మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై సర్కారు మెడలు వంచుతాం | Sajjala Ramakrishna Reddy unveiled the YSRCP Praja Udyamam poster | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణపై సర్కారు మెడలు వంచుతాం

Oct 23 2025 5:03 AM | Updated on Oct 23 2025 5:03 AM

Sajjala Ramakrishna Reddy unveiled the YSRCP Praja Udyamam poster

వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ నేతలు

‘వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం’ పోస్టర్‌ ఆవిష్కరణలో సజ్జల

28న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో, నవంబర్‌ 12న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు

నవంబర్‌ 24న పార్టీ కార్యాలయానికి చేరుకోనున్న కోటి సంతకాలు  

గవర్నర్‌కు కోటి సంతకాల ప్రతులను సమర్పించనున్న వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కృషితో సాకారమైన కొత్త మెడికల్‌ కాలేజీల­ను ప్రైవేటీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేదాకా పోరాడతామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. తమతో కలసి వచ్చే పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులతో కలసి ఉద్యమి­స్తామని తెలి­పా­రు. ‘వైఎస్సార్‌సీపీ ప్రజా ఉద్యమం’ పో­స్టర్‌ను బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కా­ర్యా­లయంలో ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు వెలంపల్లి శ్రీనివాసరావు, శైలజానాథ్, చెల్లుబోయి­న వేణు, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి, మొండితోక అ­రుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. మెడికల్‌ కాలేజీ­ల ప్రైవేటీకరణకు వ్యతిరే­కంగా పార్టీ ఆ­ధ్వర్యంలో కొనసాగుతున్న కోటి సంతకాల సేకరణ­­తోపాటు ఈనెల 28న రాష్ట్రవ్యాప్తంగా 175 ని­యో­జకవర్గాల పరిధి­లో అవగాహన ర్యా­లీలు నిర్వహించనున్నట్లు సజ్జల చెప్పారు. నవంబర్‌ 24 నా­టికి సంతకాల సేకరణ పూర్తి చేసి వైఎస్‌ జగన్‌ పార్టీ నేతలతో కలసి గవర్నర్‌కి అందజేస్తారని చెప్పారు.  

ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం.. 
కొత్త మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణతో భావి త­రా­లు ఎంత నష్టపోతాయో ప్రజలకు వివరిస్తున్నాం. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజలంతా స్వచ్ఛంద­ంగా మద్దతు ప్రకటిస్తున్నారు. ఈనెల 28న అసెంబ్లీ ని­యోజకవర్గాల పరిధిలో, నవంబర్‌ 12న అన్ని జి­ల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ­లు నిర్వహిస్తాం. ఇది రాష్ట్ర భవిష్యత్తుకి సంబంధించిన అంశం. ప్రజా ఉద్య­మం పోస్టర్‌ ఆవిష్కరణ అక్టోబ­ర్‌ 23న అన్ని జిల్లా కేంద్రాల్లో, 24న నియోజకవర్గ కేంద్రాల్లో, 25న మండల కేంద్రాల్లో జరుగుతుంది. కోటి సంతకాల ప్రతులు నవంబర్‌ 23న నియోజకవర్గ కేంద్రాల నుంచి జిల్లా కేంద్ర కార్యాలయాలకు, నవంబర్‌ 24న కేంద్ర కార్యాలయానికి చేరతాయి.  

వైఎస్సార్‌సీపీ హయాంలోనే 7 కాలేజీలు పూర్తి.. 
వైఎస్సార్‌సీపీ దిగిపోయే నాటికి 7 కొత్త మెడికల్‌ కా­లేజీలను పూర్తి చేశాం. మరో 3 కాలేజీలు ఆదోని, మదనపల్లె, మార్కాపురంలో 80 నుంచి 90 శాతం పనులు పూర్తి చేసుకుని అడ్వాన్స్‌ దశలో ఉండగా మిగిలిన కళాశాలలు వివిధ దశల్లో ఉన్నా­యి. మెడికల్‌ కాలేజీల నిర్మాణం ఒక్క రోజులో జరిగే పని­కా­దు. కేంద్రం నిర్మించిన ఎయి­మ్స్‌ ఆ­స్పత్రి పూర్తి కా­వడానికి 9 ఏళ్లు పట్టి­ందనే విష­యాన్ని చంద్రబాబు మర్చిపోతే ఎలా? ఒకపక్క మెడికల్‌ కా­లేజీలను ప్రైవేటుకి కట్టబెడు­తూ, తాను ఉచితంగా వైద్యం అందిస్తానంటే వైఎస్‌ జగన్‌ అ­డ్డుపడుతున్నారని చంద్రబాబు దుష్ప్ర­చారం చేస్తున్నారు. ప్రై­వేటు సం­స్థలు లాభా­పేక్ష లేకుండా మె­డికల్‌ కాలేజీలు ఎ­లా నడుపుతాయి? చంద్రబాబు చెబు­తు­న్న పీపీపీ మోడ­ల్‌ వల్ల భూ­మి, భవనాలు వినియోగించుకుని ప్రైవేట్‌ వ్య­క్తులు జేబులు నింపుకొంటే పేద­లు వై­ద్యం కోసం మరింత నిరుపేదలుగా మారిపోతారు. అలాంటప్పుడు పీపీపీతో నష్టం లేదని ఎలా చెబుతారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement