-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్
-
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వస్తే బాబు భూ కుంభకోణాలన్నీ బట్టబయలు
సాక్షి, అమరావతి: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన మనుషులు ఇన్నాళ్లూ సాగించిన భూ కుంభకోణాలు, కబ్జాలు బయటపడతాయని, ఆ భయంతోనే ఆయన, ఎల్లో మీడియా ఈ చట్టంపై దష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. సజ్జల శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎవరి భూములపై వారికి సంపూర్ణ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ధ్యేయమని పునరుద్ఘాటించారు. అక్రమాలకు చెక్ పెట్టేందుకే ఈ చట్టం తెస్తున్నట్లు తెలిపారు. భూ పరిపాలనలో గొప్ప సంస్కరణగా నిలిచే, విప్లవాత్మక మార్పులు తెచ్చే ఈ చట్టంపై పచ్చ మీడియా సహకారంతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. కొద్దిరోజులుగా ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కూడా నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇళ్లు భద్రంగా కడితే దొంగలకు భయమేననని, భూ కుంభకోణాలకు, కబ్జాలకు మారుపేరైన చంద్రబాబుకు ఈ చట్టం నచ్చదని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ కంటే చంద్రబాబు ప్రమాదకరమని అన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని అన్నారు. సీఎం జగన్ చేస్తున్నది ల్యాండ్ ప్రొటెక్టింగే కానీ, గ్రాబింగ్ కాదని చెప్పారు. అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకా రూపకల్పన దశలోనే ఉందని తెలిపారు. రాష్ట్రంలోని 17 వేల గ్రామాలకు గాను 6 వేల గ్రామాలలోనే సమగ్ర భూ సర్వే జరిగిందని, అన్ని గ్రామాల్లో సర్వే పూర్తయి, ఈ చట్టం అమలు కావడానికి ఇంకా మూడేళ్ళు పట్టచ్చని తెలిపారు. ప్రజల నుంచి అభ్యంతరాలు కూడా తీసుకుంటారని, ఆ తర్వాతే విధి విధానాలు ఖరారవుతాయని, చట్టం రూపుదిద్దుకుంటుందని చెప్పారు. అలాంటప్పుడు ప్రభుత్వా«దినేత భూములు మింగేస్తాకరని చెప్పడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. భూ సంస్కరణలు, రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులను జీర్ణించుకోలేకే చంద్రబాబు వీటికి అడ్డుపడుతున్నారని తెలిపారు. ఈ చట్టం ప్రజలకు మేలు చేసేదిలా ఉంటుంది కనుకనే చంద్రబాబుకి నచ్చడం లేదని చెప్పారు.ప్రధాని కూడా భూ కబ్జాలు చేస్తారని బాబు ఉద్దేశమా?ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకువచ్చిన చట్టమని, దానినే రద్దు చేస్తానని చంద్రబాబు చెప్పడంపై బీజేపీ ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు చెప్పిన ప్రకారమైతే నరేంద్ర మోదీ కూడా దేశంలో భూములు కబ్జా చేస్తున్నట్లు ఆయన ఉద్దేశమా అని అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబును కచ్చితంగా శిక్షించాల్సిందేనని, బీజేపీ నేతలు ఆయనకు మొట్టికాయలు వేసి మరీ చట్టం మంచిదనే విషయం చెప్పాలని అన్నారు. వ్యవస్థపై ఇలాంటి ఆరోపణలు చెయ్యడం దేశ ద్రోహం కంటే ఘోరమని స్పష్టంచేశారు. ఈ చట్టాన్ని రద్దు చేస్తానంటున్న చంద్రబాబు కబ్జాలను ప్రోత్సహిస్తున్నట్టేనని తేల్చిచెప్పారు. ఈ చట్టంపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలపై సీఐడీ విచారణకు ఎన్నికల కమిషన్ ఆదేశించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబు చేస్తోంది కచ్చితంగా విష ప్రచారమేనని ఎన్నికల కమిషన్ ఆదేశాలు చెబుతున్నాయని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలు గ్రహించాలని అన్నారు. భూముల పత్రాలపై సీఎం జగన్ ఫొటో ఉంటే చంద్రబాబు, ఎల్లో మీడియాకు వచ్చిన ఇబ్బందేమిటన్నారు. గతంలో చంద్రబాబు రేషన్ కార్డులపై ఫోటోలు వేసుకోలేదా? ఆనాడు ఏమయ్యాయి ఈ నీతులని నిలదీశారు. సీఎం జగన్ ఫోటో 5 కోట్ల మంది ప్రజలకు నచ్చిందని, బాబుకు నచ్చకపోతే ఇబ్బందేమీ లేదని చెప్పారు.భూకబ్జాలు చేసింది బాబు, టీడీపీనేరాష్ట్రంలో భూ కబ్జాలు చేసింది చంద్రబాబు, టీడీపీనే అని సజ్జల చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వెబ్ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అమరావతి ప్రాంతంలో (సీఆర్డీఏలో) చంద్రబాబు అండ్ కో అసైన్డ్ భూములు దోచేశారని తెలిపారు. అమరావతిలో చంద్రబాబు చేసిన భూకుంభకోణంపై విచారణ కూడా జరుగుతోందన్నారు. డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో భూములు లాక్కున్నారని తెలిపారు. 2014–19 మధ్యనే ఈ ల్యాండ్ గ్రాబింగ్ జరిగిందని చెప్పారు. సాదా బైనామా పేరుతో పేపర్లు సృష్టించి భూములు కాజేశారని వివరించారు. చంద్రబాబు హయాంలో స్టాంపుల కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. తెల్గీ స్టాంపుల కుంభకోణంలో చంద్రబాబుకి లింకులున్నాయని తెలిపారు. విశాఖపట్నంలో ఈనాడు కార్యాలయం కట్టుకోవడానికి భూమిని లీజుకు తీసుకున్న రామోజీరావు.. ఆ భూమిలో రహదారి కోసం 600 గజాల భూమిని ఇచ్చి, దాని పరిహారాన్ని భూ యజమానికి ఇవ్వకుండా మింగేశారని చెప్పారు. ఇలాంటి కబ్జాకోరు రామోజీరావు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ఫ్రచారం చేస్తున్నారని విమర్శించారు. -
భూకబ్జాలు చేసేవారికి ఈ యాక్ట్ రావడం ఇష్టముండదు: సజ్జల
సాక్షి, విజయవాడ: ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. వ్యవస్థల మీద నమ్మకం పోయేవిధంగా వ్యవరిస్తున్నారన్నారు. ‘‘ప్రభుత్వాధినేత భూములు మింగేస్తారని చెప్పడం దేనికి సంకేతం’’ అంటూ టీడీపీపై ధ్వజమెత్తారు.అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు చేయాల్సిన విమర్శలు ఇవేనా?. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఇవేనా?. అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ చట్టం తెచ్చారు. ఇంకా గజిట్ అవ్వలేదు చట్టం అమలు అవ్వలేదు. విధి విధానాలు ఖరారు అవ్వలేదు. ఎన్నికల కోసం ఈ రకంగా ప్రచారం చేస్తారా?’’ అంటూ సజ్జల మండిపడ్డారు.భూ అక్రమాలకు చెక్ పెట్టడం కోసమే చట్టం ఉద్దేశం. చట్టం తేవడం ఒక విప్లవాత్మక మార్పు. ల్యాండ్ గ్రాబింగ్ చేసింది టీడీపీ. టీడీపీ ప్రభుత్వంలో వెబ్ ల్యాండ్ పేరుతో చంద్రబాబు భూముల అక్రమాలకు పాల్పడ్డారు. వెబ్ ల్యాండ్ పోర్టల్లో మార్పులు చేసి ఎంతో మంది భూములను ఇబ్బందులోకి నెట్టారు. సీఆర్డీఏ పరిధిలోని భూములను డీమ్డ్ మ్యుటేషన్ పేరుతో అక్రమాలకు చంద్రబాబు పాల్పడ్డారు. సాదా బైనామా పేరుతో భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కున్నారు. అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు జగన్ అడుగులు వేస్తున్నారు’’ అని సజ్జల పేర్కొన్నారు.తన అనుయాయులకు భూములు చంద్రబాబు కట్టబెట్టారు. లీజులకు తీసుకోవడం వాటిని కొల్లగొట్టడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. కబ్జాలకు అలవాటు పడిన వాళ్లకి సంస్కరణలు నచ్చవు. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక భూముల రక్షణ విషయంలో పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కబ్జాలు,అక్రమాలు, అన్యాయాలకు అడ్డుకట్ట పడుతుందని చంద్రబాబు భయపడుతున్నారు’’ అని సజ్జల చెప్పారు.‘‘భూముల వివరాలను ఏ కంపెనీకి ఇస్తున్నాం. అర్థరహితమైన ఆరోపణలు చేస్తారా. 190 దేశాల్లో భూముల వివాదాలపై సర్వే చేస్తే 154 స్థానంలో ఉన్నాం. కన్నాలు వేసే వాళ్లకి ఇటువంటి చర్యలు నచ్చవు. భూ సంస్కరణలు అమలు చేస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు. ఆరు వేల గ్రామాల్లో భూముల రీ సర్వే పూర్తి అయ్యింది. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తే దానికి అడ్డుపడుతున్నారు.’’ అని సజ్జల నిప్పులు చెరిగారు.‘‘చంద్రబాబు హయాంలో స్టాంప్స్ కుంభకోణాలకు పాల్పడ్డారు. పాస్ పుస్తకాలను డిజిటలైజ్ చేశాం. పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో వస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి?. రాష్ట్ర ప్రజలకు లేని సమస్య చంద్రబాబుకు మాత్రమే వచ్చిందా?. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని చంద్రబాబు అంటే మాత్రం కచ్చితంగా శిక్షించాల్సిందే. సమగ్ర భూ సర్వే పూర్తి అయ్యాక మాత్రమే ఈ చట్టం అమలవుతుంది. ఇదే విషయాన్ని కోర్టుకు తెలిపాం. చట్టం అమలు అవ్వాలంటే మరో రెండు నుంచి మూడేళ్లు పడుతుంది’’ సజ్జల వివరించారు.‘‘కోవిడ్ వైరస్ కంటే చంద్రబాబు ముఠా ప్రమాదకరం. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను స్వాగతిస్తున్నాం. ఎన్నికల కమిషన్ తీసుకున్న చర్యలను బట్టి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి’’ అని సజ్జల పేర్కొన్నారు. -
ఇంటింటికీ ‘జగన్ కోసం సిద్ధం’: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, అమరావతి: ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ ‘జగన్ కోసం సిద్ధం’ పేరుతో బూత్ స్థాయి కమిటీలతో గురువారం నుంచి మరోసారి గడపగడపలో విస్తృతంగా ప్రచారం ప్రారంభించినట్లు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ ఎన్నికల సంగ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘సిద్ధం’ పేరిట బహిరంగ సభలు, ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సు యాత్ర చేపట్టారని, ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారని, పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపారని తెలిపారు. తాజాగా 47 వేలకు పైగా బూత్స్థాయి కమిటీలు ‘జగన్ కోసం సిద్ధం’ అంటూ గడపగడపకూ వెళ్లే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. గతంలో ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంలోనూ ప్రతి గడపను పలకరించామన్నారు. ఆ కుటుంబాలన్నీ తమ నాయకుడు జగనే అని చెప్పాయన్నారు. గడప గడపకూ కార్యక్రమంలోనూ సమస్యలు అక్కడికక్కడే పరిష్కారించామని తెలిపారు. తాజా కార్యక్రమం ద్వారా మరోసారి సీఎం జగన్ ఎందుకు కావాలో వివరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి బూత్స్థాయిలో 1 ప్లస్ 10 విధానంలో ఒక ప్రెసిడెంట్, 10 మంది సభ్యులు పాల్గొంటారన్నారు.బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ విభిన్నమైన, అభ్యుదయ ఆలోచనలతో సమాజ దిశను మార్చిన నాయకుడని చెప్పారు. బలహీన వర్గాలను కూడా సంపన్నవర్గాలకు దీటుగా మలిచారని తెలిపారు. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసిన మంచిని, భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన తాజా మేనిఫెస్టోలోని అంశాలను పార్టీ నాయకులు, స్టార్ క్యాంపెయినర్లతో కలిసి ఈ కార్యక్రమంలో ఇంటింటికీ తీసుకెళ్తామన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ రెండు ఓట్లూ ఫ్యాను గుర్తుపై వేసి గెలిపించాలని కోరతామన్నారు. సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి రాగానే తమ ప్రభుత్వం అందించే ప్రతి పథకం వివరాలతో క్యాలెండర్ రూపంలో మేనిఫెస్టోను ఇంటింటికీ ఇస్తామని వివరించారు. చంద్రబాబులా మేనిఫెస్టోను పక్కన పడేయడం కాకుండా.. ఒక ప్రామాణికతతో రికార్డెడ్గా ఉండేందుకే ప్రతి ఇంటికీ పంపిస్తున్నట్లు చెప్పారు. తద్వారా హామీలను అమలు చేయకపోతే నిలదీసే హక్కు ప్రజలకు ఉంటుందని అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత కూడా సీఎం జగన్ సచివాలయాలు, ఇతర కార్యాలయాల్లో మేనిఫెస్టో అందుబాటులో పెట్టారన్నారు.ప్రజలే స్టార్ క్యాంపెయినర్లువైఎస్సార్సీపీ తరపున 12 మంది స్టార్ క్యాంపెయినర్లను ఎంపిక చేశామని, ఇతర పార్టీలకు ఉన్నట్లు వీరు సినీ హీరోలు కాదని, సామాన్య ప్రజల్లోంచి వచ్చారని చెప్పారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందిన వివిధ సామాజిక వర్గాల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులని చెప్పారు.చంద్రబాబును నమ్మితే జీవితం చీకటే– టీడీపీ కూటమి మేనిఫెస్టో అబద్ధాల పుట్ట.. బూతుపత్రం– అమలుచేయగలిగిన హామీలతోనే వైఎస్సార్సీపీ మేనిఫెస్టో– 1999, 2014లో అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబు– ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని బాబు అనడంపై బీజేపీ వైఖరేమిటి?– వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజంటీడీపీ కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబు ఎప్పటిలానే అలవికాని హామీలు ఇస్తే.. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో తమ ప్రభుత్వం ఏమి చేయగలదో వాటిని మాత్రమే సీఎం వైఎస్ జగన్ పెట్టారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆర్థిక వెసులుబాటు ఉంటే ప్రజలకు మరింతగా మంచి చేయడానికి సీఎం జగన్ ఎప్పుడూ వెనుకాడరని తెలిపారు. సీఎం జగన్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏడాదికి రూ. 70 వేల కోట్లతో 99 శాతానికి పైగా అమలు చేశారని, కోవిడ్ సంక్షోభంలోనూ రెండేళ్లూ ఏ పథకాన్నీ ఆపలేదన్నారు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా సీఎం జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారని అన్న చంద్రబాబే టీడీపీ మేనిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చారన్నారు. వాటిని అమలు చేయాలంటే ఏడాదికి రూ.1.70 లక్షల కోట్లకుపైగా అవసరమవుతాయని, అదనపు రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడంలేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో అబద్ధాల పుట్ట, బూతుపత్రం అని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొంప కొల్లేరవుతుందని, ప్రజల జీవితాలతో చెలగాటమాడతాడని, మళ్లీ చీకటి రోజులు తెస్తాడని చెప్పారు.1999 ఎన్నికల్లో కోటి మందికి ఉపాధి, 35 లక్షల ఇళ్లు నిర్మిస్తానని బాబు హామీ ఇచ్చారని, 2014లో రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలు, రూ.14,205 కోట్ల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం లేదా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి.. ఇలా 650కిపైగా హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఒక్కటీ చేయకుండా ప్రజలను మోసం చేశారన్నారు. ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఇస్తామంటున్నారని, నిరుద్యోగులంటే ఎవరంటే స్పష్టత ఇవ్వరని చెప్పారు. రైతులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామంటున్నారని, అర్హతలేమిటో చెప్పరన్నారు. ఇలా చంద్రబాబు ఇచ్చే ప్రతి హామీ అస్పష్టమేనని తెలిపారు. ఇలా అస్పష్టంగా చెప్పడం, అధికారంలోకి వస్తే అర్హతల పేరుతో కోతలు పెట్టి, ఎగ్గొట్టడం బాబుకు అలవాటేనని అన్నారు. అందుకే టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ ఆ మేనిఫెస్టోను ముట్టుకోవడంలేదన్నారు. బీజేపీ జాతీయ స్థాయిలో మేనిఫెస్టో విడుదల చేస్తుందని, రాష్ట్రాలకు విడుదల చేయదని చంద్రబాబు సమర్థించుకున్నారని, అదే నిజమైతే అరుణాచల్ప్రదేశ్, సిక్కింలకు బీజేపీ ప్రత్యేక మేనిఫెస్టోలను ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు.ప్రజలపై బాబుకు కోపం2019 ఎన్నికల్లో చిత్తుగా ఓడించారనే కోపంతోనే చంద్రబాబు ప్రజలకు నరకం చూపిస్తున్నారని, పింఛన్ల పంపిణీలో వృద్ధులను అష్టకష్టాలు పెడుతున్నారని చెప్పారు. వలంటీర్లపై నిమ్మగడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయకుండా అడ్డుకున్నారన్నారు. సచివాలయాల్లో పింఛన్లు ఇస్తుంటే బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ఈసీకి సూచించారని చెప్పారు. ఈసీ ఆదేశాల మేరకు బ్యాంకు ఖాతాల్లో వేసిన డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ పాపం చంద్రబాబుదేనన్నారు. పొరపాటున అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని నిప్పులకొలిమిగా మారుస్తానని చంద్రబాబు చెప్పకనే చెప్పారని అన్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తానని మోదీతో బాబు చెప్పించగలరా?బీజేపీతో పొత్తుపెట్టుకున్న చంద్రబాబు.. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని ప్రధాని మోదీతో చెప్పించగలరా అని సజ్జల నిలదీశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు భూములపై సర్వ హక్కులు కల్పించే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రూపకల్పనకు 2019లో నీతి ఆయోగ్ ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఆ కమిటీ ఇచ్చిన ముసాయిదాను చట్టంగా అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించిందని తెలిపారు. చంద్రబాబు మాత్రం ఆ చట్టం ద్వారా సీఎం జగన్ భూములు లాగేసుకుంటారని దుష్ఫ్రచారం చేస్తున్నారని, ఇదే చెబుతూ మేనిఫెస్టోలో బూతులు అచ్చేశారని, అందుకే టీడీపీ మేనిఫెస్టోను బూతపత్రంగా అభివర్ణిస్తున్నామని చెప్పారు. ఈ యాక్ట్పై చంద్రబాబు చేస్తున్న దుష్ఫ్రచారంపై బీజేపీ జాతీయ లేదా రాష్ట్ర నాయకత్వం వాటి వైఖరేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చెబుతున్నారని, చంద్రబాబేమో కొనసాగిస్తామంటున్నారని, దీనిపైనా బీజేపీ నేతల వైఖరిని చెప్పాలని అన్నారు.జగన్ కోసం సిద్ధం బస్సులు ప్రారంభించిన సజ్జలవైఎస్సార్సీపీ ఎన్నారైలు సమకూర్చిన జగన్ కోసం సిద్ధం బస్సులను సజ్జల రామకృష్ణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ విజయమే ప్రతి ఇంట్లో గెలుపులా ప్రజలు భావిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ విజయం కోసం సిద్ధం బస్సులు ఏర్పాటు చేసిన ఎన్నారైలకు సీఎం జగన్ తరపున, పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ తరపున పనిచేస్తున్న ఎన్నారైలు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని తెలిపారు. కోమటి జయరాం అనే ఎన్నారై అహంకారంతో ఓటర్లను కొనాలని భావించడం సిగ్గుచేటన్నారు. రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని సీఎం జగన్ నిత్యం చెబుతారని వివరించారు. రాజకీయం అంటే డబ్బు అని చాలా మంది భావిస్తుంటారన్నారు. నాయకుడిని బట్టి ప్రజలు ఉంటారని తెలిపారు. సీఎం జగన్ ప్రజలకు మేలు చేస్తారు కాబట్టి వైఎస్సార్సీపీకి మద్దతిచ్చే ఎన్నారైలు కూడా ప్రజలకు మేలు చేయడానికి ముందుకొచ్చారని తెలిపారు. నాలుగు బస్సుల్లో స్టార్ క్యాంపెయినర్లు పనిచేస్తారని అన్నారు. వైఎస్సార్సీపీ గ్లోబల్ ఎన్నారై కన్వీనర్ వెంకట్ మేడపాటి మాట్లాడుతూ.. సీఎం జగన్ విధానాలు, కార్యక్రమాలతో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించి, ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ బస్సు యాత్ర లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై సీఎం జగన్ దృష్టి సారిస్తున్నారని వైఎస్సార్సీపీ సింగపూర్ కన్వీనర్ దువ్వూరు మురళీకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్సీపీ యూఎస్ఏ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, రాజామణి(యూఎస్ఏ), సుజాత(కెనడా), కోటిరెడ్డి (సింగపూర్), కార్తీక్ యల్లాప్రగడ (నెదర్ల్యాండ్స్), మన్మోహన్ (యూకే), కుద్దీర్(యూఎస్ఏ), గోవింద నాగారాజు, మర్రి కల్యాణ్ (కువైట్), వినోద్ పేరూరి (ఐర్లాండ్), బాజిబాబ(మలేషియా), సూర్య (ఆస్ట్రేలియా), కృష్ణ కోడూరు (యూఎస్ఏ) సహా వందలాది ఎన్నారైలు, పార్టీ నేతలు చల్లా మధు, పుత్తా ప్రతాప్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement