Amaravati
-
ప్రభుత్వ ఉద్యోగం నుంచి కాకర్ల వెంకట్రామిరెడ్డి తొలగింపు
సాక్షి,విజయవాడ: ఏపీ ఉద్యోగ సంఘం నాయకుడిపై కూటమి ప్రభుత్వం కుట్రకు దిగింది. కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న వెంకట్రామిరెడ్డి గత 22 నెలలుగా ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నిస్తూ, చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలదీస్తున్నారు. ఈ క్రమంలో ఆయనపై కక్ష సాధింపులకు దిగింది.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు ప్రభుత్వం వెంకట్రామిరెడ్డిపై పగబట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనపై చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి సస్పెన్షన్ విధించారు. ఇప్పుడు శాశ్వతంగా సర్వీస్ నుండి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
మా భూముల జోలికొస్తే పోరాటమే
తాడేపల్లి రూరల్: అమరావతి ముఖ ద్వారమైన గుంటూరు జిల్లా ఉండవల్లిలో పంట పొలాలను తీసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 16న భూ సేకరణ కింద నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతులంతా ఆదివారం సమావేశమయ్యారు. ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని, వేర్వేరుగా పోరాటం చేస్తే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని, గతంలో భూ సమీకరణకు ఏవిధంగా పోరాడామో ఇప్పుడూ అదేవిధంగా పోరాటానికి సిద్ధం కావాలని ఏకాభిప్రాయానికి వచ్చారు. ఒకవేళ ప్రభుత్వం దిగొచ్చి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకుంటే... చర్చించి ఏ విధంగా అభివృద్ధి చేస్తారో, రైతులకు ఎలా న్యాయం చేస్తారో అడగడానికి సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఉండవల్లిలోని పంట పొలాల్లో నుంచి వచ్చే సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూమిని ప్రభుత్వానికి భూ సమీకరణకు ఇచ్చేందుకు గతంలో కొంత మంది రైతులు 9.3 పత్రాలను అందజేశారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణానికి పోను మిగిలిన భూములకు కూడా భూ సేకరణ నోటిఫికేషన్ ఇస్తారని తెలియడంతో వారు తీవ్రంగా వ్యతిరేకిస్తూ అవసరమైతే కోర్టుల ద్వారా 9.3 పత్రాలను వెనక్కి తీసుకుంటామని తెలిపారు. ఉండవల్లిలో భూ సమీకరణకు భూములు ఇచ్చిన రైతులకు ఉండవల్లి రేగడ పొలాన ప్లాట్లు కేటాయించారు. ఆ ప్లాట్లకు సీడ్ యాక్సెస్ రోడ్కి, పాత జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ రోడ్ల నిర్మాణం చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం, సీఆర్డీఏ ఉందని, మొట్టమొదటగా గుంటూరు చానల్ ఒడ్డున సీడ్ యాక్సెస్ నుంచి మాతాశ్రీ ఆశ్రమం వరకు 160 మీటర్ల రోడ్డు నిర్మాణానికి 34 ఎకరాల రైతులకు భూ సేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి, కొండవీటి వాగు వెడల్పుకు, ఉండవల్లి – అమరావతి రోడ్డు నుంచి నాయుళ్ల రామమందిరం, రెడ్ల రామమందిరం మీదుగా ఉండవల్లి దళితవాడ వరకు... అక్కడి నుంచి నులకపేట ఫైరింగ్ స్టేషన్ మరోవైపు పెనుమాక నుంచి సొరంగం ఏర్పాటు చేసి ఉండవల్లి కరకట్ట వైపు కూడా రోడ్ల నిర్మాణానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వీటన్నింటికి విడివిడిగా భూ సేకరణకు, ఇళ్లను తొలగించేందుకు నోటిఫికేషన్ త్వరలో ఇస్తారని, మనందరం ఐక్యంగా పోరాటం చేసి ప్రభుత్వం చర్చలకు వచ్చేవిధంగా నిలబడాలని పిలుపునిచ్చారు. రైతు సంఘం నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో కలిసొచ్చే పార్టీలతో రైతులకు మద్దతుగా నిలిచి పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
‘ఏపీకి రాజధాని లేకపోవడానికి కారణం చంద్రబాబే’
గుంటూరు: ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. చంద్రబాబు అవినీతే దీనికి కారణమని చెప్పారు. అవినీతి కోసమే అమరావతిని సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడారు.‘రాజధాని పేరుతో చంద్రబాబు తన వారికి దోచిపెడుతున్నారు. రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల ఖర్చు పెడతామంటున్నారు. అమరావతి పేరుతో భయంకరమైన దోపిడీకి చంద్రబాబు తెరదీశారు. ఇప్పటివరకు రాజధాని కోసం రూ.45 వేల కోట్ల అప్పు తెచ్చారు. అప్పులు తెచ్చి రాజధాని నిర్మించాల్సిన అవసరం ఉందా?మావిగన్ ప్రతిపాదనతో ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. తక్కువ ఖర్చుతో రాజధాని నిర్మించవచ్చని జగన్ మావిగన్ ప్రతిపాదన తెచ్చారు. మావిగన్ ప్రతిపాదనతో టీడీపీలో భయం పట్టుకుంది. అందుకే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మావిగన్పై కొందరు కావాలనే ట్రోల్స్ చేస్తున్నారు’ అని అంబటి రాంబాబు చెప్పారు.అమరావతి అసాధ్యమనే మావిగన్ ప్రతిపాదనహైదరాబాద్, బెంగళూరు వంటి మహా నగరాల్లో ఏదైనా ఓ నిర్మాణం చేపట్టాలంటే గరిష్టంగా చదరపు అడుగుకు రూ.4500 ఖర్చవుతుందని అంబటి రాంబాబు అన్నారను. ‘తాడేపల్లి, గుంటూరు వంటి చోట్ల కట్టినా చదరపు అడుగుకు రూ.2500 అవుతుంది. పైస్టార్ హోటల్ లెక్కన కట్టినా చదరపు అడుగుకు విజయవాడ, గుంటూరుల్లోనూ రూ.3500 కంటే ఎక్కువ కాదు. కానీ అమరావతిలో మాత్రం చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.16 వేలు ఖర్చు పెట్డడం దోపిడీ కాదా? అనేక సందర్భాల్లో ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పలేకపోతోంది. మేం దోచుకుంటాం, మీరు చూస్తూ ఉండండి అంటున్నారు. అమరావతిలో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్ధితి. ఇంత భయంకరమైన దోపిడీకి చంద్రబాబు అమరావతి పేరుతో తెర దీశారు. ఇప్పటికే రూ.75 వేల కోట్లు ప్రాథమిక వసతుల కోసం ఖర్చు పెట్టాలని అనుకున్నారు. ఇందులో రూ.45 వేల కోట్లు బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చారు. ఆర్ధికంగా దెబ్బ తిన్న రాష్ట్రానికి లక్షల కోట్లు అప్పు తెచ్చి అమరావతి నిర్మించాల్సిన అవసరం ఉందా అని అడుగుతున్నాం. అందుకే జగన్మోహన్ రెడ్డి మావిగన్ అనే ప్రతిపాదన తెచ్చారు. దీంతో చంద్రబాబు గుండెల్లో రాయిపడినట్లయింది. దీనిపై జనం ఆలోచించడం మొదలుపెట్టారు. అందుకే మావిగన్ మీద బూతులతో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇవాళ అంతా రివర్స్ అయింది. వాళ్ల వాదన తప్పని తేలిపోయింది. మావిగన్ పై రాష్ట్రమంతా చర్చ జరుగుతోంది’ అని చెప్పారు. -
అమరావతిలో బాలయ్య 100 ఎకరాలు..
-
చంద్రబాబు తప్పు చేస్తున్నావ్ శిక్ష అనుభవిస్తావ్ జాగ్రత్త
-
సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ భవనాల్లో ఎంఈపీ పనులకు టెండర్లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో నేలపాడు సమీపంలో నిర్మిస్తున్న శాశ్వత సచివాలయం టవర్లలో ఎంఈపీ(మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్) పనులకు మూడు ప్యాకేజీల కింద అమరావతి గ్రోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏజీఐసీఎల్) టెండర్లు పిలిచింది. బీ+జీ+39 అంతస్తులతో నిరి్మస్తున్న 1, 2 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.743.02 కోట్లు.. 2, 3 టవర్లలో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.681.47 కోట్లు, ముఖ్యమంత్రి కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం బీ+జీ+49 అంతస్తులతో నిరి్మస్తున్న జీఏడీ టవర్లో ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.431.59 కోట్లుగా నిర్ణయించింది. ఇక ఏడు అంతస్తుల(బీ+జీ+7)తో నిర్మిస్తున్న హైకోర్టు భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.365.15 కోట్లు.. మూడు అంతస్తులతో(బీ+జీ+3) నిర్మిస్తున్న అసెంబ్లీ భవనం ఎంఈపీ పనుల కాంట్రాక్టు విలువను రూ.244.26 కోట్లుగా నిర్ణయించింది. విద్యుత్ సౌకర్యం, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు, శానిటరీ పనుల కోసం ఈ టెండర్లు పిలిచింది. బిడ్ల దాఖలుకు మే 5ను తుది గడువుగా నిర్ణయించింది. మే 11న ఆర్థిక బిడ్ తెరిచి.. ఎల్–1గా నిలిచిన కాంట్రాక్టర్కు మే 18న పనులు అప్పగించేలా షెడ్యూలు రూపొందించింది. జాయింట్ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ కాంట్రాక్టు సంస్థలు సంయుక్తంగా) టెండర్లలో బిడ్ల దాఖలుకు అర్హత లేదని నిబంధన పెట్టింది. దీన్ని బట్టి చూస్తే.. ఈ పనులను ఎవరికి అప్పగించాలన్నది ఇప్పటికే ఖరారైందని.. టెండర్లు నామమాత్రమేనని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
మైనర్ బాలికలే టార్గెట్.. 350 అభ్యంతకర వీడియోలు
మహారాష్ట్రలో దారుణం జరిగింది. మైనర్ యువతులను ట్రాఫ్ చేసి వారి అభ్యంతరకర వీడియోలు చిత్రీకరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు 19 సంవత్సరాల ఆయాన్ అహ్మద్ తన్వీర్గా తెలిపారు. నిందితుడి ఫోన్లో బాలికలకు సంబంధించిన దాదాపు 350కి పైగా అశ్లీల వీడియోలు గుర్తించినట్లు పేర్కొన్నారు.అమరావతికి చెందిన ఆయాన్ అహ్మద్ తన్వీర్ అనే వ్యక్తి మైనర్ బాలికలే టార్గెట్గా వల పన్నాడు. మాయ మాటలతో వారిని మచ్చిక చేసుకొని వారిని నమ్మించి లైంగికంగా వేధించాడు. అనంతరం వారికి తెలియకుండా అశ్లీల వీడియోలు తీశాడు. ఆ పై ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వారిని బెదిరిస్తూ బ్లాక్మెయిల్కు పాల్పడ్డాడు. ఈ ఘటనలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.దీంతో వివరాలు తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. అనంతరం విచారించగా నిందితుడు సుమారు 350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించినట్లు సమాచారం. వీటిలో దాదాపు 100కు పైగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే అక్కడి స్థానిక నేతలు దాదాపు 180 మంది బాలికలను ఈ విధంగా వేదించాడని ఫిర్యాదు చేశారు. అయితే విచారణలో ఇప్పటివరకూ ఎనిమిది మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు అయాన్ అహ్మద్తో పాటు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఉజేర్ ఖాన్ ,ఇక్బాల్ ఖాన్ అనే మరో ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిపై భారతీయ న్యాయ సంహిత (BNS) 2023, పోక్సో (POCSO) చట్టం మరియు ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.ప్రస్తుతానికి నిందితున్ని వారం రోజుల పాటు కస్టడీకి తరలించామని నిందితుడి మొబైల్ ఫోన్లో డిలీట్ చేసిన డేటాను రికవరీ చేసేందుకు ఫోరెన్సిక్ బృందాల సాయం కోరుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుని వల్ల మరెవరైనా బాధితులుంటే తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు హామీ ఇచ్చారు.అయితే ఈ ఘటన మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేపింది. నిందితుడికి గతంలో రాజకీయ నేపథ్యం ఉండటంతో స్థానిక రాజకీయ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక ఏదైనా కుట్రకోణం ఉందా అనే దృష్టిలో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. -
చంద్రబాబు దేశముదురు.. NTR నుండి KCR వరకు అంతా చెప్పింది ఒక్కటే..
-
రాజధానిలో మచిలీపట్నం ఉందా? ఉంటే అక్కడ ఏం కడుతున్నారు?
-
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
6 నెలలుగా జీతాలు లేవు అమరావతి ఆస్పత్రి వద్ద ధర్నా
-
అమరావతి VS మావిగన్.. జగన్ విజన్ వర్సెస్ బాబు శకుని బుద్ది
-
‘మావిగన్’తో కలవరం
సాక్షి, అమరావతి: మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు కారిడార్గా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం మావిగన్ ప్రకటనతో టీడీపీ, చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. ఈ అంశంపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతుండటం వల్లే తనకెప్పుడూ అలవాటైన రీతిలో చంద్రబాబు తన మంత్రుల ద్వారా తిట్ల దండకం చదివిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనాలోచిత నిర్ణయాలు, అంతులేని అవినీతి, అత్యాశల కారణంగా అమరావతి అనేది రాష్ట్రానికి మోయలేని గుదిబండగా మారిందన్నారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం పేరుతో చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి భవిష్యత్ తరాలను అంధకారంలోకి నెట్టేస్తున్నారని వైఎస్ జగన్ అద్భుతంగా వివరించారని చెప్పారు. జగన్ ప్రతిపాదనను ఎందుకు అంగీకరించడం లేదో చెప్పకుండా, లెక్కలతో వివరించకుండా చంద్రబాబు తన మంత్రులు, ఎమ్మెల్యేలకు బూతు పాఠాలు రాసిచ్చి వారితో మాట్లాడిస్తున్నాడని నిప్పులు చెరిగారు.మంత్రులుగా ఉండి బాధ్యతగా వ్యవహరించాల్సిన అచ్చెన్నాయుడు, అనిత, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, సత్యకుమార్, సవితలతోపాటు ఎమ్మెల్యే ధూళిపాళ్ల, ఎంపీ కలిశెట్టి, టీడీపీ నాయకుడు పట్టాభి వంటి వారిని వైఎస్ జగన్ మీదకు ఉసిగొల్పి బూతులు, అసత్యాలతో వ్యక్తిత్వ హననం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా మావిగన్పై చర్చ జరగకుండా జగన్ను ట్రోల్ చేశామని సంబరపడిన 48 గంటల్లోనే వారి ఆశలు ఆవిరైపోయాయన్నారు. ఈ అంశం ప్రజల్లోకి శరవేగంగా దూసుకెళ్లిందని చెప్పారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..వీళ్లంతా చంద్రబాబును ఎంత ఘోరంగా తిట్టారో..కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నప్పుడు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు తీసుకొచ్చి వైఎస్ జగన్ వ్యక్తిత్వం గురించి చంద్రబాబు తప్పుడు ప్రచారం మొదలు పెట్టాడు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ అప్పట్లో చంద్రబాబును ఘోరాతి ఘోరంగా తిట్టాడు. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం, అభినవ ఔరంగజేబు చంద్రబాబు, పశువుకున్న విశ్వాసం కూడా చంద్రబాబుకి లేదు.. అని దుమ్మెత్తిపోశారు. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తన వైపు లాక్కున్నాడని చెప్పాడు. నా మీద పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి నా ప్రభంజనంలో కొట్టుకుపోయిన చిన్న మిడత చంద్రబాబు.. నమ్మించి ముంచిన నంగనాచి, బాబు నా కన్నా పెద్ద నటుడు. ఇలా 73 ఏళ్ల వయసులో చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు.ఆయన తిట్టిన తిట్లకు ఇంకెవరన్నా అయితే ఏదైనా అఘాయిత్యం చేసుకునేవాళ్లు. ఇవన్నీ ఎంపీ కలిశెట్టి మీడియాకు చూపించాలి. చంద్రబాబు ఊసరవెల్లి. వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం. మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తాడని ఆయన వద్ద ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వాళ్లే అన్నారు. ఇప్పుడు చంద్రబాబుకు పార్టనర్గా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం నాడు చంద్రబాబు, లోకేశ్ల అవినీతిని తీవ్రంగా విమర్శించారు. బాబు మళ్లీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే అన్నాడు. చంద్రబాబు కేబినెట్లో ఉన్న సగం మంది మంత్రులు ఒకప్పుడు ఆయన్ను తిట్టిన వీడియోలు చాలా ఉన్నాయి.164 మంది ఎమ్మెల్యేల్లో చంద్రబాబుని తిట్టిన వారి లెక్క వందకు పైనే. చంద్రబాబుని మోడీ, మోడీని చంద్రబాబు దూషించుకున్నారు. చంద్రబాబును దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నిసార్లు తిట్టిందో లెక్కే లేదు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా చంద్రబాబు గురించి పుస్తకాలే రాశాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలను టీడీపీ శిక్షణ తరగతుల్లో పంచి పెట్టగలరా? ఈ ప్రాంతాల్లో రూపాయి ఖర్చు చేశారా? చంద్రబాబు చెప్పే అమరావతి కాన్సెప్టులో బలముంటే మావిగన్ పేరెత్తితే ఎందుకంత భయం? మావిగన్ అనేది సీఆర్డీఏ పరిధిలో ఎప్పుడో ఉందని 2014 డిసెంబర్ 30 నాటి జీవో చూపిస్తున్నారు. మరి ఎనిమిదేళ్లలో ఈ ప్రాంతాలకు మాస్టర్ ప్లాన్ ఎందుకు సిద్ధం చేయలేదు? వైఎస్ జగన్ మావిగన్ పేరెత్తే వరకు అమరావతి అంటే 29 ఊర్లే. ఆయన ఎప్పుడైతే మావిగన్ కాన్సెప్టు తీసుకొచ్చారో అప్పుడు హడావుడిగా విజయవాడ రూరల్, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, పమిడిముక్కల, నూజివీడు, గుడివాడ, గన్నవరం, ఉంగుటూరు, పామర్రు, ఘంటసాల, పెదపారుపూడి మండలాలకు కన్సల్టెంట్లను పంపించాడు.రూ.51 వేల కోట్లకు టెండర్లు పిలిచామని చెప్పే మంత్రి నారాయణ అందులో ఒక్క కోటి రూపాయలైనా ఈ ఊర్లలో ఎందుకు వెచ్చించలేదు? మాస్టర్ ప్లాన్ ఇంత వరకు ఎందుకు రూపొందించలేదు? మా ప్రాంతాల్లో ఒక్క ఆఫీసు ఉందా? ఐదు టవర్లలో ఒక్కటైనా ఉందా? జడ్జి బంగ్లాలు, ఎమ్మెల్యే క్వార్టర్లు లేకుండా మేం రాజధాని పరిధిలో ఉన్నామని ఎలా ఫీలవ్వాలో చెప్పాలి. 8 ఏళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి నారాయణ చెబుతున్నాడు. కానీ అందులో రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులే ఉన్నాయి. ఏ లెక్కన ఎకరం రూ.10 కోట్లు అంటున్నారు?జమ్మూ కశ్మీర్లో కాలేజీ పెట్టిన నారాయణ నష్టమొచ్చిందని ఎలా మూసేస్తున్నాడో, రాష్ట్రానికి అమరావతి గుదిబండగా మారిందని తెలిశాక ఆపేస్తేనే భవిష్యత్తు తరాలకు మంచిది. రాజధాని మీద ఇంత అప్పు చేస్తున్నప్పుడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? ఈ అప్పులు ఎక్కడికి చేరుకుంటాయో కనీస అంచనా కూడా ప్రభుత్వం వద్ద లేదు. 2029 నాటికి బేసిక్ కేపిటల్ (సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు) పూర్తి చేస్తామని చెబుతున్నారు. బేసిక్ కేపిటల్కే రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తే, ల్యాండ్ పూలింగ్లో రైతుల నుంచి తీసుకున్న ప్లాట్లు డెవలప్మెంట్కు ఇంకెంత ఖర్చు చేయాలి? అమరావతిలో ఎకరం విలువ రూ.10 కోట్లు ఉందని, భవిష్యత్తులో రూ.20 కోట్లకు చేరుతుందని బోగస్ ప్రచారం మొదలుపెట్టారు.వాస్తవం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. చంద్రబాబు తన ఇంటి నిర్మాణం కోసం వెలగపూడి ప్రాంతంలో 25 వేల చదరపు గజాలు (5 ఎకరాలు) గజం రూ.7,500 చొప్పున కొనుగోలు చేశాడు. ఆ మొత్తం 5 ఎకరాల స్థలాన్ని ఏడాది క్రితం రూ.18.75 కోట్లకు కొనుగోలు చేసినట్టు సేల్ డీడ్లో స్పష్టంగా పేర్కొన్నారు. దీని ప్రకారం చంద్రబాబు ఎకరం రూ.3.63 కోట్లకు కొన్నాడు. అది కూడా కొత్తగా నిర్మించబోతున్న సచివాలయానికి ఎదురుగా ఉండే ప్రైమ్ ల్యాండ్లో. ఇంటి వెనుక హైకోర్టు వస్తుంది.అలాంటిది ఎకరం రూ.10 కోట్లు పలుకుతుందని మంత్రి నారాయణ చెప్పేవన్నీ అబద్ధాలే కదా? ఈ లెక్కన ప్రభుత్వం వద్ద ఉన్న 5 వేల ఎకరాలు అమ్మినా వచ్చే ఆదాయం రూ.18,150 కోట్లు అవుతుంది. ఈ లెక్కలన్నీ వివరిస్తే వైఎస్ జగన్ను తూలనాడుతున్నారు. 4,800 గజాల్లో వైఎస్ జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకుంటేనే ప్యాలెస్ అంటే, చంద్రబాబు ఐదెకరాల్లో కడుతున్న ఇంటిని ఏమనాలి? బాబు చెబుతున్న లెక్కల ప్రకారం అసలు, వడ్డీ కలిపి ఏడాదికి రూ.19,500 కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల చొప్పున 20 ఏళ్లపాటు కట్టాలి.రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు?ప్రజల ఆకాంక్ష మేరకు ఇప్పుడైనా మావిగన్ గురించి ఆలోచించండి. రూ.10 వేల కోట్లతో అద్భుతమైన రాజధాని అవుతుంది. మీరు చెప్పినట్లే విశాలంగా 10 లక్షల చదరపు అడుగుల చొప్పున హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ కూడా కట్టొచ్చు. కోకాపేటలో ఎకరా రూ.100 కోట్లకు వేలంలో పాడి అద్భుతమైన సదుపాయాలతో ఇళ్లు పూర్తి చేసి, చదరపు అడుగు రూ.10 వేలకు అమ్ముతున్నారు. ఇదే విషయం మిమ్మల్ని ప్రశ్నిస్తే వైఎస్ జగన్ను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. హైదరాబాద్ శంకరపల్లి, కోకాపేట, నియోపోలీస్ ఏరియాలో కూడా చదరపు అడుగు ఎంతో తెలుసుకోండి. మంత్రి నారాయణ ఇళ్లు, కార్యాలయం చదరపు అడుగు రూ.16 వేలతో కట్టారా? చంద్రబాబు ఇంటికి ఇంతే పెడుతున్నారా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? నేను అగ్రిమెంట్ రాస్తాను.మీరు చెబుతున్నట్టు 10 లక్షల చదరపు అడుగుల చొప్పున సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ కేవలం రూ.10 వేల కోట్లలో కట్టి చూపిస్తాం. కేంద్రమంత్రి పెమ్మసాని అమరావతిలో లక్ష జనాభా లేరని, హోటల్ కట్టినా ఎవరూ రారని చెబుతున్నారు. మరోవైపు చంద్రబాబు మాత్రం 2035 నాటికి 50 లక్షల జనాభా అవుతుందని చెబుతున్నారు. ఎంత మోసం? అమరావతి బిల్లు పెట్టినప్పుడు చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మిగిలిన ప్రాంతాల ప్రజలను మభ్యపెట్టడానికి ఏయే జిల్లాలకు ఏం చేయబోతున్నాడన్నది హామీ ఇచ్చాడు.అనంతపురం కరువు నివారణకు 100 శాతం డ్రిప్, ఉద్యాన యూనివర్సిటీ, ఎయిమ్స్కు అనుబంధంగా ఆసుపత్రి, నూతన పారిశ్రామిక నగరం, హిందూపూర్లో స్మార్ట్ సిటీ, ఎలక్ట్రానిక్ పార్కు, పుడ్ పార్కు, ఎలక్ట్రానిక్ హార్డ్ వేర్ క్లస్టర్, సోలార్–విండ్ పవర్ ప్లాంట్, పెనుగొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఆధ్యాత్మిక నగరంగా పుట్టపర్తి, ఎయిర్ పోర్ట్, అనంతపురంలో విమాన మరమ్మత్తుల కేంద్రం, హంద్రీ–నీవా ప్రాజెక్టు, స్టీల్ ప్లాంటు ఇవన్నీ అనంతపురం జిల్లాకే చేస్తామన్నాడు. ఇందులో ఒక్కటైనా చేశారా చంద్రబాబూ?ఏ సమస్య వచ్చినా చంద్రబాబు చేసేది డైవర్షనే⇒ ఏ సమస్య వచ్చినా దానికి చంద్రబాబు దగ్గర ఉన్న పరిష్కారం డైవర్షన్ రాజకీయం. జగన్ను వ్యక్తిత్వ హననం చేస్తూ తిట్టించడం. చంద్రబాబు దోపిడీ, విలాసాలకు ఒక హద్దుపద్దు లేకుండా పోయింది. రాష్ట్రాని సర్వనాశనం చేస్తున్నారు. రెండేళ్లు తిరక్కుండానే చంద్రబాబు రూ.3.57 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఇంత డబ్బు తెచ్చికూడా సంక్షేమం కరువైంది. అభివృద్ధి అటకెక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతిలో రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రైనేజీ లాంటి సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత రాష్ట్రానికి ఉందా? ⇒ ప్రాక్టికల్ కాని అమరావతి మీద లక్షల కోట్లు పెడితే, ప్రజల పట్ల, రాష్ట్రం నిర్వర్తించాల్సిన బాధ్యతల సంగతి ఏమిటి? ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థులు చదువులు మానేస్తున్న పరిస్థితి. 2026–27 ఆర్థిక సంవత్సరంతో కలుపుకొని రూ.10 వేల కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ సమావేశాలకు ముందు లోకేశ్ బీఆర్ కాపీలు చూపుతూ రూ.1,200 కోట్లు ఇస్తున్నామని చెప్పాడు. ఇప్పటికీ పూర్తిగా ఇవ్వలేదు. ⇒ ఆరోగ్య శ్రీ పూర్తిగా పడకేసింది. దాదాపు రూ.3,200 కోట్లు నెట్వర్క్ ఆస్పత్రులకు ఇవ్వాలి. చివరకు పేద రోగుల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా దోచుకుంటున్నారు. మా పథకాలన్నీ రద్దయ్యాయి. మీరిస్తామన్న సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ లేదు. ఆడ బిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇస్తానన్న దానికీ అతీగతీ లేదు. 40 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నెలకు రూ.4 వేల పెన్షన్కు దిక్కులేదు. నిరుద్యోగ భృతి కింద ఒక్క రూపాయి లేదు. ⇒ స్కూళ్లలో, ఆస్పత్రుల్లో నాడు–నేడు ఆపేశారు. ఆస్పత్రుల్లో మందులకు, దూదికీ దిక్కులేదు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించేస్తున్నారు. మత్స్యకారుల కోసం మేం కట్టిన ఫిషింగ్ హార్బర్లు వారికి అప్పగించకుండా, ప్రైవేటు వారికి అమ్మేస్తున్నారు. మేం ప్రారంభించిన మూడు ప్రభుత్వ పోర్టుల్లో పనులన్నీ ఆపేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నిత్యం అమరావతి పాట పాడుతున్నారు. ఎందుకంటే ఆ పేరిట స్కామ్లు, వాటి ద్వారా చంద్రబాబుకు వస్తున్న ఆదాయాలే కారణం. ఆయన స్కాముల కోసం ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారు. రాష్ట్రానికి కేపిటల్ అనేది లేకుండా చేస్తున్నారు.ఇప్పటికైనా ఆలోచించండి⇒ ఏ రోజైనా విజయవాడ వెస్ట్ బైపాస్ ఆలోచన చేశారా? జగన్ ఈస్ట్ బైపాస్ అనుమతులు తీసుకొస్తే.. అవుటర్ రింగ్ రోడ్డు పేరుతో దాన్ని కూడా రద్దు చేశారు. ఈ అవుటర్ రింగ్ రోడ్డు ఎప్పటికి పూర్తి అవుతుంది? రాజధాని లోపలకి వెళ్లడానికి రోడ్డే ఇంతవరకు పూర్తి కాలేదు. చంద్రబాబు ఇంటి వద్దే ఎకరం రూ.3.63 కోట్లు ఉంటే అమరావతి మారుమూల ప్రాంతాల్లో ఎంత రేటు ఉంటుంది? అలాంటప్పుడు వైఎస్ జగన్ చెప్పిన మావిగన్ ప్రతిపాదన తప్పేంటి? ⇒ ఇండియా–పాకిస్తాన్ మ్యాచ్కు ఎవరు డబ్బులు కట్టారో చెప్పకుండా విమానంలో వెళ్లి మ్యాచ్ చూసి రావడం గొప్పకాదు లోకేశ్.. ఫీజు రీయింబర్స్మెంట్ నయా పైసలతో కట్టి మాట్లాడండి. ఆరోగ్యశ్రీ లేక ప్రజలు అల్లాడుతుంటే మీరు మాత్రం విలాసాల్లో మునిగారు. భార్య చనిపోతే భర్తకు, భర్త చనిపోతే భార్యకు పెన్షన్ ఇవ్వడం లేదు. కొత్త పెన్షన్ లేవీ లేవని మీ స్పీకరే చెబుతున్నాడు. పంట నష్ట పరిహారం ఇస్తున్నారా అని అసెంబ్లీలో అడిగితే స్పష్టమైన సమాధానం లేదు. ⇒ అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల కారణంగా అన్ని పనులను నిలిపివేశారు. అమరావతిలో బ్లాక్–1 తప్ప ఎక్కడ లిఫ్ట్లు కూడా పనిచేయవు. ఉన్న అసెంబ్లీని బాగు చేయవచ్చు. అందరినీ తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు చేస్తే అది ఎప్పటికీ తీరేది కాదు. మీ తప్పడు ఆలోచనలు మానండి. బూతులు తిట్టడం ఆపండి. మీకు దమ్ముంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో అమరావతిని పోల్చండి. ⇒ ఎప్పటికి అమరావతిని పూర్తి చేస్తారు? రైతులకు ప్లాట్లు ఎప్పుడిస్తారు? రోడ్లు ఎప్పుడు వేస్తారు? అప్పు ఎంత చేస్తారు? ఎలా అప్పు తీరుస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే మావిగన్ గురించి ఆలోచించండి. ప్రతి ఇంటా దీపాలు వెలిగించాలని లోకేశ్ పిలుపు ఇస్తే 29 గ్రామాల్లో ఎక్కడా ప్రజలు దీపాలు పెట్టలేదు. దీన్ని బట్టే ప్రజల మనోగతం అర్థమవుతోంది. -
ఆరునెలలుగా జీతాలు ఇవ్వడం లేదు
తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో తెలుగుదేశం పార్టీనేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ నిర్వహిస్తున్న అమరావతి ఆస్పత్రి ఎదుట ఆస్పత్రి సిబ్బంది సోమవారం ధర్నా చేశారు. తమకు నెలల తరబడి పెండింగులో ఉన్న జీతాలు చెల్లించాలంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఆరు నెలలుగా 30 మందికి జీతాలు చెల్లించకుండా ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి అనుసరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికి సుమారు రూ.60 వేల వరకు జీతం బకాయిలు రావాలని వివరించారు.వేతనాలు లేక కుటుంబ పోషణ భారమైందని, పిల్లల ఫీజులు కట్టలేక, కుటుంబం గడవక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆక్రోశించారు. ఈ విషయమై తాము కలెక్టరుకు, లేబర్ కమిషనర్కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఇప్పటికి పలుమార్లు చర్చలు జరిపినా, ఆస్పత్రి యాజమాన్యం వేతనాల చెల్లింపునకు ముందుకు రానందున 1936 వేతనాల చెల్లింపు చట్టం ప్రకారం ప్రభుత్వానికి అప్పీలు చేసుకోవాలని కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్ ధనలక్ష్మి ఇటీవల సూచించారని, తమకు ఎవరు న్యాయం చేస్తారని ఆస్పత్రి సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, వేతనాల కోసం శావల దేవదత్ వద్దకు వెళ్లిన సిబ్బందిని ఆయన స్పందించిన తీరు తీవ్ర మనోవేదనకు గురిచేసింది. ‘మీడియాకు ఎక్కి పరువు తీస్తే జీతాలు ఇస్తారా? మీరు ఎమ్మెల్యేకి, ఎంపీకి, మంత్రి లోకేశ్కి చెప్పుకున్నా నాకేమీ ఇబ్బంది లేదు’ అని దేవదత్ సిబ్బందితో బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ఇంటికి వెళ్లి కొలికపూడిని కొడతా: దేవదత్తాను ఎన్నికల్లో టికెట్ కోసం ఎంపీ చిన్నికి డబ్బులిచ్చానని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని దేవదత్ ఖండించారు. తన ఆస్పత్రి సిబ్బంది ఆందోళన చేయడానికి తెరవెనుక ప్రోత్సహించే వారెవరో తెలుసని, ఇటువంటి చర్యలకు పాల్పడే వారిని వదలబోనని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును హెచ్చరించారు. ఇలాంటివి ఆపకపోతే ఆయన ఇంటికి వెళ్లి కొడతానని దేవదత్ హెచ్చరించారు.రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్షాపులే..! ఇక్కడే ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివి? తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడిపై ధ్వజమెత్తిన టీడీపీనేత దేవదత్ ‘రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో బెల్టు షాపులు ఉన్నాయి.. ఒక్క తిరువూరు నియోజకవర్గంలో ‘బెల్టు షాపులు ఉన్నట్టు చెప్పడానికి నువ్వెవడివయ్యా?.. నీకేంటి నొప్పి’ అంటూ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ సంస్థ చైర్మన్ శావల దేవదత్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో బెల్టు దుకాణాలు అధికంగా ఉండడంతో ప్రజలు మద్యానికి బానిసై ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారని ఎమ్మెల్యే కొలికపూడి చేసిన ఫిర్యాదుపై టీడీపీ నేత శావల దేవదత్ తీవ్రంగా స్పందించారు.ఆదివారం రాత్రి తిరువూరులో విడుదల చేసిన వీడియోలో ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు. ‘నీ చేతకాని తనంతో పార్టీపై ఆరోపణలు చేయద్దు.. నీ వల్ల ఏమైనా అవుతుందా? పల్లె కన్నీరు కారుస్తోందంటున్నావు. నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు’ అంటూ ఎమ్మెల్యేపై దేవదత్ ధ్వజమెత్తారు. కూర్చుని సోషల్ మీడియాలో అవాకులు చెవాకులు పేలితే సహించేది లేదంటూ దేవదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..
