16న వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత | Unexpected response to the one crore signature public movement against the privatization of medical colleges | Sakshi
Sakshi News home page

16న వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో గవర్నర్‌కు కోటి సంతకాలు అందజేత

Dec 4 2025 5:05 AM | Updated on Dec 4 2025 5:05 AM

Unexpected response to the one crore signature public movement against the privatization of medical colleges

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి అనూహ్య స్పందన

వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేపట్టి­న కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజల నుంచి అనూహ్యమైన స్పంద­న వచ్చిందని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్‌సీపీ జి­ల్లా పార్టీల అధ్యక్షులు, పార్లమెంటరీ పరిశీల­కులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినే­షన్, అను­బంధ విభాగాలు), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డి­నే­షన్‌), ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమ­న్వయక­ర్తలు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్‌)­తో బు­ధ­వారం రామకృష్ణారెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లా­డుతూ.. కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలా సా­గిందన్నారు. సంతకాలు కోటి అనుకుంటే అంత­కుమించి వస్తున్నాయని చెప్పారు. ఇప్పటి­వరకు నియోజకవర్గ స్థాయిలో సేకరించిన సంత­కాలను ఈ నెల 10న జిల్లా పార్టీ కా­ర్యాలయాలకు పంపాలని సూచించారు. 13న జిల్లా కార్యాలయాల నుంచి కేంద్ర కార్యాలయం తాడే­పల్లికి పంపాలని కోరారు. ఈ నెల 16న పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలో గవర్నర్‌కు  కోటి సంతకాలు అంద­జేయనున్నట్టు చెప్పారు.

సేకరించిన సంతకాలన్నీ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజల ముందు, మీడి­యా ముందు ప్రదర్శించి వారి సమక్షంలోనే బా­క్సుల్లో సర్ది వాహనాల్లో పెట్టి నాయకులు జెండా ఊపి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన నా­యకులంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. 13న జిల్లా కేంద్రంలో కూడా అదే స్థాయిలో కార్యక్ర­మం నిర్వహించి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాల­యానికి పంపాలని చెప్పారు. 

ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని అధినేత వైఎస్‌ జగన్‌ ప్రత్యేకంగా చెప్పారని వెల్లడించారు. జిల్లా కేంద్రం నుంచి వేలాది మందితో ర్యాలీలు చేపట్టి రాష్ట్ర కార్యాలయానికి పంపాలన్నారు. పార్టీ అనుబంధ విభాగాలు కూడా ఇందులో కీలకపాత్ర పోషించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement