Top Stories
ప్రధాన వార్తలు

‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే లేఖ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్కు ఆరు పేజీల లేఖలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. మై డియర్ డాడీ అంటూ కేసీఆర్కు రాసిన ఆరు పేజీల లేఖలో వరంగల్ సభ సక్సెస్ అయ్యిందంటూనే.. పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది మార్చి నెలలో బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్ని నిర్వహించింది. ఆ వేడుకలపై, అంతకు ముందు పరిణామాలపై..ఆ తర్వాత పరిణామాలను కేసీఆర్కు రాసిన లేఖకు కవిత ప్రస్తావించారు. పాజిటీవ్,నెగిటీవ్ ఫీడ్ బ్యాక్ అంటూ వివరంగా లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. బీజేపీపై 2 నిమిషాలే మాట్లాడడంపై అనేక అనుమానాలున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేజన్లపై విస్మరించారు. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నవారికి వేదికపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా? తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ గీతం మార్చడంపై మోటివేట్ చేస్తారని అందరూ ఎదురు చూశారు. ఓవరాలుగా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. పార్టీ లీడర్స్కు యాక్సెస్ ఇవ్వడం లేదు. బీజేపీతో పొత్తుపై సిల్వర్ జూబ్లీ వేడుకల్లో క్లారిటీ ఇవ్వలేదు. వక్ఫ్ బిల్లుపై మాట్లాడి ఉంటే బాగుండేది. ఎస్సీ వర్గీకరణపై నోరు విప్పలేదు. పాత ఇన్ఛార్జ్లకే బీ ఫారమ్ ఇస్తారా?. బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డా. బీజేపీని టార్గెట్ చేసి ఉంటే బాగుండేది’ అని కేసీఆర్కు రాసిన లేఖలో కవిత ప్రస్తావించారంటూ ఆరు పేజీల లేఖ ఒకటి వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ లేఖపై బీఆర్ఎస్ లేదంటే, ఎమ్మెల్సీ కవిత అధికారికంగా స్పందించాల్సి ఉంది.

‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ, ప్రశ్నించే గొంతులు నొక్కుతూ, యథేచ్ఛగా రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వ అనైతిక పర్వాన్ని నిలదీశారు.‘‘రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జరిగిన హత్యలు 390. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు 2,466. జైలుకు వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు 500 మంది. అక్రమ కేసులు నమోదైన సోషల్ మీడియా యాక్టివిస్టులు 440 మంది...కేసులు నమోదై జైలుకు వెళ్లిన సోషల్ మీడియా యాక్టివిస్టులు 79 మంది. దాడులకు గురైన జర్నలిస్టులు 11 మంది. జర్నలిస్టులపై అక్రమ కేసులు 63. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198. ప్రజాసంఘాల నాయకులపై అక్రమ కేసులు 73. జైలుకు వెళ్లిన ప్రజాసంఘాల నాయకులు 2. జైళ్లకు వెళ్లిన జర్నలిస్టులు 8 మంది’’ అని మీడియాకు వివరించారు.‘‘టీడీపీ పాలనలో వేధింపులకు గురైన అధికారులు 199 మంది. వారిలో ఏఎస్పీలు 27, డీఎస్పీలు 42, సీఐలు 119 మంది. ఐపీఎస్లు డీజే ర్యాంకు అధికారి. పీఎస్ఆర్ అంజనేయులు, డీజే ర్యాంక్ దళిత అధికారి సునీల్ కుమార్, అడిషనల్ డీజీ ర్యాంకు అధికారి సంజయ్ ఐపీఎస్, సీనియర్ ఆఫీసర్, ఐజీ ర్యాంక్ కాంతిలాల్ రాణా, ఐజీ ర్యాంక్ ఆఫీసర్ విశాల్ గున్నీ, ఐజీ ర్యాంకు అధికారి రఘురామిరెడ్డి, రవిశంకర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి ఐపీఎస్ లు, ఐపీఎస్ అధికారి పి.జాషువా, వేధింపులకు గురయ్యారు. మరో రిటైర్డ్ అధికారి విజయ్పాల్ను అక్రమంగా అరెస్టు చేశారు. పార్టీ ట్విట్టర్ హ్యాండిల్, నా వ్యక్తిగత ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ఈ సమాచారాన్ని అప్ లోడ్ చేస్తాం’’ అని వైఎస్ జగన్ తెలిపారు.

ఇంగ్లండ్తో టెస్టు సిరీస్.. భారత జట్టులోకి స్టార్ ప్లేయర్! ఎవరంటే?
టీమిండియా స్టార్ పేసర్ అర్ష్దీప్ సింగ్ త్వరలోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. ఇంగ్లండ్ పర్యటనకు 26 ఏళ్ల అర్ష్దీప్ ఎంపిక చేయాలని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణంయిచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు సిద్దంగా ఉండాలని ఈ పంజాబ్ పేసర్కు సెలక్టర్లు సూచించినట్లు సమాచారం.అర్ష్దీప్ రాకతో భారత టెస్టు జట్టులో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ లేని లోటు తీరనుంది. కాగా వన్డే, టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసిన అర్ష్దీప్.. టెస్టుల్లో మాత్రం ఇంకా డెబ్యూ చేయలేదు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో రెగ్యూలర్గా ఆడుతున్నప్పటికి టీమిండియా తరపున టెస్టుల్లో ఆడే అవకాశం మాత్రం సింగ్కు రాలేదు. ఇంగ్లండ్ టూర్తో అతడు మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం ఖాయమన్పిస్తోంది. అర్ష్దీప్కు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడిన అనుభవం ఉంది. అక్కడి పరిస్థితులు అర్ష్దీప్కు బాగా తెలుసు. ఈ క్రమంలోనే అతడిని ఇంగ్లండ్కు పంపాలని అగర్కాకర్ అండ్ కో భావిస్తున్నట్లు వినికిడి.తన కెరీర్లో ఇప్పటివరకు 21 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అర్ష్దీప్.. 66 వికెట్లు పడగొట్టాడు. గత రంజీ సీజన్లో అతను రెండు మ్యాచ్లు ఆడి నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇక ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు భారత జట్టును బీసీసీఐ మే 23న ప్రకటించే అవకాశముంది. కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు విడ్కోలు పలకడంతో కొత్త కెప్టెన్తో మెన్ ఇన్ బ్లూ ఇంగ్లండ్కు పయనం కానుంది. భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్గా శుబ్మన్ గిల్ ఎంపిక దాదాపు ఖారరైనట్లు సమాచారం. మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సైతం టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడి స్ధానాన్ని ఎవరి భర్తీ చేస్తారో వేచి చూడాలి. జూన్ 20 నుంచి భారత్- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.ఇంగ్లండ్తో సిరీస్కు భారత జట్టు(అంచనా)కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్,, ధ్రువ్ జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, బుమ్రా, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, అర్ష్దీప్ సింగ్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు

ఉంగరంతో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు, ఈలోపే..
చూడచక్కని జంట. ఒకే దగ్గర కలిసి పని చేస్తున్నారు. ఒకరినొకరు గాఢంగా ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలనుకుంది. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్లు.. విధి ఆడిన వింత నాటకంలో అనూహ్యంగా ఇద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయారు.యారోన్, సారా.. ఇద్దరూ ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది. బుధవారం సాయంత్రం వాషింగ్టన్లోని యూదుల మ్యూజియం వద్ద జరిగిన వేడుకలో కలిసే పాల్గొన్నారు. అయితే ఓ దుండగుడు అత్యంత సమీపంగా నలుగురు ఉన్న బృందంపైకి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఈ ఇద్దరే మరణించారు. ఆ తర్వాతే తెలిసింది ఏంటంటే.. త్వరలో ఆ యువకుడు ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేయాలనుకున్నాడని!యారోన్, సారా మంచి మిత్రులు మాత్రమే కాదు.. ఒకరికొకరు ఇష్టపడ్డారు కూడా. వచ్చే వారం జెరూసలేంలో సారాకు ఉంగరం ఇచ్చి ప్రపోజ్ చేయాలని యారోన్ సిద్ధంగా ఉన్నాడు. ఈలోపే ఇలా జరిగింది. ఎంతో జీవితం ఉన్న ఆ యువ జంట జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడం నిజంగా బాధాకరం అని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబారి యెచెయిల్ లెయిటర్ తెలిపారు. ఇదిలా ఉంటే.. ఉగ్రదాడిలో యువ జంట మరణించడంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాల్పుల ఘటన తర్వాత దుండగుడ్ని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతను ఫ్రీ పాలస్తీనా నినాదాలు చేశాడు. అతన్ని చికాగోకు చెందిన ఎలియాస్ రోడ్జిగూజ్గా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతన్ని దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. ఇదీ చదవండి: ఇలాంటివి అమెరికాలో కుదరవు-ట్రంప్

జూన్ 4న వెన్నుపోటు దినం: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ నిరసన గళం వినిపిస్తూనే ఉంటుందని పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో.. ఎన్నికల ఫలితాలు వెలువడిన తేదీ జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినం(Vennupotu Day)గా నిర్వహిస్తామని ప్రకటించారాయన. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా నిర్వహిస్తాం. ఆరోజున ప్రజలతో కలిసి నిరసనలు చేపడతాం. కలెక్టర్లను కలిసి హమీల డిమాండ్ పత్రాలను సమర్పిస్తాం. చంద్రబాబు చేసిన మోసానికి నిరసనగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా కలిసి రావాలని కోరారాయన.ఇదీ చదవండి: YS Jagan-నాకు పోరాటాలు కొత్త కాదు

'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'
టెక్నాలజీ వల్ల లాభాలు ఎక్కువగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆల్ఫాబెట్కు చెందిన గూగుల్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ అయిన క్యారెక్టర్.ఏఐ తన కొడుకు ఆత్మహత్యకు కారణమైందని ఓ తల్లి కోర్టు మెట్లెక్కింది.అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన మెగన్ గార్సియా.. తన 14 ఏళ్ల కొడుకు 'సెవెల్ సెట్జర్' ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏఐ చాట్బాట్తో చాటింగ్ చేసినట్లు పేర్కొంది. పిల్లల మానసిక బాధ లేదా ప్రవర్తన నుంచి బయట పడేయడంలో ఏఐ విఫలమైందని ఆ మహిళ ఆరోపించింది.ఏఐ చాట్బాట్ పట్ల ఒక యువకుడు ఎంతగానో మక్కువ పెంచుకున్నాడనే దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే చాట్బాట్ల అవుట్పుట్ రాజ్యాంగబద్ధంగా ఉన్న స్వేచ్ఛా వాక్ స్వాతంత్య్రాన్ని కలిగి ఉన్నందున కేసును కొట్టివేయాలని గూగుల్, ఏఐ సంస్థ విజ్ఞప్తి చేశాయి. అయితే దీనిపై యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అన్నే కాన్వే ఏకీభవించలేదు. అంతే కాకుండా కంపెనీ తప్పకుండా జవాబుదారీ తనంతో ఉండాలని పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఉద్యోగాలు కనుమరుగవుతాయా?: మాయ చేస్తున్న మరమనుషులుఏఐ చాట్బాట్ ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తుంది. అయితే అడిగే ప్రశ్న మంచిదా?, ప్రమాదాన్ని కలిగిస్తుందా? అనే విషయం ఏఐ గుర్తించడం లేదు. ఒక వ్యక్తి ఎలా చనిపోవాలి అని అడిగితే.. దానికి కూడా తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. మానసిక బాధతో ఉన్న వ్యక్తులు ఏఐను ఒక ఫ్రెండ్ లేదా అంతకంటే ఎక్కువే అనుకుంటారు. అలాంటి సమయంలో ఏఐ ఇచ్చే సలహాలు ప్రమాదానికి కారణమవుతున్నాయి. కాబట్టి ప్రశ్న ఎలాంటిదో.. ముందు ఏఐ దానిని తప్పకుండా గమనించేలా కంపెనీలు కూడా సవరణలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

‘రన్యారావుకు హోంమంత్రి పెళ్లి గిప్ట్ ఇచ్చారు’.. ఈడీ రైడ్స్పై డిప్యూటీ సీఎం డీకే
సాక్షి,బెంగళూరు: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రోజుకో అంశం వెలుగులోకి వస్తోంది. రన్యారావుకు కర్ణాటక హోం మంత్రి జీ.పరమేశ్వరకు చెందిన విద్యాసంస్థలకు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విద్యాసంస్థలపై దాడులు జరిపారు. అయితే ఈ దాడులపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఈడీ దాడులు జరిపిన నేపథ్యంలో డీకే శివకుమార్.. జీ పరమేశ్వరను పరామర్శించారు. అనంతరం, డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. పరమేశ్వర.. రన్యారావుకు పెళ్లికి గిప్ట్ ఇచ్చారట. ఇందులో తప్పేముంది. నటికి గిఫ్ట్ ఇచ్చిన విషయాన్ని ఆయనే స్వయంగా నాకు చెప్పారు.రన్యారావుది పెళ్లి కార్యక్రమం. ప్రజాజీవితంలో ఉన్నం. విద్యా సంస్థల్ని నడుపుతాం. తెలిసిన వారికి గిప్టులు ఇస్తుంటాం. వాటి ఖరీదు. ఒక్క రూపాయి, పది రూపాయలు, పది లక్షలు, ఐదు లక్షలు ఉండొచ్చు. అలాగే ఆయన (పరమేశ్వర)కూడా రన్యారావు పెళ్లి కానుకగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఇందులో తప్పేముంది’ అని అన్నారు. రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ వంటి చర్యల్ని తాము సమర్ధించబోమన్నారు.డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై పరమేశ్వర స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆయననే అడగండి’అని వ్యాఖ్యానించారు.

అనకాపల్లి: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టు
సాక్షి, అనకాపల్లి జిల్లా: అచ్యుతాపురం కేంద్రంగా భారీ సైబర్ డెన్ గుట్టురట్టరయ్యింది. అచ్యుతాపురం శివారులో ఫేక్ కాల్ సెంటర్ ముసుగులో ఈ సైబర్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 44 ఫ్లాట్స్ అద్దెకు తీసుకుని.. గత రెండేళ్ల నుండి సైబర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు. నెలకి రూ.15 నుంచి 20 కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.అమెరికా పౌరులే లక్ష్యంగా కాల్ సెంటర్ ముసుగులో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరాలకు పాల్పడుతున్న 33 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, రాజస్థానకు చెందిన ఇద్దరు ప్రధాన మేనేజర్లు నడిపిస్తున్నారు. మేఘాలయ, సిక్కిం, అస్సాం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు ఇందులో పనిచేస్తున్నారు. అమెరికా పౌరులతో ఎలా మాట్లాడాలో రెండు వారాలు ట్రైనింగ్ ఇస్తున్నారు. అమెజాన్ ఈ మార్కెట్ పేరుతో సైబర్ కాల్స్, వాల్నట్, సూపర్ మార్కెట్ గిఫ్ట్ కూపన్ లా పేరుతో నాలుగు దశల్లో ట్రాప్ చేస్తున్నారు.3 వందల డాలర్ల నుంచి 3,000 డాలర్ల వరకు కూపన్లు ఒక్కొక్కరికి అమ్ముతున్నారు. ఇందులో 200 నుండి 250 మంది కాల్ సెంటర్లో పని చేస్తున్నారు. మొదట వీరందరికీ ఉద్యోగాల పేరుతో ఎరవేస్తున్నారు. అపార్ట్మెంట్లకు 18 లక్షల రూపాయలు చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. పోలీసులు.. అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు. రూ.3 లక్షల నగదు, 300కు పైగా కంప్యూటర్స్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని.. అపార్ట్మెంట్ ఓనర్లపై కూడా విచారణ జరుపుతామని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు.

ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా.. బండారు సంచలన వ్యాఖ్యలు
సాక్షి, పాయకరావుపేట: ఏడాది నుంచి ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నానంటూ టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మహానాడు వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నిధులు కేటాయింపులో వివక్ష చూపుతున్నారు. ప్రజల్లో తిరగలేకపోతున్నా.. సమాధానం చెప్పలేకపోతున్నా.. ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయా’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై వివక్ష చూపిస్తున్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ప్రస్తావించి నిధులు ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. మాడుగుల చోడవరం ప్రజలు టీడీపీకీ ఓటు వేయలేదా?. ప్రశ్నించే వేదిక ఇదే.. నేను ప్రెస్ మీట్ పెట్టి అడగడం లేదు. ఆరోపించడం లేదు. అందుకే మహానాడు ద్వారా మంత్రులను నియోజకవర్గం ప్రజల తరపున ప్రశ్నిస్తున్నా’’ అంటూ బండారు వ్యాఖ్యానించారు.మరో వైపు, టీడీపీ కాకినాడ జిల్లా మహానాడులో టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కూడా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో కూటమి ఎన్నాళ్లు ఉంటుంది.. పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు.. కూటముల నుంచి ఎన్నిసార్లు బయటకు రాలేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రభుత్వంలో పదవులు ఎవరికి ఇస్తున్నారు?. పార్టీ నిర్ణయాల వల్ల టీడీపీ నిర్వీర్యం అయిపోతుందని చెప్పుకొచ్చారు.

రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్కొన్న అజ్ఞాత వ్యక్తి, అంబానీ పండిట్ వైరల్
200 కోట్ల రూపాయల విలువైన ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేశాడోవ్యక్తి. మరి అంత విలాసవంతమైన జెట్ కొన్నా తరువాత అంతే భక్తితో దైవిక పూజలు నిర్వహించి, దేవుడి ఆశీర్వాదం తీసుకోకుండా ఉంటాడా. అదీ ఖరీదైన పూజారి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించాడు. ఇదే ఇపుడు నెట్టింట హాట్ టాపిక్గా నిలిచింది. ఇంతకీ ఆ లగ్జరీప్రైవేట్ జెట్ ఓనరు ఎవరు? పూజలు చేసిన పండితుడు ఎవరు? తెలుసుకోవాలని ఉందా? ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారిన ఆవివరాలు మీకోసం.బెంగళూరుకు చెందిన మిస్టరీ వ్యక్తి తన ప్రైవేట్ జెట్ను సొంతం చేసుకున్నాడు. రూ. 200 కోట్లదీని ధర రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల వరకు ఉంటుంది. బిలియనీర్, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట పూజలు నిర్వహించే ప్రసిద్ధ పూజారి పండిట్ చంద్రశేఖర్ శర్మ ఈ వాహనానికి సంబంధించిన పూజలు నిర్వహించారు. స్వయంగా ఆయనే దీనికి సంబంధించిన ఒక క్లిప్ను పంచుకున్నారు. ప్రైవేట్ జెట్కు స్వాగత పూజలు చేశారు. ఈ ప్రైవేట్ జెట్ సాధారణమైనది కాదు. ఇది గల్ఫ్స్ట్రీమ్ G280 జెట్, జెట్ యజమానికి సంబంధించి పూర్తి వివరాలుఅందుబాటులో లేవు. కానీ ఈ జెట్ అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాన్ మారినోలో ఉన్న ఎంపైర్ ఏవియేషన్ కింద రిజిస్టర్ అయింది. పూజలు ఇండియా చేశారు కాబట్టి, దీని యజమాని భారతీయుడేనా? కాదా అనే దానిపై కూడా స్పష్టత లేదు. చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్పండిట్ చంద్రశేఖర్ శర్మ అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వివాహ వేడుకలో ఒక కార్యక్రమంలో ఆచారాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.తన ఐజీ హ్యాండిల్ ద్వారా ప్రైవేట్ జెట్లో పూజ చేస్తున్న వీడియోను షేర్ చేశారు. జెట్ టేకాఫ్ కావడానికి కొద్దిసేపటి ముందు పూజ జరిగిందని తెలిపాడు. View this post on Instagram A post shared by Pandit Chandrashekar Sharma (@pandit_chandrashekar)దాదాపు రూ. 200 కోట్ల ప్రైవేట్ జెట్ విశేషాలుగల్ఫ్స్ట్రీమ్ G280 జెట్ 10 మందికి ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. రెండు హనీవెల్ HTF7250G టర్బోఫ్యాన్ ఇంజిన్లు ఉంటాయి. ఇవి ఒక్కొక్కటి 33 కిలోన్యూటన్ల వరకు థ్రస్ట్ను మోయగలవు. దానితో పాటు, ప్రైవేట్ జెట్లో అధునాతన ఫీచర్స్, విలాసవంతమైన సేవలను అందిస్తుంది. ఇది గంటకు 900 కి.మీ వరకు ఎగురుతుంది.ఇదీ చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
వాళ్లే ఆదర్శం.. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటా: బెల్లంకొండ
‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
గుజరాత్ వర్సెస్ లక్నో లైవ్ అప్డేట్స్
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'
మైసూర్ శాండల్తో తమన్నా ఢీల్పై విమర్శలు.. మంత్రి వివరణ
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు నోటీసులు
కెప్టెన్ సెంచరీ వృధా.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
డిగ్రీ తీసుకున్న కుమారుడు - ఆనందంలో కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
24 గంటల్లో 1618 కిమీ ప్రయాణించిన స్కూటర్
‘మై డియర్ డాడీ’ అంటూ.. కేసీఆర్కు కవిత సంచలన లేఖ
వాళ్లే ఆదర్శం.. రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటా: బెల్లంకొండ
‘చంద్రబాబు సర్కార్’ అరాచకాల చిట్టా విప్పిన వైఎస్ జగన్
గుజరాత్ వర్సెస్ లక్నో లైవ్ అప్డేట్స్
'నా కొడుకు చావుకు గూగుల్, ఏఐ కంపెనీలే కారణం'
మైసూర్ శాండల్తో తమన్నా ఢీల్పై విమర్శలు.. మంత్రి వివరణ
'ఆ రెండు ఓవర్లే మా కొంపముంచాయి.. లేదంటే విజయం మాదే'
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అత్త ఝాన్సీకి హైకోర్టు నోటీసులు
కెప్టెన్ సెంచరీ వృధా.. విండీస్ను చిత్తు చేసిన ఇంగ్లండ్
ఆకట్టుకున్న మానస హల్దీ వేడుకలు
నేడు మానస వివాహం.. పెళ్లి పెద్దగా కలెక్టర్ శ్రీహర్ష
ముక్కులో దూది.. నోటికి పది రౌండ్లు టేపు చుట్టుకుని..
పాకిస్తాన్ వద్దట! నరకానికే తీసుకుపొమ్మని బ్రతిమిలాడుతున్నాడు!
అక్కడ యుద్ధాలు ఆగిపోవడం ఏమోగానీ ఇక్కడ పాలన ఆగిపోయింది. కాస్త ఇటువైపు కూడా పట్టించుకోండి సార్!
అయ్యయ్యో చైనా.. ఎంత కష్టమొచ్చే?
ఏం చేస్తాం ఖర్మ.. గడపగడపకు వచ్చిన ప్రభుత్వాన్ని కాదనుకున్నాం!!
24 ఏళ్లకే 101 కిలోల బరువు : ఈజీడైట్తో దెబ్బకి 62 కిలోలకు!
ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
ఈ రాశి వారికి పలుకుబడి పెరుగుతుంది.. ఆస్తిలాభం
పవన్.. ఇంతగమ్మున ప్రజా వ్యతిరేకతా?
ధోని పాదాలకు నమస్కరించిన వైభవ్.. సీఎస్కే కెప్టెన్ రియాక్షన్ వైరల్
ఈ రాశి వారికి ఆకస్మిక ధన,వస్తులాభాలు
ఈ రాశి వారికి వ్యాపార , ఉద్యోగాలలో నూతనోత్సాహం.
విశాల్ జీవితంలో ఆ నలుగురు అమ్మాయిలు!
తమ్ముడూ మీ బావ లేడురా.. మనల్ని వదిలి వెళ్లాడురా..!
PKL వేలం.. అతడిపై కన్నేసిన ఫ్రాంఛైజీలు.. రిటెన్షన్ జాబితా ఇదే
చిన్నప్పటి ఫోటోతో అక్కకు 'బర్త్డే శుభాకాంక్షలు' చెప్పిన స్టార్ హీరో
వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్
దుబాయ్లో కంపెనీ గల్లంతు.. రూ.కోట్లు నష్టపోయిన భారతీయులు
సినిమా

భర్తతో ఆ హీరోయిన్ రొమాన్స్ చూసి ఏడ్చేసింది.. హీరో నిర్ణయంతో షాక్!
హీరో హీరోయిన్లు ఆన్స్క్రీన్ రొమాన్స్ బాగా పండిస్తే సినిమా విజయానికి అది దోహదం చేయవచ్చు. కానీ... అదే హీరో/ హీరోయిన్లకు అప్పటికే పెళ్లయి ఉంటే..ఆ పెళ్లికి అది పెనుముప్పుగా మారవచ్చు. ఇప్పుడు పెళ్లయిన నటీనటులు సినిమాల్లో రొమాన్స్ పండించడం వాటిని చూస్తూ కూడా సదరు నటీనటుల భార్య/భర్త ప్రొఫెషనల్గా మాత్రమే తీసుకోవడం సర్వసాధారణంగా మారిపోయి ఉండవచ్చు కానీ ఒకప్పుడు అది అంత సులభమైన విషయం కాదు. అదే పరిస్థితిని ఎదుర్కుంది అలనాటి ఒక సినిమా జంట.దాదాపు ఏభైఏళ్ల క్రితం అంటే, 1970ల చివరలో, బాలీవుడ్లో అత్యంత చర్చనీయాంశమైన ఆన్స్క్రీన్ జోడీగా పేరొందారు అమితాబ్ బచ్చన్ అలనాటి దక్షిణాది బ్యూటీ క్వీన్ రేఖ. వీరి గురించి గుసగుసలు కూడా పరస్పరం గుసగుసలాడాయి అన్నంతగా వార్తలు వ్యాపించాయి. వారిద్దరి మధ్యా పండిన అద్భుతమైన కెమిస్ట్రీ వెండితెరను వెలిగించింది ఆ గాఢమైన అనుబంధం వెనుక నటన మాత్రమే కాదు అంతకు మించి అని అభిమానులను కూడా నమ్మించింది. కానీ పుకార్లు తమ చుట్టూ తిరుగుతుండగా, అప్పుడూ ఎప్పుడూ అమితాబ్ మౌనంగానే ఉన్నారు. మరోవైపు, సీనియర్ నటి రేఖ మాత్రం తరచు వాస్తవాలు మాట్లాడుతూ వస్తున్నారు. తమ కథలోని అత్యంత నాటకీయ భావోద్వేగ క్షణాలలో ఒకటి 1978 బ్లాక్బస్టర్ ’ముకద్దర్ కా సికందర్’ విడుదల సమయంలో జరిగిందని రేఖ ఇటీవల చెప్పారు. .ఓ ఇంటర్వ్యూ సందర్భంగా రేఖ మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది. ’ముకద్దర్ కా సికందర్’ విడుదలకు ముందుగా ఆ సినిమా ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించారని, ఆ సమయంలో ఆ స్క్రీనింగ్ చూడడం కోసం అమితాబ్ బచ్చన్ కుటుంబం వచ్చిందని ఆమె గుర్తు చేసుకుంది. వారిని తాను ప్రొజెక్షన్ రూమ్లో నుంచి గమనిస్తూ ఉండిపోయానని తెలిపింది. ‘‘’ముకద్దర్ కా సికందర్’ ట్రయల్ షో చూడటానికి వచ్చిన బచ్చన్ కుటుంబాన్ని ప్రొజెక్షన్ రూమ్లో నుంచి చూస్తూ ఉన్నా. జయ ముందు వరుసలో కూర్చుంది. అతను (అమితాబ్) అతని తల్లిదండ్రులు ఆమె వెనుక వరుసలో ఉన్నారు. వారు ఆమెను నేను చూడగలిగినంత స్పష్టంగా చూడలేకపోయారు. ఆ సమయంలో నేను గమనించాను. అమితాబ్ నాకు (రేఖ) మధ్య మా ప్రేమ సన్నివేశాలు వస్తున్న సమయంలో, ఆమె ముఖం కన్నీటితో తడిసిపోవడం నేను చూడగలిగాను. ఒక వారం తర్వాత, పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ నాకు చెప్పారు. అతను నాతో కలిసి పనిచేయబోనని తన నిర్మాతలకు స్పష్టం చేశాడని. ఈ నిర్ణయం చాలామందిని షాక్కి గురి చేసింది. ఎందుకంటే అమితాబ్ రేఖ కలిసి పరిశ్రమకు అనేక విజయాలను అందించారు వారి జంటను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడ్డారు.ఏదైతేనేం.. ’ముకద్దర్ కా సికందర్’ తర్వాత, 1981లో వచ్చిన ఏకైక ’సిల్సిలా’ సినిమా వరకు వారు మళ్ళీ కలిసి కనిపించలేదు, ఈ సినిమా వారి వ్యక్తిగత జీవితాల చుట్టూ తిరుగుతున్న పుకార్లకు అద్దం పట్టింది. తన పట్ల అమితాబ్ కుటుంబం ఎప్పుడు ఎలా స్పందించినా, ఎల్లప్పుడూ జయ గురించి మాత్రం రేఖ గౌరవంగానే మాట్లాడింది, తామిద్దరి మధ్య శత్రుత్వం లేదా ద్వేషం అంటూ వచ్చిన వార్తలను కథలను తోసిపుచ్చింది. గత 1990లలో ఒక ఇంటర్వ్యూలో, రేఖ జయ గురించి తన భావాలను చాలా స్పష్టంగా చెప్పింది. ‘దీదీభాయ్ (జయ) చాలా పరిణతి చెందినది, చాలా కలుపుగోలు మనిషి. నేను ఇంతగా కలిసిపోయే మరో మహిళని చూడలేదు. ఆమె గౌరవించదగ్గ వ్యక్తి. ఆమెకు చాలా బలం ఉంది. నేను ఆమెని ఆరాధిస్తాను.‘ అంటూ చెప్పడం దీనికి నిదర్శనం. విశేషం ఏమిటంటే... 1981లో ‘సిల్సిల’ తర్వాత, అమితాబ్ రేఖ మళ్లీ కలిసి నటించలేదు.

మాజీ కోడలు సమంతను అభినందించిన అక్కినేని అమల!
టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇటీవలే నిర్మాతగా గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చింది. శుభం మూవీతో ఓ చిన్న పాత్రలో కనిపించిన సామ్.. ఈ సినిమాను తన సొంత బ్యానర్లో నిర్మించింది. ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఈ నేపథ్యంలోనే సమంత టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేసుకుంది. ఈ ఈవెంట్లో సమంత తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన జర్నీని తలచుకుంటూ ఎమోషనలైంది సామ్.తాజాగా ఓ ఛానెల్ నిర్వహించిన సినిమా అవార్డ్ ఈవెంట్లో మెరిసింది సమంత. ఈ ఈవెంట్లో 15 ఏళ్ల సినీ కెరీర్ను పూర్తి చేసుకున్న సమంతను ప్రత్యేకమైన అవార్డ్తో సత్కరించారు. ఈ సందర్భంగా సమంత టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు అన్నీ ఇచ్చింది.. ఇదే నా కర్మ భూమి అంటూ భావోద్వేగ ప్రకటన చేసింది. ఇదే ఈవెంట్కు హాజరైన అక్కినేని అమల.. సమంతను కొనియాడుతూ చప్పట్లు కొట్టి అభినందించింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ఇది చూసిన అభిమానులు అక్కినేని అమల తన మాజీ కోడలికి అభినందనలు తెలిపారంటూ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. 2010లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన 'యే మాయ చేసావే' చిత్రంతో సమంత రూత్ టాలీవుడ్లో హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగులో బృందావనం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అత్తారింటికి దారేది, కత్తి లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. 2018లో అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లాడిన సమంత ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకుంది. గతేడాది నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నారు. మరోవైపు సమంత బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో డేటింగ్లో ఉన్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.

‘కేసరి: చాఫ్టర్ 2(తెలుగు వెర్షన్)’ మూవీ రివ్యూ
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా దేశభక్తి చిత్రం ‘కేసరి: చాప్టర్ 2’. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 18న బాలీవుడ్లో రిలీజై మంచి టాక్ని సంపాదించుకుంది. ఇప్పుడీ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై మే 23న ఇది తెలుగులో రిలీజ్ కానుంది. ఈనేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ షో వేశారు. 1919లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండ ఉదంతాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా ఏప్రిల్ 13, 1919లో పంజాబ్లోని అమృత్సర్కు సమీపంలో ఉన్న జలియన్వాలా బాగ్లో సమావేశం అయిన భారతీయులపై అప్పటి పంజాబ్ జనరల్ డయ్యర్ విచక్షణారహితంగా కాల్పులు జరుపుతాడు. తనకున్న అధికార బలంతో ఈ మారణకాండ గురించి స్థానిక వార్తా పత్రికల్లో రాకుండా చేస్తాడు. ఈ ఘటనపై అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఓ కమిషన్ ఏర్పాటు చేస్తుంది. అందులో బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న భారత న్యాయవాది శంకరన్ నాయర్(అక్షయ్ కుమార్) కూడా ఉంటాడు. తమకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వాలని శంకరన్పై ఒత్తిడి తెస్తారు. కానీ జలియన్వాలా బాగ్ ఘటన వెనుక పెద్ద కుట్ర ఉందని శంకరన్కు అర్థమవ్వడంతో ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్(అనన్య పాండే)తో జనరల్ డయ్యర్పై కోర్ట్లో కేసు వేయిస్తాడు. బాధితుల తరపున ఆయన వాధిస్తాడు. డయ్యర్ తరపున వాధించేందుకు ఇండో బ్రిటన్ న్యాయవాది నెవిల్లే మెక్కిన్లే (ఆర్.మాధవన్) రంగంలోకి దిగుతాడు. ఎలాంటి సాక్ష్యాలే లేని ఈ కేసును శంకరన్ ఎలా డీల్ చేశాడు? డయ్యర్ చేసిన కుట్రను ప్రపంచానికి తెలియజేసేక్రమంలో శంకరన్కు ఎదురైన సమస్యలు ఏంటి? యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? చివరకు డయ్యర్ చేసిన తప్పులను సాక్ష్యాలతో సహా ఎలా బయటపెట్టాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే?శతాబ్దం క్రితం భారత్లో చోటుచేసుకున్న జలియన్ వాలాబాగ్ దురంతాన్ని ఇప్పటికీ మర్చిపోలేం. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భారతీయులపై నాటి బ్రిటిష్ పాలకులు జరిపిన మారణకాండ గురించి పుస్తకాలల్లో చదివాం. భారతీయ న్యాయవాది శంకరన్ చేసిన న్యాయ పోరాటం గురించి కూడా విన్నాం. ఈ రెండిటికి దృశ్యరూపం ఇస్తే.. అది ‘కేసరి: ఛాప్టర్ 2’ చిత్రం అవుతుంది. జలియన్ వాలాబాగ్ దురంతాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే..శంకరన్ చేసిన న్యాయ పోరుని హైలెట్ చేశారు. నిజంగా అప్పట్లో బ్రిటీష్ ఉన్నతాధికారిపై కేసు వేయడం అనేది ఆషామాషీ వ్యవహరం కాదు. కానీ బ్రిటిష్ వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యుడిగా ఉన్న శంకరన్ ఆ సాహసం చేశాడు. దేశ స్వాతంత్రం కోసం ఆయన చేసిన త్యాగం ఎంత గొప్పదో దర్శకుడు కరణ్ సింగ్ మరోసారి తన సినిమా ద్వారా ప్రపంచానికి తెలియజేశాడు. ఈ హిస్టారికల్ కోర్ట్రూమ్ డ్రామాని అత్యంత సహజంగా తీర్చిదిద్దాడు. కోర్ట్ సన్నివేశాలే ఈ సినిమాకు కీలకం. శంకరన్, మెక్కిన్లే మధ్య జరిగే వాదనలు ఉత్కంఠను రేకిస్తూనే.. మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. జలియన్వాలాబాగ్ ఘటన సన్నివేశంతో సినిమా ప్రారంభం అవుతుంది . ఆ తర్వాత శంకరన్ నేపథ్యం, కమీషన్ ఏర్పాటు వరకు కథనం నెమ్మదిగా సాగుతుంది. శంకరన్ డయ్యర్కు వ్యతిరేకంగా వాదించడం మొదలు పెట్టినప్పటి నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. తొలి ట్రయల్లో శంకరన్ వాదనలు ఆకట్టుకుంటాయి. శంకరన్కి పోటీగా డయ్యర్ తరపున మెక్కిన్లే రంగంలోకి దిగడంతో కథనం మలుపు తిరుగుతుంది. సెకండాఫ్ మొత్తం కోర్ట్లో జరిగే వాదనల చుట్టూనే కథనం సాగుతుంది. క్లైమాక్స్ అదిరిపోతుంది. మొత్తంగా మనల్ని రెండున్నర గంటల పాటు ఆ కాలం నాటి పరిస్థితులను తీసుకెళ్లి.. బ్రిటీష్ పాలకులు చేసిన అరచకాలను చూపిస్తూనే స్వాతంత్రం కోసం మనవాళ్లు చేసిన పోరాటాలను గుర్తు చేసే చిత్రమిది. డోంట్ మిస్ ఇట్. ఎవరెలా చేశారంటే.. సర్ శంకరన్ నాయర్గా అక్షయ్ కుమార్ ఒదిగిపోయాడు. నిజమైన న్యాయవాదిలా ఆయన వాదనలు ఉంటాయి. క్లైమాక్స్లో ఆయన చేప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న మెక్ కిన్లేగా ఆర్ మాధవన్ ఒదిగిపోయాడు. యువ న్యాయవాది దిల్రీత్ గిల్గా అనన్య పాండే తనదైన నటనతో ఆకట్టుకుంది. శంకరన్ భార్యగా రేజీనా ఉన్నంతలో చక్కగానే నటించింది. మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సాష్వత్ సచ్దేవ్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు భావోద్వేగాన్ని రగిలించేలా ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితీరు అద్భుతం. 1919 నాటి పరిస్థితుల్ని.. నాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. తెలుగు డబ్బింగ్ చక్కగా కుదిరింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్డెస్క్

సడన్లో ఓటీటీకి వచ్చేసిన టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి, స్వాతి మందల్ జంటగా నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ 'ది డెవిల్స్ చైర్'(the devil's chair). ఈ సినిమాకు గంగ సప్తశిఖర దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. విడుదలైన మూడు నెలల తర్వాత ఎలాంటి ప్రకటన లేకుండానే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ ఆహాలో ది డెవిల్స్ ఛైర్ స్ట్రీమింగ్ అవుతోంది.ది డెవిల్స్ చైర్ కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
న్యూస్ పాడ్కాస్ట్

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్... మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు సహా 27 మంది మృతి... ఇది అసాధారణ విజయం అంటూ స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ

హామీలు నెరవేర్చలేకే రెడ్బుక్ కుట్రలు... బరితెగించి తప్పుడు కేసులతో ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన... వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు

సహ నిందితుల వాంగ్మూలం ఆధారమా?. బెయిల్ సమయంలో వారి వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోవడమా?

హైదరాబాద్ పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం... 17 మంది మృత్యువాత... మృతుల్లో 8 మంది చిన్నారులు

మద్యం కుంభకోణం పూర్తిగా కట్టుకథే... ఇది ముమ్మాటికీ రాజకీయ ప్రేరేపిత కేసే... ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహన్రెడ్డి తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించిన మాజీ అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్.. దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసిన సిట్

రాజకీయ దురుద్దేశాలకు తీవ్ర పర్యవసానాలు తప్పవు.. ఏపీలో మద్యం కేసు వెనుక పక్షపాతం, దురుద్దేశాలను కొట్టిపారేయలేం... కూటమి ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

విచారణ పేరుతో వేధింపులు... న్యాయస్థానం తీర్పు బేఖాతరు... రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్రెడ్డి పట్ల అభ్యంతకరంగా ఏపీ సిట్ తీరు

లిక్కర్ మాఫియా డాన్ చంద్రబాబే.. ఆధారాలతో సహా గతంలోనే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీఐడీ... ఆ కేసులో ముందస్తు బెయిల్పై బయట ఉన్న చంద్రబాబు

భారత వాయుసేనకు వందనం, పాకిస్తాన్కు లక్ష్మణరేఖ గీసి వచ్చారు... ఆదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించి, జవాన్లను ప్రశంసించిన ప్రధాని నరేంద్ర మోదీ

‘అణు’మాత్రం బెదరం. దాయాదికి మోదీ హెచ్చరికలు. ఉగ్ర భూతంపై ఆపరేషన్ సిందూర్
క్రీడలు

IPL 2025 Play-Offs: ఆర్సీబీలోకి పవర్ హిట్టర్.. ప్రకటన విడుదల
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి కొత్త ఆటగాడు చేరాడు. ఇంగ్లండ్ బ్యాటర్ జేకబ్ బెతెల్ (Jacob Bethel) స్థానాన్ని యాజమాన్యం న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫర్ట్ (Tim Seifert)తో భర్తీ చేసింది. ఇందుకు సంబంధించి ఐపీఎల్ గురువారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.కాగా ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ఐపీఎల్-2025 వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మే 17 నుంచి లీగ్ పునః ప్రారంభమైంది. అయితే, మధ్యలో విరామం వచ్చిన కారణంగా మే 25న జరగాల్సిన ఫైనల్.. జూన్ 3కు షెడ్యూల్ అయింది.మే 24న స్వదేశానికిఈ నేపథ్యంలో జాతీయ జట్టు విధుల దృష్ట్యా పలు ఫ్రాంఛైజీలకు చెందిన విదేశీ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్ మ్యాచ్లకు దూరం కానున్నారు. జేకబ్ బెతెల్ కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇంగ్లండ్ జట్టుతో చేరే క్రమంలో అతడు ఆర్సీబీని వీడనున్నాడు. మే 24న అతడు స్వదేశానికి వెళ్లనున్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ ముగిసిన తర్వాత జేకబ్ బెతెల్ ఆర్సీబీని వీడనున్నాడు.సెంచరీ మిస్ఈ క్రమంలో అతడి స్థానాన్ని కివీస్ వికెట్ కీపర్ బ్యాటర్ టిమ్ సీఫర్ట్తో ఆర్సీబీ భర్తీ చేసింది. కాగా న్యూజిలాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 66 మ్యాచ్లు ఆడిన టిమ్ సీఫర్ట్ 1540 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో పది అర్ధ శతకాలు ఉండగా.. అత్యధిక స్కోరు 97. కాగా టిమ్ సీఫర్ట్ రూ. 2 కోట్ల ధరతో ఆర్సీబీలో చేరనున్నాడు. మే 24 నుంచి అతడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు.కాగా జేకబ్ బెతెల్ ఆర్సీబీ తరఫున ఈ సీజన్లో కేవలం రెండు మ్యాచ్లు ఆడి 67 పరుగులు సాధించాడు. ఇందులో ఓ అర్ధ శతకం (55) ఉండటం విశేషం. మరోవైపు ఆర్సీబీకి ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం (మే 23) సన్రైజర్స్ హైదరాబాద్తో, మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్తో పాటిదార్ సేన తలపడనుంది.ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ చేరగా.. ముంబై ఇండియన్స్ బుధవారం తమ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక టాప్-4లో ఉన్న గుజరాత్ టైటాన్స్ కూడా ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్ సేవలను ప్లే ఆఫ్స్లో కోల్పోనుంది. వెస్టిండీస్తో సొంతగడ్డపై సిరీస్ నేపథ్యంలో బట్లర్ గుజరాత్కు దూరం కానున్నాడు.మరోవైపు.. ఈ నెల 26 తర్వాత దక్షిణాఫ్రికాకు చెందిన రికెల్టన్, కార్బిన్ బాష్... ఇంగ్లండ్ ప్లేయర్ విల్ జాక్స్ ముంబై జట్టును వీడనున్నారు. ఈ క్రమంలో ఫ్రాంఛైజీ వారి స్థానాలను జానీ బెయిర్స్టో (రూ. రూ.5.25 కోట్లు), రిచర్డ్ గ్లీసన్ (రూ. కోటి)తో పాటు శ్రీలంక ఆటగాడు చరిత అసలంక (రూ. 75 లక్షలు)తో భర్తీ చేసిన విషయం తెలిసిందే.చదవండి: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు

కెప్టెన్గా బుమ్రా.. సుదర్శన్కు దక్కని చోటు!.. శార్దూల్కు ఛాన్స్!
భారత టెస్టు జట్టు కొత్త కెప్టెన్ ఎవరు?.. ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్టు మ్యాచ్లు ఆడే జట్టు ప్రకటన ఎప్పుడు?.. భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడిదే చర్చనీయాంశం. మాజీ క్రికెటర్లలో దిగ్గజం సునిల్ గావస్కర్ సహా వసీం జాఫర్, క్రిష్ణమాచారి శ్రీకాంత్ తదితరులు జస్ప్రీత్ బుమ్రాకే పగ్గాలు అప్పగించాలని సూచిస్తున్నారు.మరోవైపు.. రవిశాస్త్రి వంటి మరికొంత మంది మాజీలు యువకుడైన శుబ్మన్ గిల్ను కెప్టెన్గా నియమించాలని, పేస్ దళాన్ని ముందుకు నడిపిస్తున్న బుమ్రాపై అదనపు భారం వద్దని అభిప్రాయపడుతున్నారు.కాగా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఈ సిరీస్తో టీమిండియా టెస్టు చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. ఇద్దరు స్టార్ల నిష్క్రమణ తర్వాత తొలిసారి విదేశీ గడ్డపై రెడ్బాల్ క్రికెట్లో భారత జట్టు ఎలా రాణిస్తుందనే అంశంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.వసీం జాఫర్ ఎంచుకున్న జట్టు ఇదేఇక మే 24న బీసీసీఐ ఇంగ్లండ్ టూర్కు జట్టును ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈలోపే భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ పదహారు మంది సభ్యులతో కూడిన తన జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు బుమ్రాను కెప్టెన్గా ఎంపిక చేసిన వసీం.. శుబ్మన్ను అతడికి డిప్యూటీగా నియమించాడు.సాయి సుదర్శన్, నితీశ్లకు మొండిచేయిఅయితే, మొదటి నుంచి రేసులో ఉన్న సాయి సుదర్శన్ పేరును మాత్రం వసీం జాఫర్ పరిగణనలోకి తీసుకోలేదు. ఐపీఎల్-2025లో అదరగొడుతున్న ఈ గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ను కాదని.. టెస్టు స్పెషలిస్టు, ఇంగ్లండ్ లయన్స్తో తలపడే భారత్-ఎ జట్టు కెప్టెన్ అయిన అభిమన్యు ఈశ్వరన్కు పెద్దపీట వేశాడు.అంతేకాదు.. ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీతో ఆకట్టుకున్న ఆంధ్ర పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి కూడా వసీం జాఫర్ మొండిచేయి చూపాడు. అతడికి బదులు సీనియర్ శార్దూల్ ఠాకూర్వైపే మొగ్గుచూపాడు.శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్ఇక వికెట్ కీపర్ల కోటాలో రిషభ్ పంత్తో పాటు ధ్రువ్ జురెల్కు స్థానమిచ్చిన వసీం జాఫర్.. మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే కరుణ్ నాయర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపాడు. ఇక స్పిన్ దళంలో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్తో పాటు.. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్కు చోటిచ్చాడు ఈ మాజీ క్రికెటర్.అదే విధంగా.. ఫాస్ట్ బౌలర్ల బృందంలో బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీలకు చోటిచ్చిన వసీం జాఫర్.. నాలుగో ఆప్షన్గా అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, ఆకాశ్ దీప్లలో ఒకరిని ఎంచుకుంటానని తెలిపాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఇంగ్లండ్తో టెస్టులకు తన జట్టును ప్రకటించిన వసీం జాఫర్.. మరి మీ ఎంపిక ఏమిటంటూ క్రికెట్ ప్రేమికులను అడగ్గా.. మెజారిటీ మంది అతడి జట్టుతోనే ఏకీభవిస్తున్నారు. కాగా జూన్ 20 నుంచి ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.ఇంగ్లండ్తో టెస్టులకు వసీం జాఫర్ ఎంచుకున్న భారత జట్టుయశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుబ్మన్ గిల్ (వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్/కరుణ్ నాయర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), మహ్మద్ సిరాజ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, అర్ష్దీప్ సింగ్/ప్రసిద్ కృష్ణ/ అకాశ్దీప్, వాషింగ్టన్ సుందర్.చదవండి: ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటు

ఇంగ్లండ్ టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు
India U-19 squad Announced for tour of England: ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అండర్-19 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) జూనియర్ సెలక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. ఐదు వన్డే, రెండు మల్టీ- డే మ్యాచ్లు ఆడేందుకు సెలక్టర్లు పదహారు మందితో కూడిన జట్టును ఎంపిక చేశారు. జూన్ 24- జూలై 23 వరకు సుదీర్ఘకాలం పాటు భారత జట్టు ఇంగ్లండ్లో పర్యటించనుంది.ఇందులో భాగంగా తొలుత 50 ఓవర్ల ఫార్మాట్లో వార్మప్ మ్యాచ్ జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్ల యూత్ వన్డే సిరీస్కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వనుంది. అనంతరం ఇరుజట్ల మధ్య రెండు మల్టీ-డే మ్యాచ్లు (Multi Day Matches) జరుగుతాయి.కెప్టెన్గా ఆయుశ్, వైభవ్ సూర్యవంశీకి చోటుఇక ఇంగ్లండ్ టూర్కు వెళ్లే భారత యువ జట్టుకు ముంబై ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ యువ సంచలనం ఆయుశ్ మాత్రే కెప్టెన్గా ఎంపికయ్యాడు. అతడికి డిప్యూటీగా అభిజ్ఞాన్ కుందును సెలక్ట్ చేశారు. అదే విధంగా.. ఐపీఎల్-2025లో దుమ్మురేపిన రాజస్తాన్ రాయల్స్ చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా ఈ జట్టులో చోటు దక్కింది.ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఆయుశ్, వైభవ్ల ఆట తీరుపైనే ఉండనుంది. పొట్టి క్రికెట్లో అదరగొట్టిన ఈ ఇద్దరు యంగ్ స్టార్లు.. యాభై ఓవర్లు, రెడ్ బాల్ క్రికెట్లో యూకేలో ఎలా రాణిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ.. మొత్తంగా ఏడు మ్యాచ్లు ఆడి 252 పరుగులు సాధించాడు.మరోవైపు.. ఆయుశ్ మాత్రే చెన్నై తరఫున ఓపెనర్గా బరిలోకి దిగి.. ఆరు మ్యాచ్లు ఆడి 206 పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్-2025లో తమదైన ముద్ర వేయగలిగారు.ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 పురుషుల జట్టుఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్సింగ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), హర్వన్ష్ సింగ్ (వికెట్ కీపర్), ఆర్.ఎస్. అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధాజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మొహ్మద్ ఇనాన్, ఆదిత్య రానా, అన్మోల్జీత్ సింగ్.స్టాండ్ బై ప్లేయర్లు: నమన్ పుష్కక్, డి. దీపేశ్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారి, అలంకృత్ రాపోలే (వికెట్ కీపర్).భారత్ అండర్-19 వర్సెస్ ఇంగ్లండ్ అండర్-19: 2025 షెడ్యూల్👉జూన్ 24- 50 ఓవర్ల వార్మప్ గేమ్- లోబోరో యూనివర్సిటీ👉జూన్ 27- తొలి వన్డే- హోవ్👉జూన్ 30- రెండో వన్డే- నార్తాంప్టన్👉జూలై 2- మూడో వన్డే- నార్తాంప్టన్👉జూలై 5- నాలుగో వన్డే- వోర్సెస్టర్👉జూలై 7- ఐదో వన్డే- వోర్సెస్టర్👉జూలై 12- తొలి మల్టీ డే మ్యాచ్- బెకింగ్హామ్👉జూలై 20- రెండో మల్టీ డే మ్యాచ్- చెమ్స్ఫోర్డ్.చదవండి: వాళ్లిద్దరి వల్లే నా పని సులువు.. అతడొక అద్భుతం: హార్దిక్ పాండ్యా

ఢిల్లీ క్యాపిటల్స్ అత్యంత చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి ఇలా
ఐపీఎల్-2025 (IPL 2025)ఆరంభంలో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్కు నిరాశే మిగిలింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టాప్-4 నుంచి అధికారికంగా నిష్క్రమించగా.. ముంబై ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించింది.గుజరాత్ టైటాన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్తో పాటు ముంబై టైటిల్ పోరులో నిలిచింది. మరోవైపు.. ముంబై చేతిలో ఓడిపోయిన ఢిల్లీ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఐపీఎల్ సీజన్లో తొలి నాలుగు మ్యాచ్లలో గెలిచి కూడా.. ప్లే ఆఫ్స్ చేరని ఏకైక జట్టుగా నిలిచింది.వరుసగా నాలుగు విజయాలుకాగా ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా అక్షర్ పటేల్ (Axar Patel) పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో తొలుత లక్నో సూపర్ జెయింట్స్తో తలపడ్డ ఢిల్లీ.. ఒక వికెట్ తేడాతో గెలుపొందింది. మరుసటి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్పై ఏడు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ను ఢీకొట్టిన అక్షర్ సేన.. చెపాక్లో సీఎస్కేను 25 పరుగుల తేడాతో ఓడించింది. అనంతరం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును తమ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఇలా సీజన్లోని తొలి నాలుగు మ్యాచ్లలో గెలుపొందిన ఢిల్లీ.. ఆ తర్వాత అదే జోరును కనబరచలేకపోయింది.ముంబై చేతిలో అపుడూ ఓడిన ఢిల్లీముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన(ఏప్రిల్ 13) ఢిల్లీ సీజన్లో తొలి పరాజయం చవిచూసింది. అయితే, మరుసటి మ్యాచ్లో రాజస్తాన్ రాయల్స్తో తలపడ్డ ఢిల్లీ అదృష్టవశాత్తూ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన అక్షర్ సేన.. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్పై సీజన్లో రెండో విజయం సాధించింది.అయితే, ఆర్సీబీ మాత్రం ప్రతీకారం తీర్చుకుని ఢిల్లీలోనే ఢిల్లీ జట్టును ఓడించింది. అనంతరం కోల్కతా నైట్ రైడర్స్ చేతిలోనూ అక్షర్ సేన ఓడిపోయింది. ఆ తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో గట్టెక్కింది. అనంతరం పంజాబ్ కింగ్స్తో ఢిల్లీ మ్యాచ్ సాంకేతిక కారణాల (ఆపరేషన్ సిందూర్) వల్ల ఆగిపోయింది.ఆ తర్వాత గుజరాత్ను ఢీకొట్టిన ఢిల్లీ పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తాజాగా ముంబై ఇండియన్స్ చేతిలో మరోసారి ఓటమిని చవిచూసింది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వాంఖడే వేదికగా ఢిల్లీ జట్టు.. హార్దిక్ సేనతో తలపడింది.సూర్య, నమన్ ధనాధన్టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఈ క్రమంలో ఆతిథ్య జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ (73 నాటౌట్), నమన్ ధీర్ (24 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ కుమార్ రెండు వికెట్లు కూల్చగా.. దుష్మంత చమీర, ముస్తాఫిజుర్ రహ్మాన్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.లక్ష్య ఛేదనలో ఢిల్లీ విలవిలఇక లక్ష్య ఛేదనలో ఢిల్లీ చేతులెత్తేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (11), తాత్కాలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (6).. వన్డౌన్ బ్యాటర్ అభిషేక్ పోరెల్(6) దారుణంగా విఫలమయ్యారు. సమీర్ రిజ్వీ (39), విప్రాజ్ నిగమ్ (20) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది.మిగతా వారంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో 18.2 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసి ఢిల్లీ ఆలౌట్ అయింది. దీంతో ముంబై చేతిలో 59 పరుగుల తేడాతో ఓడిపోయి.. టోర్నీ నుంచి నిష్క్రమించింది.ఇలా ఐపీఎల్ సీజన్ ఆరంభంలో వరుసగా తొలి నాలుగు మ్యాచ్లు గెలిచినప్పటికీ.. ప్లే ఆఫ్స్ చేరకుండా ఇంటిబాట పట్టిన తొలి జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ అపవాదును మూటగట్టుకుంది. కాగా లీగ్లో తమ చివరి మ్యాచ్లో ఢిల్లీ పంజాబ్తో తలపడనుంది.చదవండి: వారికి నేనిచ్చే సలహా ఇదే: వైభవ్ సూర్యవంశీపై ధోని కామెంట్స్Dominant victory ✅Playoffs ✅A dream outing for #MI in their last match at Wankhede this season as they secure a 59-run win over #DC 💙👏Scorecard ▶ https://t.co/fHZXoEJVed#TATAIPL | #MIvDC | @mipaltan pic.twitter.com/mitYRgtqlZ— IndianPremierLeague (@IPL) May 21, 2025
బిజినెస్

చమురుకు మరింత డిమాండ్
న్యూఢిల్లీ: దేశీయంగా చమురు వినియోగం వచ్చే దశాబ్ద కాలం పాటు గణనీయంగా పెరగనుంది. వార్షికంగా 4 శాతం చొప్పున వృద్ధి చెందనుంది. ఎస్అండ్పీ గ్లోబల్లో భాగమైన ఎస్అండ్పీ గ్లోబల్ కమోడిటీ ఇన్సైట్స్ ఈ మేరకు అంచనాలు వెలువరించింది. దీని ప్రకారం 2025లో ఇప్పటివరకు ఆయిల్ వినియోగం రోజుకు 4.8 మిలియన్ బ్యారెళ్లుగా (ఎంబీపీడీ) ఉంది. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 4.3 శాతం పెరిగింది.చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరా పెరగడం, అంతర్జాతీయంగా డిమాండ్ కాస్త మందగించడం వంటి అంశాల కారణంగా ఈ ఏడాది చమురు రేట్లు కొంత నెమ్మదించినట్లు సంస్థ హెడ్ ఆఫ్ ఇండియా కంటెంట్ (క్రాస్ కమోడిటీస్) పులకిత్ అగర్వాల్ తెలిపారు. మెరుగైన ఆర్థిక వృద్ధి వంటి సానుకూలాంశాలతో భారత్లో ఆయిల్కు డిమాండ్ పెరుగుతోందన్నారు. అంతర్జాతీయంగా భారత్కి మరింత ప్రాధాన్యం లభిస్తోందని వివరించారు. రష్యా నుంచి వరుసగా నాలుగో ఏడాది కూడా నిరాటంకంగా సరఫరా కొనసాగుతున్న నేపథ్యంలో ముడి చమురు కొనుగోళ్లకు మనకు మరిన్ని వనరులు అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు తగ్గాలి.. పర్యావరణహిత ఇంధనాల వ్యయాలు ఎంత తక్కువగా ఉంటే అంత వేగంగా వాటి వైపు మళ్లడం ఉంటుందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గౌరి జోహర్ చెప్పారు. ఈ విషయంలో వివిధ టెక్నాలజీలను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రభుత్వ విధానాలు, నియంత్రణ సంస్థల నిబంధనలు, కార్పొరేట్ల చొరవ మొదలైన అంశాలన్నీ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, హరిత ఇంధనాల వైపు మళ్లినంత మాత్రాన పాత ఇంధనాల వినియోగం పూర్తిగా నిల్చిపోతుందనడానికి లేదని తెలిపారు. బొగ్గు నుంచి చమురుకు మారినప్పటికీ ప్రపంచంలో బొగ్గు వినియోగం ఆగిపోలేదన్నారు. వాస్తవానికి గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత పెరిగిందని గౌరి తెలిపారు. మరోవైపు, టారిఫ్లపై ఆందోళనలతో దేశీ మార్కెట్లలో నిల్వలు పెరగడం, పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పడిపోవడం వంటి అంశాలపై ఆందోళన నెలకొన్నప్పటికీ 2025–26లో జీడీపీ వృద్ధికి మించి పెట్రోకెమికల్స్కు డిమాండ్ ఉంటుందని అసోసియేట్ డైరెక్టర్ స్తుతి చావ్లా చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ నెమ్మదిస్తుండటం, టారిఫ్లపై అనిశ్చితి, మార్జిన్లు తగ్గడం, ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడంలాంటి అంశాలతో సతమతమవుతున్న అంతర్జాతీయ పెట్రోకెమికల్ ఉత్పత్తిదారులు భారత్పై ఆశలు పెట్టున్నట్లు తెలిపారు.

బంగారానికి కావాలా లాకర్? టాప్ బ్యాంకుల్లో చార్జీలివే..
బంగారం ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. 10 గ్రాముల బంగారమే రూ.లక్ష వరకూ పలుకుతోంది. బంగారం సాధారణంగా చాలా మంది దగ్గర ఆభరణాల రూపంలోనే ఉంటుంది. వీటిని ఎప్పుడో ప్రత్యేక సందర్భాల్లో తప్ప మిగిలిన సమయాల్లో పెద్దగా ధరించరు. ఈ నగలను ఇంట్లోని బీరువాల్లోనే భద్రపరుచుకుంటుంటారు. అయితే విలువైన బంగారు ఆభరణాలను ఇలా ఇంట్లో పెట్టుకుంటే వల్ల చోరీకి గురవుతాయేమోనన్న ఆందోళన చాలా మందిలో ఉంటుంది. అందుకే అనేక బ్యాంకులు బంగారంతోపాటు విలువైన డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు సేఫ్ డిపాజిట్ లాకర్ల సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.ఈ సేఫ్ డిపాజిట్ లాకర్లలో బంగారం, డాక్యుమెంట్లు, ఆస్తి పత్రాలు భద్రపరుచుకునేందుకు బ్యాంకులు కొంత చార్జీలను వసూలు చేస్తాయి. లాకర్ పరిమాణం, బ్రాంచ్ లొకేషన్ (గ్రామీణ, సెమీ అర్బన్, అర్బన్ లేదా మెట్రో), బ్యాంక్ అంతర్గత విధానాల ఆధారంగా ఈ లాకర్లకు అద్దె ఛార్జీలు మారవచ్చు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నాలుగు టాప్ బ్యాంకులలో సేఫ్ డిపాజిట్ లాకర్ల చార్జీలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లాకర్ పరిమాణం, స్థానాన్ని బట్టి మారుతూ ఉండే అంచెల ధరల నిర్మాణాన్ని అందిస్తుంది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు వర్తిస్తుంది. ఇది చిన్న, మధ్యతరహా లాకర్లకు రూ .500, పెద్ద, ఎక్స్ట్రా లార్జ్ లాకర్లకు రూ .1,000. వీటికి జీఎస్టీ అదనం.వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా):చిన్న లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.1,000 అర్బన్/ మెట్రో: రూ.1,500మీడియం లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్/ మెట్రో: రూ.3,000పెద్ద లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.5,000అర్బన్/ మెట్రో: రూ.6,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్/ సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్/ మెట్రో: రూ.9,000పంజాబ్ నేషనల్ బ్యాంక్పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సేఫ్ లాకర్ల కోసం అందుబాటు చార్జీలను వసూలు చేస్తోంది. కొన్ని నిర్దిష్ట మెట్రో శాఖలలో 25% ప్రీమియం వర్తిస్తుంది. కస్టమర్లు సంవత్సరానికి 12 సార్లు ఉచితంగా తమ లాకర్ను సందర్శించవచ్చు. ఆ తర్వాత ప్రతి అదనపు సందర్శనకు రూ .100 వసూలు చేస్తారు.వార్షిక ఛార్జీలు ఇలా.. (జీఎస్టీ కాకుండా)చిన్న లాకర్లు: రూరల్: రూ.1,000 సెమీ అర్బన్/ అర్బన్: రూ.1,250 అర్బన్/ మెట్రో: రూ.2,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,200 సెమీ అర్బన్/ అర్బన్: రూ.2,500 అర్బన్/ మెట్రో: రూ.3,500పెద్ద లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.3,000 అర్బన్/ మెట్రో: రూ.5,500ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: రూరల్, సెమీ అర్బన్: రూ.6,000 అర్బన్/ మెట్రో: రూ.8,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: అన్ని ప్రాంతాల్లో: రూ.10,000ఐసీఐసీఐ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): చిన్న లాకర్లు: గ్రామీణం: రూ.1,200 సెమీ అర్బన్: రూ.2,000 అర్బన్: రూ.3,000 మెట్రో: రూ.3,500 మెట్రో+: రూ.4,000మీడియం లాకర్లు: గ్రామీణం: రూ.2,500 సెమీ అర్బన్: రూ.5,000 అర్బన్: రూ.6,000 మెట్రో: రూ.7,500 మెట్రో+: రూ.9,000పెద్ద లాకర్లు: గ్రామీణం: రూ.4,000 సెమీ అర్బన్: రూ.7,000 అర్బన్: రూ.10,000 మెట్రో: రూ.13,000 మెట్రో+: రూ.15,000ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: గ్రామీణం: రూ.10 వేలు సెమీ అర్బన్: రూ.15,000 అర్బన్: రూ.16,000 మెట్రో: రూ.20,000 మెట్రో+: రూ.22,000హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వార్షిక ఛార్జీలు (జీఎస్టీ కాకుండా): ఎక్స్ట్రా స్మాల్ లాకర్లు: మెట్రో: రూ.1,350 పట్టణ: రూ.1,100 సెమీ అర్బన్: రూ.1,100 గ్రామీణం: రూ.550చిన్న లాకర్లు: మెట్రో: రూ.2,200 పట్టణ: రూ.1,650 సెమీ అర్బన్: రూ.1,200 గ్రామీణం: రూ.850మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,000 అర్బన్: రూ.3,000 సెమీ అర్బన్: రూ.1,550 గ్రామీణం: రూ.1,250ఎక్స్ట్రా మీడియం లాకర్లు: మెట్రో: రూ.4,400 పట్టణ: రూ.3,300 సెమీ అర్బన్: రూ.1,750 రూరల్: రూ.1,500పెద్ద లాకర్లు: మెట్రో: రూ.10,000 అర్బన్: రూ.7,000 సెమీ అర్బన్: రూ.4,000 గ్రామీణం: రూ.3,300ఎక్స్ట్రా లార్జ్ లాకర్లు: మెట్రో: రూ.20,000 పట్టణ: రూ.15 వేలు సెమీ అర్బన్: రూ.11,000 గ్రామీణం: రూ.9,000🔶 లాకర్ సదుపాయాన్ని ఎంచుకునేటప్పుడు ధర మాత్రమే ముఖ్యం కాదు. లభ్యత, ఎంత దగ్గరలో ఉంది, లాకర్ పరిమాణం వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. ముందస్తు సరెండర్ పాలసీలు లేదా రిజిస్ట్రేషన్ ఫీజులు వంటివి ఏవైనా అదనపు నిబంధనలు ఉన్నాయేమో చూసుకోవాలి.

హైదరాబాద్ ఎస్బీఐ బ్రాంచిలో రూ.2.2 కోట్ల మోసం
సరైన పూచీకత్తు లేకుండా బంగారు రుణాలు మంజూరు చేసిన కేసులో ఇద్దరు ఎస్బీఐ ఉద్యోగులపై కేసు నమోదైంది. వడ్డీతో కలిసి సుమారు రూ.2.2 కోట్ల మేరకు మోసానికి పాల్పడినట్లు తెలిసింది. హైదరాబాద్లోని రాంనగర్ ఎస్బీఐ బ్రాంచి మేనేజర్ డి.సునీల్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఇద్దరు ఉద్యోగులతోపాటు మరో 18 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.ఫిర్యాదులోని వివరాల ప్రకారం, ఎస్బీఐలో సర్వీస్ మేనేజర్గా పని చేస్తున్న గుగ్లోత్ జైరాం నాయక్ క్యాష్ ఇన్ఛార్జ్ చీర్లా రుతుపవన్తో కలిసి విధులను దుర్వినియోగం చేశారు. సరైన పూచీకత్తు లేకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, సహచరుల పేరిట నకిలీ బంగారు రుణాలను మంజూరు చేశారు. ఇందులో మరో 18 మంది పాత్ర ఉంది. ప్రధాన నిందితుడు నాయక్ తన పదవిని దుర్వినియోగం చేశాడని, అంతర్గత విచారణలో నిందితుడు చేసిన మోసం బయటపడిందని ఆరోపిస్తూ మే 15న బ్రాంచి మేనేజర్ సునిల్ ఫిర్యాదులో పేర్కొన్నారు.చెల్లుబాటయ్యే పూచీకత్తు లేకుండా, బ్యాంకు విధానాలను ఉల్లంఘించి ఈ రుణాలను ప్రాసెస్ చేసి ఆమోదించారని తెలిపారు. క్యాష్ ఆపరేషన్స్ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ, అతను ఉద్దేశపూర్వకంగా ప్రామాణిక బ్యాంకు మార్గదర్శకాలను పట్టించుకోలేదని చెప్పారు. ఈ మోసంతో అక్రమంగా పోగు చేసిన రూ.2.2 కోట్ల నిధులను వివిధ వ్యక్తిగత ఖాతాలకు బదిలీ చేసి ఎల్లారెడ్డిగూడలోని ఓ ప్రైవేటు సంస్థకు మళ్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగివడ్డీతో సహా రూ.2.2 కోట్ల బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు ఇటీవల లిఖితపూర్వక వాంగ్మూలంలో నాయక్ అంగీకరించినట్లు బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) నిందితులపై సెక్షన్ 316(5) (ప్రభుత్వ ఉద్యోగి, లేదా బ్యాంకర్, వ్యాపారి లేదా ఏజెంట్ ద్వారా నేరపూరిత ఉల్లంఘన), 318(4) (మోసంతో ఆస్తి పంపిణీని ప్రేరేపించడం), ఆర్ / డబ్ల్యూ 61 (2) (నేరపూరిత కుట్ర) కింద కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం జరిగిన ఈ మోసం ఇటీవల అంతర్గత ఆడిట్లో వెలుగు చూడడం గమనార్హం. ప్రధాన నిందితుడు నాయక్, రుతుపవన్ను అరెస్టు చేశారు. మిగతా నిందితుల పాత్రను పరిశీలిస్తున్నామని సీసీఎస్ అధికారి ఒకరు తెలిపారు.

హైరేంజ్లో హైదరాబాద్
దశాబ్దాల చరిత్రను ఇముడ్చుకున్న హైదరాబాద్ చారిత్రక నగరం మరెన్నో చరిత్రలు తిరగరాస్తూ దూసుకుపోతోంది. అటు ఐటీ ఇటు రియల్టీ మరోవైపు ఫార్మా, ఇంకోవైపు సినిమా.. ఇలా ఏ రంగంలో చూసినా ఎదురేలేదు అన్నట్టు ఎదుగుతోంది. ఈ నేపథ్యంలో మరి కొన్నేళ్ల పాటు ఈ దూకుడు ఇలాగే కొనసాగనుందని, దేశంలోనే మన సిటీ అగ్రగామిగా అవతరించనుందని జేఎల్ఎల్ సంస్థ తాజా నివేదిక వెల్లడించింది. ఆ నివేదిక వెల్లడించిన విశేషాల్లో కొన్ని.. – సాక్షి, సిటీబ్యూరోదేశంలో అభివృద్ధి కేంద్రంగా నగరం స్థిరపడుతోంది. పలు రంగాల్లో ప్రగతితో పాటు ప్రణాళికా బద్ధమైన మౌలిక వసతుల అభివృద్ధి, విస్తరించిన అంతర్జాతీయ స్థాయి జీవనశైలి కారణంగా నగరంలో నివాస, వాణిజ్య గిడ్డంగుల విభాగాల్లో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం, నగరంలో వచ్చే 3–4 సంవత్సరాల్లో లక్ష కొత్త నివాస యూనిట్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రధాన రిటైల్ కంపెనీలు నగరంలో తమ పరిధిని విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ఐటీ నుంచి స్టార్టప్స్ దాకా..నగరంలో ఐటీ/ఐటీఈఎస్ రంగం సిటీ దూకుడుకు దోహదం చేస్తున్న ప్రధానమైన డ్రైవర్గా నిలుస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో నగరం 32 బిలియన్ డాలర్ల విలువైన ఐటీ ఎగుమతులతో దేశంలోనే రెండో స్థానాన్ని సాధించింది. ఇక్కడ 4 వేలకు పైగా స్టార్టప్లు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దేశంలోని మొత్తం గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాల్లో 15.6 శాతం భాగస్వామ్యంతో నగరం ముందంజలో నిలిచింది. అలాగే, దేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో(జీసీసీఎస్) 17 శాతం నగరంలో ఉన్నాయి.హైదరాబాద్కి ఈ ఊపు ఎందుకు..?‘హైదరాబాద్లో 17 శాతం గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీఎస్) ఉండటం దేశీయ వాణిజ్య రియల్ ఎస్టేట్ రంగంలో కీలకమైన మలుపు కాగా ఈ కేంద్రాల నాణ్యత, పరిధి నగర స్థిరాభివృద్ధికి అండగా నిలుస్తాయి,’ అని ప్రముఖ ఆర్బర్ ఇన్వెస్ట్మెంట్ వ్యవస్థాపకుడు చిరాగ్ మెహతా అన్నారు. జేయుఎస్టివో రియల్ ఫిన్ టెక్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు పుష్పమిత్ర దాస్ మాట్లాడుతూ.. హైదరాబాద్ రానున్న రెండేళ్లలో ఏడాదికి 17–19 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని జోడించనుందని, అలాగే, గిడ్డంగుల సామర్థ్యాన్ని మరో 4 మిలియన్ స్క్వేర్ ఫీట్లకు పెంచనుందనీ తెలిపారు.ఈ అభివృద్ధికి దోహదం చేస్తున్న అంశాల్లో ఆయన అభిప్రాయం ప్రకారం, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్ ఒక సంతులిత ఆర్థిక వ్యవస్థను నిర్మించగలిగింది. ఇది ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, లాజిస్టిక్స్ ఇలా భిన్న రంగాల్లో వృద్ధిని చూపిస్తోంది. మెగా మాస్టర్ ప్లాన్ 2050, ముచెర్ల 4.0 ఐటీ హబ్, మెట్రో రైలు విస్తరణ వంటి ప్రణాళికలు నగరాభివృద్ధిని మరింత వేగవంతం చేస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా బెంగళూరుతో పోలిస్తే స్తిరాస్తి ధరలు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన గమ్యంగా మారిందని అన్నారు. ‘నాణ్యమైన వసతులు, తక్కువ ధరలతో వ్యాపారం నిర్వహించాలనుకునే సంస్థలకు హైదరాబాద్ గొప్ప అవకాశం. పలు రంగాల్లో సమతులిత అభివృద్ధి కనిపిస్తుండటంతో పాటు మౌలిక వసతుల పురోగతికి పెట్టుబడుల ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చు’ అని దాస్ అన్నారు. ఇదీ చదవండి: కంపెనీపై రూ.35.3 కోట్లు దావా వేసిన ఉద్యోగిఆఫీస్ స్పేస్కి డిమాండ్.. మెరుస్తున్న మాల్స్2019 నుంచి ఇప్పటి వరకు 78.2 మిలియన్ స్క్వేర్ ఫీట్ల గ్రేడ్ ఏ కార్యాలయ స్థలాన్ని నగరం జోడించగా, 2024లో 7.31 మిలియన్ స్క్వేర్ ఫీట్ల కార్యాలయ స్థలాన్ని ఆక్రమించడం జరిగిందని జేఎల్ఎల్ పేర్కొంది. ఇది అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 6.1 శాతం అధిక వృద్ధిగా తేల్చింది. నగరంలోని గ్రేడ్ ఏ షాపింగ్ మాల్స్ స్థలం 9.86 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా లెక్కించింది. ఇక నగరంలో రానురానూ ఖాళీ స్థలాలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది ఆరోగ్యకరమైన డిమాండ్కి సంకేతంగా భావించవచ్చు. మరోవైపు డేటా సెంటర్ల సామర్థ్యం కూడా వచ్చే రెండు సంవత్సరాల్లో 23 మెగావాట్ల మేరకు పెరగనుంది. తద్వారా హైదరాబాద్ ఒక ప్రధాన డేటా సెంటర్ హబ్గా మారనుంది. దీని సామర్థ్యం 2020 మొదటి అర్ధభాగంలో 32ఎం.డబ్ల్యూ నుంచి 2025 నాటికి నాలుగు రెట్లు పెరిగి 130ఎం.డబ్ల్యూకు చేరుకుంటుంది.
ఫ్యామిలీ

తొలిసారి చీర, కెంపులహారం, సింధూరం : ఐశ్వర్య రాయ్ లుక్కి ఫిదా
కాన్స్ ఫిలిం ఫెస్టివ్లో అందాల ఐశ్వర్యం ఐశ్వర్య రాయ్ బచ్చన్ మళ్లీ మెరిసింది. దశాబ్దానికి పైగా ప్రతిష్టాత్మక రెడ్కార్పెట్పై మెరుస్తున్న ఐశ్వర్య ఈ ఏడాది కూడా తన అందంతో అందర్నీ ఆశ్చర్యపర్చింది. భారతీయ సంస్కృతిని గౌరవించేలా దుస్తులతో ఫ్యాషన్ ప్రపంచాన్ని విస్మయ పర్చింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సుదీర్ఘ విరామం తర్వాత ఐశ్వర్య రాయ్ బచ్చన్ చీరలో మెరవడం ఒక విశేషమైతే, ముఖ్యంగా ఆమె ధరించిన కెంపుల హారం, ఇతర ఆభరణాలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 51 ఏళ్ల వయసులో అందమైన బెనారసీ చీర, అందమైన నగలు నుదుట సింధూరంతో ముగ్ధమనోహరంగా మెరిసిన ఐశ్వర్య లుక్ పలువురి ప్రశంసలందుకుంది. కాన్స్లో తొలిసారి చీరలో మెరిసిన ఐశ్వర్య78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో కనిపించడానికి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మనీష్ మల్హోత్రాడిజైన్ చేసిన చీర, ఆభరణాలను ఎంచుకుంది. ఐవరీ, రోజ్ గోల్డ్ కలర్ బెనారసీ రియల్ సిల్వర్ జరీ ఎంబ్రాయిడరీ చీరలో రాయల్లుక్తో అదరగొట్టింది. వారణాసి ఫేడింగ్ సాంప్రదాయ కడ్వా టెక్నిక్తో హ్యాండ్ లూమ్ చీర ఆది తితో నేయబడింది.కడ్వా టెక్నిక్లో ప్రతి మోటిఫ్ను చాలా అందంగా తీర్చిద్దారు. అలాగే బంగారం, వెండితో తయారు చేసిన వైట్ టిష్యూ, జర్దోజీ ఎంబ్రాయిడరీతో చేతితో తయారుచేసిన దుపట్టాను ధరించింది. మొత్తంమీద, ఆమె లుక్ భారతీయ నైపుణ్యం, సంస్కృతి, వారసత్వాన్ని చాటి చెప్పింది. ఈ లుక్ ఫ్యాషన్ విమర్శకులను, అభిమానులను ఆకట్టుకుంది.సాధారణంగా కనిపించే పచ్చలకు బదులుగా కాన్స్ ఈవెంట్లో ఐశ్వర్య కెంపులతో రూపొందించిన లేయర్డ్ హారాన్ని , మ్యాచింగ్ చౌకర్ను ధరించింది. ఇవి కూడా మనీష్ మల్హోత్రా హౌస్నుంచి వచ్చినవే. ఐశ్వర్యతన ఐశ్వర్యాన్ని ప్రతిబింబించేలా 500 క్యారెట్ల మొజాంబిక్ కెంపుల పొడవైన అద్భుతమైన హారాన్ని ఎంచుకుంది.అన్కట్డైమండ్స్, కెంపులతో 30 క్యారెట్ల 18 క్యారెట్ల నాణ్యతగల బంగారంతో దీన్ని రూపొందించారు. దీనికి జతగా రూబీస్ స్టేట్మెంట్ రింగ్ ఐశ్వర్యకు రాయల్ లుక్నిచ్చింది. సంక్లిష్టమైన పూల డిజైన్లో తయారు చేసిన ఆభరణలు ప్రపంచ వేదికపై సాంప్రదాయ భారతీయ హస్తకళ ల అద్భుతాన్ని ప్రదర్శించారు.ఇదీ చదవండి: పట్టుబట్టాడు, ఐఎఫ్ఎస్ కొట్టాడు : రైతుబిడ్డ దీక్షిత్ సక్సెస్ స్టోరీఐశ్వర్య రాయ్ లుక్పై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇండియా సత్తాను ప్రపంచానికి చాటిన ఆపరేషన్ సిందూర్ ను గుర్తుకు తెచ్చేలా ఐశ్వర్య రాయ్ సిందూర్ ధరించడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. భారత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ఐశ్వర్య నిలిచిందంటూ కొనియాడారు.చదవండి: ముత్యాల నగలు, ఘూంఘట్ : మహారాణిలా, ‘అమ్మ’ లా జాన్వీ స్టన్నింగ్ లుక్

'టాకింగ్ ట్రీ'..నిజంగానే మొక్కతో మాట్లాడే టెక్నాలజీ..!
చిన్నప్పుడు సరదాగా చెట్టు వెనుకదాక్కుని దాంతో మాట్లాడటం వంటివి చేసేవాళ్లం. ఆ సరదా అల్లరే వేరు. కొందరు ప్రకృతి ప్రేమికులు చెట్లనే తమ ఆత్మీయులుగా వాటితోనే మాట్లాడటం, పెళ్లి చేసుకోవడం వంటివి చేసిన ఘటనలు చూశాం. అలాగే పరిశోధకులు చెట్టుకు ప్రాణం, ఉంది అవి కూడా స్పందిస్తాయని చెప్పారు. అది ఎంత వరకు నిజం అనేది కూడా ప్రయోగాత్మకంగా ప్రూవ్ చేశారు. అవి ఎలా తన పక్క చెట్లతో సంభాషిస్తుందో కూడా వివరించారు. ఇప్పుడూ ఏకంగా చెట్టుతో నేరుగా మాట్లాడే సరికొత్త టెక్నాలజీని అభివృద్ధిపరచడమే కాదు..మాట్లాడే అవకాశం కూడా ఇస్తున్నారు. అదెలాగో సవిరంగా తెలుసుకుందాం..!.ఐర్లాండ్ రాజధానిలలోని ట్రినిటి కాలేజ్లో 'టాకింగ్ ట్రీ' అనే టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఏఐ సాంకేతికతతో చెట్టుకు స్వరాన్ని అందిస్తారు. అందుకోసం పర్యావరణ సెన్సార్లు ఉపయోగించుకుంటుంది. అంటే ఇక్కడ సెన్సార్లుగా నేల తేమ, నేల pH, గాలి ఉష్ణోగ్రత, తేమ, సూర్యకాంతి, గాలి నాణ్యత' తదితరాల ఆధారంగా 'బయోఎలక్ట్రికల్ సిగ్నల్స్'ని తీసుకుంటుంది. ఆ సిగ్నల్స్ని ఏఐ సాంకేతికత మానవులకు అర్థమయ్యే భాషలా మారుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం కేవలం ప్రకృతి ప్రయోజనార్థమే చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకృతితో మనం అనుసంధానమై ఉంటే..అకస్మాత్తుగా అంటుకుని కార్చిచ్చులను సకాలంలో నివారించడం సాధ్య పడుతుందని చెబుతున్నారు. అంతేగాదండోయ్ తాము చెట్టుతో ఎలా సంభాషిస్తున్నామో వీడియో రూపంలో సవివరంగా చూపించారు. అక్కడ ట్రినిటీ కాలేజ్లో దాదాపు 200 ఏళ్ల నాటి లండన్ ప్లేన్ ట్రీ వేర్లకు వైర్లకు టెక్నాలజీని అనుసంధానించి మాట్లాడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి ఆ పురాతన చెట్టుతో ఏవిధంగా సంభాషిస్తున్నాడో స్పష్టంగా కనిపిస్తుంది వీడియోలో. View this post on Instagram A post shared by RTÉ News (@rtenews) (చదవండి: డ్యాన్స్ బేబీ డ్యాన్స్..! పార్కిన్సన్స్కు నృత్య చికిత్స)

Ego అహం పతనానికి నాంది
గర్వం, అహంకారం అన్నవి మహాచెడ్డ దుర్గుణాలు. మానవులకు ఏవిధంగానూ శోభించని లక్షణాలు. నిజానికి ఇవి షైతాన్ గుణాలు. కేవలం అహం కారణంగానే దైవానికి అవిధేయుడై దుర్మార్గుల్లో కలిసి పొయ్యాడు, ధూర్తుడిగా మిగిలి పోయాడు. దైవం మానవుణ్ణి సృష్టించిన తరువాత, అందరూ అతనికి సజ్దా (సాష్టాంగ ప్రణామం) చెయ్యాలని ఆదేశించాడు. కాని షైతాన్ చెయ్యలేదు. ఈ విషయం పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది.: ’ ... ఆ తర్వాత మేము ఆదంకు గౌరవ సూచకంగా అభివాదం చెయ్యండని దైవదూతలను ఆదేశించాము. అప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీసు తనేదో గొప్పవాణ్ణన్న అహంకారంతో విర్రవీగుతూ, తిరస్కరించి అవిధేయుడై పొయ్యాడు.’(2 – 34). అల్ ఆరాఫ్ సూరా 11, 12 వాక్యాల్లో, సాద్ సూరా 73, 74, 75 లో కూడా ఈ ప్రస్తావన ఉంది.అహం అంటే.., తానే గొప్పవాడినని భావించడం. ఇతరులను తక్కువగా, హీనంగా చూడడం. అన్నీ, అంతా తనకే తెలుసని, ఇతరులకేమీ తెలియదని తల΄ోయడం. షైతాన్ ఇక్కడ రెండు తప్పులు చేశాడు. ఒకటి: దైవాదేశాన్ని తిరస్కరించాడు. రెండు: ఆదిమానవుణ్ణి తనకన్నా తక్కువ వాడుగా, నీచుడిగా చూశాడు. అంటే, తన సృజన అగ్నితో జరిగింది కాబట్టి, మట్టితో సృష్టించబడిన వాడికంటే తానే గొప్పవాడినన్న అహం అతడి సత్యతిరస్కారానికి కారణమైంది. ఈ విధంగా వాడు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నాడు.సత్యాన్ని సత్యంగా అంగీకరించాలంటే, ఇతరులను గౌరవ దృష్టితో చూడగలగాలంటే, ’అందరి’ కన్నా గొప్పవాడయిన సృష్టికర్త ఆదేశాలను పాలించగలగాలి. కాని అతనిలోని అహం మరెవ్వరినీ తనకన్నా గొప్పవాడుగా అంగీకరించడానికి ఒప్పుకోదు. సమాజంలో తనకో గొప్పస్థానం ప్రాప్తం కావాలని కోరుకుంటాడు. మరెవరూ తన స్థాయికి, కనీసం తన దరిదాపుల్లోకి రావడాన్నీ సహించలేడు. అంతా తనకే తెలుసునని, ఎదుటివారికి ఏమీ తెలియదని, తనమాటే చెల్లుబాటు కావాలని అభిలషిస్తాడు. ఈ వైఖరి సరయినది కానప్పటికీ, ఎదురు దెబ్బలు తగులుతున్న ప్పటికీ అతనిలోని ’ అహం ’ తప్పుడు వైఖరి గురించి ఆలోచించే అవకాశమే ఇవ్వదు. మంచి అనేది ఉంటే అది తనలోనే ఉందని, ఇతరులు చేరుకోక ముందే తాను దాన్ని అంది పుచ్చుకుంటానని అతను భావిస్తాడు. ఎదుటి వారిలోని ఏమంచినీ, ఏ నైతిక సుగుణాన్నీ అతను అంగీకరించడు. నైతిక వర్తను డైనా, సౌజన్యశీలుడైనా అంతా తానేనని తల΄ోస్తాడు.చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఇలాంటివారు తమ అహంకార వైఖరి కారణంగా తమను తామే నష్టపరుచుకుంటారు తప్ప మరొకటి కాదు. ఇదంతా తమకే అంతా తెలుసు, ఎదుటి వారికి ఏమీ తెలియదనుకున్న ఫలితం. వారి మనసులో తామేదో గొప్పవాళ్ళమన్న అహంకార భావం తిష్ట వేసుకొని ఉంటుంది. ఇది ఎంతమాత్రం మంచి విధానంకాదు. గర్వం, అహంకారం లాంటి దుర్లక్షణాల నుండి దైవం అందరినీ కాపాడాలని కోరుకుందాం.ఇదీ చదవండి: ఎవడు వివేకి? ఎవడు అవివేకి?

ఎవడు వివేకి? ఎవడు అవివేకి?
వివేకి లోక విషయాల్లోని దోషాన్ని గ్రహిస్తాడు. అలౌకికాన్ని ఆరాధిస్తాడు. అవివేకి అజ్ఞానంతో లౌకిక విషయాసక్తుడై అలౌకిక సత్యాన్ని ఆలోచించలేడు. పైగా లౌకిక విషయ సుఖమే సత్యంగా భావించి దాన్ని అనుభవిస్తూండటం వివేకమనుకుంటాడు. అటువంటి వారు అతితెలివితో భ్రాంతచిత్తులయి తమాషాగా ప్రవర్తిస్తారు. అలాంటి కథ ఇది:మిక్కిలి తెలివి గల ఒక రాజు ఉన్నాడు. మనిషి మంచివాడే. కాక పోతే కొంచెం వక్రంగా ఆలోచిస్తాడు. అందుకే అందరికంటే వివేక హీనుడెవడో చూచి వాడికి సన్మానం చేయాలనుకుంటాడు. అటువంటివాడిని తీసుకురమ్మని సేవకులను రాజ్యం నలుమూలలకూ పంపాడు. అతి కష్టం మీద రాజసేవకులు ఏ పనీ చేయని, ఎవరి తోనూ మాట్లాడని, చింపిరి గుడ్డలు కట్టుకొని ఆకులు అలములుతింటూ తిరుగాడేవాడిని తీసుకొస్తారు. రాజు కూడా అవివేకి ఇతడే అని సంతోషించి సన్మానంలో ఒక వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని అతనికి బహూకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజుకు తీవ్రమైన రోగం వచ్చింది. ఎవరూ వైద్యం చేయలేమని చేతులెత్తేసిన సమయంలో అవి వేకిగా సన్మానితుడైన మనిషి వచ్చి రాజు రోగాన్ని నయం చేస్తానన్నాడు. చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఅయితే వైద్యం ప్రారంభించే ముందు... ‘ఓ రాజా! మీరింతవరకూ సుఖాలెన్నో అనుభవిస్తూ వచ్చారు. మరి మీరు చనిపోతే మీ శరీరం ఈ సుఖభోగాల ననుభవించలేదు కదా! అందువల్ల మర ణించే ముందైనా, ఇప్పటినుంచే ఆ భోగాలన్నింటినీ వదిలిపెట్టి ఉండగలరా చెప్పండి?’ అన్నాడు. ‘ఇంతవరకు అలవాటు పడిన ఈ భోగాలను వదలి ఉండలేను’ అని సమాధానం చెప్పాడు రాజు. ‘రాజా! నేను ఆకులలములు తింటూ ఏవో గుడ్డ పీలికలు కట్టుకొని, కటిక నేలపై పడుకొంటూ ఇప్పటికీ సుఖంగానే ఉన్నాను. మరి నాకు కష్టం, సుఖం వేరుగా కనబడలేదు. నాకెంతో తృప్తిగా ఉంది. కానీ మీరు, ప్రాణాంతకమైన రోగం వచ్చినా రక్షించలేని ఈ సుఖాలను, కొంతకాలమైనా వదిలి పెట్టలేకపోతున్నారు. అన్నీ ఉన్నా మీకు తృప్తిలేదు. విషయ సుఖలాలసత ఇంకా కోరుతున్న మీరు, సిసలైన అవివేకులు. కనుక మీరు నాకిచ్చిన వజ్రపుటుంగరం తిరిగి మీకే ఇస్తున్నాను తీసుకోండి’ అని ఉంగరం ఇస్తూ తన యోగదృష్టి పాతంతోనే రాజుకు పరిపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాడాయన.చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?ఆయన ఎవరో కాదు. సర్వసిద్ధులూ కలిగిన ’అవధూత’. ‘విరతి రాత్మరతి శ్చేతి వివేకస్య పరమం లక్షణమ్’. విషయసుఖాలపై వైరాగ్యముండటం, సర్వదా ఆత్మానుసంధానంతో ఉండటమూ వివేకానికి లక్షణమని అర్థం. అవధూత స్థితి ఇలాంటిది. కనుక గురూపదేశంతో ప్రతి ఒక్కరూ సుఖదుఃఖ సమభావన సాధించాలి.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి
ఫొటోలు


Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్ బ్యూటీలు (ఫొటోలు)


లిక్కర్ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్ ధ్వజం (చిత్రాలు)


అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)


HHVM మూవీ ఈవెంట్లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)


Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)


ప్రసాద్ ఐమ్యాక్స్ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్ ఈవెంట్ రానా సందడి (ఫొటోలు)


హైదరాబాద్లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)


హనుమాన్ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)


విజయ్ సేతుపతి 'ఏస్' మూవీ ప్రీరిలీజ్ వేడుక (ఫొటోలు)


'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
అంతర్జాతీయం

175 బిలియన్ డాలర్లతో ట్రంప్ ‘గోల్డెన్ డోమ్’.. చైనా, రష్యా ఆందోళన..
వాషింగ్టన్: ప్రపంచంలోని పలు దేశాల మధ్య యుద్ధం వాతావరణం కొనసాగుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-హమాస్ వార్.. ఇక, ఇటీవల భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ వంటి పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో, రక్షణ వ్యవస్థల గురించి చాలా చర్చలు జరిగాయి. ఇలాంటి యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆ దేశానికి కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ‘గోల్డెన్ డోమ్’ అని పేరు పెట్టారు. ఈ ‘గోల్డెన్ డోమ్’ కోసం ఏకంగా దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా( 175 బిలియన్ డాలర్లు)ఖర్చు చేస్తామని వెల్లడించారు.వివరాల ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కోసం కొత్త క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అమెరికాను క్షిపణి దాడుల నుంచి రక్షించుకోవడానికి మూడేళ్లలోనే ‘గోల్డెన్ డోమ్’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్ల ప్రారంభ నిధులు కేటాయిస్తున్నామని, అంతిమంగా 175 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజల కోసం రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు.అత్యంత సాంకేతికతతో కూడిన మిస్సైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాజెక్ట్ ను ఆమోదిస్తున్నందుకు సంతోషంగా ఉందని ట్రంప్ తెలిపారు. గోల్డెన్ డోమ్ అందుబాటులోకి వచ్చాక ప్రపంచం అవతలి నుంచి అమెరికాపై క్షిపణి దాడులు చేసినా ఇది తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. స్పేస్ నుంచి దాడులు చేసినా అమెరికాకు ఏమీ కాదన్నారు. మన దేశం విజయంలో.. మనం భూమి మీద నివసించాలంటే ఇలాంటివి అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.🚨 #BREAKING: President Trump and Secretary Hegseth have announced the GOLDEN DOME missile defense system for the U.S."Golden Dome will be capable of catching missiles from across the world or even SPACE.""We'll be completing the job Reagan started 40 years ago!"Trump also… pic.twitter.com/MX1URx1fa0— Nick Sortor (@nicksortor) May 20, 2025యూఎస్ స్పేస్ ఫోర్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నాయకత్వంలో గోల్డెన్ డోమ్ నిర్మాణం జరుగుతుందని ట్రంప్ పేర్కొన్నారు. దీని నిర్మాణంలో భాగం కావడానికి కెనడా సైతం ఆసక్తిని చూపినట్లు తెలిపారు. డోమ్ నిర్మాణానికి 175 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుందని ట్రంప్ పేర్కొన్నప్పటికీ.. దీనికి 542 బిలియన్ డాలర్ల వ్యయం అవుతుండొచ్చని కాంగ్రెస్ బడ్జెట్ ఆఫీస్ అంచనా వేసింది. పెంటగాన్ చీఫ్ పీట్ హెగ్సేత్ మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేశాన్ని క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ క్షిపణులు, హైపర్సోనిక్ క్షిపణులు, డ్రోన్లు, అణు దాడుల నుంచి రక్షించడమే లక్ష్యంగా దీని ఏర్పాటుకు వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.చైనా, రష్యా ఆందోళన..ఇక, ఇప్పటికే ఇజ్రాయెల్.. ఐరన్ డోమ్ వ్యవస్థను 2011 నుంచి ఉపయోగిస్తోంది. ప్రత్యర్థుల క్షిపణులు దూసుకొచ్చినా.. ఉక్కు కవచంలా వాటిని అడ్డుకునేందుకు టెల్అవీవ్ ఈ డోమ్ను ఉపయోగిస్తుంది. దీని నిర్మాణానికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. దీంతో అటువంటి గోల్డెన్ డోమ్ను అభివృద్ధి చేసుకునేందుకు అమెరికా (USA) సైతం సిద్ధమయ్యింది. అయితే, ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై చైనా, రష్యా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ విధానం వల్ల అంతరిక్షం యుద్ధభూమిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశాయి. . @SecDef "The Golden Dome for America’s game changer. A generational investment in security in America and Americans..." pic.twitter.com/uazlPcCytR— DOD Rapid Response (@DODResponse) May 20, 2025

జైళ్లనిండా బుల్లి ఫోన్లే
ఇది రికార్డుల కోసం తయారు చేసిన బుల్లి ఫోన్ కాదు. ఎంచక్కా పని చేస్తుంది. ఫ్రాన్స్ జైళ్లలో ఖైదీలు వీటిని విచ్చలవిడిగా వాడుతున్నారు. జైలు నుంచే దర్జాగా డ్రగ్ డీల్స్ మొదలుకుని కాంట్రాక్ట్ హత్యల దాకా నానా దందాలూ చక్కబెట్టుకుంటున్నారు. ఈ వ్యవహారంపై కొన్నాళ్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెంచి జైళ్లలో నిబంధనల జాడే లేనంతగా అరాచకం రాజ్యమేలుతోందని జనం మండిపడుతున్నారు. దాంతో జైళ్లలో ఫోన్ల వాడకంపై అధికారులు ఉక్కుపాదం మోపారు. ‘ప్రిజన్ బ్రేక్’ పేరిట మంగళవారం దేశవ్యాప్తంగా ఏకంగా 66 జైళ్లలో ఏకకాలంలో తనిఖీ ఆపరేషన్ నిర్వహించారు. కరడుగట్టిన ఖైదీల వద్ద ఇలాంటి బుల్లి ఫోన్లు వేలాదిగా దొరకడంతో విస్తుపోయారు. కేవలం సిగరెట్ లైటర్ పరిమాణంలో ఉండే ఈ ఫోన్లన్నీ చైనా పీసులేనని విచారణలో తేలడం విశేషం! ఆపొరి్టక్ అనే ఫ్రెంచి కంపెనీ వీటిని విక్రయిస్తోంది. జైళ్లలో జరిపే ఎలాంటి ఎల్రక్టానిక్ తనిఖీలకూ ఇవి చిక్కవని వెబ్సైట్లో బాహాటంగా ప్రచారం చేసుకుంటోంది! దాంతో సదరు కంపెనీని ప్రభుత్వం బ్లాక్లిస్టులో పెట్టింది.

పాక్ ఆర్మీ చీఫ్కు ప్రమోషన్
ఇస్లామాబాద్: భారత్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అత్యున్నత మిలటరీ హోదా అయిన ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ పొందారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్యాలయం మంగళవారం ప్రకటించింది. ప్రధాని షరీఫ్ ఆధ్వర్యంలో సమావేశమైన కేబినెట్ ఆర్మీ చీఫ్ మునీర్కు ఫీల్డ్ మార్షల్ హోదా కట్టబెట్టేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనపై చర్చించి, ఆమోదం తెలిపిందని పేర్కొంది.ఇటీవల భారత్తో తలెత్తిన సైనిక ఉద్రిక్తతల సమయంలో పాక్ బలగాలను విజయం దిశగా నడిపించిన మునీర్ పదోన్నతి పొందారని స్థానిక మీడియా తెలిపింది. ఈ విషయంలో ఆయన అద్వితీయమైన పాత్ర పోషించారని ప్రశంసించింది. యుద్ధంలో తమదే విజయమంటూ పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంటుండగా, భారత్ మాత్రం సాక్ష్యాధారాలతో వివిధ అంతర్జాతీయ వేదికలపై వాస్తవాలను వివరిస్తూ వస్తోంది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ తిరుగులేని అధికారాలను చెలాయిస్తున్న మునీర్కు ఇటీవల ఆ దేశ సుప్రీంకోర్టు మరిన్ని అధికారాలను కట్టబెట్టడం తెల్సిందే. తాజాగా, ఆయనకు ప్రమోషన్ సైతం లభించడం గమనార్హం. Government of Pakistan has promoted Army Chief General Asim Munir to the rank of Field Marshal. ⭐⭐⭐⭐⭐ pic.twitter.com/NNrAM9Npzp— Ambassador Murad Baseer (@muradbaseer) May 20, 2025

అశ్లీల కంటెంట్పై అమెరికా కొరడా
వాషింగ్టన్: ఆన్లైన్లో అశ్లీల కంటెంట్పై అమెరికా కొరడా ఝళిపించింది. దాని నియంత్రణకు ‘టేకిట్ డౌన్’ పేరిట కొత్తం చట్టం తెచ్చింది. దీనిప్రకారం వ్యక్తుల తాలూకు అశ్లీల, అభ్యంతరకర ఫొటోలు, వీడియోలను వారి అనుమతి లేకుండా ఆన్లైన్, సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేయడానికి వీల్లేదు. సోషల్ ప్లాట్ఫాంలు అలాంటి కంటెంట్ను తమ దృష్టికి రెండు రోజుల్లోగా తొలగించాల్సి ఉంటుంది.ఈ నిబంధన డీప్ఫేక్ కంటెంట్కు కూడా వర్తిస్తుంది. ఈ చట్టం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా ఎన్నాళ్లుగానో కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లుపై సోమవారం ఆమె సమక్షంలోనే ట్రంప్ సంతకం చేశారు. అనంతరం ఆయన కోరిక మేరకు మెలానియా కూడా బిల్లుపై సంతకం చేయడం విశేషం. ‘‘దీనికోసం మెలానియా ఎంతగానో పోరాడింది. కనుక ఆమె సంతకానికి అర్హురాలు’’ అని అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
జాతీయం

‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ
పహల్గామ్: జమ్ముకశ్మీర్లోని పహల్గామ్(Pahalgam)లో ఏప్రిల్ 22న 25 మంది పర్యాటకులను, ఒక స్థానికుడిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. ఈ దాడి జరిగి నేటికి (మే 22)కు నెలరోజులయ్యింది. ఈ ఘటన భారత్ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.ఈ దాడి జరిగిన దరిమిలా జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్ఐఏ ప్రస్తుతం సాక్షులను విచారిస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోందని సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల(terrorists) స్కెచ్లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకూ ఫోన్ ఆపరేటర్లు, దుకాణదారులు, ఫోటోగ్రాఫర్లు, సాహస క్రీడలలో పనిచేసేవారితో సహా 150 మంది స్థానికులను విచారించారని ఒక అధికారి తెలిపారు.ఈ ఘటనకు 15 రోజుల ముందు ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా దుకాణాన్ని మూసివేసిన దుకాణదారుడిని కూడా ఎన్ఐఏ విచారించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ డంప్ డేటాను సేకరించింది. వీటిలో అధికంగా బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇవి దాడి చేసినవారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఒక అధికారి తెలిపారు. 2019 పుల్వామా దాడి(Pulwama attack) దర్యాప్తు సమయంలో ఎన్ఐఏ త్రీడీ మ్యాపింగ్ను తయారు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా మ్యాపింగ్తో దర్యాప్తు సాగిస్తోందని సమాచారం. మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించి, వందలాది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీని గురించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ రెండు రోజుల పాటు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు. వారిలో చాలా మందిని విడుదల చేశామని కూడా తెలిపారు. కాగా దాడి జరిగిన దరిమిలా భద్రతా సంస్థలు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల పాదముద్రలను గుర్తించగలిగాయని ఒక అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రమాదం బారిన జీవవైవిధ్యం

నేడు ప్రధాని మోదీ ప్రారంభించనున్న రైల్వే స్టేషన్లు ఇవే..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పునరాభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు (మే 22)న ప్రారంభించనున్నారు. 2022, డిసెంబర్లో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధానమంత్రి రెండు దశల్లో శంకుస్థాపన చేశారు. దేశంలోని రైల్వే స్టేషన్లను ఆధునిక, సమగ్ర రవాణా కేంద్రాలుగా మార్చడంలో భాగంగా రైల్వే మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా 1,300కుపైగా స్టేషన్లను పునరాభివృద్ధి చేసింది.అమృత్ భారత్ స్టేషన్(Amrit Bharat Station) పథకాన్ని దేశంలోని పలు రైల్వే స్టేషన్లలో ఆధునిక వసతుల కల్పన, మల్టీమోడల్ ఇంటిగ్రేషన్, దివ్యాంగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా చేపట్టారు. నేడు ప్రధాని మోదీ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని 103 రైల్వే స్టేషన్లను ప్రారంభించనున్నారు. ఆ స్టేషన్ల వివరాలిలా ఉన్నాయి.అస్సాం: హైబర్గావ్బీహార్: పిర్పైంటి, థావే.ఛత్తీస్గఢ్: దొంగగర్, భానుప్రతాపూర్, భిలాయ్, ఉర్కురా, అంబికాపూర్.గుజరాత్: సమఖియాలీ, మోర్బి, హపా, జామ్ వంతాలి, కనలస్ జంక్షన్, ఓఖా, మిథాపూర్, రాజులా జంక్షన్, సిహోర్ జంక్షన్, పాలిటానా, మహువ, జామ్ జోధ్పూర్, లింబ్డి, డెరోల్, కరంసాద్, ఉత్రాన్, కొసాంబ జంక్షన్, డాకోర్.హర్యానా: మండి దబ్వాలి.హిమాచల్ ప్రదేశ్: బైజ్నాథ్ పప్రోలా.జార్ఖండ్: శంకర్పూర్, రాజమహల్, గోవింద్పూర్ రోడ్.కర్ణాటక: మునీరాబాద్, బాగల్కోట్, గడగ్, గోకాక్ రోడ్, ధార్వాడ్.కేరళ: వడకర, చిరాయింకీజ్.మధ్యప్రదేశ్: షాజాపూర్, నర్మదాపురం, కట్ని సౌత్, శ్రీధం, సియోని, ఓర్చా.మహారాష్ట్ర: పరేల్, చించ్పోక్లి, వడలా రోడ్, మాతుంగా, షాహద్, లోనంద్, కేద్గావ్, లాసల్గావ్, ముర్తిజాపూర్ జంక్షన్, దేవ్లాలి, ధూలే, సావ్దా, చందా ఫోర్ట్, ఎన్ఎస్బీసీ ఇటావ్రీ జంక్షన్, అమ్గావ్. పుదుచ్చేరి: మహే.రాజస్థాన్: ఫతేపూర్ షెఖావతి, రాజ్గఢ్, గోవింద్ గర్, దేశ్నోక్, గోగమేరి, మందావర్ మహువ రోడ్, బుండి, మండల్ గర్.తమిళనాడు: సామలపట్టి, తిరువణ్ణామలై, చిదంబరం, వృద్ధాచలం జంక్షన్, మన్నార్గుడి, పోలూరు, శ్రీరంగం, కుళిత్తురై, సెయింట్ థామస్ మౌంట్.తెలంగాణ: బేగంపేట(Begumpet), కరీంనగర్, వరంగల్.ఉత్తరప్రదేశ్: బిజ్నోర్, సహరాన్పూర్ జంక్షన్, ఈద్గా ఆగ్రా జంక్షన్, గోవర్ధన్, ఫతేహాబాద్, కర్చన, గోవింద్పురి, పోఖ్రాయాన్, ఇజ్జత్నగర్, బరేలీ సిటీ, హత్రాస్ సిటీ, ఉఝని, సిద్ధార్థ్ నగర్, స్వామినారాయణ్ చప్పియా, మైలానీ జంక్షన్, గోల గోకరనాథ్, రామ్ఘాట్ హాల్ట్, సురైమాన్పూర్, బల్రామ్పూర్.పశ్చిమ బెంగాల్: పనగఢ్, కళ్యాణి ఘోష్పరా, జోయ్చండీ పహార్.ఇది కూడా చదవండి: యూట్యూబ్లో జ్యోతి మల్హోత్రా సంపాదన ఎంతంటే..

మేము చనిపోయామని అనుకున్నాం.. ఇండిగో బాధితుల ఆవేదన
శ్రీనగర్: దేశంలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో తీవ్ర ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. ఢిల్లీ నుంచి ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని తీవ్ర కుదుపులకు గురైంది. వడగండ్ల కారణంగా విమానం ముందుభాగం దెబ్బతిని పెద్ద రంధ్రమే ఏర్పడింది. దీంతో ప్రయాణికులు భయాందోళనలకు గురై హాహాకారాలు చేశారు. ఇదే విమానంలో ప్రయాణించిన తృణముల్ కాంగ్రెస్ నేతలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.ఐదుగురు సభ్యుల తృణమూల్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం డెరెక్ ఓ'బ్రియన్, నదిముల్ హక్, సాగరికా ఘోష్, మనస్ భూనియా, మమతా ఠాకూర్తో కూడిన బృందం బుధవారం శ్రీనగర్కు వెళ్తున్న 6E2142 విమానంలో ప్రయాణించారు. విమానం ల్యాండ్ అయిన తర్వాత సాగరిక ఘోష్ మాట్లాడుతూ.. విమానంలో ఒక్కసారిగా కుదుపులు రావడంతో మేమంతా ఇక చనిపోయామని అనుకున్నాం. చావు దగ్గర వరకు వెళ్లి వచ్చినట్టుగా ఉంది. నా జీవితంలో ఇలాంటి పరిస్థితులను ఎప్పుడూ చూడలేదు.I had a narrow escape while flying from Delhi to Srinagar. Flight number #6E2142. Hats off to the captain for the safe landing.@IndiGo6E pic.twitter.com/tNEKwGOT4q— Sheikh Samiullah (@_iamsamiullah) May 21, 2025విమానంలో ఉన్న వారంతా భయంతో కేకలు వేస్తున్నారు. కొందరు ప్రార్థనలు చేశారు. మమ్మల్ని సురక్షితంగా తీసుకువచ్చిన పైలట్కు కృతజ్ఞతలు. విమానం దిగిపోయిన తర్వాత మేమంతా విమానం దెబ్బతిన్న భాగాన్ని చూసి ఖంగుతిన్నాం’ అని చెప్పుకొచ్చారు. భారత్, పాక్ మధ్య దాడుల వల్ల సరిహద్దుల్లో ప్రభావితమైన ప్రజలకు సంఘీభావం తెలియజేయడానికి వీరంతా శ్రీనగర్ వెళ్లినట్టు తెలిపారు. టీఎంసీ ప్రతినిధి బృందం మే 23 వరకు జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. శ్రీనగర్తో పాటు పూంచ్, రాజౌరిలో వీరు పర్యటించనున్నారు.Delhi–Srinagar IndiGo flight hit by severe turbulenceFlight 6E-2142 was caught in a terrifying hailstorm just before landing in Srinagar, forcing an emergency landing around 6:30pm. Damage to plane's nose cone, cabin luggage tumbling. #6E2142 #indigo6e pic.twitter.com/gHKFxpn7SI— Lucifer (@krishnakamal077) May 21, 2025ఇదిలా ఉండగా.. 227 మంది ప్రయాణికులతో శ్రీనగర్ బయలుదేరిన ఇండిగో విమానం 6E2142 వడగండ్ల వానలో చిక్కుకుని బుధవారం తీవ్ర కుదుపులకు గురైంది. అప్రమత్తమైన పైలట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీనగర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్కు సమాచారం ఇచ్చారు. దీంతో విమానం సురక్షిత ల్యాండింగ్కు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం 6.30గంటల సమయంలో విమానాన్ని సురక్షితంగా కిందకు దించారు. విమానం ముందు భాగం దెబ్బతిన్న, ప్రయాణికులు కేకలు వేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. సాంకేతిక సమస్యలతో విమానం శ్రీనగర్లోనే నిలిచిపోయింది.

కేంద్రంపై స్టాలిన్ పోరాటం.. సుప్రీంలో పిటిషన్
సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్వశిక్ష అభియాన్ నిధుల కోసం తమిళనాడు ప్రభుత్వం న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 2024–2025 సంవత్సరానికి రూ.2,151 కోట్లకు పైగా నిధులను నిలిపేయడాన్ని సవాలు చేస్తూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం 2020ని డీఎంకే ప్రభుత్వం అమలుచేయకపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సర్వ శిక్ష అభియాన్ నిధులను కేంద్రం నిలుపుదల చేసింది. జాతీయ విద్యా విధానం అమలుతోనే నిధులు వస్తాయని కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమైంది. సర్వశిక్ష అభియాన్ నిధులను జాతీయ విద్యావిధానాన్ని అనుసంధానిస్తూ కేంద్రం తీసుకున్న చర్య రాజ్యాంగ విరుద్ధం, ఏకపక్షం, అసమంజసమైనదని పిటిషన్లో పేర్కొంది. ఇప్పటికే శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ పెండింగ్ పెట్టిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరోమారు ప్రభుత్వం కేంద్ర నిధులపై పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది.
ఎన్ఆర్ఐ

శంకర్ సుబ్రమోనియన్ తో SNUSA 'మీట్ అండ్ గ్రీట్' కార్యక్రమం
వాషింగ్టన్: శంకర నేత్రాలయ USA (SNUSA) అట్లాంటా విభాగం, ప్రముఖ దాత, IIT మద్రాస్ పూర్వ విద్యార్థి శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారిని సత్కరించేందుకు 2025 ఏప్రిల్ 26న (శనివారం) ఒక ప్రత్యేకమైన "మీట్ అండ్ గ్రీట్" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.శ్రీ శంకర్ సుబ్రమోనియన్ గారు అట్లాంటా నివాసితులు. సమాజానికి తిరిగి ఇవ్వాలనే భావనతో, అనేక సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, అనేక సంస్థలకు ప్రోత్సాహక దాతగా నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధన కేంద్రాలను స్థాపించడంలో మరియు కొనసాగించడంలో ఆయన పాత్ర విలువైనదిగా నిలిచింది.2022 లో కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ బ్రున్స్విక్ వారు శ్రీ శంకర్ గారిని "ఇంజినీరింగ్ వాల్ ఆఫ్ ఫేమ్"లో చేర్చి సత్కరించారు. 2024 సెప్టెంబర్లో, IIT మద్రాస్ పూర్వ విద్యార్థుల సహకారంతో, డయాబెటిస్పై పరిశోధన కోసం "శంకర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్" ను స్థాపించారు. ఇది ఎమోరీ యూనివర్సిటీ యొక్క గ్లోబల్ డయాబెటిస్ రీసెర్చ్ సెంటర్ (EGDRC) తో భాగస్వామ్యంలో పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న మధుమేహ సమస్యకు శాస్త్రీయ పరిష్కారాలను అందించాలనే ఉద్దేశ్యంతో ఈ కేంద్రం ప్రారంభించబడింది.తమ సొంత ఊరైన ఎట్టాయపురం, తమిళనాడులోని గ్రామీణ ప్రాంత ప్రజల కోసం $350,000 విరాళం అందించి, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటు చేయడంలో శ్రీ శంకర్ గారు ముఖ్యపాత్ర పోషించారు. ఇది శంకర నేత్రాలయకు ఐదవ MESU యూనిట్ కాగా,2025 ఆగస్టులో ఇది పూర్తిగా సిద్ధమై తమిళనాడు మరియు కేరళకు సేవలు అందించనుంది. ఈ యూనిట్ ద్వారా ప్రతి సంవత్సరం 80 కన్ను శిబిరాలు నిర్వహించగలగడం వల్ల అనేకమందికి వెలుగు పంచే అవకాశం లభించనుంది.ఈ సందర్భంగా శ్రీ శంకర్ గారి కుటుంబ సభ్యులు — శ్రీమతి లక్ష్మీ శంకర్, కుమార్తె అంబికా శంకర్, కుమారుడు అశోక్ కుమార్ మరియు మనవడు — కార్యక్రమానికి హాజరయ్యారు.SNUSA అధ్యక్షుడు మరియు "శంకర రత్న" అవార్డు గ్రహీత శ్రీ బాలా ఇందుర్తి గారు, శ్రీ శంకర్ గారిని ఘనంగా సత్కరించి,SNUSA యొక్క బ్రాండ్ అంబాసడర్గా ఆయనను ప్రకటించారు. ఈ సందర్భంగా, వారి మానవతా దృక్పథానికి, లక్షలాది మంది కళ్లల్లో వెలుగు నింపాలనే శంకర నేత్రాలయ ఆశయానికి ఆయన అందిస్తున్న మద్దతుకు SNUSA తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపబడింది.ప్రస్తుతం శంకర నేత్రాలయ గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ యూనిట్ల ద్వారా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు భారత ప్రభుత్వం నుండి అధికారికంగా అనుమతి పొందిన ఏకైక సంస్థ. ఇతర క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా సమీపంలోని శంకర నేత్రాలయ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా అందించబడుతున్నాయి.ఈ కార్యక్రమాన్ని SNUSA అధ్యక్షుడు శ్రీ బాలా ఇందుర్తి, కోశాధికారి శ్రీ మూర్తి రేకపల్లి, ట్రస్టీలు శ్రీనీ వంగిమల్ల, మెహర్ లంకా, డా. మాధురి నాముదూరి, సాంస్కృతిక విభాగం నీలిమ గడ్డమనుగు, క్రీడా విభాగం రమేష్ చాపరాల, MESU “అడాప్ట్-ఎ విల్లేజ్” చైర్ డా. కిశోర్ రాసమళ్ళు, చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ తాడికమల్లా, మీడియా చైర్ గిరి కోటగిరి, మరియు సభ్యులు శ్రీధర్ జూలపల్లి, పాడి రావు అట్మూరి, మరియు అట్లాంటా చాప్టర్ నాయకులు శ్రీనివాస్ దుర్గం, రామ్ దుర్వాసుల, శిల్ప ఉప్పులూరి, డా. జనార్ధన్ పన్నెల, రామరాజు గదిరాజు, వెంకీ నిలం, సందీప్ కౌత, దుర్గ గోరా, బిజు దాస్, మరియు యువత విభాగం చరిత్ర జూలపల్లి గారు కలిసి విజయవంతంగా నిర్వహించారు. సింగపూర్ నుండి శ్రీ రత్నకుమార్ కవుటూరు గారు మీడియా విభాగంలో ఎనలేని సేవలందిస్తున్నారని బాలగారు తన ప్రసంగంలో పేర్కొన్నారుఈ వేడుకలో మేటి నాట్య కళాకారులు — రేవతి కోమందూరి, శశికల పెనుమర్తి, నీలిమ గడ్డమనుగు, సోబియా కిషన్, జసోథ బాలసుబ్రమణ్యం — నేతృత్వంలో భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాధవి ఉప్పులూరి మరియు ఉష మోచెర్ల లలిత సంగీతంతో పాటు, స్థానిక గాయనీ గాయకులు, జసోథ బాలసుబ్రమణ్యం విద్యార్థుల వాయిలిన్ వాయిద్య ప్రదర్శన కూడా ఆధ్యాత్మికతతో కూడిన మూడ్ను ఏర్పరిచిందివేదికపై శ్రీ శంకర్ గారు $350,000 చెక్కును SNUSA కోశాధికారి మూర్తి రేకపల్లి గారికి అందజేశారు,SN బృందం మరియు పూజారుల సమక్షంలో. కార్యక్రమం ప్రారంభం లో అట్లాంటా హిందూ టెంపుల్ ప్రధాన పూజారి శ్రీ గోపాల్ భట్టార్ మరియు నలుగురు పూజారులు వేద మంత్రాలతో దీపప్రజ్వలన చేశారు మరియు శంకర నేత్రాలయ సేవా మార్గానికి ఆశీర్వచనాలు అందించారు.కార్యక్రమం ముఖ్య అతిథులుగా డా. కిషోర్ చివుకుల (బోర్డ్ ఆఫ్ అడ్వైజర్ - ఆబర్న్, అలబామా), శ్రీ శ్యామ్ అప్పలి (ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ - లాస్ ఏంజలిస్), శ్రీ అధి మొర్రెడ్డి, శ్రీమతి రేఖా రెడ్డి (ఫీనిక్స్, AZ), శ్రీమతి భాను రామకృష్ణన్ (వాషింగ్టన్ DC), డా. కేశవ్ భట్ (రాలీ,NC), మరియు ఇతరులు పాల్గొన్నారు. మెహర్ లంకా కార్యక్రమ స్థల ఎంపిక మరియు అతిథుల ఆతిథ్య ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించారు. నీలిమ గడ్డమనుగు పూజారులు, కొరియోగ్రాఫర్లు, గాయనీ గాయకులు మరియు అలంకరణ బృందంతో సమన్వయం చేసారు.ఈ సమావేశానికి హాజరైన ప్రముఖులు మరియు MESU దాతలు: డా. బీకే మోహన్, డా. సుజాత రెడ్డి,కోమటి మోహన్ రెడ్డి, రవి పోనంగి, మురళి రెడ్డి, రవి కందిమల్ల, అమర్ దుగ్గసాని, బాలరామిరెడ్డి, శ్రీకాంత్ కొండా, కిరణ్ పాశం, ప్రభాకర్ రెడ్డి ఎరగం, అనిల్ జాగర్లమూడి, భరత్ మదాడి, వంశీ మదాడి, తిరు చిల్లపల్లి, జగదీష్ చీమర్ల, నారాయణ రేకపల్లి, శీలా లింగం, అధి చిన్నతిమ్మ, గోపాల్ నాయర్, ఇందు నాయర్, ప్రవీణ్ ఆకుల, రవి గెల్లా, రాజ్ వుచాటు, రాఘవ తడవర్తి, కమల్ సాతులూరు, శ్రీరామ్ రెడ్డి పళ్ళా, మరియు డా. ప్రమోద్ రెడ్డి కైలా.ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించిన మాస్టర్స్ ఆఫ్ సెరిమనీ: శ్రీ విజు చిలువేరు మరియు శ్రీ శ్యామ్ అప్పలి . ఫోటో/వీడియో కవరేజ్: శ్రీ వెంకట్ కుట్టువా. ఫుడ్ : అచిస్ రెస్టారెంట్. ఓటు ఆఫ్ థ్యాంక్స్: శ్రీ శ్యామ్ అప్పలి. ఫోటో గ్యాలరీ: https://sankaranethralayausa.org/meet-n-greet-shankar-subramonian/index.htmlమరిన్ని వివరాల కోసం దయచేసి మా వెబ్సైట్ను సందర్శించండి: www.SankaraNethralayaUSA.org

నాట్స్ డల్లాస్ విభాగం ఆధ్వర్యంలో ఫుడ్ డోనేషన్
భాషే రమ్యం.. సేవే గమ్యం అనే నినాదంతో పనిచేస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన నినాదానికి తగ్గట్టుగా పేద దేశాల్లో పిల్లల ఆకలి తీర్చేందుకు ముందడుగు వేసింది. రిచర్డ్సన్ నగరంలో నాట్స్ డల్లాస్ విభాగం, ఫీడ్ మై స్టార్వింగ్ చిల్డ్రన్స్ సంస్థతో కలిసి తెలుగు చిన్నారులతో ఫుడ్ డోనేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో నాట్స్ సభ్యులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని అత్యద్భుత సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. దాదాపుగా 30 మంది పిల్లలు, పది మంది పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మొత్తం 105 బాక్సులు ప్యాక్ చేయబడి, 22,680 భోజనాలు సిద్ధం చేశారు. ఈ ప్రయత్నం ద్వారా 62 మంది పిల్లలకు ఒక సంవత్సరం పాటు పోషకాహారం అందించగలిగే ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమానికి నాట్స్ పూర్వ అధ్యక్షులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాపు నూతి , నాట్స్ డల్లాస్ చాప్టర్ జట్టు కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ, శ్రావణ్ నిడిగంటిలు నాయకత్వం వహించారు. నిర్వాహకులుగా సౌజన్య రావెళ్ళ, పావని నున్న వ్యవహరించారు. నాట్స్ డల్లాస్ చాప్టర్ అడ్వైజర్ సురేంద్ర ధూళిపాళ్ల ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ సేవా కార్యక్రమంలో నాట్స్ జాతీయ జట్టు నుండి రాజేంద్ర మాదాల, రవి తాండ్ర , కిషోర్ నారె, సత్య శ్రీరామనేని మరియు డల్లాస్ చాప్టర్ జట్టు నుండి సుమతి మాదాల, శివ మాధవ్, బద్రి బియ్యపు, కిరణ్ నారె తదితరులు పాల్గొన్నారు. "ఒక చిన్న సహాయం ఒక జీవితాన్ని మారుస్తుంది" అనే నినాదంతో నాట్స్ సేవా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని, పిల్లల్లో సేవాభావాన్ని పెంపొందించటానికి ఇలాంటి కార్యక్రమాలు దోహద పడతాయని నాట్స్ పూర్వ అధ్యక్షులు బాపు నూతి అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలకి పెద్దలకి, దాతలకు నాట్స్ డల్లాస్ చాప్టర్ కోఆర్డినేటర్లు స్వప్న కాట్రగడ్డ మరియు శ్రావణ్ నిడిగంటిలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. డాలస్ చాప్టర్ టీం, సలహాదారు బృందం సభ్యుల సహకారం వల్ల ఈ కార్యక్రమం విజయవంతం కావడం పట్ల నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షులు మదన్ పాములపాటి హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

మిస్సోరిలో నాట్స్ ఉచిత వైద్య శిబిరం
అమెరికాలో తెలుగు వారి మేలు కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ .మిస్సోరీలో ప్రతి నెల ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నాట్స్ మిస్సోరి విభాగం బాల్విన్లోని మహాత్మగాంధీ సెంటర్లో ఆదివారం నాడు ఓ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డాక్టర్ సుధీర్ అట్లూరి ఉచిత వైద్య సేవలు అందించారు. రోగులను పరీక్షించిన సుధీర్ అట్లూరి వారికి విలువైన వైద్య సలహాలు ఇచ్చారు.. నాట్స్ మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడి, నాట్స్ మిస్సోరి విభాగం కో ఆర్డినేటర్ సందీప్ కొల్లిపర ఈ వైద్య శిబిరం నిర్వహణకు సహకారం అందించారు.మరిన్ని ఎన్ఆర్ఐ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంతా బయోటెక్, శంకర నేత్రాలయ ఆత్మీయ సమావేశం: భారీ విరాళం
అమెరికాలోని అట్లాంటా మహానగరంలో భారతీయ పారిశ్రామికవేత్త, శాస్త్రవేత్త, శాంతా బయోటెక్వ్యవస్థాపక చైర్మన్ పద్మ భూషణ్ డాక్టర్ కెఐ వరప్రసాద్ రెడ్డితో శంకర్ నేత్రాలయ ఒక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించింది. శంకర నేత్రాలయ USA అధ్యక్షడు బాలారెడ్డి ఇందుర్తి ఆధ్వర్యంలో, కోశాధికారి మూర్తి రేకపల్లి, పాలకమండలి సభ్యులు శ్రీని వంగిమళ్ళ, ఉపేంద్ర రాచుపల్లి, నీలిమ గడ్డమణుగు, డా. కిషోర్ రసమల్లు, రాజేష్ తడికమల్ల ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వరప్రసాద్ రెడ్డి శంకరనేత్రాలయ మేసు (MESU) కార్యక్రమాలను అభినందిస్తూ, తనవంతుగా రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. గత విరాళం రూ. 25 లక్షల కు తోడు, మొత్తం రూ. 50 లక్షలువిరాళాన్ని ఆయన శంకర నేత్రాలయ యుఎస్సే కు అందించారు. అలాగే 2026లో నెల్లూరులో మరో భారీ కంటి చికిత్సా శిబిరాన్ని నిర్వహించడానికి డా. వరప్రసాద్ రెడ్డి అంగీకరించారు. కాగా ఈ విరాళం ఐదు MESU Adopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు సాయం అందుతుందని అద్యక్షుడు బాలారెడ్డి ఇందుర్తి కొనియాడారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రసాద్రెడ్డి డాలస్ ను కూడా సందర్శించారు. ఆయన మిత్రుడుCTO EVP, LennoxInternational (బిలియన్-డాలర్ పబ్లిక్ కంపెనీ) ప్రకాశ్ ఆహ్వానం మేరకు , ఆయన స్వగృహంలొ15 మంది స్నేహితులతో ఇంకొక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. వరప్రసాద్ ప్రసంగాలు, సంగీత సాహిత్య మేళవింపుగా ఇది ఈ సమావేశం హృద్యంగా సాగింది. డాలస్ నివాసి, శంకర నేత్రాలయ యుఎస్సే పాలక మండలి సబ్యులు డా. రెడ్డీ (NRU) ఊరిమిండి సంస్థ లక్ష్యాలను, సేవలనుపంచుకొన్నారు. ప్రకాశ్ బెడపూడి శంకరనేత్రాలయ సంస్థ సమగ్ర సేవలను అభినందిస్తూ తమ మిత్రుని గౌరవార్ధం యాభై వేల డాలర్ల విరాళాన్ని ప్రకటించారు. అక్కడకు విచ్చేసిన స్నేహితులు అదనంగా మరో రెండు MESUAdopt-A-Village కంటి చికిత్సా శిబిరాలకు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ఇతర విరాళాలతో కలిపి డాలస్ కార్యక్రమంలో దాదాపు లక్ష డాలర్ల వరకు విరాళాలు ప్రకటించడం సంస్థకార్యక్రమాలకు ఉత్సాహాన్ని ఇచ్చిందని శంకర్నేత్రాలయ ప్రకటించింది.
క్రైమ్

ఒంటరి మహిళలే రాము టార్గెట్.. 18 దారుణ హత్యలు!
ఘట్కేసర్(హైదరాబాద్): మహిళను హత్యచేసి మృతదేహాన్ని కాల్చిన నిందితుడికి 1వ అడిషనల్ జిల్లా కోర్టు జీవితఖైదు విధించింది. బుధవారం ఇన్స్పెక్టర్ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 4, 2021న అంకుషాపూర్ రైల్వేట్రాక్ 218/16–18 మైలురాయి వద్ద ముళ్లపొదల్లో 35–45 ఏళ్లున్న గుర్తు తెలియని మహిళ కుళ్లిపోయిన మృతదేహం లభ్యమైంది. గుర్తుతెలియని దుండగులు ఆమెను అక్కడికి తీసుకొచ్చి గుర్తుపట్టకుండా ముఖం కాల్చివేసినట్లు కేసు నమోదైంది. అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబు దర్యాప్తు చేయగా.. మృతురాలు నగరానికి చెందిన దినసరి కూలీ కూర వెంకటమ్మగా తేలింది. సీసీ ఫుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా.. పోలీసులు సీసీ పుటేజీ, ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒంటరి మహిళలను టార్గెట్ చేసి 18 మందిని హత్య చేసిన నిందితుడు సీరియల్ కిల్లర్ సంగారెడ్డి జల్లా కంది మండలం, ఆరుట్ల గ్రామానికి చెందిన మైనం రాములు (47)గా పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని అరెస్ట్చేసి రిమాండ్కు తరలించి దర్యాప్తు తర్వాత చార్జ్షిట్ దాఖలు చేశారు. మహిళ హత్య కేసును ఛేదించిన అప్పటి ఇన్స్పెక్టర్ చంద్రబాబును పోలీస్ ఉన్నతాధికారులు అభినందించి అవార్డును అందజేశారు. ఇరు వాదనలు విన్న 1వ అడిషనల్ మేడ్చల్ జిల్లా న్యాయమూర్తి నిందితుడికి జీవితఖైదు విధించారు.

బీజేపీ ఎమ్మెల్యే కార్యాలయంలో గ్యాంగ్రేప్
యశవంతపుర: మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న అనుచరులు తనపై అత్యాచారం చేశారని ఓ మహిళ ఆర్ఎంసీ యార్డు పోలీసు స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేసింది. తాను బీజేపీ కార్యకర్తనని, మాట వినలేదని చెప్పి మునిరత్న తనపై వ్యభిచారం సహా పలు కేసులు పెట్టించి జైలుకు పంపాడని ఆమె ఆరోపించింది. 2023 జూన్లో కేసులు మాఫీ చేయిస్తానని ఎమ్మెల్యే అనుచరులు వసంత్, చెన్నకేశవ, కమల్ ఎమ్మెల్యే ఆఫీసుకు తీసుకెళ్లి అక్కడ అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. ముఖంపై మూత్రం పోసి, ప్రమాదకరమైన జబ్బు వైరస్ను ఎక్కించారని పేర్కొంది. కాగా, మునిరత్నపై ఇదివరకే కాంట్రాక్టర్లకు బెదిరింపులు, హనీట్రాప్ తదితర కేసులు ఉన్నాయి. అరెస్టయి బెయిలుపై విడుదలయ్యారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. అయితే తాజా ఆరోపణలపై ఎమ్మెల్యే స్పందించలేదు.

మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్లో మరణించడం మావోయిస్టు పార్టీకి తీవ్ర నష్టమనే చెప్పాలి. ఆపరేషన్ కగార్ పేరిట తరుముతున్న సాయుధ పోలీసు బలగాలు..మరోవైపు ముంచుకొస్తున్న ఆనారోగ్య సమస్యలు.. కొన్నేళ్లుగా మావోయిస్టు పార్టీ కేడర్ను సతమతం చేస్తున్నాయి. ప్రధానంగా మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్న నాయకులంతా ఐదుపదుల వయస్సు దాటినవారే కావడంతో ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్య వారిని వెంటాడుతూనే ఉంది. కొందరు కీలక నేతలను అనారోగ్యంతో కోల్పోతే, మరికొందరు ఎన్కౌంటర్లలో హతమవడం మావోయిస్టులను కలవర పెడుతోంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మావోయిస్టు పార్టీ పొలిట్బ్యూరో సభ్యుడు, సెంట్రల్ కమిటీ మెంబర్ కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ జూన్ 2023లో మృతి చెందారు. అంతకుముందే మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, సెంట్రల్ కమిటీ మెంబర్ యాపా నారాయణ (హరిభూషణ్) కరోనాతో మృతి చెందారు.మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ (ఆర్కే) సైతం కిడ్నీలు ఫెయిల్ అవడం ఇతర అనారోగ్యంతో బాధపడుతూ బస్తర్ అటవీ ప్రాంతంలో చనిపోయారు. ఇక సెంట్రల్ కమిటీలోని కొందరు నేతలు సొంతగా నడవలేని స్థితిలోనూ ఉన్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర సాయుధ బలగాల నుంచి తప్పించుకుని తిరగడం వారికి కష్టమవుతోందనే వాదనలు ఉన్నాయి. కీలక నేతలే టార్గెట్గా ఆపరేషన్లు మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర ప్రభుత్వం 2026 మార్చి 31 డెడ్లైన్గా విధించడంతో సీఆర్పీఎఫ్, డీఆర్జీ, గ్రేహౌండ్స్ వంటి ప్రత్యేక బలగాలతో పాటు స్థానిక పోలీసులు మావోయిస్టు కీలక నేతలనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఓవైపు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న అబూజ్మఢ్, బస్తర్, కర్రిగుట్టలు సహా కీలక ప్రాంతాలన్నింటిలోకి చొచ్చుకుని వెళుతూ దళాలు క్యాంపులు నిర్మిస్తున్నాయి. మరోవైపు మావోయిస్టు అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తేనే మావోయిస్టులను మూలాల నుంచి దెబ్బ కొట్టవచ్చన్న వ్యూహంతో ముందుకు వెళుతున్నాయి. గతంలోనూ ఇదే తరహా వ్యూహాలను అమలు చేశాయి. ఈ ఏడాది జనవరి 16న ఛత్తీస్గఢ్ జాపూర్ జిల్లా పరిధిలో చేసిన ఎన్కౌంటర్లో తెలంగాణ మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ను మట్టుపెట్టాయి. జనవరి 21న ఒడిశా మావోయిస్టు పార్టీ కార్యదర్శి చలపతి మరణించారు. 2024 డిసెంబర్లో ములుగు జిల్లా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో కుర్సుం మంగు అనే కీలక నేత చనిపోయారు. దంతెవాడ–బీజాపూర్ జిల్లా పరిధిలో 2024 సెప్టెంబర్లో జరిగిన ఎన్కౌంటర్లో మాచర్ల ఏసోబు అలియాస్ రణ«దీర్ ఎన్కౌంటర్ అయ్యారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో అత్యంత చురుకైన, ప్రమాకరమైన మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యుడు మాడ్వి హిడ్మా కోసం వేలాది మందితో కూడిన భద్రత బలగాలు గాలిస్తున్నాయి. క్రమంగా కుచించుకుపోతున్న పార్టీ మావోయిస్టుల స్థావరాలు భద్రత బలగాల హస్తగతం అవుతుండడం..వరుస ఘటనల్లో అగ్ర నాయకత్వాన్ని కోల్పోతుండడంతో మావోయిస్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలోనే పదుల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోతున్నారు. ప్రస్తుతం మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీలో వంద మంది లోపే సభ్యులు ఉన్నారని, వారిలోనూ 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల వారే ఉన్నట్టు పోలీసులు అధికారికంగా వెల్లడించారు.ఇలా తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ మావోయిస్టు కమిటీల్లో కొత్తగా రిక్రూట్మెంట్లు లేకపోగా..ఉన్న వారు లొంగిపోతుండడంతో పార్టీ క్రమంగా కుచించుకుపోతోందని అంటున్నారు. తుడిచివేతే లక్ష్యంగా ‘కగార్’ దేశంలో మావోయిస్టులు లేకుండా చేయాలనే లక్ష్యంతో 2009లో కేంద్రం ఆపరేషన్ గ్రీన్హంట్ను చేపట్టింది. గడిచిన పదహారేళ్లలో ఈ కార్యక్రమం ఆపరేషన్ సమాధాన్, ప్రహార్గా కొనసాగి ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లోని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలను నలువైపుల నుంచి చుట్టుముట్టడం ద్వారా మావోయిస్టులను పూర్తిగా ఏరివేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా.. 1) ఆయా ప్రాంతాల్లో ఫార్వర్డ్ బేస్ క్యాంపులను ఏర్పాటు చేస్తారు. దీని కోసం సీఆర్పీఎఫ్, ఇండోటిబెటన్ పోలీస్, బస్తర్ ఫైటర్స్, డీఆర్జీ, కోబ్రా ఇలా వివిధ పేర్లతో లక్ష మందికి పైగా జవాన్లను తయారు చేశారు. ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒకటి వంతున క్యాంపులు ఏరా>్పటు చేస్తున్నారు. 2) మావోయిస్టుల సమాచారం సేకరించడంలో భాగంగా డ్రోన్లు, శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిíÙయల్ ఇంటిలిజెన్స్లను వాడుతున్నారు. 3) తమ ఆ«దీనంలోకి వచి్చన ప్రాంతాల్లో వెనువెంటనే పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి లా అండ్ ఆర్డర్ను అమలు చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. 4) లొంగిపోవాలని భావించే మావోయిస్టులకు ఉదారంగా సరెండర్ పాలసీ అమలు. ఈ నాలుగు లక్ష్యాలతో ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1న మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోకి క్యాంపులు రావడంతో నక్సలైట్ల కదలికలు పరిమితం అయ్యాయి. వారు దట్టమైన అడవుల్లో, షెల్టర్ జోన్లలో ఉండటాన్ని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి గుర్తిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్లు చేసే క్రమంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులు పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. సరెండర్ పాలసీ కారణంగా లొంగుబాట్లు కూడా పెరిగాయి.

45 ఏళ్ల అజ్ఞాతం.. అడవిలోనే అంతం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/ సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/కాజీపేట అర్బన్: మావోయిస్టు పార్టీ తన ప్రస్థానంలో ఎన్నో ఎదురు దెబ్బలు కాసింది. కానీ.. ఆ పార్టీకి బుధవారం తగిలిన ఎదురుదెబ్బ మాత్రం అశనిపాతమే. పార్టీ సుప్రీం కమాండర్గా ఉన్న ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు (ఎన్కే) అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎవరూ ఊహించని విధంగా ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో పోలీసు తూటాలకు నేలకొరిగారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో దిట్టగా గుర్తింపు పొందిన నంబాల అనేక భారీ దాడులకు వ్యూహకర్తగా వ్యవహరించారు. విద్యార్థి దశ నుంచే.. కేశవరావు స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలోని జియ్యన్నపేట. వాసుదేవరావు, లక్ష్మీనారాయణమ్మ దంపతులకు 1955లో జన్మించారు. ఆయనకు ఇద్దరు సోదరులు, ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. తండ్రి ఉపాధ్యాయుడు కాగా 1 నుంచి 5 వరకు స్వగ్రామమైన జియ్యన్నపేటలోనే విద్యనభ్యసించారు. ఆ తర్వాత 6 నుంచి 10 వరకు టెక్కలి మండలం తలగాం ఎట్ నౌపడ ఆర్ఎస్లోను, టెక్కలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్, టెక్కలి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. కబడ్డీ, వాలీబాల్ క్రీడాకారుడిగా రాణించిన కేశవరావు విద్యార్థి దశలోనే విప్లవ భావజాలానికి ఆకర్షితుడయ్యారు. విద్యార్థి దశలో తన స్వగ్రామం వచ్చి తనకు రావాల్సిన వాటాను ఆస్తిగా ఇస్తే, పేదలకు పంపిణీ చేస్తానని తండ్రిని అడిగినట్టు సమాచారం. వరంగల్లోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో (ఇప్పటి నిట్) బీటెక్ చేశారు. ఆ సమయంలోనే విప్లవ పార్టీలతో పరిచయాలు ఏర్పడ్డాయి. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ఎస్యూ) సభ్యుడిగా చేరిన ఆయనకు సీపీఐ (ఎంఎల్) అగ్రనేతలు కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తితో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. మలుపు తిప్పినఎంటెక్..ఎంటెక్ చదువుతుండగా కళాశాలలోని మెస్లో జరిగిన చిన్నపాటి వివాదం కేశవరావు జీవితాన్ని మలుపు తిప్పింది. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా కేశవరావు ఉన్న సమయంలో మరో విద్యార్థి సంఘం ఏబీవీపీతో జరిగిన వివాదానికి సంబంధించిన కేసులో ఆయన చిక్కుకున్నారు. అరెస్టు చేస్తారన్న సమాచారంతో.. 1980లో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కేశవరావు 1982లో చింతపల్లి ప్రాంతంలో పోలీసులకు పట్టుబడ్డారు. విశాఖపట్టణం సెంట్రల్ జైలులో ఉండి బెయిల్పై బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఆచూకీ లేదు.ఒక్కసారి కూడా ఇంటికి రాలేదు..కేశవరావు విప్లవ పార్టీలో చేరిన తరువాత ఒక్కసారి కూడా తన స్వగ్రామం జియ్యన్నపేటకు రాలేదు. 1980లో పీపుల్స్ వార్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. తొలుత గంగన్న అనే పేరుతో పీపుల్స్ వార్ ఈస్ట్ డివిజన్ కార్యదర్శిగా చేశారు. 1987లో ఈస్ట్ డివిజన్ను విస్తరించి ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ దండకారణ్య కమిటీ ఏర్పాటు ఆయన ఆలోచనే. ఆ కమిటీలో కేశవరావుతో పాటు మల్లోజుల కోటేశ్వరరావు, కటకం సుదర్శన్ కీలకపాత్ర పోషించారు.ఎల్టీటీఈ ద్వారా శిక్షణ1990లో కేశవరావు పీపుల్స్వార్ పార్టీ అగ్రనేతగా ఎదిగారు. ఆ తరువాత పీపుల్స్ వార్ పార్టీకి గుండెకాయ వంటి దండకారణ్య కమిటీ కార్యదర్శిగా నియమితులయ్యారు. కేశవరావు పేలుడు పదార్థాల తయారీ నిపుణుడిగా, మిలటరీ ఆపరేషన్ల వ్యూహ నిపుణుడిగా గుర్తింపు పొందారు. అప్పటి పీపుల్స్వార్ పార్టీ కీలక నేతలు మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డిలతో కలసి 1987లో మధ్యప్రదేశ్లోని బస్తర్ అడవుల్లో పేలుడు పదార్థాల ప్రయోగం, గెరిల్లా దాడుల్లో శిక్షణ పొందారు. ఎల్టీటీఈ ద్వారా వీరు ఈ శిక్షణ తీసుకున్నారు. దేశవ్యాప్త మిలటరీ ఆపరేషన్లకు నేతృత్వం పీపుల్స్వార్ పార్టీలో ప్రత్యేక మిలటరీ ఆపరేషన్స్ విభాగం ఏర్పాటు చేయాలని 1995లో గణపతి, కేశవరావు భావించారు. ఆ మిలటరీ ఆపరేషన్స్ విభాగానికి బసవరాజు, బీఆర్ పేర్లతో కేశవరావే నేతృత్వం వహించారు. 2001లో పీపుల్స్వార్ 7వ కాంగ్రెస్లో సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా నియమితులయ్యారు. అప్పటివరకు దండకారణ్య ప్రాంతానికే పరిమితమైన ఆయన ఆ తర్వాత దేశవ్యాప్తంగా పీపుల్స్వార్ పార్టీ మిలటరీ ఆపరేషన్లను పర్యవేక్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి బిహార్, ఉమ్మడి మధ్యప్రదేశ్, ఒడిశాలో వేలాదిమందికి గెరిల్లా పోరాటంలో శిక్షణ ఇచ్చారు.2016లో సుప్రీం కమాండర్గా..పీపుల్స్వార్, మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ సెంటర్(ఎంసీసీ)ను విలీనం చేయడంలో గణపతి, కేశవరావు జోడీ ప్రధాన పాత్ర పోషించింది. గణపతి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేయగా.. కేశవరావు మిలటరీ కమిషన్ ఇన్చార్జిగా వ్యవహరించారు. 2016లో వయోభారంతో గణపతి ఆ పదవి నుంచి వైదొలగడంతో ప్రధాన కార్యదర్శి హోదాలో కేశవరావు సుప్రీం కమాండర్గా నియమితులయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో రెండు దశాబ్దాల పాటు పీపుల్స్వార్/మావోయిస్టు పార్టీ జరిపిన అన్ని ప్రధాన దాడుల వెనుక వ్యూహకర్త నంబాల కేశవరావే అని పోలీసులు చెబుతారు. గెరిల్లా వార్ఫేర్, ఆయుధాల తయారీ, మెరుపు దాడులు చేయడం వంటి అంశాల్లో నంబాల కేశవరావుకు దిట్టగా పేరుంది. స్వతహాగా ఇంజనీరింగ్ చదివి ఉండడంతో ఆ నైపుణ్యాన్ని పార్టీ బలోపేతానికి వినియోగించినట్టు చెబుతారు. పీపుల్స్వార్ చరిత్రలో తొలిసారి 1987లో తూర్పుగోదావరి జిల్లా దారగడ్డలో పోలీసు బలగాలపై గెరిల్లా దళం దాడికి కేశవరావు నేతృత్వం వహించారు. ఆ దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. అలిపిరి ఘటనకు, ఇతర భారీ దాడులకు బాధ్యుడు 2003 అక్టోబర్ 1న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై తిరుపతిలోని అలిపిరిలో క్లెమోర్ మైన్ దాడి వ్యూహం కేశవరావుదే. 2008లో ఒడిశా నాయగఢ్లో పోలీసుల ఆయుధాగారంపై దాడిచేసి వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను అపహరించుకుపోయిన దాడికి నేతృత్వం వహించారు. 2010లో ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో 76 మంది సీఆర్పీఎఫ్ బలగాలను బలిగొన్న దాడికి వ్యూహకర్త నంబాల కేశవరావే. ఆ దాడికి హిడ్మా నేతృత్వం వహించాడు. 2013లో ఛత్తీస్గఢ్ మాజీ మంత్రి, మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వా జడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మతో పాటు కాంగ్రెస్ నేత నందకుమార్ మరో 27మందిని బలిగొన్న దాడికి కూడా కేశవరావే వ్యూహకర్త. విశాఖ జిల్లా అరకులో అప్పటి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య ఘటనలోనూ కేశవరావు ప్రమేయం ఉందన్న వాదనలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నయాగరా, చింతల్నార్, బలిమెల వంటి దాడులు కూడా ఆయన నేతృత్వంలోనే చోటుచేసుకున్నాయి. శత్రువులుగా భావించిన వారికి మాటల కంటే తూటాలతోనే ఎక్కువ బదులిస్తారనే పేరు మోశారు. కాగా బసవరాజు పేరు ఏపీ, తెలంగాణలో కంటే జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.నీడను కూడా నమ్మని మావోయిస్టు పార్టీ గెరిల్లా పోరాట పంథానుఅనుసరిస్తుండటంతో మావోయిస్టు పార్టీ నీడను సైతం నమ్మకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. పార్టీలో ఏదైనా విభాగానికి నిర్దిష్టమైన పనులు తప్ప మొత్తం వ్యవహారంపై అవగాహన ఉండదు. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పొలిట్బ్యూరో, సెంట్రల్ మిలటరీ కమిషన్, రాష్ట్ర కమిటీలు, వివిధ డివిజన్ కమిటీలను సమన్వయం చేయడం, ఆర్థిక, ఆయుధ వ్యవహారాలను చక్కదిద్దడం వంటి పనులు చూస్తుంటారు.ఎక్కడ నుంచి ఆయుధాలు వస్తుంటాయి, ఆర్థిక వనరుల ఆనుపానులు ఎక్కడ ఉంటాయి, పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఎక్కడ షెల్టర్లలో ఉన్నారనే అంశాలు కూడా ఆయనకే ఎక్కువగా తెలుస్తాయి. ఇప్పటికే పెరిగిన నిర్బంధంతో ఆ పార్టీ విభాగాలు, కీలక నేతలు చెల్లాచెదురయ్యారు. ఇప్పుడు కేంద్ర కార్యదర్శే చనిపోవడంతో పార్టీకి సంబంధించిన వివిధ విభాగాల మధ్య సమన్వయం దెబ్బతినే అవకాశముందని భావిస్తున్నారు. ఒక్కసారి చిక్కినా విదిలించుకుని.. నంబాల కేశవరావు విద్యార్థి సంఘాలు ఆర్ఎస్యూ, ఏబీవీపీ ఘర్షణల్లో ఒక్కసారి మాత్రమే అరెస్టయ్యారు. 1987లో విశాఖపటా్ననికి ఒంటరిగా వచ్చిన ఆయన్ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే కబడ్డీ క్రీడాకారుడు కావడంతో చాకచక్యంగా విదిలించుకుని పరారయ్యారు. మిలటరీ ఆపరేషన్ల నిర్వహణలో కీలక పాత్ర పోషించిన ఆయనపై రూ.10 లక్షలతో మొదలైన పోలీసు రివార్డు రూ.1.50 కోట్లకు చేరుకుంది. పోలీసు శాఖ మోస్ట్వాంటెడ్ లిస్టులో అత్యధిక రివార్డు కేశవరావుపైనే ఉందని సమాచారం. 45 ఏళ్ల క్రితం విద్యార్థిథగా ఇంటిని వదిలివెళ్లిన కేశవరావు మావోయిస్టు అగ్రనేతగా ఎదిగి అప్పట్నుంచీ అజ్ఞాతంలోనే జీవితాన్ని గడిపారు. చివరకు అడవిలోనే ప్రాణాలు విడిచారు. కేశవరావు కుటుంబం విశాఖపట్నంలోనే స్థిరపడింది.
వీడియోలు


మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం


ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025


Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు


KTR: నీ కేసులకు భయపడేది లేదు


రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..


రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్


Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..


MLAని అని చెప్పుకోవాలంటే సిగ్గుగా ఉంది: Bandaru Satyanarayana


తమిళనాడు లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నాం : ప్రధాని మోదీ