సాక్షి,తాడేపల్లి: కూటమి పాలనలో వ్యవసాయం రంగం సంక్షోభంలో చిక్కుకుందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రైతు సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రైతు విభాగం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సజ్జల మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాబు ధరలేదు. అధికార పార్టీ, దళారులు కుమ్మక్కై మోసం చేస్తున్నారు. సమస్యలు గాలికొదిలేసి మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారని’ధ్వజమెత్తారు.
రైతు విభాగం సమావేశంలో వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ ప్రధాన కార్యదర్శులు లేళ్ళ అప్పిరెడ్డి, ఆలూరు సాంబశివారెడ్డి, రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డి రఘురామ్, మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు సహా రైతు విభాగం నేతలు పాల్గొన్నారు.