-
చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతుల అల్టిమేటం
సాక్షి,అమరావతి: చంద్రబాబు సర్కారుకు అమరావతి రైతులు అల్టిమేటం జారీ చేశారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని తెలిపారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంపై రైతులు ఆందోళన బాట పట్టారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు పుల్లడిగుంట హైవే వద్ద భూములు కోల్పోతున్నామని ఆందోళన చేపట్టారు. సజావుగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2017లో సరిగా ఉండగా.. 2025-26 మ్యాప్ అలైన్మెంట్లో మార్పులు జరిగాయని రైతులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు మలుపు తిప్పడం వల్ల తమ భూములు ప్రభావితమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చెన్నై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కూడా 140 మీటర్ల వెడల్పు రోడ్లు లేవని రైతులు వాదిస్తున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. -
బాబు మరో గ్రాఫిక్స్ మాయ.. వందల కోట్లు వృథా
-
ఇది పుచ్చుకో.. అది ఇచ్చుకో!.. రాజధాని పనుల్లో క్విడ్ ప్రో కో
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కాంట్రాక్టు పనుల్లో మరో కోణం వెలుగుచూసింది. శాశ్వత సచివాలయంలో భాగంగా నిర్మిస్తున్న జీఏడీ టవర్ పనులను టెండర్లలో ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. కానీ.. ఆ టవర్ను డయాగ్రిడ్ స్ట్రక్చరల్ స్టీల్ విధానంలో తామే నిర్మిస్తున్నట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. టెండర్ నిబంధనల ప్రకారం 50 శాతం పనులను సీఆర్డీఏ అనుమతి తీసుకుని అధికారికంగా సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణంలో డిజైన్, స్ట్రక్చరల్ కనెక్షన్ ఇంజినీరింగ్, ప్రిసిసిన్ స్టీల్ ఫ్యాబ్రికేషన్, డయాగ్రిడ్ స్ట్రక్చరల్ పద్ధతిలో నిర్మించే పనులను తాము చేస్తున్నట్లు భీమా సంస్థ పేర్కొంది.అయితే.. ఇదే సంస్థ హైదరాబాద్కు సమీపంలో శామీర్పేట వద్ద సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ ఫుడ్స్కు 6,205 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రీ–ఇంజినీర్డ్ బిల్డింగ్(పీఈబీ) విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు తన వెబ్సైట్లో పేర్కొంది. ‘నీకిది.. నాకిది’లో భాగంగానే హెరిటేజ్ పుడ్స్కు ఐస్క్రీమ్ ఫ్యాక్టరీ ప్లాంట్ను సీహెచ్ సీతారాం మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న భీమా సంస్థ నిర్మించిందనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.హెరిటేజ్కు ఐస్క్రీమ్ ప్లాంట్ను నిర్మించిన భీమాటెండర్లలో అధికారికంగా పనులు దక్కించుకున్న ఎన్సీసీ సంస్థకు వాటిని అప్పగించడానికి గతేడాది జూన్ 26న ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టెండర్ నిబంధనల ప్రకారం సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలకు సమాచారం ఇచ్చి.. వారినుంచి అధికారిక అనుమతి తీసుకున్నాక 50 శాతం పనులను సబ్ కాంట్రాక్టర్కు అప్పగించవచ్చు. జీఏడీ టవర్ నిర్మాణ పనుల్లో భీమా సంస్థకు ఎంత పరిమాణంలో సబ్ కాంట్రాక్టు కింద అప్పగించామన్నది ఎన్సీసీ సంస్థ అధికారికంగా ప్రకటించలేదు. సీఆర్డీఏ ఈఎన్సీ, సీఈలు కూడా వెల్లడించలేదు.కానీ.. భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ సంస్థ మాత్రం తన అధికారిక వెబ్సైట్లో ఆ పనులు చేస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇదే సంస్థ సీఎం చంద్రబాబు కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్కు హైదరాబాద్కు సమీపంలోని శామీర్పేట్ వద్ద 98.5 మీటర్ల పొడవు, 63 మీటర్ల వెడల్పు, 18.2 మీటర్ల ఎత్తుతో పీఈబీ విధానంలో ఐస్క్రీమ్ ప్లాంట్ కోసం భవనాన్ని నిర్మించినట్టు భీమా ఇన్ఫ్రా సొల్యూషన్స్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటించింది. ఆ ప్లాంట్ను ఇటీవల సీఎం చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణి ప్రారంభించారు.నాడూ నేడూ ఒకే సంస్థ.. అంచనా వ్యయం భారీగా పెంపుముఖ్యమంత్రి, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో 1,04,815 చదరపు మీటర్ల నిర్మిత ప్రాంతంతో చేపట్టే పనులకు 2018లో నిర్వహించిన టెండర్లలో రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. 2019 నాటికే రూ.32.90 కోట్ల విలువైన పనిని ఆ సంస్థ పూర్తి చేసిందని కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) 2023లో ఇచ్చిన నివేదికలో పేర్కొంది. అంటే.. జీఏడీ టవర్లో మిగిలిన పనుల విలువ రూ.521.16 కోట్లు. 2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ కాంట్రాక్టును రద్దు చేసింది. ఆ పనుల కాంట్రాక్ట్ విలువ రూ.884.22 కోట్లుగా నిర్ణయించి.. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ వంటి పన్నుల రూపంలో 163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని పేర్కొంటూ గతేడాది టెండర్లు పిలిచింది.ఈ పనులను 4.53 శాతం అధిక ధర అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచి ఎన్సీసీ సంస్థే తిరిగి దక్కించుకుంది. దానికి పన్నులు కలిపితే.. జీఏడీ టవర్ కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లకు చేరుతుంది. అంటే.. నాటికీ నేటీకీ అంచనా వ్యయం రూ.524.91 కోట్లు పెంచేసినట్టు స్పష్టమవుతోంది. అప్పుడూ ఇప్పుడూ ఒకే సంస్థ టెండర్లో పనులు దక్కించుకోవడాన్ని బట్టి చూస్తే గూడుపుఠాణీ కాకపోతే మరేమిటని ఇంజినీరింగ్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. దీనిద్వారా కాంట్రాక్టర్కు భారీఎత్తున ప్రయోజనం చేకూర్చారని ఆరోపణలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇవే అంశాలను వైఎస్సార్సీపీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. -
అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం
అమరావతి: ఏపీలోని అమరావతి నిర్మాణాల అక్రమాల్లో మరో కోణం బయడపడింది. హైదరాబాద్లో హెరిటేజ్ కొత్త యూనిట్ను నిర్మించిన భీమా ఇన్ఫ్రాకే అమరావతి నిర్మాణాలు అప్పచెప్పారు. జీఏడీ టవర్ల పనుల్లో భీమా ఇన్ఫ్రాకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది ప్రభుత్వం. హైదరాబాద్లో కొత్త హెరిటేజ్ యూనిట్ను భువనేశ్వరి, బ్రాహ్మిణి ఇటీవలే ప్రారంభించారు. రామ్ హెరిటేజ్, జీఏడీ టవర్లు చేశామన్న భీమా ఇన్ఫ్రా ప్రకటించింది. హెరిటేజ్ యూనిట్ పూర్తి చేసినట్లు భీమా ఇన్ఫ్రా వెల్లడించింది., అదే భీమా సంస్థకు అమరావతి జీఏడీ టవర్ల పనులు దక్కడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భీమా ఇన్ఫ్రాకి అమరావతి పనులు ఇవ్వడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా తప్పుబట్టింది. -
అమరావతిలో నీకింత.. నాకింత... ఎన్నికల్లో టీడీపీకి భారీగా నిధులు సమకూర్చిన ‘బీఎస్సార్’కు రాజధానిలో భారీగా పనుల అప్పగింత
-
360 లక్షల కోట్లు..! వాటే విజన్
-
ఇదీ పరిస్థితి.. అమరావతిలో.. సీఎం, సీఎస్ వెళ్లే దారిలోనే..!
విజయవాడ: ఏపీలో నిబంధనలను తుంగలో తొక్కి బార్ అండ్ రెస్టారెంట్ను టెంట్ల్లో నడుపుకునేందుకు అనుమతి ఇచ్చిన ఘటన మరొకటి వెలుగుచూసింది. అమరావతిలో బార్ అండ్ రెస్టారెంట్కు టెంట్ వేసి మద్యం అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చారు. దాంతో బరితెగించి ఓపెన్ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. అది కూడా అసెంబ్లీ, సచివాలయంకి వెళ్లే దారిలో కొత్త బార్ అండ్ రెస్టారెంట్ వెలిసింది. సీఎం, సీఎస్లు వెళ్లే దారిలో నిబంధనలకు విరుద్ధంగా ఇది ఏర్పాటు చేయడం లిక్కర్ అమ్మకాల పాలసీని ఎలా పక్కదోవ పట్టిస్తున్నారో అనే దానికి అద్దం పడుతోంది. రేకుల షెడ్డు, టెంట్ కిందే బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఎక్సైజ్ మంత్రి ఊర్లో రూల్స్ గీల్స్ జాన్తా నై..! -
చంద్రబాబు చెప్పే రాజధాని 30 నుంచి 40 ఏళ్ళైనా పూర్తికాదు
-
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు పెట్టడం దారుణం : వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో వేధింపులకు గురైన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ కుటుంబానికి అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించినందుకు పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్ స్టేషన్కు పిలిపించి దారుణంగా కొట్టడమే కాకుండా తిరిగి తనపై కేసులు నమోదు చేశారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్ విద్యార్థిని సుప్రియ,ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు.కూటమి ప్రభుత్వంలో తమ కుటుంబానికి జరుగుతున్న అన్యాయాలను సుప్రియ, ఆమె కుటుంబ సభ్యులు జగన్కు వివరించారు. ఈ సందర్భంగా బీఎస్సీ నర్సింగ్ చదువుతున్న దళితురాలు సుప్రియపై కేసు నమోదు చేసి రిమాండ్కు పంపడం దారుణమని జగన్ మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయసహాయం వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందిస్తుందని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ కైలే అనిల్కుమార్కు సూచించారు.పామర్రు సీఐ శుభాకర్, ఎస్సై భాస్కర్లపై హైకోర్టులో ప్రైవేట్ కేసు వేసి న్యాయం జరిగేలా చూడాలని జగన్ అన్నారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగేంతవరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.ఈ సమావేశంలో సుప్రియ,ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
అమరావతి దేవతల రాజధానా ఎవడు చెప్పాడు?
-
నిధులు అన్ని అమరావతిలో పెడితే మా ప్రాంతాల పరిస్థితేంటి..
-
చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేస్తున్నారు: ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: అభివృద్ధి అన్ని ప్రాంతాలకు సమానంగా అందడమే నిజమైన ప్రజాస్వామ్యమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇవాళ శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తొలి ప్రధాని నెహ్రూ ఆశయాలకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని చెప్పారు.‘రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక తండ్రి లాంటి వారు.. అందరినీ సమానంగా చూడాలి. కానీ నేడు సీఎం కేవలం ఒక ప్రాంతానికే, కొద్దిమంది సంపన్నులకే కొమ్ముకాస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీ హెచ్చరికలను చంద్రబాబు పెడచెవిన పెడుతున్నారు. నిధుల పంపిణీలో అసమానతల వల్లే గతంలో తెలంగాణ ఉద్యమం వచ్చిందని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్పై పెట్టిన దృష్టి ఇతర ప్రాంతాలపై పెట్టకపోవడం వల్లే విభజన జరిగింది. మళ్లీ అదే తప్పు చేస్తూ ఉత్తరాంధ్ర, రాయలసీమలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు.విభజన చట్టంలోని సెక్షన్ 6 ప్రకారం నియమించిన నిపుణుల కమిటీని చంద్రబాబు గౌరవించలేదు. అమరావతి రాజధానికి అనుకూలం కాదని నిపుణులు చెబితే వారిని అవమానించి పంపారు. రాజ్యాంగ విరుద్ధంగా అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తూ చట్టాన్ని సవరించారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాజకీయ అవసరాల కోసం ఈ సవరణ చేయించారు’ అని చెప్పారు.పొట్టచేతబట్టుకుని వలస.. అమరావతి బిల్లు సమయంలో ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా వంటి కీలక నేతలు సభకు రాలేదని ధర్మాన ప్రసాదరావు అన్నారు. ‘రాష్ట్ర రాజధాని ఫలానా చోటే ఉండాలని చెప్పే అధికారం కేంద్రానికి లేదని గతంలో అఫిడివిట్ ఇచ్చారు. రాజ్యాంగంలో సుప్రీంకోర్టు సీటు గురించి ఉందే తప్ప రాజధాని గురించి ఎక్కడా లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలని విభజన చట్టమే స్పష్టంగా చెప్పింది. 80 ఏళ్ల వయసులో కూడా ఉత్తరాంధ్ర ప్రజలు పొట్టచేతబట్టుకుని వలస వెళ్తున్నారు.రాయలసీమ బిడ్డగా ఉండి కూడా ఆ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ఏం చేశారు? వెనుకబడిన ప్రాంతాల్లో కనీసం ఒక్క ఎకరా భూమిని కూడా పేదలకు పంపిణీ చేయలేదు. 60 ఏళ్లవుతున్నా ఉత్తరాంధ్రాలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కావడం లేదు? విశాలమైన తీరప్రాంతం ఉన్నా ఒక్క హార్బర్ రాకుండా అడ్డుకోవడం ధర్మమేనా?రాష్ట్ర బడ్జెట్ రూ.3.30 లక్షల కోట్లు ఉంటే శ్రీకాకుళం ప్రాజెక్టులకు రూ.1,000 కోట్లు కూడా ఇవ్వరా? లక్ష ఎకరాల్లో అమరావతిని కట్టాలంటే మౌలిక వసతులకే రూ. 2 లక్షల కోట్లు కావాలి. అమరావతి నిర్మాణం పూర్తి కావడానికి 50 ఏళ్లు పడుతుందని స్వయంగా ముఖ్యమంత్రే చెబుతున్నారు.అంతకాలం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు అభివృద్ధికి దూరంగా ఉండాలా? ఒకే ప్రాంతంపై లక్షల కోట్లు ఖర్చు పెడితే మళ్లీ హైదరాబాద్ తరహా విద్వేషాలు వస్తాయి. భవిష్యత్తు తరాలు ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేసే పరిస్థితి చంద్రబాబే కల్పిస్తున్నారు.రాష్ట్ర సంపద ఐదు కోట్ల ప్రజలకు చెందాలి కానీ ఒక్క అమరావతికే కాదు. విశాఖ, విజయనగరంలో వస్తున్న సంస్థల ఆస్తులు ఇతర ప్రాంతాల వ్యక్తులకే చెందుతున్నాయి. అభివృద్ధి చెందిన ప్రాంతాలనే మళ్లీ అభివృద్ధి చేస్తే వెనుకబడిన ప్రాంతాలకు గోచీ తప్ప ఏమీ మిగలదు. ముఖ్యమంత్రి పంతం కోసం ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను మరుగున పడేయడం అన్యాయం.వలసలు ఆగేలా, స్థానిక ప్రాజెక్టులు పూర్తయ్యేలా నిధులు ఎందుకు కేటాయించడం లేదు? ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేలా కాకుండా సమాన అభివృద్ధికి సీఎం బాటలు వేయాలి. అమరావతి పేరుతో వెనుకబడిన జిల్లాల నోళ్లు నొక్కడం రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు తన నిర్ణయాలను పునరాలోచించుకోవాలి’ అని ధర్మాన ప్రసాదరావు అన్నారు. -
సమాధానాలు చెప్పలేకే ఎదురుదాడి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు సర్కార్ సాగిస్తున్న అవినీతి, అక్రమాలు, నిర్వాకాలను నిలదీస్తూ... ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బతీస్తున్న వైనాన్ని నిగ్గదీస్తూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధించిన ప్రశ్నాస్త్రాలు అందరిలో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. మచిలీపట్నం – విజయవాడ – గుంటూరు ప్రాంతాలను అనుసంధానించి రాజధాని కారిడార్ ‘మావిగన్’గా ప్రకటించాలంటూ చేసిన ఆచరణాత్మక ప్రతిపాదనను రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకంగా ఆ మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. జాతీయ రహదారులతోపాటు అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు లాంటి సదుపాయాలు ఉన్నందున ప్రత్యేకంగా మౌలిక వసతుల కోసం పెద్దగా వ్యయం చేయాల్సిన అవసరం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారని పేర్కొంటున్నారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో, తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్గా మారే అవకాశం ఉన్న విశాఖను పరిపాలన (ఎగ్జిక్యూటివ్) రాజధానిగా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా... అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వైఎస్ జగన్ తెలిపారు. అయితే సీఎం చంద్రబాబుకు అది నచ్చ లేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. ఇక రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం తాము ప్రతిపాదించిన ప్లాన్–బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ లాంటి కనీస సదుపాయాల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం 10 శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్పుడూ.. ఇప్పుడూ వైఎస్ జగన్ ఆచరణాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించారని మేధావుల నుంచి సామాన్యుల వరకూ అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో అమరావతిలో భవనాల చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తుండటం.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నిర్మిస్తుంటే, అదే తరహా రోడ్లకు రాజధానిలో కి.మీ.కు ఏకంగా రూ.53 కోట్లను ఖర్చు చేస్తుండటాన్ని బట్టి చూస్తే భారీ ఎత్తున అవినీతి చోటుచేసుకుంటోందనే చర్చ ప్రజల్లో బలంగా జరుగుతోంది. ‘సిండికేటు’ కాంట్రాక్టర్లతో కలిసి భారీ ఎత్తున దోచుకుంటుండటం వల్లే వైఎస్ జగన్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ సమాధానం చెప్పలేకపోతోందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది చంద్రబాబు సర్కార్ను మరింత ఇరకాటంలోకి నెట్టింది. దాంతో రాజధానిలో అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సీఎం చంద్రబాబు, మంత్రులు, కూటమి నేతలు మాటలతో దాడి చేస్తూ తమకు అలవాటైన రీతిలో డైవర్షన్ పాలిటిక్స్కు దిగారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఈ ప్రశ్నలకు బదులేది బాబూ..?1. ఆచరణ సాధ్యం కాదని తెలిసీ... అమరావతి పేరుతో చంద్రబాబు భ్రమలు కల్పిస్తూ.. రాజధాని ముసుగులో కమీషన్ల పర్వానికి తెర తీశారు. రాజధానికి తొలి విడత తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, మురుగునీటి వ్యవస్థ, తాగునీటి సరఫరా, వరద నీటి మళ్లింపు లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అయ్యే ఖర్చు కేంద్రానికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్ ప్రకారమే ఎకరాకు రూ.2 కోట్లు అవుతుంది. ఆ 50 వేల ఎకరాలకు అయ్యే రూ.లక్ష కోట్లకే దిక్కు లేదనుకుంటే.. ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలకు అదనంగా అయ్యే వ్యయం మరో రూ.లక్ష కోట్లు. అలా అమరావతిని ఎందుకు పెంచాల్సి వస్తోంది? ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు? ఈ డబ్బులు ఎలా వస్తాయి? ఆ పనులన్నీ పూర్తవడానికి ఎన్నేళ్లు పడుతుంది? ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఆ సమయంలో.. ఆ 2 లక్షల కోట్ల వ్యయం ఇంకా ఎంతకు చేరుతుంది? రోడ్లు వేయటానికే దశాబ్దాలు తీసుకుంటే ఇక రాజధాని ఎక్కడుంది? మిగతా ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి? 2. ఏడేళ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండి (మొదటి విడత ఐదేళ్లు, ఇప్పుడు రెండేళ్లు) కూడా భూములిచ్చిన రైతులకు కనీసం ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములిచ్చి 50–60 సార్లు సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగామని రైతులు కన్నీళ్లు పెట్టుకున్నారు. 3. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అయితే అమరావతి కోసం ఇప్పటికే రూ.47,387 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నట్లు? అప్పు కాకుండా రాష్ట్ర బడ్జెట్ నుంచి కేటాయింపులు ఎందుకు చేస్తున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే రాజధాని కోసం తెస్తున్న రుణాలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్యారెంటీలు ఎందుకు ఇస్తున్నారు? భూములు అమ్మి డబ్బు తెస్తానని నమ్మబలికి ఇన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ప్రభుత్వ ఖజానాపై ఎందుకు భారం మోపుతున్నారు? సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయితే.. ఇప్పటి వరకు అమ్మిన భూములు ఎన్ని? మీ విజనరీ ఆలోచనల ద్వారా అమరావతి ప్రాజెక్ట్ నుంచి ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చాయి? లక్ష ఎకరాల అమరావతిలో ఇంత వరకు కట్టింది ఎంత? అమరావతి మానస పుత్రిక (పెట్ ప్రాజెక్టు) అంటూ ఇంతవరకు మీరు చేసిన పనులేమిటి? 4. అమరావతి పనుల్లో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగు(ఎస్ఎఫ్టీ)కి రూ.11 వేల నుంచి రూ.14 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. దేశంలో ఆరు వరుసలతో జాతీయ రహదారులను కి.మీ.కు రూ.20 కోట్ల చొప్పున నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మిస్తుంటే.. అమరావతిలో కి.మీ.కు రూ.53 కోట్ల చొప్పున ఖర్చు చేస్తున్నారు. అంత వ్యయం ఎందుకవుతోంది? ఏ స్కాముల వల్ల అది ఎగబాకుతోంది? 5. రాజధాని అమరావతిలో టెండర్లు ఒక్కసారి గమనిస్తే.. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో 2024 టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా ఇప్పుడు వారికి అవే పనులకు సంబంధించిన టెండర్లు దక్కాయి. ఇది గూడుపుఠాణి కాదా? మాఫియా వ్యవహారం కాదా? ఒకవైపు అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి అంచనా వ్యయాన్ని పెంచేస్తూ.. కాంట్రాక్టర్లను సిండికేటు చేస్తున్నారు. 2018లో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్కే మళ్లీ అధిక ధరలకు కట్టబెడుతున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా? 6. రాజధానిలో కేవలం గవర్నమెంటు కాంప్లెక్స్లో సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారు? దేశంలో ఎక్కడైనా డిజైన్లకు ఇంతలా ఖర్చు చేసిన దాఖలాలు ఉన్నాయా? ఇందులోనూ దోపిడీకి పాల్పడతారా? 7. బటన్లు నొక్కడం పెద్ద విషయం కాదు.. ఎవరైనా నొక్కుతారని, తాను అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పారు. రెండేళ్లు పూర్తి కాకముందే చంద్రబాబు సర్కార్ చేసిన అప్పులు రూ.3.37 లక్షల కోట్లు. అప్పు చేస్తే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని ఎలా నిర్మిస్తారు? రైతులు, అక్కచెల్లెమ్మలు, విద్యార్థుల సంక్షేమం మాటేంటి? శిథిలమవుతున్న స్కూళ్లు, ఆస్పత్రుల పరిస్థితి ఏమిటి? ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన రూ.36 వేల కోట్ల బకాయిల పరిస్థితి ఏమిటి? ఇక తప్పనిసరిగా ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతల పరిస్థితి ఏమిటి? రాజధానికే ఖర్చు చేస్తూ పోతే రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఏం కావాలి?8. రాజధానికి 2015లో సమీకరించిన 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో అత్యద్భుతమైన రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు పదే పదే గొప్పగా ప్రకటించారు. బాహుబలి సినిమాను తలదన్నే రీతిలో డిజైన్లతో మాయ చేశారు. ఇప్పుడేమో 50 వేల ఎకరాలకే పరిమితమైతే అమరావతి మున్సిపాల్టిగా మిగిలిపోతుందని సీఎం చంద్రబాబు చెబుతున్నారు. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాటా? కాంట్రాక్టు పనులనూ అధిక ధరలకు సిండికేటు కాంట్రాక్టర్లకు అప్పగించి.. భూములను అస్మదీయులకు కట్టబెట్టి దోచుకోవడానికే కదా మళ్లీ 50 వేల ఎకరాలు కావాలంటున్నారు! 9. తెలంగాణలో 10 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయాన్ని నిర్మించారు. అందులో ఇంకా స్థలం ఖాళీగా ఉంది. కానీ.. రాజధాని అమరావతిలో 52.20 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం కట్టే పనులను కాంట్రాక్టర్లకు చంద్రబాబు సర్కార్ అప్పగించింది. ఇంత భారీ ఎత్తున నిర్మిస్తూ.. పెద్ద ఎత్తున ఖర్చు చేయడం కమీషన్ల కోసమే కదా? 10. రాజ్యాంగంలో దేశ రాజధాని అని ఉంటుందే గానీ ఎక్కడా రాష్ట్రాల రాజధాని ప్రస్తావన లేదు.. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం అంటూ అధికారికంగా, రాష్ట్ర హైకోర్టులో 2020 ఆగస్టు 19న కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆ రాష్ట్రాలే రాజధానిపై నిర్ణయం తీసుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది.. కేవలం మన రాష్ట్రానికి మాత్రమే ఎందుకు వర్తిస్తోంది? ఎలా వర్తిస్తోంది? 11. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 సవరించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించారు. మరి అదే చట్టసభలో భాగమైన శాసనమండలి సమావేశాన్ని ఎందుకు నిర్వహించలేదు? రాజధాని ముసుగులో సీఎం చంద్రబాబు సాగిస్తున్న అవినీతి, అక్రమాలను కడిగిపారేస్తారనే భయంతోనే కదా! 12. రాజధానికి తొలి విడత భూసమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తయింది. చంద్రబాబు ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి.. అమరావతిని అలా అభివృద్ధి చేస్తామని ఊదరగొట్టారు. ఆ దేశాలు ఇక్కడేమైనా కనపడుతున్నాయా? కనీసం భూములిచ్చిన రైతులకు చెప్పిన హామీలైనా అమలు చేశారా? 13. ప్రపంచంలో ఎక్కడైనా రాజధాని నగరాన్ని నిర్మించిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? రాజధానిలో అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయం లాంటి ప్రభుత్వ భవనాలు, ఉద్యోగులు క్వార్టర్స్ నిర్మిస్తున్నారు. ఆ తర్వాత కాలం గడిచే కొద్దీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో నగరం తనను తాను నిర్మించుకుంటుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై.. ఇలానే కదా మహానగరాలుగా అభివృద్ధి చెందాయి? లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మించడం సాధ్యం కాదని తెలిసి కూడా భ్రమలు కల్పించడం ప్రజలను మోసం చేయడం కాదా? ఇది రాష్ట్రానికి రాజధాని లేకుండా చేయడానికి చేస్తున్న కుట్ర కాదా? 14. ఒక్క రాజధానికే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలనుకున్నప్పుడు కేవలం రూ.5 వేల కోట్లు వ్యయం చేస్తే పూర్తయ్యే కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? వాటిని ఎందుకు ప్రైవేటుపరం చేయాలనుకున్నారు? కమీషన్ల కోసమే కదా? 15. కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ సారవంతమైన పంట పొలాల్లో గ్రీన్ఫీల్డ్ రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించింది. కమిటీ నివేదికను వక్రీకరించి లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపట్టడం స్కామ్ల కోసమే కాదా? -
ఏపీలో తొమ్మిది జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి,అమరావతి: ఏపీలో తొమ్మది జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన వర్షంతో పాటు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని శ్రీకాకుళం , పార్వతీపురం మన్యం , విజయనగరం , అల్లూరి సీతారామరాజు ,తూర్పు గోదావరి , పశ్చిమగోదావరి , ఏలూరు , ఎన్టీఆర్ , కృష్ణా జిల్లాలకు ఏపీ విపత్తుల శాఖ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా బయటకు వెళొద్దు. చెట్లకింద నిలబడొద్దని తెలిపింది. -
‘ఇది రాష్ట్రంలోని ప్రతి మహిళకు జరిగిన అవమానం’
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ‘మావిగన్’ ప్రతిపాదనను ప్రజలు హర్షిస్తున్నారని అర్థం కావడంతో సీఎం చంద్రబాబుకు వణుకు పుడుతోందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఇవాళ వైఎస్సార్ జిల్లాలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.‘మావిగన్ ప్రతిపాదనను ప్రజల నుంచి తప్పించడం చేతకాక ఇక పచ్చ మీడియాను రంగంలోకి దించారు. చంద్రబాబుకు శిఖండి మాదిరిగా ఉపయోగపడే ఆంధ్రజ్యోతి పత్రిక రంగంలోకి దిగింది. రాధాకృష్ణ చేస్తుంది జర్నలిజం కాదు... బ్రోకరిజం. వీకెండ్ కామెంట్స్ పేరుతో రాధాకృష్ణ తీరు అత్యంత దారుణంగా మారింది. మేము వెన్నెముక లేని మనుషులమని విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలోని మహిళల పట్ల నీచంగా, అనుచితంగా మాట్లాడారు. ఇది ఒక పార్టీకి సంబంధించిన అవమానం కాదు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క మహిళకు జరిగిన అవమానమే. రాధాకృష్ణ... నీకూ భార్యాబిడ్డలు ఉన్నారు కదా.. నీలా మేం మాట్లాడితే? కానీ, మేం అంత అసహ్యంగా, జుగుప్సాకరంగా మాట్లాడలేం. చివరికి భార్యాభర్తల బంధాన్ని కూడా అపహాస్యం చేస్తూ జర్నలిజం అంటావా? ప్రజలు చంద్రబాబు ఎంతటి నీతి బాహ్యమైన చర్యలకు దిగుతున్నాడో గమనించాలి. కేవలం జగన్ మావిగన్ ప్రతిపాదనను పక్కదోవ పట్టించడానికి ఇంతటి నీచానికి దిగజారాలా?మా పార్టీ అధినేత వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదన చేశారు. రూ.2 లక్షల కోట్లు పెట్టి, ఆచరణలో సాధ్యంకాని భ్రమరావతిని ఊహించుకోవడం కంటే ఇది చాలా ముఖ్యం. కేవలం రూ.20 వేల కోట్లతో ఇది గ్రోత్ ఇంజిన్గా తయారవుతోందని ఆచరణ సాధ్యమైన ప్రతిపాదన చేశారు. దానికే కోట్లు ఖర్చు చేసి సోషల్ మీడియాలో టీడీపీ నేతలు విపరీతంగా ట్రోలింగ్ చేయిస్తున్నారు. నీచాతినీచంగా టీడీపీ మూకలు ట్రోలింగ్ చేయిస్తూ వికృతానందం పొందుతున్నాయి. మంత్రులు, చోటా మోటా నాయకులు అయిపోయిన తర్వాత పచ్చ మీడియాను రంగంలోకి దించారు. కండకావరంతో, కొవ్వెక్కి ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఎంతటి అవమానకరంగా మాట్లాడినా శాంతియుతంగా నిరసన తెలపండని వైఎస్ జగన్ మాకు చెప్పారు’ అని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. -
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ కట్టలేని నువ్వు అమరావతి ఎలా కడతావ్..
-
రాజధానిని కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధికి నష్టం.. ఒకేచోట వద్దు..
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బ తింటాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరించింది. రాష్ట్ర విభజన అనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదని, ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదని స్పష్టం చేసింది. సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం ఉంటుందని అభిప్రాయపడింది. రాజధాని కోసం సారవంతమైన వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదని సూచించింది.ఈమేరకు విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం సరైన ప్రాంతాన్ని సూచించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ అమరావతి పేరుతో పంట భూముల్లో రాజధాని నిర్మాణాన్ని గట్టిగా వ్యతిరేకించింది. పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని, అన్ని కార్యాలయాలు ఒకే చోట ఏర్పాటు సరికాదని తెలిపింది. విభజన చట్టంలో హైదరాబాద్ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ప్రకటించినందున హడావుడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితం, వృథాగా పరిణవిుంచవచ్చని తేల్చి చెప్పింది. విభజిత ఆంధ్రప్రదేశ్లో సారవంతమైన పంట భూముల్లో ఏకైకమహానగరాన్ని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మాణం చేయడాన్ని శివరామకృష్ణన్ కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది.విభజిత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోటుతో పాటు తీవ్ర ఆర్థిక ఒత్తిడిలో ఉన్నందున రాజధాని నిర్మాణాన్ని వీలైనంత తక్కువ వ్యయంతో చేపట్టాలని, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకోవాలని కమిటీ నాటి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాజధానిని వికేంద్రీకరించాలని కమిటీ సూచించింది. అధికార వ్యవస్థలను ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే శివరామకృష్ణన్ కమిటీ తన నివేదిక సమర్పించకుండానే అప్పటి చంద్రబాబు సర్కారు ప్రభుత్వం రాజధాని ఎంపిక కోసం పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో సొంతంగా మరో కమిటీని నియమించుకోవడం గమనార్హం. ఇదే విషయాన్ని శివరామకృష్ణన్ తన నివేదికలో ప్రస్తావించింది. దీంతో శివరామకృష్ణన్ కమిటీ పరిధి నాటి ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకే పరిమితం అయింది. శివరామకృష్ణన్ కమిటీ ముఖ్య సూచనలు ఇవీ..⇒ రాజధానిని ఒకేచోట కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి. విజయవాడ, గుంటూరు.. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి, నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వాధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి. అసెంబ్లీ, సెక్రటేరియెట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు. హైకోర్టును ఒక ప్రాంతంలో ఏర్పాటు చేస్తే.. మరో ప్రాంతంలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయవచ్చు. ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థలను విస్తరించాలి. ⇒ అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోట ఏర్పాటు చేయడానికి ప్రయత్నించడంలో ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు.⇒ ఆంధ్రప్రదేశ్కు ఒకే పెద్ద రాజధాని నగరం ఏర్పాటు ఆచరణ యోగ్యం కాదు.⇒ ఆంధ్రప్రదేశ్లో విస్తారమైన ప్రభుత్వ భూములు లభించే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రతిపాదిత రైలు, రహదారి అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరచవచ్చు, విస్తరించవచ్చు. ఈ కారణంగా ఒకే సూపర్ సిటీ కోసం అన్వేషణ అవసరం లేదు.⇒ హైదరాబాద్ తరహా సూపర్ రాజధాని వద్దు. శాసనసభ, న్యాయస్థానాలు, మంత్రిత్వ శాఖలు, విభాగాలు, కమిషనరేట్లు, డైరెక్టరేట్లతో కూడిన కార్యనిర్వాహక వర్గం హైదరాబాద్లో చాలా ఏళ్లుగా కేంద్రీకృత మైంది. ఈ కేంద్రీకరణే విభజన ప్రక్రియలో ప్రధాన వివాదాంశంగా ఉంది.⇒ భూసేకరణ ఆలస్యమయ్యే కొద్ది రాజధాని నిర్మాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ⇒ విశాఖలో ప్రభుత్వ డైరెక్టరేట్లు ఏర్పాటు చేయాలి.⇒ అమరావతి, నూజివీడు, ముసునూరు, గన్నవరం ప్రాంతాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవచ్చు.⇒ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ వ్యవస్థతో ముఖ్యంగా ప్రభుత్వ సంస్థల మధ్య ఆధునిక సమాచార మార్పిడి ద్వారా భౌగోళిక దూరాన్ని అధిగవిుంచడంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. అందువల్ల ప్రస్తుతానికి ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు దూరాలు అడ్డంకి కాదు.⇒ ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాల్సిన అవసరం లేదు.⇒ విశాఖపట్టణంలో హైకోర్టు, రాయలసీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయవచ్చు.⇒ విశాఖపట్టణం, శ్రీకాకుళం ప్రాంతాలను ప్రత్యేక కారిడార్లుగా గుర్తించాలి.⇒ విశాఖపట్టణంలో పరిశ్రమలకు, అనంతపురంలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వచ్చు.⇒ ప్రభుత్వ భూములున్న చోటే ఏర్పాటు చేయడం మంచిది.⇒ 13 జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడం మంచిది.⇒ సీఎంవో, సచివాలయానికి 15–20 ఎకరాలు, అసెంబ్లీకి 80–100 ఎకరాలు అవసరం⇒ హైకోర్టుకు 100 – 140 ఎకరాలు అవసరం కాగా రాజ్భవన్కు 15 ఎకరాలు అవసరం.⇒ వ్యవసాయ భూములను తీసుకోవడం మంచిది కాదు.⇒ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం. అన్ని కార్యాలయాలు ఒకే చోట వద్దు.⇒ అసెంబ్లీని ఐదు సంవత్సరాల వ్యవధిలో నిర్మించాలి. ⇒ హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నందున హడావిడిగా ప్రభుత్వ కార్యాలయాలను తరలించడం మంచిది కాదు.⇒ గ్రీన్ ఫీల్డ్ రాజధాని నగరం ఏర్పాటుకు ఈ కమిటీ ఏమాత్రం సుముఖంగా లేదు.⇒ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ రాజధానిని ఏర్పాటు చేయాలని భావిస్తే తగినంత పెద్ద మొత్తంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండే ప్రదేశాల కోసం జాగ్రత్తగా అన్వేషించాలి.⇒ ఇప్పటికే ఉన్న నగరాల విస్తరణ చేపట్టే ముందు మౌలిక సదుపాయాల అవసరాలు, పర్యావరణ ప్రభావంపై సరైన అంచనా వేయడం ముఖ్యం. ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా, హడావుడిగా ఏర్పాటు చేయడం అనుచితంగా, వృథాగా పరిణవిుంచవచ్చు.⇒ ముఖ్యమంత్రి, మంత్రులు, సచివాలయానికి సంబంధించి పరిమిత సంఖ్యలో కార్యాలయాల ఏర్పాటు కోసం నగర శివార్లలో వీజీటీఎంకు అవతల అనువైన ప్రదేశాల ఎంపికను ప్రభుత్వం పరిశీలించవచ్చని కమిటీ సూచించింది. -
ఆచరణ ప్రథమా? అవినీతి మార్గమా?
-
స్టేషన్ గేటుకు బేడీలు ఎందుకు?.. లోపల తాతంశెట్టి నాగేంద్ర ఉన్నాడంట
సాక్షి,రైల్వేకోడూరు: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై న్యాయపోరాటం చేస్తున్న బాధితురాలు హర్షవీణపై దాడి కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల హర్షవీణపై జనసేన నాయకులు నడిరోడ్డుపై దాడి చేసి, పోలీసుల చేతిలోని లాఠీ లాక్కొని కొట్టడంతో పాటు తరుముతూ అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో నిందితుడు జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రకు పోలీసులు అండగా నిలుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.తాజాగా, తాతంశెట్టి నాగేంద్ర విచారణలో పోలీసుల హైడ్రామా బయటపడింది. హర్షవీణపై దాడి చేసిన కేసులో విచారణను పోలీసులు అత్యంత గోప్యంగా నిర్వహించారు. విచారణ సందర్భంగా రైల్వేకోడూరు పోలీస్ స్టేషన్ గేటుకు బేడీలు వేశాడు. హర్షవీణను నడిరోడ్డుపై చితకబాదినా, ముద్దాయికి వేయాల్సిన బేడీలను స్టేషన్ గేటుకు వేసి విచారణ జరపడం పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. చిన్న తప్పులకే అమాయకులను నడిరోడ్డుపై నడిపించే పోలీసులు, ఇలాంటి ఘటనలో మాత్రం నిందితుడికి సహకరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మహిళల జోలికి వస్తే తాట తీస్తాం.. ఆడపడుచులను కష్టపెడితే అంతు చూస్తాం.. అతివలను అగౌరవపరిస్తే అక్కడికక్కడే శిక్షిస్తాం’’ అంటూ ఆవేశంతో ఊగిపోయిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ .. ఇప్పుడు తాతంశెట్టి నాగేంద్రకు వంతపాడడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. -
మావిగన్.. ప్రజలు అంగీకరిస్తున్న రాజధాని
సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన మావిగన్ కాన్సెప్ట్ మంచి ప్రతిపాదన అని, సీఎం చంద్రబాబు చెప్పే అమరావతి దోచుకోనే ప్రతిపాదన అని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఆయన శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో అమరావతి కట్టే బదులు, మావిగన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని మూడు ముక్కలాట అంటూ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ చెప్పారురాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఉండకూడదన్నది వైఎస్ జగన్ ఉద్దేశం. ప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని చెప్పారు. జగన్ ఇప్పుడు చెప్పిన ప్లాన్ బీ కూడా కొత్తదేమీ కాదు. కొన్ని నెలలుగా చెబుతూనే ఉన్నారు. అయితే పెద్దగా చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఈ కారిడార్కు మావిగన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు ఉన్నాయి. నోయిడా అసలు పేరు.. ‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ’. పేర్లు ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం – విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజిన్గా అభివృద్ధి చేసేందుకు జగన్ పోర్టు నిర్మాణం చేపట్టారు.మావిగన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే. ఒక మంచి గ్రోత్ కారిడర్ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నారు. ఈ మూడు నగరాలు కలవడం బాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్ను అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ రాకుండా అడ్డుకుంటున్నాడు. మా ప్రభుత్వం వచ్చాక ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ రాజధాని పెడితే చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుల భారం ఉండదు. జగన్ చేసిన ఈ ఆచరణాత్మక ప్రతిపాదనపై ఈ మూడు నగరాలు సహా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, మేధావులు చర్చిస్తున్నారు.మంచి ప్రతిపాదన అని అంగీకరిస్తున్నారు. మా పార్టీ నాయకులంతా మద్దతు పలుకుతున్నారు. మా పార్టీ నాయకులు వ్యతిరేకించారన్నది దుష్ప్రచారమే. అమరావతికి కులం రంగు పులిమిందీ చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అంటే టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేశ్ ఆమెకు ధన్యవాదాలు చెప్పారు.అమరావతి ఇప్పట్లో కాదని బాబే చెబుతున్నారుబాబు ప్రణాళికతో అమరావతి సజీవ నగరంగా నిలుస్తుందా? ఉద్యోగాలొస్తాయా? అప్పుల భారం లేని సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా ఎప్పుడు మారుతుంది? అమరావతి ఇప్పట్లో పూర్తి కాదని చంద్రబాబే చెబుతున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్. పన్నుల ద్వారా రాజధానికి ఆదాయం వస్తుందన్న వాదనా అసంబద్ధమైనది. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వ భూములు ఎప్పుడు అమ్ముతాడు? హైదరాబాద్లో ఉన్న రేటు రావడానికి ఎంత కాలం పడుతుంది? చంద్రబాబువన్నీ మభ్యపెట్టే మాటలే.ఇదీ నయా రాయ్పూర్ వాస్తవ పరిస్థితిచత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్లో ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికీ రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. రాయ్పూర్ కోసం ఆ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అదీ తీర్చేశారు. అక్కడ చేసిన ఖర్చు రూ.7 వేల కోట్లు కాగా, ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని వస్తే ఇలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. చత్తీస్గఢ్లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్పూర్లో పెట్టారు. ఇక్కడ వికేంద్రీకరణ పెద్ద తప్పుగా దుష్ప్రచారం చేశారు.అమరావతి రైతులకూ అన్యాయం చేశారుచంద్రబాబు అమరావతి రైతులకూ అన్యాయం చేశారు. ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు.అమరావతి సంబరాలను ప్రజలు, అధికారులు పట్టించుకోలేదుఅమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటు. అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా వారు కూడా పట్టించుకోలేదు. -
అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ మోసం..
సాక్షి, విశాఖపట్నం: అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం అంతులేని దోపిడీకి పాల్పడుతోందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. శనివారం విశాఖలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతి చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు.చంద్రబాబు లెక్కల ప్రకారమే అమరావతి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలకు రూ.2 లక్షల కోట్లవుతుందని, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ఆయన ప్రశ్నించారు. రోడ్లకే ఎన్నో దశాబ్దాలు పడుతుంది.. ఇక మిగిలిన సదుపాయాలెప్పుడు? రాజధాని నిర్మాణాలెప్పుడు? రాష్ట్రానికి భారం కాని విధంగా అత్యంత వాస్తవిక దృక్పథంతోనే తాము విశాఖను రాజధానిగా ఎంపిక చేశామని, తక్కువ ఖర్చుతోనే గ్రోత్ ఇంజన్గా మారే అవకాశమున్న విశాఖను కాదన్నారు సరే.. అలాంటి అవకాశాలున్న, రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా ఎంచుకోవడానికి మీకు ఉన్న అభ్యంతరమేమిటని బొత్స ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై మౌనమెందుకు?అమరావతిపై చట్టం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు విభజన హామీ అయిన ప్రత్యేక హోదాపై ఎందుకు తీర్మానం చేయలేదని బొత్స ప్రశ్నించారు. ‘ప్రత్యేక హోదా వస్తే ఇలాంటి అమరావతిలు పది వస్తాయి. విశాఖ వంటి నగరాలు అభివృద్ధి చెందుతాయి. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని చెప్పడం బాధ్యతారాహిత్యం. ఈ నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అమరావతితో పాటు ప్రత్యేక హోదా బిల్లును కూడా ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలి’ అని డిమాండ్ చేశారు.అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ‘అమరావతి నిర్మాణాల్లో భారీ దోపిడీ జరుగుతోంది. చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు ఖర్చయ్యే చోట రూ.14 వేలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. గత ఐదేళ్లలో చంద్రబాబు 5 శాతం పనులే చేశారు. ఇప్పుడు రెండేళ్లు పూర్తయినా ఎమ్మెల్యే క్వార్టర్లు, మంత్రులు, ఉద్యోగుల నివాస సముదాయాలు, న్యాయమూర్తుల నివాసాలు, చివరకు కరకట్ట రోడ్డు కూడా పూర్తి చేయలేకపోయారు. అమరావతి ఎప్పటికి పూర్తవుతుందనే దానికి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోంది. అమరావతిపై అసెంబ్లీలో తీర్మానం చేసిన కూటమి ప్రభుత్వం శాసనమండలిలో ఆ బిల్లును ఎందుకు ప్రవేశపెట్టలేదు? మండలిలో నిలదీస్తామనే భయంతోనే ప్రభుత్వం ఈ చీప్ ట్రిక్స్కు పాల్పడింది. రాజధాని పేరుతో ఎంత ఖర్చు చేశారు? కాంట్రాక్టర్లకు ఎంత అడ్వాన్స్ ఇచ్చారు? ఎంత పని జరిగింది? అన్న లెక్కలతో శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ‘మావిగన్’ ప్రతిపాదనలో తప్పేంటి?‘మా నాయకుడు వైఎస్ జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు. ఇప్పటికే రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టు ఉన్న మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు (మావిగన్) ప్రాంతాన్ని ఎక్కువ ఖర్చు లేకుండానే రాజధానిగా అభివృద్ధి చేయవచ్చు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనేదే ఆయన ఆకాంక్ష. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమరావతి రైతులకు కౌలు డబ్బులు ఒక్కరోజు కూడా ఆపలేదు. టీడీపీ కూటమి ప్రభుత్వం రైతులకు చేసిన అదనపు మేలేంటో సమాధానం చెప్పాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ ఉన్నారు. -
ఆచరణ పథమా? అవినీతి మార్గమా?
అమరావతి అనే పేరుతో ఒక ఎమోషనల్ డ్రామాను రక్తి కట్టించడానికి చంద్రబాబు ప్రభుత్వం చెమటోడ్చి పనిచేస్తున్నది. ఇప్పుడు మాత్రమే కాదు, ఈ పాలక కూటమి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ నాటకాన్ని ప్రదర్శించింది. అప్పటి జగన్ ప్రభుత్వం పాలనాపరమైన విజయాలను మసకబార్చడానికి ‘అమరావతి’ పేరుతో, శోకరస ప్రధానమైన ఇతివృత్తంతో ప్రదర్శించారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో జరుగుతున్న అవినీతిపై కురుస్తున్న ప్రశ్నల వర్షాన్ని తప్పించుకోవడానికీ, పాలనాపరమైన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించ డానికీ, అదే నాటకంలో మరిన్ని భావోద్వేగాలను దట్టించడానికి తీవ్రంగా ప్రయత్నించారు.రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్ల తర్వాత, ప్రధానమంత్రిని రెండుసార్లు రప్పించి శంకుస్థాపన చేసిన తర్వాత... అమరావతే రాజధాని అంటూ మరోమారు అసెంబ్లీ తీర్మానం ఎందుకు? అసెంబ్లీలో అంతర్భాగమైన ఎగువ సభను ఉపేక్షించి ‘అర్ధాంగీ కారం’తోనే పార్లమెంట్కు పంపడానికి వేగిరపడిందెందుకు? రాజధాని నిర్ణయం రాష్ట్రాల పరిధిలోని అంశమేనని గతంలోనే సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన తర్వాత... ఈ విషయంలో అసెంబ్లీ తీర్మానానికి అనుగుణంగా ప్రవేశపెట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోదించడమనేది చాలా సహజమైన క్రతువు.కేంద్రంలో ఉన్నది కూడా కూటమి సర్కారే కనుక మొహ మాటం కొద్దీ ఏపీ రాష్ట్ర విభజన (సవరణ) బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టి సహకరించింది. ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆ రాష్ట్ర శాసనసభ చేసిన తీర్మానా నికి విరుద్ధంగా ఇతర రాష్ట్రాలకు, ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు వ్యవహరించరు... ఏవో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప! అయినా, సమాజ్వాది సభ్యుడు ధర్మేంద్ర యాదవ్ అమరావతి ఎంపికపై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కొద్దిపాటి ఖర్చుతోనే సహజసిద్ధంగా ఎదిగే అవకాశమున్న విశాఖను వదిలి అమరావతి పేరుతో మోయలేని భారాన్ని ఎంచుకోవడం పట్ల విస్మయాన్ని ప్రకటించారు.ఈమాత్రం తతంగానికి శత్రురాజ్యం మీద యుద్ధం చేసి గెలిచినంత హడావిడి చేసింది చంద్రబాబు సర్కార్. ‘కట్టండి తోరణాలు, ఎత్తండి జెండాలు, చేయండి ఉత్సవాలు’ అంటూ కిందిస్థాయి కార్యకర్తలకు ఆదేశాలు వెళ్లాయని సమాచారం. అయితే ఆ స్థాయిలో కేడర్ స్పందించలేదన్న సంగతి ఇక్కడ మనకు అనవసరం. అది వారి ఆంతరంగిక విషయం. ‘అమరా వతి ఇక శాశ్వత రాజధాని. దాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ చంద్రబాబు మాట్లాడారు. దేశంలోని సమస్త పార్టీలూ ఒక్క తాటిపై నిలిచి అమరావతికి మద్దతు తెలిపాయని చెబుతూ ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించిందని బాబు తప్పుబట్టారు.ఈ బిల్లును ప్రస్తుత రూపంలో వ్యతిరేకిస్తున్నామని ఉభయ సభల్లో వైసీపీ సభ్యులు చెప్పారు. అమరావతిని వ్యతిరేకిస్తున్నా మని చెప్పలేదు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులో పెట్టలేకపోయినా అప్పటి ప్రధాని ప్రభుత్వం తరఫున ఏపీకి ‘ప్రత్యేక హోదా’ను హామీ ఇచ్చారు. ఆ ‘ప్రత్యేక హోదా’ అనేది ఏపీకి సంజీవని వంటిదని జగన్ మోహన్ రెడ్డితో పాటు పలువురు ఆర్థిక నిపుణులు కూడా అభిప్రాయ పడ్డారు. మొన్న పార్లమెంట్ ఆమోదించిన బిల్లు 2014 నాటి విభజన చట్టానికి సవరణ కనుక ప్రత్యేక హోదాను చట్టంలో చేర్చడానికి ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది?వైసీపీ సభ్యులు అదే ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను బిల్లులో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. రాజధాని భూసమీకరణకు సహకరించిన రైతుల గురించి బిల్లులో ఎందుకు లేదని అడిగారు. ఇంకెన్నాళ్లకు వారికి న్యాయం జరుగు తుందని కడిగేశారు. రాజధాని నిర్మాణ పనుల పేరుతో ఆమో దించిన టెండర్లలో కనిపిస్తున్న కనీవినీ ఎరుగని అవినీతి వ్యవహారాన్ని సభ దృష్టికి తెచ్చారు. ఢిల్లీలో చదరపు అడుగుకు నాలుగు వేలున్న నిర్మాణ వ్యయం అమరావతిలో పన్నెండు వేలు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఈ ప్రశ్నను గతంలో పలుమార్లు స్వయంగా ప్రతిపక్ష నేత కూడా వేసినా, ప్రభుత్వం స్పందించలేదు.ఈ అవినీతిని ఎత్తిచూపకుండా పార్లమెంట్లో అమరావతి బిల్లుకు మద్దతునిస్తే రాష్ట్ర సర్కార్కు క్లీన్చిట్ ఇచ్చినట్టు కాదా? బేషరతుగా బిల్లుకు మద్దతునిచ్చి ఉంటే ప్రతిపక్ష బాధ్యతలో వైసీపీ విఫలమైనట్టు భావించవలసి వచ్చేది. అందుకే సవరణ బిల్లును ఈ రూపంలో వ్యతిరేకిస్తున్నామని చెప్పి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఒక సెంటిమెంటల్, ఎమోషనల్ డ్రామాగా మార్చి ప్రచారం చేయడానికి కూటమి పార్టీల నేతలు, యెల్లో మీడియా వారు వీరకంకణాలు ధరించారు. అమరావతి నిర్మాణాన్నీ, అభివృద్ధినీ వైసీపీ అడ్డుకుంటున్నదని ప్రచార సంరంభాన్ని ప్రారంభించారు. రాజధాని పేరుతో ఎంత విచ్చలవిడిగా అవినీతి చెలరేగినా ప్రశ్నించ కూడదా? ప్రత్యేక హోదా డిమాండ్కు పాలక కూటమి మంగళం పాడితే ప్రతిపక్షం కూడా కోరస్ పాడాలా? చట్టబద్ధత అనేది అమరావతికి మాత్రమే ఉండాలా? అందుకోసం భూములిచ్చిన రైతులకు చట్టపరమైన రక్షణ అవసరం లేదా?... ఇవి కదా ఇప్పుడు చర్చ జరగవలసిన ప్రధానాంశాలు!అసలీ చట్టబద్ధత అనేదే పెద్ద బోగస్. దీన్నేమీ రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చలేదు కదా, మార్చకుండా ఉండ టానికి? చట్ట సవరణ కోసం ఏపీ శాసనసభ ఎంత సులభంగా మొన్న తీర్మానం చేసిందో, కావాలనుకుంటే ఇంకో ప్రభుత్వం అంతే సులభంగా ఇంకో తీర్మానాన్ని కూడా చేసి కేంద్రానికి పంపించగలదు. తమకిచ్చిన హామీలు నెరవేరక, చూపెట్టిన రంగుల చిత్రాలు నిజం కాక నిరాశతో ఉన్న రైతులను మరి కొంతకాలం మభ్యపెట్టడానికీ, రెండో విడత భూసేకరణకు సిద్ధపడని రైతులను బుజ్జగించడానికీ, నిర్మాణ పనుల్లో జరుగుతున్న అవినీతి వ్యవహారాల నుంచి దృష్టి మళ్లించడానికీ పన్నిన వ్యూహం తప్ప ఈ చట్టసవరణకు ఇంతకు మించిన ప్రాధాన్యంలేదు.విభజన చట్టం సవరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, ముఖ్యమంత్రి తన ఆనందాన్నీ, ప్రతిపక్షం మీద ఆక్రోశాన్నీ వెలిబుచ్చుతున్న సందర్భంలో ఒక కీలకమైన అంశం ఆయన మాటల్లోంచి దొర్లిపడింది. ‘రాజధాని నిర్మాణం నిరంతర ప్రక్రియ, ఒక్కరోజులో పూర్తయ్యేది కాద’ని చంద్రబాబు చెప్పారు. రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మాణం కాలేదన్న నానుడి చంద్రబాబు దాకా చేరేసరికి శతాబ్దాల కాలం పట్టిందన్నమాట! ఆంధ్రప్రదేశ్కు గ్రోత్ ఇంజన్ లాంటి నగరంగా అమరావతిని నిర్మించాలన్నది తన లక్ష్యమని కూడా ఆయన పలుమార్లు చెప్పారు. రెండో విడత, మూడో విడత భూసమీకరణ సంగతిని పక్కన పెడదాం. మొదటి విడత 50 వేల ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకే బాబు లెక్క ప్రకారం లక్ష కోట్లు కావాలి.ఇప్పటివరకు రాజధాని పేరుతో చేసిన రూ. 47 వేల కోట్ల అప్పుల్లో చాలాభాగం ఐకానిక్ బిల్డింగ్ల ఖాతాల్లోకి మళ్లింది. తొలివిడత మౌలిక వసతులను పూర్తిచేయడానికి ఇంకెన్ని వేల కోట్లు కావాలి? ఎప్పటికి సమకూరాలి? ఓ దశాబ్దానికో, రెండు దశాబ్దాలకో మౌలిక వసతుల్ని, ప్రభుత్వ భవనాలను, ప్రైవేట్ సంస్థల భవనాలను పూర్తి చేసినా, జనసమ్మర్దం నివసించే నగరంగా మారే అవకాశాలు అమరావతికి చాలా తక్కు వని నిపుణులు చెబుతున్నారు. ఛత్తీస్గఢ్లోని నయా రాయ్ పూర్గానో, మలేసియాలోని పుత్రజయగానో చీకటి పడగానే నిర్మానుష్య నగరంగా మిగిలిపోయే అవకాశాలే ఎక్కువని సాధికారికంగా వివరిస్తున్నారు. ఇటువంటి నగరం ఎన్ని తరాలు గడిస్తే గ్రోత్ ఇంజన్గా ఎదగగలుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.ఈ నేపథ్యంలోనే గతంలో జగన్మోహన్రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రకటనను పరిశీలించాలి. హైదరాబాద్లో అభివృద్ధి కేంద్రీకృతమైన కారణంగా మిగిలిన ప్రాంతాలు వెనుక బడ్డాయనీ, విభజిత రాష్ట్రంలో అటువంటి పొరపాటు చేయ వద్దనీ రాజధానిపై కేంద్రం ఏర్పాటుచేసిన నిపుణుల కమిటీ సూచించింది. అభివృద్ధి వికేంద్రీకరణతోపాటు పాలనా వికేంద్రీ కరణ కూడా ప్రజాస్వామ్యం బలపడేందుకు దోహదపడుతుంది. దీనితోపాటు మరో ముఖ్యమైన విషయం– రాష్ట్రాభివృద్ధికి దోహదపడే గ్రోత్ ఇంజన్ లాంటి నగరం కూడా ఈ మూడు రాజధానుల ప్రతిపాదనలో అంతర్లీనంగా ఉన్నది.విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం. షిప్యార్డ్, తూర్పు నావికాదళం, స్టీల్ ఫ్యాక్టరీ వగైరాల ఏర్పాటుతో కాస్మొ పాలిటన్ స్వరూపాన్ని సంతరించుకున్నది. బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఒరిస్సాల నుంచి పెద్దసంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తున్న పర్యాటక కేంద్రంగా కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతున్నది. తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలో విశాఖను గ్రోత్ ఇంజన్గా అందుబాటులోకి తీసుకొని రావచ్చు. దాంతో పాటు కర్నూలు న్యాయ రాజధాని విషయం కూడా!మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు శ్రీబాగ్ ఒడంబడిక స్ఫూర్తితో కర్నూలులో రాజధాని ఏర్పాట యింది. మూడేళ్ల తర్వాత రాయలసీమ ప్రాంతం తన రాజధాని హోదాను త్యాగం చేసి దేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పా టుకు శ్రీకారం చుట్టింది. భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు విచ్ఛిన్నమై పాత ఆంధ్ర రాష్ట్రమే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. న్యాయం ప్రకారం రాయలసీమ తన పాత హోదాను అడిగి తీసుకోవాలి. కనీసం హైకోర్టునైనా అక్కడ ఏర్పాటు చేయడం సముచితమన్న ఉద్దేశంతోనే జగన్ మూడు రాజధానుల ప్రతి పాదన తీసుకొచ్చారు. దీన్ని మూడు ముక్కల ఆటంటూ టీడీపీకి ఉన్న ప్రచార బలంతో, మీడియా దన్నుతో అవహేళన చేసి, ప్రజలను ఏమార్చారు.ఇప్పుడు అమరావతి నిర్మాణం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది. రాజధాని నిర్మాణం ఒక్క రోజులో పూర్తి కాదనే గ్రహింపు కూడా చంద్రబాబుకు ఉన్నది. కొన్ని దశాబ్దాలు గడిచినా అది గ్రోత్ ఇంజన్ మాదిరిగా ఉపయోగపడే అవకా శాలు తక్కువే. అయినా ఇతరేతర కారణాలేవో ఆయన్ను అమరావతి చుట్టే తిప్పుతున్నాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతి కోసం తక్కువ కాలంలో గ్రోత్ ఇంజన్గా అందుబాటులోకి వచ్చే మరో ప్రత్యామ్నాయ సూచన కూడా జగన్ చేశారు. మచిలీ పట్నం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు 110 కిలోమీటర్ల ప్రాంతాన్ని రాజధాని గ్రోత్ కారిడార్గా ప్రకటించ వచ్చని సూచించారు. ఇందుకోసం ఆయన ఉపయోగించిన ‘మావిగన్’ పేరు నచ్చకపోతే ఇంకే పేరైనా పెట్టుకోవచ్చని కూడా అన్నారు.తక్షణమే యాభై లక్షల జనాభా గల నగరంగా ఇది అవతరిస్తుంది. మచిలీపట్నం పోర్టు, దేశంలో ప్రముఖమైన విజయవాడ రైల్వే జంక్షన్, గన్నవరం అంతర్జాతీయ విమానా శ్రయం రెడీమేడ్గా అందుబాటులోకి వస్తాయి. అమరావతికి రెండో విడత భూ సమీకరణ అవసరముండదు. తొలి విడత సమీకరించిన భూమిలోనే కేటాయింపులు పోగా మిగిలిన భూమి అమ్మకాలతోనే ఈ కారిడార్లో అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయవచ్చు. మచిలీపట్నం రాష్ట్రంలోని తొలి మునిసిపా లిటీల్లో ఒకటి. నిజాంల కాలంలోనే హైదరాబాద్ నుంచి బందరు రేవుకు రహదారి నిర్మాణం (ప్రస్తుత ఎన్హెచ్ 65) జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే ఏకైక రేవుపట్టణం కూడా మచిలీపట్నమే! ఫుడ్ ప్రాసెసింగ్, వస్త్ర పరిశ్రమలు పెద్దఎత్తున ప్రారంభించడానికి తక్షణం ఉపయోగ పడే ప్రాంతం. రాష్ట్ర పురోగతికి ఆచరణాత్మకమైన మార్గాన్ని అనుసరించాలనుకుంటే ఈ ప్రతిపాదనను పరిశీలించవచ్చు. అసాధ్యమైన అమరావతి బాటనే ఎంచుకుంటే అది రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రం కాదు!వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు?: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో అభివృద్ధి చెందేదని శాననమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తే అది ముగిసిన అధ్యాయమని చెబుతున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని చంద్రబాబు కేంద్రాన్ని ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు.విశాఖపట్నంలో బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేకహోదా హామీ ఏమైంది? రెండేళ్లలో అమరావతిలో ఎంత అభివృద్ధి చేశారో చంద్రబాబు చెప్పాలి. అమరావతిలో అగ్నిప్రమాదం జరిగితే వైఎస్సార్సీపీకి ఏం సంబంధం? ఆ అగ్ని ప్రమాదం విషయం ఏమైంది? కూటమి అధికారంలోకి వచ్చాక అమరావతిలో ఏం చేశారో చెప్పాలి.రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం చేయాల్సిన పని చెయ్యడం లేదు. గిట్టుబాటు ధరలేక రైతులు, ఫీజు రీయింబర్స్మెంట్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అమరావతి విషయంలో కాంక్రీట్ వేశామని ఫీలింగ్ ఇవ్వడానికి చంద్రబాబు తాపత్రయ పడ్డారు’ అని చెప్పారు.విభజన హామీలు ఏమయ్యాయి? మీడియా కూడా జరుగుతున్న అఘాయిత్యాలను పట్టించుకోకుండా అమరావతి అంశాన్నే చూపిస్తోందని బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రాష్ట్రంలో మామిడి పండ్లను కూడా కల్తీ చేసే దుస్థితి నెలకొంది. ఆరోగ్య శ్రీని పూర్తిగా అటక ఎక్కించారు. తీర్మానం చేసి అమరావతి పర్మినెంట్ అనుకుంటున్నారు. నిర్మాణం పూర్తి చేస్తే అది పర్మినెంట్ అవుతుంది. రాష్ట్ర విభజన హామీల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు? ప్రత్యేక హోదా వస్తే 10 అమరావతిలు వస్తాయి. ముంబై వంటి నగరాలు కూడా వస్తాయి. ప్రత్యేక హోదా కోసం ఎందుకు మాట్లాడటం లేదు? మావిగన్ ప్రతిపాదనలో తప్పేముంది? మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చే క్వార్టర్స్ అయినా పూర్తి చేశారా? కరకట్ట రోడ్డు కూడా వెయ్యలేకపోయారు. అమరావతిలో ఈ రెండేళ్లు ఏమి చేశారు? అమరావతి నిర్మాణంలో ఎస్ఎఫ్టీకి రూ.14 వేలు ఎందుకు? ఎవ్వరికైనా ఇదే అనుమానం వస్తుంది.. జగన్ కూడా అదే అడిగారు. ఈ రెండేళ్లలో అమరావతిపై ఎంత ఖర్చు చేశారు? ఎంత పని చేశారు? ఎంత పేమెంట్ ఇచ్చారు? బకాయిలు ఎంత పెట్టారు? ఆ వివరాలను బట్టి ఎన్ని సంవత్సరాల్లో అమరావతి పూర్తి అవుతుందో చెప్తాం. గిరి గీసుకొని అమరావతి మాత్రమే అభివృద్ధి చెయ్యాలని అనుకోని చేస్తున్నారు. మళ్లీ జరిగే పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా బిల్లు పెట్టించాలి. ప్రభుత్వం మీదే కదా? ప్రత్యేక హోదా బిల్లు పెట్టిస్తే.. చంద్రబాబుని మెచ్చుకుంటాం’ అని బొత్స సత్యనారాయణ అన్నారు. -
20 ఏళ్ల క్రితం ఛత్తీస్ గఢ్ రాజధాని అమరావతికీ ఇదే పరిస్థితి..
-
YSR అన్నట్లు బాబు ప్రతి అబద్దపు మాట ఆణిముత్యమే
-
‘ఏపీపై చంద్రబాబు మోయలేని భారం మోపారు’
తాడేపల్లి: అమరావతి బిల్లును పార్లమెంట్ ఆమోదిస్తే రాష్ట్రమంతా సంబరాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని, అమరావతి పేరుతో రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేస్తున్న చంద్రబాబుకు ఇలాంటి హంగామా కొత్తేమీ కాదని వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. ఏకంగా రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసి అమరావతి కట్టే బదులు, మావిగాన్ పేరుతో ప్లాన్–బీ గురించి జగన్ చెబితే, నిస్సిగ్గుగా ఎదురుదాడి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గతంలో తాము మూడు ప్రాంతాల్ని అభివృద్ధి చేస్తామని చెబితే, దాన్ని ఇప్పటికీ మూడు ముక్కలాట పేరుతో విమర్శిస్తూ.. ఆయా ప్రాంతాల్ని అవమానిస్తున్నారని తెలిపారు. గతంలో మచిలీపట్నాన్ని గ్రోత్ ఇంజన్ చేసేందుకు వీలుగా పోర్టు నిర్మాణం చేపట్టామని, ఇప్పుడు మావిగాన్ ప్లాన్ కూడా దానికి కొనసాగింపే అని చెప్పారు. దీన్ని తట్టుకోలేకే చంద్రబాబు అవాకులూ, చవాకులు పేలుతున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు.సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏమన్నారంటే..అప్పుల అమరావతిపై రాష్ట్రమంతా సంబరాలా!చంద్రబాబు రాష్ట్రంలో మూడు ప్రాంతాలను పేకముక్కలతో పోల్చి అవమానిస్తున్నారు. రూ.2 లక్షల కోట్ల అప్పుతో కూడా సాధ్యం కాని అమరావతిపై సంబరాలు చేయమని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు. మట్టి, నీళ్లు ఇచ్చిన ప్రధాని మోదీ, తమ నెత్తి మీద చేయి పెట్టారని నాడు చంద్రబాబు విమర్శించారు. ఇంకా అమరావతికి కులం రంగు పులిమింది చంద్రబాబే. రేణుకాచౌదరి పార్లమెంటులో కమ్మరావతి అని అన్నారు. దీన్ని టీడీపీ నుంచి ఎవరైనా ఖండించారా? పైగా ఆమె ఆ మాట అన్నందుకు రాజ్యసభలో గ్యాలరీ నుంచి లోకేష్.. ఆమెకు ధన్యవాదాలు చెప్పారు. అమరావతిలో అవినీతిని మేం ప్రశ్నిస్తున్నాం. అలాగే వాస్తవాలు గుర్తించి, నేల మీద నిలబడి ఆలోచించాలని జగన్గారు సలహా ఇచ్చారు. ఆ పని చేయకుండా ఎదురుదాడి చేస్తున్నారు.జగన్ స్పష్టమైన విధానంతో ఉన్నారుప్రజలపై భారం లేని గ్రోత్ ఇంజిన్ కావాలని జగన్ స్పష్టంగా చెప్పారు. రాజధాని గురించి తొలుత ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ భూమి 30 వేల ఎకరాలు ఉండాలన్నారు. సామాన్యులకు, మధ్య తరగతి ప్రజలకు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వారికి అందుబాటులో ఉండాలన్నది అప్పుడు ఆయన ఆలోచన. దీని కోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం మీద ఆర్థిక భారం కాకూడదన్నది ఆయన ఉద్దేశం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న చోట రాజధాని పెట్టమన్నారు.రాజధాని ఇప్పట్లో కాదని చంద్రబాబే అంగీకరించారు ఏ అవకాశం వచ్చినా దోపిడీ చంద్రబాబు నైజం. అందులో ఆయన ఆరితేరారు. అమరావతి పనుల్లో కూడా అవసరం లేని, ఎక్కడా లేని రేట్లు పెట్టి, అందమైన పేర్లతో కాంట్రాక్టులు ఇచ్చి, దోపిడీ చేస్తున్నారు. మోటారు పెట్టి నీటిని తోడినట్టు, ప్రజల సొమ్మును రాజధాని పేరు మీద లాగేస్తున్నారు. తన దోపిడీ కోసమే, అవినీతి కోసమే అమరావతి ప్రాంతాన్ని చంద్రబాబుగా రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. అమరావతి బాండ్లను తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటు. అప్పట్లో 8 శాతం వడ్డీకి రుణాలు వస్తుంటే, చంద్రబాబు 10.3 శాతం వడ్డీతో అప్పు చేశారు. అయినా ఏదో సాధించినట్లు సిగ్గుచేటు. మరోవైపు అమరావతి ఇప్పట్లో కాదని చంద్రబాబే చెప్తున్నారు. 2047 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతిని లాగి ఖజానాను పిండాలన్నది వారి ప్లాన్.నిజానిజాలు ప్రజలు ఆలోచించాలిచంద్రబాబు చెబుతున్న దానికి, జగన్ వాస్తవాల విషదీకరణ మధ్య వ్యత్యాసాన్ని, నిజానిజాలపై ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు ప్రణాళికతో అసలు రాజధాని వస్తుందా? ఉద్యోగాలు ఇచ్చే నగరం, సజీవ నగరంగా, అప్పుల భారం లేని విధంగా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి ఎప్పుడు మారుతుంది? ఈ తరహా నగరం ఇప్పుడు పూర్తి కాదని చంద్రబాబు స్వయంగా చెబుతున్నారు. ప్రభుత్వ అప్పుల ద్వారా రాజధాని కడితే, ఆ తర్వాత పన్నుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందన్నది చంద్రబాబు అసంబద్ధమైన వాదన. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు జీఎస్టీ రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు పొందడాన్ని ఆదాయం అంటారా? ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్ల రాయితీకే సరిపోతుంది. అమరావతిలో ప్రభుత్వానికి వచ్చే భూములు ఎప్పుడు అమ్ముతాడు?. హైదరాబాద్లోని రేటు రావడానికి ఎంత సమయం పడుతుంది?. చంద్రబాబువి మభ్యపెట్టే మాటలు.ఇదీ నయాపూర్ వాస్తవ పరిస్థితి(చత్తీస్గఢ్ రాజధాని నయా రాయపూర్ నిర్మాణం జరిగి దాదాపు 20 ఏళ్లయినా, ఇప్పుడు కూడా వాస్తవ పరిస్థితి ఏమిటన్నది ప్రెస్మీట్లో సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో ద్వారా చూపారు). అక్కడ ఇప్పటికీ ఉద్యోగులు, సిబ్బంది రాయ్పూర్ నుంచే రాకపోకలు చేస్తున్నారు. కాకపోతే రాయ్పూర్ కోసం ఆ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేయలేదు. రాజధాని కోసం చత్తీస్గఢ్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1500 కోట్లు మాత్రమే. అవి కూడా తీర్చేశారు. కాగా, అక్కడ చత్తీస్గఢ్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన వ్యయం రూ.7 వేల కోట్లు కాగా, అదే సమయంలో ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా రూ.18 వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్థిక, వాణిజ్య కార్యకలాపాలు బలంగా ఉన్న చోట రాజధాని ఏర్పడితే అలా అన్ని రకాల ఉపయోగం. అదే ఇక్కడ అమరావతిలో పనుల కోసం విచ్చలవిడిగా వేల కోట్ల అప్పు చేస్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో కూడా వికేంద్రీకరణ దిశలో ఆ రాష్ట్ర హైకోర్టును బిలాస్పూర్లో పెట్టారు. అలాంటిదే ఇక్కడ ప్రతిపాదిస్తే వికేంద్రీకరణ అంటే ఆదో పెద్ద తప్పుడు పనిగా కలరింగ్ ఇచ్చి దుష్ప్రచారం చేశారు.ఆ కమిటీ నివేదిక అసంబద్ధమా? అసలు అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సరికాదని నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ మీ దృష్టిలో పిచ్చి కమిటీనా? దేశంలోని ప్రఖ్యాత నిపుణులు చెప్పిన మాటలు మీకు అవహేళనగా కనిపించాయా? ఆచరాణాత్మక ఆలోచనను వాళ్లు ప్రభుత్వం ముందు ఉంచారు. అయినా శివరామకృష్ణన్ నివేదికను పక్కకు తోసేసి చంద్రబాబు సొంత నిర్ణయాలు తీసుకున్నారు.వీటికి చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాలిమరి అవన్నీ వద్దన్న చంద్రబాబు ఏం చేశాడు? అమరావతి రైతులకు అన్యాయం చేయలేదా? కౌలు, పెన్షన్లు ద్వారా ఇప్పటికి రూ.3,800 కోట్లు ఇచ్చారు. ఇవన్నీ చంద్రబాబు తన జేబులో నుంచి ఇవ్వటం లేదు కదా? ఇప్పటికీ రైతుల సమస్యలు కొలిక్కి రాలేదు. దీనికి చంద్రబాబు బోనులో నిలబడి సంజాయిషీ ఇవ్వాలి. ప్రపంచంలో లేని కొత్త అవినీతి మార్గాన్ని చంద్రబాబు సృష్టించాడు. అమరావతి ద్వారా ఆయన రాష్ట్రానికి గుదిబండ తయారు చేశాడు. కాగా, రాజధానిలో రేట్లు, భవనాల సైజు, అందులో జరుగుతున్న అవినీతి చూస్తే భయం వేస్తోంది. అవి ఎప్పటికి పూర్తి అవ్వాలి? ఆ భవనాల నిర్వహణ మరొక గుదిబండ. రైతులకు ఇచ్చిన కౌలు డబ్బులతోనే ప్రభుత్వానికి సొంతంగా వేలాది ఎకరాలు సమకూరేవి. అక్కడి రైతుల పిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. నీళ్లు ఎత్తిపోయడానికే రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు.జగన్ ప్లాన్–బి ప్రతిపాదనకు తాటాకులు కట్టడం ఎందుకు?జగన్ రాయలసీమలో రాజధాని పెట్టమన్నాడా? మచిలీపట్నం– విజయవాడ – గుంటూరులో పెట్టమంటే చంద్రబాబుకు మంట ఎందుకు? జగన్ సూచించిన గ్రోత్ ఇంజిన్కు జగన్ మొదలుపెట్టిన మచిలీపట్నం పోర్టు దోహద పడుతుంది. ఒక మంచి గ్రోత్ కారిడర్ను చంద్రబాబు తన అవినీతి కోసం విస్మరిస్తున్నాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును రాజధాని ప్రాంతంగా జగన్ ప్రతిపాదించడం ఇదే మొదటిసారి కాదు. గడిచిన కొన్ని నెలల్లో అనేకమార్లు దీన్ని ప్రతిపాదించారు. అయితే అది పెద్దగా అది చర్చలోకి రాలేదు. ఆ ఉద్దేశంతోనే ఆయన ఈ కారిడార్కు మావిగాన్ అని పేరు పెట్టారనుకుంటున్నా. ఇలాంటి పేర్లు దేశంలో అనేక గ్రోత్ కారిడార్లకు కూడా ఉన్నాయి. ఉదాహరణకు నోయిడా కూడా అలాంటిదే. చాలా మందికి అసలు పేరు పూర్తిగా తెలియదు. దాని అసలు పేరు..‘న్యూ ఒఖలా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ – నోయిడా’ఇక్కడ మావిగాన్ కూడా అలాంటిదే. పేర్లు ఏమిటన్నది ముఖ్యం కాదు. వాటి వెనక ఉద్దేశాలు చూడాలి. సారాంశం అర్ధం చేసుకోవాలి. కేవలం ఆ పేరుకు టీడీపీ వాళ్లు తాటాకులు కట్టడం ఎందుకు? పేరుపై అంత రాద్ధాంతం అవసరమా?ప్రజలు కూడా జగన్సూచన, ప్రతిపాదన మావిగాన్ మీద చర్చించారు. మేథావులు, నిపుణులు సీరియస్గా ఆలోచించారు. మన దగ్గర అనేక అర్బన్ సంస్థలకు.. వుడా, తుడా, ముడా అని పేర్లు పెట్టారు. దేశంలోని అనేక గ్రోత్ కారిడర్లు, ఇండస్ట్రియల్ కారిడర్లు పేర్లు చూస్తే మరింత విచిత్రంగా ఉంటాయి. ఇక్కడ చర్చ చేయాల్సింది పేరుపై కాదు. చేసిన ప్రతిపాదన ప్రజలకు మంచి చేస్తుందా? లేదా? అన్నది ముఖ్యం.చంద్రబాబుకు ఈ మూడు నగరాల కలయిక ఇష్టం లేదుమచిలీపట్నం–విజయవాడ– గుంటూరు కలవడం చంద్రబాబుకు ఇష్టం లేదు. గతంలో పశ్చిమ బైపాస్ను చంద్రబాబు అడ్డుకున్నాడు. తూర్పు బైపాస్ను రానీయకుండా అడ్డుకుంటున్నాడు. అవి వస్తే, చంద్రబాబు అవినీతి ముందుకు సాగదని భయం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు సిటీలు బాగా అభివృద్ధి చెందాయి. ఇప్పుడు రాజధాని అక్కడ ఏర్పాటు చేస్తే, ఆ ప్రాంతం చాలా తక్కువ ఖర్చుతో మరింత అభివృద్ధి చెందుతుంది. అప్పుడు రాష్ట్రంపై అప్పుల భారం కూడా ఉండదు. ఒకవేళ ప్రభుత్వానికి మావిగాన్ పేరు ఇష్టం లేకపోతే.. మరో పేరు పెట్టుకోమని జగన్ స్వయంగా చెప్పారు కదా. అయినా ఇంకా ఏమిటి దానిపై మీ అభ్యంతరం?’ అని ప్రశ్నించారు సజ్జల. -
దేవతల రాజధాని అమరావతిని చూడాలంటే 200 సంవత్సరాలు పడుతుంది
-
బాబు మన కోసం మళ్లీ పుట్టి.. రాజధానిని పూర్తి చేస్తాడు
-
"పిలవరా కమ్మరావతి.." రేణుక చౌదరికి అంబటి కౌంటర్
-
మెడికల్ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెర తీశారు. మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!రంగంలోకి ఆ ముగ్గురు..పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మెడికల్ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్ వేశారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.న్యాయ వివాదాలు..2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇచ్చారు.5న జనరల్బాడీ సమావేశం.. రూ.250 కోట్ల కార్పస్ ఫండ్పై ముఖ్యనేత కన్నుఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. -
స్వర్ణాంధ్రానికి స్వతంత్రం లేదా?
శూన్యం నుంచి గారడీ వీరుడు ఒక రాజధానిని పుట్టించవచ్చు అన్నట్టుగాఉంది ‘అమరావతి’ అనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కథ. తెలంగాణ నుంచి విడి పోయిన తరువాత ఇప్పటి దాకా ఆంధ్ర ప్రదేశ్కు నిర్దిష్టమైన రాజధాని లేకపోతే అది శాపమా లేక చేవలేనితనమా? ప్రభుత్వ పరిపాలనా కేంద్రాలన్నీ ఒకే చోట నిర్మించడం తప్పు అని శివరామకృష్ణన్ కమిటీ చెబితే అది పనికిరాదు. వికేంద్రీకరణ వద్దు, ప్రతిచోటా కేంద్రీకరణ. తద్వారా రియల్ ఎస్టేట్ దుకాణాలు!ఇదొక సంక్షోభంమన భారత రాజ్యాంగం ప్రకారం ఆ యా రాష్ట్రాలు, పార్లమెంట్ ఆమోదం మేరకు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం తన పాలనలో భాగంగా రాజధాని ఏర్పాటు చేసుకుంటుంది. హైదరాబాద్ తరతరాలు, శతాబ్దాల క్రమంలో రాజధానిగా నిలబడింది.ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈ కథ వేరు. ఒక బలీయమైన ప్రభుత్వం ఉంటే ఒక జీవో ద్వారా రాజధాని ఏదో నిర్ణయించవచ్చు. కొన్ని రాష్ట్రాలలో ఒకటికన్నా ఎక్కువ రాజధానులు ఉన్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే రాజధాని ఉండటం కూడా మనకు తెలుసు. 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్ప డితే... 2026లో పార్లమెంట్ అమరావతిని రాజధాని అని చెబుతూ చట్టం చేసిందంటే... ఇంతకన్నా విషాదం ఏమైనా ఉందా? శాసనసభలో అమరావతిని రాజధానిగా పేర్కొంటూ ఆమోదించిన తీర్మానాన్ని శాసన మండలిలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఎక్కడో ఢిల్లీలో ఉన్న పార్లమెంట్కు పంపే ముందు... ఏపీ శాసన వ్యవస్థలో భాగమైన శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టక పోవ డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వికేంద్రీకరణ వద్దా?ఒక దశలో సీఆర్డీఏ చట్టం ద్వారా అమరావతిని రాజధాని అన్న మాట ఈ సందర్భంగా గుర్తుంచు కోవాలి. అలాగే ఒక విధానం ద్వారా (సంవిధానంగా కాదు) ల్యాండ్ పూలింగ్ చేసి నిర్మించాలను కున్న విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి. దీన్ని నిర్మించడానికి లక్షల కోట్లు కుమ్మరించాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరా బాదులోనే సమస్త అభివృద్ధినీ కేంద్రీకరించి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారనే విమర్శ ఉంది.అందుకే వైఎస్ జగన్ మోహనరెడ్డి పాలనా కాలంలో ఆంధ్ర ప్రదేశ్కు మూడు రాజధానులను ప్రతిపాదించారు. ఈ విధానం వికేంద్రీకరణ లక్ష్యంతో ముందుకు వచ్చింది. ఒకే నగరంలో అధికార కేంద్రీకరణ తగ్గించాలనే ఉద్దేశ్యం దీనిలో ఉంది. ఇందువల్ల నిధులు, ఉద్యోగాలు, పరిశ్రమలు, అధికారాలు వికేంద్రీకరించే అవకాశంఉంటుంది. కానీ అమరావతిపై ఉన్న భ్రమల కారణంగా భూములు ఇచ్చిన రైతులు కోర్టులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని ఆదేశించింది. రాజధాని లేని దయనీయ పరిస్థితి ఉన్నందున విధిలేక కోర్టు ఈ తీర్పుఇచ్చింది. ఈ తీర్పు న్యాయవ్యవస్థ పరిమితులపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తింది: రాజధానిని నిర్ణయించేది ఒక పాలసీ అయితే, దాన్ని ఎప్పుడైనా మార్చవచ్చా? కోర్టులు ప్రభుత్వ విధానాన్ని నిర్దేశించ గలవా వంటి ప్రశ్నలు రాజ్యాంగంలో ఈ విషయంపై ఉన్న ఖాళీని గుర్తించేలా చేశాయి. నిజానికి ఇదొక సంక్షోభం!ఏదో కారణంగా విశాఖపట్టణం రాజధానిగా వద్దనుకున్నారు. విశాఖ కాకపోతే ‘మావిగ¯Œ ’ పేరుతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాలను కలుపుతూ 110 కిలోమీటర్ల కారిడార్ రాజ ధాని ప్రాంతం అయితే బాగుంటుందన్నది మంచి ప్రతిపాదన. మచిలీపట్నం వద్ద జగన్ ప్రభుత్వం నౌకాశ్రయ (పోర్టు) నిర్మాణం చేపట్టింది. మచిలీపట్నం–విజయవాడకు, విజయవాడ–గుంటూరు మధ్య ఆరు వరుసల జాతీయ రహదారులు ఉన్నాయి. విజయవాడ శివార్లలో ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అమరావ తిలో పెట్టే 10 శాతం ఖర్చుతోనే ఇక్కడ రాజధాని సాధ్యం అవుతుందని చెబుతుంటే వినేవాళ్లెవరు? పారదర్శకత ఉందా?తెలుగు ప్రజలందరికీ ఇది చరిత్రాత్మకమైన రోజని టీడీపీమంత్రులు సంతోషపడుతున్నారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందనీ, కృష్ణానది తీరంలో అమరావతి నిర్మించా లనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమనీ, ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుగుతోందనీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. బాగానే ఉంది కానీ అది ఏపీ ప్రభుత్వ నిర్ణయమైతే, పార్లమెంట్ చట్టం అవసరం ఎందుకు వచ్చింది? పైగా ఇంతటి భారీ వ్యయాలపై, పారదర్శకత లోపంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అవసరమని చెప్పడం, ఆ నిధుల మూలాలు స్పష్టంగా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇది రాజ్యాంగబద్ధ విశ్లేషణ. ప్రాంతాల వారీగా, కులాల వారీగా రాజధాని నిర్మాణానికి ప్రతిబం«ధకాలు గమనించక తప్పదు. మౌలిక సదుపాయాలకు గాను లక్ష ఎకరాలకు ఎకరానికి 2 కోట్ల చొప్పున 2 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతున్నది. ఇంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిది అంటూ పార్లమెంట్లో బిల్లు ఎలా పెడతారు అన్న ఆయన ప్రశ్న కీలకమైనది. అలాగే సచివాలయానికి 52 లక్షల చదరపు అడుగుల స్థలం కావాలనడం ఆశ్చర్యం కలిగించే మరో అంశం. తెలంగాణలో కొత్త సచివాలయానికి 600 కోట్ల రూపాయలు ఎక్కువ అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు కావాలి? అనేక ప్రశ్నలు, గందరగోళాలు, కుంభకోణాల గండాలను దాటి, 12 సంవత్సరాల తరువాతైనా ఒక స్థిరమైన రాజధాని వస్తుందా?-వ్యాసకర్త కేంద్ర సమాచార సంఘం మాజీ కమిషనర్-మాడభూషి శ్రీధర్ -
‘మావిగన్’ ప్రతిపాదనతో టీడీపీలో వణుకు మొదలైంది’
సాక్షి,అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ‘మావిగన్’ ప్రతిపాదనకు టీడీడీలో వణుకు మొదలైందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అంతులేని కథలా సాగుతున్న అమరావతిని పూర్తి చేయలేనని చంద్రబాబే ఇవాళ ప్రెస్ మీట్లో అంగీకరించారని, ప్రత్యామ్నాయంగా వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మావిగన్ ఆలోచనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మంత్రం అవుతుంది. అమరావతి కోసం రాష్ట్రాన్ని దివాళా తీయించడం మానుకోవాలని చంద్రబాబుకు ఆయన హితవు పలికారు.అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా పూర్తి కాదని, దానికి బదులు కేవలం 20 వేల కోట్లతో పూర్తయ్యే మావిగన్ ఆలోచనే సరైనదని అంబటి రాంబాబు తెలిపారు. దీనిపై ప్రజలు కూడా ఆమోదించే పరిస్ధితికి వస్తున్నారని అన్నారు. ఇది తట్టుకోలేకే ఎల్లో మీడియా, పసుపు పార్టీలు ట్రోలింగ్స్ నడుపుతున్నాయని, త్వరలోనే అవన్నీ పటాపంచలు అవుతాయన్నారు.ప్రెస్ మీట్లో అంబటి రాంబాబు ఇంకేమన్నారంటే... జగన్ చెప్పిన మావిగన్పై రాష్ట్రంలో చర్చరెండు, మూడు రోజుల నుంచీ రాష్ట్రవ్యాప్తంగా మావిగన్ అనే పదం మీద చర్చ జరుగుతోంది. తెలుగు ప్రజలు ఉన్న ప్రతీ చోటా ఈ చర్చ జరుగుతోంది. అద్భుతమైన చర్చకు ప్రజలు ముందుకొచ్చారు. మావిగన్ అంటే ఏంటి అని ఆలోచిస్తున్నారు. చంద్రబాబుకు డిక్షనరీలో ఈ పదం కనిపించడం లేదంట. ఉడా, తుడా, గుడా అంటే మాత్రం కనిపిస్తున్నాయా ?, మావిగన్ అనే ఓ కొత్త ఆలోచనను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం తెరపైకి తెచ్చారు. ఏ విధంగా ఆయన దీన్ని తెచ్చారో అంతా చూశారు. చంద్రబాబు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాడు.అది తెలియక చేస్తున్నాడో, మితిమీరిన తెలివితేటల వల్ల చేస్తున్నాడో అర్దం కాదు. ఓ సాధ్యం కాని ప్రతిపాదన పెట్టి అంతులేని కథలా లాగుతున్నాడు. ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు. చంద్రబాబు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు 50 వేల ఎకరాలు అన్నాడు, ఇప్పుడు లక్ష ఎకరాలు అంటున్నాడు. తన బంధుమిత్రులకు అమరావతిని దోచిపెట్టే కార్యక్రమం తప్ప రాజధానిని అభివృద్ధి చేసి గ్రోత్ ఇంజన్ గా తయారు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు లేదు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆ విషయం ఇట్టే అర్దమవుతోంది.2029కి అమరావతి పూర్తి కాదని చంద్రబాబే ఒప్పుకున్నారు2028-29కి రాజధాని అమరావతి పూర్తి కాదనే విషయాన్ని చంద్రబాబు ఇవాళ ఒప్పుకున్నారు. గతంలోనూ ఇలాగే పూర్తి చేయకుండా అన్నీ తాత్కాలికం చేశారు. ఈ 2028-29కి కూడా ఆ ఏడు భవనాలు పూర్తి చేస్తే చేస్తాడు, లేకపోతే అవీ చేయడు. టీడీపీ వాళ్లు కూడా చంద్రబాబు ప్రెస్ మీట్ ను ఓసారి పరిశీలిస్తే ఇదే అర్థమవుతుంది.2028-29కి ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తామన్నారు. నవనగరాలు మాత్రం గాలికి పోయాయి. ఈ ఏడు బిల్డింగ్లు పూర్తి చేస్తే చాలన్న ప్రయత్నం చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో వైఎస్ జగన్ మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కలిపి మావిగన్ గా తయారవుతుందని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా దాన్ని ఆమోదించే దశకు వస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు అమరావతిని పూర్తి చేయలేడన్న విషయం అందరికీ అర్ధమైంది.ఆయన చెప్పిన తరహాలో చేయాలంటే 2 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్ర ఆర్దిక పరిస్జితి ఎలా ఉంది ? ప్రభుత్వం చేయాల్సిన పనులకే డబ్బులు లేవు, ఇక రాజధాని ఎలా పూర్తవుతుంది ? కాబట్టి 2 లక్షల కోట్లు పెట్టి అమరావతి పూర్తి చేస్తానన్న మాట బూటకంలా ఉంది తప్ప వాస్తవంగా పూర్తి చేసే పరిస్ధితి లేదన్నది అర్దమవుతోంది. చంద్రబాబు ఏడు బిల్డింగ్ లు పూర్తి చేస్తాను అన్నాడు తప్ప మొత్తం రాజధాని పూర్తి చేస్తానన్న ధైర్యం చేయలేకపోతున్నాడు. అంటే అప్పులు తెస్తారు, కాంట్రాక్టులు ఇస్తాడు, కమిషన్లు తీసుకుంటాడు, కోట్లు కోట్లు తీసుకుంటాడు తప్ప రాజధాని మాత్రం పూర్తి చేయడు. ఇప్పటికీ ఏడు బిల్డింగ్ లు పూర్తి చేసి చేతులు దులుపుకునే పరిస్ధితుల్లో ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడు దిగివచ్చినా దాన్ని పూర్తి చేయలేడు, చంద్రబాబు అంత పెద్ద ప్లాన్ వేశాడు మరి. 2 లక్షల కోట్లు ఖర్చుపెడిటే నీళ్లు, కరెంటు, డ్రైనేజీ, రోడ్లు వస్తాయి తప్ప నగరం ఏర్పడదు. నగరం నిదానంగా ఏర్పడితే అప్పటికి చంద్రబాబూ ఉండదు, ఎవరూ ఉండరు.మావిగన్ ట్రోలింగ్స్కు వైఎస్సార్సీపీ భయపడదుఅమరావతి తీర్మానం అసెంబ్లీలో తప్ప మండలిలో పెట్టలేదు. లోక్ సభ, రాజ్యసభలో బిల్లు తెచ్చారు. అమరావతి రాజధానిని మార్చే అవకాశమే లేదంటున్నారు. ఎందుకు లేదు ?, రాజ్యాంగాన్నే సవరిస్తుంటే, అసెంబ్లీలో ఒక చట్టం చేస్తే సవరించలేరా ?, ఇది కూడా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి మావిగన్ ఆలోచనను తెరపైకి తెచ్చారు. దీంతో తండ్రీ కొడుకులకు భయం పట్టుకుంది. ఈ చర్చలోకి జనం వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా గందరగోళం చేద్దామని వెయ్యి, రెండు వేల సోషల్ మీడియా పేజీల్ని, యూట్యూబ్ ఛానల్స్ కొనేసి ట్రోల్ చేస్తున్నారు.ఈ ట్రోలింగ్స్ కు మేం భయపడతామా ?, అందులో వాస్తవం ఉంటే ఈ ట్రోలింగ్స్ అన్నీ పటాపంచలైపోతాయి. మావిగన్ ఆలోచన తెచ్చాక ఆంధ్ర రాష్ట్రంలో బృహత్తర చర్చ జరుగుతోంది. అమరావతి ఎలాగో పూర్తి కాదు, అందులో పెట్టుబడులు పెట్టినా వృథా అనే నిర్ణయానికి చాలా మంది వచ్చేశారు. అందుకే ఏంటీ మావిగన్, అమరావతి ఏంటనే చర్చ జరుగుతోంది. గుంటూరు బస్టాండ్లో బస్సెక్కి అమరావతికి టికెట్ తీసుకుంటే అమరావతి గుడికి తీసుకెళ్తారు తప్ప ఎక్కడికి తీసుకెళ్లాలో తెలియదు.20 వేల కోట్లతో పూర్తయ్యే గ్రోత్ ఇంజన్ మావిగన్ ఈ మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణం. అమరావతి విస్తీర్ణం చూస్తే 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే. కేవలం 20 వేల కోట్లతో మావిగన్ ను పూర్తి చేయొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మౌలిక సదుపాయాలు, భవనాలు, రోడ్లు ఉన్నాయి. కొత్తగా ఏదో చేయాల్సిన అవసరం లేదు. కానీ అమరావతిలో మాత్రం విద్యుత్, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కోసం భారీ ఖర్చు పెట్టాల్సిందే. మావిగన్ అనేది కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు మూడు జిల్లాలతో కూడుకున్నది. డైనమిక్ పవర్ హౌస్ లాంటిది. అమరావతి అనేది ఓ చిన్న ప్రాంతం. ఇప్పుడే అభివృద్ది చెందుతున్న ప్రాంతం. మావిగన్ 60 లక్షల జనాభా ఉన్న విస్తృతమైన కారిడార్. అమరావతిలో ఉన్నదీ పరిమితమైన ప్రజలు. మావిగాన్ విస్తరించిన అభివృద్ధి మోడల్. అమరావతి మాత్రం కేంద్రీకృతమైన మోడల్. తక్కువ రిస్క్ తో అభివృద్ధి చేసే ఎకో సిస్టమ్ మావిగాన్ పరిధిలో ఉంది. ఎక్కువ ఖర్చు లేకుండా అభివృద్ది చెందుతుంది. అమరావతి మాత్రం ఖరీదైన రిస్క్ ప్రాజెక్ట్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పట్టణంలో నీళ్లు తోడి నదిలో పోసే పరిస్ధితి అమరావతిలో ఉంది. అంత లోతట్టు ప్రాంతాన్ని చంద్రబాబు ఎంచుకోవడం వెనుక ఆయన స్వార్ధ ప్రయోజనాలే ఉన్నాయి. కానీ మావిగాన్ అనేది భవిష్యత్తు వాగ్దానం. అనేక రకాల ఆదాయాన్ని అందించే మోడల్. అమరావతి కేవలం ఆ ఒక్క నగరంపైనే ఆధారపడిన మోడల్. మావిగాన్ లో మూడు నగరాల ఆదాయం ఉంది. అమరావతి పరిమిత పాలనా కేంద్రం మాత్రమే. కాబట్టి మావిగాన్ అనేది అద్భుతమైన ఆలోచన.చంద్రబాబే ఊసరవెల్లి2014లో రాష్ట్రం విడిపోతే ఇప్పటికీ పరిపూర్ణమైన రాజధాని లేని పరిస్ధితి వచ్చిందంటే అందుకు కారఇం చంద్రబాబే. గ్రీన్ పీల్డ్ రాజధాని కడతామని చెప్పి, రెండోసారి అధికారం ఇచ్చినా పూర్తి చేయలేని పరిస్దితిలో ఉన్నారు. ఇవాళ చంద్రబాబు ప్రెస్ మీట్లో కొత్తగా ఏమీ లేదు. ఈనాడులో ఆరేడు, పేజీల్లో ఉండే మ్యాటరే. అమరావతికి కులం రంగు పూశారంటున్న చంద్రబాబు.. నిన్న రేణుకా చౌదరి రాజ్యసభలో చెప్పిన మాటలు ఓసారి గమనించాలి. కులం రంగు పులుముకుంది మీరే, మేము కాదు. ఈనాడులో కిరణ్ జగన్మోహన్ రెడ్డి గురించి నయవంచన, ఈసరవెల్లి అని రాశారు. ఈ రాష్ట్రంలో ఊసరవెల్లి అంటే గుర్తుకొచ్చేది చంద్రబాబే. గతంలో ఎన్నో ఊసరవెల్లి వేషాలు వేశారు. బీజేపీతో సయోధ్య చేస్తారు, తిరిగి బీజేపీని వ్యతిరేస్తారు. మళ్లీ కాంగ్రెస్ తో సయోధ్య చేస్తారు, తిరిగి అదే కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు. జగన్ మాట మీద నిలబడే వ్యక్తి అనేది గుర్తుంచుకోవాలి. ఈనాడు కిరణ్ మనుషులు, చంద్రబాబు ముఠాతో కలిసి అమరావతిలో దోపిడీ చేస్తున్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారు. కానీ అమరావతిలో రెండు లక్షల కోట్లు పెట్టే శక్తీ లేదు, కనుచూపు మేరలో రాదు. కాబట్టి అమరావతి పూర్తయ్యే పరిస్దితి లేదు. అందుకే మావిగన్ మాత్రమే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మంత్రంగా మారుతుందని అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. -
ఇది చూసి నవ్వుకునేరు.. బాబోరు మళ్లీ వేసేశారు..!
సాక్షి,అమరావతి: చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతానికి పర్యాయ పదం. అయితే, ఆయన ధోరణి రెండు నాల్కుల తీరు అనేది మరోసారి బయటపడింది. తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆయన తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఇప్పుడు తాను విభజనకు వ్యతిరేకం కాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకునే చంద్రబాబు తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్ అని చెప్పడంపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ సిలిండర్తో వంట చేయొచ్చని చెప్పింది తానేన్నారు. గతంలో తన వల్లే అందరికీ సెల్ఫోన్లు వచ్చాయని కూడా చెప్పుకున్నారు. గతంలో ఇలాగే 2016లో దేశంలో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనుక తన పాత్ర ఉందని, ప్రధాని మోదీకి తానే సూచించానని ప్రచారం చేసుకున్నారు. అవినీతిని తగ్గించేందుకు పెద్ద నోట్లను రద్దు చేసి డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలని తానే ఆలోచించానని చెప్పి .. జనం ముందు అభాసుపాలయ్యారు బాబోరు..ఈ విధంగా, తరచూ తనకే క్రెడిట్ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తూ, వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడటం ఆయనలోని విచిత్ర ధోరణిని బయటపెట్టుకుంటున్నారు. ప్రజలు ఏమనుకుంటారో అనేది సంబంధం లేకుండా ఏ ఘనతనైనా ఇట్టే తన ఖాతాలో వేసుసుకునే బాబుగారు.. తాజాగా తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్(నా మేధస్సు వల్లే పుట్టినది) అని చెప్పుకోవడం చూసి..బాబోరు మళ్లీ వేసేశారు అనుకుంటూ అదేదో సినిమాలోని సీరియస్ కమెడియన్ను గుర్తు చేసుకుంటున్నారు. -
అమరావతి టైం లైన్పై చేతులెత్తేసిన చంద్రబాబు
సాక్షి,అమరాతి: రాజధాని భూములను రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంపై ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి. అమరావతి నిర్మాణం టైమ్లైన్పై చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ‘అమరావతి నిర్మాణం నిరంతర ప్రక్రియ’ అని వ్యాఖ్యానించారు. అమరావతి పూర్తికి ఎంత ఖర్చు అవుతుందో కూడా ఆయన వెల్లడించలేదు.పైగా, రాజధాని నిర్మాణంతో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని, భవనాల నిర్మాణంపై పన్నుల ద్వారా 20 శాతం ఆదాయం వస్తుందని చెప్పారు. మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయిస్తామని, వాటి ద్వారా ఆదాయం వస్తుందని తెలిపారు. అభివృద్ధి చేసిన భూములను తిరిగి రైతులకు అప్పగిస్తామని, మిగతా భూములను వేలం వేసి రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్ముతామని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజల్లో గందరగోళం నెలకొంది. -
అమరావతికి కాదు.. బిల్లుకు వ్యతిరేకం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. అమరావతి ప్రస్తుత బిల్లుకు మాత్రమే వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. రాజ్యసభలో అమరావతిపై చర్చలో భాగంగా వైఎస్సార్సీపీ ఎంపీల గొంతు నొక్కారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోందన్నారు.వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా మా పార్టీకి తక్కువ సమయం కేటాయించారు. మా పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం ఎలా చేశారో రాజ్యసభ చైర్మన్కి వివరించాము. రాజ్యసభలో మాకు ఏడుగురు ఎంపీలు ఉన్నారు. మాకు 20 నిమిషాల సమయం ఇవ్వాలి. మాకు రాజ్యసభలో 5 నిమిషాలు సమయం ఇచ్చి మైక్ కట్ చేశారు. మాకన్నా చిన్న పార్టీలైన బీఆర్ఎస్, టీడీపీకి ఎక్కువ సమయం ఇచ్చారు. బీఆర్ఎస్ ఎంపీలకు ఒక్కొక్కరికి 10 నిమిషాలు సమయం ఇచ్చారు. మేము చెప్పిన అంశాలను ఉపరాష్ట్రపతి సానుకూలంగా విన్నారు. అడ్డుకోవడం వల్ల మిగిలిపోయిన మా ప్రసంగం రికార్డులలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు మేము వ్యతిరేకం. రాజధాని రైతుల దగ్గర 50 వేల ఎకరాలు తీసుకున్నారు 29వేల మంది రైతులకు న్యాయం చేయమని అడిగాం. అమరావతి రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో బిల్లులో పెట్టమని అడిగాం. అమరావతి నిర్మాణం పేరుతో దోపిడీ, అవినీతి జరుగుతోంది. స్క్వేర్ ఫీట్కు 14 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా నిర్మాణానికి ఇంత ఖర్చు చేయలేదు. ఇదంతా ప్రజా ధనాన్ని లూటి చేయడమే. కోల్కత్తా, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎన్ని ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మాకు కేటాయించిన సమయంపై రాజ్యసభ చైర్మన్కి వివరించాము. నిబంధనలకు విరుద్ధంగా రాజ్యసభ గ్యాలరీలో టీడీపీ నేతలని టీవీలో చూపించారు. గ్యాలరీలో ఉన్న వారి ఫోటోలను పత్రికలలో వేశారు. దీనిపై విచారణ జరగాలి’ అని డిమాండ్ చేశారు. -
కమ్మ రాజధాని.! బాబు సైలెంట్..
-
జగన్ వస్తాడని బాబుకు అర్థమైంది.. అందుకే చట్టబద్ధత బిల్లు
-
ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదు
సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగదని 90 ఏళ్ల వృద్ధురాలు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట కన్నీటి పర్యంతమైంది. సీఆర్డీఏ అధికారులు తనకున్న కాస్త భూమిని లాక్కుని జీవిత చరమాంకంలో అధోగతి పాల్జేస్తున్నారని గోడువెళ్లబోసుకుంది. మతిస్థిమితం లేని మనుమరాలితో అష్టకష్టాలు పడుతుంటే.. తన భూమిని వెనక్కి ఇవ్వకుండా ప్రభుత్వం ముప్పుతిప్పలు పెడుతోందని వాపోయింది. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను రాజధాని ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చెందిన నెల్లూరి శేషగిరమ్మ కలిసి తన ఆవేదనను వెళ్లబోసుకుంది. శేషగిరమ్మ దీనగాథను పరికిస్తే..చంద్రబాబు భూ దాహం 90 ఏళ్ల వృద్ధురాలిని రోడ్డున పడేస్తే.. బలవంతపు భూదోపిడీ ఆమె భర్తను మృత్యు ఒడిలోకి నెట్టేసింది. నెల్లూరి శేషగిరమ్మ కుటుంబం రాయపూడిలో తమకున్న ఐదు సెంట్ల స్థలంలో నిర్మించుకున్న చిన్న ఇంటిలో నివసిస్తోంది. 2015లో సీఆర్డీఏ అధికారులు ఆ స్థలం మీదుగా రోడ్డు వెళ్తుందని.. భూమికి భూమి ఇచ్చి, ఇంటికి పరిహారం ఇస్తామని చెప్పి నమ్మబలికారు. శేషగిరమ్మ భర్త శేషగిరి రావు (100ఏళ్లు)తో తెల్ల కాగితాలపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు.రెండేళ్ల తర్వాత శేషగిరమ్మ బ్యాంకు ఖాతాలో అత్యంత హీనంగా రూ.2,500 కౌలు వేశారు. దీంతో ఆందోళన చెందిన బాధితురాలి భర్త శేషగిరిరావు తన భూమిని ప్రభుత్వం తీసేసుకుందని గ్రహించి 2017లో తమకు కౌలు వద్దని, భూమిని వెనక్కి ఇవ్వాలని సీఆర్డీఏ కార్యాలయం చుట్టూ తిరిగి అలిసిపోయాడు. కేన్సర్తో బాధపడుతున్న అతడు మృతి చెందారు. కొంతకాలానికే కుమార్తె సైతం బ్రెయిన్ స్ట్రోక్తో మృతి చెందింది. అప్పటినుంచి మతిస్థిమితం లేని 40 ఏళ్ల మనుమరాలితో బిక్కబిక్కుమంటూ శేషగిరమ్మ ఒంటరి జీవనం సాగిస్తోంది. ప్రభుత్వ దుర్నీతిపై కోర్టుకు వెళ్లిన వృద్ధురాలు తన భూమి తిరిగి ఇప్పించాలని.. లేదంటే కారుణ్య మరణానికి అనుమతించాలని వేడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.ఈ క్రమంలోనే న్యాయ పోరాటం చేసూ్తనే తనకు సాయం చేయాలని వైఎస్ జగన్ను కలుసుకుని గోడు వెళ్లబోసుకుంది. గతేడాది అక్టోబర్లో తన స్థలంలోని ఉంటున్న ఇల్లు అగ్నికి ఆహుతి కాగా.. ఫైర్ అధికారులు సర్టిఫికెట్ కూడా ఇవ్వట్లేదని వాపోయింది. స్వశక్తి, ఆత్మాభిమానంతో జీవించే శేషగిరమ్మ ఈ వయసులోనూ ఎవరి ఆర్థిక సహాయాలను కోరుకోవట్లేదు. కొంతమంది దాతలు, ఎన్నారైలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చినా వద్దని.. తన భూమి తిరిగి వస్తే చాలని తిరస్కరించింది. ఇంతటి విలువలు కలిగిన వృద్ధురాలి నుంచి ప్రభుత్వం భూమి లాక్కోవడం సిగ్గుచేటని, వైఎస్సార్సీపీ తరఫున పూర్తిగా అండగా నిలుస్తామని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆమెకు భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన ఏపీ నూతన బార్ కౌన్సిల్ సభ్యులు న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంపొందించండి∙ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు వైఎస్ జగన్ సూచన∙కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు సాక్షి, అమరావతి: న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించాలని, న్యాయ సేవలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలని ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులకు మాజీ సీఎం వైఎస్ జగన్ సూచించారు. నూతనంగా ఎన్నికైన ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వారిని వైఎస్ జగన్ అభినందించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారంలో ముందుండాలని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మలసాని మనోహర్రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి, నూతన బార్ కౌన్సిల్ సభ్యులు కొమ్మసాని శ్రీనివాసులరెడ్డి(హైకోర్టు), రోళ్ల మాధవి(హైకోర్టు), కొవ్వూరి వెంకట్రావిురెడ్డి(హైకోర్టు), ఆలూరు రామిరెడ్డి(అనంతపురం), వట్టిజొన్నల బ్రహ్మారెడ్డి(గుంటూరు), కృష్ణారెడ్డి బి.వి (ఏలూరు) పాల్గొన్నారు. -
అమరావతి బిల్లుకు రాజ్యసభలోనూ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రపదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు–2026 గురువారం రాజ్యసభలోనూ ఆమోదం పొందింది. బిల్లుకు బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్, బీఆర్ఎస్, బీజేడీ, ఆప్, జేడీయూ సహా పలు పార్టీలు మద్దతు ప్రకటించాయి. రెండు గంటల చర్చ అనంతరం ఈ బిల్లుకు సభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం దక్కినట్లయింది. లోక్సభలో బుధవారం ఆమోదం పొందిన బిల్లును గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాలు ముగిశాక ప్రవేశపెట్టారు. బిల్లుపై మొత్తం 19 మంది ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లులో అనేక అంశాలపై స్పష్టత లేదంటూ, బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ నుంచి వాకౌట్ చేసింది. వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటన్న విపక్షాలు... బిల్లుపై మాట్లాడిన అన్ని పార్టీలు ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం అందించే సాయం, ఎప్పటిలోగా నిర్మాణం పూర్తి చేస్తాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. రాజధానికి భూములిచ్చిన రైతులను ఆదుకునే ప్రక్రియ, పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేయాలని కోరాయి. తన అవసరానికి ప్రాంతీయ పార్టీలను వాడుకొని వదిలేయడం బీజేపీకి అలవాటని, వారితో జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. విభజన జరిగి పదేళ్లయినా ఇంతవరకు ఏపీ, తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని, కడప స్టీల్ ప్లాంట్, తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పూర్తి చేయలేదని ఎంపీలు పేర్కొన్నారు. ఈ దృష్ట్యా అమరావతిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో కేంద్రం నిర్దిష్ట కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తృణమూల్ ఎంపీ మహ్మద్ నదీముల్ హక్ మాట్లాడుతూ, ‘బిహార్లో జేడీయూ నితీశ్కుమార్కు, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండేకి ఏమి జరుగుతుందో చూస్తున్నారు. వాడుకొని వదిలేయడం (యూజ్ అండ్ త్రో పాలసీ) బీజేపీ విధానం. కావున టీడీపీ అప్రమత్తంగా ఉండాలి’ అని సూచించారు. ఆప్ ఎంపీ సంజయ్సింగ్ మాట్లాడుతూ, ‘కేంద్రంలోని బీజేపీ వైఎస్సార్సీపీకి మూడు రాజధానులు చేయమని ప్రోత్సహించింది.అమరావతిని రాజధాని చేయమని టీడీపీకి చెబుతోంది. బీజేపీతో జాగ్రత్త..చాలా పార్టీలను మోసం చేసిన చరిత్ర బీజేపీకి ఉంది. కావున జాగ్రత్త’ అంటూ హితవు పలికారు. బీజేడీ తరఫున మాట్లాడిన నిరంజన్ బిషీ..పోలవరంతో ఒడిశాలో ముంపుపై సమగ్ర అధ్యయనం జరగాలని, నిరాశ్రయులకు సరైన పరిహారం ఇచ్చేలా చూడాలని కోరారు. ఇక ప్రస్తుత రూపంలో ఉన్న బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ‘అమరావతిని మేమెన్నడూ వ్యతిరేకించలేదు. కానీ ఇప్పటికే 50వేల ఎకరాలు రైతుల నుంచి సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక్క శాశ్వత భవనాన్ని నిర్మించలేదు. అలాంటి రాజధానిని ఎప్పటిలోగా పూర్తి చేస్తారు. నిర్మాణం పూర్తయ్యేందుకు అవసరమయ్యే రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారన్న దానిపై స్పష్టత లేదు’ అని వైఎస్సార్సీపీ తరఫున మాట్లాడిన పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి పరిశీలనకు బిల్లు..బిల్లుపై చర్చ ముగిసిన అనంతరం మంత్రి నిత్యానంద్ రాయ్ సభకు బిల్లు వివరాలు వెల్లడించారు. అనంతరం బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఉభయ సభల్లోనూ బిల్లుకు ఆమోదం లభించడంతో తదుపరి ఆమోదానికి బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనున్నారు. -
పెట్టరా పేరు అమరావతి.. పిలవరా కమ్మరావతి!
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. గురువారం రాజ్యసభలో ‘ఏపీ పునర్విభజన (సవరణ) బిల్లు–2026’పై జరిగిన చర్చలో ఆమె పాల్గొంటూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కంటితుడుపు మాత్రమే.. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’ అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్ టచ్ (కంటితుడుపు చర్య) మాత్రమే.. క్షేత్రస్థాయిలో ఏమీ మారలేదు. 12 ఏళ్ల తర్వాత అమరావతి రాజధాని అని ప్రభుత్వం నిర్ణయిస్తే.. మేము వారిని మెచ్చుకోవాలా? కృతజ్ఞతలు చెప్పాలా? ఇది జాతీయ అవమానం. విభజన చట్టంలోని హామీలైన కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు ఏమయ్యాయి? 1.42 లక్షల కోట్ల ఆస్తుల పంపిణీ ఎందుకు తేలలేదు? ఈ సభ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి దశాబ్దంపైగా సమయం తీసుకోవడం మీ వైఫల్యం కాదా?‘ అని రేణుక చౌదరి కేంద్రాన్ని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతోందని రేణుకా చౌదరి ఆరోపించారు. ‘గుజరాత్లో రాజధాని అభివృద్ధికి వేల కోట్లు కుమ్మరిస్తున్నారు.. కానీ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని మాత్రం కించపరుస్తున్నారు’ అని మండిపడ్డారు. ఆ ఐదు మండలాలు.. తెలంగాణలో కలపాలి..భద్రాచలం రామాలయ ఆస్తులు ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం మండలాల ప్రజలు ప్రస్తుతం ‘నో మ్యాన్స్ ల్యాండ్’లో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘అటు ఏపీలోనూ, ఇటు తెలంగాణలోనూ సంక్షేమ పథకాలు అందక వారు నరకం చూస్తున్నారు. ఆ మండలాలను వెంటనే తెలంగాణలో కలపాలి‘ అని డిమాండ్ చేశారు. విభజన హామీల అమలుపై పార్లమెంటులో ‘స్టేటస్ పేపర్’ విడుదల చేయాలని, ప్రతి హామీకి సంబంధించి కాలపరిమితితో కూడిన ‘రోడ్ మ్యాప్’ ప్రకటించాలని కోరారు. -
రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలు
సాక్షి,అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం, రికార్డు స్థాయిలో మద్యం వినియోగం జరుగుతోంది. బెల్టు షాపులు, పర్మిట్ రూమ్ల ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి.గత ఏడాదిలో బీర్ వినియోగం 70.29 శాతం పెరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాలు రూ. 31,237 కోట్లకు చేరాయి. మొత్తంగా ప్రభుత్వం 414 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిపింది. గతంలో 362 లక్షల కేసులు ఉండగా, ఇప్పుడు 414 లక్షలకు పెరిగింది.బీర్ వినియోగం కూడా గణనీయంగా పెరిగింది. 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు పెరిగి, మొత్తం 232 లక్షల కేసుల బీర్ను ప్రజలు వినియోగించారు.ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఈ పరిస్థితిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. మద్యం నియంత్రణను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మకు YS జగన్ భరోసా
-
అమరావతి పేరుతో చంద్రబాబు ఆంధ్రప్రజలను మోసం చేస్తున్నారు
-
వైఎస్ జగన్ ఎదుట కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళా రైతు
సాక్షి, తాడేపల్లి: రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట అమరావతి వృద్ధ మహిళా రైతు శేషగిరమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ శేషగిరమ్మ గురువారం వైఎస్ జగన్ను కలిశారు.రాజధాని కోసం రాయపూడిలో తన భూమిని అక్రమంగా లాక్కున్నారని, నష్టపరిహారం ఇవ్వకుండా తనను మోసం చేశారని వాపోయారు. తనకు న్యాయం చేయాలని రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదన్నారు. ఈ సందర్భంగా శేషగిరమ్మకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. ఆమెకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో శేషగిరమ్మ కుటుంబ సభ్యులు బ్రహ్మేంద్ర కుమార్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
అమరావతి కాదు.. కమ్మరావతి ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
-
‘వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్’
సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ ‘మావిగన్’ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ గ్రోత్ ఇంజిన్లా పని చేస్తుందన్నారు. గుంటూరు నుండి మచిలీపట్నం వరకు పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. భూముల రేటు పెరుగుతుంది. అది ప్రజలకే ఉపయోగం. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది’’ అని కాసు మహేష్రెడ్డి వివరించారు.‘‘చంద్రబాబు అమరావతి కంటే ముందు నూజివీడు, గన్నవరం అంటూ రకరకాల పేర్లు ఎందుకు చెప్పారు?. తమ వారు అమరావతిలో భూములు కొన్నాక అమరావతిని రాజధానిగా ప్రకటన చేశారు. వైఎస్ జగన్ చేసిన మావిగన్ ప్రతిపాదనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం-విజయవాడ-గుంటూరు కారిడార్ ఒక గ్రోత్ ఇంజిన్లా ఉంటుంది. మచిలీపట్నం పోర్టు రాకతో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతోంది. చంద్రబాబు అమరావతి నిర్మాణాల పేరుతో రాష్ట్ర ప్రజల భవితవ్యాన్ని పణంగా పెట్టారు...వైఎస్ జగన్ మావిగన్ ప్రతిపాదనతో చంద్రబాబు షాక్ తిన్నారు. ప్రజల నుండి జగన్ ప్రతిపాదనకి మంచి సపోర్ట్ వస్తోంది. అమరావతిలో రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి?. చదరపు అడుగు రూ.4 వేలు అయ్యేదాన్ని రూ.14 వేలకు పెంచారు. ఇందులో చంద్రబాబు, ఇతర మంత్రులు పొందుతున్న ముడుపులు ఎంత?. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు కలిసి విశ్వనగరంగా మారుతుంది...అమరావతిలో సొంత భూములకు ధర పెంచుకోవటానికే రాజధానిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. వైఎస్ జగన్ ప్రతిపాదనపై చర్చ జరగాలి. మావిగన్ అనేది ఒక సూచన మాత్రమే. రాజధాని పేరు మీద చర్చించాలి గానీ ట్రోల్స్ చేస్తే ఏం లాభం?. రూ.20 వేల కోట్లతో పూర్తయ్యే రాజధానిని రూ.2 లక్షల కోట్ల ఖర్చు అవసరమా?. దీనిపై ప్రజలే ఆలోచించు కోవాలి. చంద్రబాబు తొలుత సమైక్యాంధ్ర అన్నారు. ఆ తర్వాత తెలంగాణ కోసం లేఖ రాశారు. రెండు నాల్కల ధోరణి చంద్రబాబుదే’’ అని కాసు మహేష్రెడ్డి దుయ్యబట్టారు. -
అమరావతి బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ?
-
అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు : వైవీ సుబ్బారెడ్డి
న్యూఢిల్లీ: అమరావతి పేరుతో పెద్ద డ్రామా చేశారు. శాసన ప్రక్రియను పాటించలేదు. ప్రస్తుత రూపంలోని అమరావతి బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లుపై జరిగిన చర్చలో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.మండలిలో చర్చించకుండా తీర్మానం చేశారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని.. కేంద్ర ప్రభుత్వమే అఫిడవిట్ దాఖలు చేసింది.ఇప్పుడెలా రాజధానిపై బిల్లును ప్రవేశపెట్టారు. రైతుల నుంచి 50వేల ఎకరాలు తీసుకున్నారు. ఇప్పటివరకు శాశ్వత నిర్మాణాలు జరగలేదు. ఒక్కో ఎకరానికి రూ.2 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. రూ.2లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?. ఇప్పటికే వడ్డీలకు రూ.20వేల కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి. అమరావతి కోసం ఎనిమిదేళ్లలో రూ.7వేల కోట్లు ఖర్చు చేశారు. రెండేళ్లలోనే రూ.3.40లక్షల కోట్లు అప్పు చేశారు.అమరావతి వరదలతో మునిగిపోతుందని ఆధారాలు ఉన్నాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే మేం మూడు రాజధానులు చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా పెట్టాం. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా కర్నూల్ను జ్యూడీషియల్ క్యాపిటల్గా పెట్టాం. అమరావతిలో ప్రతి చదరపు అడుగుకు.. రూ.12వేలకు పైగా ఖర్చుపెడుతున్నారు. అమరావతి పేరుతో.. కుంభకోణాలు చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. అనంతరం రాజ్యాసభ నుంచి వైఎస్సార్సీపీ నేతలు వాకౌట్ చేశారు. -
‘కమ్మరావతి’.. రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కమ్మరావతి అని పిలవాలని అన్నారు. ఏపీ పునర్విభజన చట్టసవరణ బిల్లుపై రేణుకా చౌదరి మాట్లాడారు. ‘నేను ఇప్పటికే ముఖ్యమంత్రికి చెప్పాను పెట్టరా పేరు అమరావతి.. లేదంటే పిలవరా పేరు కమ్మరావతి. పెట్టు పేరు’అంటూ వ్యాఖ్యానించగా.. సభలో ఇతర ఎంపీలు.. రాజధాని పేరు కమ్మరావతి పెట్టమని చెప్పడమేంటని నవ్వుకున్నారు. -
జగన్ ప్లాన్ - B.. రాజధానికి కొత్త పేరు..! MAVIGUN
-
అమరావతిలో తినాలంటే ఎప్పటికీ తిండి దొరకదు తాగాలంటే టీ కూడా దొరకదు
-
కేవలం రాజధాని గుర్తింపు కోసం బిల్లు.. బాబు అసలు కుట్ర ఇదే
-
క్యాపిటల్ ముసుగులో బాబు వేలకోట్ల దోపిడీ ఆధారాలతో ఉతికారేసిన జగన్
-
భ్రమలు కల్పిస్తూ.. రాష్ట్రానికి ఏ రాజధానీ లేకుండా చేస్తున్నావ్
ఆచరణాత్మక ఆలోచన.. మావిగన్చెన్నై, ముంబై పోర్టు ఆధారిత సిటీలు. ఈ తరహాలోనే మచిలీపట్నం గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల జాతీయ రహదారి వెంబడి ప్రాంతాలను రాజధాని కారిడార్గా ప్రకటించండి. మచిలీపట్నం నుంచి తొలి రెండు అక్షరాలు ఎంఏ, విజయవాడలోంచి తొలి రెండు అక్షరాలు వీఐ, గుంటూరు నుంచి జీయూఎన్ తీసుకుని ‘మావిగన్’ (MAVIGUN) అని పేరుపెట్టండి. గన్ అంటే బాగుండదు.. జగన్ గుర్తొస్తారనుకుంటే వేరే పేరు పెట్టుకోండి. రాజధానిగా అభివృద్ధి చేయండి. అంతేకానీ రూ.2 లక్షల కోట్లు ఖర్చు అంటే అయ్యేది కాదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ఏడేళ్లు సీఎంగా ఉండి లక్ష ఎకరాల అమరావతిలో ఎంత వరకు కట్టారు? అమరావతి తన పెట్ ప్రాజెక్టు (మానస పుత్రిక) అని చెప్పే చంద్రబాబు ఏ మేరకు నిర్మాణాలు చేశారు? చంద్రబాబు డబ్బా కొట్టినట్టు అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అయ్యిందా? ఏ దేశం వెళితే ఆ దేశం బొమ్మలు చూపించి అదిగో.. ఇదే అమరావతి అంటారు. ఇప్పుడు అమరావతి ఎంత వరకు వచ్చింది? ఆ దేశాలు ఇక్కడ కనిపిస్తున్నాయా?కనీసం భూములు ఇచ్చిన రైతులకు హామీలను నెరవేర్చారా? మొదట తీసుకున్న 50 వేల ఎకరాల్లోనే కేవలం రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి సౌకర్యాల కల్పనకు ఎకరానికి కేంద్రానికి, బ్యాంకులకు చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం రూ.2 కోట్లు అవుతుంది. అంటే 50 వేల ఎకరాలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేయాలి. ఇంకా భవనాల ఖర్చు అదనం. దీనికే దిక్కులేదంటే మళ్లీ మరో 50 వేల ఎకరాలు అదనంగా సేకరిస్తున్నారు. దీనికి మరో రూ.లక్ష కోట్లు అవుతుంది. ఇలా అమరావతి బడ్జెట్ను ఎందుకు పెంచాల్సి వస్తోంది? నిర్మాణాలకు, అభివృద్ధికి డబ్బులు ఎలా వస్తాయి? లక్ష ఎకరాల్లో కేవలం రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. ఇదంతా చేయడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుంది? ఇంత సుదీర్ఘ సమయంలో రూ.2 లక్షల కోట్ల వ్యయం కాస్తా రూ.10 లక్షల కోట్లకు పెరుగుతుంది.భవిష్యత్తులో రాజధానిని ఎవరూ మార్చకుండా చట్టం తెస్తున్నామని చంద్రబాబు డ్రామా చేస్తున్నారు. అసెంబ్లీలో వీళ్లు చేయగా లేనిది.. అదే అసెంబ్లీలో మార్చలేరా? చట్టాలు చేసిన తర్వాత చట్ట సవరణలు చేయలేరా? ఈ విషయం చంద్రబాబుకు తెలిసినా, తన అవినీతిని కప్పిపుచ్చుకునే డ్రామా చేస్తున్నారు.2014 నుంచి ఇప్పటి వరకు 12 ఏళ్ల కాలంగా మనస్ఫూర్తిగా చంద్రబాబు ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇక్కడ కాపురం పెట్టారా? ఇప్పటికీ కూడా మీ కుటుంబాలన్నీ ఎక్కడున్నాయి? 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీసు చేశారు. ఒకవైపు సీఎంగా ఉంటూ హైదరాబాద్కు వెళ్లి వచ్చారు. ప్రతిపక్ష నాయకుడిగా 2024 ఎన్నికల వరకు వీళ్ల అడ్రస్ మొత్తం హైదరాబాద్. ఇప్పుడు కూడా వారానికి రెండు రోజులు అక్కడే. అదీ చంద్రబాబు తీరు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కొడుకైతే వారానికి నాలుగు రోజులు ఉంటే గొప్ప. పవన్ కళ్యాణ్ ఎప్పుడుంటాడో తెలీదు. ప్రత్యేకంగా ఒక్కొక్కరికి ఒక్కో విమానం. మమ్మల్ని తిట్టడానికే అసెంబ్లీ. నిజానికి మా ప్రశ్నలు ప్రజలను ఆలోచింపజేసేవి. - వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: చంద్రబాబు తన స్కామ్ల కోసం ఏ రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను దెబ్బ తీస్తున్నారని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కానిది.. అసాధ్యమైన దానిపై భ్రమలు కల్పిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. అమరావతి క్యాపిటల్(రాజధాని)ను సీఎం చంద్రబాబు దేశంలో అతి పెద్ద స్కామ్గా మార్చేశారని ధ్వజమెత్తారు. అమరావతి ప్రజల రాజధాని కాదని, స్కామ్ల రాజధాని అని అభివర్ణించారు. రాజధాని నిర్మాణ పనుల్లో చంద్రబాబు దోపిడీ ముందు వీరప్పన్ కూడా సరిపోడంటూ ఎద్దేవా చేశారు. అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే రాజధానికి చట్టబద్ధత పేరుతో డ్రామా చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డ్రామా చేస్తున్నారని స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతికి సంబంధించి నాణానికి రెండో పార్శ్వాన్ని సాక్ష్యాధారాలతో ఆయన వివరించారు. అమరావతి రాజధానిలో 12 ఏళ్ల క్రితం సీఎం చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారమే రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకే ఎకరానికి రూ.2 కోట్లు చొప్పున లక్ష ఎకరాలకు రూ.2 లక్షల కోట్లు వ్యయం చేయాల్సి వస్తుందన్నారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కేవలం రూ.8 వేల కోట్లే రాజధాని కోసం ఖర్చు చేశారని.. ఈ లెక్కన కనీస సదుపాయాలు కల్పించడానికే దశాబ్దాలు పడుతుందన్నారు. అప్పుటికి ఆ వ్యయం రూ.4 లక్షల కోట్లు అవుతోందో.. లేక రూ.10 లక్షల కోట్లకు చేరుతుందో అన్నారు. అప్పు తెచ్చిన నిధులు.. బడ్జెట్ ద్వారా కేటాయించిన నిధులు ఒక్క అమరావతికే ఖర్చు పెడితే.. రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల అభివృద్ధి మాటేంటని, ప్రభుత్వాలు బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన సంక్షేమం, మంచి మాటేంటని వైఎస్ జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి రాజధాని గుదిబండగా మారకూడదనే ఉద్దేశంతో.. తక్కువ పెట్టుబడితో రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్గా మారే అవకాశం ఉన్న విశాఖపట్నంను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా.. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలనుకున్నామని వివరించారు. సీఎం చంద్రబాబుకు అది నచ్చలేదని.. అందుకే వాటిని రద్దు చేశారన్నారు. రాష్ట్రాన్ని తక్కువ ఖర్చుతో గ్రోత్ ఇంజిన్గా మార్చాలనే ఉద్దేశంతో ఆర్నెల్ల క్రితం మేం ప్రతిపాదించిన ప్లాన్ బీ ప్రకారం అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు అయ్యే వ్యయం రూ.2 లక్షల కోట్లలో కేవలం పది శాతం ఖర్చు చేస్తే మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు మధ్య 110 కిలోమీటర్ల కారిడార్ ‘మావిగన్’ మహానగరంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అమరావతిలో ఇప్పటికీ భవనాలు ప్రాథమిక దశలో ఉన్న నేపథ్యంలో ‘మావిగన్’ ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించి భవనాలను కట్టాలని సూచించారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు చేస్తున్న కుంభకోణాలు బట్టబయలవుతాయని.. దేవుడు, ప్రజలు చంద్రబాబుకు మొట్టికాయలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే..అప్పుడు బెస్ట్ కేపిటల్.. ఇప్పుడు మున్సిపాలిటీనా? ⇒ 2019కి ముందు చంద్రబాబు స్వయంగా చేసిన మాస్టర్ ప్లాన్ ప్రకారం 50 వేల ఎకరాల్లో ప్రపంచంలో అత్యద్భుతమైన (బెస్ట్), బ్రహ్మాండమైన రాజధాని వస్తుందని బాహుబలి సెట్టింగులు చూపించారు. ఆ మాస్టర్ ప్లాన్ను ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? అప్పుడు ఇదే 50 వేల ఎకరాల్లోనే ప్రపంచంలోనే బెస్ట్ కేపిటల్ అని ఊదరగొట్టిన వ్యక్తి, ఈ రోజు మున్సిపాలిటీగా మిగిలిపోతుందంటూ మరో 50 వేల ఎకరాలు కావాలని చెప్పడం స్కాములు చేయడానికే!⇒ ఎక్కడా లేని విధంగా అమరావతిలో చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ) నిర్మాణానికి ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు అవుతుంది. అంతంత ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ఏ స్కాములతో ఇది పెరుగుతోంది. వీటికి సమాధానం ఎక్కడైనా అసెంబ్లీలో చెప్పారా చంద్రబాబు? ఐదున్నర గంటలపాటు నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో వీటికి సమాధానం చెప్పలేదు. ⇒ కేవలం జగన్ను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోయడానికి, బూతులు తిట్టడానికి మాత్రమే వాడుకున్నారు. రాజధాని పేరుతో పట్టపగలు చేస్తున్న దోపిడీపై ప్రజలను డైవర్ట్ చేసేందుకు డ్రామా చేశారు. ఒకవైపు అసెంబ్లీని పిలుస్తారు.. మరోవైపు అదే చట్టసభలో భాగమైన కౌన్సిల్(శాసనమండలి)ను పిలవరు. కౌన్సిల్ను పిలిస్తే రాజధాని పేరుతో చంద్రబాబు చేస్తున్న అవినీతి బాగోతాన్ని మా సభ్యులు బయట పెడతారని, చంద్రబాబు బండారాన్ని కడిగి పారేస్తారని భయం.రాజధానిలో అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే తీర్మానం డ్రామా⇒ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం. అసలు చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. నిజాయితీ లేదు. బాబు దృష్టిలో పరిపాలన అంటే కేవలం దోపిడీ, అవినీతి చేయడమే. రకరకాలుగా దోపిడీ కోసం డ్రామా చేస్తాడు. విజన్, సంపద సృష్టి అంటాడు. కొత్త కొత్త పేర్లతో డ్రామాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లించి స్కాము(కుంభకోణం)లతో దోచేస్తున్నారు. అమరావతిలో గత వారం శాసనసభ తీర్మానం డ్రామాలో ఇవన్నీ స్పష్టంగా కనిపించాయి.⇒ వాస్తవానికి రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని చంద్రబాబు ప్రభుత్వంలోని మంత్రి పార్థసారథి ప్రకటించారు. అసలు రాజ్యాంగంలో రాజధాని అనే పదం ఎక్కడా లేదు. కేవలం దేశానికి మాత్రమే రాజధాని అని ఉంది. రాష్ట్రాలకు సంబంధించి రాజధానిపై ప్రత్యేకంగా ప్రస్తావన లేదు. సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వం సైతం రాజధాని అంశం రాష్ట్రాల ఇష్టమని అధికారికంగా ఏపీ హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని విషయంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదని అందులో పేర్కొంది.⇒ మన కళ్ల ఎదుటే 2000 సంవత్సరంలో కేంద్రం కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్గఢ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ఆ రాష్ట్రాలకు రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలు నిర్ణయించుకున్నాయి. మరి ఎవరికీ వర్తించనిది మనకు మాత్రమే ఎందుకు వర్తిస్తోంది. ఎందుకీ డ్రామా? రాజధానిపై రాష్ట్రాలకే హక్కు ఉన్నప్పుడు చంద్రబాబు డ్రామా చేస్తూ రైతులను, ప్రజలను నిలువునా ముంచేస్తున్నారు.స్కాముల కోసం చట్ట సభలనూ వదలట్లేదు⇒ చంద్రబాబు హైకోర్టు, అసెంబ్లీని కూడా స్కాముల కోసం వదలట్లేదు. దుబారా, విచ్చలవిడి దోపిడీ కోసం చట్టసభలను వాడేస్తున్నారు. చంద్రబాబు తన అవినీతిని సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు పరిమితం చేయలేదు. ఏ పని చూసినా దోపిడీ కనిపిస్తోంది. రోడ్లు, మురుగు నీటి కాలువలు, సీవరేజీ ప్లాంట్, కొండవీటి వాగు వరద మళ్లింపు, లే అవుట్ డెవలప్మెంట్, అర్కిటెక్చర్ డిజైన్ల ఫీజుల్లో అవినీతికి పాల్పడ్డారు.రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు?⇒ రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ వసతుల కల్పనకు రూ.2 లక్షల కోట్లు కాకుండా భవనాల నిర్మాణానికి అదనంగా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు? ఒక్క అమరావతిలో కేవలం మౌలిక వసతులకే ఇంత ఖర్చు చేస్తుంటే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి.. ఇతర ప్రభుత్వ బాధ్యతల పరిస్థితి ఏమిటి? ఇప్పటికే చంద్రబాబు అమరావతిపై అప్పులు తెచ్చి.. స్కాములు చేయడంతో దాని ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది.⇒ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా నాడు–నేడు పనులు ఆగిపోయాయి. స్కూళ్లు, హాస్పిటళ్లను పట్టించుకునే నాథుడు లేదు. వసతి దీవెన, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ ఏడాదితో కలిపితే రూ.10 వేల కోట్లు అవసరం అయితే బడ్జెట్లో విదిల్చింది స్వల్పమే. ప్రభుత్వంపై నెట్వర్క్ ఆస్పత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పేదలకు ఆరోగ్యశ్రీలో ఉచిత వైద్యం నిలిపివేస్తున్నాయి. రైతులకు సంబంధించి ఏ పంటకు గిట్టుబాటు ధర రావట్లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది. ఆర్బీకేలను నిర్వీర్యం చేశారు. ఈ–క్రాప్ను పట్టించుకోవట్లేదు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున ఐదేళ్లలో రూ.5 వేల కోట్లు పెడితే పూర్తయ్యే మెడికల్ కాలేజీలను నిలిపేశారు.⇒ మా హయాంలోని పథకాలు రద్దయ్యాయి. రాష్ట్రానికి అవసరమయ్యే కార్యక్రమాలన్నీ గతించాయి. చివరికి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవన్ హామీలు మోసాలుగా తేలాయి. ఉద్యోగులకు రూ.36 వేల కోట్లు బకాయిలున్నాయి. చంద్రబాబు తన జీవితాంతం అమరావతిలోనే రోడ్లు, కరెంటు, నీళ్లు, డ్రెయిన్లు కడతారా? వాటిని కట్టడానికి జీవితాంతం అప్పులు చేస్తారా? అంత వరకు రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉండాలా? ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు చెప్పిన లక్ష ఎకరాల అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది? రూ.2 లక్షల కోట్లు పెట్టే స్తోమత మనకు ఉందా? ఇవన్నీ అడుగుతామనే అసెంబ్లీలో తీర్మానం అంటూ కౌన్సిల్ను పిలవకుండా తానేదో గొప్పగా సాధించినట్టు డ్రామాలు చేశారు. నాయకులుగా ఆచరణాత్మక ఆలోచన చేయాల్సిన ధర్మం మనపై ఉంది. అంతేగానీ స్కాములకు స్టాంపు వేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేయకూడదు.ఖర్చు చేసింది రూ.8 వేల కోట్లే!⇒ వైఎస్సార్సీపీ రాష్ట్రంలో ఈ ప్రాంతానికే కాదు.. ఏ ప్రాంతానికీ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వ్యతిరేకం కాదు. చంద్రబాబు చెప్పిన లెక్క ప్రకారమే అమరావతిలో ఒక ఎకరా అభివృద్ధికి (రోడ్లు, కరెంటు, డ్రెయినేజీ, నీటి వసతి) మాత్రమే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఇంక భవనాల ఖర్చు అదనం. మొదటి దశలో తీసుకున్న 50 వేల ఎకరాల్లో సాధారణ మౌలిక వసతుల అభివృద్ధికే దిక్కులేదు. రెండో దశలో మరో 50 వేల ఎకరాలు తీసుకుంటున్నారు. అందులో 20 వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చారు.⇒ చంద్రబాబు 12 ఏళ్ల కిందట చెప్పిన లెక్క ప్రకారం రాజధానిలో లక్ష ఎకరాల్లో సాధారణ మౌలిక వసతులకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాలి. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి రూ.2 లక్షల కోట్లు రూ.4 లక్షల కోట్లు అవుతుందో.. రూ.10 లక్షల కోట్లు అవుతుందో చెప్పలేము. ఇది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలీదు.⇒ విడిపోయిన రాష్ట్రానికి ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటి వరకు రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు? 2014–19 మధ్య కేవలం రూ.5,335 కోట్లు ఖర్చు చేశారు. ఇది కూడా అప్పుల ద్వారా తెచ్చిందే. ఈ రెండేళ్లలో ప్రస్తుతానికి చేసిన గ్రాస్ కమిటెడ్ (మొత్తం చేసిన, చేయడానికి నిర్ణయించిన) అప్పులు రూ.47 వేల కోట్లు. ఇందులో డ్రా చేసింది రూ.13 వేల కోట్లు. వీటిల్లో మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చింది రూ.5,500 కోట్లు. ఇక్కడ 10 శాతం అడ్వాన్సులుగా ఇవ్వడం.. అందులో 8 శాతం కమీషన్లు తీసుకోవడం.⇒ సచివాలయం, హైకోర్టు, అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు పెట్టారు. కొండవీటి వాగు నుంచి వారధి వరకు ఫ్లైఓవర్ కోసం కిలోమీటరుకు రూ.170 కోట్లు పెడుతున్నారు. మా హయాంలో బెంజ్ సర్కిల్లో రెండో ఫ్లైవర్ పూర్తిగా నిర్మించాం. దీనికి కిలోమీటరకు రూ.35 కోట్లు ఖర్చు అయ్యింది. చంద్రబాబు ఏమైనా బంగారు బిస్కెట్లు పెట్టి కడుతున్నారా?⇒ అమరావతిలో మిగిలిపోయిన ఆరు లేన్ల రోడ్లు వేయడానికి కిలోమీటర్కు రూ.53 కోట్లు వెచ్చిస్తున్నారు. అదే జాతీయ రహదారి నిర్మాణానికి టెండర్లు పిలిస్తే కిలోమీటరుకు రూ.20 కోట్లు సగటు ఖర్చు. ఈ దోపిడీని ప్రశ్నించకూడదు, అడగకూడదు. అడిగితే ఎదురుదాడి చేసి అమరావతికి వ్యతిరేకం అంటారు.⇒ మా హయాంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలేదు. పని చేసి బిల్లు పెడితే డబ్బులిచ్చాం. చంద్రబాబు వచ్చిన తర్వాత దాన్ని మార్చి, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకొచ్చారు. ముందే డబ్బులిచ్చి అందులో కమీషన్లు ఎత్తేస్తున్నారు. కేవలం రూ.2,500 కోట్లు మాత్రమే బిల్లుల కింద ఇచ్చారు. మరో రూ.960 కోట్లు దారి మళ్లించారు. ఏడేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు అమరావతికి ఖర్చు చేసింది రూ.2,500 కోట్లు, రూ,5,335 కోట్లు. మొత్తంగా దాదాపు రూ.8 వేల కోట్లు మాత్రమే. కేవలం రోడ్లు, కరెంట్, నీళ్లు, డ్రెయినేజీ సౌకర్యాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేయాల్సిన చోట ఇప్పటి వరకు కేవలం రూ.8 వేల కోట్లు ఖర్చు చేస్తే మిగిలింది ఎప్పటికి చేస్తారు?⇒ అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు. సాధ్యాసాధ్యాలను ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. లీడర్లుగా ఉంటూ స్కాముల కోసం.. సాధ్యం కాదని తెలిసి కూడా ప్రజలను మభ్యపెడుతూ పెడదోవ పట్టిస్తే రాష్ట్రానికి రాజధాని ఉండదు. మౌలిక వసతుల అభివృద్ధి కోసం రూ.2 లక్షల కోట్లు అవసరం అని తెలిసినా, అసాధ్యమని కళ్లముందే కనిపిస్తున్నా.. రైతులను, ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు అప్పులు తెచ్చి, అమరావతి పేరు చెప్పి.. స్కాములు చేసి దోచేయాలనేది చంద్రబాబు ప్లాన్. ఈ దోపిడీ డైవర్షన్ కోసం అసెంబ్లీలో తీర్మానం పేరుతో డ్రామాలు చేశారు.రాజధాని అమరావతి నిర్మాణాలకు అనూహ్యంగా రేట్లు పెంచడంపై ది హిందూ పత్రికలో ప్రచురించిన కథనాన్ని ప్రదర్శిస్తున్న వైఎస్ జగన్ 2018లో ఇచ్చిన వాళ్లకే ఇప్పుడు మళ్లీ పనులు⇒ రాజధాని నిర్మాణ పనులు 2018లో ఎవరైతే చేశారో.. 2024లో ఆ టెండర్లు రద్దు చేశారు. మళ్లీ ఆ పనులకు టెండర్లు నిర్వహించి.. అవే కంపెనీలకు ఆ పనులు దక్కేలా చేశారు. అమరావతి పనుల టెండర్లలో చంద్రబాబు గూడుపుఠాణి, మాఫియా వ్యవహారం స్పష్టంగా కనిపిస్తోంది. అనూహ్యంగా టెండర్లు రద్దు చేసి, మళ్లీ రేట్లు పెంచేస్తున్నారు. మరోవైపు టెండర్లను రిగ్ చేసి మళ్లీ పాత వాళ్లకే కట్టబెడుతున్నారు. ఇక్కడ కాంట్రాక్టర్కు ఇసుక ఫ్రీ, కరెంటు చార్జీల్లో రాయితీలు, జీఎస్టీ, సీనరేజీ, ఎన్ఏసీ మినహాయింపులు అన్నీ ఇస్తున్నా సరే చదరపు అడుగుకు ఏకంగా రూ.11 వేల నుంచి రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇది భయంకరమైన దోపిడీ కాదా?⇒ కేపిటల్గా అమరావతి రియాల్టీ సంగతి పక్కన పెడితే.. దేశంలో అతిపెద్ద స్కాముకు చంద్రబాబు నిజంగా కేపిటల్గా మార్చేశారు. ఇక్కడ వ్యవస్థీకృతంగా (ఆర్గనైజ్డ్) అవినీతి సాగుతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లో 5 స్టార్ సదుపాయాలతో కట్టిన రెసిడెన్షియల్ ప్లాట్స్ చదరపు అడుగుకు రూ.4,500 మించట్లేదు. ఇందులో ఇసుక ఉచితం లేదు.. ఎటువంటి రాయితీలు లేవు. కానీ, రాజధానిలో అన్ని రకాల రాయితీలు ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేల నుంచి రూ.14 వేలు చెల్లిస్తున్నారు.⇒ అమరావతిలో చంద్రబాబు సాగిస్తున్న దోపిడీకి వీరప్పన్ కూడా సరిపోడు. సచివాలయంలో టవర్–1, 2లకు బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, 39 అంతస్తుల నిర్మాణానికి 2018లో ఖరారు చేసిన కాంట్రాక్టు విలువ రూ.932 కోట్లు. ఇప్పుడు అదే పని విలువ రూ.1,423 కోట్లకు పెంచేశారు. పైగా టెండర్లో పెంచిన రేటుకు 4.5 శాతం అధికంగా చెల్లిస్తున్నారు. కాంట్రాక్టర్కు నజరానా రూపంలో జీఎస్టీ, పన్నుల వంటి మినహాయింపుల ద్వారా రూ.257 కోట్లు లబ్ధి. మొత్తంగా రెండు టవర్ల నిర్మాణ వ్యయం రూ.1,762 కోట్లకు చేరింది. గతంలో కంటే ఏకంగా రూ.830 కోట్లు పెరిగింది. పైగా అçప్పటి కాంట్రాక్టర్ షాపూర్జీ పల్లంజీనే ఇప్పుడు పనులు చేసేది.⇒ ఇక టవర్ 3, 4 పనులను 2018లో రూ.784 కోట్లతో కాంట్రాక్టు ఇచ్చారు. ఇప్పుడు దానిని రూ.1,247 కోట్లకు పెంచేశారు. దానిపై మళ్లీ 4.5 శాతం అదనంగా కాంట్రాక్టర్కు ఇస్తున్నారు. రాయితీలు మరో రూ.241 కోట్లు. మొత్తంగా చూస్తే రూ.1,545 కోట్లు ఖర్చు అవుతుంది. అప్పుడు కాంట్రాక్టర్ ఎల్అండ్టీ. ఇప్పుడూ వాళ్లే. ఈ పనులు అన్నింటికీ ఇసుక ఫ్రీ.⇒ జీఏడీ టవర్ చూస్తే బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్తో పాటు 49 అంతస్తుల నిర్మాణానికి 2018లో రూ.554 కోట్లు కాంట్రాక్టు ఇస్తే.. ఇప్పుడు దానిని రూ.844 కోట్లకు పెంచేశారు. ఆ పెంచిన టెండర్ల రేటుపై 4.53 శాతం అదనంగా చెల్లిస్తున్నారు. రాయితీల రూపంలో మరో రూ.163 కోట్లు లబ్ధి. మొత్తం రూ.1,046 కోట్లకు చేరింది. అప్పుడు కాంట్రాక్టర్ ఎన్సీసీ. ఇప్పుడూ వాళ్లే.⇒ ఈ ఐదు టవర్లకు రాయితీలతో కలిపి రూ.4,354 కోట్లకు కాంట్రాక్టు ఇస్తే.. మళ్లీ దీనికి అదనంగా ఏసీలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, లిఫ్టులు, ఫైర్ పనుల కోసం మరో రూ.2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అన్నీ కలుపుకుంటే ఐదు టవర్లకు రూ.6,671 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ ప్రభుత్వ కాంప్లెక్స్లో మౌలిక వసతుల (డ్రెయినేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్) కోసం రూ.1,053 కోట్లు చెల్లిస్తోంది. ఎక్కడైనా ప్లాట్లు కట్టే సమయంలో ఇవన్నీ అందిస్తేనే ప్రజలు అందులో చేరతారు. ఇక్కడ కాంట్రాక్ట్ విలువ కంటే వీటికి అదనంగా ఖర్చు చేస్తున్నారు.⇒ దీని బిల్డప్ ఏరియా 52.20 లక్షల ఎస్ఎఫ్టీ. అంటే ఎస్ఎఫ్టీకి రూ.14,795 ఖర్చు చేసింది. ఇందులో అదనపు మౌలిక వసుతులు తీసేస్తే ఎస్ఎఫ్టీకి రూ.12,779 అవుతుంది. బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో అన్నీ కలుపుకుని ఎస్ఎఫ్టీ రూ.4,500కు చేస్తుంటే ఇక్కడ రూ.వందల కోట్ల మినహాయింపులు, ఇసుక ఉచితంగా ఇచ్చినా నిర్మాణాలకు రూ.14 వేల కోట్లకుపైగా అవుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.⇒ ఒకవైపు ఇంత డబ్బులు ఖర్చు చేసి టవర్లు కడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ పేరుతో రూ.1,100 కోట్లు వృథా చేశారు. అవి ఎందుకు కట్టారు? ఇప్పుడు ఆ డబ్బులన్నీ గంగలో పోసినట్టే కదా? తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడు 28 ఎకరాల్లో 10 లక్షల ఎస్ఎఫ్టీలో రూ.615 కోట్లతో సచివాలయం కట్టారు. దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.970 కోట్లు మాత్రమే అయ్యింది. అందులో 1,272 మంది కూర్చునేలా కట్టారు. పార్లమెంట్ను దేశం మొత్తం చూస్తోంది. ఆ స్థాయిలో వాళ్లు కడితే.. ఇప్పుడు కట్టే మన అసెంబ్లీ రూ.1,449 కోట్లు అవుతుంది. అంటే, పార్లమెంట్ను దాటేశాం.. కేసీఆర్ నంబర్కు డబుల్ చేసేశాం. ఇక హైకోర్టు కోసం మరో రూ.1,480 కోట్లు. ఐదు టవర్లు కాకుండా ఈ రెండూ అదనంగా కట్టేవి. -
లోక్సభ నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల వాకౌట్
సాక్షి, ఢిల్లీ: ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ప్రస్తుత రూపంలో అమరావతి బిల్లును అంగీకరించం అని వైఎస్సార్సీపీ తేల్చి చెప్పింది. రైతుల సమస్యలు, నిధుల గురించి చెప్పకుండా కేవలం పేరు మాత్రమే తీసుకొస్తే లాభం లేదన్న వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి.. తాము అమరావతికి కానీ, మరే ప్రాంతానికి కానీ వ్యతిరేకం కాదన్నారు.అమరావతి పేరుతో దోపిడీ.. అమరావతి బిల్లుపై లోక్సభలో ఇవాళ జరిగిన చర్చలో మిథున్రెడ్డి మాట్లాడుతూ.. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అంటూ దుయ్యబట్టారు.చర్చలో సమాజ్వాదీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ కూడా మాట్లాడుతూ.. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ ఉంది.. విశాఖ రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేదని.. ల్యాండ్ పూలింగ్, నిధుల సమస్య వచ్చేదేకాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ పెద్దలకే లాభం.. రైతులకు ఏం వస్తుందంటూ ధర్మేంద్ర ప్రశ్నించారు. అమరావతి కోసం భారీ ఎత్తున రైతుల నుంచి భూములు తీసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు పరిహారం ఎందుకివ్వలేదు? అంటూ ఆయన నిలదీశారు.ఉద్ధవ్ సేన ఎంపీ అర్వింద్సావంత్ మాట్లాడుతూ ఏపీ విభజన సమయంలో టీడీపీ ఐదేళ్లు ప్రత్యేక హోదా కోరిందని.. అప్పుడు శివసేన, టీడీపీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అప్పుడు ఐదేళ్లు హోదా కావాలని పదేపదే అడిగారు. ఇప్పుడు ఈ అంశాని ఎందుకు ప్రస్తావించడం లేదంటూ ఆయన ప్రశ్నించారు. -
అప్పు చేస్తే తప్ప జీతాలు ఇవ్వలేవు అమరావతికి 2 లక్షల కోట్లు ఎక్కడ నుండి తెస్తావ్
-
అమరావతి రైతులకు ఇప్పటి వరకు ప్లాట్లు ఇవ్వకుండా బిల్లు ఎలా పెడతారు?
-
అమరావతి కుంభకోణం పై POINT to POINT సంచలన నిజాలతో జగన్
-
హైకోర్టు, సచివాలయం అసెంబ్లీ, కేవలం డిజైన్స్ కోసమే 401 కోట్లు.. ఏంది సామీ ఇదంతా..!
-
అమరావతికి YSRCP వ్యతిరేకం కాదు
-
ఏపీ కొత్త రాజధాని MAVIGUN!
-
కిలోమీటర్ కు 170 కోట్లా..కొంచమైనా సిగ్గుందా బాబు
-
అమరావతి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: అమరావతికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ మిథున్ రెడ్డి. రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని చెప్పుకొచ్చారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. జీతాలు, సంక్షేమానికి డబ్బులు లేవని చెబుతున్న చంద్రబాబు.. అమరావతి అభివృద్ధికి ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. ఏపీలో జరుగుతున్న అన్యాయాల నుంచి డైవర్ట్ చేయడానికే అమరావతి డ్రామా అని అన్నారు.అమరావతి బిల్లుపై లోక్సభలో ఈరోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. చర్చలో భాగంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ..‘రాజధాని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం. రెండేళ్లలో రైతులకు అభివృద్ధి చెందిన ప్లాట్ల కోసం ప్రయత్నిస్తామని చెప్పారు.. కానీ ఇవ్వలేదు. 2014-19 వరకు రైతులకు ఎలాంటి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వలేదు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసం తట్టుకోలేక రైతులు గుండె ఆగి చనిపోయారు. రైతుల గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతులకు ఎలా న్యాయం చేస్తారో ప్రకటించాలి. అమరావతిలో ప్రతీ ఎకరానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ నిధులను ఎక్కడినుంచి తీసుకొస్తారు?.అదనపు భూసేకరణకు అవసరం ఏముంది?. మొత్తం ఎన్ని ఎకరాల భూమి తీసుకుంటారో చెప్పాలి. తీసుకుంటున్న భూమికి జస్టిఫికేషన్ ఏంటి?. అమరావతికి చంద్రబాబు హయాంలో ఐదేళ్లలో రూ.5335 కోట్లు ఖర్చు పెట్టారు. వాస్తవ సమస్యల నుంచి పక్కదారి పట్టించడానికి డైవర్షన్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. రెండేళ్లలో మూడు లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారు. చదరపు గజానికి ఢిల్లీలో 4,000 ఖర్చు పెడుతున్నారు. అమరావతిలో చదరపు గజానికి 12,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారు. 8000 రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నారు. అమరావతి పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారుబీజేపీ మాట మార్చింది.. చంద్రబాబు నాయుడు తొలుత తిరువూరులో రాజధాని ఉంటుందని చెప్పారు. ఈలోగా అమరావతిలో భూములను కాజేశారు . అమరావతి పేరుతో ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని మా పార్టీ అభిమతం. రాయలసీమలో రెండో రాజధానిగా ఉంటుందని బీజేపీ చెప్పింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలని వారికి లేదు. రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రస్తుత ఫార్మాట్లో ఉన్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాం. అమరావతికి, ఏ ప్రాంతానికి మేము వ్యతిరేకం కాదు. బిల్లుకు వ్యతిరేకంగా మేము వాకౌట్ చేస్తున్నాం’ అని అన్నారు. అనంతరం, లోక్సభలో సమాజ్వాదీపార్టీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్ మాట్లాడుతూ..‘ఏపీలో అతిపెద్ద నగరం వైజాగ్ సిటీ. విశాఖను రాజధానిగా చేసి ఉంటే ఇంత భూమి, ఖర్చు, అప్పులు అవసరం ఉండేది కాదు. విశాఖపట్నం రాజధానిగా అభివృద్ధి చేస్తే సహజంగా ఉండేది. అమరావతి పేరుతో భారీ ఎత్తున రైతుల నుంచి భూమి తీసుకున్నారు. రైతులకు నాలుగు రెట్లు నష్టపరిహారం ఇచ్చారా?. రైతులకు న్యాయం జరగాలి’ అని అన్నారు. -
బాబు చేసే దోపిడీకి.. వీరప్పన్ కూడా సరిపోడు..
-
గోల్డ్ బిస్కెట్లతో కడుతున్నావా? బాబుపై జగన్ సెటైర్లే సెటైర్లు
-
అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేశాం: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు.. సాధ్యమవుతుందా.. కాదా అనేది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉందన్నారు. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశామని వైఎస్ జగన్ తెలిపారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతి పేరుతో దోపిడీ చేయడమే చంద్రబాబు ప్లాన్. దోపిడీ నుంచి డైవర్షన్ కోసమే అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంతఖర్చును తట్టుకోగలమా?. ప్రజలను పెడదోవ పట్టించడం ఎందుకు?. ఇలా చేస్తే రాష్ట్రానికి రాజధాని ఎప్పుడు అవుతుంది?. రాజధానే లేని పరిస్థితి ఉంటుంది: రూ.2 లక్షల కోట్ల ఖర్చును తట్టుకునే స్తోమత రాష్ట్రానికి ఉందా?. అందుకే రాష్ట్రంలో ఇతర ప్రాంతాలను రోడ్డున పడేయకూడదని మేము అనుకున్నాం.అందుకే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్.. రాష్ట్రంపై భారం పడకూడదని అభివృద్ధి, సంక్షేమం కుంటుపడకూడదని మనం కూడా హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి మెట్రో నగరాలతో పోటీపడాలంటే, మనకు కూడా ఒక గ్రోత్ ఇంజిన్ ఉండాలని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం పెట్టాలనుకున్నాం. ఇందులో స్వార్థం లేదు, ఆచరణాత్మక ధోరణే ఉంది. శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ కర్నూలును న్యాయ రాజధానిగా పెట్టాలనుకున్నాం. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగించాలని నిర్ణయించాం. కానీ, ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. మా ఆలోచనల్లో ఎక్కడా కూడా మేం అమరావతిని నిర్లక్ష్యం చేయలేదు. రైతులకు మరో ఐదేళ్ల పాటు కౌలును పెంచాం, రాజధానిలో పెన్షన్లను రూ.5వేలకు పెంచాం.ఆచరణాత్మక ఆలోచన. ప్రాక్టికల్గా సాధ్యమయ్యే ఆలోచనలు మేం చేశాం. మరోవైపు ప్రభుత్వం తన బాధ్యతగా ప్రజలకు చేయాల్సిన ప్రతి మేలుకూ అడ్డంకులు లేని ఆలోచన చేశాం. ప్రభుత్వం మీద, ప్రజల మీద అప్పులు భారం మోపకుండా ఆలోచన చేశాం. కేవలం రూ.10వేల కోట్లు పెడితే చాలని విశాఖనగరం ఈరోజు ఉన్న ఈ స్థాయి నుంచి గొప్పస్థాయికి ఎదుగుతుందని చెప్పాం. రాష్ట్రానికి ఆదాయాన్ని, మన పిల్లలకు ఇక్కడే ఉద్యోగాలను, ఇచ్చే వనరుగా మారుతుందని మేం చెప్పాం. దీని మీద చంద్రబాబు, ఎల్లో ముఠా చేసిన ప్రచారం, చెప్పిన అబద్ధాలు అన్నీ ఇన్నీ కావు. నాకు సంకుచితమైన ఆలోచన ఉండి ఉంటే, రాయలసీమలో రాజధాని ఆలోచన చేసేవాడిని. కానీ, నేను అలా చేయలేదు. రాష్ట్రానికి మంచి చేయాలన్న ఆలోచన చేశాను. ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని నేను అనుకున్నాను. అందుకే ఇలా చేశాను’ అని చెప్పుకొచ్చారు.MAVIGUN ప్లాన్ ఇదే.. పోనీ మేం ప్రాక్టికల్గా చేసిన ఆలోచన చంద్రబాబుకు నచ్చలేదు సరే. ప్లాన్-బీ కింద అయినా మేం చెప్పిన ప్లాన్ గురించి చంద్రబాబు ఆలోచించలేదు. మచిలీపట్నం to విజయవాడ, విజయాడ to గుంటూరు 40 కి.మీ. ఈ మొత్తం 110 కి.మీ హైవే ఇప్పటికే ఉంది. ఈ హైవేకు అటు, ఇటు క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేస్తే గ్రోత్ ఇంజిన్ తయారవుతుందని చెప్పాం. మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరు నుంచి GUN తీసుకోండి. MAVIGUN అని పేరుపెట్టి క్యాపిటల్ ఏరియాగా డిక్లేర్ చేయండి. స్కాంలు చేసే బదులు, కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కట్టండని సలహా ఇచ్చాం. అది చేస్తే రూ.1,90,000 కోట్లు మిగులుతాయి కదా?. అమరావతిలో పెట్టాలనుకుంటున్న డబ్బులో 10% ఇక్కడ పెడితే బాగుంటుంది కదా అని సూచించాం:మచిలీపట్నంలో MA, విజయవాడలో VI, గుంటూరులో GUN ఈ మూడు కలిస్తే, MAVIGUN ఆనే గ్రోత్ కారిడర్ ఏర్పడుతుంది. ఈ సలహా కూడా ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. విజయవాడ- దాని చుట్టుపక్కల ఇప్పటికే 20 లక్షల జనాభా ఉంది. గుంటూరులో మరో 10 లక్షల జనాభా ఉంది, మచిలీపట్నంలో మరో 3-4 లక్షల జనాభా ఉంది. అదొక మహానగరంగా, గ్రోత్ ఇంజిన్గా ఎదుగుతుంది కదా? అని చెప్తే అది కూడా చంద్రబాబుకు నచ్చలేదు. దీనికన్నా లక్ష ఎకరాల్లో రాజధాని, దాంట్లో బేసిక్ ఇన్ఫ్రా కోసమే రూ.2 లక్షల కోట్లు పెట్టడానికి వెళతానంటున్నాడు. అసాధ్యమని తెలిసి కూడా, తన స్కామ్ల కోసం, తన బినామీల భూముల రేట్లు కోసం పోతానంటున్నాడు. సంక్షేమాన్ని, అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి, రాష్ట్రాన్ని అంధకారంలోకి, అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. -
దేశంలోనే అతిపెద్ద స్కాంకు, కరప్షన్ కు బాబు క్యాపిటల్
-
స్కామ్లు రాజధాని అమరావతి..చంద్రబాబు కష్టపడి సాధించిన ఘనత
-
బాబు అమరావతి అవినీతి చిట్టా.. విస్తుపోయే షాకింగ్ నిజాలను బయటపెట్టిన జగన్
-
దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దేశంలో అతిపెద్ద స్కామ్ అమరావతి క్యాపిటల్ అని చెప్పుకొచ్చారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. అమరావతి ప్రజల రాజధాని కాదు.. కుంభకోణాల రాజధాని అని ఆరోపించారు. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు అని అన్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారని తెలిపారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘అమరావతిలో భయంకరమైన అవినీతి, దోపిడీ జరుగుతోంది. దేశంలో అతిపెద్ద స్కామ్కు అమరావతి క్యాపిటల్. అమరావతి ప్రజల క్యాపిటల్ కాదు.. స్కామ్ల రాజధాని. అమరావతి టెండర్లలో గూడుపుఠాణీ జరిగింది? మాఫియాగా ఏర్పడ్డారు. 2018లో ఏ పనులు, ఎవరు చేశారో, 2024లో టెండర్లు రద్దు చేసిన తర్వాత కూడా మళ్లీ అవే కంపెనీలకు పనులు దక్కాయి. ఒకవైపున అనూహ్యంగా రేట్లు పెంచి, మరో వైపున టెండర్లు రిగ్ చేశారు. ల్యాండు ఫ్రీ, ఇసుక ఫ్రీ, కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ మినహాయింపు, సీనరేజీ మినహాయింపు, ఎన్ఏసీ మినహాయింపు ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాసరే ఎస్ఎఫ్టీ చదరపు అడుగుకు రూ.11వేల నుంచి రూ.14వేలు చూపిస్తున్నారు. ప్రజల రాజధాని సంగతి దేవుడెరుగు అతిపెద్ద స్కాంకు, కరప్షన్కు చంద్రబాబు నిజంగానే క్యాపిటల్ చేసేశాడు. బెంగళూరు, హైదరాబాద్లాంటి మహా నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగుకు రూ.4,500 దాటదు. కానీ, అమరావతిలో టవర్-1కు 2018లో టెండర్ విలువ రూ.932 కోట్లు. కాంట్రాక్టర్కు అన్ని మినహాయింపులు ఇచ్చి టెండర్ పెంచారు. మొత్తం కాంట్రాక్ట్ విలువ 1762 కోట్లకు పెంచారు. టవర్-2కు 2018లో టెండర్ విలువ 762 కోట్లు. ఇప్పుడు అన్ని మినహాయింపులు ఇచ్చి 1545 కోట్లకు పెంచారు. జీఏడీ టవర్.. 2018లో కాంట్రాక్ట్ విలువ 554 కోట్లు. ఇప్పుడు జీఏడీ టవర్ పనులను రూ.1046 కోట్లకు పెంచేశారు.ఐదు టవర్లకు చదరపు అడుగుకు రూ.14795 ఖర్చు చేస్తున్నారు. తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీకి 1100 కోట్లు వృథా చేశారు. తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ రూ.615 కోట్లతో కట్టారు. ఢిల్లీలో పార్లమెంట్ కొత్త భవనం రూ.970 కోట్లతో కట్టారు. మళ్లీ అసెంబ్లీ అంటూ రూ.1149 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మళ్లీ హైకోర్టు అంటూ రూ.1480 కోట్లు ఖర్చు చేస్తున్నారు. స్కామ్ల కోసం హైకోర్టు, అసెంబ్లీలను కూడా వదలడం లేదు. అసెంబ్లీ డిజైన్ల కోసం రూ.401 కోట్లు ఖర్చు చేశారు. మురుగు కాల్వల నుంచి వరదల వరకు ప్రతీచోటా బాబు అవినీతి జరిగింది. కొండవీటి వాగు-వారధి వరకు ఫ్లైఓవర్కు కిలోమీటర్కి 170 కోట్లా?. మా హయాంలో ఫ్లైఓవర్ల కోసం కిలోమీటర్కి రూ.35 కోట్లు ఖర్చు చేశాం. అమరావతిలో కి.మీకి 53 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అమరావతికి ఎవరూ వ్యతిరేకం కాదు’ అని అన్నారు. -
ఫస్ట్ 50వేల ఎకరాలకే దిక్కు లేదు.. 3 మరో 50 వేల ఎకరాలు బాబు టార్గెట్ 2 లక్షల కోట్లు..
-
అడ్వాన్సుల పేరుతో 8 వేల కోట్లు సర్వనాశం చేశాడు..
-
మీ కుటుంబాలు అన్నీ ఎక్కడున్నాయో నన్ను చెప్పమంటావా చంద్రబాబు వైఎస్ జగన్ షాకింగ్ నిజాలు
-
లోకేష్, పవన్ ఇప్పటికీ షటిల్ సర్వీసులే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: రాజధాని పేరుతో చంద్రబాబు పట్టపగలే దోపిడీ చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. 12ఏళ్లలో మనస్పూర్తిగా చంద్రబాబు అమరావతిలో ఉన్నారా?. ఇప్పటికీ కూడా మీ కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..‘రాజధాని పేరుతో దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా?. ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి?. 2019 వరకు హైదరాబాద్కు షటిల్ సర్వీస్ చేశారు. ఇప్పుడు కూడా హైదరాబాద్కు షటిల్ సర్వీసే చేస్తున్నారు. పవన్, లోకేష్ నాలుగు రోజులు కూడా అమరావతిలో ఉండటం లేదు. పవన్, లోకేష్లకు కూడా ప్రత్యేక విమానాలు ఉన్నాయి. విమానాల్లో తిరుగుతున్నారు..షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ వ్యతిరేకం కాదు. మేము అప్పుడు, ఇప్పుడు ఇదే చెబుతున్నాం. కానీ, ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు మాట్లాడుతూ బిల్డప్ ఇస్తున్నాడు.అమరావతికి ఇప్పటి వరకు చంద్రబాబు ఎంత ఖర్చు చేశారు?. 2014-19 మధ్య రూ.5335 కోట్లు ఖర్చు చేశారు. ఈ రెండేళ్లలో అమరావతికి బాబు చేసిన అప్పు 47వేల కోట్లు. అమరావతి కోసం ఏడేళ్లలో మొత్తం 8000 కోట్లు ఖర్చు చేశారు. ఏడేళ్లలో 8000 కోట్లు ఖర్చు పెడితే రూ.2లక్షల కోట్లు ఖర్చు చేయడానికి ఎన్నేళ్ల సమయం పడుతుంది. అమరావతి నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అయ్యిందా?. అమరావతిలోనే వేల కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరిస్థితేంటి?’ అని ప్రశ్నించారు. -
LIVE: YS జగన్ కీలక ప్రెస్ మీట్
-
అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: అమరావతిపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం ఉందా? అని ప్రశ్నించారు. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి? భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా? అని వైఎస్ జగన్ అడిగారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘చంద్రబాబు ఈ 12 ఏళ్ల కాలంలో మనస్ఫూర్తిగా ఈ ప్రాంతంలో ఉన్నారా? ఇప్పటికీ చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ కుటుంబాలు ఎక్కడ ఉంటున్నాయి? ఇప్పుడు కూడా మూడు ప్రత్యేక విమానాల్లో షటిల్ సర్వీసు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ అమరావతి ప్రాంతానికే కాదు.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికీ అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ వ్యతిరేకం కాదు.శాసనసభలో అమరావతిపై తీర్మానం ఒక డ్రామా. రాజధానిపై అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదని స్వయంగా మంత్రి పార్థసారథి చెప్పారు. రాజ్యాంగంలో ఎక్కడా రాజధాని అనే పదం లేదు. చంద్రబాబు దృష్టిలో పాలన అంటే దోపిడీ, అవినీతి. చంద్రబాబు సీఎంగా ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాజధానులను కేంద్రం నిర్ణయించలేదు. ఆయా రాష్ట్రాలే రాజధానులను నిర్ణయించుకున్నాయి. ఏడేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు అమరావతిలో చేసిందేమిటి?. భూములిచ్చిన రైతుల హామీలు నెరవేర్చారా?.అమరావతిని ఎందుకు పెంచుకుంటూ పోతున్నారు?. రోడ్లు, డ్రైనేజీలకే ఎకరానికి రూ.2 కోట్లు అవుతుందని చంద్రబాబు లెక్కలే చెబుతున్నాయి. ఆ లెక్కన లక్ష ఎకరాలకు 2 లక్షల కోట్లు కావాలి. రూ. 2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి?. ఈ 2 లక్షల కోట్లు ఇంకా పెరుగుతూనే పోతాయి. 2019కి ముందు మాస్టర్ ప్లాన్ను ఎందుకు మారుస్తున్నారు. ఒకప్పుడు వరల్డ్ క్లాస్ సిటీ అని చంద్రబాబు ఊదరగొట్టారు. ఇప్పుడు మున్సిపాలిటీగా మిగిలిపోతుందని ఎందుకు అంటున్నారు. చదరపు అడుగుకు 11వేల నుంచి 14వేలు అవుతుందని చెబుతున్నారు. ఐదున్నర గంటల చర్చలో అమరావతిపై ఏం చెప్పారు?. రాజధాని పేరుతో పట్టపగలే దోపిడీ చేస్తున్నారు. దోపిడీని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు డ్రామాలు. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదు. చట్టసభల్లో భాగమైన కౌన్సిల్లో చర్చ లేదు. కౌన్సిల్ సభ్యులు అవినీతిని బయటపెడతారని బాబు భయం. సభలు చట్టాలు చేస్తాయి. సవరణలూ చేయగలుగుతాయి’ అంటూ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబు సర్కారు.. కిక్కు బాక్సింగ్
సాక్షి, అమరావతి: ప్రజలతో తెగ తాగించేందుకు చంద్రబాబు సర్కారు పన్నుతున్న కుట్రలో ఎక్సైజ్ అధికారులు సమిథలవుతున్నారు. ప్రభుత్వ టార్గెట్లు వారికి ప్రాణసంకటంగా మారుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల లక్ష్యాన్ని చేరేందుకు చివరి రోజు మార్చి 31న అధికారులు నానాపాట్లు పడ్డారు. మద్యం దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేయాల్సిందిగా ప్రాథేయపడ్డారు. 2025–26లో మద్యం అమ్మకాలు రూ.30,200 కోట్ల మార్కు దాటించడం కోసం రాత్రి పొద్దుపోయే వరకు తీవ్ర అవస్థలు పడ్డారు. రూ.35వేల కోట్లు కాలేదు.. రూ.30 వేల కోట్లు దాటాలి మద్యం అమ్మకాలతో వచ్చే ఆదాయాన్నే చంద్రబాబు సర్కారు ప్రధాన ఇంధనంగా చేసుకుందన్నది సుస్పష్టం. 2025–26లో ఏకంగా రూ.35 వేల కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్సైజ్ శాఖకు లక్ష్యం నిర్దేశించారు. ప్రతీ వారం సమీక్షించి ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్ ఆదేశించింది. మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్ల ద్వారా వేళా పాళా లేకుండా మద్యం అమ్మకాలకు తలుపులు బార్లా తెరచింది.ఎంత చేసినా ఈ ఏడాది ఫిబ్రవరి 28 నాటికి ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ రూ.27వేల కోట్ల మద్యాన్నే దుకాణాలు, బార్లకు విక్రయించగలిగింది. దీంతో ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము నిర్దేశించిన రూ.35వేల కోట్ల మార్కుకు చేరలేకపోతున్నారని మండిపడ్డారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు కనీసం రూ.30,200 కోట్లు అయినా దాటించాలని నిర్దేశించారు. ఏం చేస్తారో తెలీదు.. ఇచి్చన టార్గెట్ మేర దుకాణాలు, బార్ల యజమానులతో మద్యం కొనిపించాల్సిందేనని తేల్చి చెప్పారు. తీవ్ర ఒత్తిడికి గురైన ఎక్సైజ్ సిబ్బంది దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు భారీ టార్గెట్లు పెట్టారు. మార్చిలో రూ.3,200 కోట్ల మేర మద్యం అమ్మకాలు సాధించాలని స్పష్టం చేశారు. గత ఏడాది మార్చిలో రూ.2,400 కోట్ల మద్యం అమ్మకాలు జరిపారు. సాధారణంగా దానిపై సుమారు 10 శాతం పెంచి లక్ష్యంగా నిర్దేశిస్తారు. అంటే ఈ ఏడాది మార్చిలో రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలు లక్ష్యమని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఆ శాఖ ఉన్నతాధికారులు ఏకంగా రూ.3,200కోట్ల మద్యం అమ్మకాలు సాధించాలని ఆదేశించడంతో జిల్లాల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కంగుతిన్నారు. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మార్చి నెలంతా రోజూ సమీక్షలు చేస్తూ మద్యం అమ్మకాలు పెంచేందుకు తీవ్ర ఒత్తిడి చేశారు. దీంతో సిబ్బంది సతమతమయ్యారు.చివరి రోజు ఆపసోపాలుఉన్నతాధికారుల ఒత్తిడి భరించలేక మార్చి నెలంతా దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి ఎక్సైజ్ సిబ్బంది కాళ్లావేళ్లా పడ్డారు. అమ్మకాలు పెంచాలని వేడుకున్నారు. డిమాండ్ మేరకే మద్యం కొనగలమని, అంతుకుమించి కొనలేమని దుకాణాలు, బార్ల యజమానులు తేల్చిచెప్పారు. అయినా సరే ఎక్సైజ్ అధికారులు పట్టు వీడక దుకాణాలు, బార్లపై ఒత్తిడి పెంచుతూనే ఉన్నారు. మార్చి 30నాటికి రూ.2,600 కోట్ల మద్యం అమ్మకాలే జరిపారు. అంటే మార్చి లక్ష్యం రూ.3,200 కోట్లకు రూ.600 కోట్లు తక్కువ.ఇక ఒక్క రోజు అంటే మార్చి 31(మంగళవారం) మాత్రమే ఉంది. దీంతో ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులపై అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క మంగళవారమే రూ.600కోట్ల మద్యం అమ్మకాలు జరపాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం ఉదయాన్నే దుకాణాలు, బార్ల యజమానుల వద్దకు వెళ్లి రోజువారి ఇండెంట్ కంటే ఎక్కువ కొనాలని వేడుకున్నారు. అయితే అవసరానికి మించి కొనుగోలు చేయలేమని కొందరు తేల్చిచెప్పారు. మరి కొందరు తమ వద్ద అందుబాటులో ఉన్న నగదు మేరకే కొంటామని వివరించారు. దీంతో కొందరు ఎక్సైజ్ శాఖ అధికారులు మద్యం దుకాణాలు, బార్ల యజమానులపై బెదిరింపులకు దిగారు.తాము చెప్పిన మేర మద్యం కొనకుంటే తర్వాత తీవ్ర పరిణామాలు ఉంటాయని, తనిఖీలు కఠినంగా ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. మరికొందరు అధికారులైతే అప్పు ఇప్పిస్తామని, రోజువారీ ఇండెంట్ కంటే ఎక్కువ మద్యం కొనాలని దుకాణదారులకు ప్రతిపాదించారు. ఓ అధికారి అయితే ఓ బార్ యజమానికి రూ.25లక్షలు అప్పు ఇచ్చి మరీ కొనుగోలు చేయించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మంగళవారం ఇదే పరిస్థితి కొనసాగింది. అయినా సరే మంగళవారం రాత్రి వరకు అనుకున్న లక్ష్యం పూర్తికాలేదు. దీంతో ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ల ద్వారా వెంటపడడం గమనార్హం. దీంతో మద్యం అమ్మకాలు తగ్గితే ప్రభుత్వ వ్యవస్థ నిలిచిపోతుందన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. -
అమరావతి నాటకం.. చట్టబద్ధత బూటకం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతిని కప్పిపుచ్చుకోవడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడం.. ఎన్నికల హామీలు, ప్రజా సమస్యల నుంచి జనం దృష్టి మళ్లించడమే లక్ష్యంగా రాజధాని అమరావతికి ‘చట్టబద్ధత’ పేరుతో సీఎం చంద్రబాబు ఆడుతున్న నాటకంలో మరో అంకానికి తెరతీశారు. శనివారం శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014కు సవరణ చేయాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదింపజేశారు. ఇక రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరంటూ తనకు తానుగా ఛాంపియన్గా చిత్రీకరించుకోవడానికి సీఎం చంద్రబాబు సినీఫక్కీలో డైలాగ్లతో చెలరేగిపోయారు.కేంద్రానికి సంబంధం లేకపోయినా..రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలన్నది ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర, సంబంధం ఉండదు. ఇదే అంశాన్ని తేల్చిచెబుతూ 2020 ఆగస్టు 19న హైకోర్టులో కేంద్ర ప్రభుత్వం ప్రమాణ పత్రం(అఫిడవిట్) దాఖలు చేసింది. టీడీపీ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన తీర్మానం మేరకు.. రాష్ట్ర రాజధాని అమరావతిగా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరణ చేసే బిల్లును పార్లమెంటులో బుధవారం కేంద్రం ప్రవేశపెట్టనుంది.భవిష్యత్లో రాష్ట్ర రాజధాని అమరావతికి బదులుగా మరో నగరాన్ని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014ను సవరించాలని కోరుతూ శాసనసభలో తీర్మానాన్ని ఆమోదించి పంపితే.. ఆ మేరకు కేంద్రం చట్టాన్ని సవరించేలా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెడుతుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే.. అమరావతికి చట్టబద్ధత అంటూ సీఎం చంద్రబాబు ఆడుతున్నది నాటకం తప్ప దానికి ఎలాంటి ప్రామాణికత లేదని తేల్చిచెబుతున్నారు. ‘డబ్బుల్’ ధమాకా..రాజధాని ప్రాంతంలో 2015లో ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడి రైతుల నుంచి తక్కువ ధరకే చంద్రబాబు బినావీులు, వందిమాగధులు భారీఎత్తున భూములు కాజేశారు. ఇప్పుడు ఆ భూముల ధరలు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ«దాని నిర్మాణం పేరుతో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, నాబార్డు, హడ్కో వంటి జాతీయ ఆర్థిక సంస్థల నుంచి అధిక వడ్డీలకు ఇప్పటికే రూ.47,387 కోట్ల రుణం తెచ్చారు. ఆ రుణంతో చేపట్టిన పనుల అంచనా వ్యయాన్ని భారీగా పెంచేసి.. సిండికేటు కాంట్రాక్టర్లకు అధిక ధరలకు కట్టబెట్టారు. కాంట్రాక్టు విలువలో 10 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సుగా ముట్టజెప్పి ‘నీకింత.. నాకింత’ అంటూ పంచుకుతింటున్నారు. రెండో విడత భూ సమీకరణకు సిద్ధమై..రాజధాని 29 గ్రామాలు.. 53,748 ఎకరాలకు (217 చ.కి.మీ.) పరిమితమైతే చిన్న మున్సిపాల్టీగా మిగిలిపోతుందని.. భూముల ధరలు పెరగాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, స్పోర్ట్స్ సిటీ, స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని.. అందుకోసం రెండో విడత భూసమీకరణ తప్పదని సీఎం చంద్రబాబు తెగేసిచెప్పారు. అందులో భాగంగా పల్నాడు జిల్లా అమరావతి మండలంలో నాలుగు గ్రామాలు, గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మూడు గ్రామాలు వెరసి ఏడు గ్రామాల్లో రెండో విడత 20,494 ఎకరాల్లో (82.9 చ.కి.మీ.) భూసమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.వాటితోపాటు గుంటూరు జిల్లాలోని గుంటూరు, మంగళగిరి, మేడికొండూరు, పెదకాకాని మండలాలు, తాడికొండ, పల్నాడు జిల్లాలో అమరావతి, యడ్లపాడు, పెదకూరపాడు మండలాల్లో 43 గ్రామాల్లో 1,54,853.43 ఎకరాలకు(626.67 చ.కి.మీ.) రాజధాని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 50 గ్రామాల్లో 709.57 చ.కి.మీ. పరిధిలో రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపొందించడానికి టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ భూములను స్పోర్ట్స్ సిటీ, ఎయిర్ పోర్టు వంటి అభివృద్ధి ప్రాజెక్టుల ముసుగులో అస్మదీయులకు కట్టబెట్టి భారీగా కాజేయాలన్నది సీఎం చంద్రబాబు ప్లాన్.దీన్ని గ్రహించే రెండో విడత భూసమీకరణకు రైతులు ముందుకు రావడం లేదు. తొలి విడత 11 ఏళ్ల క్రితం భూములు ఇచ్చిన రైతులకు అప్పట్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని, అభివృద్ధి చేసిన ప్లాట్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజధాని నిర్మాణ పనుల్లో అంతులేని అవినీతి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం.. రెండో విడత భూసమీకరణను వ్యతిరేకిస్తున్న రైతులను మభ్యపెట్టడమే లక్ష్యంగా అమరావతికి చట్టబద్ధత డ్రామాకు సీఎం చంద్రబాబు తెరతీశారని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి రాష్ట్రంరాజధానికి ఇప్పటికే సమీకరించిన 53,748 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికే ఎకరానికి సగటున రూ.2 కోట్ల చొప్పున రూ.లక్ష కోట్లు అవసరమని 2016–18 మధ్య కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్లు పంపింది. గతేడాది ఏప్రిల్ 16న రాజధాని తొలి దశ నిర్మాణానికే రూ.77,249 కోట్లు అవసరమని 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రెజెంటేషన్ ఇచ్చారు. 1.75 లక్షల ఎకరాల్లో రాజధానిని విస్తరించాలంటే మౌలిక సదుపాయాల కల్పనకే ప్రస్తుత ధరల ప్రకారం రూ.3.50 లక్షల కోట్లు అవసరం. ఇటీవల బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ ఎదుట 53 వేల ఎకరాల్లో రాజధాని అభివృద్ధికి వందేళ్ల సమయం పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది.తొలి దశ రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.లక్షల కోట్లుకు చేరుతుందని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. ఈ లెక్కన రాజధానిని 1.75 లక్షల ఎకరాలకు విస్తరించే పనులు పూర్తి కావాలంటే ఇంకెన్ని వందలేళ్లు పడతాయి?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు వ్యయం అవుతుంది?, ఇంకెన్ని రూ.లక్షల కోట్లు అప్పు తేవాలని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రాజధాని నిర్మాణం పేరుతో తెచ్చే అప్పులు పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
Magazine Story: బాబు అప్పు ఏపీకి ముప్పు
-
అమరావతి ముందు సింగపూర్ దేనికి పనికిరాదు.. భూములు ఇవ్వండి.. నిండా మునగండి
-
నీ వికృత చేష్టలన్ని బద్దలైపోద్ది.. నాకు ఎల్లో మీడియా ఉందని రెచ్చిపోతే..
-
‘కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’
సాక్షి,అమరావతి: రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదని జై భీమ్ రావు భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల్ని అచ్చెన్నాయుడు నిందించడం ఏంటి?. టీడీపీకి ఓట్లు వేయకపోతే రాష్ట్ర ప్రజలు తప్పు చేసినట్లా?. ఓట్లు వేయకపోతే ప్రజలను నిందిస్తారా?. ప్రభుత్వం తప్పులు చేస్తున్నా ప్రజలు చూస్తూ ఊరుకోవాలా?. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఫ్లాటు ఎందుకు ఇవ్వలేదు. చంద్రబాబు గాడిదలు కాస్తున్నారా?. కళ్లు ఆర్పకుండా చంద్రబాబు రైతులను మోసం చేస్తున్నారు’అని దుయ్యబట్టారు. -
అమరావతిపై పెట్టింది తీర్మానం మాత్రమే.. బిల్లు కాదు.. ముందుది ముసళ్ల పండగ
-
ఏం ప్లాన్ వేశావ్ బాబు.. రాజధాని వెనుక ఇంత స్కామా..?
-
ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ డ్రామా.. రాజధాని, ప్రజా సమస్యలపై నుంచి దృష్టి మళ్లించడానికే కూటమి సర్కారు పన్నాగం...
-
2028 నాటికి అమరావతి పూర్తి
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో జరుగుతున్న పనులన్నింటినీ 2028 నాటికి పూర్తి చేసి, ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ మాదిరి ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ అంటే అమరావతి అనుకునేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని.. యుమునా నది పవిత్ర జలాలను, పార్లమెంట్లోని పవిత్ర మట్టిని తెచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. అమరావతి స్వయం సమృద్ధి (సెల్ఫ్ సస్టెయినబుల్) ప్రాజెక్టు అని పునరుద్ఘాటించారు. అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరేందుకు చంద్రబాబు ప్రభుత్వం శనివారం ప్రత్యేక శాసనసభ సమావేశం నిర్వహించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్–5(2)ను సవరిస్తూ కొత్తగా ‘ఎట్ అమరావతి’ అనే పదాన్ని చేర్చడంతో పాటు సీఆర్డీఏ నోటిఫై చేసిన ప్రాంతాలను కూడా రాజధాని పరిధి వర్తింప చేసేలా చట్ట సవరణ కోరుతూ సీఎం చంద్రబాబు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. చర్చ అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం ఆమోదం పొందినట్టు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. అంతకుముందు తీర్మానంపై సభలో జరిగిన చర్చకు సీఎం చంద్రబాబు జవాబిస్తూ.. అమరావతిని ఇక ఎవరూ టచ్ చేయలేరని, అంగుళం కూడా కదిలించే పరిస్థితి రాదన్నారు. ‘ఏపీకి ఒక్కటే రాజధాని. అది అమరావతి మాత్రమే. అదే శాశ్వతం. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీ తీర్మానంతో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా దృఢత్వం వస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, ఆంధ్రప్రదేశ్ ఆత్మ, ఆమరావతి అందరిదీ అనేలా ఈ నగర నిర్మాణం చేస్తాం’ అని తెలిపారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైబరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు.అమరావతిలో ఆదాయం సృష్టిస్తాం‘నాలుగోసారి సీఎం అయ్యా. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. నా లక్ష్యం ఒక్కటే. ఆ రోజు సైబరాబాద్ను అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశా. ఈ రోజు అమరావతిని అలా చేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్కు ఏపీ దేహం అయితే అమరావతి గుండె. నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగౌరవంగా చెప్పుకునేలా తయారు చేసే బాధ్యత మనందరిది. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. ఇక్కడ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి ఇక్కడి ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి తెస్తాం. దేశంలో ఇప్పుడున్న నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం. అమరావతి భవిష్యత్ నగరం. వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేస్తాం. ప్రపంచంలో, దేశంలో ఎన్ని లేటెస్టు టెక్నాలజీలు ఉన్నాయో అవన్నీ తెస్తాం. రాష్ట్రాన్ని విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. మూడు మెగా సిటీలు అభివృద్ధి చేస్తాం. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేసి, జాతికి అంకితమిస్తాం. ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర విభజన సమయంలో ఎక్కడున్నాడో తెలియదు. తన స్టాండ్ ఏమిటో చెప్పలేదు’ అని చంద్రబాబు అన్నారు. కేంద్రహోంశాఖకు తీర్మానం కాపీ రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశంలో ఆమోదం పొందిన తీర్మానం కాపీని అసెంబ్లీ జనరల్ సెక్రటరీ శనివారం సాయంత్రం కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర హోం మంత్రి, ఏపీ సీఎస్కు పంపారు. ఈ మేరకు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల విభాగం (ఐ అండ్ పీఆర్) ఒక ప్రకటన విడుదల చేసింది. -
అమరావతి పేరుతో అడ్డగోలుగా దోచుకుంటున్నావ్ .. KK రాజు సంచలన రియాక్షన్
-
2029లో జగన్ వస్తాడనే భయంతోనే అమరావతిపై చట్టబద్ధత బిల్లు..
-
నేడు శాసన సభ ప్రత్యేక సమావేశం
సాక్షి, అమరావతి: శాసన సభ ప్రత్యేక సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు జరగనుంది. రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఈ సమావేశంలో తీర్మానం చేయనున్నారు. విభజన చట్టంలోని సెక్షన్–5లో ‘ఏపీ రాజధానిగా అమరావతి’ అనే పదాన్ని చేర్చాలని కోరనున్నారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఈ పార్లమెంటు సమావేశాల్లోనే చట్ట సవరణ చేయాలని అభ్యర్థించనున్నారు. ఇదిలా ఉండగా శాసన సభను సమావేశపరచి శాసన మండలిని సమావేశపరచక పోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
అమరావతి కాదు.. ATM ప్రతీ పైసా లెక్క చెప్పకపోతే.. బాబుపై MLC కల్పలతా రెడ్డి ఫైర్
-
మంత్రి మాటలతో అడ్డంగా బుక్కైన బాబు.. అమరావతి డ్రామా
-
అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం
-
‘అమరావతి కోసం తీర్మానం అనేది బాబు డ్రామా’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం అన్నది చంద్రబాబు డ్రామా అని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఇది ప్రజలను పూర్తిగా మభ్యపెట్టడానికి చేస్తున్న సరికొత్త ఎత్తుగడ అని ఆయన ధ్వజమెత్తారు. అమరావతి కోసం అసెంబ్లీలో చంద్రబాబు తీర్మానం పెట్టడంపై చంద్రబాబు సర్కార్కి సజ్జల రామకృష్ణారెడ్డి పలు ప్రశ్నలు సంధించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి కోసం తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఎవరు అభ్యంతరం చెప్పారు, ఎవరెవరు అడ్డంకులు సృష్టించారో చంద్రబాబు స్పష్టంగా వివరించాలని ఆయన డిమాండ్ చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసి అంతా చేసేశానని చెప్పుకోవడమే లక్ష్యమని, అయితే శాసన మండలిని సమావేశపరచకుండా ఎందుకు ఉంచుతున్నారో కూడా సమాధానం చెప్పాలన్నారు. మండలిలో వైఎస్సార్సీపీ బలం ఎక్కువగా ఉందని... అమరావతిలో చంద్రబాబు అవినీతి, వ్యవహరిస్తున్న తీరును గట్టిగా ప్రశ్నిస్తారనే భయంతోనే మండలిని సమావేశపరచడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి శాశ్వత రాజధానిని నిర్మించి, ప్రజలకు వేగంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచన చంద్రబాబు ఎప్పుడూ చేయలేదని, రాజధాని అంశాన్ని శాశ్వత కామధేనువుగా మా ర్చుకుని అవినీతి యజ్ఞం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఇంకేమన్నారంటే..జగన్ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు... అమరావతి ప్రాంతానికి ఎప్పుడూ జగన్ వ్యతిరేకం కాదు. 2019లో అధికారంలోకి రాకముందే జగన్ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. అవినీతి, దోపిడీ పైనే మా అభ్యంతరం. బాబు చెబుతున్నదానినిబట్టే రాజధానిలో కనీస మౌలిక సదుపాయాల కోసం రూ.2 లక్షల కోట్లు కావాలి. 2014–19 మధ్య ఐదేళ్లలో బాబు ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే. ఇప్పుడు కూడా కొత్త నిర్మాణాలు ఏమీ చేపట్టలేదు. పాత బిల్డింగులే ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. వచ్చాక కూడా ఏమీ చేయడం లేదు. కొత్త నిర్మాణాలంటూ ఇప్పుడు చదరపు అడుగుకు రూ.19వేల వరకూ పెంచారు. మళ్లీ డిజైన్ల పేరిట రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారు. 2018లో టెండర్లు ఖరారై, పనులు ప్రారంభమైన వాటికి కూడా మళ్లీ టెండర్లు పిలిచారు. అమరావతిని ఏటీఎం, కామధేనువుగా మార్చారు. రాజధాని రైతుల సమస్యలను ఇప్పటికీ పరిష్కరించ లేదు. పిల్లల పెళ్లిళ్లు కూడా రైతులు చేయలేకపోతున్నారు. అమరావతి పనుల్లో పారదర్శకత ఏదీ? అమరావతి పనులు ఎక్కడా జరగడం లేదు. ఆర్టీఐ కింద సమాచారం అడిగినా ఇవ్వడం లేదు. ఈ విడతలో రూ.9వేల కోట్లు తెచ్చి, రూ.5వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. అమరావతికి వ్యతిరేకం అని ముద్ర వేస్తున్నారు. అమరావతి ఏపీలో భాగం కాదా? మొదటి విడతలో భూములు ఇచ్చిన రైతులకే న్యాయం చేయకుండా, రెండో విడత పేరుతో మళ్లీ ఇబ్బందులు పెడుతున్నారు. అమరావతిలో పాత బిల్డింగులు తప్ప.. కొత్తగా చంద్రబాబు ఏం కట్టారు?. రాజధాని ప్రాంతానికి కనెక్టివిటీకోసం ఏమైనా చేశారా? ఇప్పటికీ కరకట్ట రోడ్డే కదా గతి. వెస్ట్రన్ బైపాస్ పూర్తిచేసింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే కదా? పనులు ఏమీ చేయకపోయినా, ప్రజలను నిరంతరం భ్రమల్లో పెట్టాలన్నదే చంద్రబాబు ప్లాన్. మొదటి రోజు నుంచి ఇప్పటి వరకూ అమరావతి విషయంలో వివరాలు ప్రభుత్వం బయట పెట్టగలదా? అమరావతి పేరు మీద అప్పులు తెస్తున్నారు, మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇస్తున్నారు, కమీషన్లు కొట్టేస్తున్నారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లను మాత్రం అభివృద్ధి చేయడం లేదు. చంద్రబాబు గతంలో చెప్పిన హైపర్ లూప్ ఏమయ్యింది? అమరావతిలో ఒలింపిక్స్ ఏమయ్యాయి? సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అట.. అమరావతి పనుల కమీషన్లకు సంబంధించే చంద్రబాబుకు ఇన్కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. రూ.2వేల కోట్ల అవినీతిపై ఆ రోజు ఇన్కంట్యాక్స్ నోటీసులు వచ్చాయి. చంద్రబాబు పీఏ శ్రీనివాస్కు కమీషన్లు, లంచాలు వెళ్లాయని ఆ నోటీసుల్లో ఉంది. ఈ నోటీసులపై విచారణ ఆగిపోయింది. అమరావతిలో చంద్రబాబు అవినీతికి ఈ నోటీసులే నిదర్శనం. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటున్నారు. అదెలా చేస్తారో తెలియదు. లక్ష కోట్ల అప్పును ఎకరాల ధరతో విభజిస్తారట. మరి నిజంగా అక్కడ అంత ధర ఉందా? చంద్రబాబు అక్కడ భూమిని గజం రూ.7,500 చొప్పున తన కోడలి పేరుతో కొన్నాడు. ఆ ప్రకారం చూస్తే ఎకరం రూ.4 కోట్లు మాత్రమే అవుతుంది. మరి 8 వేల ఎకరాలు, రూ.4 కోట్ల చొప్పున లెక్కిస్తే ఎంత అవుతుంది?. అందుకే మళ్లీ చెబుతున్నాం. మా పార్టీకి కానీ, మా నాయకుడికి కానీ ఒకటే స్థిరమైన అభిప్రాయం. మేము అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదు. రాజధాని నిర్మాణం పేరుతో చేస్తున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అమరావతిలో సామాన్యులు, నిరుపేదలు ఉండే పరిస్థితి ఉందా? చివరకు అక్కడ పేదలకు ఇచ్చిన ప్లాట్లు కూడా రద్దు చేశారు కదా? అక్కడ ఆర్గానిక్గా ఎలా, ఎప్పుడు డెవలప్ అవుతుంది? అక్కడికి ప్రజలు ఎప్పుడొస్తారు? ప్రభుత్వానికి ఆదాయం ఎలా వస్తుంది?నాడు ఇంటర్నేషనల్ సిటీ .. ఇప్పుడేమో మున్సిపాలిటీ అట! ఆ రోజు అదే అమరావతిని ఇంటర్నేషనల్ సిటీ అన్నారు. అప్పుడు 33 వేల ఎకరాలు తీసుకున్నారు. మరి ఇప్పుడు మరో 30 వేల ఎకరాలు కావాలంటున్నాడు. ఆ తర్వాత ఇంకా కావాలంట. ఎందుకయ్యా అంటే, ఇప్పుడున్న భూమితో కేవలం మున్సిపాలిటీ మాత్రమే అవుతుంది అంటున్నారు. సింగపూర్ మాదిరిగా ఇంటర్నేషనల్ సిటీ కావాలంటే, మళ్లీ 30 వేలకు పైగా ఎకరాలు కావాలని చెబుతున్నాడు. దీంతో రైతులకు అనుమానం కలుగుతోంది. ఒకవేళ మీరు ఒకేసారి వేల ఎకరాలు అమ్మకానికి పెట్టినా, కొనడానికి ఎవరొస్తారు? అంత మొత్తం ఎవరు పెట్టుబడి పెడతారు? ఇంకా, మీరు అనుకున్న ధర వస్తుందా? ఈలోగా వడ్డీలు ఎంత పెరుగుతాయి? రుణాలు తిరిగి ఎలా చెల్లిస్తారు?. ఇవన్నీ గట్టిగా నిలదీస్తాం కాబట్టే, అమరావతిపై తీర్మానం కోసం మండలిని సమావేశపర్చడం లేదు. -
అమరావతి ప్లాన్ లో లోపాలు.. ఖజానాపై రూ 1472 కోట్ల భారం
-
రాజధాని మాస్టర్ ప్లాన్లో లోపం... ఆంధ్రప్రదేశ్ ఖజానాపై ఒక వెయ్యి 472 కోట్ల రూపాయలకుపైగా భారం
-
అమరావతిలో భారీ అగ్నిప్రమాదం
-
శాశ్వత భవనాల నిర్మాణం పేరుతో నారా వారి భారీ స్కాం..?
-
నాడు అభివృద్ధికి రూపం .. నేడు దుబారాకు కలరింగ్!
అవాస్తవాలను అడ్డగోలుగా ప్రచారం చేసి... వాటి పునాదులపై అధికారంలోకి వచ్చిన కూటమి... ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. కూటమి ప్రభుత్వం ఏదైనా చేసిందంటే అందులో స్వప్రయోజనాలే ఉంటాయి తప్ప, రాష్ట్ర ప్రజలకు అది ఉపయోగపడేది మాత్రం అస్సలు ఉండదు. ఇందుకు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చే నిదర్శనం.అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ల ఖర్చు రూ. 401 కోట్లట. ఇక్కడ అమరావతి మొత్తం భవనాల ఖర్చు రూ. 2316 కోట్లు కాగా, డిజైన్లకే రూ. 401 కోట్లు ఖర్చు చూపెట్టారు. కేవలం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజెన్లకే వందల కోట్ల రూపాయిలు నీళ్లలా ఖర్చు చేశారు. ఇంతటి ఖర్చు ఎవరికి ఉపయోగం. ఈ ఖర్చును చూస్తే డిజైన్లకు అన్ని వందల కోట్లా అని ముక్కున వేలేసుకోకమానరు ప్రజలు.. అదే సమయంలో మన బాబుగారు చేస్తున్న పాలన కదా ఇలాగే ఉంటుంది అని నవ్వుకోక మానరు.రుషికొండ ప్రభుత్వ భవనాల ఖర్చుకే ఏడుపులు..మరి ఆనాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం.. రుషికొండలో ప్రభుత్వ భవనాలకు అయిన మొత్తం ప్రాజెక్ట్ ఖర్చు రూ. 230 కోట్లు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు అవుతున్న ఖర్చు పోలిస్తే ఇది బాగా తక్కువ. మరి ఆనాడు చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. విశాఖ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలనే ఉద్దేశంతో జగన్ ఆ కార్యక్రమం చేపడితే అప్పడంతా చెత్త ఏడుపులే కనిపించాయి.ఆ భవనాలపై వికృత రాజకీయంరాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం అనేది తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ ప్రభుత్వానికి చేతకాదు. విభజిత రాష్ట్రానికి 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ.. ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని సాగదీసి, స్వలాభం చూసుకోవడమే తప్ప, రాష్ట్రానికి చేసిన మంచి ఒక్కటీ లేదు. రాజధాని పేరుతో చేసిన విధ్వంసం, తాత్కాలిక సచివాలయాల పేరుతో నిర్మించిన నాసి రకం భవనాలు, పోలవరం ప్రాజెక్టులో తప్పులు.. ఇలా అన్నీ రాష్ట్రానికి తలవంపులు తెచ్చే పనులే. రుషికొండపైన అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా, విశాఖ ఖ్యాతిని మరింతగా పెంచేలా వైఎస్ అద్భుత ప్రభుత్వ భవనాలను నిర్మిస్తే, దానిపై వికృత రాజకీయం చేసింది.తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు ఎప్పుడూ కపట రాజకీయాలు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.700 కోట్లతో తమ ప్రభుత్వం నిర్మించిన తాత్కాలిక సచివాలయం చిన్న వర్షానికే లీకైపోయి, నీరంతా గదుల్లో ప్రవహించగా.. రూ. 230 కోట్లతో రుషికొండపై విశాఖకే కాక యావత్ రాష్ట్రానికే తలమానికంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్మించిన ఐకానిక్ భవనాలను చూసి టీడీపీ అధినేతలు ఏడుపు మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే విష ప్రచారం చేశారు. అవి ప్రభుత్వ భవనాలే అని చెప్పినా శృతిమించి మరీ కపట రాజకీయం చేసింది.చివరకు అవి ప్రభుత్వ భవనాలేనని అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అంగీకరించింది. అప్పుడొక ఏడుపు.. ఇప్పుడొక కవరింగ్. ఇది బాబుగారి రాజనీతి పాలన.మరి ఇప్పుడు అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకు రూ 400 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారంటే దాన్ని ఏమనాలి. దీన్ని స్వలాభాపేక్ష అనకుండా ఏమంటారు చంద్రబాబు.అభివృద్ధికి రూపాన్ని చూపెట్టిన నాయకుడు జగన్ఆనాడు అభివృద్ధికి అసలైన రూపాన్ని చూపెట్టిన నాయకుడు వైఎస్ జగన్. ఏ విషయంలోనైనా జగన్ మార్క్ పాలన అనేది కనబడింది. అందుకు రిషికొండలో వైఎస్ జగన్ నిర్మించిన ప్రభుత్వ భవనాలే ఒక ఉదాహరణ. ఈ ప్రభుత్వ భవనాలను చూసి తొలుత అగ్లీ(చెత్త) ఏడుపు ఏడ్చింది మీరే.. ఆ తర్వాత శభాష్ అంటూ మెచ్చుకున్నది మీరే. ఇది కూటమి పెద్దల తీరు. అయితే, మరి ఈరోజు కూటమి పెద్దలు చేస్తున్నదేమిటి?, అభివృద్ధి అంటూ పైకి కల్లిబొల్లి మాటలు చెప్పే నేటి ప్రభుత్వ పెద్దలు.. అసలైన అభివృద్ధికొచ్చేసరికి మాత్రం తేలిపోతున్నారు. ఇక్కడ రిషికొండ భవనాలను, అమరావతి గవర్నమెంట్ భవనాలను పోల్చి చూస్తే.. కూటమి పెద్దలది కేవలం బ్లూప్రింట్ల పాలన అనేది అందరికీ అర్థమవుతోంది. నేటి ప్రభుత్వ పాలనలో డిజైన్ల వంటి వాటికే వందల కోట్ల రూపాయిలను వెచ్చిస్తున్న వైనం అందర్నీ ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరికోసం ఈ దుబారా?అయితే ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే.. కేవలం డిజైన్లకే ఇంత ఖర్చు అయితే పూర్తి నిర్మాణానికి ఎంత అవుతుంది?, ఇది అభివృద్ధా… లేక దుబారా ఖర్చా?, ప్రజల డబ్బుతో డిజైన్ల పేరిట కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ ఖర్చులు ఏంటని చర్చించుకుంటున్నారు. -
విశాఖ స్టీల్ భవిష్యత్తు అయోమయం.. అమరావతి పేరుతో అప్పులు, దోపిడీ
-
రాజధాని డిజైన్లకే 401.54 కోట్లు.. షాక్ లో ఇంజనీరింగ్ నిపుణులు
-
22ఏ నిషేధిత జాబితా నుంచి 51,603 ఎకరాల తొలగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఆధీనంలో ఉన్న 51,603.46 ఎకరాల ప్రభుత్వ, డీకేటీ, పట్టా భూములను రిజిస్ట్రేషన్ చట్టం–1908 సెక్షన్ 22–ఏ నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగించింది. ఆ భూములను పూర్తిగా ఏపీఐఐసీ పేరు మీదకు మార్చడానికి అనుమతిస్తూ పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. ఏపీఐఐసీ స్వాధీనంలో 70,000 ఎకరాలు ఉన్నప్పటికీ, పరిహారం చెల్లించిన 51,603.46 ఎకరాలకు సంబంధించి ఇంకా రెవెన్యూ, వెబ్ల్యాండ్ రికార్డుల్లో మ్యుటేషన్ జరగలేదని పేర్కొన్నారు. దీనివల్ల వివిధ సంస్థలతో ఏపీఐఐసీ అమ్మకం ఒప్పందాలు కుదుర్చుకోలేకపోతుందని, ఈ భూములను 22ఏ జాబితా నుంచి తొలగించి తక్షణమే ఏపీఐఐసీ పేరు మీదకు బదలాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని స్పష్టంచేశారు. 22ఏ జాబితాలోఅత్యధికంగా అనకాపల్లి జిల్లాలో 11,862.11 ఎకరాలు ఉండగా, ఆ తర్వాత నెల్లూరు జిల్లాలో 10,403.92 ఎకరాలు, తిరుపతి జిల్లాలో 4,172.18 ఎకరాల భూములు ఉన్నాయి. అతి తక్కువగా పొలవరం జిల్లాలో 19.61 ఎకరాలు ఉన్నాయి. చదవండి: అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్లకే రూ.401.54 కోట్లు! -
అప్పులు తెచ్చి.. అడుగడుగునా దోపిడీ!
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కారు దుబారా వ్యయానికి హైకోర్టు, అసెంబ్లీ శాశ్వత భవనాల నిర్మాణ పనులు మరో నిదర్శంగా నిలుస్తున్నాయి. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ (ఏజీసీ) ‘ఎఫ్’ బ్లాక్లో నిర్మిస్తున్న హైకోర్టు భవనానికి హైసైడ్ ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ (హీటింగ్ వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్), అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ (సీసీటీవీ, ఫైర్ అలారమ్తో కూడిన భద్రత వ్యవస్థ) పనులను రూ.556 కోట్లతో చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.ఇక ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో నిర్మిస్తున్న అసెంబ్లీ భవనానికి ఎలక్ట్రికల్, హెచ్వీఏసీ, అగ్నిమాపక వ్యవస్థ, ప్లంబింగ్, ఈఎల్వీ పనులు రూ.424.34 కోట్లతో చేపట్టడానికి ఆమోదం తెలిపింది. ఇప్పటికే హైకోర్టు భవన నిర్మాణ పనులను రూ.924.64 కోట్లకు.. అసెంబ్లీ నిర్మాణ పనులు రూ.724.69 కోట్లకు కాంట్రాక్టు సంస్థలకు సీఆర్డీఏ అప్పగించింది.. తాజాగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పరిగణనలోకి తీసుకుంటే.. హైకోర్టు నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు, అసెంబ్లీ నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లకు చేరుకుంది.దీంతో చదరపు అడుగు నిర్మాణ వ్యయం అసెంబ్లీ భవనానికి రూ.10,244.07, హైకోర్టు భవనానికి రూ.7,286.03కి పెరిగింది. గతంలో తాత్కాలిక సచివాలయ భవనాల నిర్మాణ పనులను చదరపు అడుగుకు సగటున రూ.3,350 చొప్పున కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి చదరపు అడుగు వ్యయం రూ.19,183కు చేరింది. ఇప్పుడు శాశ్వత అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణం పూర్తయ్యే నాటికి ఈ వ్యయం ఇంకెంతకు చేరుతుందోనని అధికార వర్గాలు లెక్కలు వేస్తున్నాయి.తాజాగా రూ.556 కోట్లు..హైకోర్టు భవనాన్ని ఏజీసీ ‘ఎఫ్’ బ్లాక్లో 42.36 ఎకరాల్లో బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఏడు అంతస్తులు (బీ+జీ+7)లో 20,32,231 చ.అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ ఈ భవన నిర్మాణ డిజైన్ను రూపొందించింది. ఈ భవన పనులను రూ.752.06 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి మరో మూడేళ్లు భవనాన్ని నిర్వహించాలన్న షరతులతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది. 4.52 శాతం అధిక (ఎక్సెస్) ధరకు అంటే రూ.786.05 కోట్లకు ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ కోట్ చేసి టెండర్ దక్కించుకుంది.జీఎస్టీ, న్యాక్, సీనరేజీ లాంటి పన్నుల రూపంలో రూ.138.64 కోట్లు అదనంగా ఇస్తామని టెండర్లో పేర్కొన్నారు. అంటే.. హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనుల కాంట్రాక్టు విలువ రూ.924.69 కోట్లన్న మాట. తాజాగా.. ఈ భవనం పనులకు రూ.556 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో హైకోర్టు భవన నిర్మాణ వ్యయం రూ.1,480.69 కోట్లకు చేరుకుంది. అసెంబ్లీ నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.10,244.07అసెంబ్లీ భవనాన్ని ఏజీసీ ‘ఈ’ బ్లాక్లో బేస్మెంట్, గ్రౌండ్ఫ్లోర్, 3 అంతస్తులు (బీ+జీ+3)లో 11,21,975 చ.అడుగుల్లో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవన డిజైన్ను కూడా ఫోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థే రూపొందించింది. ఈ పనులకు రూ.590.86 కోట్ల అంచనా వ్యయంతో లంప్సమ్ విధానంలో 24 నెలల్లో పూర్తిచేసి, మరో మూడేళ్లు నిర్వహించాలనే షరతుతో గతేడాది మార్చి 1న సీఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ జారీచేసింది.4.48 శాతం అధిక ధరకు అంటే.. రూ.617.33 కోట్లకు ఎల్అండ్టీ లిమిటెడ్ సంస్థ చేజిక్కించుకుంది. జీఎస్టీ, న్యాక్, సీనరేజీ వంటి పన్నుల రూపంలో రూ.107.69 కోట్లు అదనంగా ఇస్తామంది. అంటే.. అసెంబ్లీ శాశ్వత భవనం నిర్మాణ కాంట్రాక్టు విలువ రూ.725.02 కోట్లు. తాజాగా.. ఈ పనులకు రూ.424.34 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో ఈ భవనం నిర్మాణ వ్యయం రూ.1,149.36 కోట్లన్నమాట. అసెంబ్లీ భవన నిర్మాణ వ్యయం చ.అడుగుకు రూ.10,244.07కు చేరుకుంది.అసలే అప్పులు.. ఆపై దుబారా..ఇప్పటికే తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను చంద్రబాబు ప్రభుత్వ రూ.వందల కోట్లు వెచ్చించి నిర్మించింది. ఇప్పుడు శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక భవనాలకు వెచ్చించిన ఖర్చంతా వృథానే. అది కూడా అప్పు తెచ్చిందే కావడం గమనార్హం. ఇక అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలను నిర్మిస్తున్నది కూడా అప్పుగా తెచ్చిన నిధులతోనే. అవసరమైన మేర కంటే భారీగా నిర్మిస్తుండటం వల్ల భవనాల నిర్మాణ వ్యయం పెరుగుతోంది. రాజధానిలో వెలగపూడి వద్ద 2015లో ఆరు లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం అప్పగించింది.కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యేసరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఇప్పుడు అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాలు పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం ఇంకెంతకు చేరుతుందో ఊహించుకోవచ్చని ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో ఫైవ్స్టార్ సదుపాయాలతో ఇటాలియన్ మార్బుల్స్తోనూ భవనాల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించదని గుర్తు చేస్తున్నారు.అలాంటిది రాజధాని నిర్మాణం పేరుతో అధిక వడ్డీలకు జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పు తెచ్చి చేపట్టిన భవనాల నిర్మాణ వ్యయం ఎక్కడా లేనట్లు చదరపు అడుగు రూ.పది వేలతో నిర్మిస్తుండడం చూస్తుంటే నీకింత.. నాకింత అన్నట్లుగా దోచుకోవడానికేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
గంటపాటు వర్సానికి మునిగిపోయిన అమరావతి రోడ్లు
-
బాబు అవినీతికి రాచమార్గం క్యాపిటల్ తో కరప్షన్
-
బిల్డర్ బాబు కొత్త రేటు..
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణ వ్యయం పెంచేయడంలో చంద్రబాబు సర్కార్ తన రికార్డులను తానే బద్దలు కొడుతోంది. శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయమే ఇందుకు తార్కాణం. నేలపాడు వద్ద అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజీసీ)లో శాశ్వత సచివాలయం, హెచ్వోడీ(శాఖాధిపతులు) కార్యాలయాల కోసం ఐదు టవర్లను డయాగ్రిడ్ విధానంలో ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లతో పరిపాలన అనుమతి ఇస్తూ ఇటీవల పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని బట్టి చూస్తే శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.12,779.07 అని అర్ధమౌతోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలు, ఇటాలియన్ మార్బుల్స్తో నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.4 వేలకు మించడం లేదని ఇంజినీరింగ్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే.. శాశ్వత సచివాలయం కాంట్రాక్టు పనుల్లో భారీగా కమీషన్లు చేతులు మారాయన్నది స్పష్టమవుతోందని ఆరోపిస్తున్నారు. శాశ్వత సచివాలయం నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం ఇంకెంత పెరుగుతుందో అని లెక్కలు వేస్తున్నారు. గతంలో తాత్కాలిక సచివాలయం నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.3,350తో మొదలై.. పూర్తయ్యే సరికి చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. రాజధాని నిర్మాణం కోసం అంతర్జాతీయ, జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లతో కలిసి ప్రభుత్వ పెద్దలు దోచుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాడూ–నేడూ కాంట్రాక్టర్ ఒక్కరే..: » సచివాలయం 1, 2 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,423.07 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి 2025లో టెండర్లు పిలిచింది. సచివాలయం 3, 4 టవర్లను బీ+జీ+39 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.1,247.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. సీఎం కార్యాలయం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సచివాలయంలో జీఏడీ టవర్ను బీ+జీ+49 అంతస్తులతో నిర్మిస్తోంది. ఈ పనులకు రూ.844.22 కోట్లను కాంట్రాక్టు విలువగా నిర్ణయించి టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో మూడు ప్యాకేజీలకు ముఖ్యనేత ఏర్పాటుచేసిన సిండికేట్లోని ఎన్సీసీ, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలే బిడ్లు దాఖలు చేశాయి. » 1, 2 టవర్ల నిర్మాణ పనులను 4.50 శాతం అధిక ధరకు అంటే రూ.1,487.11 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన షాపూర్జీ పల్లోంజీ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.275.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 1, 2 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,762.81 కోట్లు. ఇదే పనులను 2018లో రూ.932.46 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో షాపూర్జీ పల్లోంజీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.830.35 కోట్లు పెరిగినట్లు స్పష్టమవుతోంది. » 3, 4 టవర్ల నిర్మాణ పనులను 4.54 శాతం అధిక ధరకు అంటే రూ.1,303.85 కోట్లకు కోట్ చేసి ఎల్–1గా నిలిచిన ఎల్ అండ్ టీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.241.70 కోట్లు రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే.. 3, 4 టవర్ల కాంట్రాక్టు విలువ రూ.1,545.55 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.784.62 కోట్లకే పూర్తి చేసేందుకు సీఆర్డీఏతో ఎల్ అండ్ టీ ఒప్పందం చేసుకుంది. అంటే.. 2018 తో పోలిస్తే ఇప్పటికే ఈ టవర్ల కాంట్రాక్టు వ్యయం రూ.760.93 కోట్లు పెరిగినట్లు తేటతెల్లమవుతోంది. » జీఏడీ టవర్ నిర్మాణ పనులను 4.53 శాతం అధిక ధరకు అంటే రూ.882.47 కోట్లకు కోట్ చేసి ఎల్–1 నిలిచిన ఎన్సీసీ సంస్థ దక్కించుకుంది. జీఎస్టీ, సీనరేజీ, న్యాక్ పన్నుల రూపంలో రూ.163.60 కోట్లను రీయింబర్స్ చేస్తామని సీఆర్డీఏ పేర్కొంది. అంటే ఆ పనుల కాంట్రాక్టు విలువ రూ.1,046.07 కోట్లు. 2018లో ఇదే పనులను రూ.554.06 కోట్లకు ఎన్సీసీ సంస్థకు సీఆర్డీఏ అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పటికే ఈ కాంట్రాక్టు వ్యయం రూ.492.01 కోట్లు పెరిగింది. అప్పు చేసి.. దోచిపెట్టి.. పంచుకు తినేలా శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని 2018లోనూ.. ఇప్పుడూ డయాగ్రిడ్ విధానంలోనే నిర్మించేలా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. అప్పటితో పోలిస్తే సిమెంట్, స్టీల్, డీజిల్, పెట్రోల్, నిర్మాణ సామగ్రి ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేదు. పైగా ఇప్పుడు ఇసుక ఉచితం. అదీ నాలుగైదు కిలోమీటర్ల దూరంలోనే కృష్ణా నదిలో కావాల్సినంత దొరుకుతుంది. వీటిని పరిగణనలోకి తీసుకుంటే.. 2018తో పోలిస్తే టవర్ల కాంట్రాక్టు విలువ ఇప్పుడు పెరగడానికి వీల్లేదని అధికార వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. ఇదే టవర్ల నిర్మాణ పనులను 2018 ఏప్రిల్ 26న చదరపు అడుగు రూ.4,350.42 చొప్పున రూ.2,271.14 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ, ఎన్సీసీ సంస్థలకు అప్పగిస్తూ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ అదే సంస్థలకు వాటి నిర్మాణ పనులను రూ.4,354.43 కోట్లకు అప్పగించింది. అంటే.. 2018తో పోలిస్తే ఇప్పుడు వాటి కాంట్రాక్టు వ్యయం రూ.2,083.29 కోట్లు పెరిగింది. ఐదు టవర్ల నిర్మిత ప్రాంతం 4,85,000 చదరపు మీటర్లు (52,20,496 చదరపు అడుగులు). అంటే.. చదరపు అడుగు రూ.8,339.12 చొప్పున ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను కాంట్రాక్టు సంస్థలకు అప్పగించినట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ భవనాలకు హై సైడ్ ఎలక్ట్రికల్(విద్యుత్ సరఫరా), హెచ్వీఏసీ(వాతావరణం స్థిరంగా ఉండేలా చూసే వ్యవస్థ), అగ్నిమాపక వ్యవస్థ, లిఫ్ట్లు, ప్లంబింగ్ పనులు చేపట్టడం కోసం రూ.2,316.88 కోట్లు మంజూరు చేసింది. దాంతో శాశ్వత సచివాలయం నిర్మాణ వ్యయం రూ.6,671.31 కోట్లకు చేరుకుంది. చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరింది. సంప్రదాయ పద్ధతిలో నిర్మించినా.. డయాగ్రిడ్ విధానంలో నిర్మించినా నిర్మాణ వ్యయంలో పెద్దగా తేడా ఉండదని ఇంజినీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాగ్రిడ్ విధానంలో అంతస్తులు పెరిగే కొద్దీ నిర్మాణ వ్యయం తగ్గుతుందని స్పష్టం చేస్తున్నారు. కానీ.. శాశ్వత సచివాలయం టవర్ల నిర్మాణాన్ని చదరపు అడుగు నిర్మాణ వ్యయం రూ.12,779.07కు చేరడంపై ఇంజినీర్లు విస్మ యం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేఎఫ్డబ్ల్యూ, హడ్కో వంటి సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పుగా తెచ్చి వాటిని కాంట్రాక్టు సంస్థలకు దోచి పెడుతూ.. నీకింత నాకింత అంటూ ముఖ్యనేత పంచుకుతినేలా కుట్ర పన్నారంటూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్మాణం పూర్తయ్యే సరికి తడిసిమోపెడుతెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2015లో ఓటుకు కోట్లను ఎరగా వేసి.. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో సీఎం చంద్రబాబు తెలంగాణ సర్కార్కు అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసు భయంతో హైదరాబాద్ నుంచి ఉండవల్లి కరకట్టలోని లింగమనేని అక్రమ బంగ్లాలోకి మకాం మార్చారు. ఆ తర్వాత అమరావతి నుంచే పరిపాలన చేయడం కోసం 6 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో తాత్కాలిక సచివాలయం పనులను చదరపు అడుగు రూ.3,350 చొప్పున రూ.201 కోట్లకు షాపూర్జీ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్థలకు అప్పగించారు. కానీ.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి అంచనా వ్యయం రూ.1,151 కోట్లకు చేరుకుంది. అంటే.. చదరపు అడుగుకు రూ.19,183 చొప్పున బిల్లులు చెల్లించారు. ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్లు చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వ్యక్తమయ్యాయి. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి కమీషన్లు వసూలు చేసిన సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి అప్పట్లో ఐటీ శాఖకు పట్టుబడటం కలకలం రేపింది. ఇప్పుడు శాశ్వత సచివాలయం పేరుతో నిర్మిస్తున్న ఐదు టవర్ల నిర్మాణంలోనూ అదే తరహా దోపిడీకి పథకం రచించారని.. వాటి నిర్మాణం పూర్తయ్యే సరికి కాంట్రాక్టు వ్యయం ఇంకెంతకు పెరుగుతుందోనని ఇంజినీరింగ్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మా సహనానికి పరీక్షా?
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి రాగానే పీఆర్సీ వేస్తామన్నారు.. అంతకు ముందే ఐఆర్ ప్రకటిస్తామని చెప్పారు. తీరా గద్దెనెక్కాక ‘మీరెవరు?’ అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా? ఉద్యోగులను ఇంత దారుణంగా వంచిస్తారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాల నేతలు శనివారం చంద్రబాబు సర్కారుపై నిప్పులు చెరిగారు. రెండేళ్లవుతున్నా పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు.. బకాయిల ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. గతంలో ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రకటిస్తూ వచ్చాయి. రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు రూ.30 వేల కోట్లు, పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. ఉద్యోగులందరూ ఆర్థికంగా నష్టపోతున్నారు. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయం. రిటైర్ అయిన ఉద్యోగులు వారికి రావాల్సిన బెనిఫిట్స్ అందుకోకుండానే కన్ను మూస్తున్నారు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఇన్నాళ్లూ ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తర్వాత చెప్పలేం’ అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కానేకాదని, ముంచిన ప్రభుత్వం అని ప్రభుత్వోద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను బానిసల కంటే హీనంగా చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటం తథ్యం అని స్పష్టం చేశారు. ఆయా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాదిలోపు ఐఆర్ ప్రకటించకపోతే పోరాటమేసాక్షి, అమరావతి : ఉగాది నాటికి రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ఐఆర్ ప్రకటించకపోతే ఆందోళనలకు దిగుతామని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె. వెంకట్రామిరెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తొలుత అన్ని జిల్లాల్లో నిరసన ప్రదర్శలు చేస్తామని, అనంతపురం జిల్లాతో నిరసనలు ప్రారంభిస్తామన్నారు. తాడేపల్లిలోని సమాఖ్య కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లా స్థాయి నిరసన ప్రదర్శనల తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోతే విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తామని తేల్చిచెప్పారు. ఐఆర్ ప్రకటించి, పీఆర్సీ కమిషన్ను వెంటనే ఏర్పాటుచేయాలని, లేనిపక్షంలో ఏప్రిల్ ఒకటి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఏ కేటగిరీ ఉద్యోగులకు కూడా మంచి జరగలేదని, ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా అణచివేస్తున్నారని, అనివార్యంగా పోరాడక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది మంచి ప్రభుత్వం కాదని ఉద్యోగులను ముంచిన ప్రభుత్వమని ఆయన మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాకర్ల వెంకట్రామిరెడ్డి రెండేళ్లయినా ఐఆర్ ఊసేలేదు.. ఉద్యోగులను దారుణంగా వంచించారని, ఏ ఒక్కరికీ న్యాయం జరగలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ఉద్యోగులను పట్టించుకోకపోవడంవల్లే విజయవాడ ధర్నాచౌక్ ఉద్యోగుల ధర్నాలతో దద్దరిల్లుతోందన్నారు. ఒక్క డీఏ ఇచ్చి పండుగ చేసుకోవాలని చెప్పారని.. దానితో ఎన్ని పండుగలు చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఆర్నెల్లకు ఒకటి చొప్పున మొత్తం నాలుగు డీఏలు ఇవ్వాల్సి ఉండగా కేవలం ఒకటి మాత్రమే ఇచ్చారని.. అది కూడా పూర్తిగా ఇవ్వకుండా కొంత పెండింగ్ పెట్టారని తెలిపారు. అలాగే, ఐఆర్ వెంటనే ఇస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారని.. కానీ, రెండేళ్లయినా దాని గురించి మాట్లాడడంలేదన్నారు. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట మేరకు ఐఆర్ ఇచ్చిందని వెంకట్రామిరెడ్డి గుర్తుచేశారు. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేస్తే ఇప్పటివరకూ కొత్త కమిషనర్ను నియమించలేదని, ఇక పీఆర్సీ ఎప్పుడు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగులకు రూ.40 వేల కోట్ల బకాయిలు..ఇక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్ల వరకూ ఉన్నాయని.. వాటిని ఎప్పుడు ఇస్తారో, అసలు ఇస్తారో లేదో కూడా తెలీడంలేదని వెంకట్రామిరెడ్డి అన్నారు. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా పోలీసులకు ఐదు ఎస్ఎల్లు పెండింగ్లో ఉన్నాయని.. సీపీఎస్ ఉద్యోగుల సమస్యకు పరిష్కారం చూపించకపోగా కనీసం దాని గురించి ఆలోచన కూడా చేయడంలేదని.. ఉద్యోగులకు కనీసం పదోన్నతులు కూడా ఇవ్వలేదన్నారు. అర్హతలేని వ్యక్తిని సెక్రటరీ జనరల్గా నియమించి అసెంబ్లీలో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబదీ్ధకరణను నిలిపివేయడం అన్యాయమని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయని, రాజుల కాలంలో బానిసల కంటే దారుణంగా వారితో పనిచేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అంత పని ఒత్తిడి తట్టుకోలేక ఇప్పటికే 80 మంది ఉద్యోగులు చనిపోయారని.. అయినా వారిపై చంద్రబాబు ప్రభుత్వం కనికరం చూపడంలేదని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ రెండేళ్లలో ఉద్యోగులకు చేసిందేమీ లేదుఅనంతపురం అర్బన్ : ‘చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగులకు చేసిందేమీ లేదు. ప్రభుత్వ తీరు చూస్తుంటే పీఆర్సీ దూరమవుతోందనే ఆందోళన ఉద్యోగుల్లో కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఐఆర్ను ప్రభుత్వాలు ప్రకటిస్తూ వచ్చాయి. కానీ, రెండేళ్లవుతున్నా ఐఆర్ ప్రకటించకపోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల ఊసేలేదు. సరెండర్ లీవులు పెండింగ్.. డీఏలు పెండింగ్. మాకు చట్టబద్ధంగా రావాల్సినవే అడుగుతున్నాం. పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్లలో ఒక్క రూపాయి కూడా వారికి అందలేదు. ఉద్యోగులు అడుగుతున్న ప్రశ్నలకు నాయకులుగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. చేతగాకపోతే తప్పుకోండంటూ మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చేస్తుందనే నమ్మకంతో ఓపికగా ఉన్నాం. ఆ ఓపిక ఉద్యోగులు మాకు అవకాశం ఇచ్చినంత వరకే. ఆ తరువాత చెప్పలేం’.. అని ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. అనంతపురం విచ్చేసిన ఆయన శనివారం ఆ సంఘం కార్యాలయంలో అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల అధ్యక్షులు దివాకర్రావు, మైనుద్దీన్, కార్యదర్శి సోమశేఖర్ తదితర నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు.. ప్రభుత్వ తీరుతో ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆయన చెప్పారు., ఉద్యోగులకు ఇవ్వాల్సినవన్నీ త్వరలో ఇస్తామని గత ఏడాది అక్టోబరు 18న ముఖ్యమంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారని.. అయితే, ఐదారు నెలలు అవుతున్నా ఇప్పటికీ అమలుకాలేదని బొప్పరాజు అన్నారు. దీంతో పీఆర్సీ దూరం చేస్తారనే ఆందోళనలో ఉద్యోగులు ఉన్నారన్నారు. జాప్యం చేయకుండా పీఆర్సీ కమిషనర్ను తక్షణం నియమించాలన్నారు. 60 రోజుల్లో నివేదిక ఇచ్చే వెసులుబాటు కల్పించాలన్నారు. తక్షణం ఐఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.30 వేల కోట్లకు పైగా బకాయిల ఊసేలేదని అన్నారు. సరెండర్ లీవులు ఇవ్వలేదని, డీఏలూ పెండింగ్ పెట్టారన్నారు. పోలీసులకు ఒక్క సరెండర్ లీవును రెండు విడతలుగా ఇవ్వడం ఇప్పుడే చూస్తున్నామని చెప్పారు. ఇంతటి దయనీయమైన పరిస్థితిని ఎప్పుడూ చూడలేదన్నారు. పెన్షనర్లకు రూ.10 వేల కోట్ల బకాయి.. ఇక పెన్షనర్లు, చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.10 వేల కోట్లు ఉన్నాయని బొప్పరాజు చెప్పారు. బెనిఫిట్లు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా అందకపోవడంతో వారు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బెనిఫిట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని.. కానీ, అవి తీసుకోకుండానే రిటైర్డ్ ఉద్యోగులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ఉద్యోగులుగా తాము సహకరిస్తున్నామని, అదే స్థాయిలో ప్రభుత్వం సహకరించడంలేదని బొప్పరాజు చెప్పారు.ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిచంద్రబాబు ప్రభుత్వంలో ఉద్యోగులు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. గత సంక్రాంతి పండుగకు ఇచ్చామంటున్న డీఏ ఇంత వరకు చాలా మందికి అందలేదు. సంస్కరణల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తున్నారు. పదో తరగతి పరీక్షల మూల్యాంకనం రెమ్యూనరేషన్ ఇవ్వడం లేదు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి యమలోకంలో ఉన్నట్లు ఉంది. 30 ఏళ్ల పిల్లలు కూడా గుండె నొప్పి, బ్రెయిన్ స్ట్రోక్లతో చనిపోతున్నారు. – బాజీ పఠాన్, అధ్యక్షులు, ఏపీ సీపీఎస్ ఎంప్లాయీస్ యూనియన్ఏ సమస్యా పరిష్కారం కాలేదుఉపాధ్యాయుల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు. వాటి కోసం దశల వారీగా ఉద్యమాన్ని చేపడుతున్నాం. కూటమి మేనిఫెస్టో హామీల అమలు కోరుతూ ఆందోళనలు చేస్తాం. ఈ ప్రభుత్వం ఐఆర్ గురించి పట్టించుకోలేదు. బకాయిలు చెల్లించలేదు. పీఆర్సీ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి. 11వ పీఆర్సీ బకాయిలు, డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు అలాగే ఉన్నాయి. పెన్షన్ కార్పొరేషన్ హామీ ఏమైందో తెలీదు. – రఘునాథ్రెడ్డి, అధ్యక్షుడు, రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ)త్వరలో ఆందోళన ఉధృతంఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. మా జీతం కింద దాచుకున్న పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి వాటిని కూడా మాకు ఇవ్వడంలేదు. పీఆర్సీ, ఐఆర్ గురించి అసలు ప్రస్తావనే చేయకపోవడాన్ని బట్టి అవి ఇచ్చే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని అర్థమవుతోంది. ఉపాధ్యాయులను ప్రతి చిన్న విషయానికి వేధింపులకు గురి చేస్తున్నారు. లోపభూయిష్టమైన అసెస్మెంట్ రిజిస్టర్లతో ఇబ్బంది పెడుతున్నారు. త్వరలో ఉధృతంగా ఆందోళన తప్పదు.– ఏఎం గిరిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీఆర్టీయూ -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. -
నా భూమిని ఎలా తీసుకుంటారో నేను చూస్తా.. అమరావతి రైతు కౌంటర్
-
ప్రభుత్వానికి భూములు ఎందుకివ్వాలి?
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు. రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్ రింగ్రోడ్డు (ఓఆర్ఆర్)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు. మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్ అకౌంటెంట్ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు. -
అమరావతి అభివృద్ధికి వందేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం (అమరావతి) అభివృద్ధికి వందేళ్లు పట్టవచ్చు నని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఏపీ ప్రభు త్వం నివేదించింది. ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) చట్టం–2014 ప్రకారం.. సీఆర్డీఏ అనేది ఒక ముసాయిదా ప్రణాళిక మాత్రమేనని.. దానిపై గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయకపోవడం వల్ల దానికి చట్టబద్ధత లేదని వివరించింది. రాజధాని నగరం, రాజధాని ప్రాంతం మధ్య వ్యత్యాసం ఉందని పేర్కొంది. రాజధాని ప్రాంతం అభివృద్ధి వల్ల పట్టణీకరణ కారణంగా పంటల సాగు నిలిచిపోతుందని.. దీని వల్ల 15.78 టీఎంసీలు ఆదా అవుతాయని తెలంగాణ చేసిన వాదనలో పసలేదని తోసిపుచి్చంది. జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా మంగళవారం రెండో రోజు వాదనలు కొనసాగించారు. రాజధాని ప్రాంతంలోని 53,600 ఎకరాల్లో ఒక్క ఎకరా కూడా కృష్ణా డెల్టా ఆయకట్టు భూమి లేదన్నారు. వైకుంఠపురం ఎత్తిపోతల కింద 891 ఎకరాల ఆయకట్టు మాత్రమే రాజధాని ప్రాంతంలో ఉందని.. ఆ ఎత్తిపోతల ఇప్పుడు పనిచేయడం లేదని వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించేందుకే పట్టిసీమ ఒక తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనన్నారు. ఆ ప్రాజెక్టు పూర్తయ్యాక పట్టిసీమ ఎత్తిపోతల అవసరం ఉండదని స్పష్టం చేశారు. గోదావరి ట్రిబ్యునల్ అనుమతించిన 80 టీఎంసీల కంటే కృష్ణా డెల్టాకు ఎక్కువగా గోదావరి నీళ్లను మళ్లిస్తున్నారంటూ తెలంగాణ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. కృష్ణా జలాల పంపిణీకి 2023, అక్టోబర్ 6న కేంద్రం అదనంగా నిర్దేశించిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ట్రిబ్యునల్ విచారణను మంగళవారం ముగించింది. తదుపరి విచారణను మార్చి 23–25కు వాయిదా వేసింది. తదుపరి విచారణలో కూడా ఏపీ ప్రభుత్వం తుది వాదనలను కొనసాగించనుంది. -
సంచలనంగా మంత్రి నారా లోకేష్ లగ్జరీ టూర్
సాక్షి,అమరావతి: మంత్రి నారా లోకేష్ విలాసవంతమైన టూర్ సంచలనంగా మారింది. క్రికెట్ మ్యాచ్ కోసం కోట్లు వెచ్చించి ప్రత్యేక విమానంలో ప్రయాణించిన లోకేష్ చక్కెర్లు కొట్టారు.ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు తెలుస్తోంది. టీ20 ప్రపంచకప్లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్-పాక్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ను స్టేడియంలో వీక్షిస్తున్న లోకేష్ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించేందుకు నారా లోకేష్ కేవలం 24 గంటల్లోనే కొలంబో–విజయవాడ–ఢిల్లీ ప్రయాణాలు చేసినట్లు సమాచారం. మ్యాచ్ చూసేందుకు విజయవాడ నుంచి ఢిల్లీ.. అక్కడి నుంచి శ్రీలంకకు వెళ్లాల్సి ఉంది. ఇలా వెళ్లిన లోకేష్ విమానం అద్దెకు రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లోకేష్ ఈ మెరుపు ప్రయాణాలతో ప్రజాధనం వృథా చేస్తున్నారని ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారు. -
బిల్గేట్స్ ఏపీ పర్యటన.. ఏపి కి లాభం ఏంటి?
-
డిజిటల్ విప్లవానికి భారత్ పునాది
సాక్షి, అమరావతి: డిజిటల్ విప్లవానికి భారత్లో బలమైన పునాదులున్నాయని గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్ గేట్స్ చెప్పారు. తమ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే ఎక్కువని తెలిపారు. గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గేట్స్ మాట్లాడుతూ.. ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థుల సమస్యలను అర్ధం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో విద్యాబోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందని చెప్పారు.అలాగే, వ్యవసాయ రంగం చాలా ముఖ్యమైనదన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం–గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి కొత్త దశ, దిశ ఏర్పడుతుందన్నారు.ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్వన్ చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తంచేశారు. పది సూత్రాలతో స్వర్ణాంధ్ర–2047.. కార్యక్రమంలో.. స్వర్ణాంధ్ర–2047 విజన్, రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్కు సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా తీర్చిదిద్దడం.. తలసరి ఆదాయం ప్రస్తుతం 3,400 డాలర్లు ఉండగా 2047 నాటికి దీనిని 42,000 డాలర్లకు పెంచడం.. ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు పెంచడం.. నిరుద్యోగాన్ని 4.1 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం.. మహిళా కారి్మకుల సంఖ్యను 45.8 శాతం నుంచి 80 శాతానికి పెంచడం లక్ష్యంగా సీఎం చెప్పారు. అనంతరం.. బిల్ గేట్స్, సీఎం చంద్రబాబు కరకట్ట సమీపంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి సేంద్రీయ ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. విమానం ల్యాండింగ్కు ఇబ్బందులు విమానాశ్రయం(గన్నవరం): గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్గేట్స్ ప్రయాణిస్తున్న విమానానికి గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. బిల్గేట్స్ ప్రత్యేక విమానంలో సోమవారం ఉదయం 8.15 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే దట్టమైన పొగమంచు రన్వే ప్రాంతాన్ని కప్పివేసింది. దీంతో రన్వే విజిబులిటీ లేక విమానం 15 నిమిషాలపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. 8.30 గంటలకు పొగమంచు ప్రభావం తగ్గడంతో సురక్షితంగా రన్వేపై విమానం దిగింది.తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు ఇక్కడికి చేరుకుని ప్రత్యేక విమానంలో వెళ్లిపోయారు. చట్టాలను సరళతరం చేస్తాం పాలనలో వివిధ ప్రక్రియలను, నిబంధనల్ని మరింత సరళీకరించేలా కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా కొన్ని చట్టాలను కూడా సరళతరం చేస్తామన్నారు. ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేసే విషయమై అధ్యయనం కోసం ఓ కమిటీ వేయాలని ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో సోమవారం రియల్ టైమ్ గవర్నెన్స్పై సీఎం సమీక్షించారు. టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా చెల్లింపులు ఇతర ప్రభుత్వ సేవల కోసం ఇబ్బందులు ఎదుర్కోకూడదని, ఆటోమేషన్ దిశగా అడుగులు వేయాలని ఆయన చెప్పారు. -
అమరావతి రైతుల సమస్యలపై కలెక్టర్ని కలిసిన వల్లభనేని వంశీ
-
అందినకాడికి బాదుడే లక్ష్యం.. ప్రైవేట్ కు రాజధాని..!
-
అమరావతి సైతం ప్రైవేట్ పరం... అందినకాడికి బాదుడే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు
-
ఏపీలో మళ్లీ భారీ అప్పుకి కేబినెట్ ఆమోదం
సాక్షి,విజయవాడ: ఏపీలో మళ్లీ భారీ అప్పుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈసారి మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి భారీ మొత్తాన్ని సమీకరించేందుకు నిర్ణయం తీసుకుంది.రాష్ట్ర కేబినెట్ తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బెవరేజస్ కార్పొరేషన్ ద్వారా రూ.11,850 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఈ మొత్తాన్ని బాండ్ల రూపంలో తెచ్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ పథకాల అమలుకు అవసరమైన నిధులను ఈ విధంగా సమీకరించాలని కేబినెట్ తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా రూ.2,500 కోట్ల అప్పును నిన్నే సమీకరించింది. ఈ కొత్త నిర్ణయంతో అప్పుల భారం మరింత పెరగనుంది. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అప్పులు ఇప్పటికే రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత 19 నెలల్లో రాష్ట్ర అప్పులు 3.11 లక్షల కోట్లను దాటాయి. ఈ సంఖ్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో స్పష్టంగా చూపిస్తోంది. సంక్షేమ పథకాల కోసం నిధులు సమీకరించడంలో ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ప్రధాన ఆధారంగా చేసుకోవడం, రాష్ట్ర ఆర్థిక వ్యూహంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్లో అప్పుల భారం రోజురోజుకీ పెరుగుతుండగా, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి కొత్త అప్పులు తెచ్చుకోవడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
ఫేజ్ 1 అట్టర్ ఫ్లాప్ మరోసారి అమ్మకానికి అమరావతి
-
ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,విజయవాడ: మరోసారి రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపింది. కోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారని మండిపడింది. విచారణ సందర్భంగా.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. ‘ఇలాంటి వాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు. హైకోర్టులో కూడా ఇలాగే అరెస్టులు చేస్తారా?’ కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు తీరు సరైంది కాదని వ్యాఖ్యానించింది.దౌర్జన్యం చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తేలికగా తీసుకోవద్దని, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.పత్తికొండ న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్లో, కోర్టు హాల్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు, పోలీసుల వ్యవహారంపై కఠినంగా స్పందించింది. -
స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలు
సాక్షి, అమరావతి: స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పది సూత్రాల ప్రణాళికతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చెప్పారు. భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. 77వ గణతంత్ర దిన రాష్ట్ర స్థాయి వేడుకలను రాజధాని అమరావతి పరిధిలోని నేలపాడులో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు బలగాల పరేడ్ను తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం గవర్నర్ మాట్లాడుతూ రాజధాని అమరావతిలో తొలిసారిగా జాతీయ జెండాను ఆవిష్కరించడం ద్వారా ఈ గణతంత్ర వేడుకలు చారిత్రక ఘట్టంగా నిలిచాయన్నారు. స్వర్ణాంధ్ర–2047 లక్ష్య సాధన కోసం పేదరిక నిర్మూలన(జీరో పావర్టీ), ఉపాధి కల్పన–నైపుణ్యాభివృద్ధి, జనాభా నిర్వహణ–మానవ వనరుల అభివృద్ధి, నీటిభద్రత, రైతు–అగ్రిటెక్, లాజిస్టిక్స్–మౌలిక సదుపాయాలు, ఇంధనం–పరిశ్రమలు, ఏపీ బ్రాండ్, స్వచ్ఛాంధ్ర–సురక్షాంధ్ర, డీప్టెక్–స్మార్ట్ ఆంధ్రా వంటి పది సూత్రాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని చెప్పారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకుందని గవర్నర్ తెలిపారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తోపాటు వివిధ ప్రాంతాల్లో ఎల్రక్టానిక్ టాయ్, సోలార్, డ్రోన్, స్పేస్, బల్క్ డ్రగ్ సిటీలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ కల్లా పోలవరం పూర్తి పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ చెప్పారు. అదే ఏడాది జూన్ నాటికి పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులు పూర్తి చేసి, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలకు నీటిని సరఫరా చేయాలని లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. నదుల అనుసంధానం ద్వారా ప్రతి సాగు భూమికి నీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాయలసీమను దేశానికే హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. గుంతలు లేని రోడ్ల లక్ష్యంతో పనులు వేగవంతం చేశామన్నారు.జూన్ నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తవుతుందని, రామాయపట్నం సహా 4 కొత్త పోర్టుల నిర్మాణం జరుతోందని అన్నారు. 160 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన లక్ష్యంతో గ్రీన్ హైడ్రోజన్ క్యాపిటల్గా రాష్ట్రం ఎదుగుతుందన్నారు. ‘మన మిత్ర’ ద్వారా వాట్సాప్లోనే 119 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన.. మొదటి స్థానంలో సాంస్కృతిక శాఖ శకటం గణతంత్ర వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వందేమాతరం రచించి 150 సంవత్సరాలైన అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిన రాష్ట్ర సాంస్కృతిక శాఖ శకటానికి ప్రథమ బహుమతి లభించింది. మహిళా సంక్షేమం, పరిశ్రమల శాఖ శకటాలకు ద్వితీయ, తృతీయ బహుమతులు వచ్చాయి. కవాతులో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఇండియన్ ఆర్మీ కంటింజెంట్కు మొద టి స్థానం, విశాఖపట్నం ఏపీఎస్పీ 16వ బెటాలి యన్ రెండోస్థానం పొందాయి. కేరళ రాష్ట్ర పోలీస్ కంటింజెంట్కు ప్రోత్సాహక బహుమతి లభించింది. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం
సాక్షి, గుంటూరు: రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం నెలకొంది. గతంలో సీఆర్డీఏ కేటాయించిన అభ్యంతరకరమైన ప్లాట్లపై అధికారులు మళ్లీ లాటరీ నిర్వహించారు. ఈ లాటరీలో ఈసారి కూడా తమకు వీధి శూల ప్లాట్లు వచ్చాయంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధానికి భూములు ఇచ్చి ప్లాట్ కోసం మీ చుట్టూ 11 ఏళ్ల నుంచి తిరుగుతున్నామని రైతులు మండిపడుతున్నారు. తాము కేటాయించిన ప్లాట్లే తీసుకోవాలని.. ఇష్టం ఉంటే తీసుకోండి.. లేకపోతే లేదని చెబుతున్నారంటూ సీఆర్డీఏ అధికారుల తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. రైతుల ఆగ్రహంతో ప్లాట్ల లాటరీ నిలిచిపోయింది. -
అంతుచిక్కని పజిల్... అమరావతి!
అమరావతి... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పజిల్. రాష్ట్రం భవిష్యత్తు మొత్తం దీంతోనే ముడిపడిందని కూటమి పెద్దలు చెబుతున్నా... దాన్నో రియల్ ఎస్టేట్ వెంచర్గా మార్చడం వల్లనే ప్రస్తుత సంక్షోభం నెలకొందని అందరూ అనుకుంటున్నారు. కేవలం 29 గ్రామాల్లో లక్షల కోట్లు గుమ్మరిస్తున్నామని చెబుతున్నా అక్కడి రైతులు మాత్రం అసంతృప్తితో రగిలిపోతున్నారు. సమస్య ఎంత తీవ్రంగా మారిందంటే.. తమ ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెపోటుతో మరణించేంత! దురదృష్టవశాత్తూ ఈ అసంతృప్తులు, మరణాలు కూటమి నేతల మనసుల్లో ఏమాత్రం కదలిక, మార్పు తీసుకు రాలేకపోయాయి. ఉన్న ఇళ్లు కూల్చకుండానే అభివృద్ధి చేస్తామని మన్నటివరకూ ఊదరగొట్టిన చంద్రబాబు, మంత్రి నారాయణల గొంతులిప్పుడు మూగబోయాయి ఎందుకు? సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ అని.. ఇప్పుడు వేల కోట్ల అప్పులెందుకు చేస్తున్నారు? ఉన్నది చాలదన్నట్లు మరో 44 వేల ఎకరాల భూమి పూలింగ్ కోసం ఎందుకు పాకులాడుతున్నట్లు? రాష్ట్ర ప్రజల మనసుల్లోని సమాధానం లేని ప్రశ్నలివి. కొద్ది రోజుల క్రితం మందడం గ్రామసభలో రామారావు అనే రైతు రాజధాని కోసం తానిచ్చిన రెండెకరాల భూమికి బదులుగా వాగులో ఫ్లాట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడే గుండెపోటుకు గురై మరణించడం తీవ్ర కలకలం రేపింది. రామారావు బంధువులు, కొందరు స్థానికులు ‘‘మళ్లీ ఎవరిని చంపడానికి వచ్చారు’’ అంటూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే శ్రావణకుమార్లను ప్రశ్నించిన తీరు రాజధాని ప్రాంతంలో రైతుల ఆగ్రహానికి దర్పణం పడుతుంది. రామారావుది ప్రభుత్వ హత్యే అని సీపీఐ నేత కె.నారాయణ విమర్శించారు. గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ ఎవరు ఎలా మరణించినా, అమరావతి ఉద్యమంలోనే మృతి చెందారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా, వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు సి.ఎమ్. అయ్యాక రామారావు ఇంటికి వెళ్లలేదు. ఫోన్లో పరామర్శించారని ఎల్లో మీడియా తెలిపింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు కూడా రామరావుది సహజ మరణంగా చూపించడానికి తాపత్రయపడ్డాయి. రామారావు అంత గట్టిగా మంత్రిని ప్రశ్నిస్తే ఆయన కూల్గా మాట్లాడి కుప్పకూలారని ఒక పత్రిక హెడింగ్ పెట్టింది. ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న అన్యాయం రామారావు ఒక్కరి సమస్య కాదు. వేలాదిమంది ఇతర రైతుల బాధ. చిన్నకారు, సన్నకారు రైతులకు ఎదురవుతున్న సంక్షోభం. కీలకమైన ప్రదేశాలలో ఉన్న తమ పొలాలను ప్రభుత్వానికి ఇస్తే, తమకు చెరువులలో, వాగులలో ప్లాట్లు ఇస్తున్నారేమిటని ప్రశ్నిస్తున్నారు. అలాగే పలుకుబడిని బట్టి తూర్పు ఫేసింగ్ ప్లాట్లు కేటాయిస్తున్నారని మరి కొందరు వాపోతున్నారు. సీడ్ యాక్సిస్ రోడ్డు చెంత తమకు ఎందుకు ప్లాట్లు ఇవ్వరని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా ఆసక్తికరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగు రోడ్ల మధ్యలో ప్లాట్ ఎలా కొనుగోలు చేయగలిగారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రశ్నించడం విశేషం. ఇక ఆయా గ్రామాల వారికి కొత్త టెన్షన్ పట్టుకుంది. భూ సమీకరణ సమయంలో గ్రామాలకు ఎలాంటి హానీ జరగదని చంద్రబాబు హామీ ఇచ్చారు. కాని ప్రస్తుతం రోడ్ల నిర్మాణంతో గ్రామాలు ఛిద్రమవుతున్నాయని ఒక జర్నలిస్టు తన పరిశీలన వ్యాసంలో తెలిపారు. అబ్బరాజుపాలెం, దొండడపాడు, పిచ్చుకలపాలెం, రాయపూడి, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు తదితర 11 గ్రామాలలో తక్షణం ప్రభావితం అవుతుండగా, మొత్తం 20 గ్రామాలలో ఇళ్లు, భవనాలు పోతాయని అనధికార సమాచారంగా ఉందని ఆ కథనంలో తెలిపారు. ఒక్క మందడంలోనే 147 ఇళ్లను తొలగించవలసి వస్తోందట. చంద్రబాబు ఎప్పటికప్పుడు తన తక్షణ అవసరాల కోసం ఏదో ఒక హామీ ఇచ్చేయడం, ఆ తర్వాత దానికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఇళ్లు కోల్పోయే వారికి ప్రత్యామ్నాయ స్థలాలు ఇస్తారన్న గ్యారంటీ లేదట. బాధితులు కోరిన విధంగా ఖరీదైన ప్రాంతాలలో స్థలాలు ఇవ్వలేమని సీఆర్డీయే అధికారులు చెబుతున్నారట. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ తదితర ఆర్థిక సంస్థల నుంచి వేల కోట్ల అప్పు తెస్తున్న ప్రభుత్వం వాటిని దుబారా చేయడం కూడా విమర్శలకు దారి తీస్తోంది. పూలింగ్ లే అవుట్ కింద రాజధాని జోన్ 8లో ఎకరా అభివృద్దికి ఏకంగా రెండు కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఇంత వ్యయం దేశంలో ఇంకెక్కడైనా జరుగుతుందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అమరావతి ట్రంక్ రోడ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆమోదించిన మొత్తం ఖర్చు రూ.7794 కోట్లుగా ఉండడంపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వరద నీటిని ఎత్తిపోయడానికి ఏ రాజధానిలోనూ వరదనీటి ఎత్తిపోతకు ప్రత్యేక లిఫ్ట్లు లేవని ప్రముఖ నిపుణుడు రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. హైదరాబాద్ వంటి చోట్ల కూడా భూమి కొనుగోలు చేసి నిర్మాణాలు చేసినా చదరపు అడుగుకు రూ.నాలుగైదు వేలు కాదని, అమరావతిలో మాత్రం రూ.తొమ్మిది, పది వేలు అవడానికి కారణం ఏమిటన్నది మరికొందరి ప్రశ్న. చంద్రబాబు అండ్ కో రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నా రియల్ ఎస్టేట్ పెద్దగా లేకపోవడం అక్కడివారిలో నిరాశకు దారి తీస్తోంది. గతంలో అమరావతికి మద్దతుగా మాట్లాడిన వడ్డే శోభనాద్రీశ్వర రావు, పరకాల ప్రభాకర్ వంటి కొందరు ప్రముఖులు రాజధాని స్థల ఎంపికను తప్పుపడుతున్నారు. అంతేకాక, ప్రస్తుతం ఉన్న 53 వేల ఎకరాల భూమి చాలదని, మరో నలభైవేల ఎకరాలు తీసుకోవడానికి ప్రభుత్వం పూనుకోవడాన్ని ఆక్షేపిస్తున్నారు. రెండో దశ పూలింగ్కు సహకరించవద్దని వడ్డే శోభనాద్రీశ్వరరావు రైతులకు పిలుపునిచ్చారు కూడా. అయినా ప్రభుత్వం రెండో దశ పూలింగ్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. తొలిదశ రైతులకు ఇచ్చిన హామీలను ఏ మేరకు నెరవేర్చారని, తమకు ఏ గ్యారంటీలు ఇస్తారని రెండో దశ గ్రామాల రైతులు ప్రశ్నిస్తున్నారు..ఈ పరిణామాలతో ఒకప్పుడు చంద్రబాబుకు గట్టి మద్దతుదారులుగా ఉన్న రైతులలో సైతం ఇప్పుడు ఏమి జరుగుతోందో తెలియక ఇదంతా ఒక పజిల్గా మారిందని వాపోతున్నారు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
సాక్షి,గుంటూరు: సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సొంత గ్రామాల మీద మమకారానికి మనమంతా ఇచ్చే గౌరవానికి సంక్రాంతి పండుగ ఒక ప్రతీక.భోగి మంటలు, రంగ వల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, గాలి పటాల సందళ్ళు, పైరు పచ్చల కళకళలు గ్రామాల్లో ఎనలేని సంక్రాంతి శోభను తీసుకువచ్చాయి. ఈ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఎంతో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. -
పవన్పై అంబటి సెటైర్లు.. ‘అది ఓ ఆర్టే’
సాక్షి,గుంటూరు: సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. క్రెడిట్ చోరీ చంద్రబాబు నిష్ణాతుడైతే.. తనలోని ఆరర్ట్స్ని ప్రదర్శించడంలో పవన్ కళ్యాణ్ దిట్టా అని ఎద్దేవా చేశారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. క్రెడిట్ చోరీలో చంద్రబాబు నిష్ణాతుడు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్ట్ విషయంలో కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. భూ కేటాయింపులు, అనుమతులు, పునరావాసం వంటి కీలక పనులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగాయి.పదివేల ఎకరాలు కావాలని చంద్రబాబు కోరగా ప్రజలు తిరగబడ్డారని, తాము వచ్చాకే సరిపడా భూమికి కుదించాం. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సహకరిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తోందని చంద్రబాబు చెప్పే మాటలు బడాయి మాత్రమే. మా హయాంలోనే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా 32 లక్షల ఉద్యోగాలు వస్తే.. గత చంద్రబాబు కేవలం 9 లక్షల ఉద్యోగాలే వచ్చాయి. కరెంటు, తాగునీరు సహా అనేక పన్నులు వేసి ప్రజలను బాధపెడుతున్న ఘనత చంద్రబాబుదే. ఛార్జీలు పెంచేదిలేదన్న ఆయన రూ.20 వేల కోట్లపైనే కరెంటు ఛార్జీలు పెంచారు. వైఎస్ జగన్ అప్పు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు.. గత 18 నెలల్లోనే రూ.3.7 లక్షల కోట్ల అప్పు చేశారు. మరి దీన్ని ఏం అనాలో చంద్రబాబే చెప్పాలి. పవన్ కళ్యాణ్ చాలా ఆర్ట్స్ ఉన్నాయి. రాజకీయాల్లో నటించటం కూడా పవన్కు తెలిసిన విద్యే. చంద్రబాబును అనవసరంగా పొగడటం, వైఎస్ జగన్ను తిట్టినందుకు రహస్యంగా గిఫ్టులు అందుకుంటున్నారు. అది కూడా ఒక ఆర్టే. జనసేన నెత్తిమీద ఎక్కి టీడీపీ వారు డాన్స్ చేస్తున్నారు. ముందుగా మీ కార్యకర్తలను కాపాడుకో పవన్.పవన్ కళ్యాణ్ ఎక్కడ పడితే అక్కడ డాన్స్ చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామితో ఆటలాడొద్దని హితువు పలికారు. -
KSR Comments: అమరావతి పెద్ద స్కామ్.!
-
మరో వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
సాక్షి,అనంతపురం: టీడీపీ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు మరోసారి వివాదాస్పద ఘటనలో చిక్కుకున్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు ఫకృద్దీన్ చేసిన ఫిర్యాదు ఈ సంఘటనను వెలుగులోకి తెచ్చింది.ఫిర్యాదు ప్రకారం, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులు ఎగ్జిబిషన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నిర్వాహకుడు డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో, వారు మద్యం సేవించి ప్రాంగణంలో హంగామా సృష్టించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ హంగామా సమయంలో ఎగ్జిబిషన్ సిబ్బందిపై దాడి జరగడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సిబ్బంది భయాందోళనకు గురయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు.నిర్వాహకుడు ఫకృద్దీన్ అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ వద్ద అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ముఖ్య అనుచరుడు గంగారాం ఆయన గన్మెన్ షేక్షావలి బెదిరింపులు చేసినట్లు వివరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పది మంది మంత్రులు YS జగన్ పై ఎదురుదాడి..
-
YS జగన్ ప్రశ్నిస్తే తప్పా: Sajjala
-
మైసూరు బోండంలో మైసూరు ఉండదు.. మన రాజధానిలో అమరావతి ఉండదు
-
తప్పుడు వార్తలతో అమరావతి రైతులపై కుట్ర
-
టీడీపీ నేతల మైకుల్లో మారుమోగిన జగన్ మంచితనం
-
రాజధాని చంద్రబాబు జాగీరు కాదు: శైలజానాథ్
సాక్షి, తాడేపల్లి: ఏపీ రాజధాని ముఖ్యమంత్రి చంద్రబాబు జాగీరు కాదని మండిపడ్డారు మాజీ మంత్రి సాకే శైలజానాథ్. రాయలసీమకు అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా? అని ప్రశ్నించారు. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే కదా అని ఎద్దేవా చేశారు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి.. మీకు అనుకూలంగా ఉండే చోట కాదంటూ హితవు పలికారు.మాజీ మంత్రి సాకే శైలజానాధ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రాజధాని చంద్రబాబు జాగీరు కాదు. దాని గురించి మాట్లాడితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. ఏమీ చేయలేని వారే కోపపడుతుంటారు. రాయలసీమను అన్యాయం చేసి అమరావతిలో వేల కోట్లు ఖర్చు చేస్తారా?. రాజధానిలో మా రాయలసీమ చెమట, రక్తం కూడా ఉంటుంది. అలాంటి రాజధానిని మీ ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే సహించం. రాజధానిలో జరుగుతోంది నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమమే. దాదాపు వెయ్యి కోట్లు నీటిని ఎత్తిపోసేందుకే ఖర్చు చేశారు. అమరావతిలో బిల్డింగుల నిర్మాణానికి చాలా ఖర్చు ఎక్కువ అవుతోంది.చంద్రబాబు పుణ్యమా అని రామారావు అనే రైతు గుండె పగిలి చనిపోయాడు. రాజధాని అనేది జనానికి అనువుగా ఉండాలి. మీకు అనుకూలంగా ఉండే చోట కాదు. ఎకరా అభివృద్దికి రెండు కోట్లు చొప్పున మౌళిక సదుపాయాల ఖర్చు చేస్తారా?. మీరు తెచ్చే అప్పులకు ప్రతి ఏటా పదహారు వేల కోట్లు వడ్డీలే కట్టాలి. ఇదంతా రాష్ట్రమంతా భరించాలి. ఇది ఎవరి సొమ్ము?. నారాయణ కాలేజీల నుంచి డబ్బు తెస్తున్నారా?. రాజధాని గురించి ఎవరూ అడగటానికి వీల్లేదా?. రెండు ఎత్తిపోతల పథకాలు, మూడు రిజర్వాయర్లు కట్టాల్సి ఖర్మ ఏంటి?. ప్రజల కోసం జగన్ మాట్లాడితే మీకు ఎందుకు కోపం వస్తోంది?. రాయలసీమకు నష్టం చేయవద్దని చెబితే చంద్రబాబుకు అంత కోపం ఎందుకు?. చంద్రబాబు కట్టేది నీళ్లలో తేలియాడే నగరమా?. సమాధానం చెప్పలేకనే చంద్రబాబుకు కోపం వస్తోంది.అమరావతిలో వేల ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం చేస్తారా? అది సాధ్యమయ్యే పనేనా?. ఆల్రెడీ ఉన్న గన్నవరం ఎయిర్పోర్టును ఏం చేస్తారు?. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేసినట్టు దాన్ని కూడా నిలిపేస్తారా?. మునిగిపోయే ప్రాంతంలో ఎవరూ ఇల్లు కూడా కట్టుకోరు. మరి రాజధానిని ఎలా కడతారు?. రాజధాని సెల్ఫ్ ఫైనాన్స్ అన్నారు. మరి ఇప్పటి వరకు ఏ సెల్ఫ్ ఫైనాన్స్తో కడుతున్నారు?. అమరావతిలో కడుతోంది రాజధాని కాదు, లిఫ్టు ఇరిగేషన్లే. వడ్డమానులో భూ సమీకరణకు వెళ్తే రైతులు ఛీ కొట్టారు. భూములు ఇవ్వకపోతే లాగేసుకుంటామని బెదిరిస్తారా?. అందుకే రామారావు లాంటి రైతులు చనిపోతున్నారు. రాజధాని అందరిదీ, అదేమీ చంద్రబాబు జాగీరు కాదు. రాజధాని విషయంలో దేవతా వస్త్రాలు కట్టుకున్నట్లు వ్యవహరించవద్దు. అప్పులు తెస్తూ రుణ సమీకరణ అంటూ కొత్త పదాలు చెబుతున్నారు. ప్రజలు లేని రాజధానిని కడుతున్నారు. మీ రాజధాని కోసం మా చెమట, రక్తాన్ని ధారపోయవద్దు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి. నాలుగు గోడల మధ్య కూర్చుని మాట్లాడుకుని నిర్ణయాలు తీసుకోవటానికి అదేమీ మీ ఇంటి విషయం కాదు. రైతుల పక్షాన మేము నిలబడతాం. రైతుల తరపున పోరాడుతాం. రానున్న రోజుల్లో రాజధాని గురించి అందరూ మాట్లాడతారు’ అని వ్యాఖ్యానించారు. -
రెండో విడత భూసేకరణపై వైఎస్.జగన్ ఆగ్రహం
-
బాబును నిలదీసిన అమరావతి రైతులు


