72nd Miss World 2025 - Latest News, Updates, Contestants & Winners
Sakshi News home page

Miss World 2025

న్యూస్ Update

Miss England quits Miss World 2025 midway citing ethical concerns1
బ్యూటీ విత్‌ పర్పస్‌ అనేది డొల్ల

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఆతిథ్యం ఇస్తున్న మిస్‌ వరల్డ్‌–2025 అందాల పోటీల చుట్టూ తీవ్ర వివాదం ముసురుకుంది! వ్యక్తిగత కారణాలతో పోటీల నుంచి వైదొలగుతున్నట్లు చెప్పి స్వదేశం వెళ్లిపోయిన మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ తాజాగా ‘ద సన్‌’కు ఇచి్చన ఇంటర్వ్యూలో పోటీల తీరుపై సంచలన ఆరోపణలు గుప్పించారు. తాను వేశ్యననే భావన కలిగేలా నిర్వాహకులు పరిస్థితులను కలి్పంచారంటూ బాంబు పేల్చారు. నిర్వాహకులు పేర్కొన్నట్లు ఈ పోటీలు బ్యూటీ విత్‌ పర్పస్‌కు అనుగుణంగా లేవని.. అదంతా డొల్లేనని దుయ్యబట్టారు.పోటీదారులంతా ఎల్లవేళలా మేకప్‌ వేసుకోవాలని ఆదేశించారని.. అల్పాహారం సమయంలోనూ బాల్‌ గౌన్లు ధరించాల్సిందేనని హుకుం జారీ చేశారని విమర్శించారు. ‘పోటీకి ఆర్థిక సహకారం అందిస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతాపూర్వకంగా ఆరుగురు అతిథులు కూర్చున్న ఒక్కో టేబుల్‌ వద్ద ఇద్దరేసి పోటీదారులను కూర్చోబెట్టారు. సాయంత్రం మొత్తం వారితో కూర్చొని కృతజ్ఞతలు తెలుపుతూ మేం వినోదం అందించాలని నిర్వాహకులు ఆశించారు.ఓ సమయంలో పోటీల ఉద్దేశం గురించి అతిథులకు వివరించే ప్రయత్నం చేశా. కానీ ఈ విషయాన్ని వారెవరూ పట్టించుకోలేదు. అది నాకు భరించలేనట్లుగా అనిపించింది. ఇతరుల వినోదం కోసం నేను ఇక్కడికి రాలేదు కదా అనుకున్నా. సంపన్న పురుష స్పాన్సర్ల ముందు కవాతు చేశాక వేశ్యలా భావించా’అని మిల్లా మాగీ చెప్పుకొచ్చింది. మారాలనుకున్నా... నా వల్ల కాలేదు.. సమాజంలో మార్పు తీసుకురావడానికి, యువతలో స్ఫూర్తినింపి వారి భవితకు దోహదపడాలనే ఉద్దేశంతోనే పోటీలో పాల్గొన్నానని మిల్లా మాగీ పేర్కొంది. కానీ అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితుల్లో ఉంటానని ఏమాత్రం ఊహించలేకపోయానని చెప్పుకొచ్చింది. అతిథులను సంతోషపెట్టేందుకు ఆటాడే కోతుల్లా అక్కడ కూర్చోవాల్సి వచ్చిందని.. దీన్ని ఏమాత్రం తట్టుకోలేకపోయానని వాపోయింది.‘నేను నిర్వాహకుల నిబంధనలకు అనుగుణంగా మారాలనే ప్రయత్నంలో ఒత్తిడిని అనుభవించా. అలా చేయకపోతే గెలవలేననే విషయం నాకు అర్థమైంది. మిస్‌ వరల్డ్‌ పోటీలంటే మనం ఎలా ఉన్నామో అలా కనిపించడం. కానీ 1970ల నుంచి ఆ పోటీల తీరు మారలేదు. అందుకే మేకప్‌ లేకుండానే బయటకు వెళ్లడం ప్రారంభించా. అల్పాహారం తీసుకోవడానికి నాకు నప్పేవి, తగిన దుస్తులను ధరించడం ప్రారంభించా’అని మిల్లా మాగీ చెప్పింది. ఆరోపణలన్నీ నిరాధారం: మిస్‌ వరల్డ్‌ సీఈఓ మిస్‌ ఇంగ్లండ్‌ మిల్లా మాగీ ఆరోపణలను మిస్‌ వరల్డ్‌–2025 సీఈఓ జూలియా మోర్లే ఓ ప్రకటనలో ఖండించారు. ఆమె ఆరోపణలను నిరాధార, కల్పితమైనవిగా అభివరి్ణంచారు. తల్లి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందున పోటీల నుంచి వైదొలగుతానని మిల్లా మాగీ చెప్పడంతో ఆమె స్వదేశం చేరుకొనేందుకు ఏర్పాట్లు చేశామన్నారు.మాగీ స్థానంలో మిస్‌ ఇంగ్లాండ్‌ పోటీల్లో రన్నరప్‌గా నిలిచిన చార్లెట్‌ గ్రాంట్‌ పోటీలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ చేరుకుందని.. ఈ పోటీలో ఇంగ్లండ్‌ ప్రాతినిధ్యం కొనసాగుతోందని పేర్కొన్నారు. మిల్లా మాగీ ఆరోపణల నేపథ్యంలో పోటీలో పాల్గొన్న సందర్భంగా ఆమె నిర్వాహకులను ప్రశంసిస్తూ మాట్లాడిన మాటలు, అనుభూతులను పంచుకున్న వైనాన్ని వీడియోలను విడుదల చేయనున్నట్లు జూలియా మోర్లే వివరించారు. మిస్‌ వరల్డ్‌ సంస్థ అంకిత భావంతో ఉందని.. బ్యూటీ విత్‌ పర్పస్‌ అనే పంథాకు కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Miss India Nandini Gupta among four continental winners in Miss World 2025 top model challenge2
టాప్‌ మోడల్‌ చాలెంజ్‌ విజేత మిస్‌ ఇండియా

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ గ్రాండ్‌ ఫినాలే ముందు ఒకే ఒక్క చాలెంజ్‌ రౌండ్‌ ఉందనగా మిస్‌ ఇండియా నందినీ గుప్తా టాప్‌–40 జాబితాలో చోటు దక్కించుకుంది. గ్రాండ్‌ ఫినాలే నాటికి పోటీలో ఉండాలంటే కచ్చితంగా ఖండానికి 10 మంది చొప్పున ఉండే ఈ టాప్‌–40లో చోటు దక్కించుకోవాల్సిందే. ఫాస్ట్‌ట్రాక్‌ పోటీ రౌండ్లలో విజయం సాధించడం ద్వారా నేరుగా అందులో చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మూడు రౌండ్లలో ఆమె విజయం సాధించలేకపోవడంతో మిస్‌ వరల్డ్‌ పోటీలను అనుసరిస్తున్న భారత అభిమానుల్లో నిరాశే మిగిలింది.శనివారం హైటెక్స్‌లో జరిగిన టాప్‌ మోడల్‌ ఫ్యాషన్‌ షోలో నందినీ గుప్తా.. పటోలా లెహంగా వస్త్రధారణతో ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌తో న్యాయనిర్ణేతల దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఆధునిక వస్త్రధారణలోనూ తళుక్కున మెరిసింది. వెరసి ఈ రౌండ్‌లో ఆసియా–ఓషియానియా గ్రూప్‌ నుంచి ఆమె న్యూజిలాండ్‌ సుందరితో కలిసి టాప్‌–8లో నిలిచింది. చివరకు న్యూజిలాండ్‌ భామను వెనక్కు నెట్టి విజేతగా ఎంపికైంది. పోచంపల్లి, గద్వాల, గొల్లభామ చీరలు... మిస్‌ వరల్డ్‌ పోటీలు ఆసాంతం తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబిస్తూ ముందుకు సాగుతుండగా దాన్ని మరింత విస్తరిస్తూ శనివారం టాప్‌ మోడల్‌ పోటీలు సాగాయి. ప్రపంచ ప్రఖ్యాత పోచంపల్లి వస్త్రాలు, సిద్దిపేట గొల్లభామ, గద్వాల చీరలతోపాటు లెహంగా, గాగ్రా చోలీ తదితర భారతీయ వస్త్రాలు ధరించిన అందాల భామలు.. ర్యాంప్‌పై క్యాట్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. తొలుత తెలంగాణ టాప్‌ డిజైనర్లు రూపొందించిన తెలంగాణ–భారతీయ సంప్రదాయ వ్రస్తాలతో క్యాట్‌ వాక్‌ చేశారు. అనంతరం టాప్‌ డిజైనర్లు రూపొందించిన ఆధునిక వ్రస్తాలతో రెండోసారి ర్యాంప్‌పై నడిచారు. ఈ రెండు రౌండ్లకు కలిపి న్యాయనిర్ణేతలు మార్కులు వేశారు. హైహీల్స్, పొడవాటి వ్రస్తాలు ధరించిన జపాన్‌ సుందరి క్యాట్‌వాక్‌ రౌండ్‌ చివర్లో అదుపుతప్పి ర్యాంప్‌పై పడిపోయింది. ఆ వెంటనే లేచి తేరుకుని వాక్‌ పూర్తి చేసింది. తెలంగాణ డిజైన్లకు న్యాయ నిర్ణేతల ప్రశంసలు.. ఫ్యాషన్‌ ఫినాలేకు హాజరైన న్యాయ నిర్ణేతలు, ఆహూతులు.. తెలంగాణ సంప్రదాయ డిజైన్లను చూసి ప్రశంసలు కురిపించారు. పోటీదారులంతా స్థానిక చేనేతలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడం ఆ డిజైన్లకు, తయారీదారులకు గుర్తింపును, మార్కెటింగ్‌ అవకాశాలను అందిస్తుందన్నారు. తెలంగాణ చేనేత వ్రస్తాలతో డిజైన్లు చేయడం ఆనందంగా, గర్వంగా ఉందని డిజైనర్‌ అర్చనా కొచ్చార్‌ అన్నారు. దీని ద్వారా చేనేత చీరలకు ప్రపంచ ఖ్యాతి దక్కుతుందని అభిప్రాయపడ్డారు. డిజైనర్‌ డ్రెస్‌ విజేతలు వీరే.. ఈ పోటీల్లో బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌ విజేతలుగా ఒక్కో ఖండం నుంచి ఒకరు చొప్పున నిలిచారు. ఆసియా–ఓషియానియా గ్రూప్‌ నుంచి న్యూజిలాండ్‌ సుందరి సమంతా పూల్, ఆఫ్రికా నుంచి దక్షిణాఫ్రికా ముద్దుగుమ్మ జోలైస్‌ జాన్సెన్‌ వాన్‌ రెన్స్‌బర్గ్, ఆమెరికా–కరీబియన్‌ బృందం నుంచి ప్యూర్టోరికో భామ వలేరియా పెరేజ్, యూరప్‌ నుంచి ఉక్రెయిన్‌ సుందరీమణి మారియా మెలి్నచెంకో విజేతలుగా నిలిచారు. అయితే వారు టాప్‌–40 పరిధిలోకి రారు.

Miss World 2025: Top 10 Best people From Asia3
10 మందికి బెర్తులు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటం కోసం పోటీపడే టాప్‌–40 మందిలో 10 మంది చోటు దక్కించుకున్నారు. వారు ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే టాప్‌–10లో భాగం కానున్నారు. శనివారం నాటికి మొత్తం నాలుగు రకాల చాలెంజ్‌ రౌండ్లు పూర్తయ్యాయి. గ్రాండ్‌ ఫినాలే ముందు మరో రౌండ్‌ మాత్రమే మిగిలి ఉంది. ఒక్కో ఖండం నుంచి ఎంపికయ్యే మొదటి 10 మందిలో ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో స్థానం సంపాదించిన ఈ 10 మందిలో భారత సుందరి నందినీ గుప్తా కూడా ఉండటం విశేషం. మొదటి మూడు చాలెంజ్‌ రౌండ్లలో ఆమెకు నిరాశ ఎదురవగా శనివారం జరిగిన కీలక టాప్‌ మోడల్‌ చాలెంజ్‌లో ఆమె ఆసియా–ఓషియానియా నుంచి విజేతగా నిలిచి టాప్‌–10 గ్రూపులో చేరింది.ఇక చివరగా ఈ నెల 26న హైటెక్స్‌లో బ్యూటీ విత్‌ పర్పస్‌ కార్యక్రమం జరగనుంది. అందులో పోటీదారులు వారి సామాజిక సేవా కార్యక్రమాల గురించి వివరించాల్సి ఉంటుంది. వాటిల్లో ఉత్తమంగా రాణించినవారు టాప్‌–40 (ఖండానికి 10 మంది చొప్పున)లో మిగతా బెర్తులు సాధిస్తారు. వారిలోంచి టాప్‌–20 (ఖండానికి ఐదుగురు చొప్పున), ఆ తర్వాత టాప్‌–8 (ఖండానికి ఇద్దరేసి) ఎంపిక చేస్తారు. ఈ ఎనిమిది మంది ఈ నెల 31న హైటెక్స్‌లో జరిగే గ్రాండ్‌ ఫినాలేలో భాగమవుతారు. వారి నుంచి విజేత, మొదటి రన్నరప్, రెండో రన్నరప్‌ ఎంపికవుతారు. టాప్‌ మోడల్‌ చాలెంజ్‌: విజేతలు: మిస్‌ ఇండియా, మిస్‌ నమీబియా, మిస్‌ మార్టీనిక్, మిస్‌ ఐర్లాండ్‌ శనివారం జరిగిన టాప్‌ మోడల్‌ చాలెంజ్‌ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో తొలుత నాలుగు ఖండాల నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఎనిమిది మందితో షార్ట్‌లిస్ట్‌ తయారు చేశారు. అందులోంచి న్యాయ నిర్ణేతలు ఖండానికి ఒకరు చొప్పున నలుగురిని విజేతలుగా ప్రకటించారు. ఇందులో ఆసియా–ఓషియానియా నుంచి మిస్‌ ఇండియా నందినీ గుప్తా న్యూజిలాండ్‌ భామ నుంచి గట్టి పోటీ ఎదుర్కొని విజేతగా నిలిచింది.ఆఫ్రికా నుంచి నమీబియా సుందరి సెల్మా కమన్య, ఆమెరికా–కరీబియన్‌ నుంచి మిస్‌ మార్టీనిక్‌ అరేలీ జోచిమ్, యూరప్‌ నుంచి ఐర్లాండ్‌ సుందరి జాస్మిన్‌ గెర్హాడ్‌లు విజయం సాధించారు. ఇలా ఇప్పటి వరకు 10 మంది భామలు ఖండానికి 10 మంది చొప్పున మొత్తం 40 మంది ఉండే బృందంలో బెర్తు దక్కించుకున్నారు. గ్రాండ్‌ ఫినాలే నాటికి పోటీల్లో ఉండేందుకు చోటు దక్కించుకున్న 10 మందిలో ముగ్గురు ఆసియా ఖండానికి చెందిన వారున్నారు. మిగిలిన వారిలో యూరప్‌ నుంచి ముగ్గురు, ఆఫ్రికా నుంచి ఇద్దరు, ఆమెరికా–కరీబియన్‌ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆసియా ఖండం నుంచి ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో టాలెంట్‌ చాలెంజ్‌లో ఇండోనేసియా సుందరి, హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌లో తుర్కియే ముద్దుగుమ్మ , శనివారం నందినీ గుప్తా చోటు దక్కించుకున్నారు. ఇంకా ఏడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు వివిధ చాలెంజ్‌లలో విజేతలుగా టాప్‌–40లో చోటుదక్కించుకున్న వారి వివరాలు ఇలా..స్పోర్ట్స్‌ చాలెంజ్‌: విజేత మిస్‌ ఎస్తోనియా ఎలిస్‌ రాండ్‌మా ⇒ ఈ నెల 17న గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరిగింది. 109 మంది పోటీదారులు ఫిట్‌నెస్‌లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించారు. అందులో 32 మందిని షార్ట్‌లిస్ట్‌ చేయగా అందులోంచి మొదటి నాలుగు స్థానాలకు నలుగురిని ఎంపిక చేశారు. వారిలో ఎస్తోనియాకు చెందిన ఎలిస్‌ రాండ్‌మా విజేతగా నిలిచింది. ఖండానికి 10 మంది చొప్పున 40 మందితో కూడిన ప్రధాన పోటీదారుల జాబితాలో ఆమె తొలి స్థానాన్ని దక్కించుకుంది.టాలెంట్‌ చాలెంజ్‌: విజేత మిస్‌ ఇండోనేసియా మొనికా కెజియా ⇒ ఈ నెల 22న శిల్పకళావేదికలో ఈ పోటీలు సాగాయి. పోటీదారులు ఆటాపాట, సంగీతంతో ఉర్రూతలూగించారు. అందులో మొత్తం 24 మందిని ఉత్తమ ప్రతిభావంతులుగా షార్ట్‌లిస్ట్‌ చేశారు. వారిలో నందినీ గుప్తా కూడా ఉన్నారు. ఆ తర్వాత టాప్‌–3లో ఇండోనేసియా, కామెరూన్, ఇటలీ పోటీదారులు నిలవగా చివరకు విజేతగా ఇండోనేసియా భామను ప్రకటించారు.హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌: విజేతలు మిస్‌ వేల్స్, మిస్‌ తుర్కియే, మిస్‌ ట్రినిడాడ్‌–టొబాగో, మిస్‌ జాంబియా ⇒ ఈ నెల 20, 21 తేదీల్లో టీ–హబ్‌లో జరిగింది. ఫైనల్‌ పోటీ శుక్రవారం హోటల్‌ ట్రైడెంట్‌లో నిర్వహించారు. కాంటినెంటల్‌ క్వాలిఫైర్స్, టాప్‌–8 మందిని ఎంపిక చేసి అందులోంచి శుక్రవారం విజేతలను ప్రకటించారు. అందులో ఆసియా నుంచి తుర్కియే భామ ఇదిల్‌ బిల్గెన్, ఆఫ్రికా నుంచి ఫెయిత్‌ బ్వాల్వా, అమెరికా–కరీబియన్‌ దీవుల నుంచి ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోకు చెందిన అన్నా లిసే నాన్టన్, యూరప్‌ నుంచి వేల్స్‌ ముద్దుగుమ్మ విల్లీ మీ ఆడమ్స్‌ ఎంపికయ్యారు. తొలుత టాప్‌–20, ఆ తర్వాత టాప్‌–8 భామలను ఎంపిక చేసి చివరకు విజేతలను ప్రకటించారు.

Miss World 2025 Hyderabad4
హైదరాబాద్‌తో అనుబంధం పెంచుకున్న మిస్‌ వరల్డ్‌ తారలు

గ్లోబల్‌ వేదికగా ఏ రంగంలోనైనా హైదరాబాద్‌ తన ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ఇది ఇప్పుడొచ్చిన గుర్తింపేం కాదు.. నిజాం కాలం నుంచే అంతర్జాతీయ స్థాయిలో భాగ్యనగరం ప్రసిద్ధి చెందింది. ఆనాటి సంస్కృతులు, ఆహారం, విలాస నగరంగానే కాకుండా ఇప్పటి ఐటీ, సినిమా, క్రీడలు తదితర రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోంది. ఈ ఒరవడిలో వీటన్నింటి సమాహారంగానే ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ పోటీలు నగరంలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 109 దేశాలకు చెందిన మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌లు నగరానికి వచి్చన విషయం విధితమే. ఈ ప్రయాణంలో అందాల తారలు నగరానికి ముగ్దులైపోతున్నారు. ఈ మిస్‌ వరల్డ్‌ పోటీల్లో ఒక్కరు మాత్రమే విజేతగా నిలుస్తారు.. కానీ ఈ మిస్‌ల అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకుంది భాగ్యనగరం. ఈ నేపథ్యంలో పలువురు మిస్‌వరల్డ్‌ పోటీదారులు ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు.. బెల్జియం చాక్లెట్లు మావే.. వచి్చనప్పటి నుంచి చూస్తున్నా.. ఎంతో ఆతీ్మయత, ప్రేమ నింపుకున్న మనుషులు మీరంతా..?! నాకు చాలా సంతోషంగా అనిపించింది. అధునాతన జీవన విధానం బాగా నచ్చింది. దీనికి సమానంగా సామాన్య జీవనం కనిపిస్తోంది. మిస్‌ వరల్డ్‌ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని ప్రాంతాలను సందర్శించాను.. ఎంత అందమైన నగరమో. ఇక్కడి బెల్జియం చాక్లెట్లను చూశాను. ఈ బెల్జియం చాక్లెట్లకు మాతృక మా దేశమే. హైదరాబాద్‌లో షాపింగ్‌ చేయడం మరచిపోలేని అనుభూతి. – కారెన్‌ జాన్సెన్, మిస్‌ బెల్జియంఅమ్మా నాన్నలను తీసుకొస్తా.. ఇక్కడ అద్భుతమైన జీవన విధానమే కాదు.. ఎన్నో వింతలు ఉన్నాయి. మిస్‌ వరల్డ్‌ బృందంతో పాటు అవన్నీ సందర్శించాను. ముఖ్యంగా కొన్ని ప్రాంతాలను చూడటానికి మళ్లీ హైదరాబాద్‌ వస్తా. వీటిని చూపించడానికి మా తల్లిదండ్రులను కూడా తీసుకొస్తాను. నా ఫేవరెట్‌ డెస్టినేషన్‌ నగరాల్లో హైదరాబాద్‌ కూడా చేరింది. నగరం చూట్టూ ఉన్న ప్రకృతి కూడా నాకు బాగా నచి్చంది. – ఎమ్మా మోరిసన్, మిస్‌ కెనెడామరో ఇల్లులా అనిపించింది.. భారత దేశం విభిన్న సంస్కృతుల సమ్మేళనం.. అంతెందుకు విదేశాలకు చెందిన కొన్ని సంస్కృతులు సైతం ఇక్కడ తారసపడ్డాయి. ఈ వైవిధ్యాన్ని చూడటానికి భారత్‌ మొత్తం తిరగాల్సిన పనిలేదు. కేవలం హైదరాబాద్‌ వస్తే చాలు. ఇది నేను అనుభవపూర్వకంగా చెబుతున్నా. ఢిల్లీ వెళ్తే ఒకలా, చెన్నై, లద్దాక్‌ వెళితే మరోలా.., ఒక్కో రాష్ట్రంలో ఒక్కో సాంస్కృతి కనిపిస్తుంది. అంతెందుకు కోల్‌కతా (బెంగాల్‌) వెళితే మా బంగ్లాదేశ్‌ మూలాలు కనిపిస్తాయి. ఇవన్నీ హైదరాబాద్‌లో చూశా. ఇది ఒక మినీ ఇండియా. నాకైతే హైదరాబాద్‌ మరో ఇల్లులా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజల ఆత్మీయ ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. నాకు నచి్చన స్పైసీ ఫుడ్‌ లభిస్తుంది. వారసత్వ వంటకాలు బాగున్నాయి. నేను తిన్న కొబ్బరి చట్నీ అయితే సూపర్బ్‌. – అక్లిమా అతికా కొనికా, మిస్‌ బంగ్లాదేశ్‌అమ్మాయిలకు అనువైన నగరం.. ఇక్కడి అమ్మాయిలను చూస్తే సంతోషంగా ఉంది. వారికి అనుకూలమైన వాతావరణం ఉంది. మా దేశం జింబాబ్వే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం.. అంతర్జాతీయంగా ఫ్యాషన్‌ రంగంలో మా కళకు, డిజైనింగ్‌కు ప్రత్యేకత ఉంది. మా డిజైనర్ల డిజైనింగ్‌ ఇక్కడ చూసి సంతోషం అనిపించింది. ఒక మోడల్‌గా గర్వపడుతున్నా. విదేశాల్లోనూ ఆఫ్రికన్ల సంస్కృతి ఇప్పుడు ట్రెడ్‌గా మారుతోంది. మేమంతా వివిధ దేశాల నుంచి వచ్చిన మహిళలుగా మాకు వేర్వేరు నమ్మకాలున్నాయి. కానీ ఇక్కడి సంస్కృతిక సమ్మేళనం, వైవిధ్యం ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇలాంటి సమాంతర వ్యవస్థ ఉండటం అద్భుతం. రంగు, రూపం వంటి అంశాలతో భిన్నంగా ఉన్న స్త్రీలను ఈ వైవిధ్యం విజేతను చేస్తుంది. అవకాశం ఉంటే మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనుంది. –కోర్ట్నీ జాంగ్వే, మిస్‌ జింబాబ్వే మొదటి సారి పానీ పూరీ తిన్నా.. వియత్నాంలో ఉన్నప్పుడు సోషల్‌ మీడియాలో పానీ పూరీ గురించి వీడియోలు చూశాను. ఉన్నత చదువుల కోసం ఆ్రస్టేలియా వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు వీటి గురించి విన్నాను. అయితే హైదరాబాద్‌ వచ్చాకే పానీ పూరీ మొదటి సారి తిన్నా. వీటి రుచిని మాటల్లో చెప్పలేను. మొదట్లో వీటిని సరిగా తినలేకపోయాను. మిస్‌ ఇండియా నందినీ గుప్తా పానీపూరీ ఎలా తినాలో చూపించింది.. అప్పటి నుండి తినడం అలవాటైంది. ప్రస్తుతం హైదరాబాద్‌ అనగానే మొదట పానీపూరీనే గుర్తొస్తుంది. ఇక్కడి ప్రజలు ఆతీ్మయంగా పలుకరిస్తారు. నేను బసచేసే హోటల్‌ సిబ్బంది చూపించే ప్రేమ ఇంటిని మరిపిస్తోంది. చారి్మనార్‌ వీధుల్లో కొన్న వస్తువులు వియాత్నాం తీసుకెళతాను. ఎయిర్‌పోర్ట్‌లోకి రాగానే బొట్టు పెట్టి ఆహ్వానించిన విధానం నాకెంతో నచి్చంది. తెలంగాణ సంస్కృతిలో భాగంగా ప్రదర్శించిన నృత్యాలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. – హూన్‌ త్రాన్‌ నీ, మిస్‌ వియాత్నాం

Wales, Turkey, Trinidad and Tobago, Zambia win Head-to-Head continental titles5
ఇక్కడి సంస్కృతికి ఫిదా అయ్యాం

తెలంగాణలో జరుగుతున్న 72వ మిస్‌ వరల్డ్‌ బ్యూటీ పాజెంట్‌లో భాగంగా ‘హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌’ ఈవెంట్‌ కూడా పూర్తయింది. ఇందులో టర్కీ, వేల్స్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, జాంబియా దేశాలకు చెందిన సుందరీమణులు గెలుపొందారు. వాళ్ల పరిచయాలు..బుద్ధవనం ప్రాజెక్ట్‌ వెరీ వెరీ స్పెషల్‌– ఇడిల్‌ బిల్గెన్, మిస్‌ టర్కీమిస్‌ వరల్డ్‌ పాజెంట్‌లో భాగంగా హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌లో విజేతగా నిలిచింది మిస్‌ టర్కీ ఇడిల్‌ బిల్గెన్‌. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘ఈ రోజు నాకు చాలా స్పెషల్‌. నా దేశానికిప్రాతినిధ్యం వహిస్తున్నందుకు గర్వంగానూ చాలా ఉత్సాహంగానూ ఉన్నాను. ఈ హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌లో ముందంజలో ఉండటం మరింత ఆనందం. మహిళల భద్రత, సాధికారత, విద్య, సాంస్కృతిక గుర్తింపు, మానసిక ఆరోగ్యం, సోషల్‌ మీడియా ప్రభావం, వాతావరణ మార్పుల... ఇలా విభిన్నమైన టాపిక్స్‌తో హెడ్‌ టు హెడ్‌ చాలెంజింగ్‌ రౌండ్‌ గడిచింది. ఎక్కడైనా మహిళల విజయానికి చదువు చాలా ముఖ్యమైనది. ఏ దేశంలోనైనా అభివృద్ధి, సాధికారిత రెండూ కలిసి ప్రయాణించాలి. జనాభాలో సగం మంది వెనకబడి ఉంటే మనం విజయం సాధించలేం. ఇక్కడ మహిళలు వెనుకబడి ఉండకుండా ప్రభుత్వాలు చూసుకుంటున్నాయి. సాంకేతికత, వైద్యపురోగతికి ఈప్రాంతం కేంద్రంగా ఉంది. ప్రజల ఆప్యాయత, ప్రేమ, దయాగుణం, ఇక్కడి సంస్కృతి హైలైట్‌ చేస్తున్నాయి. ఇవే విషయాలను వేదికపై నుంచి వినిపించాను. తెలంగాణలోని టూరిజం నాకు బాగా నచ్చింది. ముఖ్యంగా బుద్ధవనం ప్రాజెక్ట్‌ వెరీ వెరీ స్పెషల్‌. అక్కడ మాంక్స్‌ చదివే మంత్రాలు ఆధ్యాత్మిక భావనలో ముంచెత్తాయి. నేను రేడియేషన్‌ అంకాలజీలో మెడిసిన్‌ చేస్తున్నాను. క్యాన్సర్‌ అవగాహన కార్యక్రమాలలో పాల్గొంటుంటాను. ‘నేనొక వైద్యురాలిని, అంతేకాదు నేను ఒక టర్కిష్‌ మహిళను. మిస్‌ వరల్డ్‌లో టర్కిష్‌ మహిళల గొంతుగా నేను ఉండాలనుకుంటున్నాను’ అని వేదికపై వివరించాను. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ప్రాజెక్ట్‌లో భాగంగా రొమ్ము, గర్భాశయ క్యాన్సర్‌ అవగాహనకు కృషి చేస్తున్నాను. ఒక వైద్యురాలిగా క్యాన్సర్‌ రోగులకు సహాయకారిగా ఉండటం నా బాధ్యత. క్రీడలు అంటే చాలా ఇష్టం. మానసిక ఒత్తిడి నుంచి విశ్రాంతి పొందడానికి క్రీడలు, జిమ్‌ నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అసాధ్యం అనేది మన డిక్షనరీలో ఉండకూడాదు. ఎలాంటి సమస్య వచ్చినా దానిని అధిగమించగలను, సాధించగలను అనే ఆలోచన మనలో ధైర్యాన్ని నింపుతుంది. విజయాలను మన ముందుంచుతుంది’ అంటూ వివరించింది ఇడిల్‌.యువతకు చదువు చాలా ముఖ్యం– మిల్లీ మే ఆడమ్స్, మిస్‌ వేల్స్‌మిస్‌ వరల్డ్‌ పాజెంట్‌లో భాగంగా హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌ టాప్‌ టెన్‌ జాబితా యూరప్‌కుప్రాతినిధ్యం వహిస్తున్న మిస్‌ వేల్స్‌ మిల్లీ మే ఆడమ్స్‌ టాప్‌ టెన్‌ జాబితాలోకి చేరింది. ఈ సందర్భంగా మిల్లీ మాట్లాడుతూ – ‘‘ఈ ఫీలింగ్‌ చాలా గొప్పగా ఉంది. స్వతహాగా పర్యటనలు చేయడం, చారిత్రక ప్రదేశాలు సందర్శించడం అంటే నాకు చాలా ఇష్టం. వీలు చిక్కినప్పుడు గొప్ప గొప్ప కట్టడాలను సందర్శిస్తుంటాను. అందులో భాగంగా గతంలో ఇండియాకు వచ్చినప్పుడు తాజ్‌మహల్‌ని సందర్శించాను. ఇప్పుడు ఈ మిస్‌ వరల్డ్‌ పాజెంట్‌లో భాగంగా హెరిటేజ్‌ టెంపుల్స్, చార్మినార్‌ చాలా బాగా నచ్చాయి. ఇక్కడి శిల్పనిర్మాణం అద్భుతం అనిపిస్తుంది. ట్రిప్స్‌ చాలా ఎంజాయ్‌ చేశాం. ఇక్కడి సంస్కృతితో పాటు మహిళల సాధికారిత గురించి తెలుసుకున్నాను. ప్రభుత్వాలు అందిస్తున్న రక్షణ, సెల్ఫ్‌ హెల్ప్‌ గ్రూప్స్, ఫ్రీ బస్‌ సౌకర్యం గురించి తెలుసుకున్నాం. బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌ రౌండ్‌లో 20 మందితో పోటీపడ్డాను. పోటీలో నా వర్క్స్‌ గురించి, చదువుప్రాముఖ్యత గురించి అడిగారు. నేను వేల్స్‌లో మెడిసిన్‌ చదువుతున్నాను. స్ట్రీట్‌ డాక్టర్స్‌ అనే జాతీయసంస్థతో కలిసి పనిచేయడంతో పాటు, యువతకు చదువు ఎంత అవసరమో వివరిస్తూ, పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పిస్తున్నాను. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం, అందాల పోటీల ద్వారా నిధుల సేకరించి, ప్రపంచవ్యాప్తంగా వెనుకబడిన పిల్లలకు మద్దతుగా నిలుస్తున్నాను. నా విజయానికి ఇవన్నీ ఉపకరించాయి. యువతులు, బాలికలకు తమపై తమకు పూర్తి విశ్వాసం ఉండాలి. అప్పుడు ప్రపంచంలో ఏదైనా సాధించడానికి మనకు సహకారం అందుతుంది. కోరుకున్న జీవితాన్ని గడపటానికి మహిళకు సాధికారతతో పాటు దయ, వినయం కూడా ఉంటే ఎక్కడ ఉన్నా రాణిగా వెలిగిపోతాం’’ అంటూ అందమైన నవ్వుతో సమాధానమిచ్చింది మిస్‌ వేల్స్‌.పెళ్లి తప్పించుకుని మెడిసిన్‌ చదివాఫేత్‌ వాలియా, మిస్‌ జాంబియా‘‘వృత్తిరీత్యా డాక్టర్‌ని. నాకు ఒక తమ్ముడు. మా అమ్మ పాస్టర్‌. నాన్న కార్పెంటర్‌. మేము లుసాకాలో ఉంటాం. నాకు ముందునుంచీ అందాల పోటీలంటే ఇష్టం. నాకు పదిహేనేళ్లున్నప్పుడు మొదటిసారిగా అందాల పోటీల్లో పాల్గొన్నాను. గెలిచాను కూడా! బ్యూటీ అంటే నా దృష్టిలో ఆత్మవిశ్వాసం. మా దగ్గర బాల్య వివాహాలు ఎక్కువ. నన్నూ బాల్య వివాహానికి సిద్ధం చేసింది మా సమాజం. అయితే బాగా చదువుకుని మా దేశంలోని ఆడపిల్లల తలరాతను మార్చాలి అనుకునేదాన్ని. మా ఆర్థిక పరిస్థితి బాలేనందువల్ల నా పదహారవ ఏట నాకు పెళ్లి చేసేయాలనే ఒత్తిడి తెచ్చారు మా కమ్యూనిటీ పెద్దలు. కానీ నేను తలవంచలేదు. ఆ పెళ్లిని తప్పించుకున్నాను. కష్టపడి మెడిసిన్‌ చదివాను. అప్పుడు గనుక నేను ఆ తెగువ చూపించక పోయుంటే ఈ రోజు మీతో ఇలా మాట్లాడే అవకాశం వచ్చేది కాదు. నా ఈ కథను ప్రపంచానికి చెప్పి, ఆడపిల్లలకు మానసిక స్థయిర్యాన్ని, స్ఫూర్తిని పంచడానికి అందాల పోటీలు ఓ వేదికగా కనిపించాయి. మన కథను వినిపించే, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసే అవకాశాన్నిస్తాయి. అందుకే ఎలాగైనా ఈ ప్లాట్‌ఫామ్‌ దాకా రావాలనుకున్నాను. వచ్చాను.వాయిస్‌ ఆఫ్‌ ఫెయిత్‌ జీవితంలో గెలవడానికి ఉపయోగపడేవి చదువు, నైపుణ్యం మాత్రమే. నా బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ కూడా అదే! ‘వాయిస్‌ ఆఫ్‌ ఫేత్‌’ అనే ఫౌండేషన్‌ ద్వారా అట్టడుగు వర్గాల పిల్లలకు చదువుప్రాధాన్యాన్ని తెలియజెబుతున్నాను. సేంద్రియ సాగు విధానాలను నేర్పి.. వాళ్ల సుస్థిర ప్రగతికి పాటుపడే ప్రయత్నం చేస్తున్నాను. సాంకేతిక రంగంలో వాళ్లు నైపుణ్యం సాధించేలా శిక్షణనిప్పిస్తున్నాను. ఈ పనులన్నీ ఎలా చేస్తున్నానో ‘హెడ్‌ టు హెడ్‌ చాలెంజ్‌ (బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌)’ రౌండ్‌లో ప్రెజెంట్‌ చేశాను. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, సాంకేతిక రంగాల్లో తెలంగాణ ప్రపంచంతో పోటీ పడుతున్నట్టుంది. అధిక జనాభా, తక్కువ భూభాగం లాంటి సవాళ్లతో కూడా ఇండియా సాధించిన ఈ ప్రగతి చూస్తుంటే ముచ్చటేస్తోంది. ప్రజల అవసరాల పట్ల ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి ప్రశంసనీయం. తెలంగాణ సంస్కృతికి, ఆతిథ్యానికీ నేను ఫిదా అయ్యాను. మా దేశం కూడా ఈ స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మిస్‌ జాంబియా ఫేత్‌ వాలియా.తెలంగాణ మినీ ఇండియా– అనా లీజ్‌ నాన్సాన్, మిస్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో‘‘మాది పెద్ద కుటుంబం. మేము మొత్తం ఎనిమిది మంది పిల్లలం. అందరిలోకి నేనే పెద్ద. అందుకే అన్ని విషయాల్లో నా తోబుట్టువులకు నేనో మార్గదర్శిగా ఉండాలని కోరుకునేదాన్ని! మా నాన్న ఇంజినీర్, అమ్మ గృహిణి. చదువు విషయంలో నాకు మా నాన్నే స్ఫూర్తి. ఇంగ్లండ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ చదివాను. ఇప్పుడు మాస్టర్స్‌ చేయాలనుకుంటున్నాను. పర్యావరణహిత నిర్మాణాలు నా లక్ష్యం. నేను అథ్లెట్‌ కూడా! ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ని. బ్యూటీ పాజెంట్‌లో పాల్గొనడానికి నాకు ప్రేరణ.. ఇందులోని ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’ సెగ్మెంట్‌. ఇందులో నేను నమ్మే సుస్థిర అభివృద్ధి, హ్యాపీ లివింగ్‌ వంటివాటి గురించే చెప్పే అవకాశం దొరుకుతుందని అనుకున్నాను. నా బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌ కూడా అదే! ‘ద రిపుల్‌ ఎఫెక్ట్‌’ అనే సంస్థను స్థాపించాను. స్పోర్ట్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా సస్టెయినబుల్‌ కమ్యూనిటీస్‌ని ఏర్పాటు చేయడమే దీని లక్ష్యం. ముఖ్యంగా నిస్సహాయ మహిళల సాధికారత, పిల్లల చదువు కోసం పనిచేస్తున్నాను. మా దేశానికి వలసలు ఎక్కువ. ఆ పిల్లలకు స్థానిక భాషలు, ఇంగ్లిష్‌ వంటివి రాక చదువుకు దూరమవుతున్నారు. అందుకే ట్రినిడాడ్‌లోని ‘విస్‌డమ్‌ సియోరామ్‌’ అనే ఓ టెక్నాలజీ కంపెనీ సహాయంతో ఆ పిల్లలకు పలు భాషలు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. నేను అథ్లెట్‌ని కూడా కాబట్టి స్పోర్ట్స్‌ మీదా ఫోకస్‌ చేస్తున్నాను. ఆటలతో శారీరక దృఢత్వమే కాదు ఎమోషనల్‌ బ్యాలెన్స్‌ కూడా అలవడుతుంది. అందుకే పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించే ప్రయత్నమూ చేస్తున్నాను. ముఖ్యంగా స్విమ్మింగ్‌లో. ఎందుకంటే అది లైఫ్‌ స్కిల్‌ కాబట్టి. స్థానిక వనరులతో గ్రీన్‌ బిల్డింగ్‌ టెక్నిక్స్‌ని చెప్పే పాడ్‌కాస్ట్‌ చానెల్‌నూ స్టార్ట్‌ చేశాను. ఇందులో ఇంజినీర్స్, ఆర్కిటెక్ట్స్, పర్యావరణవేత్తలను ఇంటర్వ్యూ చేస్తుంటాను. అంతేకాదు మొక్కలు నాటే కార్యక్రమాలూ నిర్వహిస్తుంటాను. ఇవన్నీ నా బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌లో భాగాలే!కలర్‌ఫుల్‌గా.. ఇండియా గురించి విన్నాను. కానీ తెలంగాణ స్టేట్‌ గురించి ఎప్పుడూ వినలేదు. తెలంగాణ మినీ ఇండియాలా అనిపించింది. మాలాగే ఇక్కడా భిన్న మతాలు, భిన్న సంస్కృతీసంప్రదాయాలు కనిపించాయి. చాలా కలర్‌ఫుల్‌గా ఉంది. ఇక్కడి ఫుడ్‌ స్పైసీగా ఉన్నప్పటికీ చాలా బాగుంది. సో డిలీషియస్‌. మళ్లీ మళ్లీ ఇక్కడికి రావాలనిపించేలా ఉంది తెలంగాణ ఆతిథ్యం! చాలా హ్యాపీ!’’ అన్నారు అనా లీజ్‌ నాన్సాన్‌ఇంట‌ర్వ్యూలు: నిర్మలారెడ్డి, సరస్వతి రమ

Miss World 2025: contestants visit Victoria Memorial home in Hyderabad6
మిస్‌ వరల్డ్‌ 2025: అందమొక్కటే కాదు..అందమైన మనసు కూడా..

మిస్‌ వరల్డ్‌ అంటే అందమొక్కటే కాదు, అందమైన మసను కూడా..!! మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరూ ఏదో ఒక సామాజిక సేవ అంశాన్ని, లక్ష్యాన్ని కొనసాగిస్తున్న వారే. ఇందులో భాగంగానే నగరంలోని సరూర్‌ నగర్‌ విక్టోరియా హోమ్‌లోని సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ను సందర్శించి అక్కడి విద్యార్థుల లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని చేరుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. ప్రతిష్టాత్మక మిస్‌ వరల్డ్‌ 2025 పోటీదారులు విక్టోరియా హోమ్‌ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ విద్యార్థులతో గురువారం ముచ్చటించారు. మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొంటున్న 107 మంది పోటీదారులతో పాటు మాజీ మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా కలసి విక్టోరియా హోమ్‌ను సందర్శించి ప్రభుత్వ హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. కష్టపడే తత్వం, విజ్ఞాన సముపార్జనతో పాటు విద్యలో రాణిస్తేనే భవిష్యత్తు బాగుంటుందని చిన్నారులకు వివరించారు. ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే పటిష్టమైన కలలు ఉంటేనే తమ లక్ష్యాలను చేరుకుంటారని అన్నారు. అనంతరం విక్టోరియా హోమ్‌ విద్యార్థినులకు బహుమతులతో పాటు వారికి నిత్య జీవితంలో ఉపయోగపడే వస్తువులను మిస్‌ వరల్డ్‌ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా విక్టోరియా హోమ్‌ విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను అలకించి అభినందించారు. అందాల తారలు.. ముచ్చటపడి ఆ చిన్నారులతో కలిసి ఆడారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ ల్యాబ్‌ను వారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మిస్‌ వరల్డ్‌ చైర్మన్‌ మోర్లే, పర్యాటక శాఖ డైరెక్టర్‌ హనుమంతు, రాచకొండ సీపీ, ఎస్సీ వెల్ఫేర్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ ఉమాదేవి శ్రీనివాస్‌ రెడ్డి, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌లతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: రానూ.. బొంబైకి రానూ.. విభిన్న కళలతో అలరించిన సుందరీమణులు)

Miss World 2025: Interesting Facts About Miss World 1997 Winner Diana Hayden7
మిస్‌ వరల్డ్‌ కధలు: సిఎంతో సారీ చెప్పించుకున్న హైదరాబాద్‌ బ్యూటీ...

ఐశ్వర్యారాయ్‌ తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని 3వసారి దేశానికి అందించిన ఘనత డయానా హేడెన్‌(Diana Hayden) దక్కించుకుంది. 1997 మిస్‌ వరల్డ్‌ పోటీ విజేత మెయిన్‌ టైటిల్‌తో పాటు మూడు సబ్‌–టైటిళ్లను కూడా గెలుచుకుని అలా గెలిచిన ఏకైక మిస్‌ వరల్డ్‌గా నిలిచింది. జన్మతః హైదరాబాద్‌ నగరంలోని ఆంగ్లో–ఇండియన్‌ కుటుంబంలో జన్మించిన డయానా హేడెన్‌... సికింద్రాబాద్‌లోని సెయింట్‌ ఆన్స్‌ హైస్కూల్‌లో తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది ఆమె పాఠశాల విద్యార్ధినిగా ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు దాంతో ఆమె 13 సంవత్సరాల వయస్సులోనే తన భృతి కోసం పనిచేయడం ప్రారంభించాల్సి వచ్చింది.మిస్‌ వరల్డ్‌గా గెలిచిన ఏడాది తర్వాత, హేడెన్‌ లండన్‌ కు వెళ్లి రాయల్‌ అకాడమీ ఆఫ్‌ డ్రామాటిక్‌ ఆర్ట్‌ లో నటనను అభ్యసించింది. అక్కడ ఆమె షేక్స్పియర్ రచనలపై దృష్టి సారించి ఉత్తమ నటి నామినేషన్‌ పొందింది. ఆమె దక్షిణాఫ్రికాలో షేక్స్పియర్ ఒథెల్లో చలనచిత్రంతో 2001 లో, తెరపైకి అడుగుపెట్టింది. ఇండియన్‌ టీవీ షో బిగ్‌ బాస్‌ రెండవ సీజన్‌ లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పొంది 13 వ వారంలో ఓటింగ్‌ ద్వారా ఎలిమినేట్‌ అయింది. మిస్‌ వరల్డ్‌ గెలిచినప్పటికీ సినిమా టీవీ రంగాల్లో ఆమె పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయింది. తెహ్‌ జీబ్, అబ్‌ బస్, లోన్‌ ఎ లవింగ్‌ డాల్‌...తదితర చిత్రాల్లో నటించినా ఆమె కేవలం ఒక సాదా సీదా నటిగానే మిగిలిపోయింది.ఐశ్వర్యారాయ్, సుష్మితాసేన్‌ల తరహాలో కాకుండా బ్రౌన్‌ స్కిన్‌తో కొంత విలక్షణమైన అందంతో టైటిల్‌ గెల్చుకున్న డయానా హేడెన్‌ తన రూపం పట్ల కొందరు చేసిన పరుషమైన కామెంట్స్‌కు గురి కావాల్సి వచ్చింది. అలాంటివాటిలో ముఖ్యంగా ఆనాటి త్రిపుర సిఎం విప్లవ్‌కుమార్‌ దేవ్‌ ఆమె రూపాన్ని హేళన చేయడం ప్రస్తావనార్హం. అసలు మిస్‌ వరల్డ్‌ టైటిల్‌ గెలిచే సత్తా ఉన్న అందం ఆమెకు లేనేలేదని, ఐశ్వర్య గెలిచిందంటే ఓ అర్ధం ఉందని అంటూ ఆయన ఆమె రూపాన్ని ఎద్దేవా చేయడం సంచలనం సృష్టించింది. మనకు లక్ష్మి, సరస్వతి వంటి అందమైన దేవతలు ఉన్నారని డయానా లు కాదని అంటూ ఆయన తీవ్రమైన వ్యంగ్యోక్తులతో ఆమెను కించపరిచారు. ఈ మాటలు తీవ్ర వివాదంగా మారడంతో ఆయన డయానాను క్షమాపణలు కోరారు.

Head-to-Head challenge at Miss World 2025 crowns four purpose driven winners8
హెడ్‌ టు హెడ్‌లో విజేతలు వీరే

సాక్షి, హైదరాబాద్‌: మిస్‌ వరల్డ్‌ పోటీల్లో కీలకమైన హెడ్‌–టు–హెడ్‌ ఛాలెంజ్‌ ఫైనల్‌ హైదరాబాద్‌లోని ట్రైడెంట్‌ హోటల్‌లో పోటాపోటీగా జరిగింది. యూరప్, ఆఫ్రికా, ఆసియా అండ్‌ ఓషియానియా, అమెరికా అండ్‌ కరేబియన్‌ నుంచి ఐదుగురు చొప్పున మొత్తం ఇరవై మంది పోటీదారులు సామాజిక అంశాలపై తమ అభిప్రాయాలను, తాము చేస్తున్న కార్యక్రమాలను తమదైన శైలిలో జడ్జిలకు వివరించారు. జడ్జిలు తమకు వేసిన ప్రశ్నలకు వారు జవాబిచ్చారు. వాటి ఆధారంగా నాలుగు ఖండాల నుంచి నాలుగు దేశాలకు చెందిన సుందరీమణులను హెడ్‌–టు–హెడ్‌ విజేతలుగా ఎంపిక చేశారు. అమెరికా–కరేబియన్‌ నుంచి మిస్‌ ట్రినిడాడ్‌ హెడ్‌–టు–హెడ్‌ ఛాలెంజ్‌ ఫైనల్లో భాగంగా అమెరికా–కరేబియన్‌ ఖండంలోని బ్రెజిల్, సురినామ్, కేమెన్‌ ఐలాండ్స్, గయానా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో నుంచి వచ్చిన పోటీదారులకు ‘తెలంగాణలో మహిళా సాధికారత – భద్రత’ పై ప్రపంచానికి మీరు ఏ సందేశాన్ని ఇస్తారనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపులో ఉత్తమ జవాబు ఇచ్చిన మిస్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో తుది రౌండ్‌కు ఎంపికయ్యింది. ప్రగతి, సాధికారత ఒకటే. భారత్‌ ముఖ్యంగా హైదరాబాద్‌ ఈ దిశగా చేయడుతున్న చర్యలు అభినందనీయం. సగం జనాభా వెనుకబడి ఉంటే విజయం సాధించలేమనే ఉద్దేశంతో మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న తెలంగాణ స్ఫూర్తిదాయకం..’ అంటూ సమాధానం ఇచ్చింది. ఆఫ్రికా నుంచి మిస్‌ జాంబియా ఆఫ్రికా ఖండానికి సంబంధించి దక్షిణాఫ్రికా, నమీబియా, సోమాలియా, ఉగాండా, జాంబియా పోటీదారులకు..‘సోషల్‌ మీడియా జీవితంలోని అనేక అంశాలను, ముఖ్యంగా యువతను ప్రభావితం చేస్తోంది. ఈ విషయంలో మీరు ఎలా ప్రామాణికంగా ఉంటారు’అనే ప్రశ్న వేశారు. ఈ గ్రూపు నుంచి తుది పోరుకు ఎంపికైన మిస్‌ జాంబియా మాట్లాడుతూ‘ప్రపంచం మారవచ్చు, కానీ మీరు మారాల్సిన అవసరం లేదు. మీరలాగే ఉండండి. ప్రపంచం దాన్ని స్వీకరించనివ్వండి. సమాజం పరిణామం చెందవచ్చు, కానీ మన నిజ స్వభావాన్ని కోల్పోకూడదు’ అని చెప్పారు. యూరప్‌ నుంచి మిస్‌ వేల్స్‌.. యూరప్‌ గ్రూప్‌లో స్పెయిన్, వేల్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్‌ దేశాల సుందరీమణులు పాల్గొనగా..‘మీ దేశంలో యువ జీవితాలను మెరుగుపరచడానికి మీరు ఒక మార్పును అమలు చేయగలిగితే అది ఏమిటి? అదే ఎందుకు?’ అనే ప్రశ్న వేయగా.. ఈ బృందంలో ఎంపికైన మిస్‌ వేల్స్‌.. ‘ఆరోగ్య సంరక్షణ, విద్య ప్రధానం. మా కుటుంబంలో విశ్వవిద్యాలయానికి వెళ్లిన మొదటి వ్యక్తిని నేనే. ఉగాండా, భారతదేశంలో వైద్య సేవలు, ముఖ్యంగా యాసిడ్‌ దాడి బాధితుల కథలు, నా లక్ష్యానికి స్ఫూర్తినిచ్చాయి. విద్య అత్యంత శక్తివంతమైన సాధనం..’ అని చెప్పడం ద్వారా విజేతగా నిలిచారు. ఆసియా నుంచి మిస్‌ టర్కీ ఇక ఆసియా అండ్‌ ఓషియానియా నుంచి శ్రీలంక, థాయిలాండ్, టర్కీ, లెబనాన్, జపాన్‌ కంటెస్టెంట్‌లకు.. ‘బ్యూటీ విత్‌ ఎ పర్పస్‌’ ప్రాజెక్ట్‌తో పనిచేయడం మీ దృక్పథాన్ని ఎలా మార్చింది?’ అనే ప్రశ్న జడ్జిలు వేశారు. ఈ గ్రూపులో విజేత మిస్‌ టర్కీ.. ‘నేటి ప్రపంచంలో సాంస్కృతిక వారసత్వం అత్యంత ముఖ్యమైనది. కాన్సులేట్లు, రాయబార కార్యాలయాలు నిర్వహించే అంతర్జాతీయ ఈవెంట్‌ ద్వారా సంగీతం, కళలు, వంటకాలు, సంప్రదాయాలతో మనం సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడటమే కాకుండా, ఐక్యతను పెంపొందించుకోగలం. సాంస్కృతిక తేడాలు అడ్డంకులు కావు.. వంతెనలు..’ అని చెప్పారు.మీరు తెలంగాణను ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు? తుది పోరుకు ఎంపికైన మిస్‌ టర్కీ, వేల్స్, జాంబియా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగోలకు జడ్జిలు చివరగా ఒక ప్రశ్న వేశారు. ‘భారతదేశంలోని అతి చిన్న రా ష్ట్రమైన తెలంగాణను సంస్కృతి, వారసత్వం, ఆవిష్కరణల పరంగా ప్రపంచానికి ఎలా పరిచయం చేస్తారు?’ అని అడగ్గా.. నలుగురూ జవాబిచ్చారు. ఆవిష్కరణల కేంద్రం తెలంగాణ సాంకేతిక, వైద్య ఆవిష్కరణల కేంద్రం. ఇది ప్రగతిశీల, శక్తివంతమైన రాష్ట్రం, మహిళల హ క్కులు, భద్రత, విద్యకు ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ ప్రపంచానికి ‘సాధికారత, ఆవిష్కరణ, లింగ సమానత్వంతో శక్తివంతమైన సందేశాన్ని పంపుతుంది. – మిస్‌ టర్కీనా దేశాన్ని ఆహ్వానిస్తా తెలంగాణ గురించి చెప్పడమే కాదు.. ఈ రాష్ట్ర గొప్ప సంస్కృతిని ప్రత్యక్షంగా అనుభవించడానికి నా దేశాన్ని ఆహ్వానిస్తాను. – మిస్‌ వేల్స్‌ కళలు, సంస్కృతితో మమేకం తెలంగాణ ప్రజలు కళలు, సంస్కృతితో మమేకమైన వారు. నాకు వారి ప్రామాణికతను ప్రతిబింబించే అనేక బహుమతులు లభించాయి. మిస్‌ వరల్డ్‌ నినాదం ‘బ్యూటీ విత్‌ ఎ పర్ప స్‌’ కాగా.. తెలంగాణ ఆ స్ఫూర్తిని పూర్తి స్థాయిలో కలిగి ఉంది. – మిస్‌ జాంబియాదయ, సంస్కృతి నిండిన ప్రజలునా దేశం లార్డ్‌ అఫ్‌ ది సన్‌ దేశంగా ప్రసిద్ధి చెందింది. తెలంగాణ సన్‌ అఫ్‌ ది లార్డ్‌. ఇక్కడ ప్రజలు దయ, సంస్కృతితో నిండి ఉన్నారు. – మిస్‌ ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో

Advertisement