చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి | Sajjala Ramakrishna Reddy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లండి

Mar 24 2026 6:05 AM | Updated on Mar 24 2026 6:05 AM

Sajjala Ramakrishna Reddy Fires on Chandrababu

రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకంపై వైఎస్సార్‌సీపీ కీలక సమావేశం 

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించిన సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షి,అమరావతి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ స్టేట్‌ కో–ఆర్డినేటర్‌ సజ్జ­ల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సోమ­వారం తాడేç­³­ల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌  భవిష్యత్‌ కార్యాచరణపై కీలక సమావేశం నిర్వహించారు. వివిధ అంశాలపై చర్చించి, భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయించారు. జిల్లా­ల స్థాయిలో టాస్‌్కఫోర్స్‌ ఏర్పాటు చేసు­కుని కార్యాచరణ చేపట్టాలని, వచ్చే రెండు మూడు నెల­లు ప్రతి వారం పది రోజులకు ఒకసారి జిల్లా స్థాయి­లో సమావేశాలు నిర్వహించాలని, విద్యారి్థ, యువజన, రైతు విభాగాలను మరింత భాగస్వా­మ్య­ం చేయాలని నిర్ణయించారు.

రాయలసీమ జిల్లాల్లో ప్రతి ఇంటికి కరపత్రాల ద్వారా రాయలసీమ లిఫ్ట్‌ ఆగిపోవడం వల్ల జరుగుతున్న నష్టం, ప్రా­జెక్ట్‌ విషయంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం వల్ల జరుగుతున్న అన్యాయాలను తెలియజేయాలని, అల్మట్టి ఎత్తుపెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి జరుగుతున్న నష్టం తదితర అంశాలపై జిల్లాల్లో సమా­వేశాలు నిర్వహించుకుని కార్యాచరణ రూపొందించు­కోవాలని సమావేశం తీర్మానించింది.

 రాష్ట్రస్థాయిలో సమన్వయం చేసే బాధ్య­తను మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు అప్పగించారు. సమావేశంలో పార్టీ నాయకులు సాకే శైలజానాథ్, ఎస్‌వీ సతీ­ష్‌రెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఉషా­శ్రీచరణ్, భూమన కరుణాకర్‌రెడ్డి, కాకాణి గోవర్ధన్‌­రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, మలసాని మనోహర్‌రెడ్డి, జిన్నూరి రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement