వీపు రుద్దుతా.. నా భార్యకు ఓటేయండి | Telangana Local Body Elections 2025 | Sakshi
Sakshi News home page

వీపు రుద్దుతా.. నా భార్యకు ఓటేయండి

Dec 1 2025 10:54 AM | Updated on Dec 1 2025 10:54 AM

Telangana Local Body Elections 2025

మంచిర్యాల జిల్లా: పంచాయతీ ఎన్నికల వేళ కొందరు నామినేషన్‌ వేసిన మరుక్షణమే ప్ర చారం మొదలు పెట్టారు. మండలంలో ని ముత్యంపేట పంచాయతీలో 6వ వా ర్డులో పోటీచేస్తున్న కొండా రజిత, తన భర్తతో కలిసి ఆదివారం ప్రచారం మొదలు పెట్టింది. ఓ ఇంటికి వెళ్లగా నర్సయ్య అనే ఓటరు ఆరుబయట స్నానం చేస్తుండగా, అభ్యర్థి భర్త అతని వీపు రుద్దుతూ, నీ ఓటు నా భార్యకు వేయాలని అభ్యర్థించాడు. ఈ దృశ్యాన్ని నరేశ్‌ వీడియోలో చిత్రీకరించి వాట్సాప్‌ స్టేటస్‌ ద్వారా వినూత్న ప్రచారం చేస్తున్నాడు.  

నామినేషన్‌ వేసిన మరుసటి రోజే గుండెపోటు
 మహిళ మృతి..పొన్కల్‌లో ఘటన
మామడ: వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు నామినేషన్‌ వేసిన మరుసటి రోజే మహిళ గుండెపోటుతో మృతిచెందింది. మండలంలోని పొన్కల్‌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పంచాయతీలో 12వ వార్డు మెంబర్‌గా పోటీ చేసేందుకు దుబాక జమున (50) శనివారం నామినేషన్‌ వేసింది. మరో ముగ్గురు నామినేషన్లు వేశారు. ఇంతలోనే ఆదివారం జమునకు గుండెపోటుకు గురై మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement