్ర నిధుల కోసమే. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. పొరపాటు చేస్తే 5 ఏళ్ల నరక యాతన తప్పదు అంటూ కీలక వ్యాఖ్యలే చేశారాయన.తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ నేపథ్యంలో రాష్ట్రంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్ రాణి కుముదిని దేవి మీడియా ముఖంగా వెల్లడించారు.మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలుఫేజ్ 1లో కోసం.. నవంబర్ 27 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 11న పోలింగ్ఫేజ్2 కోసం.. 30 నవంబర్ నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 14న పోలింగ్ఫేజ్3 కోసం.. డిసెంబరు 3 నుండి నామినేషన్ స్వీకరణ డిసెంబర్ 17న పోలింగ్ -
రిజర్వేషన్లు ఖరారు!
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో కీలకమైన రిజర్వేషన్ల కసరత్తును కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు (డీపీఓలు) పూర్తి చేశారు. జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళలకు కేటాయించిన స్థానాల వివరాలను ప్రకటించారు. రిజర్వేషన్ల వివరాలను ఆయా మండల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని పంచాయతీరాజ్శాఖ జారీ చేసిన జీవో 46లోని మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్లు ఖరారు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే కొన్నిచోట్ల గ్రామాలవారీగా జాబితాలు ప్రకటించగా మరికొన్ని చోట్ల ప్రకటనకు రంగం సిద్ధమైంది. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి జిల్లాలవారీగా ఖరారైన రిజర్వేషన్ల జాబితాలు హైదరాబాద్లోని పంచాయతీరాజ్ కమిషనరేట్లో అందజేస్తున్నారు. డీపీఓలు స్వయంగా వచ్చి సీల్డ్కవర్లో రిజర్వేషన్ల జాబితాలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల నుంచి రిజర్వేషన్ల జాబితాలు చేరగా మరికొన్ని జిల్లాల నుంచి సోమవారం అందనున్నాయి. అన్ని జిల్లాల నుంచి జాబితాలు వచ్చాక వాటిని పరిశీలించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి (ఎస్ఈసీ) పీఆర్అధికారులు నేడు అందజేయనున్నారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కలెక్టర్లు రిజర్వేషన్లకు సంబంధించి గెజిట్నోటిఫికేషన్లు జారీ చేశారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కేసు సోమవారం హైకోర్టులో విచారణకు రానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని, పంచాయతీల్లో 50 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసి జీవోలు కూడా ఇచ్చామని హైకోర్టుకు పీఆర్, ఆర్డీశాఖ వివరించనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల నిర్వహణకు కసరత్తు పూర్తి చేశామని తెలియజేయనుంది. తేలిన ఓటర్ల లెక్క రాష్ట్రంలో గ్రామీణ ఓటర్ల లెక్క కూడా తేలింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 1,67,03,173 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 81,65,899 మంది, మహిళా ఓటర్లు 85,36,770 మంది ఉండగా ఇతరులు 504 మంది ఉన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీలవారీగా వార్డుల విభజన, ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. ఓటర్ల జాబితాలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను స్వీకరించి అధికారులు పరిష్కరించారు. ఆదివారం గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో ఫొటోలతో కూడిన తుది ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 1,12,474 పోలింగ్స్టేషన్లు, 15,522 పోలింగ్ప్రాంతాలను గుర్తించారు. రాష్ట్రంలో 565 మండలాల్లోని 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు వెబ్ కాస్టింగ్కు అధిక ప్రాధాన్యమివ్వనుంది. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉంచేందుకు సీసీ కెమెరాల ఏర్పాటు, లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహణ కోసం జిల్లాలవారీగా టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు జిల్లాలవారీగా నోటిఫికేషన్లు జారీ చేసింది. జిల్లాలవారీగా వెబ్కాస్టింగ్సెంటర్ల వివరాలు కూడా పీఆర్కమిషనరేట్కు చేరినట్లు తెలిసింది. -
వడివడిగా ‘పంచాయతీ’ అడుగులు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వీలుగా రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ప్రభుత్వ ఉత్తర్వులు నేడో రేపో వెలువడనున్నాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు గురువారం సీఎస్ రామకృష్ణారావుకు నివేదికను సమర్పించారు. దీనిపై సర్క్యులేషన్ పద్ధతిలో మంత్రుల నుంచి శుక్ర, శనివారాల్లోగా ఆమోదం తీసుకొని ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 24న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి విచారణ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి కోర్టుకు జీఓ కాపీని సమర్పించనున్నట్టు తెలిసింది. ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తన కార్యక్రమాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఎన్నికల సన్నద్ధతపై గురువారం సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ షెడ్యూల్ ఇప్పటికే విడుదల చేసింది. 23న తుది జాబితా వెలువడనుంది. స్థానిక సంస్థల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికను కేబినెట్ ఆమోదించాల్సి ఉంది. శుక్ర లేదా శనివారం సాయంత్రం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ జీఓ జారీ చేయనున్నది. ఇప్పటికే డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ద్వారా జిల్లా కలెక్టర్లు, సీఈఓలు, డీపీఓలకు పంపించినట్టు సమాచారం. నేడో, రేపో జారీచేసే జీఓకు అనుగుణంగా రెండు రోజుల్లో 31 జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశముంది. జిల్లా ల వారీగా ఖరారు చేసిన రిజర్వేషన్లపై జిల్లా కలెక్టర్లు గెజిట్ విడుదల చేస్తారు. రిజర్వేషన్లు ఖరారు కాగానే, మూడు విడతల్లో నిర్వహించే ఎన్నికల తేదీపై తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)కి రాష్ట్ర ప్రభుత్వం, పంచాయతీరాజ్శాఖ అందజేయనుంది. ఇది అందుకున్న వెంటనే అంటే అదే రోజు లేదా ఒక రోజు వ్యవధితో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ జారీ అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మొత్తంగా చూస్తే డిసెంబర్ 10 నుంచి 20 తేదీల్లోగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కోదశ ఎన్నిక మధ్య మూడేసి రోజుల అంతరం ఉండనుంది. డిసెంబర్ 10, 11 తేదీల్లో మొదటి విడత, 14, 15 తేదీల్లో రెండో విడత, 18,1 9 తేదీల్లో మూడో విడత ఎన్నికలు జరగొచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. హైకోర్టులో విచారణ కీలకం ఈ నెల 24న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రభుత్వపరంగా చేస్తున్న సన్నాహాలు, జీఓ జారీ తదితర విషయాలను హైకోర్టుకు పీఆర్ఆర్డీ శాఖ తెలియజేయనుంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసుకున్నట్టుగా, ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్టు విన్నవించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణికుముదిని ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా 31 జిల్లాల్లో (హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లాలు మినహా) పంచాయతీ ఎన్నికలపై సమీక్షించారు. సీఎస్ కె.రామకృష్ణారావు, డీజీపీ బి.శివధర్రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ బాస్లు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబధించి భద్రతా అంశాలు, స్థానిక పరిస్థితులపై జిల్లా కలెక్టర్లు, అధికారుల అభిప్రాయాలను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల నిర్వహణలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని, శాంతిభద్రతల నిర్వహణ సులభతరం చేయడానికి ప్రతి జిల్లాలో ఎన్నికలను మూడు దఫాలుగా నిర్వహించాలని డీజీపీ ప్రతిపాదించారు. ఈ పరిణామాలన్నింటిని గమనిస్తే...ఈ నెల 24న కోర్టులో ప్రస్తావనకు వచ్చే అంశాలు, 50 శాతం లోపు రిజర్వేషన్లు ఇతర అంశాలను అటు ప్రభుత్వం, ఇటు ఎస్ఈసీ నిశితంగా పరిశీలించనుంది. పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కమిషనర్ రాణి కుముదిని స్థానిక సంస్థల ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా అభ్యంతరాలు, పోలింగ్ కేంద్రాలు, రిజర్వేషన్ల ప్రక్రియ, శాంతిభద్రతల అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఎన్నికల పరిశీలకులకు శిక్షణ ఇస్తామని, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసే ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుల జాబితా సమర్పించాలన్నారు. ఈ ఏడాది గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలను శాంతియుతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన ఆదేశాలు ఇచి్చనట్టు ఎస్ఈసీ కార్యదర్శి మంద మకరందు ఒక ప్రకటనలో తెలిపారు. -
స్థానికంపై నేడు నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: స్థానిక ఎన్నికల నిర్వహణకు ముందుకు వెళ్లే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం గురువారం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలు 9, 41, 42ల అమలును రాష్ట్ర హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన విష యం విదితమే. దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా కోరింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి అధ్య క్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కేబినెట్ సమావేశమై న్యాయ నిపుణులు ఇచ్చిన సలహాపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది.అయితే పాత విధానంలో రిజర్వేషన్లను అమలు చేస్తూ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని మధ్యంతర ఉత్తర్వుల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన సూచనను అమలు చేయడం తప్ప ప్రభుత్వానికి మరో మార్గం కనిపించడం లేదు. ఇలావుండగా.. ఇద్దరుకు మించి సంతానం కలిగినవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులని పంచాయతీ రాజ్ చట్టంలో ఉన్న నిబంధనను ఎత్తివేసే అంశంపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఆ మేరకు చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసేలా గవర్నర్కు ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించనుంది. ఎస్ఎల్బీసీ కాంట్రాక్టు రద్దు ..?శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగాల నిర్మా ణ సంస్థ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్తో 2005 ఆగస్టు 25న చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని రాష్ట్ర నీటిపారుదల శాఖలోని స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ చేసిన సిఫారసులపై కూడా రాష్ట్ర మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఒప్పందం రద్దు చేస్తే మళ్లీ టెండర్లు నిర్వహించి పనులను కొత్త కాంట్రాక్టర్కు అప్పగించాల్సి ఉంటుంది. అలా చేస్తే పెరిగిన ధరల ఆధారంగా అంచనాలు కొన్ని రెట్లు పెరిగిపోయే అవకాశం ఉంది. ఆయా అంశాలపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది. దేవాదుల ప్రాజెక్టు ప్యాకేజీ–6 అంచనాల పెంపుతో పాటు అదనంగా మూడో దశ పనులకు అనుమతులు ఇచ్చే అంశాన్ని కూడా తేల్చవచ్చని అంటున్నారు. కాళేశ్వరం టెండర్లకు ఓకే?కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు డిజైన్ల రూపకల్పన కోసం ఇటీవల నీటిపారుదల శాఖ ఆహ్వానించిన ఆసక్తి వ్యక్తీకరణ టెండర్లకు సైతం ఆమోదం తెలిపే (రాటిఫై) అవకాశం ఉన్నట్టు తెలిసింది. అలాగే ఎస్ఆర్ఎస్పీ రెండో దశకు మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి పేరు పెట్టే అంశాన్ని మంత్రివర్గం రాటిఫై చేయనుంది.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7తో రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించతలపెట్టిన విజయోత్సవాలపై మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫారసులకు ఆమోదం తెలపనున్నట్టు తెలిసింది. విజయోత్సవాల్లో భాగంగా సనత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభించడంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టనుంది. తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్–2047పై మంత్రివర్గం చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. -
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ చర్చించి చెప్పాలని హైకోర్టు పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు కాగా.. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ నెల 9 న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేయగా.. నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. నిన్న సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లమని చెప్పింది కదా అంటూ వ్యాఖ్యానించింది. ఎన్నికలు పెట్టుకోవచ్చని ఓరల్గా మాత్రమే చెప్పిందని.. ఆర్డర్లో ఎక్కడా చెప్పలేదని ఎలక్షన్ కమిషన్ తరఫు న్యాయవాది అన్నారు.నిన్ననే(అక్టోబర్ 16, గురువారం) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని కోర్టుకు తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చాం కాబట్టే దాన్ని సస్పెండ్ చేశాం. ఫ్రెష్ గా రిజర్వేషన్ లను గూర్చి ప్రభుత్వంతో చర్చించాకే రీ నోటిఫికేషన్ ఉంటుంది. రెండు వారాల సమయం కావాలంటూ కోర్టును స్టేట్ ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దీంతో తదుపరి విచారణ రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది. -
తెలంగాణ: నామినేషన్లు షురూ.. ఎస్ఈసీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రిలీజ్ అయ్యింది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని అందులో పేర్కొంది. ఆ వెంటనే.. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లు స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఈ తరుణంలో.. నామినేషన్లు వేయాలనుకునేవాళ్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం(SEC) కీలక సూచనలు చేసింది.జడ్పీటీసీ నామినేషన్లను జిల్లా పరిషత్ కార్యాలయంలో, ఎంపీటీసీ నామినేషన్లను స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని సమర్పించాలి. జడ్పీటీసీ నామినేషన్ వేయాలనుకున్న జనరల్ కేటగిరీ అభర్థి.. రూ.5 వేలు, అదే రిజర్వేషన్ అభ్యర్థి అయితే రూ.2,500 డిపాజిట్ చేయాలి. ఎంపీటీసీ నామినేషన్ వేసే జనరల్ అభ్యర్థి రూ.2,500, రిజర్వేషన్ అభ్యర్థి రూ.1,250 డిపాజిట్ చేయాలి.ఎన్నికల నియమావలికి అనుగుణంగా నామినేషన్ సందర్బంగా దాఖలు చేసే వ్యక్తితో కలిపి ఐదుగురికి మించి కార్యాలయంలోకి రాకూడదు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5గం. వరకే నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ తర్వాత అనుమతించరు.అభ్యర్థులు పూర్తి డాక్యుమెంటేషన్, ఫోటోలు, డిపాజిట్ రసీదుతో నామినేషన్ వేయాలి. 12న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఎన్నికల నియమావళిని పాటించని అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించబడే అవకాశం ఉంది. 15వ తేదీ మధ్యాహ్నాం 3గం.లోపు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అలాగే.. ప్రచార నిబంధనలు, ఆచరణ నియమావళి త్వరలో విడుదల అవుతుంది.ఇదీ చదవండి: తెలంగాణ ఈ ఎమ్మెల్యేలకు వింత పరిస్థితి! -
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ఎస్ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 29న విడుదలైన ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేసింది.


