breaking news
voter list
-
అఫిడవిట్ ఇస్తారా... క్షమాపణలు చెప్తారా?
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పలు లోక్సభ నియోజకవర్గాల్లో లక్షలాది ఓట్లను తొలగించి పరోక్షంగా ఓటుహక్కును అపహరించారన్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపణలను ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్కుమార్ తీవ్రంగా ఖండించారు. ‘‘ఆయన ఆరోపణల మేరకు ఓటు చోరీపై ఏడు రోజుల్లో సమగ్ర అఫిడవిట్ సమరి్పంచాలి. లేని పక్షంలో దేశప్రజలకు తక్షణం క్షమాపణ చెప్పాలి’’ అని ఆదివారం ప్రెస్ మీట్లో డిమాండ్ చేశారు. ‘‘ఓటు చోరీ ఆరోపణలు చేస్తున్న వారికి ఏడు రోజుల గడువిస్తున్నా. వారి ఆరోపణలపై ఆలోపు ప్రమాణపత్రం సమరి్పంచాలి. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పడం మినహా మరో దారి లేదు. ఎలాంటి రుజువులూ లేకుండా మీరు చేస్తున్న ఈ ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలు. అబద్ధాలతో కొన్ని పార్టీలు ఈసీ భుజాల మీదుగా ఓటర్లకు తుపాకీ గురి పెడుతున్నాయి. ’’ అన్నారు. పారదర్శకంగా ఎస్ఐఆర్ బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ చేపట్టిన ఓటు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అత్యంత పారదర్శకంగా సాగుతోందని సీఈసీ చెప్పారు. ‘‘దీనిపై కొన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయి. శాశ్వత స్థిరనివాసంలో ఒకటి, వేరే ప్రాంతానికి వలస వెళ్లడం వల్ల మరోటి... ఇలా కొందరికి రెండు ఓటర్ గుర్తింపు కార్డులు ఉండొచ్చు. ఇలాంటి తప్పిదాలను సరిచేసేందుకు పోలింగ్ యంత్రాంగం కృషిచేస్తోంది. ప్రతి ఎన్నికకు ముందూ ఓటరు జాబితాలో తప్పులు దిద్దడం ఈసీ విధి. సవరణపై సలహాలిచ్చేందుకు ఈసీ తలుపులు అందరికీ తెరచే ఉంటాయి’’ అని సీఈసీ అన్నారు. ‘‘అధికార, విపక్షాలనే తేడా లేకుండా అందరినీ ఈసీ ఒకేలా పరిగణిస్తుంది. విపక్ష పార్టీలపై ఎలాంటి వివక్షా ఉండదు. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, ఆరోపణలు, ఫిర్యాదులు సెప్టెంబర్ 1 లోపే చేసేయండి. తర్వాత స్వీకరించబోం’’ అన్నారు.వాళ్ల ఇంటి నంబర్ సున్నాయే ‘‘దొంగ, నకిలీ ఓట్లను చేర్చి వాటి చిరునామాలో ఇంటి నంబర్ను సున్నాగా పేర్కొన్నట్టు రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు. ఇల్లు లేని, వంతెనలు, ఫుట్పాత్లు, వీధి దీపాలు, అనధికార కాలనీల్లో నివసించే వారికి నిర్దిష్టమైన చిరునామా, నంబర్ ఉండవు. అందుకే ఆ కాలమ్ను ఖాళీగా వదిలేయకుండా ఇంటి నంబర్ను ‘సున్నా’గా పేర్కొంటాం. ఓటేసేందుకు చిరునామా ముఖ్యంకాదు. ఓటరు ఏ బూత్లో ఓటేస్తాడనేదే ముఖ్యం’’ అన్నారు. ‘‘వేర్వేరు బూత్ల్లో ఒకే వ్యక్తి పేర్లు నమోదైనట్లు ఆరోపణలే తప్ప ఆ మేరకు ఇప్పటిదాకా ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు. గత ఆరు నెలల్లో బిహార్లో 22 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇవన్నీ గత 20 ఏళ్లలో సంభవించినవి. ఎస్ఐఆర్ వల్లే ఈ గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. మెషీన్ రీడబుల్ ఓటర్ జాబితా ఫార్మాట్ను పార్టీలకు ఇచ్చే ప్రసక్తే లేదు. అలా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ ఫార్మాట్లో డేటా బయటికొస్తే ఓటర్ల గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముంది’’ అని చెప్పారు. -
పారదర్శకతకు ‘సుప్రీం’ పట్టం
ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ప్రత్యామ్నాయం ఏమీ ఉండదని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)కి సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతోనైనా అర్థమై ఉండాలి. బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఆ సంఘం ఆదరా బాదరాగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) పేరిట ఓటర్ల జాబితా సవరణ మొదలెట్టింది. ఎందరు ఎన్ని అభ్యంతరాలు చెబుతున్నా బేఖాతరు చేసింది. అసలు ఈ సవరణ తీరే వేరు. ఇంటింటికీ వెళ్లి కొత్త ఓటర్లను నమోదు చేసుకోవటం, జాబితాలో అప్పటికే ఉన్నవారిని సరిపోల్చుకోవటం, చిరునామాలో లేనివారిని తొలగించటం సాగిపోయేది. కానీ ఇప్పుడు ఆఖరుసారి ఓటర్ల జాబితా పూర్తి స్థాయి సవరణ జరిగిన 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారిని ఈసీ సంశయ ఓటర్లుగా పరిగణిస్తోంది. వారినుంచి రకరకాల ధ్రువపత్రాలు అడుగుతోంది. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా ముందుగా దేశ పౌరులమని నిరూపించుకోవాలి. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రా లతోపాటు తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఆధార్, గతంలో ఈసీయే జారీచేసిన ఓటరు గుర్తింపు కార్డు కూడా పనికిరాదట. పనికొచ్చే పత్రాల్లో పాస్పోర్టు ఉంది. కానీ ఆ పాస్పోర్టు సాధించటానికి పౌరులు ఆధార్ కార్డే చూపుతారని ఈసీ మరిచింది. ఒకపక్కఆందోళనలు సాగుతుండగానే సాగిన ఈ ‘సర్’ ప్రక్రియ తర్వాత ప్రకటించిన ఓటర్ల జాబితా ముసాయిదాలో ఏకంగా 65 లక్షలమంది పేర్లు గల్లంతయ్యాయి. 22 లక్షలమంది మరణించారని తేలిందని, రెండు చోట్ల ఓటుహక్కున్నవారు 7 లక్షల మంది కాగా, వలసపోవటం వల్లనో, ఇతర కారణాల వల్లనో 35 లక్షలమంది జాడలేదని అంటున్నది. అలాంటివారి పేర్లు తొలగించామని చెబుతోంది. నోటీసులిచ్చి, వాదనలు విని తొలగించామంటోంది. నిరుడు జూలై నుంచి డిసెంబర్ వరకూ ఓటర్ల జాబితాలను సరిచూసి, అవసరమైన సవరణలు చేసి ఈ ఏడాది జనవరిలో ఈసీ తుది జాబితా ప్రకటించింది. అందులో 7.90 కోట్లమంది ఓటర్లుండగా, తాజా ముసా యిదాలో 7.24 కోట్లమంది పేర్లున్నాయి. ఈ ఆర్నెల్లలో 22 లక్షల మరణాలు, మరో 35 లక్షల మంది వలసలు లేదా ఆచూకీ లేకపోవటం మాయాజాలం అనిపించటం లేదా? పైగా ఈసారి కేవలం నెల్లాళ్ల వ్యవధిలో... అంటే జూన్ 24న మొదలై జూలై 25 వరకే ఈ ప్రక్రియ సాగింది. ఇంత తక్కువ వ్యవధిలో ఇన్ని కోట్లమంది అర్హతల్ని తేల్చిపారేయటం ఎలా సాధ్యమైందన్న సంశయాలు చాలామందికొచ్చాయి. ఈ విషయంలో నిందలు పడుతున్నా ఈసీ గంభీర వదనంతో ‘మీ దగ్గర ఆధారాలున్నాయా?’ అని ఎదురు ప్రశ్నించటం మరిన్ని సంశయాలకు దారి తీసింది. ఇది ఈసీకీ, ఆరోపణలు చేస్తున్న నేతలకూ మధ్య పంచాయతీ కాదు. ఆ ఆరోపణలు అవాస్తమని రుజువు చేస్తే ఈసీ విశ్వసనీయతే పెరుగుతుంది. లేనట్టయితే విపక్షాలు చేసే ‘ఓట్ చోరీ’ ఆరోపణను జనం నమ్ముతారు. సుప్రీంకోర్టు గురువారం చెప్పింది కూడా ఇదే! తొలగించినవారి పేర్ల ఎదురుగా కారణమేమిటో పేర్కొంటూ జాబితా విడుదల చేయాలనీ, పేరు లేదా ఓటర్ క్రమ సంఖ్య టైప్ చేయగానే వివరాలు కనబడేలా ఆ జాబితా ఉండాలనీ ధర్మాసనం ఆదే శించింది. నిజానికి ‘ఓట్ చోరీ’ ఆరోపణ రాకముందు అలాంటి సదుపాయం ఉంది. అటు తర్వాత మాయమైందంటే ఏమనుకోవాలి? ఈ వివరాలతో పార్టీలకు జాబితా అందించామన్న ఈసీ వాదనలో పస లేదు. ఓటుహక్కు కోల్పోయినవారు కారణం తెలుసుకోవటానికి పార్టీల చుట్టూ తిరగాలా? జాబితా వెల్లడైతే ఓటర్ల గోప్యత హక్కుకు విఘాతం కలుగుతుందన్న సాకు అర్థరహితం. చనిపోయినవారి, ఆచూకీ లేనివారి హక్కులకై ఈసీకి ఎందుకంత తాపత్రయం?‘సర్’ వల్ల ఎలాంటి పర్యవసానాలుంటాయో ఆ సంస్థకు అర్థమైనట్టు లేదు. బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో ఒక మీడియా సంస్థ తాజా ముసాయిదా ఆధారంగా విశ్లేషించగా దిగ్భ్రాంతి కరమైన అంశాలు వెల్లడయ్యాయి. 2024 లోక్సభ ఎన్నికల్లో 24 చోట్ల నెగ్గినవారి మెజారిటీ కన్నా ఇప్పుడు తొలగించిన ఓటర్ల సంఖ్య అధికం! ఉదాహరణకు బెగుసరాయ్లో విజేత మెజారిటీ 81,480. కానీ అక్కడ తొలగించిన ఓటర్లు 1,23,178 మంది. షోహర్ స్థానంలో తొలగించిన వారు 1,09,723 అయితే, ఆ ఎన్నికల్లో విజేత మెజారిటీ 29,143! ఏ ఎన్నికల్లోనైనా అధిక ధరలు, నిరుద్యోగం వంటివి చర్చకొస్తాయి. ఈసీ నిర్వాకంతో రాగల బిహార్ ఎన్నికల్లో ఓటర్ల జాబితా తిరకాసే ప్రధాన అంశం కాబోతోంది. ఇది ఎన్డీయే కూటమికి మంచి పరిణామమైతే కాదు.ఓటర్ల జాబితాలో పేరు తొలగించటమంటే పోటీ చేయటానికిగల హక్కును నిరాకరించటం కూడా. ఇది బిహార్తో ఆగదు. ఎన్నికలు జరగనున్న కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళ నాడులకు కూడా విస్తరిస్తుంది. ఇంత అస్తవ్యస్తంగా, ఇంత గోప్యంగా ఉండే ప్రక్రియ ద్వారా ఇంతకూ ఈసీ సాధించదల్చుకున్నదేమిటి? -
‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’
న్యూఢిల్లీ: ఓట్ల చోరీపై విపక్ష కాంగ్రెస్ పార్టీ తమ పోరాటం ఉధృతం చేస్తోంది. పోలింగ్ బూత్లో ఒకరి బదులు ఇంకొకరు ఓటు ఎలా వేస్తున్నారో వివరిస్తూ ఒక వీడియోను పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ‘మీ ఓటు చోరీ, మీ అధికారం చోరీ, మీ గుర్తింపు చోరీ’ అనే శీర్షికతో సోషల్ మీడియాలో చేశారు. ఓటర్ల జాబితాలో గోల్మాల్పై ప్రజలంతా గొంతు విప్పాలని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. రాజ్యాంగబద్ధ సంస్థలను బీజేపీ కబంధ హస్తాల నుంచి కాపాడుకోవాలని చెప్పారు. వీడియోలో ఏముంది?కాంగ్రెస్ విడుదల చేసిన వీడియోలో ఆసక్తిక రమైన సన్నివేశం కనిపిస్తోంది. ఇందులో ఓ కుటుంబం ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్తుంది. ఇద్దరు వ్యక్తులు ఆ కుటుంబానికి తారసపడతారు. మీ ఓట్లు మేమే వేశాం, ఇక మీరు వెళ్లిపోవచ్చు అని చెప్తారు. దొంగ ఓట్లు వేసిన ఆ ఇద్దరు వ్యక్తులు పోలింగ్ కేంద్రంలోని ఎన్నికల అధికారికి బొటన వేలు పైకెత్తి విజయం చిహ్నం చూపిస్తారు. ఆ అధికారి టేబుల్పై ‘ఎలక్షన్ చోరీ ఆయోగ్’ అనే నేమ్బోర్డు ప్రత్యక్షం అవుతుంది. నేడు దేశవ్యాప్తంగా ర్యాలీలు: ఓట్ల చోరీపై దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో గురువారం భారీ ర్యాలీలు నిర్వహించేందుకు కాంగ్రెస్ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. -
సమగ్ర సవరణ సబబే
న్యూఢిల్లీ: విపక్ష పార్టీల విమర్శలు, అత్యంత అభ్యంతరాలతో వివాదాస్పదంగా మారిన బిహార్లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–సర్)) సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలుచేసింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఓటరు జాబితాలో మార్పు లు, చేర్పులు, సవరణలు చేపట్టడం సరైన ప్రక్రియేనని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జో య్మాల్య బాగ్చీల సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఓటర్ల జాబితా ఎప్పు డూ స్థిర సంఖ్యతో కొనసాగడం సహే తుకం అనిపించుకోదు. కాలానుగుణంగా అందులో సవరణలు తప్పనిసరి. గతంలో ఓటరుగా నిరూపించుకోవడానికి ఏడు రకాల ధ్రువీక రణ పత్రాలను ఈసీ అనుమతించేది. ఇప్పు డు ఏకంగా 11 రకాల ధ్రువీకరణ పత్రా లను అనుమతిస్తున్నారు. గతంతో పోలిస్తే ఎక్కువ ధ్రువపత్రాలను అనుమతించడం చూస్తుంటే ఈ ప్రక్రియ మరింతగా ఓటరుకు అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఓటర్లను జాబితా నుంచి తప్పించేలా ఇది కనిపించట్లేదు’’ అని ధర్మాసనం అభిప్రాయ పడింది. ఎస్ఐఆర్ తప్పులతడకగా ఉందని, దీన్ని వెంటనే ఆపాలంటూ విపక్షాలు ఆందోళన బాట పట్టిన వేల సుప్రీంకోర్టు ఈసీ అనుకూ ల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘‘అవస రమై నప్పుడు ఓటరు జాబితాకు సవరణలు చేసే సర్వాధికారం ఈసీకి ఉంది. చట్టానికి వ్యతిరే కంగా ఎస్ఐఆర్ చేపడుతు న్నారని, దీనిని ఆపేయాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తోసి పుచ్చింది. బిహార్లో ఎస్ఐఆర్ను వ్యతి రేకిస్తూ రాష్ట్రీయలోక్దళ్, కాంగ్రెస్ నేత లు సహా రాజకీయ సంస్కరణ సంస ్థ(ఏడీ ఆర్) సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే.సవరణ లేకుండా ఎలా?‘‘బిహార్లో మొదలెట్టిన ఎస్ఐఆర్ను దేశ వ్యాప్తంగా విస్తరించకుండా అడ్డుకోవాలి. ఎస్ఐఆర్లాంటి ప్రక్రియను ఈసీ గతంలో ఏనాడూ చేపట్టలేదు. అసలు ఇది ఎక్కడ ముగుస్తుందో దేవుడికే తెలియాలి’’ అని ఏడీఆర్ తరఫు సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ అన్నారు. దీంతో కోర్టు స్పందించింది. ‘‘ మీ తర్కం ప్రకారం ప్రత్యేకంగా ఓటరు సమగ్ర సవరణ చేపట్ట కూడదు. మొట్టమొదటిసారిగా దశాబ్దాల క్రితం సేకరించిన వాస్తవిక ఓటర్ల జాబితాను మాత్రమే కొనసాగించాలంటున్నారు. మా అభిప్రాయం ప్రకారం ఓటరు జాబితా అనేది ఎలాంటి సవరణలు జరపకుండా అలాగే కొనసాగించడం సబబు కాదు. ఈ జాబితా ఎప్పటికప్పుడు సవరణకు బద్దమై ఉండాల్సిందే. సవరణ చేయకుంటే చనిపోయిన వారి పేర్లను తొలగించేదెలా? వేరే రాష్ట్రానికి వలసవెళ్లిన ఓటర్లు, మరో నియోజకవర్గంలో స్థిర నివాసం ఏర్పర్చు కున్న వారి పేర్లను పాత నియోజక వర్గంలో తొలగించొద్దా?’’ అని ధర్మాసనం సూటి ప్రశ్నలు వేసింది. ‘‘ దృవపత్రంగా ఆధార్ను అంగీకరించట్లేదని మాకు అర్థమవుతోంది. కానీ ఏకంగా 11 ఇతర రకాల దృవపత్రాలను అంగీకరిస్తు న్నారుగా?’’ అని పిటిషనర్ల తరఫున హాజరైన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీని కోర్టు ప్రశ్నించింది. దీనితో పిటిషనర్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విభేదించారు. ‘‘ధ్రువపత్రాల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ అవి పూర్తిస్తాయిలో ఇప్పుడు అందరికీ అందుబాటులో లేవు. ధ్రువపత్రాల్లో ఒకటైన పాస్పోర్టు విషయానికే వస్తే రాష్ట్రంలో కేవలం ఒకటి, రెండు శాతం మంది దగ్గర మాత్రమే ఇవి ఉన్నాయి’’అని వాదించారు. దీనిపై కోర్టు స్పందించింది. ‘‘ రాష్ట్రంలో 36,00,000 మందికి పాస్పోర్టు ఉంది. ఇది మంచి సంఖ్య మాదిరిగానే కనిపిస్తోంది’’ అని కోర్టు గుర్తుచేసింది. వాటి మధ్య యుద్ధంలా తయారైంది‘‘ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 21(3) ప్రకారం ఓటరు జాబితాలో ఇప్పుడు సవరణలు అవసరమని ఈసీ భావిస్తే అప్పుడు వెంటనే ప్రత్యేక సవరణ మొదలెట్టే సర్వాధికారం ఈసీకి దఖలుపడింది. వాస్తవానికి ఈ అంశం రాజ్యాంగబద్ధ హక్కుకు, రాజ్యాంగం ద్వారా దఖలుపడిన అధికారానికి మధ్య పోరాటంలా తయారైంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. కోర్టు అభిప్రాయంతో లాయర్ శంకరనారాయణన్ విబేధించారు. చట్టప్రకారం రాష్ట్రంలో ఏదైనా కేవలం ఒక నియోజకవర్గంలో లేదంటే ఒక నియోజకవర్గంలోని కొంత భాగంలో మాత్రమే జాబితా సవరణ చేపట్టాలి. అంతేగానీ ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సవరణ చేపట్టకూడదు’’ అని వాదించారు. దీనిపై జడ్జి మళ్లీ స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని 324వ అధికరణం ద్వారా ఈసీకి సవరణ అధికారాలు దఖలుపడ్డాయి’’ అని జడ్జి వ్యాఖ్యానించారు. వెతికే అవకాశం లేకుండా చేశారు‘‘ముసాయిదా జాబితాలో సెర్చ్ ఆప్షన్ను ఈసీ దురుద్దేశంతో తొలగించింది. దీంతో గత జాబితాతో పోలిస్తే ముసాయిదా లిస్ట్లో ఎవరి పేర్లను తొలగించారో తెలియకుండా పోయింది. తొలగించిన, మరణించిన, వలసవెళ్లిన వాళ్ల జాబితా తెలీకుండా దాచిపెట్టేందుకే ఈసీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోంది. బెంగళూరు లోక్సభ నియోజకవర్గ పరిధిలో లక్ష నకిలీ ఓట్లను గుర్తించామని రాహుల్గాంధీ మీడియా సమావేశంలో ప్రకటించిన మరుసటి రోజే ఈ సెర్చ్ ఆప్షన్ తీసేశారు’’ అని ఎన్జీఓ తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదించారు. -
'దేశ'మంత మందికి ఓటుండదా?
బిహార్ ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్–సర్)లో భాగంగా ఎంత మంది పేర్లు గల్లంతయ్యాయి? దానికంటే ముఖ్యంగా, ఎంతమంది పేర్లు ఈ తాజా జాబితాల్లో నమోదు కాలేదు? ఈ సంఖ్యలు చాలా ముఖ్యం. వీటిని బట్టే ‘సర్’ పట్ల నా అభిప్రాయం ఉంటుంది. నేననుకోవడం, మనకు చెప్పిన దానికంటే వాస్తవ సంఖ్యలు చాలా ఎక్కువగా ఉంటాయి. వివరాల్లోకి వెళ్దాం.ఎన్నికల కమిషన్ ఒకటో తేదీన ముసాయిదా జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, 65.6 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించారు. సవరణ ప్రక్రియ ప్రారంభించడానికి ముందున్న మొత్తం ఓటర్లలో వీరు దాదాపు 9 శాతం ఉంటారు. ఈ తాత్కాలిక సంఖ్య చిన్నదేం కాదు. ఇప్పటికే ఇది ఆందోళన కలిగిస్తోంది.పెరగాల్సింది పోయి...మరొక విషయం ఏమిటంటే – 2024 సాధారణ ఎన్నికలతో, 2020 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చినట్లయితే ఈ దఫా నమోదైన ఓటర్లు తక్కువగా ఉన్నారు. 2005లో రెండు సార్లు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలు మినహా, 1977 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఎన్నికలకూ మొత్తం ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. అయితే, ఈ ఏడాది జరగనున్న ఎన్నికల పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటుంది.బిహార్ రాష్ట్ర అధిక సంతానోత్పత్తి రేటు (ఫెర్టిలిటీ రేట్)ను దృష్టిలో పెట్టుకుంటే, ఇది మరింత కలవరపెడుతోంది. 2001, 2011 మధ్య కాలంలో వయోజనులు 28.5 శాతం పెరిగారు. అయినా 2025లో మొత్తం రిజిస్ట్టర్డ్ ఓటర్ల సంఖ్య పెరగటానికి బదులు తగ్గటం వింతే!కొద్ది రోజుల క్రితం ప్రకటించిన దానికంటే అంతిమంగా ప్రకటించే వాస్తవ తొలగింపులు పెరిగే అవకాశం ఉంది. ‘భారత్ జోడో అభియాన్’ నేషనల్ కన్వీనర్ యోగేంద్ర యాదవ్ ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 65.6 లక్షలు అనే సంఖ్య ఇంకా పెరుగుతుందన డానికి ఆయన మూడు కారణాలు చెబుతున్నారు. ఒకటి – బూత్ లెవెల్ ఆఫీసర్స్ ముసాయిదాలోని పలు పేర్లను తిరస్కరించే అవ కాశం ఉంది. వారికా అధికారం ఉంది. రెండు – తమ దరఖాస్తు ఫారాలను అప్లోడ్ చేసిన అనేక మంది వాటిలో పొందుపరచిన వివరాలకు సరైన ధ్రువీకరణ పత్రాలను సమర్పించి ఉండరు. అలాంటి వారి పేర్లను మలి విడతలో తొలగిస్తారు. మూడు – ఎల క్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు స్థానికంగా విచారణ చేసి మరికొన్ని పేర్లను కొట్టేసే వీలుంది. ఈ మూడు కారణాల ప్రకారం, 65.6 లక్షలు అనేది ఆరంభ సంఖ్య మాత్రమే. చివరి లెక్కల్లో ఇది తప్పనిసరిగా చాలా ఎక్కువ ఉంటుంది.నమోదు కానివారి మాటో?ఓటర్ల జాబితాలపై, అంతిమంగా బిహార్ ఎన్నికలపై ఈ పేర్ల తొలగింపు ప్రభావం గురించి మాత్రమే విశ్లేషణ జరిగింది. మరి, జాబితాల్లో కొత్త ఓటర్ల నమోదు మాటేమిటి? ఈ అంశానికి దక్కా ల్సినంత ప్రాధాన్యం దక్కలేదు.యోగేంద్ర యాదవ్ దీనిపై అధ్యయనం చేశారు. ప్రభుత్వ అధికారిక జనాభా అంచనాలనే ఆయన తన అధ్యయనానికి ఆధా రంగా తీసుకున్నారు. ఎన్నికల కమిషన్ సైతం ఓటరు జాబితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయడానికి, ధ్రువీకరించుకోవడానికి వీటినే ప్రాతిపదికగా తీసుకుంటోంది.బిహార్ ఓటర్ల జాబితాల్లో నమోదైన వయోజన జనాభా (18 ఏళ్ల లేదా అంతకు మించిన వయసు ఉన్నవారు) శాతం వారి వాస్తవ జనాభాలో ఎంత ఉందో యోగేంద్ర యాదవ్ లెక్కగట్టారు. ‘సర్’కు ముందు, జూన్ 24న ఇది 97 శాతం. ‘సర్’ తర్వాత, ఇప్పుడు 88 శాతం! అంటే, 9 శాతం తగ్గింది. ఇది 94 లక్షలకు సమానం. జాబితాల నుంచి తొలగించిన 65.6 లక్షల పేర్ల కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. మరో విధంగా చెప్పాలంటే, 30 లక్షల మంది వయోజనులు అర్హత ఉండీ ఓటర్లుగా నమోదు కాలేదు.యోగేంద్ర యాదవ్ తన అధ్యయన ఫలితాలు ప్రచురించి పది రోజులు దాటింది. ఎన్నికల కమిషన్ వీటిని ఖండించలేదు, ప్రశ్నించలేదు. ఈ నిశ్శబ్దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?దేశమే అదృశ్యం?యోగేంద్ర యాదవ్ తన అధ్యయనంలో రెండు నిర్ధారణలకు వచ్చారు. బిహార్ ఓటర్ల జాబితాల్లో పేర్లు అదృశ్యమైన వారూ, పేర్లు నమోదు కాని వారూ కలిసి 1.5 కోట్ల మంది ఉంటారని ఆయన అంచనా. ఇది నిజం కాకపోతే బాగుండని అనుకోవడం తప్ప మనం చేయగలిగింది లేదు. ఇక రెండో నిర్ధారణ మనందరికీ ఆందో ళన కలిగించక మానదు. అధికారిక ప్రకటన ప్రకారం, 9 శాతం పేర్ల తొలగింపునే పరిగణనలోకి తీసుకున్నా సరే, ఇప్పటికిప్పుడు దేశ వ్యాప్తంగా ‘సర్’ నిర్వహిస్తే ఈ లెక్కన 9 కోట్ల మంది పేర్లు అదృశ్యమవుతాయి. వీరి సంఖ్య బ్రిటన్ లేదా ఫ్రాన్స్ జనాభాకు ఒకటి న్నర రెట్లు! బిహార్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ గురించి ఒక అభిప్రాయానికి వచ్చేందుకు ప్రధానంగా ఈ వివరాలు సరిపోతాయని అనుకుంటున్నాను. మీరేమంటారు?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఓట్ల చోరీపై పోరుబాట
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)తోపాటు దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల్లో అక్రమాలు, ఓట్ల చోరీ, గత లోక్సభ ఎన్నికల్లో రిగ్గింగ్పై విపక్ష ‘ఇండియా’ కూటమి పోరుబాట పట్టింది. ఓట్ల చోరీని వెంటనే ఆపాలని, ‘ఒక్కరికి ఒక ఓటు’ అనే విధానాన్ని పక్కాగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాం«దీ, ప్రియాంక గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీలు సోమవారం దేశ రాజధానిలో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తెల్లటోపీలు ధరించి పార్లమెంట్ మకరద్వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయానికి బయలుదేరిన ‘ఇండియా’ కూటమి ఎంపీలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ర్యాలీకి అనుమతి లేదంటూ పీటీఐ భవనం ఎదుట పోలీసులు ఏర్పాటు చేసిన బారీకేడ్లను పక్కకు తొలగించేందుకు ఎంపీలు ప్రయత్నించారు. కేవలం 30 మందిని అనుమతిస్తామని పోలీసులు చెప్పగా, ఎంపీలు అంగీకరించలేదు. ఎన్నికల సంఘానికి విజ్ఞాపన పత్రం అందజేయడానికి శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. కొందరు రోడ్డుపై బైఠాయించి, ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చయడం ఆపాలన్నారు. మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, సాగరికా ఘోష్, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జోతిమణితోపాటు సమాజ్వాదీ పార్టీ సభ్యుడు అఖిలేష్ యాదవ్ బారీకేడ్లపైకి ఎక్కారు. ఎన్నికల సంఘం తీరుపై నిప్పులు చెరిగారు. నినాదాలతో హోరెత్తించారు. ఈ గందరగోళం మధ్య మహిళా ఎంపీలు మహువా మొయిత్రా, మితాలీ బేగ్ స్పృహ తప్పిపడిపోగా, రాహుల్ గాంధీ వారికి సపర్యలు చేశారు. తర్వాత పోలీసులు నిరసనకారులను బస్సుల్లోకి ఎక్కించి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్కు తరలించారు. రెండు గంటల తర్వాత వారందరినీ విడుదల చేశారు. రాజకీయ పోరాటం కాదు: రాహుల్ ఇది రాజకీయ పోరాటం కాదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తేల్చిచెప్పారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే పోరాటం ప్రారంభించామని స్పష్టంచేశారు. నిరసన ర్యాలీ సందర్భంగా ఆయన మాట్లాడారు. చట్ట ప్రకారం ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలన్నారు. అక్రమాలు, అవకతవకలకు తావులేని స్వచ్ఛమైన, స్పష్టమైన ఓటర్ల జాబితా కోసం ఉద్యమిస్తున్నామని ఉద్ఘాటించారు. ఎన్నికల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రజలందరికీ తెలుసని చెప్పారు. ఎన్నికల సంఘం దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. గత ఎన్నికల్లో దేశమంతటా జరిగిన రిగ్గింగ్పై త్వరలో బాంబు పేలుస్తానని రాహుల్ మరోసారి వెల్లడించారు. ఎన్నికల సంఘం కోరుతున్నట్లుగా సంతకం చేసిన అఫిడవిట్ సమర్పించే ప్రసక్తే లేదన్నారు. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారాన్ని విశ్లేíÙంచి, ఓట్ల చోరీని బయటపెట్టానని, ఇంతకంటే సాక్ష్యాధారాలు ఇంకేం కావాలని ప్రశ్నించారు. అది తాను సృష్టించిన డేటా కాదని స్పష్టంచేశారు.బీజేపీ కుట్రలను అడ్డుకుంటాం: ఖర్గే ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే స్పష్టంచేశారు. ఓట్ల చోరీని అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఎస్ఐఆర్ పేరిట ఓటర్ల జాబితాలను తారుమారు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ కుట్రలను కచి్చతంగా అడ్డుకుంటామని అన్నారు. ఈ మేరకు ఖర్గే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దేశంలో బీజేపీ నిరంకుశత్వం చెల్లదన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఎదుటే ప్రజాస్వామ్యంపై దాడి జరిగిందని, ప్రజాస్వామ్యాన్ని హత్య చేశారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ప్రతిపక్ష ఎంపీలను అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. తమ డిమాండ్లపై ఎన్నికల సంఘానికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా అరెస్టు చేయడం దారుణమని విమర్శించారు. ఎన్నికలు నిర్వహించాల్సిన ఎన్నికల సంఘం దొంగతనం చేసే సంఘంగా మారొద్దని జైరాం రామేశ్ హితవు పలికారు. నిరసన ర్యాలీలో శరద్ పవార్(ఎన్సీపీ–ఎస్పీ), టి.ఆర్.బాలు(డీఎంకే), సంజయ్ రౌత్(శివసేన–ఉద్ధవ్), డెరెక్ ఓబ్రెయిన్(టీఎంసీ)తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, నిరసన ర్యాలీ కోసం ఎవరూ అనుమతి తీసుకోలేదని ఢిల్లీ పోలీసులు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికల సంఘం ఆఫీసు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారీకేడ్ దాటేసిన అఖిలేశ్ నిరసన ర్యాలీలో తమను అడ్డుకున్న పోలీసులపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బారీకేడ్లను తోసుకొని ముందుకెళ్లేందుకు ప్రయత్నించారు. బారీకేడ్ ఎక్కి అవతలికి దూకేశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రజా ఉద్యమంలా మారింది: రాహుల్న్యూఢిల్లీ: ‘ఓట్ చోరీ’కి వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారం ఉధృతమై ప్రజా ఉద్యమంలా మారిందని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. పోర్టల్ ప్రారంభించినప్పటి నుంచి మద్దతుగా 15 లక్షల సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని, 10 లక్షల వరకు మిస్డ్ కాల్స్ వచ్చాయన్నారు. -
పార్లమెంట్లో మిన్నంటిన నిరసనలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో విపక్షాల ఆందోళనలు, నిరసనలు, నినాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి. శుక్రవారం సైతం పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. బిహార్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రభుత్వం వెంటనే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో నిరసన వ్యక్తంచేశాయి. దాంతో లోక్సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మృతిపట్ల స్పీకర్ ఓంబిర్లా నివాళులర్పించారు. క్విట్ ఇండియా ఉద్యమ వార్షికోత్సవం గురించి ప్రస్తావించారు. అనంతరం ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని తేల్చిచెప్పారు. ఈ సమయంలో స్పీకర్ కొంతసేపు ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. విపక్షాల రగడ ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విపక్షాల నినాదాలు ఆగలేదు. విపక్షాల ఆందోళన ఆగకపోవడంతో చేసేది లేక సభాపతి లోక్సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత మరోవైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఇన్కం ట్యాక్స్ బిల్లు–2025’ను ఉపసంహరించుకున్నారు. నూతన బిల్లును ఈ నెల 11 లోక్సభలో ప్రవేశపెట్ట బోతున్నారు. ఎస్ఐఆర్పై సభలో నినానాలు మిన్నంటడంతో స్పీకర్ స్థానంలో ఉన్న కృష్ణప్రసాద్ తెన్నేటి సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు చెప్పి వెళ్లిపోయారు. ఓట్లు చోరీ చేసింది కాంగ్రెస్ నేతలే: రవనీత్ సింగ్ బిట్టూ బిహార్లో నిర్వహించిన ఎస్ఐఆర్తోపాటు గత లోక్సభ ఎన్నికల్లో జరిగిన ఓట్ల చౌర్యంపై చర్చించాలని రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. సభా కార్యకలపాలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. చర్చ కోసం రూల్ 267 కింద విపక్షాలు ఇచ్చిన 20 నోటీసులను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. దాంతో విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలతో హోరెత్తించారు. దాంతో సభ మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా పడింది. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితి యథాతథంగా కొనసాగింది. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న ఘన్శ్యామ్ తివారీ విజ్ఞప్తి చేయగా, విపక్షాలు పట్టించుకోలేదు. కర్ణాటకలో ఓటర్ల జాబితాలో అక్రమాలపై చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ డిమాండ్చేశారు. ఓట్ల దొంగతనానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలేనని కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూ మండిపడ్డారు. దొంగే దొంగ దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఆయనపై విపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. -
ఎస్ఐఆర్పై ఆగని ఆందోళన
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో రగడ ఆగడం లేదు. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబడుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అందుకు అంగీకరించకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. గురువారం సైతం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. నిరసనలు, నినాదాలతో సభా కార్యకలాపాలను అడ్డుకు న్నాయి. ఫలితంగా లోక్సభ, రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష సభ్యులు ఆందోళనకు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ రెండు సార్లు సభను వాయిదా వేశారు. మణిపూర్కు నిధులు కేటాయించేందుకు ఉద్దేశించిన మణిపూర్ అప్రొప్రియేషన్ బిల్లు–2025లో లోక్సభలో ఎలాంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. అనంతరం సభ శుక్రవారానికి వాయిదా పడింది. దేశ ప్రయోజనాల కోసమే మా పోరాటం: ఖర్గే రాజ్యసభలోనూ విపక్షాలు ఆందోళనలు కొనసాగాయి. సభ తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాలు నినాదాలు ఆపలేదు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండానే మరోవైపు కోస్టల్ షిప్పింగ్ బిల్లు–2025ను ప్రవేశపెట్టి ఆమోదించారు. కొందరు విపక్ష సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్పై సభాపతి స్థానంలో ఉన్న ఘనశ్యామ్ తివారీ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్ష నేత మల్లికార్జున ఖర్గే కొద్దిసేపు మాట్లాడారు. ఎస్ఐఆర్పై చర్చకు అనుమతించాలని కోరారు. దేశ ప్రయోజనాల కోసమే తాము పోరాడుతున్నామని చెప్పారు. తర్వాత సభను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘనశ్యామ్ తివారీ ప్రకటించారు. పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ఎస్ఐఆర్పై ప్రతిపక్ష నేతలు గురువారం పార్లమెంట్ ప్రాంగణంలో ప్లకార్డులతో నిరసన వ్యక్తంచేశారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్వాదీ పార్టీ సభ్యుడు ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐఆర్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నినాదాలతో హోరెత్తించారు. ఎస్ఐఆర్ అంటే కంటికి కనిపించని రహస్య రిగ్గింగ్ అని ఆరోపించారు. -
పార్లమెంట్లో వాయిదాల పర్వం
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై పార్లమెంట్లో ప్రతిపక్షాలు నిప్పులు చెరిగాయి. దీనిపై వెంటనే చర్చ ప్రారంభించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని బుధవారం నిలదీశాయి. నిరసన వ్యక్తంచేశాయి. వెల్లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో ఉభయ సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. లోక్సభ ఉదయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దాంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. వెనక్కి వెళ్లి సీట్లలో కూర్చోవాలని, సభకు సహకరించాలని స్పీకర్స్థానంలో ఉన్న దిలీప్ సైకియా విజ్ఞప్తి చేయగా, విపక్ష ఎంపీలు పట్టించుకోలేదు. దాంతో ఆయన సభను మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా నినాదాలు, నిరసనలు యథాతథంగా కొనసాగాయి. చేసేది లేక సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు దిలీప్ సైకియా ప్రకటించారు. అంతకుముందు లోక్సభలో మర్చంట్ షిప్పింగ్ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. ఎస్ఐఆర్పై చర్చించే ప్రసక్తే లేదు: రిజిజు ఎస్ఐఆర్పై లోక్సభలో చర్చించే ప్రసక్తే లేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తేల్చిచెప్పారు. ఆయన బుధవారం సభలో మాట్లాడారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని గుర్తుచేశారు. అందుకే సభలో చర్చించలేమని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలను చర్చించేందుకు పార్లమెంట్ నియమ నిబంధనలు ఒప్పుకోవని స్పష్టంచేశారు. అలాగే స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం కార్యకలాపాల గురించి సభలో చర్చ చేపట్టడం సాధ్యం కాదని ఉద్ఘాటించారు. రాజ్యసభలోనూ అదే అలజడి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఎగవ సభలోనూ అలజడి కొనసాగింది. ఈ అంశంపై చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఎస్ఐఆర్పై వెంటనే చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్షాలు రూల్ 267 కింద 35 నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. సభలో నినాదాలు, నిరసనలు మిన్నంటాయి. సభను హరివంశ్ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. రాజ్యసభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు కొనసాగించారు. ఒకవైపు గందరగోళం కొనసాగుతుండగానే, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మణిపూర్కు సంబంధించిన డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ను సభలో ప్రవేశపెట్టారు. తర్వాత ‘క్యారేజీ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్లు–2025’మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై సభలో స్వల్ప చర్చ జరిగింది. మరోవైపు విపక్షాలు ఆందోళన ఆగలేదు. తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మమతా ఠాకూర్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్ చైర్మన్ పోడియంపైకి ఎక్కేందుకు ప్రయతి్నంచారు. దాంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి స్థానంలో ఉన్న భువనేశ్వర్ కలితా వెల్లడించారు. -
బిహార్లో తొలగించిన ఓటర్ల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ వ్యవహారం సుప్రీంకోర్టుకెక్కింది. ఈ ప్రక్రియలో భాగంగా తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల వివరాలు ఈ నెల 9వ తేదీలోగా సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. బిహార్లో ఎస్ఐఆర్ చేపట్టాలని జూన్ 24న ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వును సవాలు చేస్తూ ప్రజాస్వామ్య సంస్కరణల సంస్థ(ఏడీఆర్) అనే ఎన్జీఓ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ దాఖలు చేసింది. తొలగింపునకు గురైన 65 లక్షల ఓటర్ల వివరాలు ప్రచురించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. వారు మరణించారా? లేక వలస వెళ్లారా? లేక మరేదైనా కారణం ఉందా? అనేది తెలియజేయాలని కోరింది. ఈ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.కోటీశ్వర్ సింగ్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. తొలగించిన 65 లక్షల మంది ఓటర్ల సమాచారం అందజేయాలని, ఒక కాపీని ఏడీఆర్కు ఇవ్వాలని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాదికి సూచించింది. -
ఎస్ఐఆర్పై చర్చించాల్సిందే
న్యూఢిల్లీ: బిహార్లో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)పై ప్రతిపక్షాలు ఎంతకీ పట్టువీడడం లేదు. గత నెల 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అంశంపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై వెంటనే చర్చించాలని, ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సైతం పార్లమెంట్లో అలజడి సృష్టించాయి. ఈ ప్రక్రియపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, ప్రభుత్వం వాటిని నివృత్తి చేయాలని విపక్ష ఎంపీలు తేల్చిచెప్పారు. నిరసనలు, నినాదాలతో లోక్సభ, రాజ్యసభ హోరెత్తిపోయాయి. లోక్సభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. నినాదాల హోరు లోక్సభలో ఉదయం 11 గంటలకు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా.. కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్ సహా ముగ్గురు దివంగత సభ్యులకు నివాళులరి్పంచారు. అనంతరం విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని నినాదాలు ప్రారంభించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ఎస్ఐఆర్పై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. ఇంతలో స్పీక ర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. అయినప్పటికీ నినాదాలు ఆగకపోవడంతో విపక్షాలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. సభ గౌరవాన్ని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు. సభకు సహకరించాలని కోరారు.విపక్ష ఎంపీలు వినిపించుకోకపోవడంతో సభను మ« ద్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్షాలు శాంతించకపోవడంతో సభను బుధవారానికి వాయి దా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. అంతకుముందు గోవా అసెంబ్లీలో ఎస్టీలకు రిజర్వేషన్లు కలి్పంచేందుకు ఉద్దేశించిన బిల్లు లోక్సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై రాజ్యసభలోనూ రగడ యథాతథంగా కొనసాగించింది.ఎస్ఐఆర్పై చర్చకు రూల్ 267 కింద విపక్షాలు 34 వాయిదా తీర్మానం నోటీసులు ఇవ్వగా డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తిరస్కరించారు. వెంటనే చర్చ ప్రారంభించాలన్న విపక్షాల డిమాండ్ పట్ల సభాపతి సానుకూలంగా స్పందించలేదు. కాంగ్రెస్ సహా ఇతర పారీ్టల ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేస్తుండడంతో సభ తొలుత రెండుసార్లు.. చివరకు బుధవారానికి వాయిదా పడింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరో ఆరు నెలలపాటు పొడిగిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ తీర్మానం లోక్సభలో ఇప్పటికే ఆమోదం పొందగా, రాజ్యసభలో మంగళవారం ఆమోదించారు. అలాగే కస్టమ్స్ టారిఫ్ యాక్ట్–1975లోని రెండో షెడ్యూల్ను సవరిస్తూ మరో తీర్మానాన్ని రాజ్యసభలో ఆమోదించారు. మేము ఉగ్రవాదులమా?: ఖర్గే రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీరుపై డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అసంతృప్తి వ్యక్తంచేశారు. గతవారం తనకు రాసిన లేఖను మీడియాకు విడుదల చేయడం సరైంది కాదని అన్నారు. గతవారం రాజ్యసభ వెల్లో విపక్ష సభ్యులు నినాదాలు చేస్తుండగా, సీఐఎస్ఎఫ్ జవాన్లు రంగంలోకి దిగి వారిని బటయకు తీసుకెళ్లారు. రాజ్యసభలోకి పారామిలటరీ సిబ్బంది రావడం పట్ల ఖర్గే మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా విపక్షాలు గొంతు నొక్కేస్తున్నారని, ప్రజాస్వామ్య హక్కును అణచివేస్తున్నారని ఆరోపించారు.సభలో పారామిలటరీ దళాన్ని అనుమతించకూడదని కోరుతూ హరివంశ్కు లేఖ రాశారు. అనంతరం ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అయితే, డిప్యూటీ చైర్మన్కు రాసిన లేఖ సభాహక్కుల పరిధిలోకి వస్తుందని, దాన్ని బయటపెట్టడం ఏమిటని హరివంశ్ ప్రశ్నించారు. పార్లమెంట్లో పారామిలటరీ సిబ్బంది సేవలు ఉపయోగించుకోవడం కొత్తేమీ కాదన్నారు. ఖర్గే స్పందిస్తూ.. తాము ప్రజాస్వామ్య విధానంలో నిరసన తెలిపామని, ఇకపై కూడా నిరసన కొనసాగిస్తామని బదులిచ్చారు. సభలో సీఐఎస్ఎఫ్ జవాన్లు అడ్డుకున్నారని, మేము ఉగ్రవాదులమా? అని ప్రశ్నించారు. డిప్యూటీ చైర్మన్కు రాసిన లేఖపై ప్రెస్నోట్ మాత్రమే మీడియాకు విడుదల చేశానని పేర్కొన్నారు. సభ్యులందరి కోసమే ఈ పని చేశానన్నారు.పోలీసులను, సైన్యాన్ని తీసుకొచ్చి సభను నడిపిస్తారా? అని నిలదీశారు. ఖర్గే వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తంచేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గతవారం మార్షల్స్ మాత్రమే లోపలికి వచ్చారని, పారామిలటరీ సిబ్బంది రాలేదని స్పష్టంచేశారు. సభలో తప్పుడు ఆరోపణలు చేసేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర మంత్రి జె.పి.నడ్డా మాట్లాడుతూ.. తాను గతంలో 40 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నానని, ప్రభావవంతమైన ప్రతిపక్షంగా ఎలా పని చేయాలో నేర్చుకోవాలంటే తన వద్దకు ట్యూషన్కు రావాలని కాంగ్రెస్ సభ్యులకు సూచించారు. -
ఎస్ఐఆర్పై చర్చకు పట్టు స్తంభించిన లోక్సభ
న్యూఢిల్లీ: అత్యంత వివాదాస్పదంగా మారిన బిహార్ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) అంశం మరోసారి పార్లమెంట్ను స్తంభింపజేసింది. పార్లమెంట్ ఉభయ సభల సభాకార్యకలాపాలకు బదులు ఎస్ఐఆర్ అంశంపైనే చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టడంతో లోక్సభ అర్ధంతరంగా మంగళవారానికి వాయిదాపడింది. వర్షాకాల సమావేశాలు మొదలయ్యాక లోక్సభలో విపక్షసభ్యుల నిరసనల కారణంగా కనీసం ఒక్క బిల్లు కూడా సభామోదానికి నోచుకోలేదని అధ్యక్షస్థానంలో ఉన్న స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నినాదాలు మాని విపక్షసభ్యులు తమ తమ సీట్లలో కూర్చోవాలని విజ్ఞప్తిచేసినా ఎవరూ పట్టించుకోలేదు. సోమవారం ఉదయం లోక్సభ మొదలుకాగానే విపక్ష సభ్యులు తమ సీట్లలోంచి లేచి వెల్లోకి దూసుకొచ్చారు. ఎస్ఐఆర్పై చర్చించాలని నినాదాలుచేశారు. ప్రభుత్వ వ్యతిరేక, ఎస్ఐఆర్ వ్యతిరేక ప్లకార్డులు చేతబూని ఆందోళన కొనసాగించారు. దీంతో సభను మధ్యా హ్నం రెండు గంటల వరకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలవగానే కాంగ్రెస్ సభ్యులు మళ్లీ ఇదే అంశంపై చర్చకు మొండిపట్టుబట్టారు. దీంతో సభాధ్యక్షస్థానంలో కూర్చున్న జగదాంబికాపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘ఈరోజు రెండు కీలక క్రీడా బిల్లులను సభలో చర్చించి, ఆమోదించాల్సి ఉంది. ఇలా నినాదాలు, ఆందోళన చేయడంతో భారతీయ క్రీడాకారులకు అన్యాయం చేసినవాళ్లమవుతాం’’అని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సైతం ఇదే తరహాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ నినాదాల హోరు మధ్యే ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కస్టమ్స్ సుంకాలకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం సభ మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ‘‘వర్షాకాల సమావేశాలు జూలై 21వ తేదీన మొదలైనప్పటి నుంచీ మీరు సభ జరక్కుండా ఆటంకం కల్గిస్తున్నారు. ఇలా వరసగా గత మూడు వారాలుగా అవరోధాలు సృష్టిస్తున్నారు’’అని జగదాంబికాపాల్ వ్యాఖ్యానించి సభను మంగళవారానికి వాయిదావేశారు. ‘‘తమ ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తున్నారన్న ఆశతో మిమ్మల్ని లక్షలాది మంది ఓటర్లు ఎన్నుకుని లోక్సభకు పంపించారు. మీరేమో ఇలా నినాదాలు చేస్తూ ముఖ్యమైన బిల్లులు చర్చకు రాకుండా, సభామోదం పొందకుండా అడ్డుకుంటున్నారు. సభా గౌరవాన్ని మీరంతా కించపరుస్తున్నారు’’అని ఓం బిర్లా సైతం వ్యాఖ్యానించడం తెల్సిందే.సోరెన్ మరణంతో రాజ్యసభ వాయిదా రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ మరణానికి సంతాప సూచికగా రాజ్యసభలో ఎలాంటి అంశాలను చర్చకు స్వీకరించలేదు. బిల్లులనూ ప్రవేశపెట్టలేదు. రాజ్యసభ సోమవారం ఉదయం ప్రారంభంకాగానే సోరెన్ మరణ వార్త, సంతాప సందేశాన్ని సభ డెప్యూటీ ఛైర్మన్ హరివంశ్ సభ్యులందరికీ చదివి వినిపించారు. ‘‘గిరిజనుల హక్కుల కోసం అవిశ్రాంతంగా సోరెన్ పోరాడారు’’అని సోరెన్ను హరివంశ్ గుర్తుచేసుకున్నారు. ఆయన మృతికి గౌరవ సూచికగా సభలో ఎలాంటి చర్చను డెప్యూటీ చైర్మన్ అనుమతించలేదు. సభను మంగళవారానికి వాయిదావేశారు. 2020 జూన్లో సోరెన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్నారు. -
తేజస్వీ యాదవ్కి రెండు ఓటర్ ఐడీలా?
పట్నా: బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)అనంతరం విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తన పేరు గల్లంతయిందంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేసిన తీవ్ర ఆరోపణలను ఎన్నికల కమిషన్(ఈసీ) తీవ్రంగా పరిగణిస్తోంది. ఓటరు ఐడీ నంబర్ మారిందని తేజస్వీ శనివారం వ్యాఖ్యానించగా ఈసీ వెంటనే ఖండించడం తెల్సిందే. ముసాయిదా ఓటరు జాబితాలో తేజస్వీ పేరు ఉందని స్పష్టం చేసింది. తేజస్వీ చూపుతున్న ఓటరు ఐడీ కార్డు తాము జారీ చేసిందేనని భావించడం లేదని, దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని పట్నా సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్, దిఘా ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి త్యాగరాజ పేర్కొన్నారు. ఈ మేరకు తేజస్వీకి ఆయన ఒక నోటీస్ పంపారు. కొత్త ఓటరు కార్డును తమకు అందజేయాలని కోరారు. రెండు వేర్వేరు నంబర్లతో కూడిన రెండు కార్డులను ఆయన కలిగి ఉండటంపై దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ఓటరు జాబితాలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 204 పరిధిలో ఓటరు సీరియల్ నంబర్ 416 తేజస్వీదేనని వివరించింది. ఆయన ఓటరు కార్డు నంబర్ ఆర్ఏబీ0456228 అని పేర్కొంది. ‘మీరు మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు ఐడీ నంబర్ ఆర్ఏబీ2916120. ఆ ఎపిక్ నంబర్ మేం అధికారికంగా జారీ చేసింది కాదని దర్యాప్తులో వెల్లడైంది. మీరు చూపిన ఆ ఎపిక్ కార్డు ఒరిజినల్ కాపీని మాకు అందజేయండి. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాల్సి ఉంది’ అని ఈసీ ఆ నోటీసులో తేజస్వీని కోరింది. తేజస్వీపై కేసు పెట్టాలి: బీజేపీరెండు ఓటరు గుర్తింపు కార్డులను కలిగి ఉన్న తేజస్వీ యాదవ్ నేరానికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. అధికారికంగా వెల్లడించిన ఓటరు గుర్తింపు కార్డు నంబర్, తేజస్వీ మీడియా ఎదుట ప్రదర్శించిన కార్డు నంబర్ ఒక్కటి కాదని తెలిపింది. ‘ఈ వ్యవహారం ఆర్జేడీ, కాంగ్రెస్ల అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసింది. ఎన్నికల కమిషన్కు అబద్ధాలు చెప్పి, వాగ్దాన భంగానికి పాల్పడ్డారు’ అని బీజేపీ నేత సంబిత్ పాత్ర ఆరోపించారు. శనివారం తేజస్వీ మీడియాకు చూపిన ఓటరు ఐడీ నంబర్ 2020లో జారీ చేసిన ఓటరు ఐడీ నంబర్ ఒక్కటి కాదన్నారు. రెండు ఓటరు ఐడీలు కలిగి నేరానికి పాల్పడిన తేజస్వీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఈసీ విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో 65 లక్షల మంది అనర్హులైన ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఈసీ ప్రకటించడం, ప్రతిపక్షాలు తీవ్ర ఆరోపణలకు దిగడం తెల్సిందే. -
ఎన్నికల ఎఫెక్ట్.. ‘తమిళనాట 6.5 లక్షల కొత్త ఓటర్లు’
ఢిల్లీ: ఓటర్ లిస్టు విషయంలో ఎన్నికల సంఘంపై ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వేళ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మరో బాంబు పేల్చారు. తమిళనాడులో ఏకంగా 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారని చెప్పుకొచ్చారు. దీంతో ఓటర్ లిస్ట్పై కొత్త చర్చ మొదలైంది.బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) రాజకీయంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడులో కూడా ఓటర్ల సంఖ్య పెరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం తెలిపారు. తాజాగా చిదంబరం ట్విట్టర్ వేదికగా.. ‘ఎస్ఐఆర్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారుతోంది. బీహార్లో 65 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదంలో ఉండగా.. తమిళనాడులో మాత్రం 6.5 లక్షల మంది ఓటర్లు పెరిగారు. ఇది ఆందోళనకరమైన చర్య. చట్టవిరుద్ధమైనది. పెరిగిన ఓటర్లను శాశ్వత వలస కార్మికులు అని పిలిస్తే అసలైన వలస కార్మికులను అవమానించినట్లు అవుతుంది. తమిళనాడు ఓటర్లు తమకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం లేకుండా చేసేందుకు ఓట్ల పెంపుదల జరిగింది. ఎన్నికల సంఘం తన అధికారాలను దుర్వినియోగం చేస్తోంది. రాష్ట్రాల ఎన్నికల విధానాలను మార్చేందుకు ఈసీ ప్రయత్నిస్తోంది. ఈ అధికార దుర్వినియోగాన్ని రాజకీయంగా, చట్టబద్ధంగా ఎదుర్కోవాల్సిందే’ అని పిలుపునిచ్చారు.The SIR exercise is getting curiouser and curiouserWhile 65 lakh voters are in danger of being disenfranchised in Bihar, reports of "adding" 6.5 lakh persons as voters in Tamil Nadu is alarming and patently illegalCalling them "permanently migrated" is an insult to the…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025ప్రతి భారతీయుడికి శాశ్వత నివాసం ఉన్న ఏ రాష్ట్రంలోనైనా నివసించడానికి, పని చేయడానికి హక్కు ఉంది. అది స్పష్టంగా సరైనది. బీహార్ ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్న లక్షల మంది వ్యక్తులు రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు. కాబట్టి వారిని మినహాయించాలని ఎన్నికల సంఘం ఎలా నిర్ణయానికి వచ్చింది?. ఒక వ్యక్తి ఒక రాష్ట్రం నుండి శాశ్వతంగా వలస వెళ్లారు అని నిర్ధారణకు రాక ముందే, ప్రతి కేసుపై సమగ్ర విచారణ నిర్వహించకూడదా?. సామూహిక ఓటుహక్కుల తొలగింపు అనేది తీవ్రమైన సమస్య, అందుకే సుప్రీంకోర్టు పిటిషన్లను విచారిస్తోంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే చిదంబరం తన పోస్టుకు తమిళనాడు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. తమిళనాడు ఓటరు జాబితాలో వలస కార్మికులను చేర్చడంపై అధికార డీఎంకేతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. Every Indian has a right to live and work in any state where he has a permanent home. That is obvious and rightHow did the ECI come to the conclusion that several lakh persons, whose names are in the current electoral rolls of Bihar, must be excluded because they had…— P. Chidambaram (@PChidambaram_IN) August 3, 2025 -
దమ్ముంటే బాంబు పేల్చు
పట్నా: ఓట్ల చౌర్యానికి పాల్పడుతున్న ఎన్నికల సంఘంపై అణు బాంబు లాంటి సాక్ష్యం ఉందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. దమ్ముంటే ఒక్కసారి అణు బాంబు పేల్చి చూపించాలని రాహుల్కు సవాల్ విసిరారు. అది పేలేటప్పుడు హాని జరగకుండా చూసుకోవాలని హితవు పలికారు. పార్లమెంట్లో భూకంపం సృష్టిస్తానని రాహుల్ గతంలో హెచ్చరించారని, చివరకు తుస్సుమనిపించారని ఎద్దేవా చేశారు. శనివారం బిహార్ రాజధాని పాటా్నలో ఓ కార్యక్రమంలో రాజ్నాథ్ మాట్లాడారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘాన్ని రాహుల్ కించపరుస్తున్నారని ఆరోపించారు. నిజానికి రాహుల్ పార్టీ చేతులే రక్తంతో తడిశాయని విమర్శించారు. 1975లో ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయతి్నంచిందని రాజ్నాథ్ ధ్వజమెత్తారు. -
మొన్న ‘డాగ్ బాబు’ ఇప్పుడు ‘డాగేశ్’
పట్నా: బిహార్లో ఓటర్ల జాబితా సవరణ మొత్తంగా ప్రభుత్వ వ్యవస్థలకే తలనొప్పిగా మారింది. రెవెన్యూ వ్యవస్థలో లోపాలను తనిఖీ చేయాలనుకున్నారో ఏమో తెలియదు! ఓ వ్యక్తి మరో శునకానికి నివాస ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. ఇటీవలే ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి రెసిడెన్స్ సర్టీఫికెట్ జారీచేయడం, దీంతో సంబంధిత విభాగంపై విమర్శలు వెల్లువెత్తడం తెల్సిందే. అయితే తాజాగా అదే బిహార్లోని నవాడా జిల్లాలో ఉన్న సిర్దాల బ్లాక్లో ‘డాగేశ్ బాబు’పేరుతో మరో దరఖాస్తు ఆర్టీపీఎస్ కార్యాలయానికి చేరింది. అందులో దరఖాస్తుదారు కాలమ్లో కుక్క ఫొటోను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఈ విషయం ఏకంగా నవాడా జిల్లా కలెక్టర్ రవి ప్రకాశ్ దృష్టికి వెళ్లింది. రాష్ట్రంలో మరో కుక్కకు స్థానిక నివాస దృవీకరణ పత్రం కావాలని అభ్యర్థన రావడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఈ దరఖాస్తు చేసిన వ్యక్తిపై వెంటనే కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. సరదాగా చేసే ఇలాంటి పనుల వల్ల ప్రభుత్వ వ్యవస్థ సమయం వృథా అవ్వడరమే కాదు, అధికారులు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుందన్నారు. ప్రభుత్వ సేవల దురి్వనియోగాన్ని సహించబోమన్న కలెక్టర్.. భవిష్యత్లో ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 24వ తేదీన మసౌరీ రెవెన్యూ అధికారులు ‘డాగ్ బాబు’పేరుతో ఓ శునకానికి నివాస పత్రాన్ని జారీ చేశారు. అందులో ‘డాగ్ బాబు’తండ్రిపేరు కుత్తా బాబు, తల్లి పేరును కుతియాదేవిగా పేర్కొన్నారు. ఈ సర్టీఫికెట్ ఆన్లైన్లో తెగ వైరల్ అయ్యింది. స్పందించిన అధికారులు.. విషయం తమ దృష్టికి రాగానే సర్టీఫికెట్ రద్దు చేశామని తెలిపారు. ఈ దరఖాస్తు చేసిన వ్యక్తి, కంప్యూటర్ ఆపరేటర్పైనా చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. -
సుప్రీంకోర్టు సంశయించకూడదు!
బిహార్లో ఓటర్ల జాబితాలపై ప్రత్యేక సునిశిత సవరణ (ఎస్.ఐ.ఆర్.–సర్) నిర్వ హించాలన్న భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు వాదోపవాదాలను వింటోంది. ఈలోగా, ఆ తతంగానికి సంబంధించిన మొదటి దశ ఇటీవలే పూర్తయింది.రాష్ట్రంలో రాబోయే ఎన్నికల లోగా జాబితా లను మెరుగుపరచాలని ‘సర్’ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశ పూర్తయ్యేనాటికి జాబితాలో చేర్చాలని కోరుతూ 7.24 కోట్ల దర ఖాస్తులు వచ్చాయని కమిషన్ వెల్లడించింది. జాబితాల సవరణ మొదలుపెట్టిన జూన్ 24 నాటికి రాష్ట్రంలో నమోదై ఉన్న ఓటర్లసంఖ్య కన్నా అది 65 లక్షలు తక్కువ. పిటిషనర్ల ఆగ్రహానికి కారణాలు1950 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21వ సెక్షన్ కింద ఓటర్ల జాబితాలను సవరించే అధికారం ఎన్నికల కమిషన్కు ఉంది. కానీ, రెండు ముఖ్యమైన అంశాలు పిటిషనర్లకు కోపం తెప్పించాయి. ఒకటి – 2003 తర్వాత నమోదైన ఓటర్లు అందరూ తిరిగి తమ పేర్లను నమోదు చేసుకోవాలనీ, అందుకు తగిన అర్హతను చూపాలనీ కోరడం. రెండు – వారు ఆ పని చేయడానికి ఒక నెల వ్యవధి మాత్రమే ఇవ్వడం. తిరిగి పేరు నమోదు చేసుకునేందుకు తక్కువ వ్యవధినివ్వడం, వేగంగా సవరణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చూడటం వల్ల ఈ విధానం అపారదర్శకంగా తయారైంది. మూకుమ్మడిగా పేర్లు తొల గింపునకు గురవుతాయనే తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అయినా, ఈ కార్యక్రమాన్ని నిలిపివేసేందుకు కోర్టు తిరస్కరించింది. ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డులను కూడా ‘పరిగణన’లోకి తీసుకోవలసిందని మాత్రమే కోర్టు కోరింది. ఆ విధంగా చాలా మందిని అనర్హులుగా చేయనున్నారనే విమర్శలకు తావు ఇవ్వకుండా ప్రయత్నించింది. ఓటర్ల జాబితా ఎందుకు కీలకం?భారతదేశంలో ప్రజాస్వామ్య హృదయాన్ని పదిలపరచేది ఓటు హక్కేనని, దాన్ని వినియోగించుకోవడంలోని ప్రాధాన్యాన్ని వివరిస్తూ గతంలో కొన్ని తీర్పులు వెలువడ్డాయి. అయితే, ఓటు హక్కు చట్ట పరమైన హక్కుగానే మిగిలిపోయింది. దాని అస్తిత్వం ఒక ప్రత్యేక శాసనంతో ముడిపడి ఉంది. దానివల్ల వచ్చిన చిక్కేమిటంటే, ఆ హక్కు విషయంలో జోక్యం చేసుకోవచ్చు లేదా అది కొన్ని షరతులకు లోబడి ఉండేటట్లు చేయవచ్చు. నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారికి మాత్రమే ఓటు హక్కు కల్పించడం జరుగుతుందని 1951 నాటి ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 62వ సెక్షన్ పేర్కోంటోంది. ఫలితంగా, అర్హులైన ఓటర్లను గుర్తించడంలో ఓటర్ల జాబితాలను రూపొందించడం లేదా సవరించడం ముఖ్యమైన ప్రక్రియగా మారింది. గడువు ముగిసిన తర్వాత ఓటర్ల జాబితాలను సవరించడానికి అనుమతించబోమని ఒకసారి బిహార్ విషయంలోనే బైద్యనాథ్ పంజియార్ వర్సెస్ సీతారామ్ మహతో (1969) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.నమోదుకు కడపటి తేదీ ముగిసిన తర్వాత, ఓటర్ల జాబితా లకు సవరణ తేవడం, చేర్చడం లేదా తొలగించడం, ఒకచోటు నుంచి ఇంకో చోటుకు మార్చడం చేయకుండా 1960 నాటి నిబంధనలు నివారిస్తున్నాయి. జాబితాల సవరణపై స్టే విధించడానికి సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించడం బట్టి, ప్రస్తుత కేసులో పిటిషనర్లకు అనుకూలంగా ఫలితం వస్తుందని ఆశించడానికి అటువంటి పూర్వ ప్రమాణాలు, నిబంధనలు స్ఫూర్తినిచ్చేవిగా లేవు. పైగా, సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రెండు కారణాల రీత్యా తోసిపుచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకటి– అటువంటి కేసులను సమీక్షించడానికి సుప్రీంకోర్టుకు ఉన్న పరిధులు పరిమితం. రెండు– ఎన్నికలను జాప్యం చేసేందుకే అలాంటి కేసులు పెట్టే ఎత్తుగడ అనుసరిస్తూ ఉంటారని సుప్రీంకోర్టుకు ఎప్పుడూ ఒక సందేహం ఉంటుంది. ఫిర్యాదులు చేయడం సాధ్యమేనా?ఫిర్యాదులు చేసేందుకు లేదా సమస్యలు పరిష్కరించాలని కోరేందుకు వీలుగా ఒక ఆంతరంగిక సమీక్షా యంత్రాంగాన్ని 1950 నాటి చట్టం సమకూరుస్తోంది. ఎన్నికల అధికారులపై ఎవరైనా అభ్యంతరాలు లేవనెత్తవచ్చు. తదుపరి ఆదేశాలు జారీ చేయవలసిందిగా కమిషన్ను కోరవచ్చు. కోర్టులను ఆశ్రయించడానికి ముందు ఆ మార్గాలను అనుసరించవలసిందిగా కోర్టు గతంలో పలుమార్లు స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్కు సంబంధించి ఎన్నికల జాబితాలను రూపొందించడం, మార్పు చేర్పులు చేయడంలో అవకతవకలు జరిగాయని, జోక్యం చేసుకోవలసిందని కోరుతూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం (1996)పై అనురాగ్ నారాయణ్ సింగ్ పెట్టిన కేసులో తలదూర్చేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బిహార్ సవరణ ప్రక్రియలోని న్యాయ బద్ధతను విశ్లేషించేటపుడు కోర్టు ఈసారి కూడా అదే రీతిలో, ఫిర్యాదు దారులందరినీ ఆ యా చట్టపరమైన ప్రక్రియల వైపు మళ్ళవలసిందిగా సూచించి చేతులు దులుపుకోవచ్చు. ఈ ఆంతరంగిక పరిష్కార యంత్రాంగాలలో వేళ్ళూనుకు పోయిన సమస్యలు చాలా ఉన్నాయని గతంలో వచ్చిన కేసులు చెబు తున్నాయి. ఫిర్యాదులతో వెళ్ళడం అధికారులకు రుచించకపోవడం వల్ల, వారు తమ అభ్యంతరాలను చెవికెక్కించుకున్నది లేదనికొందరు వాపోయిన సందర్భాలున్నాయి. పైగా, మురికివాడనివాసుల వంటి బలహీన వర్గాల పౌరులలో కొన్ని వర్గాలకు ఈ ప్రక్రియ అందని మావిపండుగానే ఉంది. ఓటరుగా అనర్హుడవని వచ్చిన నోటీసులను చదువు సంధ్యలు లేనివారు అర్థం చేసుకోగలరా? ఎన్నికల అధికారి ముందుకు వెళ్ళడం కోసమని దినసరి వేతన కార్మికుడు ఒక రోజు పనిని వదులు కోగలడా? న్యాయ పరిరక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత బిహార్ ‘సర్’ కేసులో సుప్రీంకోర్టు గణనీయంగా కల్పించుకుని సరైన తీర్పరిగా వ్యవహరించవలసి ఉంది. ఆలస్యం కాకూడదనే ఉద్దేశంతో...లక్ష్మీ చంద్రసేన్ వర్సెస్ ఏ.కె.ఎం. హసన్ (1985) కేసులో ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించడానికి సుప్రీంకోర్టు వెనుకాడింది. అది ఎన్నికలపై న్యాయవ్యవస్థ అవాంఛనీయ జోక్యానికి కార ణమవుతుందనీ, ఒక్కోసారి ఎన్నికల నిరవధిక వాయిదాకు దారి తీస్తుందనీ కోర్టు కలవరపడింది. ఎన్నికలు ఎంత ఎక్కువగా అనివా ర్యమైతే, దానిలో జోక్యం చేసుకునేందుకు కోర్టు అంత ఎక్కువగా విముఖత చూపుతుందన్న అప్రకటిత సూత్రం ఒకటి ఉంది. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, అక్రమాలు చోటుచేసుకుంటే మాత్రం, అది మొత్తం ఎన్నికలను విషపూరితం చేసే అవకాశం ఉంటుంది కనుక కోర్టు ఆ బాధ్యతను భుజాలకు ఎత్తుకుంటుంది. దాన్ని పరిష్క రించేందుకు తదనంతరం, కోర్టు ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ను ఏర్పాటు చేయవచ్చు. అసెంబ్లీ ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు అవుతుందనే సాకుతో బిహార్ విషయంలో తలదూర్చేందుకు కోర్టు మొదట తిరస్కరించవచ్చు. ఓటర్ల జాబితాల సవరణ అక్రమమని ఒకవేళ కోర్టు భావించినా కూడా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడం కానీ, అనర్హులుగా చేసే విధానాన్ని నివారించడం కానీ చేయకపోవచ్చు. భారతీయ ప్రజాస్వామ్యానికి కించిత్తు హాని జరుగుతుందని తలచినా అప్రమ త్తంగా ఉండే కాపలాదారు పాత్రనే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో నిర్వహిస్తూ వచ్చింది. ఓటు వేసేందుకు ప్రజలకు ఉన్న హక్కు ప్రజా స్వామ్యానికి ప్రాథమిక పునాది కనుక ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను సుప్రీం కోర్టు చేపట్టడం ఇప్పుడు చాలా ముఖ్యం.-వ్యాసకర్త ‘విధి సెంటర్ ఫర్ లీగల్ స్టడీస్’ రిసెర్చ్ ఫెలో(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)-అంశుల్ డాల్మియా -
భారీగా ఓట్లను తొలగిస్తే మేం జోక్యం చేసుకుంటాం
న్యూఢిల్లీ: బిహార్లో ఓటర్ల జాబితాలో సమూల ప్రక్షాళన ధ్యేయంగా జరుగుతున్న ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భారీ స్థాయిలో ఓట్లను తొలగిస్తే మాత్రం తాము కచి్చతంగా జోక్యంచేసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఓటర్ల గుర్తింపును తనిఖీచేసే ప్రక్రియలో ఆధార్ కార్డ్, ఓటర్ కార్డులను చేర్చాలన్న పిటిషన్పై మంగళవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్య బాగీ్చల సుప్రీంకోర్టు ధర్మాసనం వాదోపవాదనలను ఆలకించింది. చట్టప్రకారం ఓటర్ల జాబితాలో సవరణలు, మార్పులు, చేర్పులు చేసే అసాధారణ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పునరుద్ఘాటించింది. ‘‘తమకు ఇప్పటికే ఓటు ఉందని తెలియజేస్తూ ఎనుమరేషన్ దరఖాస్తును 65 లక్షల మంది సమరి్పంచలేదు. అంతమాత్రం చేత వీళ్లందరి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగిస్తారా? వీళ్లంతా ఎవరో ఈసీకి తెలియదా?’’ అని పిటిషనర్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్సిబల్ వాదించారు. దీంతో ధర్మాసనం జోక్యంచేసుకుంది. ‘‘ చట్టప్రకారం చర్యలు తీసుకునే అధికారం ఈసీకి ఉంది. ఓటరు ముసాయిదా జాబితాలో ఏవైనా తప్పులుంటే మా దృష్టికి తీసుకుని రండి. ముసాయిదాలో పేర్లు లేకపోవడం కారణంగా ఓట్లను కోల్పోతున్న ఒక 15 మందిని తీసుకొచ్చి మా ముందు నిలబెట్టండి. దరఖాస్తు ఇవ్వనంత మాత్రాన చనిపోయారని ఆ జాబితా నుంచి ఎవరి పేర్లయితే తీసేశారో వాళ్ల వివరాలు మాకు ఇవ్వండి. అలాగే దరఖాస్తు ఇవ్వని కారణంగా జాబితాలో పేరు గల్లంతైన వారి వివరాలూ సమర్పించండి’’ అని సిబల్కు ధర్మాసనం సూచించింది. -
భూమ్మీద దేన్నైనా ఫోర్జరీ చేస్తారు కదా?: ఈసీకి ‘సుప్రీం’ ప్రశ్న
బీహార్ ఓటరు జాబితా సవరణలో.. ఆధార్ కార్డుకు పౌరసత్వ గుర్తింపుకార్డుల జాబితా నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరోసారి తీవ్రంగా పరిగణించింది. ఆధార్తో పాటు ఓటర్ ఐడీ ఎలక్టోరల్ ఫొటో ఐడెంటిటీ కార్డు(EPIC)ని చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్ల కింద పరిగణించాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘానికి స్పష్టం చేసింది.బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్లో భాగంగా ఆధార్ను గుర్తింపుకార్డుగా ఈసీ పరిగణించడం లేదు. తద్వారా ఓట్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ వ్యవహారంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత ధర్మాసనం ఈసీని ఉద్దేశించి కీలక వ్యాఖ్య చేసింది. ‘‘భూమ్మీద దేనినైనా ఫోర్జరీ చేస్తారు కదా?’’ అని కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరాలపై సూటిగా ప్రశ్నను సంధించింది. ఈ క్రమంలో..ఆధార్ను తిరస్కరిస్తూ.. బీహార్ ఓటర్ల రివిజన్ ప్రక్రియలో ఓట్లను తొలగిస్తూ వస్తోంది ఎన్నికల సంఘం. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. జులై 10వ తేదీ నాటి విచారణ సందర్భంగా బీహార్ ఓటర్ లిస్ట్ రివిజన్ సబబేనన్న సుప్రీం ధర్మాసనం.. అదే సమయంలో ఆధార్, ఎపిక్, రేషన్ కార్డులనూ పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని ఈసీకి స్పష్టం చేసింది. అయితే.. ఇవాళ్టి వాదనల సందర్భంగా ఆధార్ను ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్గా పరిగణించడం కుదరదని, రేషన్ కార్డులు నకిలీవి సృష్టించే అవకాశం లేకపోలేదని.. కాబట్టి వాటి మీద ఆధారపడలేమని ఈసీ వాదనలు వినిపించింది. అలాగే ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్ను కేవలం ఐడెంటిటీ ఫ్రూఫ్గా మాత్రమే పరిగణిస్తామని పేర్కొంది.దీనిపై సుప్రీం కోర్టు స్పందించింది. ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్ను ఫోర్జరీ చేయలేరో చెప్పాలంటూ ఈసీని ప్రశ్నించింది. ఓటర్ నమోదు సమయంలో ఆధార్ ప్రస్తావన ఉంటున్నప్పటికీ.. ఓటరు జాబితా గుర్తింపు కోసం ఎందుకు పరిగణించడం లేదని మరోసారి నిలదీసింది. ఈ క్రమంలో.. ఆధార్, ఎపిక్ని బీహార్ ఓటర్ రోల్ రివిజిన్కు చేర్చాలంటూ ఆదేశించింది.ఎన్నికల సంఘం (EC) జాబితాలోని ఏదీ నిర్ణయాత్మక పత్రం కాదు కదా. ఆధార్, ఎపిక్ విషయాల్లో మీరు ఎత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటే గనుక రేపు మీరు అంగీకరించిన ఇతర పత్రాలు కూడా ఫోర్జరీ జరిగితే.. దాన్ని నిరోధించే వ్యవస్థ ఎక్కడ? అని ఈసీకి ప్రశ్న ఎదురైంది. అదే సమయంలో.. ఆగస్టు 1వ తేదీన ఈసీ ప్రచురించబోయే బీహార్ ఓటర్ల డ్రాఫ్ట్ లిస్ట్పై మధ్యంతర స్టే విధించాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకర్నారాయణన్ కోరారు. అయితే.. రేపటి విచారణలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని బెంచ్ స్పష్టం చేసింది. -
ఐదోరోజూ అదే తీరు
న్యూఢిల్లీ: పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో గందరగోళానికి ఇంకా తెరపడలేదు. విపక్ష సభ్యు లు ఆందోళనలు, నిరసనలు, నినాదాల కారణంగా వరుసగా ఐదో రోజు శుక్రవారం సైతం ఉభయ సభలు స్తంభించాయి. పలుమార్లు వాయిదా పడ్డాయి. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల సంఘం ప్రారంభించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై విపక్షాలు మండిపడ్డాయి. దీనిపై పార్లమెంట్లో వెంటనే చర్చించాలని, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశాయి. నినాదాలతో హోరెత్తించాయి. ప్రతిపక్షాల ఆగ్రహావేశాల వల్ల పరిస్థితి చెయ్యి దాటిపోతుండడంతో లోక్సభ, రాజ్యసభను సోమవారానికి వాయిదా వేస్తుతన్నట్లు సభాపతులు ప్రకటించారు. చెప్పుకోదగ్గ కార్యకలాపాలేవీ జరగకుండానే వర్షాకాల సమావేశాల్లో తొలివారం ముగిసిపోవడం గమనార్హం. లోక్సభలో నినాదాల హోరు లోక్సభ శుక్రవారం ఉదయం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీనిపై చర్చకు విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. చేసేది లేక స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. విపక్ష ఎంపీలు వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ఓటర్ల జాబితా సవరణపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విపక్షాలు సహకరించాలని స్పీకర్ స్థానంలో ఉన్న జగదాంబికా పాల్ కోరారు. అయినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. ఇప్పడే చర్చ ప్రారంభించాలని తేల్చిచెప్పారు. వారిపై జగదాంబికా పాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సి సభలో ఈ అలజడి ఏమిటని ప్రశ్నించారు. దీనివల్ల ఎవరికీ ఉపయోగం ఉండదని అన్నారు. సభ వాయిదా పడేలా చేయడం గొప్ప విషయం కాదని హితవు పలికారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగకపోతే దేశమే నష్టపోతుందని చెప్పారు. చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, సహకరించాలని ప్రతిపక్షాలను కోరారు. గోవాలో ఎస్టీలకు అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఉద్దేశించిన కీలకమైన బిల్లుపై చర్చిద్దామని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ చెప్పారు. అయినా విపక్షాల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జగదాంబికా పాల్ ప్రకటించారు. ‘కార్గిల్ విజయ్ దివస్’ నేపథ్యంలో కార్గిల్ అమర వీరులకు లోక్సభలో నివాళులర్పించారు. ఎంపీలంతా కొంతసేపు మౌనం పాటించారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ పార్లమెంట్ ఎగువ సభలోనూ విపక్షాల ఆందోళన యథాతథంగా కొనసాగింది. వివిధ అంశాలపై రూల్ 267 కింద చర్చను కోరుతూ విపక్షాలు ఇచ్చిన 28 నోటీసులను తిరస్కరిస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చెప్పారు. బిహార్లో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అంశాన్ని ప్రతిపక్ష ఎంపీలు లేవనెత్తారు. దీనిపై సభలో తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ మొదలైన వెంటనే నినాదాలు మిన్నంటడడంతో రఘువంశ్ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్పై బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ సమాధానం ఇస్తుండగా ప్రతిపక్ష ఎంపీలు బిగ్గరగా కేకలు వేశారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణను ఆపాలని డిమాండ్ చేశారు. ‘ఓటు చోరీ బంద్ కరో’ అంటూ నినదించారు. కొందరు ఎంపీలు వెల్లోకి ప్రవేశించారు. వెనక్కి వెళ్లిపోవాలని, సభకు సహకరించాలని సభాపతి స్థానంలో ఉన్న బీజేపీ ఎంపీ ఘన్శ్యామ్ తివారీ పదేపదే విజ్ఞప్తి చేసినా వారు పట్టించుకోలేదు. దాంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ఘన్శ్యామ్ తివారీ ప్రకటించారు. కమల్ హాసన్ ప్రమాణం ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం(ఎంఎన్పీ) పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు డీఎంకే నాయకులు రాజాత్తి, ఎస్.ఆర్.శివలింగం, పి.విల్సన్ సైతం ఎగువ సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. విపక్షాల నిరసన బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్)ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు పా ర్లమెంట్ ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించారు. మకరద్వారం మెట్లపై వినూ త్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ అని రాసి ఉ న్న పత్రాలను చించివేసి, చెత్తకుండీలో విసి రేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నా రు. ఎస్ఐఆర్పై పార్లమెంట్లో చర్చించాలని తేల్చిచెప్పారు. సభకు సహకరించడానికి విపక్షాల అంగీకారం నిరసనలు, నినాదాలు పక్కనపెట్టి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇకపై సజావుగా సాగేందుకు సహకరిస్తామని ప్రతిపక్ష నేతలు చెప్పారు. వర్షాకాల సమావేశాల్లో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం అన్ని పార్టీల సీనియర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సభా కార్యకలాపాలకు సహకరించాలని కోరగా, ప్రతిపక్ష నాయకులు అందుకు అంగీకరించినట్లు పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. సోమవారం నుంచి నిర్మాణాత్మక చర్చలు సాగిద్దామని స్పీకర్ సూచించారు. ప్రజలకు మేలు కలిగేలా సభలో అర్థవంతమైన చర్చలు జరగాలన్నదే తన ఉద్దేశమని ఆయన వివరించారు. ఆపరేషన్ సిందూర్పై సోమవారం పార్లమెంట్లో చర్చ ప్రారంభం కానుంది. -
బిహార్ ఓటరు జాబితా నుంచి 52 లక్షల పేర్లు తొలగింపు: ఈసీ
న్యూఢిల్లీ: బిహార్లో చేపట్టిన ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)లో ఇప్ప టి వరకు దాదాపు 52 లక్షల మంది పేర్లను తొలగించినట్లు మంగళవారం ఎన్నికల కమిషన్(ఈసీ) తెలిపింది.ఇందులో 18 లక్షల మంది ఓటర్లు చనిపోగా, 26 లక్షలు మంది వేరే నియోజకవర్గాల్లో ఉంటున్నవారు, 7 లక్షల మంది ఒకటికి మించి ప్రాంతాల్లో నమోదైన వారని వివరించింది. ‘ఎస్ఐఆర్లో భాగంగా అర్హులైన ఓటర్లందరి పేర్లను ఆగస్ట్ ఒకటో తేదీన విడుదల చేసే ముసాయిదా జాబితాలో చేర్చేందుకు ప్రయ త్నాలు ముమ్మరం చేశామని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. -
హాస్యాస్పద ఓటరు ధ్రువీకరణ
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ కోసం జూన్ 24న ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తు న్నాయి. కలవరపరచే పలు ప్రశ్నలను రేకెత్తిస్తున్నాయి. ఈ సవరణ ఫలితంగా కోట్ల మంది తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉండదా? వీరిలో అత్యధికులు పేదలు, అణగారిన వర్గాలే ఉంటారా? అసలు ఇప్పటికిప్పుడు ఈ సవరణ కార్యక్రమం చేపట్టడం అవసరమా? ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, ఏ సమయంలోనైనా, ఏ తరహాలోనైనా ఓటర్ల జాబితాల్లో ప్రత్యేక సవరణ చేసే అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. నాకు ఆ విషయం తెలుసు. అయితే, కేవలం నాలుగు నెలల్లో బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసి ఉన్న తరుణంలో ఈ ఆదేశం ఎంతవరకు సబబు? 2003లో, అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల ముందుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్– సర్) జరిగింది. అది నాలుగు నెలల ముందు కాదన్నది మనం గమనించవలసిన విషయం.ఆధారాలు ఎలా తెస్తారు?రెండోది, ఈ ‘సర్’ను జూన్ 25న ప్రారంభించి, జూలై 25 నాటికి పూర్తి చేయాలి. అంటే కేవలం ఒక నెల రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది. 8 కోట్ల మంది ఓటర్లను ప్రభావితం చేసే ఈ కార్య క్రమాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయడం అసలు సాధ్యపడే పనేనా?ఇవి సందర్భానికి సమయానికి సంబంధించిన ప్రశ్నలు. అయితే, ఇక్కడ ప్రశ్నార్థకం సమయం ఒక్కటే కాదు; ప్రక్రియ మీదా నీలినీడలు ముసిరాయి. ఎలాగో తెలుసుకోడానికి ఉత్తర్వుల వివ రాల్లోకి వెళ్దాం. కమిషన్ ఆదేశాల ప్రకారం, 1987 జూలైకి ముందు జన్మించిన వ్యక్తులు తమ పుట్టుకకు, పుట్టిన ప్రదేశానికి సంబంధించిన ఆధారాలు సమర్పించి తీరాలి. అయితే, చాలా మందికి జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవు. వీరిలో ఎంతో మంది ఆసుపత్రుల్లో కాకుండా ఇళ్లలోనే జన్మించారు.2000 సంవత్సరం వరకూ కూడా బిహార్లో కేవలం 3.7 శాతం జననాలే అధికారికంగా నమోదు అయ్యాయి. 2007 నాటికి ఇది 25 శాతానికి పెరిగింది. ఈ సంవత్సరంలో పుట్టిన వారికి 2025లో 18 ఏళ్లు నిండుతాయి. అంటే ఏమిటి? వీరిలో గణనీయ సంఖ్యాకుల వద్ద జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. స్వయంగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా వెల్లడించిన గణాంకాలే ఈ వాస్తవాన్ని వెల్లడిస్తున్నాయి. జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారు 11 ఇతర ఆధారాల్లో ఏదో ఒకటి చూపించగలిగితే చాలని కమిషన్ చెబుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలు జారీ చేసే గుర్తింపు కార్డు, పాస్పోర్టు, మెట్రిక్యులేషన్ సర్టిఫికెట్, అటవీ హక్కు సర్టిఫికెట్ వంటివి వీటిలో ఉన్నాయి. కానీ, సాధారణంగా అందరి దగ్గరా ఉండే ఆధార్, రేషన్ కార్డులను సుప్రీంకోర్టు సూచించినప్పటికీ వీటినుంచి మినహాయించారు. కమిషన్ పేర్కొన్న 11 పత్రాల్లో ఏదో ఒకటి ఎంత మంది బిహారీల వద్ద ఉండి ఉంటుంది? ఆ ఏదో ఒక పత్రంలో జన్మస్థలం నమోదై ఉంటుందా అనేది మరో ముఖ్యమైన ప్రశ్న. చాలా వాటిలో ఉండదు. దళితులు, ముస్లింలు, అత్యంత వెనుకబడిన కులాలు, ఆది వాసీలు వంటి అట్టడుగు వర్గాల బీద ప్రజలకు ఈ ధ్రువీకరణ పత్రాలు ఉండవు. కాబట్టి వారి ఓటు హక్కు రద్దవుతుంది. ఇది అన్యాయం కాదా?కమిషన్ మౌనంమరో అడుగు ముందుకు వెళ్లి పరిశీలిద్దాం. 1987 జూలై తర్వాతి నుంచి 2004 డిసెంబరు వరకు గడచిన కాలంలో పుట్టినవారు జనన, జనన ప్రదేశ ఆధారాలు మాత్రమే ఇస్తే సరిపోదు. తమ తల్లిదండ్రుల్లో ఒకరి జనన ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక 2004 డిసెంబరు తర్వాత పుట్టిన వారైతే తల్లిదండ్రుల ఇద్దరి వివరాలు ఆధారాలతో సహా సమర్పించాలి. ఎంతమంది ఇలా చేయగలరు? ఉదాహరణకు, నా తల్లిదండ్రుల జనన ధ్రువపత్రాలు నా వద్ద లేవు. నేను వాటిని సమర్పించలేను. చాలామంది బిహారీల వద్ద వారి తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు ఉండవని నేను కచ్చితంగా చెప్పగలను. కమిషన్ ఆ తర్వాత చెప్పిన దాని ప్రకారం, బిహార్లో 2003 ‘సర్’ జరిగిన తర్వాత 7.9 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 4.96 కోట్ల మంది ఓటర్లు ఎలాంటి డాక్యుమెంట్లూ సమర్పించాల్సిన అవసరం లేదు. మరి మిగిలిన 3 కోట్ల మంది మాటేమిటి? హక్కు ఉన్నప్పటికీ 2003 ఎస్ఐఆర్లో నమోదు కాని వారి సంగతేమిటి? ఈ ప్రశ్నలకు కమిషన్ నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.అక్రమం... హాస్యాస్పదంఇవి ఇప్పటికే వేధిస్తున్న ప్రశ్నలు కాగా, సవరణ ప్రక్రియముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని సమస్యలు ఎదురవుతాయి. కమిషన్ కోరుతున్న అన్ని వివరాలూ నెల రోజుల్లోనే సమకూర్చాలి. అలా చేయలేని వారి పేర్లను ఓటర్ల జాబితాల నుంచి తొలగిస్తారు. అసలే నడి వర్షాకాలం, పైగా ఖరీఫ్ సీజన్ ముమ్మరంగా సాగుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో పనులు మానుకుని ఎంతమంది ఈ అదనపు బరువు నెత్తికి ఎత్తుకుంటారు? ఇక్కడితో అయిపోలేదు. బిహార్ జనాభాలో 20 శాతం మంది వలసలు పోయే కార్మికులు. ఈ ప్రత్యేక సవరణ జరిగేటప్పుడు వారు స్థానికంగా అందుబాటులో ఉండరు. అలాంటి వారి విషయంలో ఏం జరుగుతుంది? ఓటర్ల జాబితాల నుంచి వారి పేర్లు గల్లంతయ్యే ప్రమాదం లేదా?చివరిగా, మరో అంశం ప్రస్తావించాలి. ఓటర్ల జాబితాల్లో ఇలా పేర్లు గల్లంతైన వారు పౌరులుగా కూడా గుర్తింపు కోల్పోయే ప్రమాదం లేదా? ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్’ (ఏడీఆర్) వ్యవస్థాపక ట్రస్టీ అయిన జగదీప్ ఛోకర్ అందుకే ఈ ఎస్ఐఆర్ ‘‘అక్రమం, హాస్యాస్పదం, అనవసరం’’ అంటున్నారు. నిర్మొహమాటంగా చెబుతున్నాను, నేను ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తాను. మరి మీ సంగతేమిటి?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
Bihar: ఓటరు జాబితాలో అత్యధిక విదేశీయులు.. ఈసీఐ అధికారులు షాక్
పట్నా: బీహార్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఎన్నికల కమిషన్ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా ఓటర్ల జాబితాను సవరిస్తున్న అధికారులకు పలు కంగుతినే అంశాలు కనిపించాయి. సెప్టెంబర్ 30న ప్రచురించే తుది ఓటర్ల జాబితాలో అక్రమ వలసదారుల పేర్లు కనిపించవని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు.బీహార్లో ఓటర్ల జాబితాపై ఇంటెన్సివ్ సమీక్ష కోసం ఇంటింటికీ వెళ్లి నిర్వహించిన సర్వేలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్కు చెందినవారు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నట్లు తేలిందని భారత ఎన్నికల సంఘం(ఈసీఐ)అధికారులు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మేజిస్ట్రేట్లు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీలలో ఇంటింటికీ వెళ్లి బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ)చేస్తున్న పనిని ధృవీకరిస్తున్నారు. బూత్-స్థాయి అధికారుల ఇంటింటి సందర్శనల సమయంలో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన ఓటర్లను కనుగొన్నారని ఈసీఐ అధికారులు తెలిపారు.ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరు ఓటర్లుగా మారడంపై చర్చ మొదలయ్యింది. కాగా అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. -
నస్ బందీ, నోట్ బందీ దారిలో ఓట్ బందీ!
ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ల యిన సందర్భంగా సంజయ్ గాంధీ ప్రోద్బలంతో 1975– 77ల్లో జరిగిన నస్ బందీ (బల వంతపు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స) గురించి చాలామంది తలచుకున్నారు. అలాగే, తొమ్మి దేళ్ల కిందటి నోట్ బందీ (పెద్ద నోట్ల రద్దు) పర్యవసానాలు అందరికీ స్వానుభవమే. సరిగ్గా ఎమర్జెన్సీని గుర్తు చేసుకునే రోజు (జూన్ 25)కు ఒక రోజు ముందు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాన్ని ఇప్పుడు ప్రతిపక్షాలు ‘వోట్ బందీ’ అంటున్నాయి. అది గత జూన్ 24న ఎన్నికల సంఘం బిహార్లో ప్రత్యేక తీవ్రతర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్– సర్) కోసం ఇచ్చిన ఆదేశం. బిహార్లోని 7,80,22,933 మంది వోటర్లలో 2003లో ఉండిన నాలుగు కోట్ల మంది పోగా, మిగిలిన వోటర్లలో ప్రతి ఒక్కరినీ కలిసి అర్హులా అనర్హులా ధ్రువీకరించి, కొత్త వోటర్ల జాబితా తయారు చేయాలనేది ఈ ఆదేశం.ప్రస్తుతం ఉన్న వోటర్ల జాబితా తప్పుల తడక అనీ, అందులో పేర్లన్నీ అనుమానాస్పదమైనవనీ ఎన్ని కల సంఘం అంటున్నది. విపరీతమైన వర్షాలతో, రాష్ట్రంలో 70 శాతం భూభాగం వరదల్లో చిక్కుకుని ఉన్న ప్రస్తుత స్థితిలో ఈ ఇంటింటి పర్యటన సాధ్యమా అనుమానమే.2003 జాబితా తర్వాత చేరిన వోటర్లందరూ బర్త్ సర్టిఫికేట్, ప్రభుత్వోద్యోగి ఐడెంటిటీ కార్డ్, పెన్షన్ కార్డ్, పాస్ పోర్ట్, విద్యార్హతల సర్టిఫికేట్, నివాస ధ్రువీకరణ పత్రం, అటవీ హక్కుల సర్టిఫికేట్, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర రిజిస్టర్, స్థానిక అధికారులు తయారు చేసిన కుటుంబ పట్టిక, ప్రభుత్వం భూమి పంపిణీ చేసి ఉంటే ఆ పత్రం వంటి పదకొండు పత్రాలలో ఏదైనా ఒకటి చూపితేనే అర్హుడైన వోటర్గా లెక్కి స్తారు. ఈ అర్హతా పత్రాలలో ఆశ్చర్యకరంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, గ్రామీణ ఉపాధి హామీ పథకపు జాబ్ కార్డ్ లేవు. చివరికి ఎన్నికల కమిషన్ తానే స్వయంగా జారీ చేసిన వోటర్ కార్డ్ కూడా లేదు. బిహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రంలో ఆ పదకొండు పత్రాలలో ఏదో ఒకటి కన్నా వోటర్ కార్డ్, జాబ్ కార్డ్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉండే అవకాశమే ఎక్కువ. కొన్ని రోజులు గడిచాక, ‘అర్హత నిర్ధారణను బూత్ లెవల్ ఆఫీసర్ల విచక్షణకు వదులుతున్నాం’ అని ఎన్నికల సంఘం అంది. అంటే ఒక వ్యక్తి వోటరా కాదా అన్నది స్థానిక అధికారి ఇష్టాయిష్టాల మీద ఆధారపడుతుందన్నమాట!ఈ కార్యక్రమం అనుమానాస్పదంగా ఉన్నదనీ, దీన్ని ఆపాలనీ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను కలిసి ప్రతిపక్షాలు విజ్ఞప్తి చేసినప్పుడు ఆయన స్వయంగా బిహార్ వోటర్ల జాబితా నుంచి కనీసం ఇరవై శాతం పేర్లు తొలగించవలసి ఉంటుందని అన్నారు. అంటే ఒక కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వాళ్లలో కొందరు నిజంగానే అనర్హులు కావచ్చు గాని, ఈ పేరుతో అధి కార పక్షం చాలామంది పేర్లు తొలగించదలచుకున్న దన్న అనుమానాలు విస్తారంగా ఉన్నాయి. 2003లో వోటర్ల జాబితా సవరించడానికి 700 రోజులు పట్టింది. ఇప్పుడు నిర్దేశించిన నెల రోజుల్లో శిక్షణ, మెటీరియల్ తరలింపునకు పట్టిన కాలాన్ని మినహాయిస్తే 19 రోజుల్లో కార్యక్రమాన్ని ముగించాల్సి ఉంది. అంటే తూతూమంత్రంగా ముగిస్తారన్నమాట. ఎన్నికల సంఘం ప్రకటనలను బట్టి మొత్తం కోటీ అరవై లక్షల వోటర్ల అర్హత ప్రశ్నార్థకమయింది. అసలు వోటర్ల జాబితాలు ఎప్పటికప్పుడు పునర్నవీకరణ చెందుతూనే ఉంటాయి. 2003 నుంచి ఇప్పటివరకూ జరిగిన ఐదు లోకసభ ఎన్నికలలో, ఐదు శాసనసభ ఎన్నికలలో వోటు వేసిన వారందరినీ ఇప్పుడు అనర్హు లుగా, అర్హత రుజువు చేసుకోవలసినవారిగా ఎన్నికల సంఘం ప్రకటిస్తున్నది. అంటే ఆ ఐదు లోకసభలూ, శాసనసభలూ ఈ అనర్హులైన వోటర్ల వల్ల ఏర్పడ్డాయని ఎన్నికల సంఘం భావిస్తున్నదా? అలా అయితే వాటి సాధికారత, చట్టబద్ధత ఎంత?వోటర్ల జాబితాల సవరణ ఎప్పటికప్పుడు చేయ వలసిన పనే గనుక ఎన్నికల నిబంధనలు అది ఎట్లా చేయాలో నిర్దేశించాయి. ఆ నిబంధనల్లో ఇంటెన్సివ్ రివి జన్ ఉంది గాని ఇప్పుడు ప్రకటించిన స్పెషల్ ఇంటె న్సివ్ రివిజన్ లేదు. అటువంటి పని చేసే అధికారం చట్ట ప్రకారం ఎన్నికల సంఘానికి ఉందా అనే ప్రశ్నకు జవాబు లేదు. బిహార్ నుంచి ప్రతి జూన్–జూలై–ఆగస్ట్ నెలల్లో కనీసం 21 శాతం వోటర్లు ఇతర రాష్ట్రాలకు పనుల కోసం వలస వెళ్తారని ఎన్నికల సంఘమే ఇది వరకు అంచనా వేసింది. మరి సరిగ్గా అదే సమయంలో ప్రతి వోటర్నూ కలిసి జాబితాను సంస్కరించాలనడంలో ఔచిత్యం ఏమిటి? ఇంకా విచిత్రం, ఇదే ఎన్నికలసంఘం గత సంవత్సరం జూన్లో వోటర్ల జాబితాను సంస్కరించమని బిహార్ ఎన్నికల అధికారులను ఆదేశించింది. వారు ఆరు నెలల పాటు శ్రమించి 2025 జన వరిలో జాబితా ప్రకటించారు. దాన్ని జూన్ 24 వరకూ ఎన్నికల సంఘం కూడా ఆమోదిస్తూ వచ్చింది.చదవండి: మారక నిల్వలు కరిగిస్తేనే కదలిక!ఇప్పుడు హఠాత్తుగా బిహార్ ఎన్నికల్లో విజయం సాధించాలంటే, ప్రతిపక్షానికి వోటు వేస్తారనే అను మానం ఉన్న లక్షలాది వోటర్లను అనర్హులుగా మార్చ డమే ఏకైక మార్గంగా ఏలినవారు భావించినట్టున్నారు. అందుకు అనుగుణంగా ఎన్నికల సంఘం ఈ వోట్ బందీ ప్రకటించినట్టుంది. నస్ బందీ తలపెట్టినవారు 1977లో ఓటమి పాలయ్యారు. 2016 నోట్ బందీ ప్రకటిత లక్ష్యాలు సాధించలేక బొక్కబోర్లా పడింది. ఇప్పుడు 2025 వోట్ బందీకి ఏమవుతుంది?- ఎన్. వేణుగోపాల్ ‘వీక్షణం’ సంపాదకుడు -
‘ఎన్నికల జాబితా’పై సుప్రీంకు మొయిత్రా
కోల్కతా: బిహార్లోని యువ ఓటర్లకు ఓటు లేకుండా చేసేందుకే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)కు పూనుకుందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. బిహార్ తర్వాత ఈసీ తదుపరి లక్ష్యం 2026లో ఎన్నికలు జరిగే బెంగాల్ అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చర్యకు నిరసనగా ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లోని నిబంధనలు ప్రజా ప్రాతినిధ్య చట్టం–1950కి విరుద్ధంగా ఉన్నాయి మహువా పేర్కొన్నారు. వివిధ పార్టీల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నందున ఈసీ ఎస్ఐఆర్ను నిలిపివేయాలని సూచించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించినట్లు వివరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఆదేశాలను ఈసీ జారీ చేయకుండా చూడాలని కోరానన్నారు. 1987 జూలై 1–2004 డిసెంబర్ 2వ తేదీల మధ్య జని్మంచిన వారు ఈసీ చేపట్టిన ఎస్ఐఆర్ కారణంగా ఓటేసే హక్కుకు లక్షలాది మంది దూరమవుతారని ఆరోపించారు. బిహార్లో ఎస్ఐఆర్ను అమలు చేయాలంటూ ఈసీ జూన్ 24వ తేదీన ఆదేశాలు జారీ చేయడం తెల్సిందే. అనర్హులను జాబితా నుంచి తొలగించడం, అర్హులైన పౌరుల పేర్లు జాబితాలో ఉండేలా చూడటమే ఈ ఆదేశాల లక్ష్యమని ఈసీ అంటోంది. ఈసీ ఆదేశాలపై ఏడీఆర్, పీయూసీఎల్ వంటి పౌర సంఘాలు, కార్యకర్తలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అయితే, బిహార్లో ఎస్ఐఆర్ అమలుకు సంబంధించి తాము జారీ చేసిన ఆదేశాల్లో ఎలాంటి మార్పూ లేదని ఈసీ ఆదివారం స్పష్టం చేసింది. -
ఈసీ విశ్వసనీయతకు గొడ్డలిపెట్టు
భారతీయ ప్రజాస్వామ్యానికి దేశంలోని మరే ఇతర సంస్థ కన్నా కూడా ఎన్నికల కమిషనే (ఈసీ) ఎక్కువ నష్టం కలిగించింది. తెలిసో తెలియకనో వాటిల్లిన ఆ నష్టం వల్ల మొత్తం ఎన్నికల ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. పాలక పార్టీకి ప్రయోజనం చేకూర్చేందుకు ఎన్నికలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ఇపుడు ప్రజల మనసులలో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. దీనిలో ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎంతో నాకు తెలియదు. దానికి సంబంధించి నా వద్ద ఎలాంటి సమాచారం కూడా లేదు. కానీ, ఒక సంస్థగా దాని వ్యవహార శైలిపై మరింత స్పష్టీకరణ, మరింత నిజాయతీతో కూడిన జవాబులు అవసరం. ‘సీఎస్డీఎస్’ సర్వేలలో ఈసీ విశ్వసనీయత స్థిరంగా తగ్గుతూ రావడంలో ఆశ్చర్యపోవాల్సింది ఏముంది! తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకునేందుకు ఈసీ చేసుకున్నది కూడా ఏమీ లేదు. ఇప్పుడెందుకు సమీక్ష?బిహార్ శాసన సభ ఎన్నికల సందర్భంగా, ఆ రాష్ట్రంలోని ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సమీక్షించాలని ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. బిహార్ ఎన్నికలను మరో రెండు నెలల లోపలే ప్రకటించనున్నారని అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సమయంలో ఎన్నికల జాబితాను విస్తృతంగా సమీక్షించవలసిన అవసరం ఏమొచ్చింది? కడపటి సమీక్షను 2003లో నిర్వహించారు. అది పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్ళు పట్టింది. ఇపుడు ఈసీ ఆ పనిని రెండు నెలల్లో పూర్తి చేయాలని కోరుతోంది. ఇది వర్షాకాలం. బిహార్లో చాలా భాగం వరద తాకిడికి గురవడం కూడా సర్వ సాధారణం. దీంతో ఓటర్ల జాబితా సమీక్ష మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు అలా ఆదేశించడమే తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తోంది. దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రమైన బిహార్లో వనరులు అరకొరగా ఉన్నాయి. మౌలిక సదుపాయాలు దేశం మొత్తంమీద నాసిరకమైనవి.ఈ నేపథ్యంలో, ఓటర్ల జాబితాలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సవరించడం ఇంచుమించుగా అసాధ్యం. రాష్ట్రీయ జనతా దళ్, కాంగ్రెస్లతోపాటు ఇతర పార్టీలు కూడా ఈసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, పాలక పార్టీకి సాయపడేందుకే అది ఈ ప్రక్రియను చేపట్టిందని నిందించడంలో వింతేముంది?ఈ పార్టీలు కొన్ని సమంజసమైన ప్రశ్నలనే లేవనెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఓటర్ల జాబితా సంగ్రహ సవరణ జరిగినపుడు, మళ్ళీ ఈ తతంగం దేనికి? తప్పుడు ఓటర్ల జాబితాను ఆధారం చేసుకుని కడపటి పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని ఈసీ భావిస్తోందా? కొద్ది నెలల క్రితం నిర్వహించిన సంగ్రహ సవరణ లోపాలతో కూడుకుని ఉందనీ, వాటిని ఇపుడు సరిదిద్దవలసి ఉందనీ భావిస్తోందా? అని అవి ప్రశ్నలను సంధిస్తున్నాయి. అదే నిజమైతే, దేనిని ఆధారం చేసుకుని ఆ రకమైన నిర్ధారణకు వచ్చిందో ఈసీ మొత్తం దేశానికి చెప్పవలసిన అవసరం లేదా? ఏదైనా దర్యాప్తు జరిపారా? నివేదిక దేనినైనా రూపొందించారా? ఈ అంశాలపై ఎవరూ నోరు విప్పడం లేదు. ఆధార్ పనికిరాదా?ఓటర్ల జాబితాను ప్రత్యేకంగా నిశితంగా సవరిస్తామంటే ఏ పార్టీ అయినా వ్యతిరేకిస్తుందని నేను అనుకోను. క్రితంసారి 2003లో సవరించినపుడు, ఆ ప్రక్రియ సాధికారమైనదిగా ఉండేందుకు తగినంత సమయాన్ని ఇచ్చారు. ఈసారి కనిపిస్తున్నట్లుగా ఆదరాబాదరాగా ఎన్నడూ జాబితాలను సవరించిన దాఖలాలు లేవు. ఓటర్ల జాబితా (2003)కు ఎక్కని ప్రతి పౌరుడు/పౌరురాలు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని చెప్పడమే ప్రతిపక్ష నాయకుల మనసులలో తీవ్ర సందేహాలను రేకెత్తిస్తోంది. అలాగే, 1987 తర్వాత పుట్టినవారు వారి తల్లితండ్రుల బర్త్ సర్టిఫికెట్ను సమకూర్చాలని చెబుతున్నారు. అది, అందులోనూ బిహార్ వంటి రాష్ట్రంలో చాలా బృహత్తరమైన కార్యం. బిహార్లో అక్షరాస్యత అత్యల్పం. ప్రభుత్వ యంత్రాంగం అంతంత మాత్రంగా ఉన్న చోట, చాలా తక్కువ వ్యవధిలో అటువంటి సర్టిఫికెట్లను పొందడం కుదిరే పని కాదు. పరమ దారిద్య్రంలోనున్న సమాజంలోని బడుగు వర్గాలు ప్రభుత్వ కార్యాలయం గడప తొక్కేందుకే జంకుతాయి. అలాంటిది తమ పౌరసత్వాన్ని నిరూపించుకునేందుకు అవసరమైన పత్రాలను వారు సమకూర్చుకోగలరని ఊహించడం కూడా అసంబద్ధమే అవుతుంది. ఈ ప్రక్రియ మరింత సందేహాస్పదంగా మారడానికి మరో కారణం కూడా ఉంది. ప్రస్తుతం భారతదేశంలో ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి అత్యంత ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పరిణమించింది. ఈ ప్రక్రియకు ఆ కార్డు చెల్లదని చెబుతున్నారు. ‘ఎందుకని’ అనే దానికి వివరణ లేదు. నకిలీ ఆధార్ కార్డులను సృష్టించడం తేలిక కనుక, అది అధికారికమైన గుర్తింపు పత్రంగా గణనకు రాదని ఊహాగానాలు సాగుతున్నాయి. ఆ లెక్కన, ఇతర డాక్యుమెంట్లు మాత్రం నకిలీవి కావనే గ్యారంటీ ఏమైనా ఉందా? దీనిపై ఈసీ నోరు విప్పుతుందా?తటస్థ అంపైర్ అనుకోవచ్చా?ఈసీ అసాధారణమైన రీతిలో న్యాయబద్ధత తాలూకు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సమాన పోటీ అవకాశాలను కల్పించి, తటస్థ అంపైర్గా ఉండవలసిన ఈసీ భారతీయ జనతా పార్టీ ఆడించే బొమ్మగా మారిందనీ, దాని స్వతంత్రత తీవ్ర రాజీకి లోనవుతోందనీ రాహుల్ గాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ఈ అంశాన్ని మరింత జటిలం చేసింది. ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేసే ప్యానల్లో ప్రధాని, ప్రతిపక్ష నాయకునితోపాటు భారత ప్రధాన న్యాయమూర్తిని కూడా చేర్చాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, సీజేఐ స్థానాన్ని ప్రభుత్వం ఒక క్యాబినెట్ మంత్రితో భర్తీ చేసింది. స్వతంత్రంగా వ్యవహరించే ఈసీ రావడం ప్రభుత్వానికి ఇష్టం లేదేమోననే అభిప్రాయాన్ని అది కల్పించింది.మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య విపరీతంగా పెరగడం పైన, ఎన్నికల జాబితాలను ఇష్టానుసారం తారుమారు చేసేశారని ప్రశ్నలు రేకెత్తినపుడు, ఈసీ నుంచి విశ్వసనీయమైన వివరణ రాలేదు. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లుగా పోలింగ్ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీని ఇచ్చేందుకు కూడా ఈసీ తిరస్కరించింది. అందుకు అది సాంకేతిక కారణాన్ని సాకుగా చూపింది. వాస్తవానికి, ప్రభుత్వం నిబంధనను మార్పు చేసింది. వీడియో ఫుటేజీని 45 రోజులకు మించి అట్టేపెట్టకూడదని ఈసీ కూడా నిర్ణయించింది. అంతకు ముందు ఆ కాల పరిధి ఏడాదిగా ఉండేది. దేశంలో 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలు అత్యంత మతపరమైన ఎన్నికలు. ముస్లింలను నేరుగా లక్ష్యంగా చేసుకున్నా, ఎటువంటి చర్యా తీసుకోలేదు. ఈసీ కనుక నిఘా నేత్రంగా వ్యవహరించి ఉంటే, అనేక మంది నాయకులు వారి ఓటింగ్ హక్కును కోల్పోయి ఉండేవారు. మతపరమైన ప్రచారం చేసినందుకు ఓసారి బాలాసాహెబ్ ఠాక్రే అలాగే ఓటు హక్కును కోల్పోయారు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. సంస్థలు మాత్రం శాశ్వతంగా ఉంటాయని ఈసీ గ్రహించాలి. ఆ సంస్థ విశ్వసనీయతను కోల్పోతే, దేశానికి భవిష్యత్తు అనేదే ఉండదు. మాయోపాయాలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఈసీ రాజీపడుతోందని అనుమానం ప్రబలితే, మొత్తం ప్రజాస్వామిక ప్రక్రియే సందేహాస్పదంగా మారుతుంది. చట్టబద్ధమైన ఓటర్లదే విజయమనే ప్రజా నమ్మకం వమ్ము అవుతుంది. ప్రజాస్వామ్యానికి అది మరణ శాసనం అవుతుంది.ఆశుతోష్ వ్యాసకర్త సత్యహిందీ డాట్కామ్ సహ–స్థాపకుడు, ‘హిందూ రాష్ట్ర’ పుస్తక రచయిత (‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
ఎందుకొచ్చిన ‘సర్’?!
దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆరోపణలు రావటం, మౌనంగా ఉండిపోయి నెలలు గడిచాక ముక్తసరిగా మాట్లాడటం ఎన్నికల సంఘం(ఈసీ)కి అలవాటైపోయింది. ఈసారి మార్పేమిటంటే... ఓటర్ల జాబితా సవరణ దశలోనే దానిపై ఆరోపణలు రావటం! రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి గనుక దానికి అనుగుణంగా ఈ దఫా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఈసీ చెబుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) కింద ఓటర్ల వివరాలు సేకరిస్తామంటున్నది. ఇదే మాదిరి సవరణ 2003లో జరిగింది. కానీ ఆ ‘సర్’ వేరు! అప్పట్లో ఇంటింటికీ వెళ్లి జాబితాలోని ఫొటోలతో ఓటర్లను పోల్చిచూడటం, అనుమానాస్పదం అనిపిస్తే తొలగించటం వగైరాలు చేశారు. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారందరినీ సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ పత్రాలు అడగాలన్నది ఈసీ తాజా నిర్ణయం. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్ఆర్సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా జాబితాలో కెక్కాలంటే ముందుగా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కాదు... తమ తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేయాలి. ప్రస్తుతం ఓటర్లను ఈసీ మూడు కేటగిరీలుగా విభజించింది. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకుముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పిస్తే సరిపోతుంది. జూలై 1, 1987– డిసెంబర్ 2, 2024 మధ్య జన్మించినవారు ఈ పత్రాలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించినవారు తమ ధ్రువీకరణ పత్రాలతోపాటు తల్లిదండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. ఇవి అందజేయలేనివారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. తుది జాబితా ప్రచురణలోగా అందిస్తేనే తిరిగి చేరుస్తారు.ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించటంలో తరచూ విఫలమవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసీ దొడ్డిదారిన ఎన్ఆర్సీని అమల్లో పెట్టజూస్తున్నదని విపక్షాలు చేస్తున్న ఆరోపణ కొట్టిపారేయదగ్గది కాదు. అలాగని దొంగ ఓటర్ల సమస్య లేదని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, అటు తర్వాత రెండు విభజిత రాష్ట్రాల్లో వేర్వేరు పోలింగ్ తేదీలున్నప్పుడు తెలుగుదేశం దీన్నొక కళగా అభివృద్ధి చేసింది. అక్కడా ఇక్కడా ఓటేయించటం, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఓటర్లను తరలించటం ఆ పార్టీకి అలవాటైన విద్య. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్ వగైరాల్లో బంగ్లాదేశ్, మయన్మార్ల నుంచి వచ్చినవారు ఓటర్లుగా నమోదై ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకు సంబంధించిన డేటా ఈసీ ఇంతవరకూ బయటపెట్టలేదు. అది విడుదల చేసివుంటే ఈ వ్యవహారం ఇంత వివాదం అయివుండేది కాదు. కానీ అలా చేయటం తన స్థాయికి తగదని సంస్థ భావిస్తున్నట్టుంది. బిహార్ మాత్రమే కాదు... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఈ ‘సర్’ వచ్చిపడుతుందంటున్నారు. ఏడేళ్ల క్రితం అస్సాంలో ఈ దేశ పౌరులెందరు... ఇతరులెందరన్న ఆరా తీశారు. భారత రిజిస్ట్రార్ జనరల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే తర్వాత 40.07 లక్షల మంది ‘విదేశీయులని’ నిర్ధారించారు. ఎన్నో ఆందోళనలు జరిగాక ఈ సంఖ్య 19 లక్షలకు తగ్గింది. వీరిలో అన్ని మతాలవారూ ఉండగా బిచ్చగాళ్లు, నిరుద్యోగులూ, ఇల్లూ వాకిలీ లేనివారూ ఎక్కువ. ఒక ఇంట్లో పెద్దన్న ‘భారతీయుడైతే’ మిగిలిన అన్నదమ్ములు ‘విదేశీయులు’గా ముద్రపడిన వారున్నారు. భర్తకు ఎన్ఆర్సీలో చోటు దక్కితే భార్య పేరు గల్లంతయిన ఉదంతాలు కోకొల్లలు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీసు విభాగంలో సబ్ఇన్స్పెక్టర్గా పనిచేసే మహమ్మద్ సనావుల్లా పేరు సైతం మాయమైతే అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు. జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులంతా గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్ దొరికింది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లయినా ఇప్పటికీ లక్షల కేసులు తేలని నేపథ్యంలో ఇంత పని ఈసీ ఎందుకు నెత్తికెందుకుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. బిహార్లో ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 7 కోట్ల 90 లక్షలు. ఇందులో 20–38 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు సగమని చెబుతున్నారు. ఈసీ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2.93 కోట్లు. వీరు తమతోపాటు తమ తల్లిదండ్రుల్లో కనీసం ఒకరి పౌరసత్వాన్ని తేల్చిచెప్పాల్సి ఉంటుంది. నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడాల్సిన బిహార్లో ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారమా? ఆ వంకన పాలక పక్షాల ఒత్తిడితో భారీయెత్తున ఓటర్లను తొలగించే ప్రమాదం ఉండదా? జాబితాలో చోటుదక్కనివారు న్యాయస్థానాలకెక్కితే పరిస్థితేమిటి? పాలకులుగా ఎవరున్నా పేదరికం రాజ్యమేలే బిహార్ నుంచి భారీయెత్తున వలసలుంటాయి. అక్కడ వృద్ధాప్య పింఛన్ నెలకు రూ. 700. ఇటీవలే దాన్ని రూ. 1,100 చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆర్భాటంగా ప్రకటించారు. పనుల కోసం వందలాది కిలోమీటర్లు దాటి తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. అక్కడి జనాభాలో 7 శాతం మంది వేరే రాష్ట్రాలకు పోగా, అందులో 30 శాతం మంది ఉపాధి వెదుక్కొని వెళ్లినవారే. వారంతా వెనక్కొచ్చి తమ పత్రాల కోసం వెతుకులాడటం జరిగే పనేనా? బిహార్లో సకాలంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ విశ్వసిస్తోందా? -
ఈసీ తీరుపై... అన్నీ అనుమానాలే!
సాక్షి, న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా అవకతవకలు, నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల సంఖ్యలో అనూహ్య పెరుగుదల, ఇష్టారాజ్యంగా ఓటర్ల తొలగింపు తదితర అంశాలను కాంగ్రెస్తో పాటు విపక్ష పార్టీలన్నీ సోమవారం లోక్సభలో లేవనెత్తాయి. వీటిపై సందేహాలు, నానాటికీ దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు మొత్తం ఎన్నికల ప్రక్రియ సమగ్రతనే ప్రశ్నార్థకంగా మార్చాయంటూ ఆందోళన వెలిబుచ్చాయి. పైగా వీటిపై కేంద్ర ఎన్నికల సంఘం అరకొర స్పందన మరిన్ని అనుమానాలకు తావిస్తోందన్నాయి. కనుక ఈ మొత్తం అంశంపై లోక్సభలో పూర్తిస్థాయి చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశాయి. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఇది ప్రతిపక్షాలన్నీ ముక్త కంఠంతో చేస్తున్న డిమాండని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ ఓటర్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందా అని ప్రశ్నించారు. ‘‘కేంద్రం తయారు చేయదన్నది నిజమే. కానీ ఇవన్నీ మొత్తం ఎన్నికల ప్రక్రియపైనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. అందుకే ఈ అంశంపై సవివరమైన చర్చకు మేం డిమాండ్ చేస్తున్నాం’’ అని రాహుల్ బదులిచ్చారు. ‘‘ఓటర్ల జాబితాల విశ్వసనీయతను దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్రతో సహా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతిపక్షాలు దీనిపై అనుమానాలు లేవనెత్తాయి’’ అని గుర్తు చేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమంటూ సమాజ్వాదీ, ఆర్జేడీ, బిజూ జనతాదళ్, ఆప్ కూడా గొంతు కలిపాయి. దీన్ని పార్లమెంటు చర్చకు స్వీకరించాల్సిందేనని పట్టుబట్టాయి. తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఓటర్ల జాబితా అంశాన్ని జీరో అవర్లో లేవనెత్తారు. ‘‘ఓటర్ల ఫొటో గుర్తింపు కార్డు నంబర్లలో నకిలీల సమస్య దశాబ్దాలుగా ఉంది. కానీ పశి్చమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన అనంతరమే కేంద్ర ఎన్నికల సంఘం దీనిపై స్పందించింది. సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ప్రకటించింది’’ అంటూ దృష్టికి తెచ్చారు. అంటే ఇంతకాలంగా తప్పిదాలు జరుగుతూ వస్తున్నట్టే కదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘బెంగాల్, హరియాణాల్లో నకిలీ ఓటరు కార్డులు దొరికాయి. ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. దానిపై అందరూ ప్రశ్నలు లేవనెత్తారు. హరియాణా అసెంబ్లీ ఎన్నికలప్పుడూ ఇలాగే జరిగింది. ఇవన్నీ తీవ్రమైన లోటుపాట్లే. వచ్చే ఏడాది బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికలున్నందున ఆలోపే ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించాలి’’ అని డిమాండ్ చేశారు. ఈ తప్పిదాలపై దేశ ప్రజలకు ఈసీ బదులివ్వాల్సిందేనన్నారు. ఈ అంశంపై సమగ్ర చర్చకు డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష సభ్యులు నిరసనలతో హోరెత్తించారు. ఎన్నికల నిర్వహణలో ఈసీ పక్షపాతరహితంగా వ్యవహరించాలని సమాజ్వాదీ సభ్యుడు ధర్మేంద్రయాదవ్ అన్నారు. ‘‘మహారాష్ట్రలో నెలల వ్యవధిలోనే కొత్తగా లక్షలాది ఓటర్లు ఎలా పుట్టుకొచ్చారు? ఢిల్లీలోనూ అదే జరిగింది. 2022లో యూపీలోనూ ఇదే చేశారు’’ అని ఆరోపించారు.రాజ్యసభలోనూ... రాజ్యసభలో కూడా జీరో అవర్లో ఈ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రయత్నించారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ అందుకు అనుమతివ్వలేదు. దీనితో పాటు డజనుకు పైగా అంశాలపై 267వ నిబంధన కింద చర్చకు డిమాండ్ చేస్తూ విపక్షాలు ఇచి్చన నోటీసులన్నింటినీ తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్తో పాటు విపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. ‘‘మహారాష్ట్రలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య ఆర్నెల్లలోనే ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇదెలా సాధ్యం? దీనిపై కాంగ్రెస్తో పాటు విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఈసీ వద్ద సమాధానమే లేదు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఉపయోగించిన ఫొటో ఓటర్ల జాబితాను ఎక్సెల్ ఫార్మాట్లో మాకు అందజేయాలని డిమాండ్ చేస్తే ఈసీ నేటికీ స్పందించనే లేదు. దేశవ్యాప్తంగా ఓటర్ల పేర్లను ఇష్టారాజ్యంగా తొలగించడం, డూప్లికేట్ ఈపీఐసీ నంబర్ల వంటి తీవ్ర తప్పిదాలు, లోటుపాట్లు ఇష్టారాజ్యాంగా చోటుచేసుకుంటున్నాయి. ఇవన్నీ ఎన్నికల ప్రక్రియ తాలూకు సమగ్రతనే సవాలు చేస్తున్నాయి. పైగా ఈ తప్పిదాలను స్వయంగా ఈసీయే అంగీకరించింది. కనుక వీటన్నింటిపై పార్లమెంటులో చర్చ జరగాల్సిందే. అందుకు మోదీ సర్కారు అంగీకరించాల్సిందే’’ అంటూ అనంతరం ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. తద్వారా ప్రజాస్వామ్యంపై, రాజ్యాంగంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కొన్నేళ్లుగా ఘోరంగా విఫలమవుతోందని అంతకుముందు టీఎంసీ సభ్యుడు కల్యాణ్ బెనర్జీ సభలో దుయ్యబట్టారు. ఇందుకు ఈసీపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘డూప్లికేట్ ఓటర్ కార్డుల అంశాన్ని సీఎం మమతే తొలిసారి లేవనెత్తారు. దీనిపై ఈసీ ఇచ్చిన వివరణ ఎన్నికల నిర్వహణ నిబంధనలకే విరుద్ధంగా ఉంది’’ అని ఆరోపించారు. అనుమానాలన్నింటినీ నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్రం, ఈసీపై ఉందని ఆప్ సభ్యుడు సంజయ్సింగ్ అన్నారు. ఇటీవలి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హరియాణా పౌరులకు విచ్చలవిడిగా ఓటరు కార్డులిచ్చారని ఆరోపించారు. తద్వారా ఎన్నికల ప్రక్రియనే ప్రహసనంగా ఈసీ మార్చేసిందని దుయ్యబట్టారు. తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఈసీ ప్రయత్నిస్తోందని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. ‘‘ఎన్నికల ప్రక్రియే పార్లమెంటు ఉనికికి ప్రాణం. ఎన్నికల అవకతవకలపై ఇక్కడ చర్చించేందుకు అవకాశమివ్వకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు’’ అన్నారు. -
బెంగాల్ ఓటర్ల జాబితాలో గోల్మాల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టి(టీఎంసీ) అధినేత మమతా బెనర్జీ ఆరోపించారు. విపక్ష బీజేపీ ఎన్నికల సంఘం అండతో ఇతర రాష్ట్రాల నుంచి జనాన్ని తీసుకొచ్చి ఓటర్లుగా చేర్పిస్తోందని మండిపడ్డారు. నకిలీ ఓటర్లను తక్షణమే తొలగించాలని, ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దాలని సూచించారు. లేకపోతే ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షకు దిగుతానని హెచ్చరించారు. గురువారం కోల్కతాలో జరిగిన టీఎంసీ సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్ నియామకం పట్ల అనుమానాలు వ్యక్తంచేశారు. ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికి బీజేపీ ప్రయతి్నస్తోందని విమర్శించారు. ఎన్నికల సంఘం మద్దతుతో ఓటర్ల జాబితాను బీజేపీ ఇష్టానుసారంగా మార్చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. ఇలాంటి అక్రమాలను సహించే ప్రసక్తే లేదన్నారు. మరోసారి ‘ఖేలా హోబే’ మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయోగించిన కుయుక్తులను బెంగాల్లోనూ పునరావృతం చేయాలన్నదే బీజేపీ కుట్ర అని మమతా బెనర్జీ మండిపడ్డారు. ఢిల్లీలో హరియాణా ప్రజలను, మహారాష్ట్రలో గుజరాత్ ప్రజలను ఓటర్లుగా చేర్పించి, అడ్డదారిలో నెగ్గిందని బీజేపీపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బెంగాల్లో స్వేచ్ఛగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచే అవకాశమే లేదన్నారు. అందుకే మరో గత్యంతరం లేక ఎన్నికల్లో నెగ్గడానికి నకిలీ ఓటర్లను నమ్ముకుందని దుయ్యబట్టారు. బీజేపీ కుట్రలకు ఎన్నికల సంఘం సహకరిస్తుండడం దారుణమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నకిలీ ఓటర్లను బహిర్గతపర్చి, బీజేపీ బండారం బయటపెడతామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీలో బీజేపీ కుట్రలను అక్కడి పార్టీలు పసిగట్టలేకపోయాయని అన్నారు. బెంగాల్లో బీజేపీ నిర్వాకాలను తాము గుర్తించామని చెప్పారు. మహారాష్ట్ర, ఢిల్లీలో అక్రమంగా గెలిచిన బీజేపీ ఇప్పుడు బెంగాల్పై కన్నేసిందని, ఆ పార్టికి తాము గట్టిగా బదులిస్తామని అన్నారు. మరోసారి ఖేలా హోబే(ఆట మొదలైంది) తప్పదని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించామని, రాబోయే ఎన్నికల్లోనూ తగిన గుణపాఠం నేర్పబోతున్నామని పేర్కొన్నారు.మన లక్ష్యం 215 ప్లస్ సీట్లు వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గాను 215కు పైగా సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని టీఎంసీ శ్రేణులకు మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీ బలాన్ని మరింతగా తగ్గించాలన్నారు. బీజేపీతోపాటు సీపీఎం, కాంగ్రెస్ అభ్యర్థులకు ఈ దఫా డిపాజిట్లు కూడా దక్కకుండా చూడాలన్నారు. గతంలో ఎన్నికలప్పుడు కాషాయదళ నేతలు ఇచ్చిన నినాదాలను ఆమె గుర్తు చేశారు. ‘2021 ఎన్నికల్లో బీజేపీ నేతలు ‘200 సీట్లకు మించి’అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఓటమి పాలయ్యారు. 2024 లోక్సభ ఎన్నికలప్పుడు ‘400కు మించి’ అనే నినాదంతో ప్రచారం చేసుకున్నప్పటికీ ఆ పార్టీ కనీసం మెజారిటీని సైతం సాధించలేకపోయింది. ‘ఈ దఫా ఎన్నికల్లో మనం, మూడింట రెండొంతుల మెజారిటీ తెచ్చుకుంటాం. కానీ, అంతకుమించి మెజారిటీ సాధించేందుకు మీరు కృషి చేయాలి. ఈసారి బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కకూడదు’ అని మమత స్పష్టంచేశారు. -
‘స్థానిక’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరో మూడు నెలల సమయం పట్టే అవకాశమున్నా, ఎన్నికల పనుల్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) పూర్తిస్థాయిలో నిమగ్నమైంది. శనివారం జిల్లాలు, మండల స్థాయిలో పోలింగ్ కేంద్రాలను గుర్తించి దానికి సంబంధించిన జాబితాలను జిల్లా, మండల కేంద్రాల్లో ప్రచురించారు. రాష్ట్రవ్యాప్తంగా 570 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ కేంద్రాలు ఉన్నట్టు ప్రకటించారు. మరోవైపు ఓటర్ల జాబితాకు సంబంధించిన కసరత్తు సాగుతోంది.ఎన్నికలు వాయిదా పడుతున్నాయనే భావనలో ఉండొద్దని, ఆయా పనులకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూనే ఉండాలని అధికారులు, సిబ్బందికి పంచాయతీరాజ్ కమిషనరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాలు, సిబ్బందికి శిక్షణ తదితరాలన్నీ పూర్తిచేసి, ఎప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చినా వెంటనే ఎన్నికల విధుల్లో దిగేందుకు సిద్ధంగా ఉండాలని ఈ ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల ఏర్పాట్లపై జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, ఇతర క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో వీడియో, టెలీ కాన్ఫరెన్స్లు, గూగుల్మీట్లు నిర్వహిస్తూనే ఉన్నారు. ఎస్ఈసీ ఆదేశాలకు అనుగుణంగా... ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా పీఆర్ శాఖ ద్వారా పోలింగ్ కేంద్రాల జాబితా, ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. పైగా సిబ్బందికి కూడా దీనికి సంబంధించిన శిక్షణను కూడా పూర్తి చేసింది. శనివారం పోలింగ్ స్టేషన్లు ఖరారు కావడంతో టీ–పోల్ యాప్లో పోలింగ్ కేంద్రాల వారీగా 500 నుంచి 700 ఓటర్లను మ్యాపింగ్ చేసి ఆయా కేంద్రాలకు కేటాయించాల్సి ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్లు ఇతర అంశాలకు సంబంధించి హైకోర్టులోనూ కేసు విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. కోర్టుకు ఆయా విషయాలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా నుంచి గ్రామస్థాయి వరకూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పీఆర్ శాఖ ఆదేశించింది. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఏవి ముందు నిర్వహించాల్సి వచ్చినా, అందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమై ఉండాలని సూచించింది. కులగుణనలో రెండోవిడతలో వివరాల సేక రణ, పరిశీలన, ఆపై కేబినెట్ భేటీలో సమగ్ర నివేదిక ఆమోదం, ఆపై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టబద్ధత కల్పించేలా బిల్లు పెట్టి కేంద్రానికి, పార్లమెంట్కు పంపించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు మరికొన్ని నెలల సమయం పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
హీరో మహేష్బాబు ఓటు తొలగింపు
గుంటూరు: శాసనమండలి కృష్ణా–గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితాలో ప్రముఖ సినీ నటుడు ఘట్టమనేని మహేష్బాబు పేరుతో నమోదైన ఓటును తొలగించినట్లు గుంటూరు నగరపాలకసంస్థ అదనపు కమిషనర్, ఏఈఆర్వో చల్లా ఓబులేసు గురువారం తెలిపారు. గుంటూరులో హీరో మహేష్బాబుకు ఓటు శీర్షికతో బుధవారం ‘‘సాక్షి’’ మెయిన్ ఎడిషన్లో ప్రచురితమైన కథనానికి ఏఈఆర్వో స్పందించారు. మహేష్బాబు పేరుతో ఓటు తప్పుగా నమోదైందని, ఫారం–7 విచారణ అనంతరం ఓటును తొలగించామని వివరించారు. గుంటూరు అర్బన్లో దరఖాస్తులపై బూత్ లెవల్ అధికారులతో విచారణ చేయించామన్నారు. అర్హులైన వారి దరఖాస్తులను ఆమోదించినట్లు పేర్కొన్నారు. -
ఓటర్ జాబితా నుంచి మాజీ సీఎం పేరు గాయబ్!
డెహ్రాడూన్: కాంగ్రెస్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్కు చేదు అనుభవం ఎదురైంది. గురువారం అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ జరగ్గా.. డెహ్రాడూన్లో ఓటేయడానికి వెళ్లిన ఆయన పేరు ఓటర్ లిస్ట్లో మిస్ అయ్యింది. దీంతో ఆయన అక్కడే ఎదురుచూస్తూ ఉండిపోయారు.డెహహ్రాడూన్లోని నిరంజన్పూర్లో రావత్ 2009 నుంచి నివాసం ఉంటున్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికలతో పాటు కిందటి ఏడాది సార్వత్రిక ఎన్నికల్లోనూ ఓటేసిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు.‘‘ గత 16 ఏళ్లుగా నేను ఓటు హక్కు వినియోగించుకుంటున్నా. కానీ, ఇప్పుడు నా పేరే లేకుండా పోయింది. ఉదయం నుంచి నేను పోలింగ్ స్టేషన్ వద్దే ఉన్నా. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నాకే ఇలా జరిగిందంటే.. ఇది కచ్చితంగా అప్రమత్తం కావాల్సిన విషయం’’ అని అన్నారాయన.VIDEO | Dehradun Municipal Elections: Congress leader Harish Rawat raises concerns over voting issues."I have been waiting since morning... but my name was not found at the polling station where I voted in the Lok Sabha elections. They are now searching for it... let's see what… pic.twitter.com/ZnNKmaD00n— Press Trust of India (@PTI_News) January 23, 2025 దీనిపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే.. కంప్యూటర్ సర్వర్లో తలెత్తిన సమస్యే ఇందుకు కారణంగా తేలింది. దీంతో రావత్కు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదని ఈసీ సమాచారం అందించింది.ఉత్తరాఖండ్లో ఇవాళ 11 మున్సిపల్ కార్పోరేషన్లు, 43 మున్సిపల్ కౌన్సిల్స్, 46 నగర పంచాయితీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలంటూ సీఎం పుష్కర్సింగ్ ధామి ఉదయం ఓటర్లను అభ్యర్థించారు. -
ఓటర్ జాబితా తారుమారుకు బీజేపీ కుట్ర: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ జాబితాను తారుమారు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. ‘‘ఢిల్లీలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనే 11 వేల ఓట్లను తొలగించాలంటూ ఈసీకి బీజేపీ దరఖాస్తులు చేసింది. నేను పోటీ చేసే న్యూఢిల్లీ స్థానంలోనూ 12,500 పేర్లను తొలగించాలంటూ దరఖాస్తు చేసింది. మేం ఈసీ దృష్టికి తీసుకెళ్లడం వల్ల పేర్ల తొలగింపు ఆగిపోయింది’’ అని వివరించారు. బీజేపీ ఆటలను సాగనివ్వబోమన్నారు. -
కులగణనా.. ఓటర్ల జాబితానా?
సాక్షి, హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుకు కులగణన చేపట్టాలా..లేదా తాజా ఓటర్లజాబితా ఆధారంగా చేయాలా అనేదానిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకోలేకపోతోంది. స్థానిక రిజర్వేషన్ల ఖరారు, ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై ప్రభుత్వం సత్వర నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఉన్నతస్థాయి సమావేశంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీల పాలకమండళ్ల పదవీకాలం ముగిసి, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలై ఆరునెలలు కావొస్తోంది. ఇక జిల్లా, మండల ప్రజాపరిషత్ల గడువు ఈ నెల 4వ తేదీతో ముగియగా, రాష్ట్రవ్యాప్తంగా 32 జెడ్పీలు, 563 మండలాల్లోని దాదాపు 6 వేల ఎంపీటీసీ, 563 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం నుంచి పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్లకు వచ్చే నిధులు ఆగిపోయాయి. బీసీ రిజర్వేషన్లు 42 శాతం ఎలా ? స్థానిక సంస్థల్లో బీసీలకు గరిష్టంగా 21 శాతం రిజర్వేషన్లు ఉండగా, దానిని 42 శాతానికి పెంచుతామని, ఉపకులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి ఏ పద్ధతి అనుసరించాలనే అంశంపై ప్రభుత్వస్థాయిలో నిర్ణయం తీసుకోలేదు. సుప్రీంకోర్టు గతంలోనే ‘ట్రిపుల్ టెస్ట్’పేరిట స్థానిక సంస్థల పరిధిలో ఆయా గ్రూపుల వెనుకబాటుతనంపై బీసీకమిషన్ ద్వారా విచారణ జరపాలని, ఆయా చోట్ల (స్థానిక స్థాయిలో) ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఏఏ నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వాలనే దానిని తేల్చాలని స్పష్టం చేసింది. మొత్తంగా రిజర్వేషన్లు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కలిపి) 50 శాతానికి మించరాదని కూడా పేర్కొంది. ఓటర్ల జాబితాతో అయితే... రాష్ట్రవ్యాప్తంగా కులగణన నిర్వహణ అనేది చాలా ఎక్కువ సమయం పట్టే› ప్రక్రియ. దీంతో కొత్త ఓటర్ల జాబితా (లోక్సభ ఎన్నికల సందర్భంగా వెలువరించిన లిస్ట్) ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖను నోడల్ ఏజెన్సీగా నియమించి..ఓటర్ల జాబితా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓటర్ల వివరాలు సేకరించాలని బీసీ కమిషన్ భావిస్తున్నట్టు తెలిసింది. ఓటర్ల జాబితా ఆధారంగా ఖరారు చేసిన రిజర్వేషన్లకు అనుగుణంగా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో బీసీ సంఘాలు, వివిధ కులసంఘాలు, జిల్లాల్లోని రాజకీయపార్టీలతో సమావేశాలు, బహిరంగ విచారణ, ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశం నిర్వహించి ముందుకు సాగొచ్చునని బీసీ కమిషన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఓటర్ల లిస్ట్ ప్రకారమైతే పెద్దగా శ్రమ లేకుండా మూడునెలల్లో క్షేత్రస్థాయిలో ఆయా సామాజికవర్గాల జనాభా వివరాలు తేల్చవచ్చునని, సామాజిక, ఆర్థిక, కుల సర్వే అయితే సమయం ఎక్కువ పడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుత బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆధ్వర్యంలో ట్రిపుల్ టెస్ట్ మేరకు క్షేత్రస్థాయి పరిశీలనలు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలిసింది. -
Lok Sabha Election 2024: పేరు మరిచిన మహిళలు!
ఈగ ఇల్లలుకుతూ తన పేరు మరిచిపోయిన కథ అందరికీ తెలుసు. 1951- 52లో మన దేశంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళల విషయంలో ఇలాంటి ‘ఈగ’ తరహా కథే జరిగింది... మొదటి సార్వత్రిక ఎన్నికల కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేసే పనిలో పడ్డ కేంద్ర ఎన్నికల సంఘానికి చిత్రమైన సమస్య ఎదురైంది. చాలా రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు తమ సొంత పేర్లు నమోదు చేసుకోలేదు! బదులుగా తమ కుటుంబంలోని పురుష సభ్యులతో తమ సంబంధాన్ని బట్టి ఫలానా వారి భార్యను, ఫలానా ఆయన కూతురును అని నమోదు చేసుకున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు.. నాడు దేశవ్యాప్తంగా నమోదైన 8 కోట్ల మంది మహిళా ఓటర్లలో ఏకంగా 2.8 కోట్ల మంది ఇలా వైఫాఫ్, డాటరాఫ్ అని మాత్రమే నమోదు చేసుకున్నారు. ఇలాంటి కేసులు ఎక్కువగా బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యభారత్, రాజస్తాన్, వింధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చాయి. దాంతో ఎన్నికల సంఘానికి పెద్ద చిక్కు వచ్చిపడింది. అలాంటి మహిళా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. సొంత పేర్లతో తిరిగి నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. పురుష ఓటర్లతో ఉన్న సంబంధపరంగా కాకుండా విధిగా మహిళా ఓటర్ల పేరుతోనే నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. పేరు చెప్పడానికి నిరాకరించిన మహిళను ఓటరుగా నమోదు చేయొద్దని స్పష్టం చేశారు. ఇందుకోసం బిహార్కు ఒక నెల ప్రత్యేక గడువిచ్చారు. ఈ పొడిగింపు బాగా ఉపయోగపడింది. ఆ గడువులో రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో మహిళలు పేర్లు నమోదు చేసుకున్నారు. రాజస్తాన్లో మాత్రం పొడిగింపు ఇచ్చినా అంతంత స్పందనే వచ్చింది. దాంతో అక్కడ చాలామంది మహిళా ఓటర్లను తొలగించాల్సి వచ్చింది! తొలి ఎన్నికల్లో 17.3 కోట్ల పై చిలుకు ఓటర్లలో మహిళలు దాదాపు 45 శాతమున్నారు. వారికోసం ప్రత్యేక పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మొత్తం 27,527 పింక్ బూత్లను మహిళా ఓటర్లకు రిజర్వ్ చేశారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి దేశ తొలి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్ రేడియోలో వరుస ప్రసంగాలు, చర్చలు చేశారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల ఓటర్ల జాబితాలో మొత్తం 47.1 కోట్ల మంది మహిళలున్నారు. 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ! -
ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు !
అర్హత కలిగిన ప్రతి పౌరుడూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమైన ఓటింగ్లో పాల్గొనేందుకు వీలుగా ఎన్నికల సంఘం అనేక సౌకర్యాలు కల్పించింది. ఓటరు జాబితా సవరణలో ఏ కారణం చేతనైనా మీ పేరు తొలగించినప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఓటరు జాబితా పరిశీలనకు అధికారులు వచ్చినప్పుడు మీరు లేకపోతే మీ పేర్లను తొలగించేందుకు అవకాశాలు ఎక్కువ. అయితే ఇలా అబ్సెంట్ అయిన వారి కోసం ప్రత్యేకంగా ఒక జాబితా రూపొందుతుంది. అంతేకాకుండా... ఒకవేళ మీ అడ్రస్ మారి ఉంటే, ఇంకో జాబితా, మరణించిన వారి కోసం కూడా ప్రత్యేకంగా జాబితా సిద్ధం చేస్తారు.ఈ జాబితాలన్నీ ఓటరు జాబితాతోపాటు ప్రిసైడింగ్ అధికారికి అందుబాటులో ఉంటాయి. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు.అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. దివ్యాంగులకు వాహన సదుపాయం...దివ్యాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదించాలి. ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తారు.పోలింగ్ కేంద్రం తెలుసుకోవడం ఇలా... ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేస్తుంది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. -
ఓటు నమోదుకు మూడు రోజులే గడువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటు నమోదుకు ఇక మూడు రోజుల సమయమే ఉంది. 18 సంవత్సరాల వయసు నిండి.. ఓటర్ జాబితాలో పేరులేని వారంతా ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా గానీ లేదా సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, మున్సిపల్ కార్యాలయాల్లో గానీ ఫాం–6ను సమర్పించడం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా సూచించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఓటర్ జాబితాలో పేరుందో, లేదో ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి. ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ.. జాబితాలో పేరు లేకపోతే పోలింగ్ రోజు ఓటు వేయలేరు. పేరు లేకపోతే ఈ నెల 15లోగా ఫాం–6 సమర్పిస్తే తప్పకుండా ఓటు హక్కు కల్పిస్తాం. సాధారణంగా అయితే నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశముంటుంది. 15వ తేదీ తర్వాత నమోదు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు జారీ చేయడానికి 10 రోజుల సమయం పడుతుంది. అందువల్ల చివరి వరకు ఆగకుండా ఏప్రిల్ 15లోగా నమోదు చేసుకోవడం మంచిది’ అని సూచించారు. ఓటర్ల నమోదు ప్రక్రియపై రాజకీయ పార్టీల నుంచి ఆరోపణలు రాకుండా.. అధికారులు అన్ని ధ్రువపత్రాలు సక్రమంగా ఉన్నాయా, లేవా అని సరి చూసిన తర్వాతే ఓటర్గా నమోదు చేస్తున్నారు. ఆన్లైన్లో ఓటు నమోదుకు దరఖాస్తు చేసుకున్నా.. ఫిజికల్గా ఆధార్ కాపీ, వయసు నిర్దారణ ధ్రువపత్రంతో పాటు ఇంత వరకు ఎక్కడా ఓటు హక్కు లేదన్న ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఓటర్గా నమోదు చేస్తున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం ఆన్లైన్లో దరఖాస్తు చేసి వదిలేయకుండా.. అన్ని కాపీలను తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా అధికారులు కోరుతున్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్గా నమోదు కావడమే కాకుండా మే 13న జరిగే పోలింగ్లో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని మీనా సూచించారు. -
ఓటును మించిన ఆయుధం లేదు
గచ్చిబౌలి (హైదరాబాద్): బుల్లెట్ కన్నా బ్యాలెట్ గొప్పదని, ఓటును మించిన ఆయుధం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ అన్నారు. ఓటు హక్కుపై ఓటర్లకు అవగాహన కల్పించేందుకు 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు కీలకమైందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్క రూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని, కొత్త ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం కల్పిస్తున్న అవకాశాన్ని యువత వినియోగించుకోవా లని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని, ఏవైనా ఉల్లంఘనలు జరిగితే బాధ్యతగల పౌరులుగా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇందుకు ‘సివిజిల్’ యాప్ను మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఫిర్యాదు అందిన వంద నిమిషాలలోపు విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని వికాస్రాజ్ తెలిపారు. బ్యాలెట్ పవర్ గొప్పది: రోనాల్డ్రాస్ బుల్లెట్ కన్నా బ్యాలెట్ పవర్ చాలా గొప్పదని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం అన్నింటా ముందున్నా, ఓటింగ్లో 50 శాతం మించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు, ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నది, లేనిది చెక్ చేసుకోవాలని, లేనట్లయితే ఈనెల 15లోగా ఫారమ్–6 ద్వారా దరఖాస్తు చేసుకొని ఓటుహక్కు పొందాలని చెప్పారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక, పెద్దసంఖ్యలో యువత, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైటెక్స్ రోడ్లోని మెటల్ చార్మినార్ వరకు రన్ కొనసాగింది. -
నిర్ణయాధికారం ‘ఆమె’దే!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాబోయే సాధారణ ఎన్నికల్లో గెలుపు ఓటములను మహిళా ఓటర్లే నిర్దేశించనున్నారు. 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సోమవారం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం మొత్తం 152 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని తేలింది. రాష్ట్రం మొత్తం ఓటర్లలో ఎలక్ట్రోలర్ లింగ నిష్పత్తి సగటు కూడా ఎక్కువగానే ఉంది. పదేళ్లుగా పెరుగుతున్న నిష్పత్తి రాష్ట్రంలో 2014 నుంచి వరుసగా 2024 వరకు ఓటర్ల జాబితాల్లో మహిళా ఓటర్ల నిష్పత్తి పెరుగుతూనే ఉంది. అర్హులైన యువతులను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో 18 నుంచి 19 సంవత్సరాల వయసుగల ఎలక్ట్రోరల్ లింగ నిష్పత్తి 778 నుంచి 796కు పెరిగింది. ఈ వయసుగల మహిళా ఓటర్లు 3.5 లక్షల మంది ఉన్నారు. గిరిజనుల్లోని ప్రత్యేక సంచార జాతులను కూడా ఓటర్లుగా నమోదుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో వీరి జనాభా 4.29 లక్షలుండగా 18 సంవత్సరాలు నిండిన 2.94 లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. బోడో గడబా, గుటోబ్ గడబా, చెంచు, బొండో పోర్జా, ఖోండ్ పోర్జా, పరేంగి పోర్జా, డోంగ్రియా ఖోండ్, కుటియా ఖోండ్, కోలం, కొండారెడ్డి, కొండ సవరాల జాతుల్లోని అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేశారు. -
ఏపీ 2024 ఎన్నికలకు ఓటర్ల తుది జాబితా విడుదల
-
AP: ఓటర్ల తుది జాబితా విడుదల.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 2024 ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం జిల్లాల వారీగా విడుదల చేసింది. సీఈఓ ఆంధ్రా వెబ్సైట్(CEO Andhra)లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా విడుదల చేసినట్లుగా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాల వారీగా ఓటర్ల జాబితాలను ఎన్నికల సంఘం ప్రచురించింది. నియోజకవర్గాల వారీగా పీడీఎఫ్ ఓటర్ల జాబితాలను సీఈఓ ఆంధ్రా వెబ్సైట్లో ఈసీ అప్ లోడ్ చేసింది. ఓటర్ల జాబితాను ఎక్కడికక్కడే విడుదల చేయాలని ఈసీ.. జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్లు: 4,08,07,256 మహిళా ఓటర్లు: 2,07,37,065 పురుష ఓటర్లు: 2,00,09,275 రాష్ట్రంలో సర్వీస్ ఓటర్లు: 67,434 థర్డ్ జెండర్ ఓటర్లు: 3482. కాగా, గత 6 నెలలుగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు, అధికారులను నియమించి ఓటర్ల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కొత్త ఓటర్ల నమోదును వేగవంతం చేశారు. ఓటు ప్రాధాన్యతపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించారు. అన్ని ప్రక్రియలు పూర్తి అయ్యాక సోమవారం అధికారికంగా తుది ఓటరు జాబితాను విడుదల చేశారు.ఏపీలో పురుషుల కంటే మహిళల ఓటర్లే అధికం ఉండటం గమనార్హం. జిల్లాల వారీగా ఓటర్ల వివరాలు జిల్లా పురుషులు స్త్రీలు ఇతరులు సర్వీస్ ఓటర్లు మొత్తం ఓటర్లు తిరుపతి 8,68,273 9,10,597 188 867 17,79,058 చిత్తూరు 7,65,90 7,88,725 84 3,379 15,58,257 ఎన్టీఆర్ 8,17,484 8,57,361 150 16,74,995 కాకినాడ 7,88,105 8,10,781 15,99,065 కృష్ణా 7,37,394 7,80,796 65 15,18,255 యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తాం ఏపీ ఓటర్ల తుది జాబితాను ప్రకటించామని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 4.08 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత 5.08 లక్షల ఓటర్లు పెరిగారని పేర్కొన్నారు. యువ ఓటర్లు 8.13 లక్షల ఓటర్లు నమోదయ్యారని వెల్లడించారు. యువ ఓటర్లు ఇంకా నమోదు కావాల్సి ఉందని చెప్పారు. యువ ఓటర్ల నమోదు కోసం మళ్లీ ప్రచారం చేస్తామని అన్నారు. ఒకే డోర్ నెంబర్పై అధిక ఓట్లు ఉన్న ఫిర్యాదులను 98 శాతం పరిష్కరించామని తెలిపారు. లక్ష 50 వేల ఇళ్లలో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు 4వేల ఇళ్లకు తగ్గాయని, ప్రతి ఎన్నికల్లోనూ ఇలాంటి ఓట్లు ఉండేవని అన్నారు. ఫామ్ 7 ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. 70 చోట్ల పోలీసు కేసులు నమోదు చేశామని అన్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. వికలాంగులు, 80 ఎళ్ల పైబడిన వారికి ఇంటి వద్ద ఓటింగ్కి అవకాశం ఇస్తామని అన్నారు. నామినేషన్ చివరి రోజు వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. చదవండి: లోలోన రగిలిపోతున్న అచ్చెన్నాయుడు -
లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం
నల్లగొండ : ఏప్రిల్ నెలల జరగనున్న లోక్సభ ఎన్నికలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాను కాకుండా కొత్త ఓటరు జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. అందులో భాగంగానే కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం కల్పించింది. మూడు రోజుల క్రితమే ఓటరు ముసాయిదా జాబితాను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జిల్లాలో మొత్తం 14,64,080 మంది ఓటర్లు ఉండగా ముసాయిదా జాబితాలో 14,67,573 మంది ఓటర్లున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు 3,493 మంది కొత్తగా ఓటు నమోదు చేసుకున్నారు. ఈ నెల 22 వరకు కొత్తగా ఓటరు నమోదుకు అవకాశం ఉండడంతో ఓటర్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అవగాహన కల్పిస్తున్న బీఎల్ఓలు 1 జనవరి 2024 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఈనెల 22వ తేదీ వరకు ఓటరు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం బీఎల్ఓలు ఓటర్ల జాబితాను తీసుకుని ఇల్లిల్లూ తిరిగి ఓటు ఉందా లేదా తెలుసుకుని ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోమని అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ప్రకటించిన ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు, మార్పులు, చేర్పులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 2వ తేదీ లోగా పరిష్కరించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం ఓటరు తుది జాబితాను ఫిబ్రవరి 8న ప్రకటించనున్నారు. ఈ జాబితాతోనే ఏప్రిల్లో లోక్సభ ఎన్నికలను నిర్వహించనున్నారు. -
టీడీపీ అక్రమాలపై చర్యలు తీసుకోండి
సాక్షి అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో టీడీపీ భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అధికారుల బృందానికి ఫిర్యాదు చేశారు. మైపార్టీ డ్యాష్ బోర్డు.కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను టీడీపీ అక్రమంగా సేకరిస్తోందన్నారు. ఆ పార్టీకి మద్దతు తెలపని ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం తప్పుడు సమాచారంతో భారీ ఎత్తున ఫామ్–7లను ఎన్నికల సంఘానికి సమర్పిస్తోందన్నారు. పైగా దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలే ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలోని నోవాటెల్ హోటల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ అధికారుల బృందం శనివారం కూడా సమీక్ష నిర్వహించింది. ఈ నేపథ్యంలో సీఈసీ బృందాన్ని మంత్రులు జోగి రమేశ్, మేరుగు నాగార్జున, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఫైబర్ నెట్ చైర్మన్ గౌతంరెడ్డి, నవరత్న పథకాల అమలు వైస్ చైర్మన్ నారాయణమూర్తిలతో కూడిన వైఎస్సార్సీపీ బృందం కలిసింది. ఈ సందర్భంగా ఢిల్లీలో ఈ నెల 14న సీఈసీకి చేసిన ఫిర్యాదులను మరోసారి వైఎస్సార్సీపీ నేతలు సీఈసీ బృందం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితాలో టీడీపీ అక్రమాలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సందర్భంగా ఇంకా ఆయన ఏమన్నారంటే.. తెలంగాణలో ఓట్లున్నవారిని ఏపీలో చేరుస్తోంది.. తెలంగాణలో ఓట్లు ఉన్న వారిని రాష్ట్రంలోనూ ఓటర్లుగా చేర్పించడానికి టీడీపీ ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో ఒక ఓటు.. రాష్ట్రంలో మరో ఓటు ఉన్నవారు రాష్ట్రంలో 4.30 లక్షల మంది ఉన్నారు. వారి ఓట్లను తొలగించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాం. ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాలని తప్పుడు సమాచారంతో పది లక్షలకుపైగా ఫామ్–7లను దాఖలు చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోనేరు సురేశ్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాం. మేనిఫెస్టో పేరుతో వచ్చే ఐదేళ్లలో ఒక్కో కుటుంబానికి ఏ మేరకు లబ్ధి చేకూరుతుందో వివరిస్తూ ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ప్రమాణపత్రాలను ఓటర్లకు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం చేశాం. టీడీపీ, జనసేన చట్టవ్యతిరేక కార్యకలాపాలు.. గతంలో సేవా మిత్ర యాప్ తరహాలోనే ఇప్పుడు మై పార్టీ డ్యాష్ బోర్డ్.కామ్ అనే వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ అక్రమంగా సేకరిస్తోంది. టీడీపీ, జనసేన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయి. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికీ వెళ్లి టెక్నాలజీని ఉపయోగించి ప్రలోభాలకు గురిచేస్తున్నాయని ఎన్నికల అధికారుల బృందానికి వివరించాం. వైఎస్సార్సీపీ ఓటర్లను గుర్తించి వారి ఓట్లను తొలగించడానికి టీడీపీ నేతలు దరఖాస్తు చేస్తున్నారు. తెలంగాణలో ఓట్లు ఉన్నవారిని సోషల్ మీడియా ద్వారా హోటల్స్కి పిలిపించుకుని రాష్ట్రంలో ఓట్లు ఎలా నమోదు చేసుకోవాలో చెబుతున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని సీఈసీ బృందానికి ఫిర్యాదు చేశాం. ఒకరికి ఒక ఓటే మా విధానం ఒకరికి ఒక ఓటు ఉండాలన్నదే వైఎస్సార్సీపీ విధానం. తెలంగాణలో ఓటు ఉన్నవారు ఏపీలోనూ ఓటు నమోదు చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి రెండు చోట్లా ఓట్లు కలిగి ఉండటం నేరం. రాష్ట్ర అధికార యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదులపై విచారణలో నిమగ్నం కావాలనే టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేసింది. టీడీపీకి చెందిన కోనేరు సురేశ్ 10 లక్షలకు పైబడి దొంగ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం ఇందుకు నిదర్శనం. వాటిని ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లకు పంపి విచారణకు ఆదేశించింది. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదు చేశారని జిల్లా కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. కోనేరు సురేశ్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చర్యపోయారు. -
సమగ్ర ప్రణాళికతో ఎన్నికలు
సాక్షి, అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే 360 డిగ్రీల సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని, ఎలాంటి గందరగోళానికి తావు లేకుండా శాంతియుత వాతావరణంలో సజావుగా ఎన్నికలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్), సాధారణ ఎన్నికల సన్నద్ధతపై శుక్రవారం నోవాటెల్లో ప్రారంభమైన సమీక్ష సమావేశం శనివారం కూడా కొనసాగింది. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్, స్వీప్ డైరెక్టర్ సంతోష్ అజ్మేరా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్, అండర్ సెక్రటరీ సంజయ్ కుమార్, డైరెక్టర్ (వ్యయం) యశ్చి0ద్ర సింగ్తో పాటు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా, అడిషనల్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎంఎన్ హరేంధిర తదితరులు హాజరయ్యారు. జిల్లాల్లోని అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు, ఓటర్ల జాబితా స్వచ్చికరణ, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బంది, శిక్షణ తదితరాలపై శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రజెంటేషన్ ఇవ్వగా, శనివారం ఇతర జిల్లాల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతూ.. ఎలాంటి పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ప్రతి దశలో అప్రమత్తత, పారదర్శకత, జవాబుదారీతనం, నిష్పాక్షికతతో ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. ఓటర్ల జాబితాలన్నీ దోష రహితంగా ఉండాలని చెప్పారు. ఎక్కడా ఒక్క మరణించిన వ్యక్తి కానీ, డబుల్ ఎంట్రీ కానీ ఉండకుండా జాబితాల స్వచ్చికరణ జరగాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి, పారదర్శకంగా, నిర్భయంగా, సకాలంలో పరిష్కరించాలని అన్నారు. ఈవీఎంలు, ఎన్నికలకు అవసరమయ్యే ప్రతి మెటీరియల్ను మైక్రో ప్లాన్కు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్నికల అధికారులు, పౌరులు, అభ్యర్థులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వేదికలపై పూర్తిస్థాయి అవగాహన అవసరమని తెలిపారు. లొకేషన్ మేనేజ్మెంట్ (డిస్పాచ్ సెంటర్, రిసీట్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాలు, ట్రైనింగ్ సెంటర్లు)కు కూడా పటిష్ట ప్రణాళిక ఉండాలన్నారు. ఎన్నికల సిబ్బందికి సమర్థవంతమైన మాస్టర్ ట్రైనర్లతో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల్లో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూంలు కూడా కీలకమని చెప్పారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేక స్వీప్ ప్రణాళిక గత ఎన్నికల్లో నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా పోలింగ్ శాతాలను విశ్లేషించుకొని, దాని ఆధారంగా ప్రాంతాలనుబట్టి ప్రత్యేక సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ (స్వీప్) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక స్వీప్ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు మంచి ఫలితాలు ఇస్తాయన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సమస్యలకు కారణాలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి, స్థానికుల్లో భయాలను పోగొట్టాల్సిందిగా చెప్పారు. సోషల్ మీడియా ఫిర్యాదుల పరిష్కారం, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ), ఎథికల్ ఓటింగ్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, ఎన్ఫోర్స్మెంట్ తదితరాలపైనా ఎన్నికల సంఘం ప్రతినిధులు మార్గనిర్దేశం చేశారు. ఈ రెండు రోజుల సమీక్షలో స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన, సమ్మిళిత ఎన్నికల నిర్వహణకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లు భేష్ రెండు రోజుల సమీక్ష సమావేశాలకు మంచి ఏర్పాట్లు చేసి, విశిష్ట ఆతిథ్యమిచ్చిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు నేతృత్వంలోని అధికార యంత్రాంగానికి కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ బృందం ధన్యవాదాలు తెలిపింది. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఎన్నికలపై ఈసీఐ అధికారుల నేతృత్వంలో విజయవంతంగా జరిగిన నిర్మాణాత్మక సమీక్ష సమావేశాలు స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు మార్గదర్శిగా నిలిచాయని కలెక్టర్ డిల్లీరావు చెప్పారు. ఈ సందర్భంగా ఈసీఐ అధికారులను జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా సత్కరించింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్, వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, సబ్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు పాల్గొన్నారు. సరిహద్దుల్లో నిఘా పెంచాలి సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నందున రాష్ట్ర, జిల్లా సరిహద్దుల్లో నిఘా పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) కేఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డికి సూచించారు. వారు శనివారం సీఎస్, డీజీపీ, ఇతర అధికారులతో సమావేశమై సార్వత్రిక ఎన్నికల సన్నద్దతలో భాగంగా రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలపై చర్చించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, ఎన్నికలకు అవసరమైన సిబ్బంది, పోలింగ్ మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరించి రాష్ట్రంలో చేపడుతున్న చర్యలను వివిధ ప్రభుత్వ శాఖలు, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాయి. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం, మద్యం సరఫరా వంటివి నిరోధించడానికి ఎక్సైజ్ శాఖ, సెబ్ సంయుక్తంగా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థాయిల్లో సమాచారం నిరంతరాయంగా వెళ్లేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. ఈ వ్యవస్థ ద్వారా ఇంటెలిజెన్స్ సహాయంతో సకాలంలో చర్యలు తీసుకోగలమని తెలిపారు. దుర్గమ్మ సేవలో కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ శర్మ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను కేంద్ర డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్, ప్రత్యేక అధికారి ధర్మేంద్ర శర్మ శనివారం దర్శించుకున్నారు. ధర్మేంద్ర శర్మకు ఆలయ ఏఈఓ ఎన్.రమేష్ బాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవ్రస్తాలను అందజేశారు. ధర్మేంద్రశర్మ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్కుమార్, వెస్ట్ ఏసీపీ హనుమంతరావు ఉన్నారు. -
AP: టీడీపీ నిర్వాకం.. డూప్లి‘కేట్స్’..!
ఈ ఫొటోలోని చండ్ర సరళ ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి పదవిలో ఉన్నారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో తెనాలి మున్సిపాలిటీ 31వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి ఓడిపోయారు. ఈమె నెల్లూరు జిల్లా పామూరుపల్లి కోడలు. అయితే పుట్టినిల్లైన తెనాలిలోనూ ఆమెకు ఓటుంది. ఇంటి పేరు మార్పుతో రెండు చోట్లా ఓటరుగా కొనసాగుతున్నారు. జాస్తి సరళ పేరుతో తెనాలిలో ఓటరుగా నమోదు చేసుకోగా చండ్ర సరళ పేరుతో పామూరుపల్లిలో ఓటు హక్కు పొందారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ ఎంతో కీలకం! ఒకే ఒక్క ఓటు సైతం అభ్యర్థుల తలరాతలను తారుమారు చేస్తుంది! గెలుపోటములను నిర్దేశిస్తుంది! ఒకపక్క ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ గగ్గోలు పెడుతున్న విపక్ష టీడీపీ మరోపక్క చాపకింద నీరులా దొంగ ఓట్ల నమోదుకు బరి తెగించింది. తాజాగా శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ మద్దతుదారుల దొంగ ఓట్ల బాగోతం బహిర్గతమైంది. పలువురు వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లోనూ ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం ఓటర్ల జాబితా పరిశీలన, నమోదు, తొలగింపు, సవరణ లాంటి కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో టీడీపీకి చెందిన పలువురు రెండు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకున్నట్లు బయటపడింది. అక్కడా ఉంటారు.. ఇక్కడా ఉంటారు! నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలోని పామూరుపల్లి 300 ఓటర్లు ఉండే చిన్న గ్రామం. అక్కడ టీడీపీ మద్దతుదారులకు సంబంధించి 30 ఓట్ల డబుల్ ఎంట్రీ వ్యవహారం తాజాగా బయటపడింది. గ్రామంలో ఓటు హక్కు ఉన్న చింతగుంపల ప్రసాద్, చింతగుంపల అరుణ, చింతగుంపల ముఖేష్కు కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం రాచెరువురాజుపాలెం గ్రామంలోనూ ఓటర్లుగా నమోదయ్యారు. చండ్ర చలపతిరావు, చండ్ర సరళకు పామూరుపల్లిలో పాటు తెనాలిలోనూ ఓట్లు ఉన్నాయి. చండ్ర ఈశ్వరమ్మకు వరికుంటపాడులోనే రెండు చోట్ల ఓట్లు ఉండటం గమనార్హం. వివాహమై అత్తారింటికి వెళ్లిన కొందరు మహిళలకు అటు మెట్టినింట్లోను, ఇటు పుట్టింటిలోనూ 2 చోట్ల ఓట్లున్నాయి. సోమిరెడ్డి – నారాయణ కుట్రలు ► సర్వేపల్లి నియోజకవర్గం పరిధిలోని ఐదు మండలాలలో 11,291 మంది వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి సోమిరెడ్డి తన అనుచరులతో ఫారం–7 ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయించారు. వెరిఫికేషన్ సమయంలో అనుమానం రావడంతో పరిశీలించగా టీడీపీ నేతలు కుట్ర పన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ► ఇదే తరహాలో నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల ఓట్లను తొలగించేందుకు మాజీ మంత్రి పొంగూరు నారాయణ టీమ్ ప్రయత్నించింది. వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను ఆన్లైన్లో ఫారం–7 ద్వారా తొలగించేందుకు దరఖాస్తు చేయించారు. అయితే నెల్లూరు కార్పొరేషన్ నుంచి సంబంధిత ఓటర్లకు సమాచారం వెళ్లడంతో ఈ కుట్రలు విఫలమయ్యాయి. నెల్లూరు నగర నియోజకవర్గం జనార్దన్రెడ్డి కాలనీ పోలింగ్ బూత్ నెంబర్ 10లో గౌస్బాషా వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కావడంతో అతడి ఓటును తొలగించేందుకు ఎల్లో గ్యాంగ్ ఆన్లైన్లో ఫారం–7 ద్వారా దరఖాస్తు చేసింది. బూత్ నెంబర్ 9లో ఎస్ మస్తాన్, పెల్గగరి దేవయానం మృతి చెందినట్లు పేర్కొంటూ ఓటర్లుగా తొలగించేందుకు ఫారం–7 ద్వారా దరఖాస్తు చేశారు. -
పోల్ మేనేజ్మెంట్పై బీజేపీ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ బూత్ మేనేజ్మెంట్పై బీజేపీ దృష్టిసారించింది. పార్టీ అభ్యర్థులకు ఓటింగ్ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెడుతోంది. బూత్స్థాయిలో ఓటర్ల జాబితాలోని ఒక్కో పేజీ పర్యవేక్షణకు నియమించిన పన్నా ప్రముఖ్ల ద్వారా ఓటర్లంతా కచ్చితంగా ఓటేసేలా చూడాలని పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు. బూత్ కమిటీల సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించే చర్యలు చేపడుతున్నారు. పార్టీ వైపు మొగ్గుచూపే ఓటర్లను కచ్చితంగా బూత్కు రప్పించేలా చేయడంలో లోటుపాట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని పార్టీ నాయకులు క్యాడర్కు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మంగళవారం సాయంత్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ పోలింగ్ బూత్ అధ్యక్షులు, ఆపై నాయకులు, జిల్లా అధ్యక్షులు, ముఖ్యనేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది. బుధవారం కూడా టెలికాన్ఫరెన్స్ చేపట్టి పోల్ మేనేజ్మెంట్పై తగిన సూచనలు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 35,655 వేల పోలింగ్ బూత్లకుగాను 90 శాతం బూత్లలో బీజేపీ సంస్థాగతంగా కమిటీలు ఏర్పాటు చేసుకుంది. జాతీయ నేతల ప్రచారంతో గెలుపుపై ధీమా... రాష్ట్రంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం బీజేపీ అభ్యర్థుల గెలుపునకు, ఓటింగ్ శాతం పెంచేందుకు దోహదపడుతుందనే ధీమా పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పరిధిలో మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మరికొన్ని చోట్ల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర జిల్లాల్లో కేంద్ర మంత్రుల ప్రచారం ప్రభావం చూపిందనే విశ్వాసాన్ని వారు వెలిబుచ్చుతున్నారు. -
తెలంగాణ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. శుక్రవారం ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాగానే.. నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రంలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వుడ్ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గాలకు శాసనసభ్యులను ఎన్నుకోవాల్సిందిగా నోటిఫికేషన్లో కోరింది ఈసీ. నేటి నుంచి 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అలాగే 15వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించింది ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఏర్పాటు చేసిన ఆర్వో(ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్) కార్యాలయాల్లో అభ్యర్థులు నామినేషన్ వేయాల్సి ఉంటుంది. నామినేషన్లు వేసే అభ్యర్థులకు సూచనలు ►నేటి నుంచి నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ స్వీకరణ ►ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3గంటల వరకు నామినేషన్ స్వీకరణ ►నామినేషన్ దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ వద్దకు అభ్యర్థి వెంట నలుగురికి అనుమతి ►నామినేషన్ పత్రాలతో పాటు ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, విద్యా అర్హత వివరాలు పత్రాలను దాఖలు చేయాలి ►నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి దాఖలుకు ఒకరోజు ముందు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి EC కి వెల్లడించాలి. ►కొత్త బ్యాంక్ అకౌంట్ లోనే అభ్యర్థి ఖర్చు వివరాలను తెలపాలి ►సువిధా యాప్ ద్వారా నామినేషన్ దాఖలు చేసే సదుపాయం కల్పించిన ఎన్నికల సంఘం ►ఆన్లైన్ లో దాఖలు తరువాత పత్రాలను RO కు అప్పగించాలి ►ప్రతిరోజు సాయంత్రం 3 గంటల తరువాత రోజువారీ నామినేషన్ వివరాలు వెల్లడించనున్న RO ►ప్రతిరోజు నామినేషన్ పత్రాలతో పాటు అఫిడేవిట్ పత్రాలను డిస్ప్లే చేయనున్న RO ►నామినేషన్ దాఖలు చేసిన ప్రతి అభ్యర్థి అఫిడేవిట్ పత్రాలను 24గంటల్లోనే CEO వెబ్సైట్ లో పెట్టనున్న ఎన్నికల అధికారులు ►అభ్యర్థులు అవసరమైతే 15వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు 3 వాహనాలు.. ఐదుగురికే అనుమతి శుక్రవారం ఉదయం 11 గంటలలోపు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఆ వెంటనే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించే సహాయ రిటర్నింగ్ అధికారుల (ఏఆర్వోలు) పేరు, రిటర్నింగ్ అధికారి కార్యాలయ చిరునామాను ప్రకటిస్తూ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ‘ఫారం–1’నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఉదయం 11 గంటల నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలోపు ఒక్కో అభ్యర్థికి సంబంధించిన 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. నామినేషన్తో పాటుగా నిర్దేశిత ఫారం–26లో అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు వంటి వివరాలను అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల వ్యయం పర్యవేక్షణ కోసం నామినేషన్ల దాఖలుకు కనీసం ఒకరోజు ముందు ప్రతి అభ్యర్థి ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘సువిధ’పోర్టల్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్ దాఖలు చేయవచ్చు. అయితే సంతకాలు చేసిన హార్డ్ కాపీని గడువులోగా ఆర్వోకు సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్ 30న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్రంలోని 35,356 కేంద్రాల్లో పోలింగ్ జరగనుంది. ఇటీవల ప్రకటించిన తుది జాబితా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 3,17,17,389 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. త్వరలో ప్రకటించనున్న అనుబంధ ఓటర్ల జాబితాతో ఈ సంఖ్య స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. డిసెంబర్ 3వ తేదీన ఓటింగ్ ఫలితాలు వెల్లడవుతాయి. సర్వం సిద్ధం! రాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం పూర్తిస్థాయిలో సమాయత్తమైంది. దాదాపుగా ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు ప్రారంభించింది. క్రమంగా ప్రత్యేకంగా ఓటర్ల జాబితా రెండో సవరణ, ఈవీఎంలు సిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పౌలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కనీస సదుపాయాల కల్పన, దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాల కల్పన, భద్రత ఏర్పాట్లను పూర్తి చేసింది. పటిష్ట బందోబస్తు, ఎక్కడికక్కడ నిఘా ఎన్నికల్లో ఓటర్లను డబ్బులు, మద్యం, ఇతర కానుకలతో ప్రలోభపెట్టేందుకు జరిగే ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈసారి ఎన్నికల సంఘం పటిష్ట ఏర్పాట్లు చేసింది. 4 రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే 17 జిల్లాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది. 89 పోలీసు చెక్పోస్టులు, 14 రవాణా, 16 వాణిజ్య పన్నులు, 21 ఎక్సైజు, 8 అటవీ శాఖ చెక్పోస్టులను ఏర్పాటు చేసింది. ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని జిల్లాల్లో వీడియో నిఘా బృందాలు, వీడియో వ్యూయింగ్ టీమ్లు, అకౌంటింగ్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్స్, స్టాటిక్ సర్వైలియన్స్ టీంలు, ఖర్చుల పర్యవేక్షణ బృందాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు 119 నియోజకవర్గాల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. శాంతిభద్రతల పర్యవేక్షణ, బందోబస్తు ఏర్పాట్లు, పరిపాలన, పోలీసు విభాగాల మధ్య సమన్వయం కోసం 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించింది. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులపై నిఘా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న సుమారు 50 మందిని వ్యయ పరిశీలకులుగా నియమించింది. పోలింగ్ రోజు అన్ని కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సదుపాయం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. -
ఓటర్ల నమోదుకు రేపే చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ప్రకటించిన తుది జాబితాలో మీ పేరు లేదా? జాబితాలో పేరు ఉన్నా మరో ప్రాంతానికి నివాసం మార్చారా? మీ పేరు, ఇతర వివరాలు తప్పుగా అచ్చు అయ్యాయా?.. ఇలాంటి కారణాలతో నవంబర్ 30న జరగనున్న రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల్లో ఓటేయలేమని బాధపడుతున్నారా? అయితే మీలాంటి వారి కోసం కేంద్ర ఎన్నికల సంఘం మరో అవకాశాన్ని కల్పిస్తోంది. కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం–6, ఇతర ప్రాంతానికి ఓటు బదిలీ, పేరు, ఫొటో, ఇతర వివరాల దిద్దుబాటు కోసం ఫారం–8 దరఖాస్తులను అక్టోబర్ 31లోగా సమర్పిస్తే వచ్చే శాసనసభ సాధారణ ఎన్నికల్లో మీకు ఓటు హక్కు లభించనుంది. నివాసం ప్రస్తుతం ఉండే నియోజకవర్గంలోనే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారినా, లేదా ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారినా ఫారం–8 దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఓటరు జాబితా/ ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో సరిగ్గా లేకపోయినా, పేరు, ఇతర వివరాలు తప్పుగా వచ్చినా ఫారం–8 దరఖాస్తు ద్వారానే సరిదిద్దుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారితో ప్రత్యేకంగా అనుబంధ ఓటర్ల జాబితాను ఎన్నికల యంత్రాంగం ప్రచురించనుంది. తుది ఓటర్ల జాబితాతో పాటు అనుబంధ ఓటర్ల జాబితాలోని ఓటర్లకు వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నామినేషన్ల ప్రక్రియ ముగింపునకు 10 రోజుల ముందు నాటికి వచ్చిన ఓటరు నమోదు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఎన్నికల్లో ఓటేసేందుకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. నవంబర్ 3న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ రానుండగా, 10తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. దానికి 10 రోజుల ముందు అనగా, అక్టోబర్ 31 నాటికి దరఖాస్తు చేసుకున్న వారికి శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనున్నారు. దరఖాస్తు ఎలా చేసుకోవాలి..? ఓటర్ల నమోదు, ఓటు బదిలీ, వివరాల దిద్దుబాటు.. తదితర సేవల కోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ https://voters.eci.gov.in లో అన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటర్ హెల్ప్లైన్ యాప్(వీహెచ్ఏ)ను మొబైల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని కూడా ఈ సేవలను పొందవచ్చు. లేకుంటే స్థానిక బూత్ స్థాయి అధికారి(బీఎల్ఓ), ఓటరు నమోదు అధికారి (ఈఆర్వో)ను కలసి సంబంధిత దరఖాస్తు ఫారాన్ని నింపి అందజేయాల్సి ఉంటుంది. ఓటరు నమోదు కోసం కొత్తగా దిగిన ఫొటోతో పాటు చిరునామా, వయసు ధ్రువీకరణ కోసం పదో తరగతి మార్కుల పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, విద్యుత్ బిల్లు డిమాండ్ నోటీసు, గ్యాస్/బ్యాంక్ పాసుపుస్తకాలు వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి? ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా ? అనేది తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా https://electoralsearch.eci. gov.in అనే వెబ్సైట్ను నిర్వహిస్తోంది. ఓటరు వివరాలు, ఓటరు గుర్తింపు కార్డు (ఎపిక్), మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుండేది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. అయితే ఓటర్స్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఓటర్ల జాబితాలో పేరును సులువుగా సెర్చ్ చేయవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్ను తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https://ceotserms2.telangana.gov.in/ ts search/ Non Standard Epic.aspx ను సందర్శించి మీ పాత కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్ను తెలుసుకోవచ్చు. -
ఏఎస్డీ జాబితాలో ‘వలస’ ఓటర్లు
ఓటరు నమోదుకు ఎప్పటిలోగా దరఖాస్తు చేసుకోవాలి? వేరే ప్రాంతానికి ఓటును బదిలీ చేసుకోవచ్చా? వికాస్రాజ్: కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, వేరే ప్రాంతానికి బదిలీ/వివరాల దిద్దుబాటుకు ఫారం–8ను అక్టోబర్ 31లోగా దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్లు నవంబర్ 10తో ముగుస్తాయి.ఆ తర్వాత అర్హులైన వారి పేర్లతో అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురిస్తాం. కొత్త ఓటర్లకు కార్డుల పంపిణీ ఎప్పుడు చేస్తారు? ఇప్పటికే 27.5 లక్షల కొత్త ఓటర్లకు సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి స్పీడు పోస్టు ద్వారా వారి చిరునామాలకు పంపాం. మరో 12.5 లక్షల కార్డులను ముద్రించి నవంబర్ 15లోగా పంపిస్తాం. నవంబర్ 10 తర్వాత ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పుల పంపిణీ ప్రారంభిస్తాం. హైదరాబాద్లో పోలింగ్ కేంద్రం ఎక్కడుందో తెలియక చాలామంది ఓటేయలేకపోతున్నారు? పోలింగ్ కేంద్రం వివరాలతో ఓటర్లందరికీ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పులను పంపిణీ చేస్తాం. ‘ఓటర్ హెల్ప్లైన్ యాప్’తోపాటు ఈసీఐ వెబ్సైట్లోని ‘ఓటర్ సహాయ మిత్ర’ అనే లింక్ ద్వారా పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవచ్చు. ఓటరు కార్డు నంబర్ ద్వారా వివరాలు తెలుస్తాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కొందరి పోలింగ్ కేంద్రాలు మారొచ్చు. ఓటర్ల జాబితాలో 120 ఏళ్లకు పైబడిన ఓటర్లు వందల సంఖ్యలో ఉన్నారు? ఎలా సాధ్యం? పుట్టిన సంవత్సరం సరిగ్గా తెలియక కొందరు తమ పుట్టిన సంవత్సరాన్ని 1900గా నమోదు చేయించారు. దీంతో కొందరు ఓటర్ల వయసు 120 ఏళ్లకు పైగా ఉన్నట్టు జాబితాలో వచ్చింది. ఆ ఓటర్లే తమ పుట్టిన సంవత్సరం సవరణకు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా పొందాలి? 80 ఏళ్లుపైబడిన వృద్ధులు, 40శాతానికి మించిన వైకల్యమున్న ఓటర్లు ఇంటి నుంచే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయొచ్చు. ఇందుకోసం వీరికి ‘ఫారం–12డీ’ దరఖాస్తులను పంపిణీ చేస్తున్నాం. వీటిని బీఎల్ఓలు సేకరిస్తారు. ముందే నిర్దేశించిన తేదీల్లో ప్రిసైడింగ్ అధికారి నేతృత్వంలోని బృందం వీరి ఇళ్లకు వెళ్లి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తుంది. రహస్యంగా ఓటేసేందుకు వీలుగా ఇంట్లో కంపార్ట్మెంట్ సైతం ఏర్పాటు చేస్తుంది. వీడియో కెమెరా బృందం, పోలీసులు సైతం ఉంటారు. పార్టీల ఏజెంట్లనూ అనుమతిస్తారు. ఓటేసిన తర్వాత ఓటరే స్వయంగా బ్యాలెట్ పత్రాన్ని కవర్లో ఉంచి సీల్ చేసి ప్రిసైడింగ్ అధికారికి ఇవ్వాలి. జర్నలిస్టులతో సహా 13 అత్యవసర సేవల విభాగాల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇచ్చే కేంద్రాల్లోనే పోలింగ్ ఫెసిలిటేటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడే వారికి పోస్టల్ బ్యాలెట్ ఇచ్చి ఓటు వేయించుకుంటాం. ప్రగతి భవన్లో బీ–ఫారాల పంపిణీ, రజాకార్ సినిమా, సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై అధికార, విపక్ష పార్టీలు ఫిర్యాదు చేశాయి కదా? ఆ ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలనలో ఉన్నాయి. అక్కడి నుంచి అందే సూచనల మేరకు చర్యలు తీసుకుంటాం. ఎన్నికల సంఘం ఇటీవల రాష్ట్రంలోపెద్దఎత్తున అధికారులను ఆకస్మిక బదిలీ చేసింది? కారణమేంటి? బదిలీ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా కారణాలేమీ తెలపలేదు. వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలిస్తే నామినేషన్ తిరస్కరిస్తారా? అఫిడవిట్లో తప్పుడు సమా చారమిస్తే రిటర్నింగ్ అధికారి నామినేషన్ను తిరస్కరించరు. అన్ని కాలమ్లను భర్తీ చేయనిపక్షంలో అభ్యర్థికి నోటీసులిస్తారు. అయినా భర్తీ చేయకుంటే ఆ నామినేషన్ను తిరస్కరించవచ్చు. నేర చరిత్రపై అభ్యర్థులు, పార్టీలు సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా అనామక పత్రికల్లో ప్రకటనలు ఇస్తున్నాయి? త్వరలో అన్ని పార్టీలకు సూచనలు జారీ చేస్తాం. సర్క్యులేషన్, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలో ఓ జాబితాను పార్టీలకు అందజేస్తాం. ఆన్లైన్ ద్వారా ఓటర్లకు నగదు బదిలీపై నిఘా ఉంచారా? యూపీఐ ద్వారా ఏ బ్యాంకు ఖాతా నుంచి ఎంత డబ్బు బదిలీ చేస్తున్నారు? అనే అంశంపై ఆదాయ పన్ను శాఖకు రోజువారీగా నివేదికలు అందుతున్నాయి. రాష్ట్రానికి కేంద్ర బలగాలు ఎన్ని వస్తున్నాయి? ఎన్నికల బందోబస్తు కోసం 65 వేల మంది పోలీసుల సేవలు అవసరం కాగా, రాష్ట్రంలో 40వేల మంది ఉన్నారు. మరో 25,000 మంది బలగాలను పంపాలని డీజీపీ అడిగారు. 100 కంపెనీల కేంద్ర బలగాలు రాష్ట్రానికి వస్తున్నాయి. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు.. కలెక్టర్..
ఆదిలాబాద్: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన క్రమంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్రాజ్ అ న్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ వివరాలు వెల్లడించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల కమి షన్ సోమవారం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వి డుదల చేసిందని తెలిపారు. దీంతో నియమావళి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుందని, 10 వరకు నామినేషన్ల గడువు, 13న పరిశీలన, 15న ఉపసంహరణ, 30న పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 3న కౌంటింగ్ ఉంటుందని వివరించారు. ఓటర్లు, ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఓటరు లిస్టుతో తమ పేర్లు ఉన్నయో లేవో పరిశీలించుకోవాలన్నారు. ఎవరైనా పేర్లు లేకపోతే నామినేషన్లకు పది రోజుల ముందు వరకు ఫారం–6 ద్వారా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పోటీ చేసే అభ్యర్థులకు నిబంధనలతో కూడిన బుక్లెట్ అందజేస్తామన్నారు. నియమావళిని పరిశీలించేందుకు ఫ్లయింగ్స్క్వాడ్ నియమించినట్లు తెలిపారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్కడ నిరంతరం సీసీ నిఘా, వీడియో చిత్రీకరణ ఉంటుందన్నారు. వీటిని కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలకు అనుసంధానం చేశామన్నారు. ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తామన్నారు. అలాగే సర్వేలైన్ అధి కారుల ద్వారా పరిస్థితులను సమీక్షిస్తామన్నారు. ఒకవ్యక్తి రూ.50వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లరాదని, అంతకు మించి తీసుకెళితే సంబంధించిన పత్రాలు వెంట ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే డబ్బును సీజ్ చేస్తామన్నారు. అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురి చేయవద్దని, సభలు, సమావేశాలు నిర్వహించే ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయూత వాతావరణంలో ఎన్నికల్లో పాల్గొ ని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నా రు.ఎన్నికల నిర్వహణ కోసం అన్నిఏర్పాట్లు చేస్తా మన్నారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా పె డుతామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సంక్షే మ పథకాలు సూచించే ఫ్లెక్సీలు తొలగించామన్నారు. ఇందులో ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, ఐటీడీఏ పీవో చాహత్బాజ్పాయ్ పాల్గొన్నారు. -
TS Election 2023: కసరత్తు పూర్తి.. తుది ఓటరు జాబితా సిద్ధం..!
జోగులాంబ: త్వరలో అసెంబ్లీ ఎన్నికల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన ఘట్టమైన తుదిఓటరు జాబితాను సిద్ధం చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. ఇందుకు సంబంధించి ఆగస్టు 21వ తేదీన విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాపై మార్పులు, చేర్పులు, 18సంవత్సరాలు నిండిన వారికి కొత్తగా ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించింది. ఈక్రమంలో ఫాం–6, 7, 8లకు సంబంఽధించి (చేర్పులు, మార్పులు, తొలగింపు)జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చాయి. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు పోలింగ్ స్టేషన్ల వారీగా క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి తుదిజాబితాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆగస్టులో ముసాయిదా జాబితా విడుదల.. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితాలో చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆధారంగా చేసుకుని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆధ్వర్యంలో ఆగస్టు 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,78,951మంది ఓటర్లున్నట్లు పేర్కొన్నారు. ఇందు లో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపా రు. వీటిపై ఏమైన అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదుల చేసుకునేందుకు అదేవిధంగా 18సంవత్సరాలు నిండిన వారికి ఓటుహక్కు కల్పించేందుకు సెప్టెంబర్ 19తేదీ వరకు మరో అవకాశం కల్పించింది. పెరగనున్న ఓటర్లు.. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల పరిధిలో 4,78,951 ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా ఓటరు జాబితా లెక్కలు చెబుతుండగా, వీటిపై మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి 44,963 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన వాటిని ఆధారంగా ప్రస్తుతం ఉన్న ఓటర్ల సంఖ్య కంటే మరికొంత మేర ఓటర్ల సంఖ్య పెరగనుంది. జాబితాను ఎన్నికల సంఘం నిర్ధేశించిన ప్రకారం ఈనెల 4వ తేదీన విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిసింది. మొత్తం 44,963 దరఖాస్తులు! ముసాయిదా ఓటరు జాబితాపై చేర్పులు, మార్పులు, తొలగింపు ప్రక్రియకు సంబంధించి ఫాం–6, 7, 8 కింద జిల్లా వ్యాప్తంగా 44,963 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో గద్వాల నియోజకవర్గంలో ఫాం–6కి 13,746, ఫాం–7కి 7,800, ఫాం–8కి 8450 దరఖాస్తులు, అలంపూర్ నియోజకవర్గ పరిధి లో ఫాం–6కి 8,432, ఫాం–7కి 3,001, ఫాం–8కి 3,531 దరఖాస్తులు వచ్చినట్లు తె లిపారు. వీటన్నింటిని జిల్లా వ్యాప్తంగా ఉన్న 593పోలింగ్ స్టేషన్లలలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ప్రతి దరఖాస్తును పరిశీలించాం.. ముసాయిదా జాబితాపై ఫాం–6,7,8లకు సంబంఽధించి వచ్చిన దరఖాస్తులను పోలింగ్ స్టేషన్ల వారిగా సందర్శించి పరిశీలించడం జరిగింది. తుది ఓటరు జాబితాను ఈనెల 4వ తేదీన విడుదల చేస్తాం. – వల్లూరు క్రాంతి, కలెక్టర్ -
Telangana: ఎన్నికలకు సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర శాసన సభ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఇందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్రాజ్ తెలిపారు. గత మే 23 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యే క సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించామని, మరో వారంలో తుది జాబితాను ప్రకటిస్తామని వెల్లడించారు. ఈవీఎంలన్నింటికీ ప్రాథమిక స్థాయి తనిఖీలతోపాటు అన్ని జిల్లాల్లో ఎన్నికల శిక్షణ కార్యక్రమాలను సైతం పూర్తి చేశామన్నారు. శాసనసభ ఎన్నికల కవరేజీ కోసం బీఆర్కేఆర్ భవన్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా కేంద్రాన్ని ఆయన శనివారం ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను స్వీకరించి పరిశీలిస్తారని, బ్యాలెట్ పత్రాల ముద్రణ తర్వాత ఈవీఎంలకు ద్వితీయస్థాయి తనిఖీల(ఎస్ఎల్ఎఫ్)ను నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చే ఎన్నికల పరిశీలకుల సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చే నెల తొలి వారంలో వచ్చే అవకాశం ఉందా? అని విలేకరులు ప్రశ్నించగా, షెడ్యూల్ను ఈసీ ప్రకటిస్తుందని బదులిచ్చారు. జిల్లాల్లో చురుగ్గా ఏర్పాట్లు అక్టోబర్ 4న తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన తర్వాత జిల్లాల్లో ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంటుందని వికాస్రాజ్ చెప్పారు. ఈవీఎంల పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు ఏర్పాటు, ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులను గుర్తించి శిక్షణ ఇస్తామని తెలిపారు. నిబంధనల మేరకు ర్యాంపులు, విద్యుదీకరణ, టాయిలెట్లు వంటి కనీస సదుపాయాలు ప్రతీ పోలింగ్ కేంద్రంలో ఉన్నాయా? లేవా? అని పరిశీలించామని, సదుపాయాలను కల్పించే ప్రక్రియ చివరి దశకు చేరుకుందన్నారు. కేంద్ర బలగాలకు వసతి, రవాణా సదుపాయాలు కల్పించడంతోపాటు ఎంత మందిని సమస్యాత్మక ప్రాంతాల్లో నియమించాలన్న దానిపై ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 6.99 లక్షల మంది యువ ఓటర్లు గత జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 15 లక్షల మంది కొత్త ఓటర్లు జాబితాలో చేరారని, వీరిలో 6.99 లక్షల మంది 18–19 ఏళ్ల యువ ఓటర్లు ఉన్నారని వికాస్రాజ్ తెలిపారు. లక్ష మంది దివ్యాంగ ఓటర్లను గుర్తించామన్నారు. 80 ఏళ్లుపైబడిన, దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం ఫుల్ కమిషన్ పర్యటించనుందని ఆయన తెలిపారు. కమిషన్ రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీఎస్, డీజీపీ, 20కి పైగా కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహిస్తుందని వివరించారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటికే నివేదికలు తమకు అందుతున్నాయన్నారు. ఓటరు నమోదు కోసం.. ఓటర్ల జాబితాతో సహా ఇతర అంశాలపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, ప్రతి ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపి ఫిర్యాదుదారులకు సైతం నివేదిక ప్రతిని అందజేస్తున్నామని వికాస్రాజ్ వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో 700 బృందాలు నాలుగు వేలకు పైగా ఇళ్లను సందర్శించి చిరునామా మారిన ఓటర్ల తొలగింపును చేపట్టారని తెలిపారు. నామినేషన్ల చివరి తేదీ వరకు ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు సీఈఓలు సర్ఫరాజ్ అహ్మద్, లోకేష్కుమార్, సమాచార శాఖ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ సీఈఓ సత్యవాణి పాల్గొన్నారు. -
ప్రతి ఓటరూ ఆధార్తో లింక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఓటరునూ ఆధార్తో అనుసంధానం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) ముఖేష్కుమార్ మీనాకు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) విజ్ఞప్తి చేశారు. దీనివల్ల దొంగ ఓట్లను పూర్తిగా నివారించడంతోపాటు ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓట్లు ఉండకుండా అడ్డుకట్ట వేయవచ్చని తెలిపారు. మంగళవారం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో సీఈవో ముఖేష్కుమార్ మీనాను మాజీ మంత్రులు పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, కైలే అనిల్కుమార్, పార్టీ నేత దేవినేని అవినాశ్తో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం కలిసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చాలా చోట్ల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, ఒకే ఫోటో లేదా ఒకే పేరు, ఒకే ఓటర్ ఐడీతో చాలా ఓట్లు ఉన్న విషయాన్ని సీఈవో దృష్టికి తెచ్చామన్నారు. ఒక మనిషికి ఒకే ఓటు ఉండాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోందన్నారు. ప్రతి ఓటరునూ ఆధార్తో అనుసంధానం చేయాలన్న తమ విజ్ఞప్తిపై సీఈవో సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రమిస్తున్న వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం అక్రమాలు టీడీపీ సర్కార్ నిర్వాకాలే.. ఓటర్ల జాబితాలను ప్రభుత్వం మార్చేస్తోందంటూ గత 15 రోజులుగా ఈనాడు, ఆంధ్రజ్యోతితోపాటు టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. 2017, 2018, 2019 ఓటర్ల జాబితాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 2023లో ఓటర్ల జాబితా ఎలా ఉందనే విషయాన్ని సీఈవోకి ఉదాహరణలతో సహా తెలియచేశాం. పేరులో చిన్న మార్పు, అడ్రస్లో చిన్న మార్పుతో ఒకే మనిషికి రెండు, మూడు ఓట్లు ఉన్నాయి. అలా 59,18,631 ఓట్లు ఉన్నట్లు 2019 ఎన్నికలకు ముందే వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఇవాళ 2023 జాబితాను చూస్తే పేరు, చిరునామాలో చిన్న మార్పులు, ఫోటోల మార్పుతో.. ఒకే మనిషికి రెండు మూడు చోట్ల దాదాపు 40 లక్షల ఓట్లు ఉండగా.. తెలంగాణ, ఏపీలో రెండు చోట్లా ఓట్లున్న వారు దాదాపు 16.59 లక్షల మంది ఉన్నారు. ► 9,242 ఇళ్లలో 20 నుంచి 30 ఓట్ల వరకు ఉండగా 2,643 ఇళ్లలో 31 నుంచి 40 ఓట్ల వరకు ఉన్నాయి. 1,223 ఇళ్లలో 41–50 ఓట్లున్నాయి. ఇంకా 1,614 ఇళ్లలో 51–100 వరకు ఓట్లున్నాయి. 386 ఇళ్లలో 101–200 ఓట్లున్నాయి. 96 ఇళ్లలో 201 నుంచి ఏకంగా 500 వరకు ఓట్లున్నాయి. 14 ఇళ్లలో 501 నుంచి 1,000 ఓట్ల దాకా ఉన్నాయి. ఇవన్నీ 2019 ఓటర్ల జాబితాలో కూడా ఉన్నాయి. ఇక ఏ డోర్ నెంబరూ లేకుండా ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లున్నాయో కూడా సీఈవోకు వివరించాం. 2019లో కూడా ఆ ఓట్లపై చర్యలు తీసుకోవాలని మేం కోరినా అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. వీటన్నింటిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఓటర్ల జాబితాను సవరించాలని సీఈవోను కోరాం. నాడు కళ్లు మూసుకున్నావా రామోజీ? ► ఒకే డోర్ నెంబరుతో 500 ఓట్లున్నాయని ఈనాడు రామోజీరావు మమ్మల్ని నిందిస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారం విజయవాడ సూర్యారావుపేట పోలింగ్ బూత్ను పరిశీలిస్తే కడియాలవారి వీధి పేరుతో ఉన్న డోర్ నెంబర్లో 2019లో కూడా 500 ఓట్లు ఉన్నాయి. మరి ఆ ఆషాఢభూతి ఇప్పుడు కొత్తగా ఓట్లు చేర్చారని మాపై ఆరోపణలు చేస్తున్నారు. పాపాలు చేసింది వారైతే నిందలు మోపేది మాపైనా? ► రేపల్లెలో ఎడాపెడా దొంగ ఓట్లున్నాయని ఒక పేపర్లో రాశారు. నిజానికి అది 2019 నాటి ఓటర్ల జాబితా. అప్పుడే అవకతవకలు చేశారు. ఒకే డోర్ నెంబర్లో 148 ఓట్లు న్నాయి. జర్నలిస్టుల ముసుగులో కుల పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయి. ఆ అవకతవకలన్నీ 2019 ఓటర్ల జాబితాలో ఉన్నాయి. మరి ఆనాడు ఎందుకు వార్తలు రాయలేదు? ► పార్వతీపురం నియోజకవర్గంలో సున్నా నెంబర్ ఇంట్లోనూ వందల సంఖ్యలో ఓటర్లు ఉన్నారు. మరి ఆనాడు మీకు ఇవేవీ కనిపించలేదా? ధృతరాష్ట్రుడిలా రామోజీకి కళ్లు కనిపించలేదా? ► 2019లోనే ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగాయి. అప్పుడే మేం వాటిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వాటిని ఇప్పుడు మేం సవరిస్తుంటే దొంగ ఓట్లు చేరుస్తున్నామంటూ నిందిస్తున్నారు. జాబితాలో పెరిగిందెక్కడ? రాష్ట్రంలో 2019 జనవరి నాటికి 3,98,34,776 మంది ఓటర్లు ఉండగా 2023 జనవరి నాటికి 3,97,96,678 మంది ఓటర్లున్నారు. మరి అలాంటప్పుడు మేం కొత్తగా ఓటర్లను ఎక్కడ చేర్పించినట్లు? మేం నిజంగా ఆ పని చేసి ఉంటే ఓటర్ల సంఖ్య పెరగాలి కదా? గజదొంగ చంద్రబాబు దొంగతనాలు చేసి నీతికధలు చెబుతున్నాడు. ఓటమి భయంతో మాపై ఆరోపణలు చేస్తున్నాడు. ప్రజలను కాకుండా కుట్ర రాజకీయాలను నమ్ముకున్న చంద్రబాబును సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్పుడు వార్తలు రాస్తున్నాయి. డూప్లికేట్లనే తొలగించామని సీఈవోనే చెప్పారు ► వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దొంగ ఓట్లను గుర్తించి 2020లో 1,85,193 ఓట్లను తొలగించింది. 2021లో 1,11,076 ఓట్లు, 2022లో 11.23 లక్షల ఓట్లు వెరసి మొత్తం 14 లక్షలకు పైగా దొంగ ఓట్లను తొలగించారు. డూప్లికేట్ ఓట్లు, ఒకే ఫోటో ఉన్న ఓట్లకు సంబంధించి 10,52,326 ఓట్లను తొలగించినట్లు సీఈవోనే స్వయంగా మీడియాకు చెప్పారు. ఒకవేళ మేం దొంగ ఓట్లను చేర్పిస్తే ఇలా తొలగిస్తామా? ఆ నీచ రాజకీయం బాబుదే.. రాష్ట్రంలో 2019 ఓటర్ల జాబితాలే ఇవాళ్టికి కూడా కొనసాగుతున్నాయి. ఆ లోపాలను సవరించమని మేం కోరుతున్నాం. దొంగ ఓట్లను చేర్చడం.. అవతల పార్టీ ఓట్లను తొలగించడం చంద్రబాబుకే అలవాటు. తప్పుడు మార్గాల్లో గెలవాలని ప్రయత్నించడం ఆయనకు ఆనవాయితీ. ► తెలంగాణకు చెందిన బీజేపీ నేత బండి సంజయ్ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నాడు. చంద్రబాబు కోసం ఆయన పని చేస్తున్నారు. ఎందుకీ దిక్కుమాలిన రాజకీయాలు? ► నాడు టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే అంటే 2015 జనవరి నాటికి 22,76,714 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మరో ఏడాదిలో అంటే 2016లో 13,00,613 మంది ఓటర్లను తొలగించారు. 2017లో మరో 14,46,238 మందిని తొలగించారు. అలా మూడేళ్లలో టీడీపీ హయాంలో మొత్తం 50,23,565 మంది ఓటర్లను జాబితాల నుంచి తొలగించారు. ► సేవామిత్ర అనే యాప్ ద్వారా వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి వారందరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. దానిపై మేం పోరాడాల్సి వచ్చింది. కోర్టులు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి ఆ ఓట్లను తిరిగి చేర్పించే ప్రయత్నం చేశాం. -
ఓటరు జాబితా ‘ప్రక్షాళన’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ కోసం ఎన్నికల సంఘం పకడ్బంధీ చర్యలు చేపట్టింది. సమగ్ర ఇంటింటి సర్వే ద్వారా పలు రకాల తప్పులను గుర్తించి ఓటరు జాబితా రూపకల్పనలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఒకే ఇంటి నెంబర్తో భారీ సంఖ్యలో ఓట్లు నమోదైన విషయాన్ని పలు రాజకీయ పా ర్టీలు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకురావడంతో పాటు ఓటరు జాబితా తయారీలో తప్పులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్న కేంద్ర ఎన్నికల సంఘం సూచనల ఆధారంగా ఈ సర్వే చేపట్టినట్లు తెలంగాణ ఎన్నికల కమిషన్ వర్గాలు వెల్లడించారు. కమిషన్ వర్గాల సమాచారం ప్రకారం ఈఆర్వో.నెట్ పోర్టల్లో అందుబాటులో ఉన్న ఓటరు డేటాను పరిగణనలోకి తీసుకుని ఇంటింటి సర్వే నిర్వహించడం ద్వారా సూక్ష్మ పరిశీలన జరిపారు. ఈ విధంగా జరిపిన పరిశీలనలో రాష్ట్రంలోని మొత్తం 7,66,557 ఆవాసాల్లో ఉన్న 75,97,433 ఓట్ల సవరణ జరిగింది. హైదరాబాద్ నగరంలోని కార్వాన్ నియోజకవర్గంలో అత్యధికంగా 17,398 ఆవాసాల్లోని 2,20,316 మంది ఓటర్లు, యాకుత్పురా పరిధిలోని 14,883 ఆవాసాల్లో ఉన్న 1,84,060 ఓటర్లు, రాజేంద్రనగర్లోని 13,901 ఆవాసాలకు చెందిన 1,57,972 ఓటర్లు, ఎల్బీనగర్ పరిధిలోని 13,987 ఆవాసాల్లో ఉన్న 1,48,378 ఓటర్లు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 10,649 ఆవాసాల్లోని 1,06,336 మంది ఓటర్లను గుర్తించి సవరణలు చేశారు. దీంతో పాటు ఓటర్ కార్డులోని చిరునామాతో పాటు ఇతర మార్పులు, ఓటరు కార్డుల మార్పు కోసం ఫారం–8 ద్వారా వచ్చిన దాదాపు 9,00,115 దరఖాస్తులను ఎన్నికల కమిషన్ పరిష్కరించింది. ఇందులో అత్యధికంగా ఆసిఫాబాద్ నుంచి 25,026 దరఖాస్తులు రాగా గద్వాల, హుస్నాబాద్, ఖానాపూర్, మక్తల్ల నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే అత్యధికంగా సిద్దిపేటలో 18,148, శేరిలింగంపల్లిలో 17,312, మేడ్చల్లో 16,569 దరఖాస్తులు రాగా, వాటిని సమగ్రంగా పరిశీలించిన అనంతరం పరిష్కరించినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఓటర్ల పేర్లు తొలగించాలి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలిన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్రాజ్కు బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ నియోజకవర్గాల్లో ఒకే కుటుంబానికి చెందిన వారి ఓట్లను ఒకే పోలింగ్ బూత్లోకి మార్చాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం బీజేపీ జాతీయ ఈసీ కమిటీ సభ్యుడు ఓం పాఠక్, రాష్ట్రపార్టీ ఈసీ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ మర్రి శశిధర్రెడ్డి నేతృత్వంలో కమిటీ సభ్యులు ఏడెల్లి అజయ్ కుమార్, పొన్న వెంకటరమణ, కేతినేని సరళ, కొల్లూరి పవన్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాను తప్పుల తడకగా తయారుచేసిన ఈఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సీఈవోకు మరో వినతిపత్రం అందజేశారు. -
పాత ఎపిక్ ఉన్నా.. ఓటు డౌటే!
హైదరాబాద్: ఓటరు ఫొటో గుర్తింపు కార్డు (ఎపిక్) ఉందనుకొని ఇప్పుడు ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకోకపోతే.. తీరా పోలింగ్నాడు వెళ్లినా మీకు ఓటు లేదని నిరాకరించవచ్చు. ఇప్పటికే ఎపిక్ కార్డులున్నప్పటికీ చాలామంది పేర్లు ఓటర్ల జాబితాల్లో ఉండటం లేవు. వాస్తవానికి ఒక ఓటును తొలగించాలంటే నిబంధనల మేరకు ఎన్నో పాటించాల్సి ఉంది. ఓటరు కచ్చితంగా లేడని నిర్ధారించుకున్నాకే తొలగించాల్సి ఉన్నప్పటికీ ఇవేవీ లేకుండానే ఇష్టానుసారం ఓట్లను తొలగించారు. దీంతో మీకు ఎపిక్ ఉన్నప్పటికీ జాబితాలో మీ పేరు లేకపోవచ్చు. తప్పు ఎవరిదైనా మీకు ఓటు వేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఓటరు జాబితాలో మీ పేరుందో, లేదో చూసుకొని లేకుంటే దరఖాస్తు చేసుకొమ్మని కోరుతున్నారు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్. తాజాగా వెలువరించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో మీ పేరుందో లేదో చూసుకోవాలని సూచించారు. ఏ అవసరానికి ఏ ఫారం వినియోగించాలంటే.. ► 18 సంవత్సరాల వయసు దాటినప్పటికీ, ఇప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, ఎపిక్ ఉన్నప్పటికీ ఓటరు జాబితాలో పేరు లేని వారు నమోదు చేసుకునేందుకు, రాబోయే అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల వయసు నిండే వారు ఇప్పుడే నమోదు చేసుకునేందుకు ఫారం 6. ► ఆధార్తో అనుసంధానానికి ఫారం 6బి. ► జాబితాలోంచి అనర్హుల పేర్లు తొలగించేందుకు, కొత్త ఓటరు చేర్పుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు ఫారం 7 ► పేరు, వివరాల్లో దోషాలు సరిచేసుకునేందుకు, నియోజకవర్గం పేరు పొరపాటుగా ఉన్నప్పుడు,కుటుంబ సభ్యులందరి పేర్లు ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు పోలింగ్ కేంద్రాల్లో ఉన్నప్పుడు, ఫొటో సవ్యంగా లేనప్పుడు, జాబితాలో మొబైల్ నంబర్ అప్డేషన్కు ఫారం 8. ► ముసాయిదా ఓటరు జాబితాలో పేరుందో లేదో చూసుకునేందుకు www.ceotelangana.nic.in ► జాబితాలో పేరుండి పొరపాట్ల సవరణ, మార్పుచేర్పుల కోసం www.voters.eci,gov.in లేదా voterhelpline app ద్వారా ► ఇతర వివరాలకు ఓటర్ హెల్ప్లైన్ నెంబర్ 1950 సంప్రదించవచ్చు. -
నిరాశ్రయులకు ఓటు హక్కు కల్పించేలాచర్యలు చేపట్టండి
సాక్షి, విశాఖపట్నం: అర్హత కలిగి ఉండి.. నిరాశ్రయులుగా ఉన్నవారికీ ఓటు హక్కు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ ఆదేశించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ–2024పై రెండు రోజుల సమీక్ష విశాఖలో గురువారం ముగిసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్కుమార్ మీనా అధ్యక్షతన సదస్సు జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్ తరఫున డిప్యూటీ ఎన్నికల కమిషనర్ హృదేశ్కుమార్, సీనియర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నరేంద్ర ఎన్ బుటాలియా, ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్కుమార్ హాజరయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణపై అవగాహన కలెక్టర్లకు ప్రత్యేక సంక్షిప్త సవరణ (స్పెషల్ సమ్మరీ రివిజన్)–2024పై పూర్తిస్థాయి అవగాహన కల్పించారు. మానవ వనరుల లభ్యత, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, చట్టబద్ధమైన డాక్యుమెంటేషన్, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్, ఎన్నికల సిబ్బందికి, పోలింగ్ స్టేషన్లకు కనీస సౌకర్యాలు, ఫిర్యాదు నిర్వహణ తదితర అంశాలపై కూడా చర్చించారు. ముగింపు సందర్భంగా సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ధర్మేంద్ర శర్మ, నితీష్కుమార్ వ్యాస్ మాట్లాడుతూ అర్హులైన వారందర్నీ ఓటరు జాబితాలో 100 శాతం చేర్పించేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నిరాశ్రయులపై శ్రద్ధ వహించాలనీ, అట్టడుగు సమాజంలో ఉన్న వారిని, మురికివాడలు, సంచార జాతులు, ఎస్సీ, ఎస్టీ ప్రజలు, గిరిజన తండాల్లో నివాసితులు, పీవీజీటీ పరిధిలో (బలహీన గిరిజన సమూహాలు) ఉన్నవారు.. ఇలా ప్రతి ఒక్కరికీ విలువైన ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ అనంతరం ఓటర్ల నమోదుపై వచ్చే ప్రతి ఫిర్యాదుపై శ్రద్ధ వహించాలని సూచించారు. రాజకీయ పార్టీలకు ఓటింగ్, ఎన్నికల గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తూ.. ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా వివరించాలన్నారు. ఈవీఎంలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని స్పష్టం చేశారు. యువ ఓటర్లు, వలస ఓటర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. ఎస్ఎస్ఆర్–2024 ప్రక్రియ పూర్తయ్యే సమయానికి అర్హులైన ఓటర్లతో ఎలాంటి తప్పులు లేకుండా పూర్తిస్థాయి పారదర్శకంగా ఉన్న ఓటర్ల జాబితా తయారు చేసేందుకు 26 జిల్లాల కలెక్టర్లు నిరంతరం కృషి చేయాలని ధర్మేంద్రశర్మ, నితీష్ ఆదేశించారు. -
ధ్రువీకరణ పత్రాలు త్వరగా అందించాలి... కలెక్టర్ రాజర్షి షా
మెదక్ కలెక్టరేట్: మీ సేవ కేంద్రాల ద్వారా ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను వేగవంతంగా పరిశీలించి జారీ చేయాలని కలెక్టర్ రాజర్షి షా తహసీల్దార్లకు సూచించారు. బుధవారం అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్రువపత్రాల జారీ, ఇంటింటి ఓటరు జాబితా సర్వే, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటు గుర్తింపు పై సమీక్షించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సర్వర్ సమస్య కూడా తీరిందని, ఆదాయ, కుల, రెసిడెన్షియల్ ధ్రుపత్రాలను త్వరగా జారీ చేయాలన్నారు. ప్రధానంగా రుణసాయం కోసం దరఖాస్తు చేసుకునే బీసీ కులాల వారికి త్వరితగతిన అందజేయాలని సూచించారు. ఓటరు జాబితా తయారీలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వే గురువారం పూర్తి చేయాలని బూత్ స్థాయి అధికారులను ఆదేశించారు. ఓటరు జాబితాలో మృతిచెందిన, షిఫ్టింగ్ అయిన వారి పేర్లను మరోసారి పరిశీలించుకోవాలన్నారు. పొరపాట్లు జరిగినట్లయితే ఫారం 6 ద్వారా తిరిగి ఓటరుగా నమోదు చేయాలన్నారు. అదేవిధంగా అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి యువత ఓటరుగా నమోదయ్యేలా చూడాలన్నారు. ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులు నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ సందర్భంగా వస్తున్న ఫామ్ 6,7,8 లను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేస్తూ వచ్చిన పక్షం రోజులలోగా డిస్పోస్ అయ్యేలా చూడాలన్నారు. పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసి ర్యాంపులు ఉండేలా చూడాలన్నారు. 1500 పైగా ఓటర్లు ఉన్న బూతులతో కొత్తగా పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలన్నారు. త్వరలో అన్ని రాజకీయపక్షాలతో సమావేశమై తగు ప్రతిపాదనలను ఎన్నికల కమిషన్కు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సాయిరాం, శ్రీనివాసులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
Hyderabad: 90 లక్షలు దాటిన గ్రేటర్, శివారు ఓటర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో అత్యధికంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 6,44,072 మంది ఓటర్లున్నారు. ఆ తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 6,12,700 ఓటర్లుండగా, చార్మినార్లో అత్యల్పంగా 2,14,774 ఓటర్లున్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలు, మేడ్చల్ జిల్లాలోని 5 నియోజకవర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని 5 నియోజకవర్గాలను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 91,86,375 మంది ఓటర్లు ఉన్నారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో కొంతభాగం మాత్రమే ఉండటంతో దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. హైదరాబాద్ జిల్లాలో ముసాయిదా జాబితాలో 41.46 లక్షల ఓటర్లుండగా, తుదిజాబితాలో ఆ సంఖ్య 42.15 లక్షలకు పెరిగింది. ఓట్లు గల్లంతయిన వారితోపాటు కొత్త ఓటర్ల నమోదుతో ఈ సంఖ్య పెరిగింది. (క్లిక్ చేయండి: మెట్రో ఛార్జీలు పెంపు!) -
AP: ఎన్నికల్లో కీలక శక్తిగా మహిళలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చట్ట సభలకు ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడంలో మహిళలే కీలక శక్తిగా మారనున్నారు. రాష్ట్రంలో పురుష ఓటర్లతో పోలిస్తే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండటం ఈ అంశాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యేక ఓటర్ల సవరణ తుది జాబితా 2023ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గురువారం విడుదల చేశారు. ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,84,868. వీరిలో పురుష ఓటర్లు 1,97,59,489 మంది కాగా, మహిళా ఓటర్లు 2,02,21,455 మంది ఉన్నారు. అంటే 4,61,966 మంది మహిళా ఓటర్లు అధికంగా ఉన్నారు. థర్డ్ జెండర్స్ ఓటర్ల సంఖ్య 3,924గా ఉంది. మొత్తం 26 జిల్లాల్లో 22 జిల్లాల్లో పురుషులకంటే మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే పురుష ఓటర్ల సంఖ్య అధికంగా ఉంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 19,41,277 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7,29,085 మంది, పార్వతీపురం మన్యం జిల్లాలో 7,76,716 మంది ఓటర్లు ఉన్నారు. 2022తో పోలిస్తే తగ్గిన ఓటర్ల సంఖ్య గతేడాది తుది ఓటర్ల సవరణ జాబితాతో పోలిస్తే ఈ ఏడాది ఓటర్ల సంఖ్య 7,51,411 తగ్గింది. 2022 తుది జాబితాలో 4,07,36,279గా ఉన్న ఓటర్ల సంఖ్య 2023 జాబితా నాటికి 3,99,84,868కి పరిమితమయింది. కానీ, నవంబర్లో విడుదల చేసిన ముసాయిదా జాబితా సవరణ తర్వాత నికరంగా ఓటర్ల సంఖ్య 1,30,728 పెరిగినట్లు మీనా తెలిపారు. ముసాయిదా జాబితా తర్వాత కొత్తగా 5,97,701 మంది ఓటర్లు చేరితే 4,66,973 మంది ఓటర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. గతంతో పోలిస్తే అదనంగా ఒక పోలింగ్ స్టేషన్ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 45,951 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రతి వెయ్యి మంది జనాభాకు 721 మందికి ఓటు హక్కు ఉండగా, లింగ నిష్పత్తి 1,027గా ఉంది. పెరిగిన తొలి ఓటు హక్కు వినియోగదారులు 2023 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చుకున్నారు. గత ఏడాది నవంబర్ 9న ప్రకటించిన ముసాయిదా జాబితాలో 18 నుంచి 19 ఏళ్లు ఉన్న తొలి ఓటు హక్కు వినియోగదారుల సంఖ్య 78,438గా ఉంటే తుది జాబితా నాటికి ఈ సంఖ్య 3,03,225కు చేరినట్లు మీనా తెలిపారు. విద్యా సంస్థల్లో ప్రత్యేకంగా ప్రచారం చేయడమే కొత్త ఓటర్ల సంఖ్య భారీగా పెరగడానికి కారణమని చెప్పారు. మొత్తం ఓటర్లలో దివ్యాంగుల సంఖ్య 5,17,403గా ఉంది. ఈ తుది ఓటర్ల జాబితాను అన్ని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు శుక్రవారం అందజేస్తామని తెలిపారు. ఓటరుగా నమోదు చేసుకోలేకపోయినవారు ఫారం–6 ద్వారా నమోదు చేసుకోవచ్చని, అభ్యంతరాలను ఫారం–7 ద్వారా, సవరణలను ఫారం–8 ద్వారా చేయవచ్చని తెలిపారు. -
ఓటరు జాబితా సవరణకు 8.67 లక్షల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితా సవరణ కోసం 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈవో) వికాస్రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 8వ తేదీతో గడువు ముగిసిందని, ఆ తర్వా త వచ్చిన దరఖాస్తులను తుదిజాబితా ప్రచురించిన తర్వాత పరిశీలిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అర్హులైన యువత ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకునేవిధంగా పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రంలోని 1,700 కళాశాలల్లో ఉన్న 18–19 ఏళ్ల వయసువారిని లక్ష్యంగా చేసుకుని ఎలక్షన్ లిటరసీ క్లబ్(ఈఎల్సీ)లను ఏర్పాటు చేశామని, క్యాంపస్ అంబాసిడర్లను నియమించడంతోపా టు విద్యార్థులందరికీ ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపామని తెలిపారు. గిరిజనుల కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేపట్టామని, రాష్ట్రంలోని 361 గిరిజన ఆవాసాల్లో గల కొ లం, తోటి, చెంచు, కొండరెడ్డి తెగలకు చెందిన 2,500 మంది నుంచి దరఖాస్తులను స్వీకరించామని పేర్కొన్నారు. విక లాంగ ఓటర్ల కోసం పింఛన్ డేటాతోపాటు సదరం వివరాలు తీసుకున్నామని తెలిపారు. పట్టణప్రాంతాల్లో ఓటరు నమోదు కోసం రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఆస్తిపన్ను చెల్లిస్తున్నవారి కి ఎస్ఎంఎస్లు పంపించామని, వీధి నాటకాల ద్వారా అ వగాహన కల్పించేందుకు ప్రయత్నించామని, పట్టణ ప్రాంతాల్లో ఉండే పారిశుధ్య వాహనాల ద్వారా ఆడియో సందేశాలు పంపామని తెలిపారు. ఈ నెల 8లోపు వచ్చిన దర ఖాస్తులను 26 వ తేదీలోపు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. జనవరి 5న తుది ఓటరుజాబితా అక్టోబర్ 1 వ తేదీ తర్వాత 8.67 లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 5.66 లక్షల ఫాం–6, 1.83 లక్షల ఫాం–7, 1.17 లక్షల ఫాం–8 దరఖాస్తులున్నాయని వికాస్రాజ్ తెలిపారు. ఆన్లైన్తోపాటు కొన్ని దరఖాస్తులను నేరుగా బీఎల్వోలు, ఏఈఆర్వోలు, ఈఆర్వోలకు ఇచ్చారని, వాటిని డిజిటలైజ్ చేసే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. అక్టోబర్–1 నుంచి నవంబర్–9 వరకు వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి వచ్చే ఏడాది జనవరి 5వ తేదీన ఓటర్ల తుది జాబితా ప్రచురిస్తామని తెలిపారు. కాగా, మహబూబ్నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో వచ్చిన ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 30లోపు పరిశీలించి పరిష్కరిస్తామని వికాస్రాజ్ వెల్లడించారు. -
Hyderabad: 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓట్ల తొలగింపు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లో 2.79 లక్షల ఓటర్లను తొలగించారు. గత జనవరి 5వ తేదీ నుంచి ముసాయిదా ఓటరు జాబితా తయారీ వరకు తొలగించిన ఓట్లు ఇవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా 29,591 ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ల జాబితాలో పేర్లున్న వారిలో మృతి చెందినవారు, చిరునామా మారిన వారు, ఒకటి కంటే ఎక్కువ పర్యాయాలు పేర్లున్న వారిని తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. మొత్తం ఓటర్లు 41.46 లక్షలు హైదరాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం జనవరిలో 43, 67,020 మంది ఓటర్లుండగా.. తొలగింపులు, కొత్తగా ఓటర్లుగా నమోదైన వారిని పరిగణనలోకి తీసుకొని రూపొందించిన తాజా ఓటర్ల ముసాయిదా జాబితాలో41,46,965 మంది ఓటర్లున్నారు. అంటే గడచిన పదినెలల్లో 2,20,055 మంది ఓటర్లు తగ్గారు. ఇందులో కొత్తగా ఓటర్లుగా నమోదైన వారు 59,575 మందికాగా, తొలగించినవారు 2,79,630 మంది. సగటున 5.04 శాతం ఓటర్లు తగ్గారు. తొలగించిన ఓటర్లు నియోజకవర్గాల వారీగా.. వీరిలో మృతులు 78 మంది కాగా, చిరునామా మారిన వారు 3966 మంది, ఒకటి కంటే ఎక్కువ ఓట్లున్నవారు 275586 మంది ఉన్నారు. ముసాయిదా ఓటరు జాబితా విడుదల హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సంబంధిత ఈఆర్ఓలు విడుదల చేశారు.ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేర్లను పరిశీలన చేసుకునేందుకు సంబంధిత నియోజకవర్గ ఎన్నికల అధికారిని సంప్రదించవచ్చని తెలిపారు. ఆన్లైన్ ద్వారా www. nvsp.com, www.ceotelangana.nic.in పోర్టల్స్ ద్వారా, ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా పరిశీలన చేసుకోవచ్చని పేర్కొన్నారు. -
డిసెంబర్ 30న ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితా
సాక్షి, హైదరాబాద్: మహబూబ్నగర్– రంగారెడ్డి–హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల నమోదుకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 7 తర్వాత కూడా కొనసాగుతుందని సీఈఓ వికాస్రాజ్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 7తో దరఖాస్తుల స్వీకరణ ముగియగా, నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించాల్సి ఉంది. ఆ తర్వాత నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరించాలి. అయితే, ఈ నెల 7 నుంచి 23 మధ్య వ్యవధిలో సైతం కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు స్వీకరించి డిసెంబర్ 30న ప్రకటించనున్న తుది ఓటర్ల జాబితాలో స్థానం కల్పిస్తామని వికాస్రాజ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. -
ఓటర్ జాబితా నిలుపుదలకు ఆదేశాలివ్వలేం
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నిక ఓటర్ల జాబితాలో అధికార టీఆర్ఎస్ అక్ర మాలకు పాల్పడుతోందని దాఖలైన పిటిషన్లో ఓటర్ జాబితా వెలువరించకుండా ఉత్తర్వుల జారీకి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల తుది జాబితా వివరాలు తమ ముందుంచాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. పెండింగ్లోని 5,517 దరఖాస్తులను ఆమోదించకుండా ఉత్తర్వులివ్వాలన్న పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. ఉప ఎన్నిక సందర్భంగా నకిలీ ఓట్లు సృష్టించి లబ్ధి పొందాలని టీఆర్ఎస్ చూస్తోందని బీజేపీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూ యాన్, జస్టిస్ సీవీ భాస్కర్రెడ్డి ధర్మాసనం శుక్రవారం కూడా విచారణ సాగించింది. ఈసీ తరఫున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘కొత్త ఓట్ల కోసం(ఫామ్–6) మొత్తం 25,013 దరఖాస్తులు వచ్చాయి. 7,247 తిరస్కరించాం. 5,517 పెండింగ్ దశలో ఉన్నాయి. 12,249 దరఖాస్తులను అనుమతించాం. అలాగే తప్పుల సవరణ (ఫామ్–8) కోసం 2,142 దరఖాస్తులు రాగా, 239 అనుమతించాం. 1,822 పెండింగ్లో ఉన్నాయి. 81 తిరస్కరించాం. దరఖాస్తు చేసుకున్న ఓట్ల అనుమతికి ఏడు రోజుల నోటీసు పీరియడ్ ఉంటుంది.. ఆలోగా ఎవరూ అభ్యంతరం తెలుపక పోతేనే దరఖాస్తులకు ఆమోదం లభిస్తుంది. పెండింగ్ దరఖాస్తుల్లో ఈ సాయంత్రం వరకు ఎన్ని పరిష్కారమైతే అన్ని అనుమతిస్తాం.. మిగతావి ఆగిపోతాయి. 2018లో 2,14,847, 2019లో 2,28,774, 2020లో 2,30,328, 2021లో 2,26,515, 2022లో(ఇప్పటివరకు) 2,38,759.. ఇదీ గత ఐదేళ్ల జాబితా’అని వివరించారు. నిబంధనల ఉల్లంఘన జరిగింది.. పిటిషనర్ తరఫున న్యాయవాది రచనారెడ్డి వాదించారు. ‘రాష్ట్రంలో అతి పెద్ద నియోజకవర్గాల్లోనే 2 లక్షల ఓటర్లు దాటలేదు. కానీ, మునుగోడులో ఆ మార్కు దాటడంతో అవకతవకలు జరిగాయి అనడానికి బలం చేకూరుస్తోంది’అని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. మీరు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు కోరుకుంటున్నారు.. మునుగోడు ఉప ఎన్నిక రద్దు కావాలంటున్నారా? ఓటర్ జాబితాపై స్టే కావాలా? ఏం కోరుకుంటున్నారో చెప్పండి.. అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. హుజూరాబాద్లోనూ ఇదే ఈసీ పనిచేసింది.. అక్కడ ఎన్నికల సమయంలో కొత్త ఓట్ల సంఖ్య పెరిగింది.. మరీ అప్పుడు అభ్యంతరం తెలపలేదమని పిటిషనర్ అడ్వొకేట్ను ప్రశ్నించింది. పిటిషనర్ పార్టీ గెలిస్తే కేసులో వాదనలు ముగిస్తామని.. లేదా కొద్ది ఓట్ల తేడాతో ఓడితే విచారణ కొనసాగిస్తామని పేర్కొంది. ఈ క్రమంలో రచనారెడ్డి మాట్లా డుతూ.. ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛ గా జరగాలన్నదే తమ అభిమత మని వివరించారు. దీంతో ఓటర్ల తుది జాబితా వివరాలు వెల్లడించాలని బెంచ్ కోరింది. శుక్రవారం సాయంత్రానికి అది ఖరా రవుతుందని దేశాయ్ చెప్పడంతో... వచ్చే విచారణ నాటికి వివరాలను తమ ముందు ఉంచాలని ధర్మాసనం ఆదేశించింది. -
బోగస్ ఓటర్లను చేర్చేందుకు టీఆర్ఎస్ ప్రయత్నం: తరుణ్ చుగ్
న్యూఢిల్లీ: మునుగోడు ఉప ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలో కొత్తగా నమోదైన ఓట్లపై అనుమానాలు వ్యక్తం చేసింది బీజేపీ. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా.. ఇప్పుడు కొత్త ఓట్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ బృందం ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ తెలంగాణ ఇంఛార్జ్ తరుణ్ చుగ్. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు చెప్పారు. ‘మునుగోడులో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. కొత్తగా చేరిన ఓటర్లను పరిశీలించాలని ఈసీని కోరాం. స్వల్ప వ్యవధిలో 25వేల కొత్త ఓట్లు ఎలా వచ్చాయి? బోగస్ ఓటర్లను చేర్పించేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది.’ అని ప్రభుత్వం, టీఆర్ఎస్పై ఆరోపణలు గుప్పించారు తరుణ్ చుగ్. ఇదీ చదవండి: రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులా? మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించాలని ఈసీకి హైకోర్టు ఆదేశం -
మునుగోడు ఓటర్ల జాబితాను సమర్పించండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల జాబితాపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో పిటిషన్పై హైకోర్టులో విచారణ ఇవాళ (గురువారం) ప్రారంభమైంది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఓటర్ల జాబితాను తమకు సమర్పించాలంటూ ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది రచనా రెడ్డి.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నిబంధనలకు విరుద్ధంగా ఓటర్ల నమోదు జరిగిందని వాదించారు. ఫార్మ్ 6 ప్రకారం కొత్తగా దాదాపు 25 వేల ఓట్లు నమోదు చేసుకున్నారు. మునుగోడు నియోజకవర్గం లోని వివిధ మండలాల లో భారీగా ఓటర్ల నమోదు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు అయ్యింది. నవంబర్ 3 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఉప ఎన్నికల నేపథ్యంలో భారీగా ఓటర్ల నమోదు అక్రమంగా జరిగిందని ఆమె వాదించారు. ఇక.. ఎన్నికల సంఘం తరపున న్యాయవాది అవినాశ్ దేశాయ్ వాదనలు వినిపించారు. ‘తుది ఓటర్ల లిస్ట్ ఇంకా ఎన్నికల కమిషన్ ప్రకటించలేదు. ప్రతి సంవత్సరం కొత్త ఓటర్లు నమోదు చేసుకుంటున్నారు. జనవరి 2021 వరకు రెండు లక్షల 22 వేలు ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం లో 2 లక్షల 38 వేలు ఓట్లు ఉన్నాయి. 25వేల ఓట్లలో ఏడు వేలు తొలగించాం. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది’ అని వాదించారు. రెండు నెలల్లో ఇన్ని దరఖాస్తులు ఎలా వచ్చాయని ఈసీని ప్రశ్నించిన హైకోర్టు.. ఈ నేపథ్యంలో దరఖాస్తుల వివరాలు, ఓటర్ల జాబితా తమకు సమర్పించాలని ఆదేశించింది. మునుగోడు ఉప ఎన్నికల ఓటర్ల జాబితా పిటిషన్ విచారణను రేపటికి వాయిదా వేసింది. -
స్థానికేతరులకు ఓటు హక్కు ఇస్తే ఖబడ్దార్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితాలో స్థానికేతరుల పేర్లను చేరుస్తూ నిర్ణయం తీసుకుంటే సహించబోమని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా హెచ్చరించారు. కోర్టుకు వెళ్లయినా సరే కచ్చితంగా అడ్డుకుంటామని తేల్చిచెప్పారు. స్థానికేతరులకు ఓటు హక్కును ఎలా అడ్డుకోవాలన్న అంశంపై చర్చించేందుకు ఆయన సోమవారం అఖిలపక్ష నాయకులతో సమావేశయ్యారు. ఈ భేటీకి 9 పార్టీల నేతలు హాజరయ్యారు. జమ్మూకశ్మీర్ ప్రత్యేకతను, గుర్తింపును దెబ్బతీసే చర్యలకు పాల్పడొద్దని ప్రభుత్వానికి సూచించారు. ఇక్కడ బయటి వ్యక్తులు ఓటు హక్కు ఇవ్వడం తమకు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీని స్థానికేతరుల చేతుల్లో పెట్టొద్దని డిమాండ్ చేశారు. -
ఓటర్ల జాబితాపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు
శ్రీనగర్/జమ్మూ: జమ్మూకశ్మీర్లో ఓటర్ల జాబితా విషయంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈఓ) చేసిన ప్రకటనపై కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు సీఈఓ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ శనివారం స్థానిక దినపత్రికల్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కశ్మీర్లో ఓటర్ల జాబితా రివిజన్ తర్వాత కొత్తగా 25 లక్షల మంది ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని సీఈఓ ఆగస్టు 17న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీనిపై రాజకీయంగా అలజడి రేగింది. బయటి వ్యక్తులను తీసుకొచ్చి, ఓటు హక్కు కల్పించేందుకు కుట్ర పన్నారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. ఈ అంశంపై చర్చించేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు వివరణ ఇచ్చారు. -
ఓటరు జాబితాతో ఆధార్ అనుసంధానం
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల సవరణలకు సంబంధించి ఆగస్టు ఒకటి నుంచి నూతన మార్గనిర్దేశకాలు అమల్లోకి రానున్నాయని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్కుమార్ మీనా తెలిపారు. ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసిందని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 17 ఏళ్లు నిండినవారు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడంతోపాటు, ఇప్పటికే నమోదైన వారు ఆధార్ నంబరును అనుసంధానం చేయాల్సి ఉంటుందని తెలిపారు. నూతన చట్ట సవరణలను అనుసరించి ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటోతేదీ నాటికి తమ ఆధార్ నంబరు తెలియజేయాలని పేర్కొన్నారు. అయితే ఇది పూర్తిగా స్వచ్ఛందమని, ఆధార్ నంబరు ఇవ్వని వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించరని స్పష్టం చేశారు. ఇప్పటికే ఓటర్లుగా ఉన్న వారి ఆధార్ నంబరు కోసం నూతనంగా ఫారం 6బీ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఈసీఐ, ఇరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ తదితర వెబ్సైట్లలో ఈ నెలాఖరు నాటికి నూతన దరఖాస్తు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. త్వరలోనే ఇంటింటికి తిరిగి ఆధార్ నంబరును అనుసంధానించే ప్రక్రియను చేపడతామని, ఆన్లైన్ ద్వారా కూడా ఆధార్ నంబరును అనుసంధానం చేయవచ్చని తెలిపారు. 6బీ ఇవ్వని వారు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొన్న 11 ప్రత్యామ్నాయాల్లో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు. ఆధార్ వివరాలను అత్యంత గోప్యంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఫారం 6తో నియోజకవర్గం మార్పు కుదరదు ఫారం 6 ఇకపై కొత్త ఓటర్ల నమోదు కోసం మాత్రమే నిర్దేశించారని, ఓటరు నియోజకవర్గం మారడానికి ఫారం 6లో దరఖాస్తు చేసేందుకు అవకాశం లేదని తెలిపారు. జాబితాలో పేరు తొలగింపునకు ఉపయోగించే ఫారం 7 విషయంలో ఇకపై మరణ ధ్రువీకరణపత్రాన్ని జతచేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఫారం 8 విషయంలో కీలక మార్పులు జరిగాయని తెలిపారు. ఇప్పటివరకు దీన్ని ఓటర్ల జాబితాలో నమోదు చేసిన వివరాల సవరణ కోసం వినియోగిస్తుండగా, ఇకపై విభిన్న అంశాలకు వినియోగించనున్నట్లు వెల్లడించారు. నియోజకవర్గ పరిధిలోనేగాక, ఇతర నియోజకవర్గాలకు ఓటరు మార్పు, నూతన ఓటరు గుర్తింపు కార్డు జారీ, వైకల్యం ఉన్న వ్యక్తిని గుర్తించడం వంటి అంశాలకు కూడా ఫారం 8 వినియోగించవచ్చని ఆయన వివరించారు. -
ఓటర్ల జాబితాలో వారిదే పైచేయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఓటర్లలో అతివలదే అగ్రస్థానం. రాష్ట్రంలో పురుష ఓటర్లు 2,01,34,664 మంది ఉండగా.. మహిళా ఓటర్లు 2,05,97,544 మంది ఉండటం విశేషం. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు 4,62,880 మంది అదనంగా ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసిన తుది నివేదికలో పేర్కొంది. ఒక్క శ్రీకాకుళం, అనంతపురం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లోనూ మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో సర్వీసు ఓటర్లతో కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 4,07,36,279. వీరిలో 4,071 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 43,45,322 మంది ఓటర్లు ఉన్నారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా 40,89,216 మంది, విశాఖపట్నం జిల్లా 37,19,438 మంది ఓటర్లతో నిలిచాయి. ఇక విజయనగరం జిల్లాలో అత్యల్పంగా 19,02,077 మంది ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. రాష్ట్ర జనాభాలో ప్రతి వెయ్యి మందికి 743 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,026 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 18–19 ఏళ్లు ఉండి తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్ల సంఖ్య 2,07,893గా ఉంది. 1,500 మంది ఓటర్లకు ఒకటి చొప్పున పోలింగ్ కేంద్రం ఉండగా కొత్తగా 33 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కె.విజయానంద్ తెలిపారు. దీంతో రాష్ట్రంలో పోలింగ్ స్టేషన్ల సంఖ్య 45,917 నుంచి 45,950కి చేరింది. 13.85 లక్షలు పెరిగిన ఓటర్లు రాష్ట్రంలో 2019 సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో పోలిస్తే అదనంగా 13,85,239 మంది ఓటర్లు పెరిగారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో 3,93,51,040 మంది ఉండగా స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)–22 నాటికి 4,07,36,279కి చేరింది. ఇందులో విదేశీ ఓటర్లు 7,033, సరీ్వస్ ఓటర్లు 67,935 మంది ఉన్నారు. -
AP: పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా
ఎన్నికల ఫలితాలు Live Updates: ► సాయంత్రం 5 గంటల వరకు వెలువడిన పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందారు. మరికొంత మంది గెలుపు బాటలో ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా: ► ఆలమూరు గ్రామ పంచాయతీ 8వ వార్డుకి జరిగిన ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఎలుగు బంట్ల సత్యనారాయణ బూరయ్య 93 ఓట్లు మెజారిటీతో గెలుపు శ్రీకాకుళం జిల్లా: ►రేగిడి ఆమదాలవలస మండలం తోకల వలస పంచాయతీలో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి సివ్వాల సూర్యకుమారి గెలుపు. విజయనగరం జిల్లా: ► భోగాపురం మండలం లింగాల వలస సర్పంచ్ ఉప ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థి బుగత లలిత 42 ఓట్ల మెజార్టీతో విజయం. ► లక్కవరపుకోట మండలం రేగ పంచాయతీ 7 వ వార్డులో టీడీపీ బలపరిచిన అభ్యర్థి లెంక శ్రీను 45 ఓట్లు మెజారిటీతో గెలుపొందారు. ► నెల్లిమర్ల మండలం, ఏటి అగ్రహారం సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సానుభూతి పరురాలు మీసాల సూర్యకాంత 44 ఓట్లు మెజారిటీ తో గెలుపొందారు. ప్రకాశం జిల్లా : ► కంభం మండలం కందులాపురం 6వార్డు అభ్యర్థి బండారు వరలక్ష్మి 63 ఓట్లతో విజయం. ► మద్దిపాడు 5 వార్డు అభ్యర్థి నూనె శ్రీనివాసులు వైఎస్సార్సీపీ మద్దతుతో 99 ఓట్లతో ఘన విజయం. ► కొత్తపట్నంలో 7వ వార్డులో వైసీపీ అభ్యర్ధి పూరిణి సరోజిని 95 ఓట్లుతో విజయం. ► తర్లుబాడు మండలం మీర్జాపేట గ్రామ 2 వ వార్డులో వైసీపీ అభ్యర్థి యోగిరవణమ్మ పై టీడీపీ అభ్యర్థి నాగజ్యోతి 30 ఓట్ల తేడతో విజయం. ► ఇంకోల్లుమండలంపూసపాడులో 5 వ వార్డులో టిడిపి అభ్యర్ది గోరంట్ల లక్ష్మీ తులసీ 101 ఓట్ల మోజార్టీ తో గెలుపు. ► కొండపి నియోజక వర్గం నిడమానూరు 12 వార్డు టీడీపీ అభ్యర్దీ కాకుమాను సుబ్బారావు 46 ఓట్లతో విజయం.. ► కందుకూరు మండలం నరిశెట్టి వారి పాలెం గ్రామపంచాయతీ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన ముప్పాళ్ళ శ్రీనివాసరావు విజయం గుంటూరు జిల్లా: ► అచ్చంపేట మండలం అంబడిపూడి సర్పంచ్ గా కొమ్మవరపు స్వరాజ్యలక్ష్మి 159 ఓట్లతో గెలుపు. ► సత్తెనపల్లి మండలం పాకాలపాడు సర్పంచ్ గా తిప్పి రెడ్డి సుజాత వెంకట రెడ్డి 427 ఓట్లతో గెలుపు. ► వినుకొండ మండలం శివపురం సర్పంచ్గా కమతం సుబ్బమ్మ 452 మెజార్టీతో గెలుపు (వైఎస్సార్సీపీ) ► బొల్లాపల్లి మండలం రేమిడిచర్ల సర్పంచ్ గా బ్రహ్మం నాయక్ 153 ఓట్లతో గెలుపు(వైఎస్సార్సీపీ) విశాఖ జిల్లా ► అమలాపురం గ్రామంలో ఐదో వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి మేడపురెడ్డి నూకల తల్లి గెలుపు. ► పెదబయలు మండలం గిన్నెలకోట పంచాయితీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ బలపరిచిన సాగేని చిన్నతల్లమ 155 ఓట్లు మెజారిటీతో గెలుపు. ► ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉపఎన్నికలో వైసీపీ బలపర్చిన మైకం భాగ్యవతి 55 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► భీమిలి రేఖవానిపాలెం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన సమ్మిడి శ్రీనివాసరావు గెలుపు చిత్తూరు జిల్లా ► గంగవరం మండలం తాళ్లపల్లిలో సర్పంచ్ ఉప ఎన్నికలలో 97 ఓట్ల ఆధిక్యంతో వైసీపీ బలపరిచిన అభ్యర్థి శంకరమ్మ గెలుపు. కర్నూలు జిల్లా ► సిరివేళ్ళ గ్రామ పంచాయతీ లోని 18 వ వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరుపున బి.పెదరాజు 253 ఓట్లతో గెలుపు. నంద్యాల మండలం భీమవరం గ్రామంలోని నాలగో వార్డు మెంబెర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 12 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన టిడిపి మద్దత్తుదారుడు శాలి పెల జనార్దన్ రెడ్డి. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►సి బెళగల్ మండలం,యనగండ్ల గ్రామ పంచాయతీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దత్తు దారుడు ఇమ్మానియల్ 39 ఓట్లతో గెలుపు. ► కృష్ణగిరి మండలం లక్కసాగరం సర్పంచ్ గా టీడీపీ మద్దుతుదారు మాదిగ వరలక్ష్మి 858 ఓట్ల మెజారిటీతో గెలుపు. కృష్ణాజిల్లా ► కృష్ణా జిల్లాలో ముగిసిన పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ► సర్పంచ్ స్థానాలు వైసిపి -2 , టీడీపీ -2 గెలుపు ► వార్డు మెంబర్లు వైసిపి -8 ,టీడీపీ-1 , టిడిపి&జనసేన -2 గెలుపు సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ► కలిదిండి (మం) కలిదిండి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధిని మసిముక్కు మారుతీ ప్రసన్న 249 ఓట్లతో గెలుపు ► ముదినేపల్లి (మం)ములకలపల్లి సర్పంచ్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నువ్వుల కోటేశ్వరరావు 57 ఓట్లతో గెలుపు ► నందివాడ (మం) పోలుకొండ సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధిని మానేపల్లి ఝాన్సీ కుమారి 27 ఓట్లతో గెలుపు ► ఘంటసాల (మం)మల్లంపల్లి సర్పంచ్ గా టీడీపీ అభ్యర్ధి బెల్లంకొండ అమలేశ్వరరావు 143 ఓట్లతో గెలుపు వార్డు ఎన్నికల ఫలితాలు ► తోట్లవల్లూరు (మం) రొయ్యూరులో 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి లుక్కా నాగభూషణం 48 ఓట్ల మెజారిటీతో గెలుపు ► నూజివీడు (మం) బూరవంచ పంచాయతీ 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సయ్యద్ ఖిజర్ పాషా ఖాద్రి 28ఓట్లతో గెలుపు ► ఆగిరిపల్లి (మం) చినఆగిరిపల్లి పంచాయతీ 1వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి చన్ను సావిత్రి 21 ఓట్ల విజయం ► కలిదిండి (మం) కోరుకొల్లు12వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్థి యాళ్ళ పద్మ 146 ఓట్ల మెజార్టీతో గెలుపు ► ఘంటసాల (మం) దాలిపర్రు 3వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి దాసరి నాగరాజు 26 ఓట్ల మెజారిటీ తో విజయం ► చల్లపల్లి (మం) ఆముదార్లంకలో 2 వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి నాగిడి శివ పార్వతి 23 ఓట్లతో విజయం ► పెడన (మం) నేలకొండపల్లి పంచాయితీ 6వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి సమ్మెట నరేంద్ర కుమార్ 11 ఓట్ల మెజార్టీతో విజయం ► బంటుమిల్లి (మం) అర్తమూరు పంచాయతీ 8వ వార్డు మెంబర్ గా వైఎస్సార్సీపీ అభ్యర్ధి మాకాళ్ళు వాసుదేవరావు 54 ఓట్ల మెజార్టీతో విజయం ► కోడూరు (మం) విశ్వనాధపల్లి 1వ వార్డు మెంబర్ గా టీడీపీ, జనసేన బలపరిచిన కొండవీటి విజయలక్ష్మి 10 ఓట్లతో గెలుపు ► మోపిదేవి (మం) కోసూరువారిపాలెం 4 వార్డు మెంబర్ గా జనసేన, టీడీపీ బలపరచిన అభ్యర్థిని చందన పద్మజ 69 ఓట్లతో విజయం ► ఆగిరిపల్లి (మం) ఆగిరిపల్లి పంచాయతీ 4వ వార్డు మెంబర్ గా టీడీపీ అభ్యర్ధి మల్లవల్లి స్పందన15 ఓట్ల మెజారిటీతో విజయం నెల్లూరు జిల్లా ► మనుబోలు మండలం, వెంకన్నపాలెంలో 4వ వార్డు ఉపఎన్నికలలో వైఎస్సార్సీపీ బలపరిచిన వల్లూరు శకుంతలమ్మ నాలుగు ఓట్లతో విజయం. అనంతపురం జిల్లా ► సోమందేపల్లి మండలం గుడిపల్లి నాలుగో వార్డు ఉప ఎన్నికలలో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామంలో 5వ వార్డ్ మెంబర్గా వైఎస్సార్సీపీ అభ్యర్థి రామలక్ష్మి 8 ఓట్లతో విజయం. ► శెట్టూరు మండలం కైరేవు గ్రామ సర్పంచ్గా వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి లక్మిదేవి 198 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం. ► కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని శెట్టూరు మండలం కైరేవు సర్పంచ్గా వైఎస్సార్సీపీ మద్దతుదారు లక్ష్మిదేవి విజయం. ► రాయదుర్గం మండలం 74- ఉడేగోళం 5వ వార్డు ఎన్నికలో వైఎస్సార్ సీపీ మద్దతుదారు రామలక్ష్మి విజయం. ► సోమందేపల్లి మండలం గుడిపల్లి 4వ వార్డు ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి శంకరమ్మ విజయం. ► రొద్దం మండలం చిన్నమంతూరు సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారు సుబ్బమ్మ విజయం. ► పుట్లూరు మండలం కందికాపుల గ్రామ సర్పంచ్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు కురువ శివరామయ్య 157 ఓట్లతో ఘన విజయం. పశ్చిమ గోదావరి జిల్లా ► తాడేపల్లిగూడెం మండలం పుల్లయ్యగూడెం వైఎస్సార్సీపీ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి చీకట్ల పుష్ప లక్ష్మీకుమారి 60ఓట్ల మెజార్టీతో గెలుపొందింది. ► ఉండి మండలం చినపుల్లేరు 5వవార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన కందుల సుభాషిణి 30 ఓట్ల మెజారిటీతో విజయం కైవసం చేసుకుంది. ► పోలవరం మండలం గూటాల గ్రామపంచాయతీ ఒకటో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి ఇందిరా ప్రియదర్శిని 60 ఓట్ల మెజారిటీతో గెలుపు. ► పెదవేగి మండలం రాయన్నపాలెం ఐదవ వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్ధి అవిరినేని రమేష్ 23 ఓట్ల మెజార్టీతో గెలుపు. ► కొవ్వూరు మండలం కాపవరం తొమ్మిదో వార్డు వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి గొతం మేరీ ఝాన్సీ బాయి ఆరు ఓట్ల మెజారిటీ తో గెలుపు. ►పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామ పంచాయతీ 8 వార్దు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థి కాపా సాంబశివరావు 67ఓట్ల మెజార్టీ తో విజయం. ► జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని వామిశెట్టి 892ఓట్ల మెజారిటీతో పావని విజయం. ► పోడూరుమండలం కొమ్ముచిక్కాల గ్రామ పంచాయతీ 9 వార్డు ఉప ఎన్నికల్లో వైఎస్సార్సిపి బలపరిచిన అభ్యర్థి పాతపాటి కొండరాజు 61 ఓట్లు మెజార్టీతో విజయం. ► ఆచంట మండలం పెదమల్లం గ్రామం వైస్సార్సీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దిరిశాల విజయలక్ష్మి 156 ఓట్ల తో మెజారిటీ గెలుపు. మధ్యాహ్నం రెండు గంటలకు పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కృష్ణా జిల్లా జిల్లాలో పోలింగ్ పూర్తయ్యే సమయానికి 78.48 శాతం నమోదు.14027 మంది ఓటర్లకుగానూ 11,008 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలుకొండ (సర్పంచ్)74 శాతం కలిదిండి (సర్పంచ్) 76.79 శాతం ములకలపల్లి (సర్పంచ్) 88.59 శాతం మల్లంపల్లి (సర్పంచ్ ) 86.34 జిల్లాలోని మిగిలిపోయిన వార్డులకు జరిగిన జరిగిన ఎన్నికల్లో 80 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం తాళ్లపల్లి లో ముగిసిన సర్పంచ్ ఎన్నికల పోలింగ్. 88 శాతం నమోదైన పోలింగ్. 1429 కు గాను 1261 ఓట్లు పోల్ అయినట్లు ప్రకటించిన అధికారులు. విశాఖపట్నం విశాఖ జిల్లా పంచాయతీ సర్పంచ్ ఉప ఎన్నికల్లో 72.5 శాతం పోలింగ్. ముంచంగిపుట్టు మండలం జర్రెల పంచాయితీ సర్పంచ్ ఉప ఎన్నిక ఓటింగ్ ప్రక్రియ ముగిసింది. 69.83% శాతం పోలింగ్ నమోదు. తూర్పు గోదావరి పెద్దాపురం మండలం జి.రాగంపేట లో ముగిసిన వార్డు మెంబర్ ఉప ఎన్నికలు. 301 ఓట్లకు గాను 243 ఓట్లు పోల్ అయ్యాయి. పశ్చిమగోదావరి - ఆచంట మండలం పెదమల్లం గ్రామ సర్పంచ్ పోలింగ్ పర్సంటేజ్ 73.40% - జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం సర్పంచ్ పొలింగ్ 59.67 % - తాడేపల్లి గుడెం మండలం పుల్లాయి గుడెం సర్పంచ్ పోలింగ్ 86.81 % - పోడూరు మండలం కొమ్ముచిక్కాల తొమ్మిదవ వార్డు పోలింగ్ 81.20% - ఉండి మండలం చినపుల్లేరు ఐదవ వార్డు పోలింగ్ పర్సంటేజ్ 92.76% - పోలవరం మండలం గూటాల ఒకటో వార్డు కు ముగిసిన పోలింగ్. 85% పోలింగ్ నమోదు. - కొవ్వూరు మండలం కాపవరం 9 వార్డు కు ముగిసిన పోలింగ్. 91% పోలింగ్ నమోదు ► గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ప్రశాంతంగా ముగిసింది. మిగిలిపోయిన 36 సర్పంచ్లు, 68 వార్డులకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 తర్వాత కౌంటింగ్ జరపనున్నారు. అనంతరం ఫలితాలు ప్రకటించనున్నారు. ►అనంతపురం జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. నాలుగు పంచాయతీలకు పోలింగ్ జరుగుతోంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ ఫక్కీరప్ప ఎన్నికలను పర్యవేక్షిస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే ఆర్కే ►గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. 5 సర్పంచ్ స్థానాలకు 9 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీస్థాయిలో ఓటర్లు తరలివస్తున్నారు. పెదకాకానిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ►రాష్ట్రంలో మిగిలిపోయిన పంచాయతీలకు పోలింగ్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు సాగనుంది. మొత్తం 69 పంచాయతీలకు గానూ 30 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా 533 వార్డులకుగానూ 380 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ జిల్లాలోని 36 సర్పంచ్ స్థానాలకు, వివిధ గ్రామాల్లోని 68 వార్డుల్లోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. సాక్షి, అమరావతి: నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ఐదు గంటలతో ముగిసింది. డప్పుల చప్పుళ్లు, నినాదాల హోరు, కళాకారుల గొంతులు మూగబోయాయి. మైకులు బంద్అయ్యాయి. ఇక ఆదివారం (నేటి నుంచి) మొదలు వరుసగా మూడ్రోజులు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ‘స్థానిక’ సంస్థల ఎన్నికల సందడి కొనసాగనుంది. మొత్తం 17.69 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆదివారం వివిధ జిల్లాల్లోని 36 సర్పంచ్ స్థానాలతో పాటు వివిధ గ్రామాల్లోని 68 వార్డు స్థానాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. సోమవారం నెల్లూరు కార్పొరేషన్తో పాటు 12 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ కూడా ఇప్పుడు ఎన్నికలు జరగుతున్న వాటిలో ఒకటి. ఇప్పుడు అందరి కళ్లూ దీనిపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇవికాకుండా మరో ఆరు కార్పొరేషన్లు, నాలుగు మున్సిపాలిటీల్లో మొత్తం 14 డివిజన్లు, వార్డులకు కూడా సోమవారమే ఉప ఎన్నికలు జరగనున్నాయి. అలాగే, మంగళవారం 10 జెడ్పీటీసీ స్థానాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 123 ఎంపీటీసీ స్థానాల్లో పొలింగ్ కొనసాగనుంది. ఇక ఆదివారం జరిగే ఎన్నికల్లో మొత్తం 1,00,032 మంది.. మున్సిపల్ ఎన్నికల్లో 8,62,066 మంది.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 8,07,637 మంది ఓటు హక్కు వినియోగించుకుంటారని రాష్ట్ర ఎన్నికల కమిషన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. మూడ్రోజుల పాటు సాగే ఈ ఎన్నికలు బ్యాలెట్ విధానంలో ఉంటాయి. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం రెండు గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపడతారు. మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 17న.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు 18న చేపడతారు. కోవిడ్ జాగ్రత్తలో అన్ని ఏర్పాట్లు : ఎస్ఈసీ స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఆ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. దీనిపై చర్చించేందుకు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఆయా నగర కమిషనర్లతో ఆమె శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ సందర్భంగా పూర్తిస్థాయిలో కరోనా నియంత్రణ జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను తెలుసుకుని సంతృప్తి వ్యక్తంచేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాల్లో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు వెబ్ కెమెరాలను ఏర్పాటుచేయడంతో పాటు వీడియోగ్రాఫర్లను కూడా నియమించామన్నారు. ఇక ఆదివారం మొత్తం 350 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతుండగా, శుక్రవారం రాత్రికే ఆయా పొలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామాగ్రిని తరలించినట్లు నీలం సాహ్ని వివరించారు. -
పాపం శశికళ: ఓటర్ జాబితాలోనూ తొలగింపు?
చెన్నె: జైలు నుంచి విడుదలై రాజకీయాల్లో సంచలనం రేపుతారని అందరూ భావించే సమయంలో అకస్మాత్తుగా ‘రాజకీయాలకు స్వస్తి’ పలికిన వీకే శశికళకు మరో షాక్ తగిలింది. ఆమెను రాజకీయాల నుంచి తప్పించినట్టు.. ఓటేసే అవకాశం కూడా ఇవ్వలేదని తమిళనాడులో చర్చ నడుస్తోంది. శశికళ పేరు ఓటర్ జాబితాలో లేదు. దీంతో తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘రాజకీయాల్లోకి రానివ్వరు.. కనీసం ఓటు కూడా వేయనివ్వరా? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఆమె మేనల్లుడు, ఏఎంఎంకే అధినేత టీవీవీ దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటరు జాబితాలో శశికళ పేరు కనిపించకపోవడం ముఖ్యమంత్రి పళనిస్వామినే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు. శశికళ ఓటేయకుండా అన్నాడీఎంకే చేసిందని మండిపడ్డాడు. 234 స్థానాలు ఉన్న తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. చదవండి: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా చదవండి: ముఖ్యమంత్రికి భారీ ఊరట -
ఓటరు జాబితాలో మోదీ ఫొటో!
సాక్షి, వికారాబాద్ అర్బన్: ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో ప్రధాని మోదీ ఫొటో దర్శనమిచ్చింది. దీంతో సదరు ఓటరు ఓటుహక్కు వినియోగించుకోనివ్వరనే అనుమానంతో పోలింగ్ కేంద్రానికే రాలేదని సన్నిహితులు తెలిపారు. వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన పట్టభద్రుడు ఎ.దయాకర్రెడ్డి ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకున్నారు. బూత్ నంబర్ 307లో వరుససంఖ్య 269లో ఆయన ఓటు నమోదై ఉంది. దయాకర్రెడ్డి ఫొటో ఉండాల్సి నచోట ప్రధాని మోదీ ఫొటో ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని స్థానిక నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఓటరు జాబితాలో ఉన్న ఫొటోతో సంబంధం లేదని పేరు, ఇతర వివరాలు సరిగ్గా ఉన్న ఆధారాలు చూపిస్తే ఓటు వేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. చదవండి: (ఎవరి ధీమా వారిదే..!) -
‘ఏలూరు’ ఎన్నికలకు బ్రేక్
సాక్షి, అమరావతి: ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ నెల 10న జరగాల్సిన ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు ఓటర్ల జాబితాలో తప్పులను సవరించే వెసులుబాటును అధికారులకు కల్పించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తుది ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున తప్పులున్నాయని, అభ్యంతరాలను స్వీకరించకుండానే తుది ఓటర్ల జాబితాను ప్రచురించారంటూ టీడీపీ నేత ఎస్వీ చిరంజీవి, మరికొందరు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఓటర్ల జాబితాలో కుక్క ఫొటో ముద్రించడంపై మండిపడుతూ పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాలో తప్పులను సవరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ గత ఏడాది మార్చి 5న తీర్పునిచ్చారు. ఈ తీర్పును అధికారులు అమలు చేయలేదంటూ చిరంజీవి, మరో 33 మంది హైకోర్టును ఆశ్రయించగా.. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ సోమయాజులు సోమవారం తన నిర్ణయాన్ని వెలువరించారు. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రకటించిన తరువాత నిబంధనల ప్రకారం పబ్లిక్ నోటీసులు ఇచ్చి ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించలేదని, తుది ఓటర్ల జాబితా తయారీ విషయంలో నిబంధనలు పాటించలేదని ఆక్షేపించారు. గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయలేదని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో వందలాది ఓటర్ల ఇంటి నంబర్లు 000గా చూపారని, అనేక మంది ఓటర్ల పేర్లు తప్పుగా ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానాలు ఇచ్చిన ఉత్తర్వుల అమలును వాయిదా వేయడానికి వీల్లేదని, కోర్టు ఉత్తర్వులను అమలు చేసి తీరాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఎవరు ఎంత పెద్ద వారైనా, చట్టం వారి కంటే పెద్దదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తప్పులు లేని ఓటర్ల జాబితా ఎన్నిక ప్రక్రియకు పునాది అని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు. చట్టం నిర్దేశించిన విధంగా ఓటర్ల జాబితా తయారు చేయకపోవడాన్ని కేవలం సాంకేతిక లోపంగా మాత్రమే చూడలేమన్నారు. ఓటర్ల జాబితా సక్రమంగా లేదని కోర్టు తేల్చిన తరువాత దానిని సరిచేయకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు. ఎన్నికను వాయిదా వేయడం వల్ల కలిగే కష్టం కంటే, ఓటర్ల జాబితాను సవరించడం వల్లే కలిగే ప్రజోపయోగమే ప్రధానమైనదని తెలిపారు. ఈ కారణాలతో ఏలూరు నగరపాలక సంస్థ పాలకవర్గ ఎన్నికలపై స్టే విధిస్తున్నట్టు న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
94 టన్నుల బ్యాలెట్ పత్రాలు
సాక్షి, అమరావతి: పురపాలక ఎన్నికల సన్నాహాలను పురపాలక శాఖ వేగవంతం చేసింది. రాష్ట్రంలో 12 నగర పాలక సంస్థలు, 75 పురపాలక సంఘాల్లో మార్చి 10న నిర్వహించనున్న పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం, బ్యాలెట్ పత్రాల ముద్రణ తదితర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి సున్నితమైనవి, అత్యంత సున్నితమైన వాటిని గుర్తించారు. వార్డులవారీగా ఓటర్ల జాబితాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ► మున్సిపల్ ఎన్నికల కోసం మొత్తం 15,978 బ్యాలెట్ బాక్సులు అవసరమని అంచనా వేశారు. జంబో బాక్సులు 922, పెద్ద బాక్సులు 10,673, మీడియం సైజు బాక్సులు 2,540, చిన్న సైజు బాక్సులు 1,843 వినియోగించను న్నారు. కొన్ని బ్యాలెట్ బాక్సులను గతంలో హైదరాబాద్లో పురపాలక సంస్థ ఎన్నికల కోసం పంపించారు. వాటిని వెనక్కి తెప్పించనున్నారు. ► బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఈ ఎన్నికల కోసం బ్యాలెట్ పత్రాల ముద్రణ ప్రక్రియను పురపాలక శాఖ చేపట్టింది. 13 జిల్లాలకు 94 టన్నుల వైట్వోవ్ కాగితాలను పంపించారు. ఎన్ని బ్యాలెట్ పత్రాలు అవసరమవుతా యన్నది జిల్లాల వారీగా కలెక్టర్లు నిర్ణయిస్తారు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల వారీగా ప్రింటింగ్ ప్రెస్లను కలెక్టర్లు ఎంపిక చేస్తారు. ► పోలింగ్ కోసం అవసరమైన ఇండెలిబుల్ ఇంక్ (సిరా)ను సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మున్సిపల్ ఎన్నికల కోసం తెప్పించిన సిరా గడువు తీరడంతో కొత్తగా ఆర్డర్ ఇచ్చారు. 5 ఎంఎల్ సిరా సీసాలు 13,500, 10 ఎంఎల్ సిరా సీసాలు 26,500 తెప్పించాలని నిర్ణయించారు. ► పురపాలక ఎన్నికల కోసం మొత్తం 9,307 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 12 నగర పాలక సంస్థల పరిధిలో 5,020 కేం ద్రాలు, 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో 4,287 పోలింగ్ కేంద్రాలున్నాయి. ► పోలింగ్ కేంద్రాల్లో సున్నితమైనవి 2,890, అత్యంత సున్నితమైనవి 2,466 కేంద్రాలు ఉండగా 3,951 సాధారణ పోలింగ్ కేంద్రా లున్నాయి. 12 నగర పాలక సంస్థల్లో సున్నితౖ మెనవి 1,465, అత్యంత సున్నితమైనవి 1,159, సాధారణమైనవి 2,396 కేంద్రాలు ఉన్నాయి. 75 పురపాలక సంఘాలు/ నగర పంచాయతీల పరిధిలో సున్నితమైనవి 1,425, అత్యంత సున్నితమైనవి 1,307, సాధారణ మైనవి 1,555 కేంద్రాలున్నాయి. ► మున్సిపల్ ఎన్నికల కోసం తొలిసారిగా ఓటర్ల ఫొటోలున్న స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. మున్సిపల్ ఓటర్ల వివరాలను పురపాలక శాఖ వెబ్సైట్లో పొందుపరిచారు. వార్డుల వారీగా ఓటర్ల పేర్లతో సహా జాబితాలను అందుబాటులో ఉంచారు. -
ఎమ్మెల్సీ పోరు: ఓటు నమోదుకు ఇదే చివరి అవకాశం!
సాక్షి, హైదరాబాద్: పట్ట భద్రుల శాసన మండలి నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఇంకా పేరు నమోదు చేసుకోలేక పోయారా? అయితే ఓటరుగా నమోదు కావడానికి మీకు మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణ తుది గడువుకు 10 రోజుల ముందు వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులు స్వీకరించి, సత్వరంగా వాటి ని పరిష్కరించి అనుబంధ ఓటర్ల జాబితాను ప్రచురించనుంది. ఈ అనుబంధ ఓటర్ల జాబితాలో చోటు సంపాదించిన వారికి ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించనుంది. మహబూబ్నగర్– రంగారెడ్డి– హైదరాబాద్ స్థానంతో పాటు వరంగల్–ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈనెల 23తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుంది. నామినేషన్ల స్వీకరణ గడువు ముగింపునకు 10 రోజుల ముందు అంటే ఈనెల 13 అర్ధరాత్రి వరకు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించి, అర్హులకు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ‘వరంగల్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో మొత్తం 4,91,396 మంది, ‘మహబూబ్నగర్’ పట్టభద్రుల మండలి స్థానం పరిధిలో 5,17,883 మంది గత నెలలో ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో చోటు సంపాదించారు. చదవండి: పట్టభద్రులు ఓటు ఇలా నమోదు చేసుకోండి కాగా తెలంగాణలో ఖమ్మం - వరంగల్-నల్గొండ, మహబూబ్నగర్ - రంగారెడ్డి -హైదరాబాద్ పట్టభద్రుల స్థానాలకు ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ జారీ కానుండగా.. మార్చి 14న పోలింగ్ జరుగనుంది. నామినేషన్ల స్వీకరణకు ఈ నెల 23వ తేదీ వరకు గడువు ఇచ్చారు. 24న నామినేషన్లను పరిశీలించన్నారు. 26న నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు ఇచ్చారు. మార్చి 14న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ప్రస్తుత ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎన్.రామచంద్రరావు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. చదవండి: మేయర్ ఎన్నిక: వారు అలా.. వీరు ఇలా.. రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ -
2019 ఓటర్ల జాబితాతో ఎన్నికలు సరికాదు..
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2021 ఓటర్ల జాబితాతో కాకుండా 2019 ఓటర్ల జాబితాతో నిర్వహించడం వల్ల 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోతారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ గుంటూరుకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 3.6 లక్షల మంది ఓటుహక్కును కోల్పోవడం.. రాజ్యాంగం ప్రసాదించిన హక్కును హరించడమేనని పిటిషన్లో పేర్కొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కును హరించే అధికారం ఎన్నికల కమిషన్కు లేదన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేయాలని కోరారు. ఈ వ్యాజ్యంపై అత్యవసరంగా విచారణ చేపట్టాలని అఖిల న్యాయవాది శివప్రసాద్రెడ్డి సోమవారం హైకోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు తోసిపుచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందని గుర్తుచేసిన న్యాయమూర్తి ఎన్నికల వ్యవహారం సుప్రీంకోర్టు ముందు ఉందని చెప్పారు. సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దామని, ఆ తరువాత అత్యవసర విచారణ గురించి ప్రస్తావించవచ్చని తెలిపారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని, దీనిపై అత్యవసర విచారణ జరపాలన్న మరో న్యాయవాది అభ్యర్థనను కూడా న్యాయమూర్తి తోసిపుచ్చారు. -
ఎన్నికల కమిషన్ నిర్ణయంతో.. 3 లక్షల మందికి నష్టం
సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలను 2019 ఓటర్ల జాబితా ఆధారంగా నిర్వహించడంవల్ల దాదాపు 3 లక్షల మంది తమ ఓటు హక్కును కోల్పోతున్నారని.. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని ఎన్నికల కమిషన్కు తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ హైకోర్టులో సోమవారం పిటిషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన విద్యార్థిని ధూళిపాళ్ల అఖిల ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు వచ్చిన తమకు దానిని వినియోగించుకునే అవకాశం కల్పించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని న్యాయస్థానానికి అఖిల నివేదించనున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణయంవల్ల తనలాగా కొత్తగా ఓటు హక్కు వచ్చిన 3 లక్షల మంది నష్టపోతారని వివరించనున్నారు. 18ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని రాజ్యాంగంలోని అధికరణ 326 కల్పిస్తోందని తెలుపనున్నారు. అందువల్ల ఈ విషయంలో జోక్యం చేసుకుని ఎన్నికల నోటిఫికేషన్ అమలును నిలిపేస్తూ ఉత్తర్వులివ్వాలని ఆమె కోరనున్నారు. -
పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు
సాక్షి, అమరావతి: మండల, జిల్లా పరిషత్ల ఎన్నికల కోసం గత ఏడాది మార్చి నాటికి తయారుచేసిన ఓటర్ల జాబితా ప్రకారమే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ శుక్రవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు. 2019 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారితో అప్పట్లో ఓటర్ల జాబితాలు తయారు చేశారని, 2020 మార్చి 7వ తేదీ నాటికి వాటిని అప్డేట్ చేశారని తెలిపారు. -
ఏపీలో ఓటర్ల తుది జాబితా విడుదల
సాక్షి, అమరాతి : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల తుది జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 4,04,41,378 ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,99,66,737, మహిళలు 2,04,71,506 మంది ఉన్నారు. ఇక 4,135 మంది థర్డ్జెండర్లు, 66,844 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. -
‘ఆమే’ నిర్ణాయక శక్తి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ప్రకటించిన 2021 ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ విషయం స్పష్టమైంది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అనంతపురం జిల్లా మినహా మిగతా 12 జిల్లాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. సర్వీసు ఓటర్లను మినహాయిస్తే థర్డ్ జండర్ ఓట్లు 4,083 కలుపుకుని మొత్తం ఓటర్లు 4,00,79,025 మంది ఉన్నారు. ఇందులో మహిళా ఓటర్లు 2,02,83,145 మంది కాగా, పురుష ఓటర్ల సంఖ్య 1,97,91,797. ఈ లెక్కన రాష్ట్ర వ్యాప్తంగా 4,91,348 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. కాగా, 2020 ముసాయిదా ఓటర్ల సవరణ జాబితా నుంచి ఈ ఏడాది నవంబర్ 16వ తేదీ నాటికి అదనంగా 1,41,631 ఓటర్లు నమోదయ్యారు. ఒక్క అనంతపురం జిల్లాలో మాత్రం పురుష ఓటర్లు 16,52,036 మంది ఉండగా, మహిళా ఓటర్లు 16,48,024 మంది ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 42,72,107 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 18,65,266 మంది ఓటర్లు ఉన్నారు. -
ఓటుహక్కు నమోదుకు అవకాశం
బేల: ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. పేరు లేకున్నా.. ఏమైనా సవరణలు ఉన్నా.. దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయం, అన్ని పోలింగ్బూత్లలో ఓటరు జాబితా అందుబాటులో ఉంది. ఆ జాబితాలో తమ పేర్లను పరిశీలించుకునే విధంగా అవకాశం కల్పించారు అధికారులు. పేర్లు తప్పుగా ఉన్నవారు, మార్పుల, చేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అభ్యంతరాల స్వీకరణతో పాటు కొత్త ఓటరు నమోదుకు డిసెంబర్ 15వరకు అవకాశం కల్పించింది. నియోజకవర్గం అధికారులు ముసాయిదా జాబితాను ఇటీవల విడుదల చేశారు. అర్హులకు అవకాశం.. రాజ్యాంగం ప్రకారం 18ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి ఓటు హక్కును కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం నుంచి కొత్తగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2021 జనవరి 1వరకు 18ఏళ్లు నిండిన వారు ఓటుహక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక ప్రణాళిక.. ఏటా నవంబర్, డిసెంబర్ నెలల్లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతారు. ఈ ఏడాది కూడా నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నాలుగు రోజులు పోలింగ్ కేంద్రాలు, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తులు స్వీకరించే విధంగా ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈనెల 21, 22తేదీలతో పాటు డిసెంబర్ 5, 6న ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకునే వీలుంటుంది. 2020 డిసెంబర్ 15 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. 2021 జనవరి 5న దరఖాస్తులు పరిశీలించిన అనంతరం జనవరి 14న తొలి జాబితాను విడుదల చేస్తారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. -
ఊపందుకుంటున్న ‘గ్రేటర్’ ఎన్నికల ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు వేగం పుంజుకున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా ఓటర్ల జాబితా ఆధారంగా, మొత్తం 150 డివిజన్ల (వార్డుల) వారీగా ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 7న ముసాయిదా జాబితాలు ప్రచురిస్తారు. మిగతా ప్రక్రియలను ముగించి 13న తుది ఓటర్ల జాబితాలను ప్రచురించనున్న నేపథ్యంలో వార్డుల వారీగా రూపొందించే ఓటర్ల జాబితాల్లో ఏ ఓటరు కులం లేదా మతం వెల్లడించే విధంగా వివరాలు ఉండకూడదని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) ఆదేశాలిచ్చింది. వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాల్లో ఏవైనా క్లరికల్ లేదా ప్రచురణ దోషాలుంటే.. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు మొదట అసెంబ్లీ నియోజకవర్గ జాబితాలో ఆ విధమైన లోపాలను సరిచేసి, ఆ తర్వాత వార్డు ఓటరు జాబితాల్లో సరిచేయాలని సూచించింది. ఈ విధంగా చేయడం ద్వారా అసెంబ్లీ ఓటర్ల జాబితాల్లోని వివరాలకు అనుగుణంగానే వార్డుల వారీ జాబితాలు ఉంటాయని స్పష్టం చేసింది. హార్డ్, సాఫ్ట్ కాపీలు.. వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో పాటు ఈసీ వద్ద నమోదై రిజర్వ్ చిహ్నం కేటాయించిన రాజకీయ పార్టీలకు ఉచితంగా సరఫరా చేసి వాటి నుంచి రశీదులు పొందాలని మున్సిపల్ అధికారులకు ఎస్ఈసీ సూచిం చింది. ఈ జాబితాల కాపీలు ఇతరులు కావాలని కోరిన పక్షంలో దానికయ్యే వాస్తవ ధర వసూలు చేసి హార్డ్, సాఫ్ట్ కాపీలు అందజేయొచ్చునని తెలిపింది. అవసరమైన ఓటరు జాబితా కాపీల ముద్రణకు అనుగుణంగా ముందుగానే అంచనా వేసి ప్రింట్ చేసుకోవాలని సూచించింది. వార్డుల వారీ ఓటర్ల జాబితాలను ఫొటోలు లేకుండా జీహెచ్ఎంసీ, ఎస్ఈసీ వెబ్పోర్టళ్లలో ఉంచాలని తెలిపింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు కీలకమైనందున వివిధ అంశాలకు సంబంధించి ఎస్ఈసీ స్పష్టతనిచ్చింది. (చదవండి: జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం) కరోనా నేపథ్యంలో విశాల గదుల్లోనే కరోనా నేపథ్యంలో విశాలమైన గదులు, హాళ్లు ఉన్న భవనాలల్లోనే పోలింగ్ కేంద్రాల ఏర్పాటు.. సాధ్యమైన మేర ఓటేసేవారు ఒక ద్వారం నుంచి ప్రవేశించి మరో ద్వారం గుండా బయటకు వెళ్లగలిగే హాళ్లు, గదులున్న భవనాలనే పోలింగ్ స్టేషన్లుగా ఎంపిక చేయాలి. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించాలి. ఆయా వార్డుల పరిధిలోనే సంబంధిత పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు చేయాలి. ఓటర్కు అందు బాటులో ఉండేలా ఒక కిలోమీటరు కంటే ఎక్కువ దూరం లేకుండా పోలింగ్ కేంద్రాలు కేటాయించాలి. పోలింగ్ కేంద్రాలుగా పాఠశాల భవనాలను ఎంపిక చేస్తే ప్రభుత్వ, సెమీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వాటినే ఎంపిక చేయాలి. ళీ ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేకపోతేనే చివరి ప్రయత్నంగా పోలింగ్ కేంద్రా లను తాత్కాలిక నిర్మాణాల్లో ఏర్పాటు చేయాలి. ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భవనాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయొద్దు. పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మత ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలను ఎంపిక చేయొద్దు. భవనాల కింది అంతస్తుల్లోనే పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. 7న ముసాయిదా ఓటర్ల జాబితాల తయారీ మొదలై 13న తుది జాబితాలను ప్రచురించనున్నందున.. అర్హులైన ఓటర్లు అసెంబ్లీ జాబితాల్లో తమ పేర్లను సరిచూసుకోవాలి. ళీ పేర్లు లేకుంటే తమ ఓటు నమోదుకు ఎన్వీఎస్పీ.ఇన్ పోర్టల్ ద్వారా నమోదు పత్రం లేదా నిర్దేశిత ఫారం– 6లో అసెంబ్లీ ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారి వద్ద దరఖాస్తు పత్రం సమర్పించాలి. వాటిని పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లను ముందుగా అసెంబ్లీ జాబితాల్లో చేర్చి తదనుగుణంగా సంబంధిత వార్డు ఓటరు జాబితాల్లో చేరుస్తారు. ఎస్ఈసీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే తేదీ వరకు ఈ అవకాశముంటుంది. -
గ్రేటర్ పోరుకు సిద్ధం కండి
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధ మైంది. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్టు సమాచారం. వచ్చే ఫిబ్రవరి 10న జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగుస్తుండటంతో ఆలోగా ఎన్నికలు నిర్వహిం చేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాల్సిం దిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ని కలిసి మున్సిపల్ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్కుమార్ విజ్ఞప్తి చేశారు. కొత్తగా వార్డుల పునర్వ్యవస్థీకరణ లేదని, గతంలోని వార్డులే కొనసాగడంతో పాటు 2016 ఎన్నికల్లో అనుసరిం చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లే వచ్చే ఎన్నికల్లోనే కొనసాగించేందుకు సంబంధించిన రెండు జీవోలను కూడా ఎస్ఈసీకి అందజేశారు. అంటే రెండోటర్మ్ కూడా అవే రిజర్వేషన్లు కొన సాగేలా ఇటీవల అసెంబ్లీలో చేసిన చట్టసవరణ బిల్లుకు తగ్గట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత పాలకమండలి ఐదేళ్ల పదవీకాలానికి మూడు నెలల ముందు ఎన్నికలు నిర్వహించే సౌలభ్యం జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం ఈ మేరకు ఎస్ఈసీ కార్యా లయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థ సారథితో అరవింద్కుమార్, జీహెచ్ఎంసీ కమిష నర్ లోకేశ్కుమార్, అధికారులు భేటీ అయ్యారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా రూపొందించి, ప్రచురించడానికి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముందు, ఇప్పటి నుంచి ఈ ఎన్నికల ప్రక్రియ అంతా ముగిసేవరకు యావత్ జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని ఎన్నికల పనులపై దృష్టి కేంద్రీ కరించేలా చూడాలని జీహెచ్ఎంసీ కమిషనర్కు ఎన్నికల కమిషనర్ సూచించారు. ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు వార్డులవారీగా ఓటర్ల జాబితాను డిప్యూటీ మున్సిపల్ కమిషనర్లు రూపొందించేలా చూడాలని ఆదేశించారు. ఓటర్ల తుది జాబితాపై నోటిఫికేషన్... జీహెచ్ఎంసీలోని 150 వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసి ఈ నెల 13న ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితా తుది ప్రచురణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. 2020 సంవత్సరం జనవరి 1వ తేదీ ప్రాతిపదికగా (క్వాలిఫైంగ్ డేట్) తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితాలను తు.చ తప్పకుండా పాటిస్తూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం చేసే బాధ్యతను సంబంధిత మున్సిపల్ సర్కిళ్లలోని జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లకు అప్పగిస్తున్నట్టు పేర్కొన్నారు. శాసనసభ ఓటర్ల జాబితాని యథాతథంగా పాటిస్తూ అదే ఫార్మాట్లో జీహెచ్ఎంసీలోని అన్ని వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రతీ వార్డు వారీగా మున్సిపల్ ఓటర్ల జాబితా టైటిల్ పేజీలో పోలింగ్ ఏరియాల వివరాలను పొందుపరచాలని సూచించారు. నవంబర్ 13న తుది ఓటర్ల జాబితాను ప్రచురించాక, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే దాకా చేర్పులు, తొలగింపులు లేదా కరెక్షన్లు వంటి వాటిని నిబంధనలకు అనుగుణంగా ఈఆర్వోల నుంచి సంబంధిత డిప్యూటీ కమిషనర్లు స్వీకరించి, ఆ మేరకు సంబంధిత వార్డులోని ఓటర్ల జాబితాల్లో చేర్చాలని ఈ నోటిఫికేషన్లో పార్థసారథి పేర్కొన్నారు. 5న కలెక్టర్లతో పార్థసారథి సమావేశం జీహెచ్ఎంసీ వార్డులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో ఉండటంతో ఎన్నికల ఏర్పాట్లు, సంసిద్ధతపై ఆయా జిల్లాల కలెక్టర్లతో నవంబర్ 5న ఎన్నికల కమిషనర్ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే 150 డివిజన్లలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన రిటర్నింగ్ అధికారులను ఎస్ఈసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఆర్వోలు, ఇతర ఎన్నికల సిబ్బందికి శిక్షణనిచ్చే ‘ట్రైనింగ్ టు ట్రైనర్స్’(టీవోటీ)కు నవంబర్ 3, 4 తేదీల్లో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ ఇదీ... నవంబర్ 7న వార్డుల వారీగా ముసాయిదా ఫోటో ఓటర్ల జాబితాలను తయారుచేసి, సాధారణ ప్రజలు పరిశీలించేందుకు వీలుగా రూల్నెం.5లో పేర్కొన్న ప్రదేశాల్లో ప్రదర్శించాలి. 8వ తేదీనుంచి 11 వరకు వార్డుల వారీ ఫోటో ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరణ. 9న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో జీహెచ్ఎంసీ కమిషనర్, ఎన్నికల అధికారి సమావేశం. 10న జీహెచ్ఎంసీ సర్కిల్ స్థాయి రాజకీయ పార్టీల ప్రతినిధులతో డిప్యూటీ కమిషనర్ల సమావేశం. 12న ఏవైనా అభ్యంతరాలుంటే డిప్యూటీ కమిషనర్ల ద్వారా పరిష్కారం. 13న సంబంధిత సర్కిళ్లలో డిప్యూటీ కమిషనర్ల ద్వారా వార్డుల వారీగా ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాల తుది ప్రచురణ. -
పదవులు 8.. ఓట్లు 3!
సాక్షి, ఆదిలాబాద్: డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నికలకు సంబంధించి శనివారం కోఆపరేటివ్ ఎన్నికల అధికారులు ఓటరు జాబితా విడుదల చేశారు. అందులో పీఏసీఎస్ అధ్యక్షులను ఏ–క్లాస్ ఓటర్లుగా, ప్రభుత్వ సంబంధిత సొసైటీల అధ్యక్షులను బీ–క్లాస్ ఓటర్లుగా లెక్క తేల్చారు. అయితే విచిత్రమేమిటంటే.. ఏ–క్లాస్ నుంచి ఈ రెండు పాలకవర్గాలకు కలిపి 22 డైరెక్టర్ పదవులు ఉంటే ఇందులో ఓటర్లుగా 77 మంది ఉన్నారు. ఇక బీ–క్లాస్ నుంచి ఈ పాలకవర్గాలకు 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఓటర్లు కేవలం ముగ్గురు మాత్రమే ఉండటం చోద్యంగా కనిపిస్తోంది. దీంతో ఐదు డైరెక్టర్ పదవులు ఎన్నిక కాకుండా మిగిలిపోనున్నాయి. క్రియాశీలకంగా లేవు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వరంగ సొసైటీలు 272 ఉండగా, ప్రస్తుతం ఇవి క్రియాశీలకంగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైంది. కుల, ఉద్యోగ, చేనేత ఇలా పలు సొసైటీలను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను నియమించుకోవాలి. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా ఓ కమిటీ పర్యవేక్షిస్తుంది. పర్సన్ ఇన్చార్జి నిరంతరంగా సొసైటీల ఎన్నికలు జరిగి అధ్యక్ష, ఉపాధ్యక్షుల నియామకం జరిగేలా జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి. అయితే ఉమ్మడి జిల్లాలో వందలాది ఇలాంటి సొసైటీలు ఉండగా, సరైన పర్యవేక్షణ లేనికారణంగా కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉండటం గమనార్హం. వాటిలో టెలికం ఎంప్లాయీస్ కోఆపరేటీవ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఆదిలాబాద్, మహరాణా ప్రతాప్సింగ్ బీసీ లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటీవ్ సొసైటీ లిమిటెడ్, ఆదిలాబాద్తోపాటు మమతా సూపర్బజార్ మంచిర్యాల సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. మిగతా సొసైటీలు ఉండీ లేనట్టుగా తయారయ్యాయి. ముగ్గురే మహిళలు.. డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల ఎన్నిక కోసం శనివారం ఓటరు జాబితా విడుదల చేయగా ఏ–క్లాస్లోని 77 మంది ఓటర్లలో కేవలం ముగ్గురే మహిళా ఓటర్లు ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరిగిన సహకార సంఘాల ఎన్నికల్లో వివిధ సొసైటీల నుంచి ముగ్గురు మహిళలు మాత్రమే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. మిర్జాపూర్ సొసైటీ నుంచి దీపారెడ్డి, పాండ్వపూర్ సొసైటీ నుంచి ఆర్.శైలజ, ధర్మరావుపేట్ సొసైటీ నుంచి బడావత్ నీల ఇందులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏ–క్లాస్లోని 22 డైరెక్టర్ పదవుల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభి స్తుందా? అనేది ఆసక్తికరం. డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవుల కోసం కొంతమంది నేతలు రాజధానిలో జిల్లా ముఖ్యనేతలతో కలిసి పైరవీ చేస్తున్నారు. వారి ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచిచూడాల్సిందే. ఈనెల 25న డైరెక్టర్ పదవుల ఎన్నిక కోసం నామినేషన్ల స్వీకరణ ఉండనుంది. ఐదు పదవులు మిగిలిపోనున్నాయి బీ–క్లాస్ నుంచి కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఇందులో 8 డైరెక్టర్ పదవులు ఉండగా, ఈ ముగ్గురు పోను మిగతా ఐదు డైరెక్టర్ పదవులు ఖాళీగా మిగలనున్నాయి. ప్రభుత్వరంగ సొసైటీలు ఎన్నికలు చేపట్టి అధ్యక్షులను నియమించుకొని క్రియాశీలకంగా ఉంటే దీంట్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉండేది. ఉమ్మడి జిల్లాలో కేవలం మూడు సొసైటీలు మాత్రమే క్రియాశీలకంగా ఉన్నాయి. – మోహన్, డీసీవో, ఆదిలాబాద్ -
విచిత్రం: ‘ఆత్మ’లకు ఓటు!
సాక్షి, షాద్నగర్ : సహకార సంఘాల ఓటరు జాబితాలో అధికారులు మృతిచెందిన వారికి కూడా చోటు కల్పించారు. సంఘంలో సభ్యులై ఉండి చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించలేదు. షాద్నగర్ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 16740 మంది ఓటర్లు ఉన్నారు. అధికారులు ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను తయారు చేశారు. ఈ జాబితాలో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదు. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఒక్కో వార్డులో సుమారు పది నుంచి ఇరవై మంది మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే, ఓటరు జాబితాలో ఉన్న మృతులకు సంబంధించిన రుణాలను వారి కుటుంబ సభ్యులు చెల్లిస్తే జాబితాలో నుంచి పేర్లు తొలిగిపోతాయని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రుణాలు చెల్లించకుండా ఉండటంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్న దృశ్యం ముందస్తు చర్యలేవీ.. ముందుగా ఓటర్ల జాబితాను రూపొందించి సహకార సంఘం కార్యాలయంలో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండానే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కొందరి ఓటర్ల ఫొటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడం ఇబ్బందిగా మారిందని నాయకులు అంటున్నారు. గ్రామాల్లో తిరిగి విచారణ చేశాం. సహకార ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను గుర్తించాం. చనిపోయిన వారి వివరాలు మాకు తెలియలేదు. దీంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించలేకపోయాం. – మహ్మద్ షరీఫ్, సీఈఓ, కొందుర్గు సహకార సంఘం -
15 వరకు ఓటర్ల నమోదు
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020లో భాగంగా గత నెల 16న ముసాయి దా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ నెల 15వరకు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంత రాలతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు దరఖాస్తులు, ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పుల్ని సరిచేయడానికి విజ్ఞప్తులను స్వీకరిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్కుమార్ తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. తుది ఓటర్ల జాబితాను ఫిబ్ర వరి 7న ప్రకటిస్తామని తెలిపారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఓటర్లను భౌగోళికంగా సులువుగా గుర్తించేందుకు వారి గృహాల మ్యాపు(నజరీ నక్షా)ను తయారు చేస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారోద్యోమాలు నిర్వహించాలని, డూప్లికేట్ ఓట్లను తొలగించాలని ఈ సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల ప్రతినిధులకు సీఈఓకు విజ్ఞప్తి చేశాయి. -
ఆదిలాబాద్లో మున్సిపల్ ఓటర్ జాబితా విడుదల
సాక్షి, ఆదిలాబాద్: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ పట్టణ ఓటర్ల సంఖ్య తేలింది. మున్సిపల్ ఎన్నికల్లో మరో కీలక ఘట్టమైన ఓటరు జాబితా సవరణ ముగిసింది. గతనెల 30న విడుదల చేసిన ముసాయిదా ఓటరు జాబితాలో తప్పులను సరిచేసేందుకు ఈనెల 2 వరకు అవకాశం కల్పించారు. 3న అభ్యంతరాలను పరిశీలించి శనివారం ఓటర్ల తుది మొదటి పేజీ తరువాయి జాబితాను విడుదల చేశారు. ఆ జాబితా ప్రకారం మున్సిపల్ పరిధిలో 1,27,801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 63,057, మహిళలు 64,738 మంది ఉన్నారు. కులాల వారీగా ఓటర్లు ఇలా.. 30న విడుదలైన ముసాయిదా జాబితా ప్రకా రం ఏవైనా తప్పులుంటే సరిచూసుకునే అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం తప్పుల సవరణ అనంతరం కూడా అదే ఓటర్లు ఉన్నారు. వార్డుల విభజనలో భాగంగా ఒక వార్డులోని కొంత భాగాన్ని వేరేవార్డులో కలిపినా ఓటర్ల సంఖ్య మాత్రం సరిగ్గానే ఉంది. నూతన లెక్కల ప్రకారం ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఎస్టీ ఓటర్లు 5,380 మంది ఉండగా పురుషులు 2,629, మహిళలు 2,751 ఉన్నారు. ఎస్సీ కేటగిరిలో మొత్తం 16,833 మంది ఓటర్లు ఉండగా పురుషులు 8,144, మహిళలు 8,689 మంది ఉన్నారు. బీసీ కేటగిరిలో మొత్తం 72,095 మంది ఓటర్లు ఉండగా పురుషులు 35,617, మహిళలు 36,476 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 33,493 మంది ఉండగా పురుషులు 16,667, మహిళలు 16,822 మంది ఓటర్లు ఉన్నారు. అన్ని కేటగిరీలకు చెందిన ఓటర్ల జాబితాను పరిశీలిస్తే పురుషుల కంటే మహిళలే అధికంగా ఉండటం గమనార్హం. -
కరీంనగర్ మేయర్ బీసీలకే..?
సాక్షి, కరీంనగర్: మునిసిపల్ ఎన్నికల్లో కీలకమైన రిజర్వేషన్ల ప్రక్రియలో తొలిఘట్టం ముగిసింది. మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో ఏ కేటగిరీకి ఎన్ని వార్డులను రిజర్వు చేశారో తేలింది. ఆయా పుర, నగర పాలక సంస్థల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా, బీసీ, జనరల్ ఓటర్ల సంఖ్యతో రూపొందించిన కులగణన ద్వారా ఆయా కేటగిరీలకు కేటాయించే వార్డుల సంఖ్యను ప్రభుత్వం శనివారం ప్రకటించింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలోని కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఉన్న రెండు కార్పొరేషన్లు, 14 మునిసిపాలిటీల్లో ఉన్న జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులను ఆయా కేటగిరీలకు కేటాయించారు. ఆయా కేటగిరీలకు కేటాయించిన వార్డులను బట్టి మునిసిపల్ కార్పొరేషన్లలో కరీంనగర్ బీసీలకు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఏ మునిసిపల్ కార్పొరేషన్లో లేని విధంగా 60లో అన్రిజర్వుడు(జనరల్) 30 స్థానాలు పోగా ఏకంగా 23 వార్డులను బీసీలకు రిజర్వు చేశారు. 6 స్థానాలు ఎస్సీలకు, ఒక స్థానాన్ని ఎస్టీకి రిజర్వు చేశారు. దీనిని బట్టి కరీంనగర్ మేయర్ స్థానాన్ని బీసీలకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. అలాగే రామగుండం కార్పొరేషన్లో ఎస్సీలకు అత్యధికంగా 11 వార్డులు కేటాయించారు. ఇక్కడ 50 స్థానాలు ఉండగా, 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా 25 స్థానాల్లో 11 స్థానాలు ఎస్సీలకు కేటాయించారు. రాష్ట్రంలో మరే కార్పొరేషన్లో ఎస్సీలకు ఇన్ని స్థానాలు లేవు. ఈ రిజర్వుడు స్థానాలను బట్టి కరీంనగర్ మేయర్ స్థానం బీసీలకు, రామగుండం ఎస్సీలకు రిజర్వు చేయడం దాదాపు ఖాయమైంది. మహిళలకా, జనరల్ స్థానమా అనేది తర్వాత తేలనుంది. మునిసిపాలిటీలకు సంబంధించి రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న అన్ని పురపాలక సంస్థలను ఒక యూనిట్గా తీసుకొని జనాభా ఆధారంగా రిజర్వేషన్లను ప్రకటిస్తారు. మునిసిపాలిటీల్లో కూడా జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి వంటి స్థానాలు బీసీలకు రిజర్వు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. మునిసిపల్ కార్పొరేషన్లలో మేయర్ లెక్క ఇదీ.. వార్డుల వారీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్లకు కేటాయించిన వార్డులను బట్టి కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లు బీసీ, ఎస్సీలకు రిజర్వు అయ్యేందుకే ఎక్కువగా అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి 50 శాతం మించకుండా ప్రభుత్వం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు వార్డుల సంఖ్యను రిజర్వు చేసింది. కరీంనగర్లోని 60 వార్డుల్లో జనరల్ స్థానాలు 30 పోగా మిగతా 30లో ఎస్సీలకు కేవలం6 స్థానాలు(10 శాతం), ఎస్టీలకు ఒక స్థానాన్ని కేటాయించారు. బీసీలకు ఏకంగా 23 స్థానాల(38 శాతం)ను కేటాయించడం గమనార్హం. దీనిని బట్టి కరీంనగర్ బీసీ కేటగిరీలో రిజర్వు అయ్యే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. ఇక ఎస్సీ జనాభా అధికంగా ఉన్న రామగుండం నగర పాలక సంస్థలో 50 వార్డులకు గాను సగం జనరల్కు కేటాయించారు. మిగిలిన 25లో ఏకంగా 11 స్థానాలు(20 శాతం) ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ బీసీలకు కేవలం 13 స్థానాలు, ఎస్టీలకు ఒక స్థానం మిగిలింది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఒక్కో వార్డును ఎస్టీకి కేటాయించారు. నేడు తేలనున్న వార్డులు ప్రకటించిన రిజర్వు స్థానాల సంఖ్య ఆధారంగా ఏయే వార్డులను ఏ కేటగిరీకి రిజర్వు చేస్తారనేది ఆదివారం తేలుతుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ జనాభా అధికంగా ఉన్న వార్డులను వారికి కేటాయించిన సంఖ్య ప్రకారం తొలుత కేటాయిస్తారు. తరువాత ఓటర్ల గణన ప్రకారం బీసీ కేటగిరీకి వార్డులను కేటాయించిన అనంతరం మిగిలిన వాటిని జనరల్ కేటగిరీ కింద ప్రకటిస్తారు. అనంతరం ఆయా మునిసిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో మహిళలకు, ఎవరికి కేటాయించని స్థానాలను లాటరీ పద్ధతిలో డ్రా ద్వారా నిర్ణయిస్తారు. ప్రతి కౌన్సిల్లో 50 శాతం మహిళలు ఉండేలా వార్డులను రిజర్వు చేయడం గమనార్హం. రేపు మునిసిపల్ చైర్పర్సన్, మేయర్ రిజర్వేషన్ మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో ఏ కేటగి రీకి ఎన్ని వార్డులను కేటాయించారనే లెక్క తేలగా, అవి ఏయే వార్డులనే విషయం ఆదివారం వెల్లడి కానుంది. ఇక మున్సిపల్ చైర్మన్, మేయర్ స్థానాలను ఏ కేటగిరీకి రిజర్వు చేశారనేది సోమవారం స్పష్టం కానుంది. రాష్ట్రం యూనిట్గా తీసుకొని జనాభా ఆధారంగా మేయర్, మునిసిపల్ చైర్మన్ల రిజర్వేషన్లను నిర్ణయించనున్నారు. రాజ కీయ నేతల్లో ఈ మేరకు టెన్షన్ నెలకొంది. -
నల్లగొండలో ఓటరు జాబితా విడుదల
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల తుది ఓటరు జాబితాలను శనివారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. వారం రోజులుగా సామాజిక కుల గణన, ఓటరు ముసాయిదా జాబితాపై కసరత్తు చేసిన అధికారులు మొత్తం ఓటర్లను వార్డుల వారీగా విభజించి తుది జాబితా తయారు చేశారు. నీలగిరి మున్సిపాలిటీ తుది ఓటరు జాబితాను మున్సిపల్ కమిషనర్ దేవ్సింగ్ విడుదల చేశారు. మున్సిపాలిటీ పరిధిలోని 48 వార్డుల్లో మొత్తం 1,27,044 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 62,215 మంది, మహిళలు 64,828 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, ఇతరుల ఓట్లను కూడా వార్డుల వారీగా లెక్క తేల్చి తుది జాబితాను తయారు చేశారు. పురుషల కన్నా మహిళలు 2,613 మంది ఎక్కువగా ఉన్నారు. 39 వార్డుల్లో మహిళలే అధికం నీలగిరి పట్టణంలో 48 వార్డులు ఉండగా అత్యధిక వార్డుల్లో మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం 39 వార్డుల్లో మహిళా ఓటర్లు ఎక్కువ ఉండగా, 9 వార్డుల్లో పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 18,486మంది, ఎస్టీలు 1,483మంది, బీసీలు 79,632, ఇతరులు ఒకటి, జనరల్ ఓటర్లు 27,443 మంది ఉన్నారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలోని 48 వార్డులకు చెందిన కులాల వారిగా ప్రకటించారు. మున్సిపాలిటీలో మొత్తం 87.431 మంది ఓటర్లు కాగా వీరిలో పురుషులు 42,744, మహిళలు 44,685 మంది ఓటర్లున్నారు. నందికొండ (నాగార్జునసాగర్) మున్సిపాలిటీలో 12 వార్డులుండగా 12,715 మంది ఓటర్లున్నారు. ఇందులో పురుషులు 6,160 మంది, మహిళలు 6,555 మంది ఉన్నారు. చండూరు మున్సిపాలిటీలో 10 వార్డులకుగాను 10,055 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,128, మహిళలు 4,927 మంది ఉన్నారు. చిట్యాల మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 11,094 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 5,578 మంది,, మహిళలు 5,516 మంది ఓటర్లున్నారు. వీరిలో ఎస్టీ ఓటర్లు 132మంది, ఎస్సీలు 1975 మంది, బీసీలు 6337 మంది, జనరల్ 2,650 మంది ఉన్నారు.దేవరకొండ మున్సిపాలిటీలో 20 వార్డుల్లో 21,590 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,595 మంది పురుషులు, 10,995 మహిళలు ఉన్నారు. కాగా, హాలియా మున్సిపాలిటీకి సంబంధించి కమిషనర్ బాలకృష్ణ అందుబాటులో లేకపోవడంతో ఓటర్ల వివరాలను ప్రకటించలేదు. -
మున్సిపల్ పోరు: మీ పేరు ఉందా..?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్తో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా, కుల గణన ముసాయిదా జాబితాను ప్రకటించారు. వెంటనే జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి.. శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా.. ఎక్కడికి పోతుందిలే అని అనుకోవద్దు.. ఇప్పటికే అనేక సార్లు ఓటరు సర్వే చేశారు. మీ పేరు తొలగించి ఉండవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీకు ఓటు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి.. వీటితో పాటు కొత్త వారికి ఓటు నమోదుకు కొంత సమయం ఉంది. వెంటనే నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండితే చాలు. ఓటు నమోదు చేసుకుని ఈనెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 7 వరకు.. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈనెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నమోదు చేసుకుకే అవకాశం ఉంది. www. nvcp.in, www.ceotelangana.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్గా నమోదు చేసుకోచ్చు. దీనికి గాను ఫారం నంబర్–6ను పూరించి అప్లోడ్ చేయాలి. గత నెల 30వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వీటికి గత నెల 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 3వ తేదీన అభ్యంతరాలకు సమాధానాలు, వివరణ ఇస్తారు. 4న తుది జాబితా ప్రకటించి, 7న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈలోపు ఓటర్గా నమోదు చేసుకోవడం మన ఓటు గల్లంతు అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు చేసుకుంటనే వాటిని సరి చేస్తారు. గత ఓటర్ల జాబితా ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్లు ఒక డివిజన్లో ఉండి మీ ఓటు మరో డివిజన్లో ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 2014వ ఎన్నికల సమయంలో 2,28,872 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికలు వచ్చే సరికి 2,72,194 మందికి పెరిగిపోయారు. గడిచిని 5 ఏళ్లలో 43,322 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 20,825 ఓటర్లు పెరిగారు. డివిజన్ల పునర్వీభజన ప్రకటించిన నాటి నుంచి 14,408 మంది ఓటర్లు పెరిగినట్లు గణనాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి మరికొంత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రాలు మారినా.. సరాసరి ఒక పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇప్పటికే కరీంనగర్కు 1050, హుజూరాబాద్కు 150, జమ్మికుంటకు 150, చొప్పదండికి 66, కొత్తపల్లికి 44 బ్యాలెట్ బాక్స్లు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను 4న ప్రకటిస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను 9న ప్రకటించి మరునాడు పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్కు నివేదిక సమర్పిస్తారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను 13న ప్రకటిస్తారు. 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు ప్రకటిస్తారు. -
జనవరి 4న తుది ఓటరు జాబితా: ఈసీ
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం కొత్త పద్దతిని ప్రారంభించిందని, తుది ఓటరు జాబితాకు ముందే షెడ్యూల్ విడుదల చేశామని ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల డ్రాప్ట్ ఓటర్ జాబితా అందుబాటులో ఉందని, వార్డుల వారీగా ఓటరు జాబితా సిద్ధం చేశామన్నారు. ఓటరు జాబితాపై జనవరి 2వ తేది వరకు అభ్యంతరాలు చెప్పవచ్చని తెలిపారు. అసెంబ్లీ జాబితాలో పేరు ఉండి.. ఇప్పుడు లేకపోతే సమస్యను పరిష్కరిస్తామన్నారు. జనవరి 4న తుది ఓటరు జాబితా విడుదల చేస్తామన్నారు. సెక్షన్ 195, 197 ప్రకారం ప్రభుత్వ అనుమతితోనే షెడ్యూల్ విడుదల చేశామని పేర్కొన్నారు. షెడ్యూల్ విడుదల చట్టప్రకారం చేశామని, ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నాగిరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల సమావేశంలో గొడవ వల్ల వివరంగా చెప్పలేక పోయామని, జనవరి 6వ తేదీ తరువాత రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. జనవరి 8 నుంచి నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. టీ పోల్ సాఫ్ట్వేర్ నుంచి, ఓటరు జాబితా నుంచి నామినేషన్ ఫామ్ తీసుకోవచ్చని అన్నారు. నామినేషన్ను ఆన్లైన్లో అప్లోడ్ చేసినంత మాత్రాన నామినేషన్ వేసినట్లు కాదన్నారు. ఒరిజినల్ నామినేషన్ కాపీని రిటర్నింగ్ అధికారికి నేరుగా ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో 35 నుంచి 40 వేల వరకు సిబ్బంది ఉంటారని, విధుల్లో వచ్చే సిబ్బంది అంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది 13 వ తేది వరకు పోస్టల్ ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సీడీఎంఏ డైరెక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ..141 మున్సిపాలిటీలకు కలిపి రాష్ట్ర స్థాయిని యూనిట్గా తీసుకొని రిజర్వేషన్లు ప్రకటిస్తామన్నారు. 130 మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఎన్నికలు ఎస్టీ, ఎస్సీ, బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి మించకుండా ఖరారు చేస్తామని తెలిపారు. జనవరి 5వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ ఛైర్మన్ రిజర్వేషన్లు ప్రకటిస్తామని, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల రిజర్వేషన్లు కలెక్టర్లు ప్రకటిస్తారని పేర్కొన్నారు. -
బోగస్ ఓట్ల ఏరివేత షురూ..!
సాక్షి, చిత్తూరు : బోగస్ ఓట్ల తొలగింపునకు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం– 2020కి ముందుగానే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావడానికి అవకాశం కల్పించింది. వయోజనుల కోసం నూతనంగా ఓటు నమోదు, ఇప్పటికే జాబి తాలో ఉన్న ఓటర్లకు అవసరమైతే సవరణ చేసేందుకు భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇందుకోసం షెడ్యూల్ ప్రస్తుతం అమల్లో ఉంది. ఏటా అక్టోబర్లో ఓటు నమోదు ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మొదలు పెడుతుంది. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం ఈ ఎడాది ఒకనెల ముందుగానే ప్రారంభించింది. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు జాబి తాలో తప్పులు ఉన్నా సవరణకు అవకాశం ఉంది. గత ఎన్నికల్లో గుర్తింపు కార్డు రానివారు ఇప్పుడు తీసుకొనే వీలుంది. దరఖాస్తు చేసుకునే విధానం తహసీల్దార్ కార్యాలయంలో ఓటరు నమోదు కావడానికి సంబంధించిన ఫారం– 6లతో పాటు సవరణ ఫారాలు అందుబాటులో ఉన్నాయి. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు స్ధానిక బూత్స్ధాయి అధికారులను స్రంప్రదించి ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. స్వయంగా నమోదు చేసుకొనేందుకు సరైన ధృవీకరణపత్రాలతో ఇంటర్నెట్లో ఎన్వీఎస్పీ పోర్టల్లోనూ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంటింటా సర్వే సెప్టెంబర్ 1నుంచి 30వరకు బూత్స్ధాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ అర్హత కలిగిన వారి సర్వే నిర్వహిస్తారు. ఇంటివద్దకే వచ్చి 18సంవత్సరాలు నిండిన వారి వివరాలు నమోదు చేస్తారు. ఓటునమోదు, సవరణకు దరఖాస్తు చేసిన అభ్యర్ధుల వివరాలు బీఎల్ఓలు పరిశీలిస్తారు. ఈ సర్వే పూర్తిచేసిన తరువాత వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. అక్టోబర్ 15వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితా ప్రచురణ తరువాత మార్పులు, చేర్పులకు నవంబర్ 30 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యంతరాలపై చర్యలు తీసుకుంటారు. డిసెంబర్ 15లోగా కొత్తజాబితా ముద్రిస్తారు. జనవరి 1నుంచి 15లోపు తుదిజాబితా ప్రచురిస్తారు. త్వరలో స్ధానిక ఎన్నికలు త్వరలో స్ధానిక సంస్ధల ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ తర్వాత ఎప్పుడైనా స్ధానికసంస్ధల ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఒకనెల ముందుగానే చేపట్టారని అధికారులు అంటున్నారు. ఇది చదవండి : కొత్త ఓటర్ల నమోదు మొదలు యువత సద్వినియోగం చేసుకోవాలి యువత ఓటరు నమోదు అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. సవరణ ఫారా లు కూడా అందుబాటులో ఉన్నాయి.∙తప్పొప్పులు సరి చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. – సురేంద్ర, తహసీల్దార్, గుడిపాల -
ఓటరు జాబితా సవరణ సమయం..
ఓటర్లకు శుభవార్త.. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2020 ఓటర్ల తుది జాబితా ప్రకటనకు కసరత్తు ప్రారంభించింది. ఇంటింటి సర్వే సహా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించింది. దీని ప్రకారం జాబితా పారదర్శకంగా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సాక్షి, అమరావతి : ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. నిర్దేశిత షెడ్యూల్ మేరకు జిల్లాలో ఓటర్ల జాబితా సవరణను పకడ్బందీగా పూర్తి చేయాలని ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 2020 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు 31 వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇలా నమోదు చేసుకున్న వారి వివరాలను సెప్టెంబర్లో బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి పరిశీలించనున్నారు. ఇది పూర్తి చేసిన తర్వాత అక్టోబర్ 15న మధ్యంతర ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అప్పటికీ ఓటర్లుగా నమోదు చేసుకోని వారికి అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు తుది అవకాశాన్ని కల్పించనున్నారు. డిసెంబర్ 15లోగా అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ 25న మరోసారి జాబితాను ప్రచురించనున్నారు. తుది పరిశీలన అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తర్వాత వచ్చే ఏడాది జనవరిలో తుది జాబితా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఇంటింటి సర్వే.. ఓటరు జాబితా సవరణలో భాగంగా సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి 30 వరకు ఇంటింటి సర్వే చేస్తారు. బూత్లెవల్ అధికారులు (బీఎల్వోలు) తమ వద్ద ఉన్న ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తారు. స్థానికంగా నివాసం లేనప్పటికీ ఇక్కడ ఓటరు జాబితాలో పేర్లుంటే వాటిని గుర్తించనున్నారు. సెప్టెంబరు 15వ తేదీ నుంచి అక్టోబరు 15 వరకు పోలింగ్ కేంద్రాల వివరాలు సేకరిస్తారు. ఎక్కడైనా పోలింగ్ కేంద్రాలు మార్పు చేయాల్సి ఉంటే ఆ వివరాలను నమోదు చేస్తారు. పోలింగ్ కేంద్రాల చిరునామాలు తప్పుగా నమోదైతే వాటిని సరి చేస్తారు. బీఎల్వోలు, రిటర్నింగ్ అధికారులు ఈ ప్రక్రియ చేపట్టి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరుకు నివేదిక అందజేస్తారు. అక్టోబరు 15న ముసాయిదా ప్రకటన ఈ ఏడాది అక్టోబరు 15వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటిస్తారు. ఆయా పోలింగ్ కేంద్రాలు, వీటి పరిధిలో ఓటర్ల వివరాలు ప్రకటిస్తారు. అదే రోజు నుంచి 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటర్లుగా చేర్చుకునేందుకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు ఓటు కోసం ఆన్లైన్లో లేదా బీఎల్వోలు, తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 30వ తేదీ వరకు నూతన ఓటర్ల దరఖాస్తులను స్వీకరిస్తారు. వీటిని డిసెంబరు 15వ తేదీ లోపు పరిశీలిస్తారు. డిసెంబరు 25 లోపు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు పరిశీలన చేసి తప్పులుంటే సరి చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి జనవరిలో ఎన్నికల కమిషన్ సూచించిన తేదీ నాటికి ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. తప్పులు సరిదిద్దేందుకు.. ఏప్రిల్లో సాధారణ ఎన్నికల సమయంలో ఓటర్ల జాబాతాను హడావుడిగా తయారు చేసి తుది జాబితా ప్రకటించారు. వాటిలో ఒకే కుటుంబానికి చెందిన పేర్లు పలుమార్లు ఓటర్ల జాబితాల్లో నమోదయ్యాయి. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు రెండుసార్లు నమోదైన ఓటర్ల పేర్లను ప్రస్తుతం జరిగే ఓటర్ల జాబితాల సవరణల్లో తొలగిస్తారు. జాబితాలో ఓటర్ల పేర్లు తప్పుగా నమోదైతే వాటిని సరిదిద్దుతారు. ఓటరు ఫొటో గతంలో లేకుంటే చేరుస్తారు. హెల్ప్లైన్ యాప్ ద్వారా ఓటర్లు తమ పేర్లు, ఫొటోలు అడ్రసు, సక్రమంగా ఉన్నాయా.? లేదా .? అన్నది పరిశీలించుకోవచ్చు. -
కులగణన తప్పుల తడక
సాక్షి, సత్తుపల్లి: మున్సిపల్ ఎన్నికల కోసం ఇంటింటికీ తిరిగి చేసిన కులగణన తప్పుల తడకలా మారింది. ఒక్క కుటుంబంలోనే సభ్యులది ఒక్కో కులంగా మారిపోయింది. తండ్రిది ఒక కులం.. కొడుకుది మరో కులం.. భార్యది ఒక కులం.. భర్తది మరో కులం.. ఇలా తప్పుల జాబితా చాంతాడును తలపిస్తోంది. అంతేకాక ఒకే ఇంటి నంబర్పై రెండు చోట్ల ఓట్లు ఉండడం ఓటర్లను అయోమయానికి గురిచేస్తోంది. నంబర్ 760లో పోతిరెడ్డిపల్లి శ్రీను బీసీ అయితే.. భార్య సంధ్య ఓసీగా 20వ వార్డు ఓటర్ల జాబితాలో పేరుంది. నంబర్ 39లో అల్లు అనిత భర్త పేరు రాఘవరెడ్డి(ఓసీ) అయితే బీసీ అని వచ్చింది. నంబర్ 578లో పొనగళ్ల వెంకట్రావ్(బీసీ గౌడ) అయితే.. ఓసీ అని ఓటర్ల జాబితాలో ప్రచురితమైంది. ఇవేకాక.. ఒకే ఓటు పలు వార్డుల్లో దర్శనమిచ్చింది. స్థానికేతరుల ఓట్లు తొలగించినట్లు కనిపించలేదని ఫిర్యాదులు అందాయి. ఇలా అయితే వార్డుల రిజర్వేషన్లపై ప్రభావం చూపుతుందని పలు పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అభ్యంతరాలను పట్టించుకోలే.. ఎన్నికలు ఆగస్టు మొదటి వారంలో జరుగుతాయని మున్సిపల్ యంత్రాంగం జూలై నెలలోనే హడావుడిగా కులగణన, వార్డుల పునర్విభజన చేసింది. అభ్యంతరాల నమోదుకు గడువు తక్కువగా ఉండడం వల్ల కూడా రాజకీయ పార్టీలు కసరత్తు వేగంగా చేయలేకపోయాయి. కొద్దిపాటి అభ్యంతరాలను వ్యక్తపరిచినా.. పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత కూడా అవే తప్పులు దొర్లడంతో రాజకీయ పార్టీలు మున్సిపల్ యంత్రాంగం పనితీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సత్తుపల్లి మున్సిపాల్టీలో 20 వార్డులు ఉండగా.. 23 వార్డులయ్యాయి. 26,470 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 12,743 మంది, మహిళలు 13,727 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 4,133 మంది, ఎస్టీ ఓటర్లు 1,580 మంది, బీసీ ఓటర్లు 14,254 మంది, జనరల్ ఓటర్లు 6,503 మంది, ఇతరులు ఒక్క ఓటరుతో వార్డులవారీగా నూతన ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. డబుల్ ఇంటి నంబర్లతో తికమక.. సత్తుపల్లి మున్సిపాల్టీలో సత్తుపల్లి రెవెన్యూ, అయ్యగారిపేట రెవెన్యూ విభాగాలున్నాయి. అయితే ఆయా రెవెన్యూల్లో చాలా డోర్ నంబర్లు ఒకే ఇంటి నంబర్తో రెండుచోట్ల కొనసాగుతున్నాయి. అయ్యగారిపేట, సత్తుపల్లి రెవెన్యూలు వేర్వేరుగా ఉండడం వల్ల ఒకే నంబర్ ఇస్తున్నారు. పట్టణమంతా ఒకే ఇంటి నంబర్ సీరియల్గా ఉండాల్సి ఉంది. కానీ.. రెవెన్యూలవారీగా ఒకే నంబర్ను రెండు రెవెన్యూ విభాగాల్లో ఇవ్వడం వల్ల రెండుచోట్ల ఒకే ఇంటి నంబర్ గల ఇళ్లు వస్తుండడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఒకే డోర్ నంబర్తో ఉన్న ఓట్లు ఒకే వార్డులో ఉండాల్సి ఉండగా.. వేర్వేరు వార్డుల ఓటర్లు జాబితాలో కనిపించడంతో తికమక పడాల్సి వస్తోంది. ఉదాహరణకు.. సత్తుపల్లి రెవెన్యూ విభాగంలోని అడపా సత్యనారాయణ వీధిలోని ఓటర్ల ఇంటి నంబర్లు, అయ్యగారిపేట రెవెన్యూ విభాగంలోని అంబేడ్కర్ నగర్ కాలనీలోని ఓటర్ల ఇంటి నంబర్లు ఒకేలా ఉన్నాయి. దీంతో ఓటర్ల జాబితాలోని పేర్లు జంబ్లింగ్ కావడంతో ఒకే ఇంట్లోని ఓటర్లు వేర్వేరు వార్డుల జాబితాల్లోకి వెళ్లాయి. -
సహకార ఎన్నికలు లేనట్టేనా?
సాక్షి, భువనగిరి : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది. ఈ నెలాఖరుతో గడువు ముగియనుండగా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణపై ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు పాలకమండళ్ల పదవీ కాలం పొడిగింపు కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా సహకార అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఆయా సంఘాలకు సంబంధించి ప్రతిపాదనలు తయారు చేయడంలో ఇప్పటికే అధికారులు బిజీగా ఉన్నారు. ఈనేపథ్యంలో ఎన్నికలను మరో ఆరు నెలలు పొడిగించే అవకాశాలు కనిపి స్తున్నాయి. జిల్లాలో 110 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాలక వర్గాలకు జూలై నెలాఖరుకు పదవీకాలం ముగుస్తుంది. ప్రస్తుత పాలకమండళ్లకే పర్సన్ ఇన్చార్జ్లుగా.. ప్రస్తుతం కొనసాగుతున్న పాలకవర్గాల పదవీకాలాన్ని మరో ఆరు నెలలపాటు పొడిగిం చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పాలకమండళ్లను పర్సన్ ఇన్చార్జ్లుగా నియమించనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. గతంలోనే ఓటరు జాబితా సిద్ధం ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణకు గడువు పొడిగించారు. సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితాను సైతం రూపొందించారు. వాటిపై అభ్యంతరాలను కూడా అధికారులు స్వీకరించారు. వరుసగా శాసనసభ, గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోక్సభ ఎన్నికలు జరిగాయి. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు జరగనుండటంతో సహకార సంఘాల పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు తెలుస్తోంది. సహకార సంఘాలకు 2018డిసెంబర్లోనే రాష్ట్ర సహకార కమిషనర్ నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో వెంటనే సభ్యత్వ నమోదు, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా పాత జాబితాను మార్పు చేశారు. రూ.10చెల్లించి సభ్యత్వం పొంది సహకార ఎన్నికల్లో ఓటు హక్కు పొందేవారు. ప్రస్తుతం అది రూ.300 చెల్లించి సభ్యత్వం తీసుకునే వారికి ఓటు హక్కు ఇవ్వనున్నారు. అలాగే సభ్యుల ఫొటో, గుర్తింపు కార్డు వివరాలను ఓటర్ జాబితాలో పొందుపర్చారు. ఇక సభ్యత్వం తీసుకునే ఏడాది తర్వాతే ఆసభ్యుడికి ఓటు హక్కు అవకాశం లభిస్తుంది. సంఘం నిర్మాణం ఇలా.. ప్రతి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో 13మంది పాలకవర్గ సభ్యులు ఉంటారు. ఎస్సీ 01, ఎస్సీ మహిళ 1, ఎస్టీ 1, బీసీ 2, బీసీ మహిళ 01, ఓసీ 7మంది సభ్యులుగా కొనసాగుతారు. వీరి లో ఒకరు అధ్యక్షుడు, మరొకరు ఉపాధ్యక్షుడిగా ఎన్నికవుతారు. అయితే ఓటర్ల జాబితా ఫొటోలతో సహా రాష్ట్ర సహకార రిజిస్ట్రార్ కార్యాలయం ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో జాబితాను ప్రకటించి అభ్యంతరాలను స్వీకరించి మార్పులు చేశారు. ఎన్నికలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుండటంతో మార్గదర్శకాలు వెలువడుతాయని భావిస్తున్నారు. వాయిదాపడే అవకాశం ఉంది 2013జూన్ 30వ తేదీన సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మూడుసార్లు పాలకవర్గాల పదవీకాలం పొడిగించడం జరిగింది. ఈసారి కూడా పదవీ కాలం పొడిగించనున్నారు. గత సంవత్సరం చివరిలో ఎన్నికలు నిర్వహిస్తామని షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్ జాబితా సిద్ధం చేసి పంపాం. తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే సంవత్సరం ముందు నుంచే ఓటర్ జాబితాను రూపొందించాల్సి ఉంటుంది. –వెంకట్రెడ్డి, జిల్లా సహకార శాఖ ఇన్చార్జ్ అధికారి -
మున్సిపల్ ఓటర్ల జాబితా సిద్ధం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 3,355 వార్డుల ఖరారుతో పాటు, వార్డు స్థాయిల్లో ఫొటోలతో కూడిన ఓటర్ల జాబితాలు మంగళవారం సిద్ధమయ్యా యి. ముసాయిదా ఓటర్ల జాబితాలు ప్రచురించి, వాటిలోని అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించిన తర్వాత ఓటర్ల జాబితాలు సిద్ధం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. ఇందులోని 129 మున్సిపాలిటీలు, 3 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని 3,149 వార్డులను ఖరారు చేసి ఓటర్ల జాబితాలను రూపొందించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) నిమగ్నమైంది. 21న పోలింగ్ కేంద్రాల జాబితా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లలో వార్డుల వారీగా ముసాయిదా పోలింగ్ కేంద్రాల జాబితా రూపొందించి, 21న తుది జాబితాను ప్రకటించాలని గతంలోని షెడ్యూల్ను సవరిస్తూ ఇదివరకే ఎస్ఈసీ సర్క్యులర్ను జారీచేసింది. మున్సిపాలిటీలకు సంబంధించి 17న ముసాయిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు మున్సిపాలిటీల స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకారం, అదేరోజు వాటి పరిష్కారం, 19న పోలింగ్ స్టేషన్ల తుది జాబితా జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదంతో సంబంధిత మున్సిపాలిటీల్లో తుది జాబితా ప్రచు రణ జరుగుతుంది. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విషయానికొస్తే 17న ముసా యిదా జాబితా ప్రచురణ, అదేరోజు సాయంత్రం 3 గంటలకు ఆయా కార్పొరేషన్ల పరిధిలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం, 19న సాయంత్రం 5 వరకు క్లెయి మ్స్, అభ్యంతరాలు, సలహాల స్వీకరణ, 20న వాటి పరిష్కారం, అదేరోజు పోలింగ్ స్టేషన్ల తుదిజాబితా ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లకు సమర్పణ, 21న జిల్లా ఎన్నికల అధికారుల ఆమోదం పొందాక పోలింగ్ కేంద్రాల తుది జాబితాను ప్రచురిస్తారు. ఏర్పాట్లు వేగవంతం ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేయడంలో భాగంగా మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా తరగతులు సైతం పూర్తిచేసింది. ఎన్నికల విధులు నిర్వహించే రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పిస్తున్నారు. గురు, శుక్రవారాల్లో జరగనున్న అసెంబ్లీ, కౌన్సిల్ సమావేశాల్లో కొత్త మున్సిపల్ చట్టానికి ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లోనే ఎస్టీ, ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. తదనుగుణంగా నాలుగో వారంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశాలున్నాయి. నోటిఫికేషన్ విడుదలయ్యాక 16 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. దీనిని బట్టి వచ్చేనెల 15 లోగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్, ఫలితాల ప్రక టన, పాలకవర్గాల బాధ్యతల స్వీకారం పూర్తి కావొచ్చునని అధికారవర్గాల సమాచారం. -
అతడి పేరు డ డ.. తండ్రి పేరు హ హ...
షాద్నగర్టౌన్: అధికారుల నిర్లక్ష్యంతో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీ ఓటరు జాబితా తప్పుల తడకలా తయారైంది. మున్సిపాలిటీ పరిధిలోని వెంకట రమణ కాలనీలో ఇంటి నంబర్ 18–211/6లో ఓటరు పేరు డ డ అని, తండ్రి పేరు హ హ.. అని నమోదు చేశారు. ఇంటి నంబర్ 18–403/5లో ఓటరు రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు బదులుగా ఆయన భార్య పేరును నమోదు చేశారు. ఓటరు జాబితాలో తమ పేరుందో లేదోనని పరిశీలిస్తోన్న ప్రజలు ఈ తప్పుల తడకలా తయారైన ఓటర్ల జాబితాను చూసి అవాక్కవుతున్నారు. -
అంతా.. గందరగోళం!
సాక్షి, నల్లగొండ : మున్సిపాలిటీల్లో జరిగిన వార్డుల పునర్విభజనపై రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. మున్సిపల్ నిబంధనలను పాటించకుండా అధికారులు ఇష్టానుసారంగా వార్డులను పునర్విభజించారని విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల్లో గతంలో ఉన్నవార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో కొత్త వార్డులను ఏర్పాటు చేయడానికి పాత వార్డులను పునర్విభజన చేయక తప్పలేదు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో అధికార టీఆర్ఎస్ నాయకులకు మేలు జరిగేలా వార్డులను విభజించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని కోసం కనీసం వార్డుల సరిహద్దులు తేల్చకుండానే, ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించారని పేర్కొంటున్నారు. నల్లగొండ మున్సిపాలిటీలో గతం కన్నా ఓటర్లసంఖ్య తగ్గించి చూపారని, దీంతో పెద్ద సంఖ్యలోనే ఓట్లు గల్లంతు అయ్యాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం1.60 లక్షల జనాభా ఉండింది. మున్సిపాలిటీలో నల్ల గొండ శివారు పంచాయతీలను విలీనం చేశారు. అంటే ఆ పంచాయతీల జనాభాను కలిపితే మున్సిపాలిటీ జనాభా పెరగాలి. కానీ, పెరిగినట్లు లేదన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, గతంలో పట్టణంలో 45వేల మందిదాకా ఓసీలు ఉంటే.. వారి సంఖ్య 27వేలకు తగ్గిపోయిందని, ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. భర్త ఓసీగా ఉంటే.. భార్యను బీసీ వర్గంలో కలిపారని, ఎస్సీలను బీసీలుగా చూపించారని, పెద్ద సంఖ్యలో ఇలా కులాలు, వర్గాలు మారిపోయాయని అంటున్నారు. మొత్తంగా జిల్లాలోని మున్సి పాలిటీల్లో వార్డుల విభజన, ఓటర్ల జాబితాల తయారీలో ఎన్నో చమత్కారాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. సరిహద్దు దాటిన ఓటర్లు నల్లగొండ మున్సిపాలిటీ వార్డుల పునర్విభజనపై విమర్శలు ఉన్నాయి. ఓటర్ల జాబితాను సరిగా రూపొందించక పోవడంతో ఓటర్ల వివరాలకు పొంతనలే కుండా పోయింది. మున్సిపల్ యంత్రాంగం చేపట్టిన పునర్విభజన ప్రక్రియ వార్డు మ్యాపు, సరిహద్దులు, ఓటర్లకు మధ్య ఎక్కడా సామ్యమే లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ఓట్లు వేర్వేరుగా రెండు, మూడు వార్డుల పరిధిలోకి చేరిపోయాయి. భార్యా భర్తలు, పిల్లల ఓట్లు చెల్లా చెదరయ్యాయి. ఉదాహరణకు 9వ వార్డులో భర్తల ఓట్లుంటే, 13వ వార్డులో భార్యల ఓట్లు చేరాయి. 39వ వార్డులో నివాసం ఉన్న వారివి దాదాపు 80 ఓట్ల వరకు 40వ వార్డులోకి వెళ్లిపోయాయి. 9వ వార్డులో నివాసం ఉంటున్న వారికి చెందిన 245 ఓట్లను 8వ వార్డులోకి చేర్చారు. 4వ వార్డులో నివాసం ఉంటే 2వ వార్డులోకి 110 ఓట్లు వచ్చి చేరాయి. 43వ వార్డు నుంచి 42వ వార్డులోకి 242 ఓట్లను మార్చారు. 9 వార్డులో ఉండాల్సిన 197 ఓట్లు 6వ వార్డులో పరిధిలోకి మార్చారు. కొన్ని కాలనీలను పార్ట్లుగా విభజించి రెండు, మూడు వార్డులోకి చేర్చడంతో ఈ సమస్యలు వచ్చినట్లు చెబుతున్నారు. పోలింగ్ బూత్లను, ఓటర్ల సంఖ్యను చూసుకొని నిబంధనల ప్రకారమే చేర్చినట్లు వార్డులను ఖరారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. 42వ వార్డు రైల్వే ట్రాక్కు ఇరువైపులా కాలనీలు ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. అదే విధంగా దేవరకొండ రోడ్డులోని 24వ వార్డు సైతం ప్ర«ధాన రహాదారికి ఇరు వైపుల ఉన్న కాలనీలతో వార్డు ఏర్పాటు చేశారు. అస్తవ్యస్తంగా వార్డుల పునర్విభజన మిర్యాలగూడ మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా చేశారు. పట్టణ మాస్టర్ ప్లాన్ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా వార్డులను విభజించారు. గతంలో 36 వార్డులు ఉన్న మున్సిపాలిటీనీ 14 వార్డులను పెంచి 48 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డుల పునర్విభజన చేపట్టారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. వార్డుల పునర్విభజనపై వచ్చిన అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం 54 ఫిర్యాదులు రాగా కేవలం 14 ఫిర్యాదులు మాత్రమే సక్రమంగా ఉన్నాయని వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆందోళన చేయడం వల్ల శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు కమిషనర్ సత్యబాబు సెలవుపై వెళ్లారు. ఇదీ... కథ మిర్యాలగూడ పట్టణంలోని 1వ వార్డులో ఉన్న చైతన్య నగర్లో రెండు అపార్ట్మెంట్లతో పాటు మొత్తం 300 ఓట్లను నల్లగొండ రోడ్డుకు అవతలివైపున ఉన్న 48వ వార్డు (రామచంద్రగూడెం)లో కలిపారు. తాళ్లగడ్డలో ఉన్న 2వ వార్డు పక్కనే 3వ వార్డు కాకుండా 8వ వార్డుకు సంబంధించిన ఓట్లు కలిపారు. బంగారుగడ్డలోని 44వ వార్డుకు సంబంధించిన ఓట్లను గెజిట్లో ప్రకటించిన డోర్నంబర్లకు చెందినవి కాకుండా సుమారుగా 450 ఓట్లను 48వ వార్డు (ఏడుకోట్లతండా)లో కలిపారు. ఈదులగూడెంలో ఉన్న 9వ వార్డులోని ఓట్లను పక్కనే ఉన్న కాలనీతో 440 ఓట్లను ఈదులగూడెంలోని కొంత భాగాన్ని 18వ వార్డుగా చేశారు. గాంధీనగర్లోని సుమారు 300 ఓట్లను పక్కన ఉన్న వార్డులోకి కాకుండా 18వ వార్డు (తాళ్లగడ్డ) లో కలిపారు. గతంలో 24వ వార్డుగా ఉన్న అశోక్నగర్ ప్రాంతాన్ని నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులలో కలపడం వల్ల పాత వార్డు లేకుండా పోయింది. రెడ్డికాలనీ నాలుగు భాగాలుగా చేసి నాలుగు వార్డులుగా విభజించారు. బాపూజీనగర్ కాలనీకి సంబంధించిన ఓట్లను ఇందిరమ్మ కాలనీకి సమీపంలో ఉన్నట్లుగా కలిపారు. 48వ వార్డుగా ఉన్న రామచంద్రగూడెంలో బాగ్యనగర్ కాలనీ ఓట్లు కలిపారు. తప్పుల తడకగా ఓటర్ల జాబితా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన అస్తవ్యస్తంగా మారింది. ఒకే కుటుంబంలోని వారి ఓట్లు వేర్వేగా ఉండడం, భర్త ఓటు ఒక వార్డులో ఉంటే భార్య ఓటు మరో వార్డులో ఉండడం, వారి పిల్లల ఓట్లు ఇంకో వార్డులో నమోదై ఉండడంతో పాటు ఒకే వ్యక్తికి రెండు, మూడు ఓట్లు కలిగి ఉండడం వంటి చమత్కారాలు చోటు చేసుకున్నాయి. తప్పుల తడకకగా రూపొందిçస్తున్న జాబితా కారణంగా ఓటు హక్కుకు దూరమవుతున్న వారు అనేక మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీలో ఇష్టానుసారంగా వార్డును విభజించారు. 9 వార్డులు ఉన్న మున్సిపాలిటీని 12 వార్డులు చేశారు. అధికార పార్టీకి చెందిన నాయకులు చెప్పినట్లుగా వార్డులను పునర్విభజన చేశారని, ఓటర్ల ముసాయిదా జాబితా తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ నాయకులు హాలియా మున్సిపాలిటీ కమీషనర్ సమ్మద్కి వినతి ప్రతం అందజేశారు. హాలియాలోని రెడ్డికాలనీని 5వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 250 ఓట్లను 7వ వార్డులో కలిపారు. సాయిప్రతాప్నగర్ను 3వ వార్డుగా విభజించారు. ఈ వార్డులోని 21 ఓట్లు 4వ వార్డు అయిన వీరయ్యనగర్, అంగడిబజార్లోకి కలిపారు. సాయి ప్రతాప్నగర్ 3వ వార్డులో ఉన్న వివిధ కుటుంబాలకు చెందిన 150 ఓట్లను వేర్వేరుగా 2వ వార్డులోని ఇబ్రహీంపేట, అలీనగర్లోకి కలిపారు. గోడుమడక బజారు, శాంతినగర్, గంగారెడ్డి నగర్ కలుపుతూ 9వ వార్డుగా విభజించారు. ఈ వార్డులో ఉన్న 70 ఓట్లను పక్కనే ఉన్న 7వ వార్డు వీరబ్రహేంద్రనగర్లోకి కలిపారు. నందికొండ (నాగార్జున సాగర్) మున్సిపాలిటీలో పరిధిలో ఉన్న టీజీ జెన్కో, భాగ్యనగర్ కాలనీ, ఇ–1 టైప్, ఇ టైప్, బీ11టైప్, పీ టైప్ను కలుపుతూ 11వ వార్డుగా విభజించారు. మున్సి పాలిటీకి సంబంధం లేనటువంటి 50 ఓట్లను ఈ వార్డులోకి చేర్చారు. 11వార్డులోని జెన్కోకి సంబందించిన ఓట్లను 10వ వార్డులోకి చేర్చారు. ఓటర్ల జాబితాలో మరణించిన వారి పేర్లు దేవరకొండ మున్సిపాలిటీ పరిధిలో గతంలో ఉన్న 20 వార్డులే ప్రస్తుతం ఉన్నాయి. ఒక్కో వార్డుకి 1050 నుంచి 1150లకుపైగా ఓట్లను విభజిస్తూ వార్డుల వారీగా జాబితాను ప్రకటించారు. గతంలో ఆయా వార్డుల్లో కుటుంబ సభ్యులందరి ఓట్లు నమోదు కాగా, ఇటీవల అధికారులు వెలువరించిన ఓటర్ల ముసాయిదా జాబితాలో ఓట్ల బదలాయింపు జరిగింది. మరికొన్ని వార్డుల్లో మరణించిన వారి ఓట్లు నమోదు కాగా, ఇంకొన్ని వార్డుల్లో ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదై ఉన్నాయి. గతంలో అధికారులు ఇంటి నంబర్ల ఆధారంగా చేపట్టిన ఓటర్ల గణన పారదర్శకంగా లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ఆయా వార్డుల్లో అధికార పార్టీకి చెందిన వారికి అనుకూలంగా ఉన్న ఓటర్లను నమోదు చేయించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఒక్కో వార్డులో 10 నుంచి 20కి మందికిపైగా ఒక్కొక్కరికి రెండేసి ఓట్లు నమోదవుతుండడంతో వివిధ పార్టీల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తాం ఓటరు జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు లేవనెత్తిన ప్రతి అభ్యంతరాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రతి అభ్యంతరంపై ఇంటింటికి వెళ్లి పరిశీలించి పారదర్శకంగా చేస్తాం. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఓటర్ల జాబితా ఫైనల్ చేస్తాం. ఓటర్లు సామాజిక వర్గం గురించి తప్పుడు సామాచారం ఇచ్చినా.. దానిని విచారించి సరిచేస్తాం. – దేవ్సింగ్, మున్సిపల్ కమిషనర్ -
ఓటర్ల లెక్క తేలింది..!
సాక్షి, త్రిపురారం : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన హాలియా మున్సిపాలిటీలో ఎన్నికలకు ఓటర్ల ముసాయిదా జాబితా సిద్ధమయ్యింది. ఇప్పటికే మున్సిపాలిటీలో ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఒక్కో సెట్ జాబితాను అందించారు. ఈనెల 12వ తేదీన అభ్యంతరాలను స్వీకరించి, 13న క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కరించనున్నారు. ఈనెల 14న తుది జాబితాను విడుదల చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండడంతో ఎన్నికల ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే కుదించిన షెడ్యూల్తో మరో నాలుగు రోజుల ముందే ఓటర్ల జాబితాను ప్రదర్శనకు పెట్టారు. ఈనెలలోనే ఎన్నికలు జరుగుతుండడంతో ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు పోలింగ్ పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టారు. హాలియా మున్సిపాలిటీల్లో బీసీ ఓటర్లు అధికం.. హాలియా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 12 వార్డుల్లో సిబ్బంది ఓటర్ల గణనను పూర్తి చేసి జాబితాను సిద్ధం చేశారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 12,770 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 6,388 మంది కాగా స్త్రీలు 6,382 మంది ఉన్నారు. దీనిలో బీసీ ఓటర్లు మొత్తం 8,242 మంది ఉండగా పురుషులు 4,118 మంది, స్త్రీలు 4,124 మంది ఉన్నారు. అదే విధంగా ఎస్సీ ఓటర్లు మొత్తం 1,703 మంది ఉండగా వీరిలో పురుషులు 850 మంది కాగా స్త్రీలు 853 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు మొత్తం 479 మంది కాగా వీరిలో పురుషులు 220 మంది, స్త్రీలు 259 మంది ఉన్నారు. ఓసీ ఓటర్లు 2,346 మంది ఉండగా పురుషులు 1,200 మంది, స్త్రీలు 1,146 మంది ఉన్నారు. హాలియా మున్సిపాలిటీ పరిధిలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన ఓటర్ల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. మున్సిపాలిటీ పరి«ధిలోని ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను త్వరలో స్వీకరించి వాటిని పరిష్కరిస్తారు. మున్సిపాలిటీలో విలీనమైన కాలనీలు.. హాలియా మున్సిపాలిటీల్లో విలీనమైన కాలనీలు ఇలా ఉన్నాయి. అనుముల, అనుములవారిగూడెం, ఈశ్వర్నగర్, సాయిప్రతాప్నగర్, గంగారెడ్డినగర్, వీబీనగర్, గణేష్నగర్, ఎస్సీ కాలనీ, సాయినగర్ కాలనీ, శాంతినగర్, వీరయ్యనగర్, అంగడి బజార్, రెడ్డికాలనీ, బీసీకాలనీ, హనుమాన్నగర్, కేవీ కాలనీ, ఎస్సీ, బీసీ కాలనీ, ఎస్టీ కాలనీ, ఇబ్రహీంపేట, అలీనగర్ కాలనీలను కలుపుతూ 12 వార్డులుగా విభజించారు. నందికొండ మున్సిపాలిటీలో తేలిన లెక్క నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీలో గల హిల్కాలనీ, పైలాన్ కాలనీల్లోని 12వార్డుల్లో సామాజిక వర్గాల వారిగా గల ఓటర్ల లెక్కను తేల్చారు. ఓటర్ల సంఖ్య 12,800మంది ఉండగా బీసీ ఓటర్లు 6,839మంది ఉన్నారు. పురుష ఓటర్లు 6,204మంది ఉండగా మహిళా ఓటర్లు 6,596 మంది ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 2,941 మంది ఉండగా ఎస్టీ ఓటర్లు 716 మంది ఉన్నారు. ఓసీ ఓటర్ల సంఖ్య 2,304 మంది ఉన్నారు. -
మున్సిపల్ ఎన్నికల ముసాయిదా విడుదల
సాక్షి, ఆదిలాబాద్: కుల గణన, ఓటర్ల ముసాయిదా జాబితాను మున్సిపల్ అధికారులు బుధవారం వెల్లడించారు. త్వరలో మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో పూర్తి వివరాలు సిద్ధం చేస్తున్నారు. పుర ఎన్నికలకు సంబంధించి అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. ఇంటి నంబర్ల ఆధారంగా ఓటర్లను గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గురు, శుక్రవారాల్లో వాటిపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. 13న మొత్తం అభ్యంతరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తారు. 14న తుది జాబితా ప్రకటిస్తారు. అనంతరం మున్సిపల్ అధికారులు వార్డుల రిజర్వేషన్లను ఈనెల 15న లేదా 16న ప్రకటించనున్నారు. మున్సిపల్ చైర్మన్, వైస్చైర్మన్ల రిజర్వేషన్లను ప్రభుత్వమే ప్రకటించనుంది. పెరగనున్న పోలింగ్ కేంద్రాలు.. గతంలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 100 పోలింగ్ కేంద్రాలు ఉండగా, విలీనమైన గ్రామాల్లో 38 పోలింగ్ కేంద్రాలతో ఆ సంఖ్య 138కి చేరింది. ప్రస్తుతం ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 చొప్పున ఓటర్లతో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అయితే దీంతో దాదాపు 152 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు వార్డులకు ఒక ఎన్నికల అధికారి మున్సిపల్ అధికారులు వార్డుల వారీగా ఎన్నికల అధికారుల నియామకాన్ని పూర్తి చేశారు. మూడు వార్డులకు కలిపి ఒక ఎన్నికల అధికారి, ఒక సహాయ ఎన్నికల అధికారిని నియమించనున్నారు. గెజిటెడ్ హోదా కలిగిన వారిని ఎన్నికల అధికారులుగా నియమించగా, నాన్గెజిటెడ్ వారికి సహాయకులుగా బాధ్యతలు అప్పగించారు. వార్డుల వారీగా నామపత్రాల స్వీకరణ, పరిశీలన, తదితర ప్రక్రియను సంబంధిత అధికారులే పర్యవేక్షించనున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించనున్న దృష్ట్యా ఆ పెట్టెలను జిల్లా నుంచే తీసుకోనున్నారు. బ్యాలెట్ పత్రాలు మాత్రం ఇతర చోట్ల ముద్రించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నోడల్ అధికారుల నియామకం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ అధికారులతోపాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు, సిబ్బందిని నియమించనున్నారు. వివిధ శాఖలకు చెందిన 10 మంది ఉన్నతాధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కో బాధ్యత అప్పగించారు. పోలింగ్ నిర్వహణకు అవసరమయ్యే సిబ్బంది నియామకం, బ్యాలెట్ పెట్టెల సేకరణ, పర్యవేక్షణ, రవాణా సౌకర్యం, సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, ఎన్నికల సామగ్రి తయారీ, నిర్వహణ, బ్యాలెట్పత్రాల తయారీ, ఎన్నికల ఖర్చుల వివరాలు పర్యవేక్షించడం, ఎన్నికల కసరత్తు పరిశీలన, మీడియా సమాచారం, సమన్వయ, సహాయ కేంద్రం నిర్వహణ, పర్యవేక్షణ తదితర పనులు నిర్వహించే బాధ్యతలను నోడల్ అధికారులకు అప్పగించారు. ఓటరు నమోదుకు అవకాశం.. మున్సిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేంత వరకు 18 ఏళ్ల వయస్సు గల వారు కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం ఉందని మున్సిపల్ అధికారులు పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఓటరు జాబితాలో మున్సిపాలిటీలో 1,21,977 మంది ఓటర్లు ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరగనుండడంతో కొత్తగా కొంతమంది దరఖాస్తు చేసుకుంటున్నారని, మరికొంత మంది కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని, దీంతో ఓటర్ల సంఖ్య మరింతగా పెరగనున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గురువారం రాజకీయ పార్టీల నేతలతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం నిర్వహించనున్నారు. ముసాయిదాకు సంబంధించిన అభ్యంతరాలు స్వీకరించనున్నారు. -
నేతల్లో గుబులు
సాక్షి, నర్సంపేట: మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అధికారులు ఎన్నికల నిర్వహణకు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధుల గుండెల్లో అలజడి మొదలైంది. కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకునే నేతలు ముందస్తుగానే ప్రయత్నాలు చేస్తున్నారు. రిజర్వేషన్ల ప్రకటన అనంతరం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు.ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ఆరాటపడుతున్నారు. ఇప్పటికే ఏ వార్డు రిజర్వేషన్ల పరంగా ఏ కేటగిరికీ ఖరారవుతుందోనని అందరిలో చర్చ మొదలైంది. తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే అధికారులు ఈ నెల 14 వరకు రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. కాగా రిజర్వేషన్లు అనుకూలిస్తే తాము.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. నర్సంపేట, పరకాల, వర్దన్నపేట మున్సిపాలిటీల్లో ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం అధికార పార్టీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్ల అనుగ్రహం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిల అనుమతి కోసం ఆ పార్టీ ఆశావహులు పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. పోయినసారి నర్సంపేట చైర్మన్ పదవి బీసీ జనరల్కు అవకాశం రాగా వార్డుల వారీగా ఎవరికి రిజర్వేషన్ ప్రకటన వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆయా వార్డుల్లో పోటీ చేసేవారు అధినాయకుల అనుమతి పొందినవారు రిజర్వేషన్ అనుకూలంగా ఉంటుందో లేదోనని టెన్షన్లో ఉన్నారు. ఈ నెల చివరలో రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడంతో మునిసిపాలిటీల్లో వార్డుల విభజన, సరిహద్దులు ఖరారు చేయగా కులాలు, వర్గాల వారీగా ఓటర్ల గణన వంటి అంశాలు పూర్తి చేసిన అధికారులు ఓటరు జాబితా ప్రకటనపై దృష్టి సారించారు. అయితే తుది ఓటరు జాబితా ప్రకటించిన వెంటనే రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో ఏ పీఠం ఎవరికి అనుకూలిస్తే వారు.. లేకుంటే తమ సతీమణులను రంగంలోకి దింపడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ మేరకు ఆయా పార్టీల టికెట్ల కోసం ఆయా పార్టీల ఎమ్మెల్యేతో పాటు ముఖ్య నాయకులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రిజర్వేషన్లపై చర్చలు జిల్లాలోని మూడు మునిసిపాలిటీ పీఠాలకు రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. జిల్లాలో పరకాల, నర్సంపేట పాతవి కాగా వర్ధన్నపేటను కొత్తగా ఏర్పాటు చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లు రాష్ట్ర యూనిట్గా, వార్డు కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను మునిసిపల్ యూనిట్గా ఖరారు చేయనున్నారు. రాష్ట్రంలోని మునిసిపాలిటీల్లో చైర్పర్సన్ పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వు చేయబోతున్నారు. మరో 50 శాతం జనరల్ కేటగిరిలో ఉండనున్నాయి. అయితే మొత్తంగా 50 శాతం మహిళలకు కేటాయిస్తారు. రూరల్ జిల్లాలోని మూడు మునిసిపాలిటీల్లో నర్సంపేటలో 24, పరకాలలో 22, వర్ధన్నపేటలో 12 వార్డుల కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో సగభాగం బీసీ, ఎస్టీ, ఎస్సీలకు రిజర్వు కానున్నాయి. ఏ మునిసిపాలిటీ ఎవరికి రిజర్వేషన్ ఖరారవుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అవసరమైన చర్యలను అధికార యంత్రాంగం సిద్దం చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో రిజర్వేషన్లపై ప్రధాన రాజకీయ పార్టీల ఆశావహులు తమతమ అంచనాలు, ఊహాగానాలతో తమకే అనుకూలిస్తుందనే గట్టి నమ్మకంతో పోటీకి సిద్ధమవుతున్నారు. రిజర్వేషన్లు 14లోపు ఖరారు.. రాష్ట్ర వ్యాప్తంగా మునిసిపాలిటీలకు కొత్త పాలకవర్గాలను ఆగస్టు మొదటి వారంలోపు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వార్డులను ఖరారు చేసిన అధికారులు తుది జాబితా ప్రకటనను మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టరేట్కు నివేదించారు. వార్డుల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వ ఆర్డినెన్స్ మేరకు విలీన గ్రామాలను పరిగణ లో కి తీసుకుని వార్డుల విభజనను పూర్తి చేశా రు. కొత్త వార్డుల వారీగా ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్న అధికారులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేసి ఎన్నికల సంఘానికి పంపించనున్నారు. ఓటరు ముసాయిదా జాబితా, తుది ఓటరు జాబితా ఆధారంగా రాష్ట్రం యూనిట్గా చైర్పర్సన్, మునిసిపల్ యూనిట్గా వార్డు కౌన్సిలర్ రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. -
‘మిర్యాల’లో ఆంధ్రా ఓటర్లు..!
సాక్షి, మిర్యాలగూడ : ఓటర్ల జాబితా తప్పుల తడకలుగా ఉన్నాయి. తప్పుడు అడ్రస్లతో ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. కాగా అధికారులు కనీసం విచారణ కూడా చేయకుండా దరఖాస్తులు చేసుకున్న వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దీనిలో భాగంగానే ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి కూడా మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఓటు హక్కు కల్పించారు. ఈ ఓట్లను గతంలో శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మార్పులు, చేర్పులతో పాటు కొత్త ఓట్ల నమోదు సమయంలో చేర్పించారు. కానీ స్థానికులు వాటిని గుర్తించకపోవడం వల్ల అధికారులకు ఫిర్యాదులు చేయలేకపోయారు. కానీ ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందున ఆశావహులు ఓటర్ల జాబితాను పరిశీలించడంతో నకిలీ ఓట్లు బయటపడుతున్నాయి. మిర్యాలగూడ మున్సిపాలిటీలో గతంలో 36 వార్డులు ఉండగా ప్రస్తుతం వాటిని 48 వార్డులుగా విభజించారు. కాగా అన్ని వార్డుల్లో మొత్తం 88 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 85,709 మంది ఓటర్లు ఉన్నారు. ఒకే వార్డులో వందకు పైగా ఆంధ్రా ఓటర్లు మిర్యాలగూడ మున్సిపాలిటీలోని పునర్విభజన ప్రకారం చింతపల్లి సమీపంలోని ఇందిరమ్మ కాలనీని 22 వార్డుగా ఏర్పాటు చేశారు. కాగా అక్కడ 107, 108 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఆ వార్డులో మొత్తం 1,650 ఓట్లు ఉన్నాయి. కాగా ఈ వార్డులోనే 170 ఓట్లు నకిలీ ఓట్లు నమోదయ్యాయి. వాటిలో వంద ఓట్లు పైగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారివి ఉండటం గమనార్హం. ఓటరు క్రమ సంఖ్య 550 నుంచి 587 వరకు ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయి. అంతే కాకుండా ఒకే ఇంటినంబర్లలో పది మంది ఓట్లు, ఇంటికి బై నంబర్లు వేసి ఓటు హక్కు పొందారు. ఇందిరమ్మ కాలనీలో 34–364కు బై నంబర్లు వేసి ఓటర్లుగా నమోదు చేశారు. ఆర్డీఓకు స్థానికుల ఫిర్యాదు ఇందిరమ్మ కాలనీలోని 107, 108 పోలింగ్ స్టేషన్లలో సుమారుగా 170 ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నాయి. స్థానికేతరులు ఓటు హక్కును నమోదు చేసుకున్నారని స్థానికులు ఆర్డీఓ జగన్నాథరావుకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రా ప్రాంతం మాచర్లకు చెందిన వారి ఓట్లు ఉన్నాయని, అధికారులు విచారణ చేయకుండా ఓటు హక్కు కల్పించినట్లు ఆరోపించారు. కాగా స్థానికుల ఫిర్యాదు మేరకు ఇందిరమ్మ కాలనీలో విచార చేపట్టి నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని ఆర్డీఓ జగన్నాథరావు స్థానికులకు హామీ ఇచ్చారు. -
కులాల వారీగా ఓటర్ల గణన పూర్తి
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికలు నిర్వహించేందుకు సమాయత్తం అవుతోంది. అందులో భాగంగానే కర్నూలు నగరపాలక సంస్థలో ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. నగరపాలక సంస్థ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ నెల 5న ఎన్నికల్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఆ ప్రకారం అదే నెల 30వ తేదీ లోపు నగరంలోని అన్ని వార్డుల్లో ఫొటో ఓటర్ల గుర్తింపు కార్యక్రమం చేపట్టారు. వివిధ కారణాలతో మే 10వ తేదీ వరకు గడువు పెంచారు. మే 10 నుంచి కులాలవారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది నగరంలోని 51 వార్డుల్లో తిరిగి కులాల వారీగా ఓటర్లను గుర్తించారు. ఇదే జాబితాను కర్నూలు నగరపాలక సంస్థ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, కర్నూలు, కల్లూరు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శనకు ఉంచారు. కర్నూలు ఓటర్లు 4.9 లక్షలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్కు 2005లో ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గం 2010 సెప్టెంబర్ 30 వరకు పనిచేసింది. అప్పట్లో నగరపాలక పరిధిలో ఓటర్ల సంఖ్య 3.42 లక్షలు. అప్పటి నుండి 9 ఏళ్లుగా కర్నూలు నగరపాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించలేదు. ఇదే క్రమంలో 2012 సంవత్సరంలో నగరపాలక సంస్థలో స్టాంటన్పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలు విలీనం అయ్యాయి. దీంతో త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేయడంతో మరోసారి నగరపాలకలో ఎన్నికల ప్రక్రియ వేగవంతం అయ్యింది. ప్రస్తుతం నగరపాలక సంస్థ పరిధిలో 4.9 లక్షల ఓటర్లు ఉన్నట్లు గుర్తించారు. 9 ఏళ్లలో నగరపాలక సంస్థలో 70 వేల ఓటర్లు నమోదు చేసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. కులాల వారీగా ఓటర్లను గుర్తించే కార్యక్రమం పూర్తి కావడంతో పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, రిజర్వేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మొత్తం 51 వార్డులు నగరపాలక సంస్థలో 51 వార్డులు ఉన్నాయి. మొత్తం 4,09,591 ఓటర్లు ఉన్నారు. పురుషులు 2,01,368, మహిళలు 2,08,147 మంది ఉన్నారు. మిగతా వారు 76 మంది ఉన్నారు. బీసీ వర్గానికి సంబంధించి 2,34,462 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 1,14,871, మహిళలు 1,19,544 మంది ఉన్నారు. ఎస్సీ వర్గానికి 59,236 ఓట్లు ఉన్నాయి. ఇందులో పురుషులు 27, 809, మహిళలు 31,421 మంది ఉన్నారు. ఎస్టీ ఓటర్లు 2,864 ఉన్నారు. ఇందులో పురుషులు 1,432, మహిళలు 1,431 ఉన్నారు. ఓసీ సంబంధించి 1,13,029 ఓట్లు ఉన్నాయి. పురుషులు 57, 256, మహిళలు 55, 751 మంది ఉన్నారు. 2010లో 13 మంది ఉండేవారు. వీరి సంఖ్య ప్రస్తుతం 76 చేరింది. వీరిలో బీసీలు 47 మంది, ఎస్సీలు ఆరుగురు, ఎస్టీ ఒకరు, ఓసీ 22 మంది ఉన్నారు. -
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట -
పంచాయతీ పోరుకు కసరత్తు
సాక్షి, అరసవల్లి (శ్రీకాకుళం): ఓ వైపు సార్వత్రిక ఎన్నికల వే‘ఢీ’ కొనసాగుతుంటే..మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు మరో కీలక అడుగు వేశారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన ‘స్థానిక’ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతున్నారు. గ్రామస్థాయిలో వార్డుల వారీగా, కేటగిరీల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శనకు సిద్ధం చేయాలంటూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేయడంతో.. త్వరలోనే పంచాయతీల పోరు షురూ అన్న సంకేతాలు పంపినట్లయ్యింది. జిల్లాలోని 1095 గ్రామ పంచాయతీల్లోనూ పాలక వర్గాల గడువు తీరిపోవడంతో గత ఏడాది ఆగస్టు 2 నుంచి ‘ప్రత్యేక’ అధికారుల పాలన కొనసాగుతున్న సంగతి విదితమే. వాస్తవానికి గత ఏడాదే స్థానిక ఎన్నికలకు సిద్ధపడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, తీవ్ర ప్రతికూల వాతావరణం నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు వెనుకడుగు వేసింది. అప్పటి నుంచి ప్రత్యేక పాలనలోనే పల్లెలున్నాయి. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్కుమార్ జారీ చేసిన తాజా ఉత్తర్వుల మేరకు మరికొద్ది నెలల్లోనే పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు సిగ్నల్ ఇచ్చేశారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు పంపారు. గతేడాది జూన్లో కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్కుమార్ జారీ చేసిన ఉత్తర్వులు మేరకు అప్పట్లో కూడా పంచాయతీలకు ఓటర్ల జాబితాను ప్రదర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందనే చర్చ జరిగింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ పాలన గడువు కూడా పూర్తికానుండడంతో, సార్వత్రిక ఎన్నికలు జరిగిన వెంటనే ‘స్థానిక’ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేద్దామనే ఆలోచనలో రాష్ట్ర ఎన్నికల అధికారులున్నట్లు సమాచారం. ఈమేరకు తొలి అడుగుగా వచ్చే నెల 10న అన్ని పంచాయతీల్లోనూ వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లాలో 21 లక్షల 75 వేల మంది ఓటర్లు.. 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారిని ప్రామాణికంగా తీసుకుని జిల్లాలో అన్ని పంచాయతీల్లోనూ ఓటర్లను ఖరారు చేయాల్సి ఉంది. తాజా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1095 పంచాయతీల నుంచి 21,75,176 మంది ఓటర్లతో జాబితా సిద్దమైంది. ఇందులో పురుషులు 10,88,410, మహిళలు 10,86,493 మందిగా నమోదయ్యారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. 2013లో జిల్లాలో మొత్తం 1100 పంచాయితీలకు గాను 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో శ్రీకాకుళం మున్సిపాల్టీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీ ఆమోదం తెలియజేయడంతో పంచాయతీకి ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ ప్రత్యేకాధికారి పాలనే కొనసాగుతోంది. తాజా పరిస్థితులను బట్టి చూస్తే జిల్లాలో మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా వంశధార ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పూర్తిగా తొలిగింపునకు గురయ్యాయి. హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, తులగాం పంచాయతీలతో పాటు వంగర మండలంలోని దేవకివాడ గ్రామ పంచాయతీ కూడా వంశధార ప్రాజెక్టు కారణంగా మెర్జింగ్ అయ్యింది. గార్లపాడులో మూడు అనుబంధ గ్రామాలు (హేమ్లెట్స్), పాడలి పంచాయతీలో రెండు అనుబంధ గ్రామాలు వంశధార పరిధిలో తొలిగిపోయినప్పటికీ, ఈ రెండు పంచాయతీలు మాత్రం రికార్డుల్లో కొనసాగుతున్నాయి. వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మొత్తం 5 పంచాయతీలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇకపై జిల్లాలో 1095 పంచాయతీలుగా రికార్డుల్లో నమోదు చేసుకోవాల్సి ఉంది. ఈ పంచాయతీల్లోనే ఈసారి ఎన్నికలు జరుగనున్నాయని అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. గ్రామ సర్పంచులతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కూడా ఇవే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలను నిర్వహించే అవకాశాలు లేకపోలేదు. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్ స్టేషన్ ఉండేలా ఎన్నికల అధికారులు నిర్ణయించారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, జనాభా దామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. చర్యలు చేపడతాం జిల్లాలో మొత్తం 1095 పంచాయతీల్లో వార్డుల వారీగా కొత్త ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎన్నికల అధికారుల ఉత్తర్వుల ప్రకారం వచ్చే నెల 10న ఓటర్ల జాబితాను ఆయా పంచాయతీ గ్రామాల్లోనే ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తాం. ఎన్నికల అధికారుల సర్క్యులర్ ప్రకారం తదుపరి చర్యలు చేపడతాం. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తాం. – బి.కోటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి, శ్రీకాకుళం -
రాజమండ్రి ఓటర్ల జాబితాలో కాజల్....
సాక్షి, రాజమండ్రి : ప్రముఖ హీరోయిన్ కాజల్ అగర్వాల్ స్వస్థలం ఏంటో తెలుసా తూర్పు గోదావరి జిల్లా. అంతేకాదండోయ్ ఆమె పేరు కూడా మార్చుకున్నారు... దీపికా పదుకొనెగా. కాజల్..ఊరు, పేరు మారటం ఏంటా అని అనుకుంటున్నారా?. ఇంతకీ అసలు విషయం ఏంటంటే... రాజమండ్రి రూరల్ నియోజవర్గ ఓటర్ల జాబితాలో దీపికా పదుకొనె పేరుతో కాజల్ అగర్వాల్ ఫోటో ప్రత్యక్షమైంది. మరో విచిత్రం ఏంటంటే ఆమె తండ్రి పేరు రమేష్ కొండా, వయసు 22 అని ఉంది. ఇందుకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ ఇది మన ఎన్నికల అధికారుల చిత్తశుద్ది అంటూ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఉత్తర ప్రదేశ్లోని భల్లిలా నియోజకవర్గంలో 51 ఏళ్ల ‘దుర్గావతి సింగ్’ పేరుతో సన్నిలియోన్ ఫోటోతో వున్న ఓటర్ల జాబితాను విడుదల చేసి ఎలక్షన్ కమిషన్ పరువు పోగోట్టుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆ జాబితాలో చాలామందికి వాళ్ల ఫోటోలకు బదులు ఏనుగు, పావురం, జింక బొమ్మలు వుండటం గమనార్హం. -
జాబితాలో మీ పేరు లేదా.. అయినా ఓటేయొచ్చు
సాక్షి, సిటీబ్యూరో: ఓటరు జాబితాలో మీ పేరు లేదా..? ఓటు ఎలా వేసేదని ఆందోళన చెందుతున్నారా..? అయినా మీరేమీ వర్రీ కావద్దు. పేరు లేకపోయినా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అయితే ఏఎస్డీ జాబితాలో మాత్రం మీ పేరు ఉండాల్సిందే. అందులో పేరు లేకపోతే మాత్రం ఏమీ చేయలేం. ఓటరు జాబితా తయారీకి ముందు అధికారులు క్షేత్రస్థాయి పర్యటన సమయంలో ఇళ్లలో లేని వారి పేర్లు జాబితా నుంచి తొలగించి.. ఏఎస్డీ (ఆబ్సెంటీ, షిఫ్ట్డ్ అండ్ డూప్లికేటెడ్ ఓటర్స్) అనే మరో జాబితాలో పొందుపరుస్తారు. ఆ ఏఎస్డీ జాబితాలో పేరు ఉంటే అది మీరే అని నిరూపించుకుని ఓటు వేయవచ్చు. -
ఓటు చెక్ చేసుకోండి.. ఈ రోజే చివరి గడువు
సాక్షి, పశ్చిమ గోదావరి: నేషనల్ ఓటర్ సర్వీసు పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటరు ఐడీ కార్డు ఎంపిక్ నంబరు కానీ నమోదు చేస్తే... ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే Search Your Name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటు ఉందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబరు వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవా కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరు ఉందా లేదా అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చెక్ యువర్ ఓటు పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరి చూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే వినియోగించుకోవచ్చు. ఓటు నమోదుకు ఈనెల 15 వరకూ అవకాశం ఉంటుంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
తూర్పు గోదావరి.. మీ ఓటు చెక్ చేసుకోండి
సాక్షి, తూర్పు గోదావరి: నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ www.nvsp.in ఓపెన్ చేసి అందులో పేరు కానీ, ఓటర్ ఐడీ కార్డు ఎపిక్ నంబర్ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు. 1950 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. www.ceoandhra.nic.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే search your name పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్ చేసుకునే వెసులుబాటు ఉంది. కలెక్టరేట్లోని కంట్రోల్ రూం ల్యాండ్లైన్ నెం : 0884–2371950, 0884–2371951 కాల్ సెంటర్ ఇన్చార్జి : డీటీ సరస్వతి టోల్ ఫ్రీ : 1800 425 3077 జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ప్రత్యేక సెల్లో ఓటరు కార్డు ఎపిక్ నంబర్ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు. శుక్రవారం సాయంత్రం 5 గంటల లోపు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు. -
ఆత్మలకూ ఓటు హక్కు.!
సాక్షి, డీజీ పేట (ప్రకాశం): సీఎస్ పురం మండలంలోని డీజీ పేట పంచాయతీలో ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. ఈ పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో దాదాపు 2,400 ఓట్లు ఉన్నాయి. మూడు బూత్లలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఈ ఏడాది జనవరి 11న ప్రకటించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉంది. మృతిచెందిన 30 మంది ఓట్లను జాబితా నుంచి తొలగించకుండా అలాగే ఉంచారు. కోవిలంపాటి తిరుపతమ్మ, వాడా జయమ్మ, కారంపూటి హుస్సేనయ్య, దువ్వూరి రమణారెడ్డి, అగ్నిగుండాల మస్తాన్బీ, కసుమూరి బాదుర్లా, పావలి వెంకటేశ్వర్లు, ఇస్కపల్లి చినమాలకొండయ్య, షేక్ చిన మౌలాలి, పలగొండ్ల వెంకటేశ్వర్లు, ఇలా దాదాపు 30 మంది మృతి చెందగా, వారి ఓట్లను నేటికీ తొలగించలేదు. అదేవిధంగా షేక్ జిలానీ, ఊటుకూరి ఏసయ్య తదితరులకు రెండు ఓట్లు ఉన్నాయి. ఒకే వార్డు, ఒకే ఇంట్లో ఉన్న ఓటర్లను విడదీసి వేరువేరు చోట్ల ఓటు నమోదు చేశారు. భార్యాభర్తల ఓట్లు కూడా వేరువేరు పోలింగ్ బూత్లలో ఉండటం గమనార్హం. జాబితా మొత్తం తప్పుల తడకగా ఉండటంతో ఓటర్లు తమ ఓటు ఉందో.. లేదో చూసుకోవాలంటే జాబితా మొత్తం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి ఓటర్ల జాబితాను సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు. -
డూప్లికేట్ ఓటర్ల గుర్తింపునకే..
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో చేర్పులు, తప్పుల సవరణ, పేర్ల తొలగింపు తదితర ప్రక్రియల కోసం సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయలేదని, కేవలం డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు మాత్రమే సాఫ్ట్వేర్ సహాయపడుతుందని ఎన్నికల సంఘం హైకోర్టుకు నివేదించింది. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ తనంతట తాను ఓట్లను తొలగించలేదని, కేవలం ఓటర్ల డేటాబేస్ నిర్వహణకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 22, ఓటరు నమోదు నిబంధనల్లోని 21ఎ నిబంధన ప్రకారం ఓటర్ల జాబితాలో తప్పుల సవరణ, ఓటర్ల తొలగింపు అధికారం కేవలం ఈఆర్వోలకు మాత్రమే ఉందని తెలిపింది. సాఫ్ట్వేర్ గుర్తించిన డూప్లికేట్ ఓటర్లను క్షేత్రస్థాయిలోని ఓటర్ల జాబితాలతో పోల్చుకుని, చట్ట ప్రకారం అన్ని విచారణలు చేసిన తరువాతనే తొలగింపు విషయంలో ఈఆర్వోలు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని వెల్లడించింది. ఓటర్ల జాబితాలో తప్పులకు ఆస్కారం లేకుండా స్వచ్ఛంగా ఉండేందుకు ఆధార్తో ఓటర్ ఐడీని అనుసంధానించామంది. ఓటర్ల అంగీకారంతోనే ఈ అనుసంధానం జరిగిందని, ఆ తరువాత సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ నెంబర్ల సేకరణను నిలిపేశామని వివరించింది. సాఫ్ట్వేర్ సాయంతో ఈఆర్వోలు ఓట్లను తొలగిస్తున్నారన్న పిటిషనర్ వాదనలో ఎంత మాత్రం వాస్తవం లేదని, ఎటువంటి ఆధారం లేకుండానే పిటిషనర్ ఈ ఆరోపణ చేస్తున్నారని తెలిపింది. ఓటర్ల జాబితా తయారు సమయంలో చట్టం గుర్తించని సాఫ్ట్వేర్, కంప్యూటర్ ప్రోగ్రాం ద్వారా ఓట్లను తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని, అసలు జాబితాలో మార్పులు, చేర్పులకు అనుసరిస్తున్న విధానాన్ని, అందుకు ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్ వివరాలను వెల్లడించేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్ మియాపూర్కి చెందిన ఇంజనీర్ కొడలి శ్రీనివాస్ హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం తరఫున డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్ ఎం.సత్యవాణి కౌంటర్ దాఖలు చేశారు. తాము ఉపయోగిస్తున్న సాఫ్ట్వేర్లో స్వీయ నిర్ణయాలు తీసుకునే విధంగా ఎటువంటి ఆల్గారిథమ్గానీ, ఇంటెలిజెన్స్గానీ లేదని ఆమె తెలిపారు. ఓటర్ల జాబితాలో డూప్లికేట్ ఓటర్లను గుర్తించేందుకు సాయపడుతున్న ఓ ఉపకరణమే ఈ సాఫ్ట్వేర్ అని వివరించారు. ఈ సాఫ్ట్వేర్కు సంబంధించిన అంతర్గత వివరాలను బహిర్గతం చేయడం సాధ్యం కాదని, దీని వల్ల సాఫ్ట్వేర్ను దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. అందువల్ల ఈ వివరాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోర్టును కోరారు. -
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఆగని సర్వేలు
సాక్షి, చిత్తూరు : ఎన్నికలు కోడ్ అమల్లోకి వచ్చిన రాష్ట్రంలో దొంగ సర్వేలు కొనసాగుతునే ఉన్నాయి. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఎల్లంకివారిపల్లిలో సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న యువకులను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. గ్రామంలోకి వచ్చిన యువకులు సర్వే పేరుతో ఇంటింటికి తిరుగుతూ ఏ పార్టీకి ఓటు వేస్తారని, ఇతర వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానం వచ్చిన స్థానికులు ఆ యువకులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా వారిని విచారించకుండానే పోలీసులు వదిలిపెట్టడం గమనార్హం. కృష్ణాజిల్లాలోని పామర్రులో సర్వేల పేరులో ఓట్ల తొలగింపుకు శ్రీకారం చుట్టారు కొంతమంది యువకులు. స్వాట్ డిజిటల్ అనే కంపనీ పేరుతో ఇంటింటికి సర్వే చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్సీపీ నేతలు వారిని పట్టుకొని నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. -
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల లిస్టు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటిచింది. జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు1,83,24,588 మంది, స్త్రీలు 1,86,04,742 మంది ఉన్నారు. ఇక, థర్డ్ జెండర్స్ కేటగిరీకి చెందిన ఓటర్లు 3,761 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల జాబితా జిల్లాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,64,330 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 10,28,460 మంది, పురుష ఓటర్లు 10,35,623 మంది, ఇతరులు 247 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. ఇచ్ఛాపురం : ఓటర్లు - 2,29,755 ; మహిళలు -1,13,348 ; పురుషులు - 1,16,392 ; ఇతరులు -15 పలాస : ఓటర్లు - 1,91,562 ; మహిళలు - 96,699 ; పురుషులు - 94,827 ; ఇతరులు - 36 టెక్కలి : ఓటర్లు - 2,09,025 ; మహిళలు - 1,03,168 ; పురుషులు - 1,05,849 ; ఇతరులు - 08 పాతపట్నం : ఓటర్లు - 2,03,543 ; మహిళలు -1,01,121 ; పురుషులు -1,02,406 ; ఇతరులు - 16 శ్రీకాకుళం : ఓటర్లు - 2,42,395 ; మహిళలు - 1,21,507 ; పురుషులు - 1,20,846 ; ఇతరులు - 42 అముదాలవలస : ఓటర్లు -1,79,300 ; మహిళలు - 88,855 ; పురుషులు - 90,400 ; ఇతరులు - 45 ఎచ్చెర్ల : ఓటర్లు - 2,23,369 ; మహిళలు -1,09,564 ; పురుషులు -1,13,780 ; ఇతరులు - 25 నరసన్నపేట : ఓటర్లు - 2,01,516 ; మహిళలు -1,00,104 ; పురుషులు -1,01,397 ; ఇతరులు - 15 రాజాం : ఓటర్లు - 2,09,646 ; మహిళలు - 1,02,950 ; పురుషులు -1,06,663 ; ఇతరులు - 33 పాలకొండ : ఓటర్లు - 1,74,219 ; మహిళలు - 88,100 ; పురుషులు - 86,107 ; ఇతరులు- 12 విజయనగరం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 17,33,667 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 8,75,222 మంది, పురుష ఓటర్లు 8,58,327 మంది, ఇతరులు 118 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య.. కురుపాం : ఓటర్లు - 1,76,977 ; మహిళలు - 90,217 ; పురుషులు - 86,730 ; ఇతరులు - 30 పార్వతీపురం : ఓటర్లు - 1,75,625 ; మహిళలు - 88,498 ; పురుషులు - 87,120 ; ఇతరులు -12 సాలూరు : ఓటర్లు - 1,82,778 ; మహిళలు - 93,319 ; పురుషులు - 89,456 ; ఇతరులు - 03 బొబ్బిలి : ఓటర్లు - 2,09,058 ; మహిళలు - 1,05,018 ; పురుషులు - 1,04,028 ; ఇతరులు - 12 చీపురుపల్లి : ఓటర్లు - 1,90,187 ; మహిళలు - 94,062 ; పురుషులు - 96,113 ; ఇతరులు - 12 గజపతినగరం : ఓటర్లు - 1,90,878 ; మహిళలు - 96,525 ; పురుషులు - 94,350 ; ఇతరులు - 04 నెల్లిమర్ల : ఓటర్లు - 1,93,212 ; మహిళలు - 96,693 ; పురుషులు - 96,507 ; ఇతరులు - 12 విజయనగరం : ఓటర్లు - 2,10,722 ; మహిళలు - 1,07,026 ; పురుషులు - 1,03,669 ; ఇతరులు - 27 శృగవరపుకోట : ఓటర్లు - 2,04,230 ; మహిళలు - 1,03,870 ; పురుషులు - 1,00,354 ; ఇతరులు - 06 విశాఖపట్నం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 32,80,028 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 16,48,709 మంది, పురుష ఓటర్లు 16,31,161 మంది, ఇతరులు 158 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. భీమిలి : ఓటర్లు - 2,64,520 ; మహిళలు - 1,32,839 ; పురుషులు - 1,31,671 ; ఇతరులు - 10 విశాఖతూర్పు : ఓటర్లు - 2,31,915 ; మహిళలు - 1,16,605 ; పురుషులు - 1,15,295 ; ఇతరులు - 15 విశాఖ దక్షిణం : ఓటర్లు - 1,88,819 ; మహిళలు - 93,769 ; పురుషులు - 95,021 ; ఇతరులు - 29 విశాఖ ఉత్తరం : ఓటర్లు - 2,45,007 ; మహిళలు - 1,22,392 ; పురుషులు - 1,22,608 ; ఇతరులు - 07 విశాఖ పశ్చిమం : ఓటర్లు - 2,11,373 ; మహిళలు - 1,01,469 ; పురుషులు - 1,09,899 ; ఇతరులు - 05 గాజువాక : ఓటర్లు - 2,62,369 ; మహిళలు - 1,28,211 ; పురుషులు - 1,34,152 ; ఇతరులు - 06 చోడవరం : ఓటర్లు - 2,01,626 ; మహిళలు - 1,02,985 ; పురుషులు - 98,628 ; ఇతరులు - 13 మాడుగుల : ఓటర్లు - 1,79,896 ; మహిళలు - 91,675 ; పురుషులు - 88,215 ; ఇతరులు - 06 అరకులోయ : ఓటర్లు - 2,16,487 ; మహిళలు - 1,10,511 ; పురుషులు - 1,05,973 ; ఇతరులు - 03 పాడేరు : ఓటర్లు - 2,21,985 ; మహిళలు - 1,13,920 ; పురుషులు - 1,08,048 ; ఇతరులు - 17 అనకాపల్లి : ఓటర్లు - 1,89,938 ; మహిళలు - 97,126 ; పురుషులు - 92,796 ; ఇతరులు - 16 పెందుర్తి : ఓటర్లు - 2,45,901 ; మహిళలు - 1,22,266 ; పురుషులు - 1,23,634 ; ఇతరులు - 01 యలమంచిలి : ఓటర్లు - 1,88,766 ; మహిళలు - 95,875 ; పురుషులు - 92,879 ; ఇతరులు - 12 పాయకరావుపేట : ఓటర్లు - 2,30,198 ; మహిళలు - 1,16,046 ; పురుషులు - 1,14,151 ; ఇతరులు - 01 నర్శీపట్నం : ఓటర్లు - 2,01,228 ; మహిళలు - 1,03,020 ; పురుషులు - 98,191 ; ఇతరులు - 17 తూర్పు గోదావరి జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 40,13,770 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 20,18,747 మంది, పురుష ఓటర్లు 19,94,639 మంది, ఇతరులు 384 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. తుని : ఓటర్లు - 2,03,043 ; మహిళలు - 1,01,673 ; పురుషులు - 1,01,354 ; ఇతరులు - 16 ప్రత్తిపాడు : ఓటర్లు - 1,93,398 ; మహిళలు - 96,084 ; పురుషులు - 97,297 ; ఇతరులు - 17 పిఠాపురం : ఓటర్లు - 2,23,633 ; మహిళలు - 1,12,956 ; పురుషులు - 1,10,672 ; ఇతరులు - 05 కాకినాడ రూరల్ : ఓటర్లు - 2,29,595 ; మహిళలు - 1,15,596 ; పురుషులు - 1,13,977 ; ఇతరులు - 22 పెద్దాపురం : ఓటర్లు - 1,93,478 ; మహిళలు - 96,259 ; పురుషులు - 97,196 ; ఇతరులు - 23 అనపర్తి : ఓటర్లు - 2,08,966 ; మహిళలు - 1,03,329 ; పురుషులు - 1,05,655 ; ఇతరులు - 02 కాకినాడ సిటీ : ఓటర్లు - 2,30,165 ; మహిళలు - 1,11,559 ; పురుషులు - 1,18,468 ; ఇతరులు - 138 రామచంద్రాపురం : ఓటర్లు - 1,87,270 ; మహిళలు - 93,970 ; పురుషులు - 93,290 ; ఇతరులు - 10 ముమ్మడివరం : ఓటర్లు - 2,20,223 ; మహిళలు - 1,11,054 ; పురుషులు - 1,09,164 ; ఇతరులు - 05 అమలాపురం : ఓటర్లు - 1,97,537 ; మహిళలు - 99,768 ; పురుషులు - 97,767 ; ఇతరులు - 02 రాజోలు : ఓటర్లు - 1,80,091 ; మహిళలు - 90,344 ; పురుషులు - 89,744 ; ఇతరులు - 03 గన్నవరం : ఓటర్లు - 1,82,670 ; మహిళలు - 93,465 ; పురుషులు - 89,199 ; ఇతరులు - 06 కొత్తపేట : ఓటర్లు - 2,34,521 ; మహిళలు - 1,17,647 ; పురుషులు - 1,16,859 ; ఇతరులు - 15 మండపేట : ఓటర్లు - 2,06,497 ; మహిళలు - 1,01,344 ; పురుషులు - 1,05,149 ; ఇతరులు - 04 రాజానగరం : ఓటర్లు - 1,94,019 ; మహిళలు - 96,647 ; పురుషులు - 97,360 ; ఇతరులు - 12 రాజమండ్రి సిటీ : ఓటర్లు - 2,31,901 ; మహిళలు - 1,12,203 ; పురుషులు - 1,19,635 ; ఇతరులు - 63 రాజమండ్రి రూరల్ : ఓటర్లు - 2,37,255 ; మహిళలు - 1,16,735 ; పురుషులు - 1,20,500 ; ఇతరులు - 20 జగ్గంపేట : ఓటర్లు - 2,04,175 ; మహిళలు - 1,01,661 ; పురుషులు - 1,02,504 ; ఇతరులు - 10 రంపచోడవరం : ఓటర్లు - 2,55,313 ; మహిళలు - 1,22,664 ; పురుషులు - 1,32,638 ; ఇతరులు - 11 పశ్చిమ గోదావరి జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,57,922 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,49,155 మంది, పురుష ఓటర్లు 15,08,403 మంది, ఇతరులు 364 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. కొవ్వూరు : ఓటర్లు - 1,69,675 ; మహిళలు - 86,500 ; పురుషులు - 83,162 ; ఇతరులు - 13 నిడదవోలు : ఓటర్లు - 1,94,270 ; మహిళలు - 98,270 ; పురుషులు - 95,988 ; ఇతరులు - 17 ఆచంట : ఓటర్లు - 1,66,421 ; మహిళలు - 83,866 ; పురుషులు - 82,547 ; ఇతరులు - 08 పాలకొల్లు : ఓటర్లు - 1,80,965 ; మహిళలు - 91,435 ; పురుషులు - 89,491 ; ఇతరులు - 39 నరసాపురం : ఓటర్లు - 159,144 ; మహిళలు - 79,416 ; పురుషులు - 79,727 ; ఇతరులు - 01 భీమవరం : ఓటర్లు - 2,29,334 ; మహిళలు - 1,16,392 ; పురుషులు - 1,12,836 ; ఇతరులు - 106 ఉండి : ఓటర్లు - 2,11,647 ; మహిళలు - 1,06,707 ; పురుషులు - 1,04,925 ; ఇతరులు - 15 తణుకు : ఓటర్లు - 2,18,163 ; మహిళలు - 1,11,353 ; పురుషులు -1,06,804 ; ఇతరులు - 06 తాడేపల్లిగూడెం : ఓటర్లు - 1,96,980 ; మహిళలు - 99,883 ; పురుషులు - 97,078 ; ఇతరులు - 19 ఉంగుటూరు : ఓటర్లు - 1,93,475 ; మహిళలు - 97,221 ; పురుషులు - 96,241 ; ఇతరులు - 13 దెందులూరు : ఓటర్లు - 2,12,258 ; మహిళలు - 1,07,540 ; పురుషులు - 1,04,708 ; ఇతరులు - 10 ఏలూరు : ఓటర్లు - 2,14,998 ; మహిళలు - 1,12,290 ; పురుషులు - 1,02,662 ; ఇతరులు - 46 గోపాలపురం : ఓటర్లు - 2,22,223 ; మహిళలు - 1,11,112 ; పురుషులు - 11,10,95 ; ఇతరులు - 16 పోలవరం : ఓటర్లు - 2,38,820 ; మహిళలు - 1,22,059 ; పురుషులు - 1,16,743 ; ఇతరులు - 18 చింతలపూడి : ఓటర్లు - 2,49,549 ; మహిళలు - 1,25,111 ; పురుషులు - 1,24,401 ; ఇతరులు - 37 కృష్ణా జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 33,03,592 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -16,69,703 మంది, పురుష ఓటర్లు 16,33,595 మంది, ఇతరులు 294 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. తిరువూరు : ఓటర్లు - 1,94,658 ; మహిళలు - 96,908 ; పురుషులు - 97,742 ; ఇతరులు - 08 నూజివీడు : ఓటర్లు - 2,20,761 ; మహిళలు - 1,09,622 ; పురుషులు - 1,11,124 ; ఇతరులు - 15 గన్నవరం : ఓటర్లు - 2,41,440 ; మహిళలు - 1,23,256 ; పురుషులు - 1,18,159 ; ఇతరులు - 25 గుడివాడ : ఓటర్లు - 1,88,664 ; మహిళలు - 97,279 ; పురుషులు - 91,370 ; ఇతరులు - 15 కైకలూరు : ఓటర్లు - 1,87,090 ; మహిళలు - 93,282 ; పురుషులు - 93,802 ; ఇతరులు - 06 పెడన : ఓటర్లు - 1,59,215 ; మహిళలు - 79,472 ; పురుషులు - 79,736 ; ఇతరులు - 07 మచిలీపట్నం : ఓటర్లు - 1,67,506 ; మహిళలు - 85,444 ; పురుషులు - 82,053 ; ఇతరులు - 09 అవనిగడ్డ : ఓటర్లు - 2,00,677 ; మహిళలు - 1,00,488 ; పురుషులు - 1,00,170 ; ఇతరులు - 19 పామర్రు : ఓటర్లు - 1,74,919 ; మహిళలు - 88,573 ; పురుషులు - 86,335 ; ఇతరులు - 11 పెనమలూరు : ఓటర్లు - 2,48,897 ; మహిళలు - 1,27,146 ; పురుషులు - 1,21,730 ; ఇతరులు - 21 విజయవాడ వెస్ట్ : ఓటర్లు - 2,06,819 ; మహిళలు - 1,04,137 ; పురుషులు - 1,02,646 ; ఇతరులు - 36 విజయవాడ సెంట్రల్ : ఓటర్లు - 2,35,724 ; మహిళలు - 1,19,915 ; పురుషులు - 1,15,743 ; ఇతరులు - 66 విజయవాడ ఈస్ట్ : ఓటర్లు - 2,37,915 ; మహిళలు - 1,20,205 ; పురుషులు - 1,17,691 ; ఇతరులు - 19 మైలవరం : ఓటర్లు - 2,59,500 ; మహిళలు - 1,30,812 ; పురుషులు - 1,28,673 ; ఇతరులు - 15 నందిగాం : ఓటర్లు - 1,91,572 ; మహిళలు - 96,949 ; పురుషులు - 94,911 ; ఇతరులు - 12 జగ్గంపేట : ఓటర్లు - 1,88,235 ; మహిళలు - 96,215 ; పురుషులు - 92,010 ; ఇతరులు - 10 గుంటూరు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 37,51,071 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -18,43,098 మంది, పురుష ఓటర్లు 19,07,552 మంది, ఇతరులు 421 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. పెదకూరపాడు : ఓటర్లు - 2,14,772 ; మహిళలు - 1,06,503 ; పురుషులు - 1,08,247 ; ఇతరులు - 22 తాడికొండ : ఓటర్లు - 1,93,526 ; మహిళలు - 94,904 ; పురుషులు - 98,615 ; ఇతరులు - 07 మంగళగిరి : ఓటర్లు - 2,54,001 ; మహిళలు - 1,24,263 ; పురుషులు - 1,29,709 ; ఇతరులు - 29 పొన్నూరు : ఓటర్లు - 2,20,881 ; మహిళలు - 1,07,400 ; పురుషులు - 1,13,460 ; ఇతరులు - 21 వేమూరు : ఓటర్లు - 1,92,438 ; మహిళలు - 94,305 ; పురుషులు - 98,127 ; ఇతరులు - 06 రేపల్లె : ఓటర్లు - 2,19,296 ; మహిళలు - 1,09,172 ; పురుషులు - 1,10,091 ; ఇతరులు - 33 తెనాలి : ఓటర్లు - 2,48,690 ; మహిళలు - 1,21,175 ; పురుషులు - 1,27,481 ; ఇతరులు - 34 బాపట్ల : ఓటర్లు - 1,75,012 ; మహిళలు - 86,356 ; పురుషులు - 88,650 ; ఇతరులు - 06 ప్రత్తిపాడు : ఓటర్లు - 2,37,093 ; మహిళలు - 1,15,799 ; పురుషులు - 1,21,278 ; ఇతరులు - 16 గుంటూరు పశ్చిమం : ఓటర్లు - 2,15,023 ; మహిళలు - 1,05,0140 ; పురుషులు - 1,09,938 ; ఇతరులు - 45 గుంటూరు తూర్పు : ఓటర్లు - 1,93,839 ; మహిళలు - 94,622 ; పురుషులు - 99,183 ; ఇతరులు - 34 చిలకలూరిపేట : ఓటర్లు - 2,18,768 ; మహిళలు - 1,07,191 ; పురుషులు - 1,11,546 ; ఇతరులు - 31 నరసరావుపేట : ఓటర్లు - 2,16,543 ; మహిళలు - 1,07,934 ; పురుషులు - 1,08,577 ; ఇతరులు - 32 సత్తెనపల్లి : ఓటర్లు - 2,21,621 ; మహిళలు - 1,09,707 ; పురుషులు - 1,11,897 ; ఇతరులు - 17 వినుకొండ : ఓటర్లు - 2,40,860 ; మహిళలు - 1,20,693 ; పురుషులు - 1,20,149 ; ఇతరులు - 18 గురజాల : ఓటర్లు - 2,53,700 ; మహిళలు - 1,24,828 ; పురుషులు - 1,28,823 ; ఇతరులు - 49 మాచర్ల : ఓటర్లు - 2,41,008 ; మహిళలు - 1,19,206 ; పురుషులు - 1,21,781 ; ఇతరులు - 21 ప్రకాశం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 24,95,383 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -12,51,823 మంది, పురుష ఓటర్లు 12,43,411 మంది, ఇతరులు149 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. యర్రగొండపాలెం : ఓటర్లు - 1,93,402 ; మహిళలు - 95,239 ; పురుషులు - 98,159 ; ఇతరులు - 4 దర్శి : ఓటర్లు - 2,05,897 ; మహిళలు - 1,01,845 ; పురుషులు - 1,04,036 ; ఇతరులు - 16 పర్చూరు : ఓటర్లు - 2,19,427 ; మహిళలు - 1,11,870 ; పురుషులు - 1,07,547 ; ఇతరులు - 10 అద్దంకి : ఓటర్లు - 2,22,180 ; మహిళలు - 1,12,481 ; పురుషులు - 1,09,687 ; ఇతరులు - 12 చీరాల : ఓటర్లు - 1,73,291 ; మహిళలు - 88,255 ; పురుషులు - 85,028 ; ఇతరులు - 8 సంతనూతలపాడు : ఓటర్లు - 2,01,059 ; మహిళలు - 1,01,383 ; పురుషులు - 99,666 ; ఇతరులు - 10 ఒంగోలు : ఓటర్లు - 2,02,648 ; మహిళలు - 1,04,425 ; పురుషులు - 98,200 ; ఇతరులు - 23 కందుకూరు : ఓటర్లు - 2,10,288 ; మహిళలు - 1,05,152 ; పురుషులు - 1,05,100 ; ఇతరులు - 26 కొండపి : ఓటర్లు - 2,22,420 ; మహిళలు - 1,11,548 ; పురుషులు - 1,10,870 ; ఇతరులు - 2 మార్కాపురం : ఓటర్లు - 2,00,541 ; మహిళలు - 99,194 ; పురుషులు - 1,01,314 ; ఇతరులు - 6 గిద్దలూరు : ఓటర్లు - 2,24,319 ; మహిళలు - 1,12,441 ; పురుషులు - 1,11,858 ; ఇతరులు - 20 కనిగిరి : ఓటర్లు - 2,19,938 ; మహిళలు - 1,07,990 ; పురుషులు - 1,11,936 ; ఇతరులు - 12 నెల్లూరు జిల్లా మొత్తం ఓటర్లు :జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 22,06,652 కాగా, వాటిలో మహిళా ఓటర్లు -11,23,624మంది, పురుష ఓటర్లు 10,82,690 మంది, ఇతరులు 338 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. కావలి : ఓటర్లు - 2,46,518 ; మహిళలు - 1,25,741 ; పురుషులు - 1,20,732 ; ఇతరులు - 45 ఆత్మకూరు : ఓటర్లు - 1,96,747 ; మహిళలు - 99,027 ; పురుషులు - 97,694 ; ఇతరులు - 26 కోవూరు : ఓటర్లు - 2,50,860 ; మహిళలు - 1,29,854 ; పురుషులు - 1,20,986 ; ఇతరులు - 20 నెల్లూరు సీటీ : ఓటర్లు - 1,92,469 ; మహిళలు - 99,235 ; పురుషులు - 93,077 ; ఇతరులు - 67 నెల్లూరు రూరల్ : ఓటర్లు - 2,16,266 ; మహిళలు - 1,11,434 ; పురుషులు - 1,04,802 ; ఇతరులు - 30 సర్వేపల్లి : ఓటర్లు - 2,18,144 ; మహిళలు - 1,10,851 ; పురుషులు - 1,07,259 ; ఇతరులు - 34 గూడూరు : ఓటర్లు - 2,21,009 ; మహిళలు - 1,12,557 ; పురుషులు - 1,08,418 ; ఇతరులు - 34 సూళ్ళూరుపేట : ఓటర్లు - 2,15,767 ; మహిళలు - 1,09,625 ; పురుషులు - 1,06,097 ; ఇతరులు - 45 వెంకటగిరి : ఓటర్లు - 2,26,567 ; మహిళలు - 1,14,446 ; పురుషులు - 1,12,086 ; ఇతరులు - 35 ఉదయగిరి : ఓటర్లు - 2,19,337 ; మహిళలు - 1,09,466 ; పురుషులు - 1,09,854 ; ఇతరులు - 17 కడప జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 20,56,660 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 10,40,400 మంది, పురుష ఓటర్లు 10,15,964 మంది, ఇతరులు 296 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. బద్వేల్ : ఓటర్లు- 1,91,237 ; మహిళలు - 94,827 ; పురుషులు - 96,392 ; ఇతరులు - 18 రాజంపేట : ఓటర్లు - 2,07,774 ; మహిళలు - 1,05,936 ; పురుషులు - 1,01,838 ; ఇతరులు - 23 కడప : ఓటర్లు - 2,37,232 ; మహిళలు - 1,20,896 ; పురుషులు - 1,16,236 ; ఇతరులు - 100 రైల్వే కోడూరు : ఓటర్లు - 1,71,536 ; మహిళలు - 86,859 ; పురుషులు - 84,660 ; ఇతరులు - 17 రాయచోటి : ఓటర్లు - 2,20,704 ; మహిళలు - 1,10,685 ; పురుషులు - 1,09,992 ; ఇతరులు - 27 పులివెందుల : ఓటర్లు - 2,12,323 ; మహిళలు - 1,07,790 ; పురుషులు - 1,04,519 ; ఇతరులు - 14 కమలాపురం : ఓటర్లు - 1,81,968 ; మహిళలు - 91,929 ; పురుషులు - 90,010 ; ఇతరులు - 29 జమ్మలమడుగు : ఓటర్లు - 2,23,913 ; మహిళలు - 1,13,893 ; పురుషులు - 1,10,000 ; ఇతరులు - 20 ప్రొద్దుటూరు : ఓటర్లు - 2,14,959 ; మహిళలు - 1,09,644 ; పురుషులు - 1,05,277 ; ఇతరులు - 38 మైదుకూరు : ఓటర్లు - 1,94,991 ; మహిళలు - 97,941 ; పురుషులు - 97,040 ; ఇతరులు - 10 కర్నూలు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 28,90,884 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 14,51,258 మంది, పురుష ఓటర్లు 14,39,183 మంది, ఇతరులు 443 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. ఆళ్ళగడ్డ : ఓటర్లు - 2,09,794 ; మహిళలు - 1,05,865 ; పురుషులు - 1,03,914 ; ఇతరులు - 15 శ్రీశైలం : ఓటర్లు - 1,69,959 ; మహిళలు - 85,895 ; పురుషులు - 84,026 ; ఇతరులు - 38 నందికొట్కూరు : ఓటర్లు - 1,87,042 ; మహిళలు - 93,866 ; పురుషులు - 93,166 ; ఇతరులు - 10 కర్నూలు : ఓటర్లు - 2,07,518 ; మహిళలు - 1,05,550 ; పురుషులు - 1,01,938 ; ఇతరులు - 30 పాణ్యం : ఓటర్లు - 2,52,185 ; మహిళలు - 1,27,511 ; పురుషులు - 1,24,635 ; ఇతరులు - 39 నంద్యాల : ఓటర్లు - 2,36,709 ; మహిళలు - 1,20,842 ; పురుషులు - 1,15,775 ; ఇతరులు - 92 బనగానపల్లె : ఓటర్లు - 2,17,653 ; మహిళలు - 1,09,380 ; పురుషులు - 1,08,253 ; ఇతరులు - 20 డోన్ : ఓటర్లు - 1,94,820 ; మహిళలు - 97,510 ; పురుషులు - 92,254 ; ఇతరులు - 20 పత్తికొండ : ఓటర్లు - 1,89,409 ; మహిళలు - 93,640 ; పురుషులు - 95,751 ; ఇతరులు - 18 కొడుమూరు : ఓటర్లు - 2,00,870 ; మహిళలు - 99,494 ; పురుషులు - 1,01,369 ; ఇతరులు - 7 ఎమ్మిగనూరు : ఓటర్లు - 2,05,846 ; మహిళలు - 1,03,107 ; పురుషులు - 1,02,704 ; ఇతరులు - 35 మంత్రాలయం : ఓటర్లు - 1,74,653 ; మహిళలు - 88,677 ; పురుషులు - 85,963 ; ఇతరులు - 13 ఆదోని : ఓటర్లు - 2,24,716 ; మహిళలు - 1,11,751 ; పురుషులు - 1,12,931 ; ఇతరులు - 34 ఆలూరు : ఓటర్లు - 2,19,710 ; మహిళలు - 1,11,504 ; పురుషులు - 1,08,170 ; ఇతరులు - 36 అనంతపురం జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,58,909 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,18,768 మంది, పురుష ఓటర్లు 15,39,936 మంది, ఇతరులు 204 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. రాయదుర్గం : ఓటర్లు - 2,40,196 ; మహిళలు - 1,19,839 ; పురుషులు - 1,20,350 ; ఇతరులు - 3 ఉరవకొండ : ఓటర్లు - 2,07,775 ; మహిళలు - 1,03,570 ; పురుషులు - 1,04,186 ; ఇతరులు - 19 గుంతకల్లు : ఓటర్లు - 2,38,010 ; మహిళలు - 1,19,210 ; పురుషులు - 1,18,738 ; ఇతరులు- 62 తాడిపత్రి : ఓటర్లు- 2,20,673 ; మహిళలు - 1,09,210 ; పురుషులు - 1,10,923 ; ఇతరులు- 10 సింగనమల : ఓటర్లు - 2,24,720 ; మహిళలు - 1,11,211 ; పురుషులు - 1,10,923 ; ఇతరులు - 10 అనంతపురం : ఓటర్లు - 2,22,652 ; మహిళలు - 1,12,109 ; పురుషులు - 1,10,503 ; ఇతరులు - 40 కళ్యాణదుర్గం : ఓటర్లు - 2,10,622 ; మహిళలు - 1,04,275 ; పురుషులు - 1,06,341 ; ఇతరులు - 6 రాప్తాడు : ఓటర్లు - 2,31,386 ; మహిళలు - 1,13,927 ; పురుషులు - 1,17,456 ; ఇతరులు - 3 మడకశిర : ఓటర్లు - 1,95,368 ; మహిళలు- 96,013 ; పురుషులు - 99,352 ; ఇతరులు - 3 హిందూపూర్ : ఓటర్లు - 2,19,012 ; మహిళలు - 1,07,791 ; పురుషులు - 1,11,211 ; ఇతరులు - 10 పెనుకొండ : ఓటర్లు - 2,11,784 ; మహిళలు - 1,03,854 ; పురుషులు - 1,07,929 ; ఇతరులు - 1 పుట్టపర్తి : ఓటర్లు - 1,90,930 ; మహిళలు - 95,046 ; పురుషులు - 95,877 ; ఇతరులు - 7 ధర్మవరం : ఓటర్లు - 2,23,007 ; మహిళలు - 1,11,001 ; పురుషులు - 1,11,980 ; ఇతరులు - 26 కదిరి : ఓటర్లు - 2,22,769 ; మహిళలు - 1,11,178 ; పురుషులు - 1,11,586 ; ఇతరులు- 5 చిత్తూరు జిల్లా మొత్తం ఓటర్లు : జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 30,25,222 కాగా, వాటిలో మహిళా ఓటర్లు 15,03,477 మంది, పురుష ఓటర్లు 15,21,401 మంది, ఇతరులు 344 మందిగా ఉన్నారు. జిల్లాలోని ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల సంఖ్య. తంబళ్ళపల్లె : ఓటర్లు - 2,03,389 ; మహిళలు - 1,01,511 ; పురుషులు - 1,01,859 ; ఇతరులు - 19 పీలేరు : ఓటర్లు - 2,18,909 ; మహిళలు - 1,09,896 ; పురుషులు - 1,09,010 ; ఇతరులు - 3 మదనపల్లె : ఓటర్లు - 2,29,048 ; మహిళలు - 1,15,436 ; పురుషులు - 1,13,560 ; ఇతరులు - 52 పుంగనూరు : ఓటర్లు - 2,18,268 ; మహిళలు - 1,09,768 ; పురుషులు - 1,08,479 ; ఇతరులు - 21 చంద్రగిరి : ఓటర్లు - 2,70,495 ; మహిళలు - 1,37,018 ; పురుషులు - 1,33,434 ; ఇతరులు - 43 తిరుపతి : ఓటర్లు - 2,36,821 ; మహిళలు - 1,18,853 ; పురుషులు - 1,17,922 ; ఇతరులు - 46 శ్రీకాళహస్తి : ఓటర్లు - 2,25,698 ; మహిళలు - 1,15,653 ; పురుషులు - 1,10,025 ; ఇతరులు - 25 సత్యవేడు(ఎస్సీ) : ఓటర్లు - 1,97,820 ; మహిళలు - 1,15,653 ; పురుషులు - 97,301 ; తరులు - 20 నగరి : ఓటర్లు - 1,86,227 ; మహిళలు - 94,495 ; పురుషులు - 91,720 ; ఇతరులు - 12 గంగాధర నెల్లూరు : ఓటర్లు - 1,93,588 ; మహిళలు - 96,050 ; పురుషులు - 97,524 ; ఇతరులు - 14 చిత్తూరు : ఓటర్లు - 1,97,996 ; మహిళలు - 90,611 ; పురుషులు - 89,349 ; ఇతరులు - 36 పూతలపట్టు(ఎస్సీ) : ఓటర్లు - 2,08,203 ; మహిళలు - 1,04,474 ; పురుషులు - 1,03,698 ; ఇతరులు - 31 పలమనేరు : ఓటర్లు - 2,47,613 ; మహిళలు - 1,23,762 ; పురుషులు - 1,23,843 ; ఇతరులు - 08 కుప్పం : ఓటర్లు - 2,09,147 ; మహిళలు - 1,03,374 ; పురుషులు - 1,05,753 ; ఇతరులు - 20 -
మీడియా ప్రతినిధులమంటూ దొంగ సర్వేలు
సాక్షి, తిరుపతి : చిత్తూరు జిల్లాలో మరోసారి దొంగ సర్వేల ముఠా బయటపడింది. సర్వే పేరుతో ఓటర్ల వివరాలను సేకరిస్తున్న ఇద్దరు యువతులను వైఎస్సార్సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్లలో సర్వే పేరుతో ఇద్దరు యువతులు ఇంటింటికి తిరుగుతూ మీరు ఎవరికి ఓటు వేస్తారో చెప్పాలంటూ ప్రజలను ఆరా తీస్తున్నారు. అనుమానం వచ్చిన వైఎస్సార్సీసీ నేతలు ఆ యువతులను నిలదీశారు. భయపడిపోయిన యువతులు మొదట తాము మీడియా ప్రతినిధులమని చెప్పి తర్వాత నీళ్లు నమిలారు. దీంతో ఆ యువతులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వద్దకు తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సూచనతో పోలీసులకు అప్పగించారు. అప్పగించిన కొద్దిసేపటికే యువతులను పోలీసులు విడిచిపెట్టడం గమనార్హం. -
మనోడు కాదనుకుంటే ఓటు గల్లంతే!
అమెరికాలోని జార్జియాలో 2018లో గవర్నర్ ఎన్నికలు జరిగాయి. దీనికి బ్రెయిన్ కెంప్–స్టేసీ అబ్రహమ్ పోటీపడ్డారు. 2010 నుంచి కొన్నాళ్లు జార్జియా సెక్రటరీగా పని చేసిన కెంప్ ఆ ప్రాంతంలో ఉన్న 3.4 లక్షల మంది కలర్ మైనార్టీల ఓట్లు వారి ప్రమేయం లేకుండానే తీసేయించేసి లబ్ధిపొందారు. దీన్ని అక్కడి పరిభాషలో ‘రాంగ్లీపర్జ్’అని అంటారు. అప్పుడు కెంప్ వినియోగించిన విధానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏపీలో వాడుతోంది. విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఓటర్లుగా ఉన్న కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అమీర్పేటలో ఉంటున్నారు. చిత్తూరుకు చెందిన ఓటర్లు వేణుగోపాల్రెడ్డి, నాగవేణి సైతం నగరంలో నివసిస్తున్నారు. వీరికి ఐటీ గ్రిడ్స్ కాల్సెంటర్ నుంచి ఐవీఆర్ఎస్ కాల్ వచ్చింది. ఇందులో టీడీపీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే.. ఈ నలుగురూ తమ ప్రమేయం లేకుండానే ఏపీలో ఉన్న ఓట్లు కోల్పోయారు. సేవామిత్ర యాప్లో కేవలం తెలుగుదేశం పార్టీ వారి సమాచారం మాత్రమే కాదు.. ఏ ఓటర్ ఏ పార్టీకి చెందిన వారు అనే సమాచారం ఉంది. ఇవి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాలివి. ఇలా ఐటీ గ్రిడ్స్ సంస్థను అడ్డంపెట్టుకుని టీడీపీ చేస్తున్న ఎన్నో కుట్రల్లో ఇవి రెండు ఉదాహరణలు మాత్రమే. సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ రూపొందించిన సేవామిత్ర యాప్ను ఆయుధంగా వాడుకుంటూ వచ్చే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో అక్రమంగా లబ్ధిపొందడానికి తెలుగుదేశం పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. తమ దురుద్దేశపూర్వక సర్వేల్లో ఎవరైనా తమ పార్టీకీ ఓటు వేయరని తేలినా.. ఆ వ్యక్తి సర్వే సమయంలో సదరు నియోజకవర్గంలో లేకపోయినా వారి ఓట్లు కుట్రపూరితంగా తొలగించేస్తున్నారు. ఈ వ్యవహారంలో టీడీపీ ‘కీ’పర్సన్స్ కీలకపాత్ర పోషించేవారని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు. (ఇదీ జరుగుతోంది!) మొదటి వారు తమ ఓటర్లు కాదనే ఉద్దేశంతో, రెండో వారు తమకు వేయకపోయే ప్రమాదం ఉందనే అనుమానంతో ఇలా చేసుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఐటీ గ్రిడ్స్ సాయంతో తెలుగుదేశం పార్టీ చేసిన, చేస్తున్న అక్రమాలపై నగరంలోని ఎస్సార్నగర్ పోలీసుస్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తు సాగుతోందని ఆయన వివరించారు. వెస్ట్జోన్, టాస్క్ఫోర్స్ డీసీపీలు ఏఆర్ శ్రీనివాస్, పి.రాధాకిషన్రావులతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు. బాధితులంతా నగరంలో ఉంటున్నవారే హైదరాబాద్లోని మధురానగర్కు చెందిన దశరథరామిరెడ్డి ఫిర్యాదుతో శనివారం రాత్రి ఐటీ గ్రిడ్స్పై ఎస్సార్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడితోపాటు ఇప్పటి వరకు గుర్తించిన బాధితులంతా హైదరాబాద్లో ఉంటున్న వారే. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి ‘పరిధి’అనే సమస్య ఉత్పన్నం కాదు. తెలుగుదేశం పార్టీ సేవా మిత్ర యాప్.. ఐటీ గ్రిడ్స్ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చేస్తోంది. ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారం, ఈసారి ఎన్నికల్లో వారి ప్రాధాన్యం, గుర్తింపు పత్రాల వివరాలు.. ఇలా అనేక అంశాలు సేకరిస్తోంది. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) దీనికోసం ఐటీ గ్రిడ్స్ సంస్థ వారు చాలా మంది సర్వేయర్లను రంగంలోకి దింపారు. ఈ యాప్లో ఉంచడానికి ఓ ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించారు. సదరు ఓటరు నియోజకవర్గంలో ఉంటున్నారా? లేదా? స్వతహాగా ఏ పార్టీకీ చెందిన వారు? రానున్న ఎన్నికల్లో ఆయన ఓటింగ్ ప్రాధాన్యం ఏ పార్టీకి? ప్రశ్నలకు సమాధానాలను ఐటీ గ్రిడ్స్ సంస్థ కాల్ సెంటర్ నుంచి ఫోన్కాల్స్ ద్వారా, క్షేత్రస్థాయిలో సర్వేయర్ల ద్వారా సేకరిస్తోంది. దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత టీడీపీ వారికి అందిస్తోంది. వారి ద్వారానే ఓటర్కు తెలియకుండానే ఓట్లు తొలగిపోతున్నాయి. అన్ని పార్టీల ఓటర్లతో సర్వే సేవామిత్ర యాప్లో కేవలం తెలుగుదేశం పార్టీ వారికి చెందిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెప్పడంలో వాస్తవం లేదు. ఒక ఓటరు.. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ, జనసేన, సీపీఐ, సీపీఎం పార్టీల్లో ఎవరికి ప్రాధాన్యం ఇస్తున్నాడు. అనేది తెలుసుకుని యాప్లో పొందుపరుస్తున్నారు. ఆయా పార్టీకి రేటింగ్స్ కూడా ఇస్తూ డేటాబేస్ రూపొందించారు. ఐటీ గ్రిడ్స్కు చెందిన సేవామిత్ర యాప్ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ వ్యతిరేక ఓటర్లను తొలగించి రానున్న ఎన్నికల్లో అక్రమ లబ్దిపొందేందుకు ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదుదారుడు పేర్కొన్న అంశాలన్నీ వాస్తవమే అని పోలీసులు తేల్చారు. ఈ యాప్ను అడ్డం పెట్టుకుని టీడీపీ వారు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండని, తమ పార్టీకి ఓటు వేయరని భావించిన వారి ఓట్లను వారి ప్రమేయం లేకుండానే తొలగిస్తున్నారు. సేవామిత్ర యాప్లో ఉన్నది తెలుగుదేశం పార్టీ డేటా మాత్రమే అన్నది వాస్తవం కాదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది విద్య, వృత్తి, వ్యాపారాల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అలాంటి వారి ఓట్లను కూడా.. వారి ప్రమేయం లేకుండానే తీసేశారు. దీనిపై ఎన్నికల సంఘం నుంచి వివరాలు, మార్గదర్శకాలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ఢిల్లీకి సైబర్ క్రైం బృందం ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టారు. సంస్థ తొలగించిన 80 జీబీ సమాచారాన్ని బయటికి తీసి (రిట్రీవ్ చేసిన).. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు బుధవారం సైబరాబాద్ సైబర్ క్రైం బృందం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళింది. ఈ బృందం ఢిల్లీలోని ఎన్నికల ప్రధాన కార్యాలయం, ఆధార్ (యూఐడీఏఐ) కార్యాలయాల అధికారులను కలిసి ఐటీ గ్రిడ్స్ దగ్గరున్న డేటా గురించి ఆరా తీయనున్నారు. ఆధార్ కార్డు, ఓటరు కార్డుకు సంబంధించిన కలర్ ఫొటోలతో కూడిన కాపీలు వీరికెలా వచ్చాయి? అసలు వాటిని ఎవరెవరికి ఇస్తారు? ఇచ్చినా వాటికి సంబంధించిన భద్రతాపరమైన అంశాలేంటి? రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరి పరిరక్షణలో ఈ వివరాలుంటాయి? వీటి గోప్యతకు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ రహస్య సమాచారాన్ని ప్రైవేటు సంస్థలకు ఇచ్చే ప్రక్రియ ఉందా? ఇస్తే ఎలాంటి చట్టాలు వర్తిస్తాయనే అంశాలపై అధ్యయనం చేయనున్నారు. మరో బృందం బుధవారం కూడా ఐటీ గ్రిడ్స్ సంస్థలో డిలీటెడ్ సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీని కోసం సైబర్ నిపుణులు పోలీసులతో కలిసి పాల్గొన్నారు. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో సున్నితంగా మారడంతో కేసు దర్యాప్తులో నిర్లక్ష్యాన్నికి తావులేకుండా ప్రతి అంశం కీలకంగా మారింది. దీంతో మరోసారి ఐటీ గ్రిడ్ సంస్థపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్రెడ్డిని బుధవారం సైబరాబాద్ పోలీసులు స్టేట్మెంట్ను రికార్డు చేసి అతని వద్దను ఆధారాలను పరిశీలించారు. బెదిరించిన పోలీసులు తెలిసిన వాళ్లే... ఐటీ గ్రిడ్స్ సంస్థ పై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్రెడ్డిని బెదిరించింది ఏపీ పోలీసులేననే ఆధారాలను సైబరాబాద్ పోలీసులు సేకరించారు. లోకేశ్వర్రెడ్డి ఇంటి వద్ద సీసీటీవీ ఫుటేజీని, ఆయన కాల్డేటాను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఇంటికి వచ్చిన వారిలో ఏపీకి చెందిన ఓ ఏసీపీ, ఇన్స్పెక్టర్, ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉన్నారని సేకరించిన ఆధారాల ద్వారా స్పష్టమైంది. సైబరాబాద్ పోలీసులు బుధవారం అమెజాన్ సర్వీసుకు 91 సీఆర్పీసీ నోటీసులను జారీ చేశారు. మొదటిరోజు నోటీసులు జారీ చేసినా అమెజాన్ వెబ్ సర్వీసు ఇంకా స్పందించలేదు. దీంతో బుధవారం మరో సారి సైబరాబాద్ పోలీసులు 91 సీఆర్పీసీ నోటీసును జారీ చేసి దర్యాప్తుకు అవసరం ఉన్న సమాచారాన్ని త్వరగా ఇచ్చేలా అమెజాన్ సంస్థ చర్యలు తీసుకోవాలని నోటీసులో స్పష్టంచేశారు. -
చినబాబు, పెదబాబు కనుసన్నల్లోనే..
-
బీసీలకు 94 ఎంపీపీలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల ప్రజాపరిషత్ (ఎంపీపీ)ల రిజర్వేషన్ల లెక్కలు కొలిక్కి వచ్చాయి. మొత్తం 32 జిల్లా ప్రజాపరిషత్ల పరిధిలోని 535 మండల ప్రజాపరిషత్ (రాష్ట్రంలోని గ్రామీణ రెవెన్యూ మండలాలు)లలో 33 మండలాలు షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉన్నాయి. మిగతా నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని 502 మండలాల్లో 50 శాతం అంటే 251 మండలాల్లోని ఎంపీపీ స్థానాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వాటిలో ఎస్టీలకు 59 రిజర్వ్కాగా, ఎస్సీలకు 98, బీసీలకు 94 రిజర్వ్ అయ్యాయి. ఈ కేటగిరిలన్నింటిలోనూ మహిళలకు 50 శాతం స్థానాలు రిజర్వ్ చేశారు. మిగతా 251 అన్ రిజర్వ్డ్గా పరిగణిస్తుండగా అందులోనూ మహిళలకు 50 శాతం ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ కేటగిరీలో మహిళలకు 125, పురుషులు/మహిళలు పోటీపడే విధంగా 126 ఎంపీపీ స్థానాలు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 32 జిల్లాల్లోని వివిధ మండలాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన ఈ వర్గాల ఎంపీపీ స్థానాలు రిజర్వ్ చేశాక ఓటర్ల జాబితా ఆధారంగా బీసీలకు ఎంపీపీ స్థానాలు కేటాయించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న సుప్రీంకోర్డు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 32 జిల్లాల్లోని మండలాలవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఖరారు సందర్భంగా ఈ లెక్కలు తేలాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నీతూ కుమారీ ప్రసాద్ ఎంపీపీ స్థానాల్లో రిజర్వేషన్లను ఖరారు చేశారు. మహిళలకు 267 ఎంపీపీ స్థానాలు రిజర్వ్ అన్ని కేటగిరిల్లో మహిళలకు 50 శాతం స్థానాలు కేటాయించాలన్న నిబంధన నేపథ్యంలో వివిధ ఎంపీపీల్లో ఎస్టీ, ఎస్సీ, బీసీ వర్గాలకు సంబంధించి మహిళల ప్రాతినిధ్యం పెరగనుంది. షెడ్యూల్డ్, నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాలు కలుపుకుని ఎస్టీ, ఎస్సీ, బీసీలకు సంబంధించి మొత్తం 142 స్థానాలు మహిళలకు రిజర్వ్ చేశారు. షెడ్యూల్డ్ ఏరియాల మండలాల్లోని ఎంపీపీల్లో మహిళలకు 16, నాన్ షెడ్యూల్డ్ మండలాల్లో 30 ఎంపీపీలు ఎస్టీ మహిళలకు, 49 ఎస్సీ మహిళలకు, 47 బీసీ మహిళలకు ఎంపీపీ అధ్యక్ష స్థానాలు రిజర్వయ్యాయి. అంతేకాకుండా అన్ రిజర్వ్డ్ కేటగిరీలో 125 ఎంపీపీ స్థానాలు మహిళలకు కేటాయించారు. మొత్తం కలిపి మహిళలకు 267 ఎంపీపీ అధ్యక్ష స్థానాలు ఖరారయ్యాయి. ఇవే కాకుండా మిగతా అన్ రిజర్వ్డ్ ఎంపీపీ అధ్యక్ష స్థానాల్లోనూ పురుషులతో మహిళలు పోటీ పడే అవకాశాలున్నాయి. పునర్విభజనతో మారిన పలు మండలాల లెక్కలు... జిల్లా, మండల పరిషత్ల పునర్విభజన సందర్భంగా షెడ్యూల్డ్ మండలాలుగా ఉన్న బయ్యారం, గార్ల, గంగారంలను సరిగ్గా లెక్కించ లేదు. తాజాగా దాన్ని సరిచేయడంతో వాటిని షెడ్యూల్డ్ మండలాల జాబితాలో చేర్చారు. గతంలో జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రి జిల్లాలో చేర్చడంతో జనగామ జిల్లా నుంచి ఆ మండలాన్ని మినహాయిం చారు. దీంతో ఆ జిల్లాలో మండలాల సంఖ్య 12కు తగ్గింది. కొత్తగా ఏర్పడిన నారాయణపేట జిల్లాలో బీసీలకు మరో ఎంపీపీ స్థానాన్ని అదనంగా కేటాయించారు. ఆ మేరకు ఆ జిల్లాలో అన్ రిజర్వ్డ్ కేటగిరీలో ఒక స్థానం తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీసీ రిజర్వేషన్లలో మార్పుల కారణంగా మహిళా రిజర్వేషన్లలో స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో చోటుచేసుకున్న మార్పుల గురించి పీఆర్ కమిషనర్ తెలియజేశారు. -
పెదబాబు డైరెక్షన్ ..చినబాబు యాక్షన్
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో కేవలం డబ్బులు పంచిపెట్టినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి రాలేమని గ్రహించిన పెదబాబు, చినబాబు ఇప్పుడు ఏకంగా ఓటర్లపైనే గురి పెట్టారు. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరులు, మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వారి ఓట్లను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. రాష్ట్రంలోని 175 శాసనసభ నియోజకవర్గాల్లో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ గత ఏడాది నవంబర్ నుంచి నిరాటంకంగా కొనసాగతోంది. ఇందుకు మార్గదర్శకత్వం పెదబాబుది కాగా, దాన్ని అమలు చేసే బాధ్యతను చినబాబు తన భుజాలపై వేసుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 6,000 నుంచి 21,000 ఓట్లను తొలగించడమే ధ్యేయంగా చినబాబు బృందం పనిచేస్తోంది. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లపై వేటు వేసేందుకు పకడ్బందీగా వ్యవహరిస్తోంది. ఎవరి ఓట్లను తొలగించాలో వారి పేర్లతోనే ఆన్లైన్ ద్వారా ఫారం–7 దరఖాస్తులను చినబాబు బృందం సమర్పిస్తోంది. తమ పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలంటూ నవంబర్ నుంచి ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 8,73,500 దరఖాస్తులు ఆన్లైన్లో రావడం గమనార్హం. ఓట్ల తొలగింపును కోరుతూ ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని అధికార వర్గాలు చెబుతున్నాయి. నివ్వెరపోతున్న ఎన్నికల సంఘం ఒక్కో జిల్లా నుంచి ఆన్లైన్లో వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం చూసి ఎన్నికల సంఘం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ దరఖాస్తులన్నింటినీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని నిర్ణయించింది. అత్యధికంగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఫారం–7 దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి 1,13,500, చిత్తూరు జిల్లా నుంచి 1,02,500 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో ఫారం–7 దరఖాస్తులు రావడం గమనార్హం. ఇవన్నీ కొందరు వ్యక్తులు కుట్రపూరితంగా సమర్పించినవేనని ఎన్నికల సంఘం గుర్తించినట్లు సమాచారం. ఓట్ల తొలగింపు వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ స్పష్టం చేశారు. ఆన్లైన్లో వచ్చిన ఫారం–7 దరఖాస్తులపై క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించాలని, ఓటర్లకు తెలియకుండానే వారి ఓట్లను తొలగించాలంటూ దరఖాస్తు సమర్పించిన వారిని గుర్తించి, క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశించింది. -
ఓటుపై వేటు
సార్వత్రిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ పోలింగ్ బూత్ల వారీగా వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు బరితెగించింది. టీడీపీకి వ్యతిరేకంగా పోలయ్యే ఓట్లను గుర్తించి గంపగుత్తగా తొలగించి గెలుపొందా లన్న వ్యూహాన్ని అమలుపరుస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. నిన్నటి వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని పరిస్థితే మిగిలిన నియోజకవర్గాల్లోనూ బుధవారం వెలుగుచూసింది. ‘‘నేను ఊరిలో ఉండడం లేదు. దయచేసి నా ఓటు తొలగించండి’’ అంటూ జాతీయ ఎన్నికల కమిషన్ వెబ్ పోర్టల్లో అధికార యంత్రాంగానికి దరఖాస్తులు అందుతున్నాయి. సంబంధిత ఓటరుకు ప్రభుత్వ యంత్రాంగం నోటీసులివ్వడంతో ఖంగు తింటున్నారు. తాము దరఖాస్తు చేయకుండా నోటీసులు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. సాక్షి, తిరుపతి: టీడీపీ వ్యతిరేక ఓటర్లే లక్ష్యంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రెచ్చిపోతున్నారు. ఓటరుకు తెలియకుండానే తన ఓటును తొలగించేలా కుట్రలు చేస్తున్నారు. మొన్నటి వరకు కేవలం చంద్రగిరికే పరిమితమైన ఓట్ల దొంగలు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ అధికార పార్టీకి అనుకూలంగా లేని ఓటర్లను జాబితానుంచి తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో ఓట్ల దొంగలు ఉన్నారని తెలిసినా.. అధికారయంత్రాంగం వారిపై చర్యలు తీసుకోకపోగా.. దొంగలను పట్టించిన వారిపైనే తిరిగి కేసులుపెట్టి అరెస్టు చేయిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఓట్ల తొలగింపు ప్రకియపై వైఎస్సార్సీపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేసింది. అయినా అధికార పార్టీ అండతో దొంగలు రెచ్చిపోతున్నారు. విజయావకాశాలు లేకపోవడంతో.. తాజా ఓట్ల సవరణ ప్రకారం జిల్లాలో మొత్తం 30,25,222 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార పార్టీ జిల్లాలో జయాపజయాలపై సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో టీడీపీకి విజయావకాశాలు లేకపోవడంతో అధినాయకత్వం ఆందోళనకు గురైంది. టీడీపీకి వ్యతిరేక ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాల పథకాలను కాపీ కొట్టి కొన్నింటిని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ తరువాత పరిస్థితులపై అధికారపార్టీ నేతలు మరోసారి సర్వే నిర్వహించారు. ఆ సర్వేలోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగానే ఫలితాలు కనిపించాయి. ఆ పార్టీ నేతలు అడ్డదారులు వెతకడం ప్రారంభించారు. అందులో భాగంగా కొందరు యువకులకు డబ్బులు ఇచ్చి గ్రామాల్లో సర్వే పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను గుర్తించేందుకు రంగంలోకి దింపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరిపై మొదట దృష్టి సారించారు. జనవరి 12 నుంచి ఫాం–7 ద్వారా ఓట్లు తొలగించాలంటూ ఓటరుకు తెలియకుండానే తన ఓటును తొలగించేందుకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేశారు. ఒక్క చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోనే 10,833 ఓట్లు తొలగించమని దరఖాస్తులు అందాయి. అప్రమత్తమైన స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి జిల్లా అధికారులు, ఎన్నికల కమిషన్ను కలిశారు. అయినా ప్రయోజనం కనిపించలేదు. అయితే ఓట్ల దొంగల పట్ల గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్న వారిని గుర్తించి పట్టుకుని పోలీసులకు అప్పగించడం ప్రారంభించారు. అంతటితో ఆగని ఓట్ల దొంగలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ వ్యతిరేక ఓటర్లను తొలగించే కార్యక్రమాన్ని వేగవంతం చేశారు. అధికారులపై అనుమానం జిల్లా వ్యాప్తంగా బుధవారం వరకు 34,088 ఓట్లను తొలగించమని దరఖాస్తు చేసుకున్నట్లు ఆన్లైన్లో దరఖాస్తులు అందాయి. ఆ దరఖాస్తుల విషయాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న కూడా ధ్రువీకరించారు. అయితే ఓట్ల దొంగల కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్లు పలుమార్లు చెప్పినా.. క్షేత్రస్థాయిలో ఓట్ల దొంగలకు అడ్డుకట్టవేయలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఓట్ల తొలగింపు ప్రక్రియపై జిల్లా అధికార యంత్రాంగంపైనే గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల దొంగలను పట్టిస్తున్నా జిల్లా ఉన్నతాధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే... చర్యలు తీసుకోవడం లేదని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. జిల్లాలో కొందరు అధికారులు టీడీపీ ఏజెంట్లుగా మారారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సంబంధిత అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ఓటర్లు కోరుతున్నారు. -
ఇష్టారాజ్యం
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటమి భయం వెంటాడుతుండడంతో అధికార పార్టీ నేతలు ఎన్నికల్లో గట్టెక్కేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. అధికార దర్పంతో కిందిస్థాయి ఉద్యోగులను బెదిరించి అవకతవకలకు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఓటర్ల లిస్టుపై దృష్టి సారించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను ఏదో రకంగా తొలగించడంతో పాటు దొంగ ఓట్లను నమోదు చేయించుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో ఈ వ్యవహారం ఇష్టారాజ్యంగా సాగిస్తున్నారు. సర్వేల పేరుతో ఓటర్ల పేర్లు సేకరించి, వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జాబితాలో లేని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కొత్తగా ఓటరు నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకున్నా, వాటిని నమోదు చేయకుండా బీఎల్వోలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో ఓటర్ల జాబితాలో గందరగోళం నెలకొంది. ఇటీవల జిల్లాలో పర్యటించిన ఎన్నికల ఆడిట్ బృందం ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఆరు నియోజకవర్గాల రికార్డులను పరిశీలించినట్లు సమాచారం. ప్రధానంగా డబుల్, ట్రిపుల్, అనుమానాస్పద ఓట్లపైనే ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఓటర్ల జాబితాల మార్పులు, చేర్పుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఆరుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. ముగ్గురు తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అధికార పార్టీ నేతలు బీఎల్వోలను తమకు అనుకూలంగా మలుచుకొని పెద్ద ఎత్తున ఓట్లు చేర్పించుకోవటంతో పాటు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ఓట్లను చేర్చకుండా అడ్డుకొంటున్నారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఇవే... వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో వడ్డెకుంట, జయంతిరామపురంలో మల్లు వెంకటేశ్వర్లుతో పాటు 33 మంది ఇప్పటికి 4సార్లు ఓటుహక్కు కల్పించమని దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జాబితాలో చేర్చే చర్యలు తీసుకోవడంలేదు. - బొల్లాపల్లి మండలంలోని వడ్డెకుంట, వెల్లటూరు, పేరూరులో డబుల్ ఎంట్రీ ఓట్లు అధికంగా ఉన్నాయి. రెడ్డిపాలెం గ్రామానికి చెందిన పేరం శ్రీనివాసరావు, కృపానాయక్, యర్రంశెట్టి మస్తాన్రావుతో పాటు మరో 16 మంది ఆ స్వగ్రామంతో పాటు, వేరే గ్రామాల్లోనూ ఓట్లు కలిగి ఉన్నారు. - గురజాల నియోజకవర్గంలో పోలింగ్ బూత్కు 50 ఓట్ల చొప్పున, వైఎస్సార్సీపీకి చెందిన 15 వేల అనుకూల ఓట్లను తొలగించేందుకు ప్రణాళిక రచించారు. మాచవరం మండలం సింగరాయపాలెం తండాకు చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరులవి 66 ఓట్లను తొలగించాలని గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత దరఖాస్తు చేయడం గమనార్హం. - జిల్లా వ్యాప్తంగా అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉండగా, అత్యధికంగా చిలకలూరిపేట నియోజక వర్గంలో 16,659 ఉన్నాయి. వీటిపై విచారణ జరపాలని పలువురు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజక వర్గంలో ఇష్టారాజ్యంగా పోలింగ్ బూత్లను మార్చారు. - పొన్నూరు నియోజకవర్గంలో 4500 ఓట్లు తొలగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దొంగ ఓట్లు 10 వేలకు పైగా ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదులు... గురజాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఓట్లను తొలగించే కుట్ర సాగిందని, శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇంతకుమునుపు సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త పోలింగ్ కేంద్రాల మార్పుపై ఫిర్యాదు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త రజని ఓటర్ల జాబితాలో అవకతవకలు చోటు చేసుకున్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలపై విచారణ జరిపి, న్యాయం చేయాలని కోరారు. నాడు చంద్రగిరి.. నేడు చిత్తూరులో ఓట్ల తొలగింపునకు అధికంగా ఫారం–7 దరఖాస్తులు చిత్తూరు కలెక్టరేట్ : చిత్తూరు జిల్లాలో ఓట్ల తొలగింపు కోసం ఆన్లైన్ ద్వారా అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి. ఇటీవల ఆ సమస్య చంద్రగిరి నియోజకవర్గంలో ప్రారంభమైంది. చిత్తూరు నియోజకవర్గంలో వేలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించాలని ఫారం–7 ద్వారా ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. సోమవారం, మంగళవారం చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో తహసీల్దారు చంద్రశేఖర్తో పాటు ఎన్నికల డెప్యూటీ తహసీల్దారు, ఇతర రెవెన్యూ అధికారులు ఓట్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపులపై ఆన్లైన్లో వచ్చిన వినతులు చూసి షాక్కు గురయ్యారు. నియోజకవర్గ పరిధిలో 8,020 మంది కొత్తగా ఓటర్లు నమోదు చేసుకోవడానికి దరఖాస్తులు ఇవ్వగా సవరణల కోసం 1,019మంది, బూత్ మార్పు కోసం 439 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో 7 వేల మందికి పైగా ఓట్లను తొలగించాలని ఆన్లైన్లో దరఖాస్తులు ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. -
5,984 ఎంపీటీసీ స్థానాలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని మండల పరిష త్ ప్రాదేశిక నియోజకవర్గాల సంఖ్య ఖరారైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 5,984 ఎంపీటీసీ స్థానాలు ఏర్పడనున్నట్టు సమాచారం. గతంలో ఉమ్మడి 9 జిల్లా ప్రజా పరిషత్ల పరిధిలో 6,473 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 5,984 స్థానాలకు తగ్గనుంది. కొత్తగా 68 మున్సిపాలిటీలు ఏర్పడిన నేపథ్యంలో ఆయా మండలాల పరిధి లోని కొన్ని గ్రామ పంచాయతీలను వాటిలో విలీనం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 489 ఎంపీటీసీ స్థానాల తగ్గింపునకు ఆస్కారం ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన 32 జిల్లాల (పూర్తిగా పట్ట ణ ప్రాంతమైన జీహెచ్ఎంసీ మినహా) ప్రాతిపదికన ఆయా జిల్లాల్లో ఎంపీటీసీ స్థానాల పునర్విభజన చేశారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా 98 స్థానాలు పెరగ్గా, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో అత్యల్పంగా 90 స్థానాలు తగ్గాయి. మంగళవారం నాటికి అత్యధిక శాతం జిల్లాలు ఈ స్థానాల పునర్విభజన ప్రక్రియను పూర్తిచేసి, గెజిట్లు ప్రచురించాయి. ఈ నెల 25 నాటికే ఈ స్థానాల పునర్విభజన పూర్తి చేసి జాబితాలను పంపించాలని జిల్లా సీఈఓలు, డీపీఓలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆదేశించారు. అయితే మంగళవారం రాత్రి వరకు కూడా అన్ని జిల్లాల నుంచి పూర్తి స్థాయిలో ఈ జాబితాలు అందకపోవడంతో బుధవారం వాటిని ప్రభుత్వానికి సమర్పించాలనే ఆలోచనలో పీఆర్ శాఖ ఉంది. మార్చి చివరికల్లా ఓటర్ల జాబితాలు ప్రస్తుతం 32 జిల్లాల పరిధిలోని 535 గ్రామీణ మండలాలను జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (50 పట్టణ స్వరూపమున్న రెవెన్యూ మండలాలు మినహాయించి)గా పరిగణిస్తున్నారు. ఆ మేరకు 32 జిల్లా ప్రజా పరిషత్లు, 535 మండల ప్రజాపరిషత్లు ఏర్పడనున్నాయి. కొత్త పంచాయతీరాజ్ చట్టానికి అనుగుణంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల సరిహద్దులు ఖరారవుతున్నాయి. వచ్చే నెల చివరికల్లా గ్రామపంచాయతీలు, వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు సిద్ధం కానున్నాయి. తాజా అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితా ప్రాతిపదికన మార్చి ఆఖరులోగా ఈ ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఇదివరకే జిల్లా కలెక్టర్లు, డీపీఓలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఈ జాబితాలు సిద్ధమయ్యాక ఏప్రిల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. లోక్సభ ఎన్నికల తర్వాతే... లోక్సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని బట్టి రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలుంటాయి. మే నెల మధ్యలోగా లోక్సభ ఎన్నికలు ముగిస్తే, మే నెలాఖరులో లేదా జూన్ మొదటి లేదా రెండో వారంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. -
ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు
అనంతపురం అర్బన్: ‘ధర్మవరం నియోజకవర్గంలో ఓటర్ల జాబితా తప్పులతడకగా సిద్ధం చేశారు. బోగస్, వివాహం చేసుకుని వెళ్లిన వారు, రెండు ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు జాబితాలో 6,073 ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే జి.సూర్యనారాయణ సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. రెవెన్యూ అధికారులు ఏళ్లగా పనిచేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా వారిని ఎన్నికల విధులకు వినియోగించుకుంటున్నారు. వీటన్నింటిపైన ప్రధాన ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అ«ధికారికి 20 సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.’ అని కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్కు ధర్మవరం మాజీ ఎమ్మల్యే, వైఎస్సార్సీపీ నియోజవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న తప్పిదాలపై విచారణ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి మలయ్మాలిక్, సెక్షన్ ఆఫీసర్ రవి శుక్రవారం జిల్లాకు విచ్చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో చేపట్టిన విచారణకు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాజరై... ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ఆధారాలతో సహా అందజేశారు. అధికారులను అధికారపార్టీ ఏవిధంగా ప్రలోభపెడుతోంది, ఏ విధంగా ఇబ్బంది పెట్టి తప్పుడు ఓట్లను నమోదు చేయిస్తోంది వివరించారు. కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ధర్మవరం, అనంతపురం ఆర్డీఓలు తిప్పేనాయక్, కూర్మనాథ్ ఉన్నారు. వెంకటరామిరెడ్డి ఫిర్యాదు ఇలా.. ♦ ఓటర్ల నమోదుకు 2018, సెప్టెంబరు నుంచి అక్టోబరు 31 వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ వ్యవధిలో ఓటరు నమోదుకు 18,429 దరఖాస్తులు వచ్చాయి. సరైన విచారణ నిర్వహించకుండా 5,988 దరఖాస్తులు ఆమోదించారు. ♦ స్థానిక ఎమ్మెల్యే సతీమణి జి.నిర్మలదేవికి రెండు చోట్ల ఓటు ఉంది. పోలింగ్ బూత్ 134లో (సీరియల్ నంబర్ 620) ఒక ఓటు, బూత్ 230లో (సీరియల్ నంబరు 552) మరో ఓటు ఉంది. ♦ ఎం.పి.సుబ్బారావు అనే వ్యక్తికి 108 బూత్లో (491), 218 బూత్ నంబర్లో (771) మరో ఓటు ఉంది. రమేశ్బాబు అనే వ్యక్తికి బూత్ నంబర్ 1లో (34) ఒక ఓటు, అదే బూత్లో(443) మరో ఓటు ఉంది. జి.నరసింహులుకు బూత్ నంబర్ 1లో (373) ఒక ఓటు, అదే బూత్లో (605) మరో ఓటు ఉంది. ఇలా బోగస్ ఓట్లు 6 వేల వరకు ఉన్నాయి. ♦ బోగస్ ఓట్ల తొలగింపునకు బీఎల్ఓలు సిఫారసు చేసినా ఏఈఆర్ఓలు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి వాటిపై 9,495 దరఖాస్తులు దాఖలు చేస్తే కేవలం 5,328 ఆమోదించారు. ♦ తొలగింపులకు సంబంధించి ఫారం–7లో దరఖాస్తు చేస్తే వైఎస్సార్సీపీ బీఎల్ఏలకు సమాచారం ఇవ్వకపోగా కనీసం విచారణ చేయలేదు. పైపెచ్చు దరఖాస్తులు తిరస్కరించారు. ♦ అధికారపార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక మునిసిపల్ కమిషనర్, ఎన్నికల డిప్యూటీ తహసిల్దారు సెలవుపై వెళ్లారు. బోగస్ ఓటర్లను నమోదు చేయాలని బీఎల్ఓలు, ఏఈఆర్ఓలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా చేయని పక్షంలో సెలవుపై వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల విషయంపై సీఈఓ, డీఈఓకు 20 సార్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. ఈ ఏడాది జనవరి 11న తుది ఓటర్ల జాబితా ప్రకటించారు. అయినా వేల సంఖ్యలో బోగస్, డూప్లికేట్ ఓట్లు అలాగే ఉన్నాయి. ♦ ధర్మవరం నియోజకవర్గం పరిధిలోని బోగస్ ఓట్ల చేర్చడంపై బీఎల్ఓ, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలు, జిల్లా ఎన్నికల అధికారిని విచారణ చేయాలి. ఇందులో బాధ్యులైన వారందరిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి. ♦ కొందరు రెవెన్యూ అధికారులు దీర్ఘకాలికంగా జిల్లాలోనే పనిచేస్తున్నారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలనే ఉద్దేశంతోæ వారిని బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వారిని యథావిధిగా జిల్లాలోనే కొనసాగిస్తూ ఎన్నికల విధులు అప్పగించారు. ఎమ్మెల్యే సూరి భార్యకు రెండు చోట్ల ఓటు ఈమె పేరు జి.నిర్మలాదేవి. ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సతీమణి. పట్టణంలో డబ్ల్యూఏయూ 316364, ఇంటి నెంబర్ 2–1, డబ్ల్యూఏయూ 1222975, ఇంటి నెంబర్ 25–585 పేరిట రెండు చోట్ల ఓటు హక్కు ఉంది. ఈ ఉదాహరణను పరిశీలిస్తే.. స్థానికంగా దొంగ ఓట్ల నమోదు ఏ స్థాయిలో సాగిందో అర్థమవుతోంది. -
ఓట్లు తొలగిస్తే వేటు తప్పదు
సాక్షి, అమరావతి: ఓటర్ జాబితా నుండి అకారణంగా ఓటర్ల పేర్లు తొలగిస్తే సంబంధిత అధికారులపై వేటు తప్పదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. ఆయన గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ఓటర్ల జాబితా తయారీలో తప్పులు చేసిన పలువురు సిబ్బందిపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగానే ఒక జిల్లా కలెక్టర్, ఒక డిప్యూటీ కలెక్టర్, ముగ్గురు తహసీల్దార్లకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు కావాలని తప్పులు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకతతో పని చేస్తామని అన్నారు. తమ అనుమతి లేకుండా కలెక్టర్లు కూడా ఓట్లు తొలగించలేరని ద్వివేది చెప్పారు. ఓటర్ల జాబితాలో 0.1 శాతం కంటే ఎక్కువ తేడాలు ఉంటే కలెక్టర్లు ప్రధాన ఎన్నికల అధికారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఓటర్ల జాబితాలో ఓటర్లు తమ పేర్లు ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఓటర్ల నమోదు ప్రక్రియ అభ్యర్థి నామినేషన్ వేసే ముందు రోజు వరకూ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో ఈ నెల 23, 24వ తేదీల్లో ఓట్ల నమోదు, ఓటర్ల జాబితాలో పేర్లు పరిశీలించుకునేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా తేదీల్లో బూత్ లెవల్ ఆఫీసర్లు అన్ని ఫారాలతో అందుబాటులో ఉంటారు. ఓటు ఉందా? లేదా? అనేది పరిశీలించుకోవచ్చు. కొత్తగా ఓటర్ నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలు తమ ఏజెంట్లను ప్రత్యేక క్యాంపుల వద్ద నియమించుకోవాలి. కొత్తగా ఓటర్ నమోదు కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి మార్చి 10వ తేదీ నాటికి ఇంటింటికీ వెళ్లి ఓటర్ గుర్తింపు కార్డులు అందజేస్తాం. నోటీసు ఇవ్వకుండా ఓట్లు తొలగించొద్దు రాష్ట్రంలో జనవరి 11వ తేదీ నాటికి 3.69 కోట్ల ఓట్లు ఉన్నాయి. వీటిలో 1.55 లక్షల ఓట్లు రెండుసార్లు నమోదైనట్లు గుర్తించాం. మరో 13,000 ఓట్లలో పలు తప్పులు దొర్లాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు రాష్ట్రాలో ఓటు ఉన్న వారి విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో సర్వేలపై ఎలాంటి నిషేధం లేదు. సర్వేల పేరిట ఓట్లు తొలగించడం అసాధ్యమే. ఓటర్ల తుది జాబితా తయారయ్యాక ఓట్లు తొలగించడానికి అవకాశం లేదు. నోటీసు ఇవ్వకుండా ఒక్క ఓటు కూడా తొలగించడానికి వీల్లేదు. ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల తొలగింపుపై ఫిర్యాదులు అందడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి మూడు బృందాలను రాష్ట్రానికి పంపింది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో ఈ బృందాలు పర్యటించి, ఓటర్ల జాబితాలపై పరిశీలన చేస్తాయి. 13 జిల్లాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను(ఈవీఎం) సిద్ధం చేస్తున్న ప్రక్రియను వెబ్ కెమెరాల ద్వారా చిత్రీకరించి, ప్రత్యక్షంగా చూసేలా సచివాలయం ఐదో బ్లాకులో ఏర్పాట్లు చేశాం’’ అని గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. ఓటర్ల నమోదుకు సహకరించండి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న క్యాంపుల వద్ద రాజకీయ పార్టీలు తమ ప్రతినిధులను నియమించి, ఓటర్ల నమోదుకు సహకరించాలని గోపాలకృష్ణ ద్వివేది కోరారు. ఆయన గురువారం వెలగపూడిలోని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీలు వ్యక్తం చేసిన సందేహలను నివృత్తి చేసి, పరిష్కరించడానికి ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని తెలిపారు. పార్టీల ప్రతినిధులు వ్యక్తం చేసే అభ్యంతరాలను కూలంకుషంగా పరిశీలిస్తామన్నారు. టీచర్/గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం నమోదుకు అర్హత గల ఓటర్లుకు నామినేషన్ దాఖలు చేసే చివరి రోజు వరకూ అవకాశం ఉంటుందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో ఓటరు నమోదుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికల సంఘాన్ని కోరారు. డూప్లికేట్ ఓట్లను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. కుటుంబం నుంచి ఒక వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు చెందిన ఓటరు నమోదు దరఖాస్తులను తీసుకొస్తే బూత్ లెవెల్ అధికారి ఎలాంటి అభ్యంతరం తెలపకుండా స్వీకరించేలా తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు సీఈఓలు సుజాత శర్మ, వివేక్ యాదవ్, జాయింట్ సీఈఓ మార్కండేయులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు మల్లాది విష్ణు, వి.శ్రీనివాసరావు, సీహెచ్ శ్రీనివాసరెడ్డి, ఎమ్.రాజేంద్ర, వై.వెంకటేశ్వరరావు, జెల్లీ విల్సన్, జె.రంగబాబు, వి.సత్యమూర్తి పాల్గొన్నారు. గోపాలకృష్ణ ద్వివేదికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో 9,872 ఓట్లు తొలగించారని శాసన మండలిలో ప్రతినేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, వైఎస్సార్సీపీ గురజాల ఇన్చార్జి కాసు మహేష్రెడ్డి గురువారం సచివాలయంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అనంతరం ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే ఓట్ల తొలగిస్తున్నారని ఆరోపించారు. కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ.. గురజాల నియోజకవర్గంలో కొందరు సీఐలు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు చెప్పినట్లు తల ఊపుతూ వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తున్నారని, దీనిపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు ఓటర్ల అనుమతి లేకుండానే ఫారం–7ను ఆన్లైన్లో ఇస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామన్నారు. -
ఓట్ల తొలగింపుపై విచారణ జరిపించాలి
-
సెల్టవర్ ఎక్కి యువకుడి హల్చల్
రాజేంద్రనగర్: ఓటరు లిస్టు నుంచి తన పేరును తొలగించారంటూ ఓ యువకుడు రాజేంద్రనగర్ బుద్వేల్లోని సెల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. బంధువులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో గంట తర్వాత కిందకు దిగి వచ్చాడు. పొంతన లేకుండా మాట్లాడుతుండడంతో పోలీసులు హెచ్చరించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిలుకూరు ప్రాంతానికి చెందిన శ్రావణ్కుమార్(28) గతంలో కిస్మత్పూర్ ఉండేవాడు. మంగళవారం రాత్రి కిస్మత్పూర్ ప్రాంతానికి వచ్చి మద్యం సేవించాడు. అనంతరం స్థానికంగా ఉన్న బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లి పొంతన లేని మాటలు మాట్లాడుతూ ఇబ్బంది పెట్టాడు. రాత్రి 11 గంటల వరకు బస్తీలో తిరుగుతుండడంతో యువకులు అతడిని ఇంటికి వెళ్లాలని రోడ్డుపైకి తీసుకువచ్చి వదిలి వేశారు. బుధవారం ఉదయం 9గంటల ప్రాంతంలో బుద్వేల్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ప్రాంతంలో ఉన్న సెల్టవర్ ఎక్కి అరుస్తూ కేకలు వేస్తూ దూకుతానని బెదిరించాడు. స్థానికులు గమనించి రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కిస్మత్పూర్లోని వారి బంధువులు, గ్రామస్తులను పిలిపించి సముదాయించి కిందకు దించారు. కిందకు దిగిన అనంతరం శ్రావణ్కుమార్ తన ఓటును తీసివేశారని నాయకులు తనకు ఏమి చేయడం లేదని, మంత్రులు, ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదంటూ ఉద్యమంలో తీవ్రంగా నష్టపోయానని పొంతన లేని సమాధానాలు ఇస్తూ అందరిని దూషించాడు. దీంతో పోలీసులు స్టేషన్కు తీసుకువెళ్లి సముదాయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
కదులుతున్న దొంగ ఓట్ల డొంక
సాక్షి, అమరావతి బ్యూరో: ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయ్యింది. అందుకు బాధ్యులైన అధికారులపై కొరడా ఝుళిపించింది. రాష్ట్రంలో డబుల్, ట్రిపుల్ అనుమానాస్పద, దొంగ ఓట్లపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల ఢిల్లీలో ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరాకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభమైంది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో భారీ అవకతవకలకు పాల్పడినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో అందుకు బాధ్యులైన ఐదుగురు బీఎల్వోలపై సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయినవారిలో మండల కేంద్రమైన నాదెండ్లలోని 35వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో నాదెండ్ల శివయ్య (పంచాయతీ కార్యదర్శి), నాదెండ్ల మండలం తూబాడులోని 43వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో జంగు జరీనా (పంచాయతీ కార్యదర్శి), యడ్లపాడు మండలం ఉన్నవలోని 85వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో వై.ప్రమీల, (అంగన్వాడీ వర్కర్), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 212వ నంబర్ పోలింగ్ కేంద్రానికి చెందిన బీఎల్వో గుంటి రవి (వీఆర్వో), చిలకలూరిపేట మండలం కోమటినేనివారిపాలెంలోని 214వ నంబర్ పోలింగ్ కేంద్రం బీఎల్వో అంగళ మరియమ్మ (అంగన్వాడీ వర్కర్) ఉన్నారు. వారితో పాటు చిలకలూరిపేట తహసీల్దార్ వీసీహెచ్ వెంకయ్య, నాదెండ్ల తహసీల్దార్ మేరిగ శిరీష, యడ్లపాడు తహసీల్దార్ ఆర్.రామాంజనేయులుకు షోకాజ్ నోటీసులిచ్చారు. పల్నాడు అధికారుల్లో భయం భయం.. అనుమానాస్పద ఓట్లపై విచారణ ప్రారంభించడం, చిలకలూరిపేట నియోజకవర్గంలో పలువురు అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో జిల్లాలోని పల్నాడు ప్రాంత అధికారులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో ఓటర్ల జాబితాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటుచేసుకోవడమే దీనికి కారణం. విచారణలో తమ గుట్టురట్టవుతుందని బీఎల్వోలు, తహసీల్దార్లు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. అనుమానాస్పద ఓట్లపైనే ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా 54 లక్షలకు పైగా అనుమానాస్పద ఓట్లు ఉన్నట్టు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో అనుమానాస్పద ఓట్లు 2,07,209 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇందులో అధికంగా మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గంలో 16,659, స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రాతినిథ్యం వహిస్తున్న సత్తెనపల్లి నియోజకవర్గంలో 15,498, నరసరావుపేటలో 14,746, గురజాలలో 15,498, పెదకూరపాడులో 15,314, మంగళగిరిలో 12,495, ప్రత్తిపాడులో 12,480, తాడికొండలో 11,971 ఉన్నాయి. వీటిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నిష్పక్షపాతంగా ఓట్ల మార్పులు, చేర్పులు చేస్తారా అనే విషయంపై రాజకీయ పార్టీలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సత్తెనపల్లి నియోజకవర్గానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల మార్పు, ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై వైఎస్సార్సీపీ నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. గురజాల నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు ఎన్నికల సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి దొంగ ఓట్లను చేర్పించుకున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. మొత్తం మీద పల్నాడు ప్రాంతంలోనే అధికంగా దొంగ ఓట్లు, అనుమానాస్పద ఓట్లుండటం గమనార్హం. అధికార పార్టీ నేతలు బూత్ లెవల్ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. తమకు అనుకూలంగా ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసినట్లు ఆరోపణలొస్తున్నాయి. ఓటర్ల జాబితాను పరిశీలించుకుని.. పేరు లేకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని వైఎస్సార్సీపీ నేతలు సూచిస్తున్నారు. -
ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం..
-
ప్రలోభాలపై ఈసీ డేగ కన్ను
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రలోభాలపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) డేగ కన్ను వేసింది. సంక్షేమ పథకాల పేరుతో ఎన్నికల ముందు వివిధ వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న పోస్టు డేటెడ్ చెక్కులపై ఆరా తీస్తోంది. సరిగ్గా ఎన్నికల ముందు బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునే విధంగా జారీ చేసిన చెక్కులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్(సీఈసీ) సునీల్ అరోరా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పర్యవేక్షించడా నికి సునీల్ అరోరా రాష్ట్రానికి వచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ఓటును తొలగించాలంటూ ప్రజలు దరఖాస్తు చేయకపోయినా ఇష్టారాజ్యంగా వారి ఓటును తొలగిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రేషన్ కార్డులు, పెన్షన్లు ఇస్తున్నప్పుడు లబ్ధిదారులతో కొందరు వ్యక్తులు ప్రమాణాలు చేయించుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, దీనిపై కూడా ప్రభుత్వం నుంచి పూర్తి సమాచారం తెప్పించుకుంటున్నామని అన్నారు. సునీల్ అరోరా ఇంకా ఏం చెప్పారంటే... ‘‘ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాలో తప్పులపై వివిధ రాజకీయ పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటన్నింటినీ సమగ్రంగా పరిశీలిస్తాం. బోగస్ ఓట్లు, దొంగ ఓట్లపై ఫిర్యాదులు అందుతున్నాయి. రెండు మూడు రోజుల్లోనే మచ్చుకు కొన్ని ఓట్లపై ఆడిట్ చేస్తాం. చాలామంది యువ ఓటర్ల పేర్లు ఓటర్ల జాబితాలో నమోదు కాలేదని ఫిర్యాదులు వచ్చాయి. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకూ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. రాష్ట్రంలో కొంతమంది సర్వేల పేరిట, కులాల పేరిట ఓట్లు తొలగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించాం. కొత్త ఓటర్ల నమోదు కోసం నియమించిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఓటర్ నమోదు పాస్వర్డ్ ఇస్తున్నాం. ఇది దుర్వినియోగం అవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. అదేవిధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్లా ఓటర్లుగా ఉన్నవారిపై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం. బదిలీలు, పదోన్నతులపై ఫిర్యాదులు ఎన్నికల ముందు బదిలీలు, ప్రమోషన్లపై.. ముఖ్యంగా పోలీసు శాఖపై చాలా ఫిర్యాదులు అందాయి. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా లేని బదిలీలు, పదోన్నతులను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుత రాష్ట్ర డీజీపీ అధికార పార్టీకి అనుగుణంగా పనిచేస్తున్నారంటూ దీనికి ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసును ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు ఎన్ఐఏ పరిధిలో ఉంది. ఇవికాకుండా డీజీపీపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఏమైనా వస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికలను పూర్తి పారదర్శకంగా నిర్వహించడానికి ప్రయత్నిస్తున్నాం. ఎన్నికల విధుల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి ఉన్నతాధికారి అయినా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈవీఎంలతోనే ఎన్నికలు నిర్వహిస్తాం.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై(ఈవీఎం) అనుమానాలు వ్యక్తం చేయడం అర్థరహితం. 2014 తర్వాత ఎన్నికలు జరిగిన పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు కాకుండా వేరే పార్టీలు గెలిచాయి. ఈవీఎంల్లో అవకతవకలు లేవనడానికి ఇదే నిదర్శనం. వచ్చే ఎన్నికలను ఈవీఎంలతోనే నిర్వహిస్తాం. రాష్ట్రంలో తొలిసారిగా శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలను వీవీ ప్యాట్లతో నిర్వహించబోతున్నాం. వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టడానికి ఆదాయపు పన్ను(ఐటీ), వాణిజ్య శాఖలతో గట్టి నిఘా ఏర్పాటు చేస్తున్నాం. గత ఎన్నికల్లో కేసులు నమోదైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించాం. పత్రికల్లో వచ్చే చెల్లింపు వార్తలను(పెయిడ్ న్యూస్) పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చేయాల్సిన బదిలీలకు ఫిబ్రవరి 20వ తేదీ వరకు గడువు ఇస్తున్నాం. ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు గతంలో జరిగిన కర్ణాటకతోపాటు ఇటీవలే జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగించడం వల్ల సత్ఫలితాలు వచ్చాయి. సి–విజిల్ యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఈ ఫిర్యాదులపై వంద నిమిషాల్లో చర్యలు తీసుకుంటాం. వచ్చిన ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించడానికి సమాధాన్ యాప్.. నామినేషన్లు, అనుమతులు, ఓట్ల లెక్కింపు, ఎన్నికల ఫలితాలను తెలుసుకోవడానికి న్యూసువిధ యాప్ను తీసుకొచ్చాం. ఈవీఎంలు, వీవీ ప్యాట్లు, యాప్లపై ప్రజలకు అవగాహన కల్పించడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తాం’’ అని సీఈసీ సునీల్ అరోరా వెల్లడించారు. ఈ సమావేశంలో సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ ఉమేష్ సిన్హా, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ సందీప్ సక్సేనా, సుదీప్ జైన్, ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల దొంగ ఓటర్లాట..!
ఈసారి ఎన్నికల్లో గెలవలేమని టీడీపీ నాయకులు అడ్డదారులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఓటర్ల జాబితాను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. తమ పార్టీ అనుకూలురనుకున్న వారి పేర్లు రెండు మూడు చోట్ల ఉంచేసి, వైఎస్సార్సీపీ నాయకులు పేర్లు ఎత్తివేస్తున్నారు. ఇలా తొట్టంబేడులో భారీగా డబుల్, ట్రిపుల్ ఎంట్రీలు ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చిత్తూరు, తొట్టంబేడు : మండలంలో 29,345 మంది ఓటర్లు ఉన్నారు. అయితే గ్రామాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానుల ఓట్లు తొలగిస్తున్నట్లు సమాచారం. అదే వారి పార్టీకి చెందిన కార్యకర్తల ఓట్లు డబుల్ ఎంట్రీలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వేర్వేరు చోట్ల ఓట్లు.. టీడీపీ రైతు సంఘం జిల్లా నాయకుడు ప్రభాకర్నాయుడుకి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నాలుగు ఓట్లు ఉన్నాయి. గుర్తు పట్టకుండా ఉండేందుకు యవ్వన దశలో ఉన్న ఫొటోలను ఓటరు జాబితాకు జతపర్చారు. ఆయన బంధువులు, అనుచరులకు సైతం శ్రీకాళహస్తి పట్టణం, పలు గ్రామాల్లో రెండు, మూడు ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇతను ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరుడు. ఈయన స్వగ్రామం మండలంలోని బోనుపల్లి. ప్రస్తుతం ఈదులగుంటలో నివాసం ఉంటున్నారు. ఓటరు జాబితాను పరిశీలించిన వైఎస్సార్సీపీ నాయకులు కైలాసగిరి కాలనీలో రెండు, ఈదులగుంటలో ఒకటి, బోనుపల్లిలో ఒక ఓటు ఉండటం గమనించారు. ♦ అదేవిధంగా బోనుపల్లికి చెందిన టీడీపీ నాయకులు రాజేంద్రనాయుడు, దినేష్కుమార్, శ్రీనివాసులు నాయుడు, రామానాయుడు, చంద్రశేఖర్ నాయుడు, ప్రమీల, కోలి రామానాయుడు, లలితమ్మ, రామ్మూర్తి, దీపిక, ఆదెమ్మ, విజయ తదితర 30 కుటుంబాలకు చెందిన వ్యక్తులకు బోనుపల్లి, ఈదులగుంట, కైలాసగిరి కాలనీల్లో ఓట్లు ఉన్నాయి. ♦ మండల వ్యాప్తంగా పూడి, పొయ్య, కారాకొల్లు తదితర గ్రామాల్లో భారీగా దొంగ ఓట్లు ఉన్నాయి. పట్టించుకోని అధికారులు.. అధికారులు దొంగ ఓట్లను పరిశీలించకుండా అధికార పార్టీ నాయకుల తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రతి ఎలక్షన్స్లో దొంగఓట్లను చేర్చి టీడీపీ ఎక్కువ మెజారిటీని పొందుతోంది. దొంగ ఓట్లను తొలగించకుండానే ఎలక్షన్స్కు ఎలా వెళతారని వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఓటుకు ఆధార్ లింక్ జత చేస్తే దొంగ ఓట్లను ఏరి వేయవచ్చని మాజీ ఎంపీపీ ప్రభాకర్రెడ్డి, బోనుపల్లి రవి, సీపీఎం మండల కార్యదర్శి గురవయ్య సోమవారం తహసీల్దారుకు యుగంధర్కు ఫిర్యాదు చేశారు. మండలంలో ఎన్ని దొంగ ఓట్లు ఉన్నాయో జాబితాను ఇస్తే వాటన్నింటిని తక్షణమే తొలగించే చర్యలు తీసుకుంటామని తహసీల్దారు హామీ ఇచ్చారు. -
ఓటరు నమోదుకు భారీగా దరఖాస్తులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఓటు హక్కు కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత మూడు నెలల్లో 1.90 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. ఇవన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అందిన దరఖాస్తులే. అధికారులకు నేరుగా మరో 30వేలకు పైగా అంది ఉంటాయని అంచనా. ఈనెల 4వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలామంది యువత ఆసక్తి చూపినట్లు తెలుస్తోంది. అత్యధికంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి నియోజకవర్గాల నుంచి 30వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులని అధికారులు విస్తృతంగా ప్రచారం చేయడం కలిసి వచ్చింది. అంతేగాక ఓటు నమోదు కోసం ఈనెల 2న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బూత్లెవల్లో క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన వారి నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. దీని ఫలితంగానే అధిక సంఖ్యలో దరఖాస్తులు అందినట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 80 వేల మంది కొత్తగా ఓటు హక్కు కోసం అందిన దరఖాస్తులను (ఫారం–6) అధికారులు వడబోస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉంటున్నారా లేదా అని ఆరాతీస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉంటే ఓటు హక్కు కల్పిస్తున్నారు. 1.90 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటివరకు 87 వేలకుపైగా ఆమోదించారు. వీటిలో 80 వేలకుపైగా ఓటర్ల వివరాలను జాబితాలో నమోదు చేశారు. 96 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్లో ఉండగా.. దాదాపు ఏడు వేల దరఖాస్తులను తిరస్కరించారు. భారీగా తొలిగింపు ఓటు హక్కు తొలగింపునకు 15 వేలకుపైగా ఓటర్లు దరఖాస్తులు సమర్పించారు. పట్టణ ప్రాంత, నగర శివారు నియోజకవర్గాలైన ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో బతుకుదెరువు కోసం వచ్చి నివసిస్తున్నారు. వీరంతా తమ సొంత నియోజకవర్గాల్లో ఓటు హక్కు పొందేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఓటును జాబితా నుంచి తొలగించుకున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో దరఖాస్తులు అధికంగా వచ్చాయని పేర్కొంటున్నారు. అంతేగాక కొందరు తమ నివాసాన్ని ఒక నియోజకవర్గం నుంచి మరొక అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోకి మార్చి ఉండొచ్చు. ఇటువంటి వారంతా ఓటు తొలగింపునకు ఫారం–7ను అందచేశారు. ఇప్పటివరకు 10వేల పైచిలుకు ఓట్లను తొలగించారు. అలాగే పేరు, ఇంటిపేరు, నివాస చిరునామా, పుట్టిన తేదీ తదితర చేర్పులు మార్పుల కోసం 25వేలకుపైగా దరఖాస్తులు అందాయి. పోలింగ్ స్టేషన్ మార్పు కోసం 4వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. 22న ముసాయిదా జాబితా కొత్తగా ఓటు నమోదు, పోలింగ్ స్టేషన్ మార్పు, తొలగింపులు, చేర్పులు, మార్పుల కోసం అందిన దరఖాస్తులను యంత్రాంగం పరిశీలిస్తోంది. ఇప్పటికే సగానికిపైగా పరిశీలించారు. ఈ ప్రక్రియ పూర్తికాగానే ఈనెల 22న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు. మొన్నటి శాసనసభ ఎన్నికల నాటికి జిల్లాలో 28.08 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కొత్తగా మరింత కొందరికి ఈ జాబితాలో చోటుదక్కే అవకాశం. ఫలితంగా జిల్లా ఓటర్ల సంఖ్య 29 లక్షల మార్క్ను దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
గవర్నర్కు వైఎస్ జగన్ ఫిర్యాదు
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్ల తొలగింపు, అవకతవకలపై ఆయన ఈ సందర్భంగా గవర్నర్కు ఫిర్యాదు చేశారు. అలాగే పోలీస్ అధికారుల నియామకాల్లోనూ అధికార దుర్వినియోగంపై వైఎస్ జగన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వైఎస్ జగన్తో పాటు గవర్నర్ను కలిసినవారిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. కాగా ఎన్నికలు సజావుగా జరగాలంటే డీజీపీ ఠాకుర్, ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు, డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్రావును వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాను ఢిల్లీలో వైఎస్ జగన్ కోరిన విషయం తెలిసిందే. -
బాబుతో ‘ఓటు’కు చేటు!
జనస్వామ్యాన్ని, పరిణత జన మనోగతాన్ని భ్రష్టు పట్టించడానికి కంకణం కట్టుకున్నట్టు ఇష్టానుసారం వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహారశైలిని వైఎస్సార్ కాంగ్రెస్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చింది. అటు ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడటం... ఇటు అధికార యంత్రాం గాన్ని దుర్వినియోగం చేస్తూ విపక్షాలను బెదిరించడానికి వినియోగించుకోవడంవంటి పనులకు పాల్పడుతున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని ఆ ప్రతినిధి బృందం ఈసీకి వివరించింది. పౌరులకు రాజ్యాంగం కల్పించిన శక్తిమంతమైన ఆయుధం ఓటు హక్కుకు తూట్లు పొడవడానికి చంద్రబాబు, ఆయన పరివారం బరి తెగిస్తున్నారు. అందుకు వారనుసరిస్తున్న విధానాలు విస్మయం కలిగిస్తాయి. ఎంతో నిశితంగా పరి శీలిస్తే తప్ప వీటినెవరూ పోల్చుకోలేరు. తెలుగుదేశం వెబ్సైట్లో అప్లోడ్ చేసిన ఓటర్ల జాబితా మరింత ఆశ్చర్యకరమైనది. ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగేవిధంగా వారి ఫొటోలు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. నిజానికి ఎన్నికల సంఘం పార్టీలకిచ్చే జాబితాల్లో ఓటర్ల ఫొటోలుండవు. మరి ఈ ఫొటోల జాబితా టీడీపీకి ఎలా వెళ్లిందో ఎన్నికల సంఘమే చెప్పాలి. ఓటర్ల జాబితాలను ఏమారుస్తున్న తీరును వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు ఒక సవాలుగా తీసుకుని పలు అక్రమాలను వెలికితీయగలిగాయి. ప్రతిపక్షానికి ఓట్లు వేస్తారని అనుమానం వచ్చిన వారి పేర్లను రకరకాల సాకులతో అధికారుల ద్వారా తొలగింప జేయటం, అది వల్లకాకపోతే సర్వేల పేరిట ఇంటింటికీ యువకులను పంపి విపక్ష మద్దతుదార్లని నిర్ధారించుకున్నవారి ఓట్లను గల్లంతు చేయడం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్లో నిరుడు సెప్టెంబర్ నాటికి ఉన్న 52.67 లక్షల నకిలీ ఓట్ల సంఖ్య ప్రస్తుతం దాదాపు 60 లక్షలకు చేరుకుంది. ఈ ఓట్లలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో నమోదైన ఓట్లు 20 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్లోనే రెండు వేర్వేరు చోట్ల స్వల్ప మార్పులతో నమోదైన ఓట్లు మరో 20 లక్షలున్నాయి. అదే సమయంలో 4 లక్షలమంది నిజమైన ఓటర్ల పేర్లు మాత్రం జాబితానుంచి గల్లంతయ్యాయి. ఇంటింటికీ తిరిగి ఒక యాప్ ద్వారా ఓట్లను తొలగిస్తున్నవారిని పట్టుకుని, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా దిక్కూ మొక్కూ లేని దుస్థితి ఏర్పడింది. సహేతుకమైన నిరసనలను పలు సాకులతో అణచేస్తున్న పోలీసులకు ఈ అక్రమాలేవీ తప్పనిపించడం లేదు. సర్వే చేయడానికి ఎవరి కైనా హక్కుంటుందని, దాన్ని అడ్డగించకూడదని సుద్దులు వల్లిస్తున్నారు. యాప్ ద్వారా ఓట్లు తొల గించే ఈ సర్వేలకు అక్రమార్కులు పెడుతున్న పేర్లు కూడా చిత్రమైనవి. ప్రజాసాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్, పీరియాడిక్ సర్వే వంటి పేర్లతో ఈ మారీచకాన్ని యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. విపక్షాలు ఓర్పుతో వ్యవహరించేంతవరకూ ఈ దొంగ సర్వేలపై పోలీసులకు ఫిర్యాదులు వెళ్తాయి. కానీ వాటిని బుట్టదాఖలా చేస్తున్నారని గ్రహించుకుని, తామే తేల్చుకోవాలనుకుంటే... అవి ఘర్షణలకు దారితీస్తే అందుకు బాధ్యులెవరు? కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సీపీఎం తదితర 23 పార్టీల నాయకులతో పాటు చంద్రబాబు కూడా సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఈవీఎంల పనితీరుపై వారు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లు ప్రవేశపెట్టడం వీలు కాదు గనుక 50 శాతం ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ల లోని రశీదులను లెక్కించి పోలైన ఓట్లతో వాటిని సరిపోల్చాలని వీరంతా కోరుతున్నారు. సలహా మంచిదే. కానీ తమ ప్రతినిధి బృందంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న టక్కుటమార విద్యల గురించి వీరంతా తెలియనట్టు నటించడం ఆశ్చర్యం కలిగి స్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ నిరుడు ఆగస్టు నుంచి వీటి గురించి అన్ని వేదికల నుంచీ గళం విని పిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్న తీరును శాస్త్రీయంగా నిరూపిస్తోంది. ఈ 23 పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆప్, బీఎస్పీలకు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభాగాలు న్నాయి. కనుక జాతీయ నేతలకు అక్కడేం జరుగుతున్నదీ తెలియదనుకోవడానికి లేదు. అయినా ఒక్క పార్టీ నాయకులైనా చంద్రబాబును ‘మరి మీరు చేస్తున్నదేమిట’ని ప్రశ్నించినట్టు లేరు. తన విశ్వసనీయత గురించి చంద్రబాబుకు ఏనాడూ పెద్దగా పట్టింపు లేదు. కానీ ఇతర పార్టీల నేతల కేమైంది? సొంత రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను భ్రష్టుపట్టిస్తున్న నాయకుడు తమతో ఉన్నందువల్ల ఎన్నికల సంఘం వద్ద నగుబాటు పాలవుతామని, తమ విశ్వసనీయత కూడా ప్రశ్నార్థకమవుతుం దని వీరెవ్వరికీ తోచలేదా? పీడగా మారిన పాలకుల్ని విరగడ చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో పౌరులకుండే ఏకైక ఆయుధం ఓటు. దాన్ని కరెన్సీ నోట్లు విరజిమ్మి, అందుకు లొంగరనుకున్నవారి పేర్లు ఓటర్ల జాబి తాల్లో గల్లంతు చేయించి, రకరకాల మార్గాల్లో ఆ జాబితాలను నకిలీ ఓట్లతో నింపి చంద్రబాబు అండ్ కో చేస్తున్న పనులు అత్యంత గర్హనీయమైనవి. ఒకపక్క నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు ఉదాహరణనని చంద్రబాబు తరచూ గొప్పలు చెప్పుకుంటారు. ఈమధ్యకాలంలో బీజేపీపై అలుపె రగని పోరాటం చేస్తున్నానని స్వోత్కర్షకు పోతూ ఆయన అన్ని రాష్ట్రాలూ తిరుగుతున్నారు. కానీ జరుగుతున్న అక్రమాలను, అధికార యంత్రాంగాన్ని బాహాటంగా దుర్వినియోగం చేస్తున్న తీరును ఎవరూ గమనించడం లేదని భ్రమపడుతున్నారు. ఈ విషయంలో ఎన్నికల సంఘం నిష్పాక్షికంగా దర్యాప్తు చేయించి తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎన్నికలను ప్రహసనప్రాయం చేయడానికి ప్రయ త్నించినవారిపై, వారు ఏ స్థాయివారైనా కఠిన చర్యలు తీసుకోవాలి. లేనట్టయితే ప్రజాస్వామ్యానికి అర్థం, పరమార్థం ఉండవు. -
పథకం ప్రకారం విపక్షం ఓట్ల తొలగింపు..
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార పక్షం కుయుక్తులు పన్నుతున్నట్లు స్పష్టమవుతోంది. ప్రభుత్వ పాలన ఎలా ఉందో వివరాలు సేకరిస్తున్నామంటూ ట్యాబ్లతో రకరకాల పేర్లతో పలుచోట్ల సర్వేలు నిర్వహిస్తున్న బృందాల సభ్యుల వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు బయటపడుతుండటం దీనికి బలం చేకూరుస్తోంది. బోగస్ బృందాలు గ్రామాల్లో తిరుగుతూ దశలవారీగా వివరాలు సేకరించి ఆధార్, ఓటరుకార్డు సంఖ్యలను ట్యాబ్ల్లో నమోదు చేస్తూ టీడీపీ సర్కారుకు సానుకూలం కాదని తేలిన పక్షంలో సర్వేలో పాల్గొంటున్న వారి ఓట్లను వెంటనే తొలగిస్తుండటం గమనార్హం. ట్యాబ్లో డిలీట్ బటన్ నొక్కగానే ఓటర్ల వివరాలు జాబితా నుంచి మాయమవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును తొలగించే అధికారం ఈ నకిలీ సర్వే బృందాలకు ఎలా వచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేవలం ఎమ్మార్వో స్థాయి అధికారికి మాత్రమే ఉండే అధికారాలను ట్యాబ్లతో తిరిగే టీడీపీ అనుకూల బృందాలకు అప్పగించడం ప్రజాస్వామ్య వ్యవస్థను రాష్ట్ర సర్కారు ఎలా అపహాస్యం పాలు చేస్తోందో రుజువు చేస్తోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. వైఎస్సార్ సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు సర్వేల పేరుతో అధికార పార్టీ నకిలీ బృందాలను రంగంలోకి దించినట్లు ఈ వ్యవహారాల ద్వారా స్పష్టమవుతోంది. ‘మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? ఎవరంటే ఇష్టం? ఏ పార్టీకి ఓటు వేస్తారు? సాక్షి టీవీ చూస్తారా? ఈటీవీ చూస్తారా?’ అంటూ సర్వే బృందాలు ప్రజల నాడి పసిగట్టి ప్రభావితం చేసేందుకు వివరాలు సేకరిస్తున్నాయి. దీనిపై వైఎస్సార్సీపీ శ్రేణులతోపాటు, ప్రజలు తిరగబడుతున్నారు. కొన్నిచోట్ల సర్వే బృందాలను అడ్డుకుని పోలీసులకు అప్పగిస్తున్నా వారిని వదిలిపెట్టాలంటూ అధికార పార్టీ నేతలు తీవ్రంగా ఒత్తిళ్లు తెస్తున్నారు. – సాక్షి నెట్వర్క్ విపక్ష మద్దతుదారుల ఇళ్ల వద్దే సర్వే.. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో పబ్లిక్ సర్వే పేరుతో జనవరి 25న వివరాలు సేకరిస్తున్న బెంగళూరుకు చెందిన యువకులను వైఎస్సార్సీపీ నాయకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లో వీరంతా వారం రోజుల పాటు పలు గ్రామాల్లో తిరిగారు. వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్ల వద్దకు మాత్రమే వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. కొత్తచెరువులో సర్వే చేస్తున్న కొందరు యువకులను వైఎస్సార్ సీపీ నేతలు పోలీసులకు అప్పగించారు. గుంతకల్లులో డిసెంబర్ 18న రహస్యంగా సర్వే నిర్వహిస్తున్న 40 మంది సభ్యులను కూడా పోలీసులకు అప్పగించారు. హిందూపురంలో స్పార్క్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్ అండ్ రిఫ్రెష్ సెంటర్ పేరిట టీడీపీ నాయకులే సర్వేలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ బూత్ కన్వీనర్లు, ప్రజలను ప్రభావితం చేసే నాయకుల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. హిందూపురంలో ఇద్దరు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు నేరుగా ఫోన్ చేసి బెదిరిస్తూ బేరసారాలకు దిగడంతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే ఎమ్మెల్యే బాలకృష్ణ ఒత్తిడి మేరకు సర్వే యువకులపై దాడి చేసినట్లు వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు బనాయించారు. నరసాపురంలో ఆధార్ వివరాలు అడుగుతూ... పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఓటరు జాబితాలను సర్వే చేస్తున్న ఓ బృందాన్ని 3 నెలల క్రితం స్థానికులు అడ్డుకున్నారు. 60 మంది యువకులతో కూడిన ఈ బృందం పట్టణంలోని ఓ హోటల్లో వారం పాటు మకాం వేసింది. ఓటు ఎవరికి వేస్తారు? మీ కులం ఏమిటి? అని ఆరా తీయడంతోపాటు ఆధార్ వివరాలు సేకరిస్తుండటంతో అనుమానించిన స్థానికులు వారిని పోలీస్స్టేషన్లో అప్పగించారు. భారత్ టెలీసర్వీస్ కంపెనీ నుంచి తాము సర్వే చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వారిని విచారించిన అనంతరం పోలీసులు విడిచిపెట్టారు. సర్కారుకు వ్యతిరేకంగా సమాధానాలిస్తే ఓట్లు గల్లంతే వైఎస్సార్ జిల్లా పాత కడపలో సర్వే పేరుతో ఓట్లు తొలగిస్తున్న నరేష్, రవి, జగదీష్, సురేష్, బాబు, అశోక్కుమార్ అనే ఆరుగురు యువకులను శుక్రవారం రాత్రి స్థానికులు పట్టుకున్నారు. వారి దగ్గరి నుంచి ట్యాబ్లు స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించారు. వీరంతా అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందినవారుగా చెబుతున్నారు. పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ తరపున సర్వే కోసం తమను నియమించారని, నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇస్తామని చెప్పారని వారు పేర్కొంటున్నారు. వీరివద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేవు. మూడు దశల్లో ఈ సర్వే సాగుతోంది. ఓటరు కార్డు నంబర్ చెబితే సంబంధిత వ్యక్తుల ఇంట్లో ఉన్న ఓటర్ల వివరాలు అందులో కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి అనుకూలంగా సమాధానాలు ఇవ్వని పక్షంలో మూడో దశలో వారి ఓట్లన్నీ తొలగించి నిష్క్రమిస్తున్నట్లు వెల్లడవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఓటమి భయంతోనే ఈ దొంగ సర్వేలు నిర్వహిస్తూ ఓట్లను తొలగిస్తున్నారని 1వ డివిజన్ కార్పొరేటర్ ఇసుకపల్లి చైతన్య, 47వ డివిజన్ కార్పొరేటర్ పాకా సురేష్కుమార్ ఆరోపించారు. గత ఎన్నికల్లో కడపలో వైఎస్సార్ సీపీకి అత్యధిక మెజార్టీ రావడంతో 1.25 లక్షల ఓట్లను తొలగించారన్నారు. ఓటర్ల జాబితా వివరాలు సర్వే బృందాలకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సర్వే చేసేందుకు వచ్చిన యువకులను చుట్టుముట్టిన వైఎస్సార్ జిల్లా చింతకుంట గ్రామస్తులు మైదుకూరు మండలంలో అడ్డుకున్న స్థానికులు.. వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం చింతకుంట, బయపనల్లె, సంగటి తిమ్మాయపల్లె, మీర్జాఖాన్పల్లె తదితర గ్రామాల్లో పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్ ఐడీ కార్డులతో సంచరించిన కొందరు యువకులు ట్యాబ్ల్లో వివరాలు నమోదు చేసేందుకు ప్రయత్నించడం శుక్రవారం కలకలం రేపింది. ట్యాబ్ల్లో ఓటర్ల వివరాలు ఉండటాన్ని గుర్తించిన స్థానికులు వారిని అడ్డుకున్నారు. తమ ఓట్లు తొలగించేందుకే గ్రామాల్లోకి వచ్చారని గ్రామస్తులు మండిపడ్డారు. సర్వే బృందాలను పంపిన కంపెనీ నిర్వాహకులు తమ గ్రామానికి వచ్చేవరకు వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. అయితే సాయంత్రం వరకు కంపెనీ ప్రతినిధులు ఎవరూ అక్కడకు రాకపోవడం గమనార్హం. ఒక్కో బూత్లో 25 మందిని సర్వే చేస్తే తమకు రూ.800 చొప్పున చెల్లిస్తారని సర్వే బృందం వెల్లడించింది. ఓటర్ల వివరాలన్నీ ట్యాబ్లో నిక్షిప్తం చేయడాన్ని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డికి గ్రామస్తులు ఫోన్ ద్వారా తెలిపారు. ట్యాబ్ల్లో ఓటర్ల జాబితాలు... వైఎస్సార్ జిల్లా సిద్దవటంలో సర్వే పేరుతో వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన నరసింహులు అనే వ్యక్తిని స్థానికులు శుక్రవారం పోలీసులకు అప్పగించారు. పీపుల్స్ సర్వే పేరుతో ట్యాబ్తో తిరుగుతూ ఓటరు కార్డు, ఆధార్ కార్డు ఇవ్వాలని అడగడంతో అనుమానించిన గ్రామస్థులు అతడిని పోలీసులకు అప్పగించారు. ట్యాబ్లో సిద్దవటంకు చెందిన ఓటర్ల జాబితా మొత్తం ఉందని స్థానికులు తెలిపారు. ఏ పార్టీకి ఓటేస్తారంటూ ఆరా రాజంపేట మండలం తాళ్లపాకలోనూ రెండురోజుల క్రితం ఇద్దరు యువకులు సర్వే పేరుతో ఇంటింటికి వెళ్లి ఫోన్ నంబర్, ఓటరు కార్డు వివరాలను సేకరించారు. ఏ పార్టీకి ఓటు వేస్తారంటూ ఆరా తీశారు. వీరి వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉండండంతో గ్రామస్తులు వారిని పోలీసులకు అప్పగించారు. తాళ్లపాక, ఎల్లాగడ్డతో పాటు పలు గ్రామాల్లో సర్వే బృందాలు సర్వే చేస్తున్నాయి. రాజంపేట పట్టణం మన్నూరులో వైఎస్సార్సీపీ సానుభూతిపరులను గుర్తించి ఓట్లను తొలగించేందుకు సర్వే బృందాలు చేస్తున్న ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. కర్నూలులో బోగస్ సర్వే... 29 వేల ఓట్ల తొలగింపు! కర్నూలు జిల్లాలో వైఎస్సార్ సీపీ మద్దతుదారుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా పలు నియోజకవర్గాల్లో బోగస్ సర్వేలు జరుగుతున్నాయి. ఎమ్మిగనూరుతోపాటు కడిమెట్ల, ఎర్రకోట, గుడేకల్, కొటేకల్ తదితర గ్రామాల్లో ముగ్గురు నలుగురితో కూడిన సర్వే బృందం సంచరిస్తోంది. వీరిని స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. సర్వే బృందాలు వివరాలను నమోదు చేసుకుంటున్న ట్యాబ్లలో ఓటర్ల తొలగింపు ఆప్షన్ ఉన్నట్లు సమాచారం. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం చెరుకులపాడు, గోవర్ధనగిరి, ఎల్.బండ, వెల్దుర్తి, రత్నపల్లె, బొమ్మిరెడ్డిపల్లె, కృష్ణగిరి మండలం టి.గోకులపాడు, ఎస్.హెచ్.ఎర్రగుడి, ఎరుకలి చెరువు గ్రామాల్లో బోగస్ సర్వేలు జరిగాయి. వెల్దుర్తి మండలంలో 12 వేల ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం గజ్జహల్లి, హెబ్బటం గ్రామాల్లో నకిలీ సర్వే బృందాలను వైఎస్సార్సీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హాలహర్వి మండలం నిట్రవట్టి గ్రామంలో బోగస్ సర్వే జరిగింది. మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం రౌడూరు, కామవరంలోనూ నకిలీ బృందాలు సర్వే చేశాయి. ఆదోని, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లోనూ ఈ సర్వేలు జరిగాయి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో బోగస్ సర్వేలతో 29 వేల ఓట్లను తొలగించినట్లు తెలుస్తోంది. ‘తూర్పు’ సర్వే బృందాల వద్ద టీడీపీ గుర్తింపు కార్డులు విపక్షం ఓట్లను తొలగిస్తున్న ఓ బృందాన్ని తూర్పు గోదావరి జిల్లాలో పార్టీ శ్రేణులు నవంబరు 12వ తేదీన అడ్డుకున్నాయి. అంబాజీపేట, రాజోలు మండలాల్లోని మాచవరం, వాకలగరవు గ్రామాల్లో 11 మంది యువకులు రెండు బృందాలుగా సర్వే నిర్వహించారు. మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆరుగురు యువకులను వైఎస్సార్సీపీ నేతలు నిలదీయడంతో ‘సోషియో పొలిటికల్ ఎనాలసిస్’ (స్పా) సంస్థ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వారిని గుర్తింపు కార్డులు చూపాలని కోరడంతో జి.సాయి, గణేష్, నరేంద్ర, రాహుల్ మణికంఠ, వెంకటేశ్వరరావులుగా పేర్లు చెప్పుకున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలిచ్చారు. వారి వెంట వచ్చిన మిగతావారు జారుకోవడంతో అనుమానించిన స్థానికులు ఈ బృందాన్ని అంబాజీపేట పోలీస్ స్టేషన్లో అప్పగించి ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు తాటిపాకలోని సాయితేజ లాడ్డిలో తనిఖీలు చేయగా ‘స్పా’ బృంద సభ్యులు అక్కడ ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు, ల్యాప్ట్యాప్, ట్యాబ్లు బయట పడటం గమనార్హం. ఈ సర్వే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించడంతో ఓ వ్యక్తి పరారైనట్లు వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు తెలిపారు. గుంటూరు జిల్లాలో 4 నెలలుగా సంచారం... వైఎస్సార్ సీపీ అభిమానుల ఓట్ల తొలగింపే లక్ష్యంగా గుంటూరు జిల్లాలో గత నాలుగు నెలలుగా సర్వే బృందాలు తిరుగుతున్నాయి. గత ఏడాది అక్టోబర్లో సర్వే పేరుతో విపక్షం ఓట్లను తొలగిస్తున్న స్పా (సెంటర్ ఫర్ సోషియో పొలిటికల్ ఎనాలసిస్) బృందం సభ్యులు గుంటూరు తూర్పు, మంగళగిరి, పెదకూరపాడు, తెనాలి, వినుకొండ నియోజకవర్గాల్లో పట్టుబడ్డారు. అయితే ఆ మరుసటి రోజే పోలీసులు వారిని వదిలేశారు. తెనాలి నియోజకవర్గం సంగంజాగర్లమూడిలో సర్వేల పేరుతో ఓట్లు తొలగిస్తున్న స్పా సంస్థ సభ్యులను పట్టుకుని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నాయకులపై గత నవంబర్ నెలలో కేసులు నమోదు చేయడం గమనార్హం. వాట్సాప్ డీపీలో లోకేష్ ఫొటో : ‘స్పా’ సంస్థ తరఫున సర్వే చేస్తున్న యువకుల వాట్సప్ గ్రూప్లో మంత్రి నారా లోకేష్ ఫొటో డీపీగా ఉండటం గమనార్హం. ఇటీవల గురజాల నియోజకవర్గం జంగమహేశ్వరపురంలో సర్వే పేరుతో వివరాలు సేకరిస్తున్న టీడీపీ బూత్ కమిటీ సభ్యుడు యలమందను స్థానికులు అడ్డుకున్నారు. అతడిని ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యెనుముల మురళీధర్రెడ్డి, మాజీ ఎంపీపీ అమరారెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం గమనార్హం. నోట్బుక్లో టీడీపీ కార్యకర్తల వివరాలు... యూట్యూబ్ చానల్ సర్వే పేరుతో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవిలో ఇల్లిల్లూ తిరుగుతూ సర్వే చేస్తున్న ముగ్గురు వ్యక్తులను వైఎస్సార్సీపీ కార్యకర్తలు శుక్రవారం అడ్డుకున్నారు. సోషల్ సర్వేయర్ పేరుతో చింతాల అనీల్కుమార్ అనే యువకుడు వివరాలు సేకరిస్తున్నట్లు గుర్తించారు. అయితే అతడి వద్ద ఉన్న నోట్బుక్ను పరిశీలించగా అందులో టీడీపీ కార్యకర్తల పేర్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. దీంతో అనుమానించిన వైఎస్సార్ సీపీ మండల బూత్ కమిటీ కన్వీనర్ షేక్ మస్తాన్, కోఆప్షన్ సభ్యుడు బషీర్లు అతడిని స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించారు. గ్రామాల్లో అనుమానాస్పదంగా సంచరించవద్దని పోలీసులు అతడిని హెచ్చరించి పంపేశారు. ఎన్డీటీవీ తరపున అంటూ... : గతేడాది నవంబర్ 1వ తేదీన ఇదే జిల్లా మనుబోలు మండలం మడమనూరు గ్రామంలో ఎన్డీటీవీ తరపున ఎన్నికల సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పుకుంటున్న నూర్అహ్మద్ అనే వ్యక్తి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేస్తుండటంతో అనుమానించిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పార్టీ నేత ఆనం రాంనారాయణరెడ్డి సూచనల మేరకు పోలీసులకు అప్పగించారు. -
ఓటు మీ హక్కు.. వినియోగించుకోండి
సాక్షి, హైదరాబాద్: ఓటరు జాబితాలో పేరు నమోదు.. పొరపాట్ల సవరణ.. చిరునామా మార్పు తదితరాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా అది ప్రజలందరికీ చేరడం లేదని, వీటిపై వారందరికీ అర్థమయ్యేలా సరళమైన తెలుగుభాషలో ఓటరు నమోదుపై చైతన్యం కలిగేలా ఇంటింటికీ పోస్టుకార్డుల పంపిణీని చేపట్టామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ తెలిపారు. అంతే కాకుండా తమవైపు నుంచి ప్రజలకు చేరవేస్తున్న సమాచారంతోపాటు వారి నుంచి ఫీడ్బ్యాక్ తెలుసుకునేందుకు కూడా ఉపకరిస్తుందని సీఈఓ చిరునామాతో రిప్లయ్ పోస్టుకార్డుతో కూడిన లేఖలను పంపామన్నారు. ‘ఓటు మీ హక్కు.. ఓటు వేయడం మీ బాధ్యత’అంటూ రజత్కుమార్ స్వీయ సంతకంతో కూడిన లేఖల్ని రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే మేరకు రాష్ట్రంలోని కోటి ఐదు లక్షల కుటుంబాలకు చేరేలా వీటిని పంపించి నట్లు తెలిపారు. సంక్రాంతికన్నా ముందుగానే పంపాలనుకున్నప్పటికీ, ఆలోగా అన్ని పోస్టుకార్డుల్ని పోస్టల్శాఖ తమకు సమకూర్చలేకపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటు పోయిందని, ఓటు వేయలేకపోయాని పలువురు వేదన వ్యక్తం చేయడంతో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా ఉండేందుకు ఈ లేఖలు ఉపకరించగలవన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలోచన రావడానికి కారణం.. ప్రజల నుంచి వస్తున్న స్పందన గురించి గురువారం రజత్కుమార్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఓటర్ల ఇళ్ల వద్దకుబూత్స్థాయి అధికారులు రాష్ట్రంలోనే కాకుండా ముఖ్యంగా నగరంలో బీఎల్ఓలు (బూత్స్థాయి అధికారులు) తమ ఇళ్లకు రాలేదని, ఇంటింటికీ సర్వే చేయకుండానే ఓట్లు తొలగించారని పలువురు తమ దృష్టికి తేవడంతో ఈ రకంగానైనా బీఎల్ఓలు ప్రతీ ఇంటికీ వెళ్తారనే ఉద్దేశంతోనూ తిరుగు పోస్టుకార్డుతో కూడిన లేఖల పంపిణీని బీఎల్ఓల ద్వారా చేపట్టామన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి లేఖను ఇవ్వడంతోపాటు వారి నుంచి అకనాలెడ్జ్మెంట్కూడా తీసుకోవాల్సి ఉన్నందున కచ్చితంగా వెళతారనే ధీమా వ్యక్తం చేశారు. ఈ రకంగానైనా బీఎల్ఓలకు, ఓటర్లకు మధ్య సంబంధం ఏర్పడుతుందన్నారు. తమ లక్ష్యాన్ని నూరు శాతం పూర్తిచేసేవారికి ప్రోత్సాహక బహుమతులిచ్చే ఆలోచన ఉందని చెప్పారు. లేఖలకు ఓటర్ల నుంచి ధన్యవాదాలు లేఖలు పంపినందుకు ధన్యవాదాలు అంటూ ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, తాను దాదాపు వంద లేఖల్ని చదివానని తెలిపారు. కొందరు ఖాలీ రిప్లయ్ కార్డులు కూడా పంపారని, చాలామంది ఎపిక్కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారన్నారు. ప్రకటనల కోసం చేస్తున్న ఖర్చులో భాగంగానే ఇంటింటికీ పోస్టుకార్డు పంపినట్లు తెలిపారు. వాట్సాప్ మెసేజ్లు, ఎస్ఎంఎస్ల గురించి కూడా ప్రస్తావన వచ్చినప్పటికీ, బీఎల్ఓలు ప్రజలను నేరుగా కలుసుకునేందుకు పోస్టుకార్డుల్ని పంపిణీ చేశామన్నారు. ఉర్దూ చదివే వారికోసం ఉర్దూలోనూ ఈ లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. ఓటు నమోదుపై ప్రజలకు ఏమాత్రం అవగాహన లేదనడం కూడా సరికాదని, అసెంబ్లీ ఎన్నికల ముందు రెండునెలల్లో ఇరవై లక్షలమందికి పైగా నమోదు చేసుకున్నారని చెప్పారు. దివ్యాంగులు, థర్డ్జెండర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు చేపట్టిన కార్యక్రమాలు అసెంబ్లీ పోలింగ్లో మంచి ఫలితమిచ్చాయని చెప్పారు. వివరాలతో లేఖలు.. ఓటరు నమోదుపై చాలామందికి సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేసేందుకూ, వారికి సులభంగా అర్థమయ్యేలా కొత్తగా పేరు నమోదు చేసుకోవాలంటే ఏ ఫారం నింపాలి.. చిరునామా మారితే ఏ ఫారం భర్తీచేయాలి.. పొరపాట్ల సవరణకు ఏ ఫారం వినియోగించాలో లేఖలో వివరించామన్నారు. ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేయవచ్చో కూడా తెలిపామన్నారు. పోలింగ్కు ముందు నామినేషన్ల గడువు వరకు ఓటరు జాబితాలో ఎప్పుడైనా పేరు నమోదు చేసుకోవచ్చునని, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రం ఇప్పుడే సరిచూసుకోవాలని రజత్కుమార్ ప్రజలను కోరారు. ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే ఓటు వేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. -
ఏపీలో 59.18 లక్షల అక్రమ ఓటర్లు
-
రాష్ట్రంలో ఓటర్లు 3.69 కోట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 3,69,33,091కు చేరింది. కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రత్యేక సవరణ(ఎస్ఎస్ఆర్)–2019 అనంతరం తుది ఓటర్ల జాబితాను శుక్రవారం ప్రకటించింది. దీనిప్రకారం రాష్ట్రంలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. తుది ఓటర్ల జాబితాలో 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరిలో 2,520 మంది ప్రవాసాంధ్ర(ఎన్ఆర్ఐ) ఓటర్లు కూడా ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించినందున ఎస్ఎస్ఆర్–2019 తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సీఈఓ) కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓటర్ల జాబితాలో ప్రజలు తమ పేరు ఉందో లేదో వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని, ఎవరి పేర్లయినా లేకపోతే నమోదు కోసం ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ముఖ్య ఎన్నికల అధికారి ఆర్.పి.సిసోడియా సూచించారు. ఓటర్ల నమోదు కోసం ఆన్లైన్లో గానీ, ఆఫ్లైన్ (నేరుగా) గానీ ఫారం–6 సమర్పించవచ్చని పేర్కొన్నారు. నామినేషన్ల చివరి రోజు వరకూ అర్హులు ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. - ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,74,58,240 మంది పురుషులు, 1,77,33,676 మంది మహిళలు, 3,344 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం 3,51,95260 మంది ఓటర్లు ఉండగా ఎస్ఎస్ఆర్–2019 తుది జాబితాకు వచ్చేసరికి 1,83,24,588 మంది పురుషులు, 1,86,04,742 మంది మహిళలు, 3,761 మంది ట్రాన్స్జెండర్లు కలిపి మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091కి పెరిగింది. - ప్రవాసాంధ్ర ఓటర్ల సంఖ్య ముసాయిదా ఓటర్ల జాబితాలో 15 మాత్రమే ఉండగా, తుది జాబితాకు వచ్చే సరికి 2,520కి చేరింది. - తుది ఓటర్ల జాబితాలో 18–19 మధ్య వయస్కులు 5,39,804 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,11,059 మంది, మహిళలు 2,28,625 మంది, ట్రాన్స్జెండర్లు 120 మంది ఉన్నారు. - తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు. - శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మాత్రమే మహిళా ఓటర్ల కంటే పురుష ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మిగిలిన 11 జిల్లాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉండడం గమనార్హం. - ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన తర్వాత 21,24,525 మంది కొత్తగా ఓటర్ల జాబితాలో చేరగా, 3,86,694 మంది పేర్లను తొలగించారు. - ముసాయిదా జాబితా ప్రకటన తర్వాత 18–19 వయస్కులు 5,03,516 మంది ఓటర్లుగా నమోదయ్యారు. -
ఏపీ ఓటర్ల తుది జాబితా ప్రకటించిన ఈసీ
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్ప ఓటర్లు(17,33,667) ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది. జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య జిల్లా పేరు ఓటర్ల సంఖ్య శ్రీకాకుళం 20,64,330 విజయనగరం 17,33,667 విశాఖ పట్నం 32,80,028 తూర్పు గోదావరి 40,13,770 పశ్చిమ గోదావరి 30,57,922 కృష్ణా 33,03,592 గుంటూరు 37,46,072 ప్రకాశం 24,95,383 నెల్లూరు 22,06,652 కడప 20,56,660 కర్నూలు 28,90,884 అనంతపురం 30,58,909 చిత్తూరు 30,25,222 -
ఆదిలాబాద్లో ఇక సహకార పోరు
సాక్షి, మంచిర్యాల అగ్రికల్చర్: ఇటీవలే అసెంబ్లీ ఎన్ని కలు నిర్వహించిన ప్రభుత్వం జనవరిలో పంచా యతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. వీటి తర్వాత ఫిబ్రవరిలో ‘సహకార’ పోరుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే ఫిబ్రవరి 15వ తేదీలోగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ఫ్యాక్స్) ఎన్నికలు నిర్వహించనుంది. గురువారం రాష్ట్ర సహకార సంఘాల కమిషనర్, రిజిస్త్రార్ ఆదేశాలతో ఉమ్మడి జిల్లాలోని సహకార శాఖ అధికారులకు ఓటరు జాబితా ప్రక్షాళన పని ప్రారంభించారు. ఈ నెల 14న సంఘ కార్యాలయాల్లో, గ్రామపంచాయతీ, మండల కార్యాలయాల్లో మొదటి ఓటరు జాబితాను అంటించనున్నారు. వీటిపై అభ్యంతరాలకు 21వ తేదీ వరకు గడువు విధించారు. సంఘాల్లో ఏవైనా కేసులు, సంఘంలో చేరి ఏడాది పూర్తి కానివారు, ఓటరు జాబితాలో పరిశీలించిన తర్వాత 28న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 76 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో గత ఎన్నికల్లో 1.20 లక్షల మంది రైతులకు సభ్యత్వం ఉంది. గత పాలకవర్గాల పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. 4వ తేదీ నుంచి ఆరు నెలలపాటు పాలకవర్గాల పదవీకాలన్ని ప్రభుత్వం పొడిగించింది. సహకార సంఘాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొన్న వారి స్థానంలో ప్రత్యేక అధికారులు నియమించింది. వీరు సహకార కమిషన్ కార్యాలయానికి వెళ్లి పదవీకాలన్ని పొడిగించుకున్నారు. ఆగస్టు నెలతో ఆరునెలల గడువు ముగియడంతో తిరిగి మళ్లీ ఆరు నెలలపాటు పదవీకాలన్ని పొడిగించారు. ఫిబ్రవరితో ముగియనున్న గడువు సహకార సంఘాల పాలకవర్గాలకు ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన గడువు వచ్చే ఫిబ్రవరి 3వ తేదీతో ముగిస్తుంది. దీంతో ఫిబ్రవరి 5 నుంచి 15వ తేదీ లోగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేపడుతున్నారు. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఫ్యాక్స్ ఓటర్ల జాబితాలో సమూలంగా మార్చేస్తున్నారు. ఇంతకాలం అడ్డగోలుగా సభ్యత్వం తీసుకున్న వారిని తొలిగించేందుకు చర్యలు చేపట్టారు. గతంలో రూ.10 చెల్లించి సభ్యత్వం పొందగా, ఇప్పుడు సభ్యత్వ రుసుం రూ.300కు పెంచారు. రూ.10తో సభ్యత్వం తీసుకున్న వారు సభ్యులుగా కొనసాగే అవకాశం ఉన్నా.. ఓటు వేసే హక్కు ఉండదు. దీంతో పాటు ప్రతి సభ్యుడి ఫొటో, గుర్తింపుకార్డు వివరాలను ఓటరు జాబితాలో ముద్రించారు. ఈ నెల 14వ తేదీన అన్ని సంఘాల కార్యాలయాల వద్ద ఓటరు జాబితాను అతికించనున్నారు. ఇప్పటివరకు సీఈఏ అనే వ్యవస్థ లేకపోగా, ఇప్పుడు ఓటర్ల జాబితాలను ఫొటోలతో సహకార రిజిస్ట్రార్ కార్యాలయానికి పంపి ఆమోదం పొందాల్సి ఉంటుంది. రాష్ట్రస్థాయిలో జాబితాలను వెల్లడించి వాటిపై అభ్యంతరాలను ఈ నెల 22వ తేదీ వరకు స్వీకరించి మళ్లీ మార్పులు చేస్తారు. ఈ విధానం ఫ్యాక్స్తో పాటు ఇతర సంఘాలకు వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకుని ఏడాది గడువులోగా తిరిగి చెల్లించని వారి పేర్లను సహకార బ్యాంకులు ఎగవేతదారుల పేర్లు జాబితాలో పెడితే వారికి ఓటు హక్కు ఉండదు. జిల్లాల వారిగా సహకార సంఘాలు, సభ్యులు జిల్లా సంఘాలు సభ్యులు ఆదిలాబాద్ 28 53,391 మంచిర్యాల 20 23,056 నిర్మల్ 16 25,430 కుమురంభీం 12 18,167 మొత్తం 76 20,044 ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నాం.. సహకారం సంఘాల పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరితో ముగిస్తుంది. ఇప్పటికే రెండుమార్లు పదవీకాలం పొడిగించడం జరిగింది. దీంతో వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు సహకార శాఖ కమిషనర్, రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి ఓటరు జాబితా ప్రక్షాళనకు ఆదేశాలు వచ్చాయి. ఈ నెల 28వ తేదీ వరకు తుది ఓటరు జాబితాను సిద్ధం చేసి ఫిబ్రవరి 15వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.– బి.సంజీవ్రెడ్డి, మంచిర్యాల, కుమురంభీం జిల్లాల సహకార శాఖ అధికారి -
ఎన్నికల్లో ధన ప్రవాహం పెరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నికల్లో ధనప్రవాహం పెరుగుతోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో రూ.76 కోట్లు సీజ్ చేయగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే రూ.112 కోట్లు పట్టుబడ్డాయి. డబ్బు ప్రవాహాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నా ఆగడంలేదు, ప్రజల్లో మార్పు వస్తేనే అడ్డుకట్ట సాధ్యమవుతుంది’అని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ అన్నారు. ‘ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు శ్రమిస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను పక్కాగా నిర్వహించడంతోపాటు ప్రచారక్రమంలో రాజకీయపార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చాం. సీ–విజిల్ ద్వారా వచ్చే ఫిర్యాదులను క్షణాల్లో పరిష్కరిస్తున్నాం. ఇప్పటివరకు 6,858 కేసులు నమోదుకాగా 4,967 కేసులు పరిష్కరించాం’అని వివరించారు. సోమవారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. మీడియాసభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు బదులిచ్చారు. వచ్చే ఏడాది జరగాల్సిన ఎన్నికలు ముందస్తుగా రావడంతో ఏర్పాట్లు వేగవంతంగా చేస్తున్నామని, సాధారణంగా ఎన్నికల ఏర్పాట్లు ఏడాది ముందు నుంచే మొదలవుతాయని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోలపై డిక్లరేషన్ తీసుకున్నాం... ఓటర్లజాబితా, ఎన్నికల విధులకు హాజరయ్యే సిబ్బంది శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం జోడించి ఎన్నికల ఏర్పాట్లు వంటివి చేపట్టినట్లు రజత్ కుమార్ తెలిపారు. ఎన్నికల్లో డబ్బు ఖర్చు విపరీతంగా పెరుగుతోందని, అభ్యర్థుల ఖర్చుపై పరిమితి ఉన్నప్పటికీ, రాజకీయ పార్టీల ఖర్చుపై పరిమితి లేదన్నారు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలపై అఫిడవిట్ కోరామని, డిక్లరేషన్ సైతం తీసుకున్నామని చెప్పారు. మేనిఫెస్టోలోని హామీల అమలుపై చాలెంజ్ చేయొచ్చన్నారు. ఓటరు జాబితాలో 4.32 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, 3.8 లక్షల ఓటర్లు చనిపోవడంతో వారి ఓట్లను తొలగించామని ఆయన తెలిపారు. అసెంబ్లీ రద్దు తరువాత ఆర్నెళ్లలోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని, దీంతో పార్టీలు, అభ్యర్థుల అఫిడవిట్లు తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ లోతైన విశ్లేషణ చేసే అవకాశం ఉండదన్నారు. ఎన్నికలు, ఫలితాలపై ఇప్పట్నుంచే బెట్టింగ్ జరుగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలోకి రాదని, పోలీస్ శాఖ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో 38 అసెంబ్లీ నియోజకవర్గాలు సున్నితమైనవిగా గుర్తించామని, కొడంగల్లో శాంతిభద్రతలను కాపాడాలని పోలీసులను ఆదేశించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,306 కేసులను పెయిడ్ న్యూస్ కింద బుక్ చేశామని, విచారణలో నిజమని తేలితే ఆ ఖర్చును అభ్యర్థుల ఖాతాలో వేస్తామన్నారు. ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదు... ఎన్నికల సంఘం ఎవరిపక్షం కాదని, తటస్థంగా వ్యవహరిస్తుందని రజత్కుమార్ స్పష్టం చేశారు. ఈవీఎంలతోపాటు కొత్తగా వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెచ్చామని, ఓటు ఎవరికి వేశామనేది వీవీప్యాట్లో స్పష్టమవుతుందని, ఎవరైనా చాలెంజ్ చేసినప్పుడు దీని ఆధారంగా నిర్ధారిస్తామన్నారు. ప్రచారపర్వంలో నిబంధనల ఉల్లంఘనలు తదితర అంశాలపై సి విజిల్ ద్వారా నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో 2.80 కోట్ల మంది ఓటర్లున్నారని, ఇందులో 1.41 కోట్ల మంది పురుషులు, 1.39 కోట్ల మంది మహిళలు, 2,691 మంది ఇతరులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అత్యధికంగా శేరిలింగంపల్లిలో 5.70 లక్షలు, అతి తక్కువగా భద్రాద్రి నియోజకవర్గంలో 1.37 లక్షల ఓట్లు ఉన్నాయన్నారు. భద్రాద్రిలోని పలు గ్రామాలు ఏపీలో విలీనం కావడంతో ఓట్లు తగ్గినట్లు చెప్పారు. ఈ ఎన్నికల్లో 4.57 లక్షల మంది దివ్యాంగులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారని, వారి కోసం ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఎన్నికల్లో 1,821 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, అధికంగా మల్కాజ్గిరిలో 42 మంది, తక్కువగా బాన్సువాడలో ఆరుగురు పోటీలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 32,700 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. గతేడాది నవంబర్తో పోలిస్తే ఈసారి 36.5 శాతం మద్యం అమ్మకాలు తగ్గాయని చెప్పారు. ఎగ్జిట్ పోల్స్ ఏడోతేదీ సాయంత్రం 5.30 గంటల తర్వాత విడుదల చేయొచ్చన్నారు. -
ఐదేళ్ల బాలికకు ఓటు.. ఆమెకు భర్త కూడా..!
సాక్షి, అమరావతి: ఆ పాప పుట్టి ఇంకా ఏడాది కూడా నిండలేదు. కానీ ఓటు హక్కు వచ్చేసింది. ఇంకో పసిబిడ్డ వయసు ఏడాదే. కానీ, కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్లు ఆ బిడ్డ పుట్టుకతోనే ఓటు హక్కుతో జన్మించింది. మరో బాలిక వయసు ఐదేళ్లే. ఆమెకు ఓటు హక్కుతోపాటు 50 ఏళ్ల భర్త కూడా ఉన్నాడట! రాష్ట్రంలో ఓట్ల నమోదు ప్రక్రియలో చిత్ర విచిత్రాలివీ. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలను పరిశీలిస్తే దిమ్మతిరిగే నిజాలు బయటపడతాయి. అధికార పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చి, లక్షల సంఖ్యలో అక్రమ ఓట్లను నమోదు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 52.67 లక్షలకు పైగా నకిలీ ఓట్లున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘానికి(ఈసీ) ఫిర్యాదులందాయి. తప్పుడు వయసు సమాచారంతో ఎన్నో ఓట్లు నమోదైనట్లు తేలుతోంది. వివిధ రకాలుగా నకిలీ ఓట్లు 25 లక్షలకు పైగా ఉన్నట్లు ఎన్నికల సంఘం కూడా ధ్రువీకరిస్తూ ఆ జాబితాను జిల్లాల వారీగా విడుదల చేసింది. బొడ్డూడని చిన్నారులూ ఓటర్లే దేశంలో ఎవరికైనా ఓటు హక్కు రావాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలి. కానీ, ఆంధ్రప్రదేశ్లో ఈ నిబంధనను లెక్కచేయకుండా ఇష్టారాజ్యంగా ఓటు హక్కు కల్పించారు. నెల్లూరు నగరానికి చెందిన పేరూరి సాయికుమార్ వయసు కేవలం ఏడాదే కాగా ఆతడి పేరిట ‘జెడ్ఏఎఫ్1714971’ ఓటర్ ఐడీ నెంబర్తో ఓటు హక్కు కల్పించారు. తూ.గో. జిల్లా తునికి చెందిన ఐదేళ్ల బాలిక టి.దివ్య ఓటరుగా నమోదైంది. కర్నూలు జిల్లా పాణ్యం పట్టణానికి చెందిన హుస్సేన్ సాహెబ్ వయసు 17 ఏళ్లు. ఆతడికి ‘ఎన్కేడీ0190108’ ఐడీ నెంబర్తో ఓటు ఉంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన బాలికకు ఐదేళ్లు నిండకుండానే ఓటు హక్కు కల్పించడమే కాకుండా ఆమెకు భర్త కూడా ఉన్నట్లు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలోని జె.రామలక్ష్మి అనే ఏడాది పసిపాపకు ఓటు హక్కు కల్పిస్తూ ఓటర్ల జాబితాలో పేరు చేర్చారు. కృష్ణా జిల్లా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఏడాది వయసున్న బెజవాడ జ్యోతి అనే పాపకు ఓటు హక్కు కల్పించారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో రెండేళ్ల వయసున్న భద్రప్ప, జీలకర్ర దొర అనే ఇద్దరు బాలురకు ఓటు హక్కు దక్కింది. తూర్పు గోదావరి జిల్లా గన్నవరంలో ఆచంట అంజనీకుమార్ అనే రెండేళ్ల బాబుకు కూడా ఓటు హక్కు కల్పించారు. 300 ఏళ్లు నిండిన వారున్నారా! ప్రపంచంలో వంద నుంచి నూటమూప్పై ఏళ్లు బతికినవారు ఉన్నారు. అయితే ఏపీలో ఏకంగా 352 ఏళ్లున్న వృద్ధులు కూడా ఉన్నారట! ఇది ఇక్కడి ఓటర్ల జాబితాలోని ప్రత్యేకత. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రాతినిథ్యం వహిస్తున్న విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలోని పెద్దిపాలేనికి చెందిన ఎర్రంశెట్టి నర్సింగరావు వయసు 352 ఏళ్లు అని ఉంది. ఈయన ఓటరు ఐడీ నెంబర్ ఎఫ్జెఎక్స్0992941. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో వనం నారాయణమ్మ అనే మహిళ వయసు 351 ఏళ్లట! ఈమె ఓటరు ఐడీ ఏపీ052740594072. కృష్ణా జల్లా గన్నవరంలో ‘యూఓజీ0077859’ అనే ఓటర్ ఐడీ నెంబర్ ఉన్న ఎ.సూర్యనారాయణ వయసు 344 ఏళ్లు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిథ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పి.సుధారాణి అనే ఓటర్ వయసు 248 ఏళ్లు. ఈమె ఓటరు ఐడీ ఎస్జీఈ0247270. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్ఏఏ0237545 ఐడీ నెంబర్తో ఓటు హక్కు ఉన్న వల్లభనేని జోజప్ప వయసు 225 ఏళ్లు. -
నకిలీ ఓట్ల ఫ్యాక్టరీ!
-
ముగిసిన ఓటరు దరఖాస్తుల గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటు హక్కు పొందడం కోసం ఓటరుగా నమోదు చేసుకోవడానికి గడువు శుక్రవారంతో ముగిసింది. ఓటర్ల జాబితా రెండో సవరణ కార్యక్రమంలో భాగంగా గత నెల 12న తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన విషయం తెలిసిందే. తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 2,73,18,603 ఉండగా ఆ తర్వాతి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు కొత్త ఓటర్ల నమోదు కోసం 3,50,962 మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త దరఖాస్తుల్లో ఇప్పటివరకు 1,53,115 దరఖాస్తులను స్వీకరించి ఓటర్ల జాబితాలో స్థానం కల్పించారు. 13,326 దరఖాస్తులను తిరస్కరించగా 1,84,521 దరఖాస్తులపై విచారణ పెండింగ్లో ఉంది. దీంతో శుక్రవారానికి రాష్ట్ర ఓటర్ల సంఖ్య 2,74,53,358కు పెరిగింది. ఇందులో వికలాంగ ఓటర్లు 6,39,276 మంది ఉన్నారు. పెండింగ్ దర ఖాస్తుల పరిష్కారం పూర్తయ్యాక మొత్తం ఓటర్ల సంఖ్య పెరగనుంది. కొత్త దరఖాస్తుల పరిశీలన ముగిశాక ఈ నెల 19న జాబితా రెండో అనుబంధాన్ని ప్రచురించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో దీన్నే వినియోగించనున్నారు. బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓ) ఓటరు నమోదు దరఖాస్తులను తిరస్కరిస్తే వరుసగా రిటర్నింగ్ అధికారులకు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవాలని సీఈఓ రజత్కుమార్ సూచించారు. ఆ తర్వాత కూడా తిరస్కరిస్తే జిల్లా ఎన్నికల అధికారులు, ఆ తర్వాత తనకు 19వ తేదీ వరకు పునఃపరిశీలన కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. -
గోల్మాల్గా గ్రేటర్ ఓటు.. పోటెత్తిన బోగస్
సాక్షి సిటీబ్యూరో: మహానగర పరిధిలోని ఓటరు లిస్టులో దిమ్మదిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఇంటింటి సర్వేలో జీహెచ్ఎంసీ సిబ్బంది, అధికారులు ఎంత బాధ్యతా రహితంగా వ్యవహరించారో వెలుగులోకి వస్తున్నాయి. తాజా ఓటరు లిస్టులో జరిగిన తప్పులపై బీఆర్ఓ, సూపర్వైజర్, ఏఈఆర్ఓ, ఈఆర్ఓలకు అధారాలు చూపించి ప్రశ్నిస్తే ఆ పొరపాటు తనది కాదంటే తనది కాదంటూ ఒకరిపై మరొకరు నెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్వైజర్ల పర్యవేక్షణలో బూత్లెవల్ ఆఫీసర్లు ఓటరు లిస్టును పరిశీలించి సరిచేయాలి. ఇక్కడ మాత్రం సూపర్వైజర్లు గాని, బూత్లెవెల్ అధికారులు గాని ఆయా నియోజకవర్గాల్లో ఇళ్లకు వెళ్లలేదని ‘సాక్షి’ పరిశీలనలో తేలింది. సూపర్ వైజర్లు తమ పర్యవేక్షణ బాధ్యతలను ఇతర వ్యక్తులకు అప్పగించారని, అదేవిధంగా బూత్లెవెల్ అధికారులు కూడా ఇంటింటి సర్వేకు వెళ్లకుండా కొందరికి రోజువారిగా డబ్బులు ఇచ్చి ఆ పని అప్పగించినట్టు తేలింది. ఈ రోజువారి డబ్బులు తీసుకున్నవారు సైతం అసలు సర్వేకే వెళ్లకుండా పోలింగ్బూత్ లేదా స్థానిక నాయకుల ఇళ్లలో కూర్చొని వారి సూచనలకు అనుగుణంగా ఓటరు లిస్టుల్లో సవరణలు చేసినట్టు విచారణలో బయటపడింది. జీహెచ్ఎంసీ అధికారుల ఆదేశాల ప్రకారం జరగాల్సిన అత్యంత ప్రధానమైన పని ఎవరికి వారే తమది కాదని నిర్లక్ష్యంగా చేయడం గమనార్హం. జిల్లాల్లో అలా.. గ్రేటర్లో ఇలా.. బాధ్యతాయుతమైన ఓట్ల సవరణను జీహెచ్ఎంసీ అధికారులు అర్హత, అనుభవం లేని వారు, అసలు సంబంధం లేని వ్యక్తుల చేతికి అప్పగించారు. బూత్ లెవల్ అధికారులుగా ఆశావర్కర్లు, ఆంగన్వాడీ టీచర్లు, వైద్య, విద్య శాఖలో కింది స్థాయిలో విధులు నిర్వహిస్తున్న వారికి అప్పగించారు. జిల్లాల్లో ఇందుకు భిన్నంగా సాగింది. అక్కడ బూత్ లెవెల్ అధికారులుగా రెవెన్యూ, రెగ్యుల్ టీచర్లు, గతంలో ఎన్నికల విధులు నిర్వహించిన వారు, అనుభవజ్ఞులైన ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను నియమించారు. అర్హత లేని సిబ్బంది, ఓట్సోర్సింగ్ ఉద్యోగులు తప్పులు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలకు అవకాశం ఉండదు. అదే రెగ్యులర్ ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. దీంతో జాగ్రత్తగా విధులు నిర్వహించారు. సవరించిన తప్పులే మళ్లీమళ్లీ.. అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓటరు లిస్టులో ఎలాంటి తప్పులు లేకుండా చూసేందుకు రెండు నెలలు ముందే జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు సమగ్ర సర్వే చేపట్టారు. ఆ బాధ్యతను బూత్లెవెల్ అధికారులకు అప్పగించారు. గ్రేటర్లోని పలు నియోజకవర్గాల్లో బూత్లెవెల్ అధికారులు సరవరించిన ఓటరు లిస్టుతో ‘సాక్షి’ ప్రతినిధి ఆయా ప్రాంతాల్లో సర్వే చేసినప్పుడు భారీగా తప్పలు బయటపడ్డాయి. ఓటరు లిస్టులో ఉన్న ఇంటి నంబర్లు ఆయా ఏరియాల్లో లేవు. ఇంటి నంబర్లకు వార్డు నంబర్లకు పొంతన లేదు. ఇదిలాఉంటే సర్వే చేసిన అంగన్వాడీ టీచర్లు ఎక్కడన్నా ఇంట్లోని ఓటర్లు కంటే.. లిస్టులో అధికంగా ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ‘సాక్షి’ వద్ద తమ బాధను వెళ్లబోసుకున్నారు. మరో ఏరియాకు వెళ్లి అక్కడి ఆశా వర్కర్ బూత్లెవల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళకు ఒకే ఇంటిపై దాదాపు 200కు పైగా ఓట్లున్నాయని, ఆ ఇంటికి మీరు వెళ్లారాని అడిగితే.. అక్కడ నాయకులు తమను బెదిరిస్తున్నారని, ఓట్లు తాము చెప్పినట్టే ఉండాలని హెచ్చరిస్తున్నారని వాపోయారు. చాలా తప్పులను సవరించి సూపర్వైజర్లకు అందించినా తిరిగి అవే పేరుతో గత నెల 12వ తేదీన విడదలైన లిస్టులో ఉన్నాయన్నారు. తాము కొన్ని రోజుల కోసం విధులు నిర్వహిస్తున్నామని, పై అధికారులే ఇలా చేస్తే ఓటరు లిస్టు ఎలా మారుతుందని ఓ మహిళా బూత్లెవెల్ అధికారి ప్రశ్నించారు. ‘సాక్షి’ సర్వేలో గుర్తించిన తప్పుల్లో కొన్ని ఇలా ఉన్నాయి.. 15 మంది ఉన్న ఇంట్లో 255 ఓట్లు యాకుత్పూర నియోజకవర్గంలోని డోర్ నంబర్ 17–1–175లో నివాసముంటున్న వారి సంఖ్య 15 మంది. వీరిలో 12 మందికి ఓటు హక్కు ఉంది. కానీ తాజా ఓటరు లిస్టులో అదే ఇంటి నంబర్లో మొత్తం 255 ఓట్లు ఉన్నాయి. గతంలో ఉన్న లిస్టులో అయితే ఆ సంఖ్య 500 ఉండేది. కొత్తగా వచ్చిన లిస్టు నుంచి సగం ఓట్లు రద్దు చేశారు. అయినా తప్పులు మాత్రం పూర్తిగా సవరించాలేదు. బూత్ నంబర్ 56లో సీరియల్ నంబర్ 364 నుంచి 737 వరకు ఒకే ఇంటి నంబర్పై 373 ఓట్లున్నాయి. అంతే కాదు.. ఇదే ఇంటి నంబర్ ఓట్లు పోలింగ్ బూత్ 57లో కూడా సీరియల్ నంబర్ 337 నుంచి 418 వరకు 81 ఓట్లున్నాయి. ఈ ఓటరు లిస్టును పరిశీలిస్తే బీఆర్ఓల నుంచి ఏఈఓల వరకు ఎంత నిర్లక్ష్యంగా పని చేశారో అర్థం చేసుకోవచ్చు. ఓకే వ్యక్తి రెండు నియోజకవర్గాల్లో ఓట్లు నాంపల్లి నియోజకవర్గంలోని ఇంటి నంబర్ 10–6–182లో ఉంటున్న జహీర్ అహ్మద్ఖాన్ ఓటు బూత్ నంబర్ 94, సీరియల్ నంబర్ 909లో ఉంది. తిరిగి ఇతని పేరు, అదే ఫొటోతో ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బూత్ నంబర్ 61లో సీరియల్ నంబర్ 1006గా ఉంది. ఇక్కడ ఎలాంటి మార్పులు లేకుండా ఇంటి నంబర్, తండ్రి పేరు, వ్యక్తి పేరుతో ప్రచురించడం గమనార్హం. ఈ తప్పులు మచ్చుకు కొన్ని మాత్రమే. ఇలా ఒకే వ్యక్తికి ‘డబుల్’, త్రిబుల్’ ఓట్లు గ్రేటర్ పరిధిలోని చాలామందికే నమోదు చేశారు. -
‘దొంగఓట్లపై విచారణ జరిపించండి’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో దొంగఓట్లను అరికట్టి, స్వేచ్ఛగా, జవాబుదారీతనంతో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఆర్పీ సిసోడియాకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు, ఆ పార్టీ ముఖ్య నాయకులు సోమవారం ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఓట్ల గల్లంతు, ఓట్ల డూప్లికేషన్, దొంగ ఓట్లపై సమీక్షించాలని కోరామని తెలిపారు. తమ దగ్గర ఉన్న ఆధారాలను ప్రధానాధికారికి సమర్పించామని, రాష్ట్రంలో దాదాపు 34 లక్షల డూప్లికేషన్ ఓట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రెండు చోట్లా 18 లక్షల మంది ఓట్లు కలిగి ఉన్నారని ఆరోపించారు. వీటన్నింటిపై విచారణ జరిపించాలని కోరగా సీఈఓ సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. -
పనులు చకచకా..
మహబూబ్నగర్ న్యూటౌన్ : ఎన్నికల వేళ సమీపిస్తుండడంతో జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే కార్యాచరణ రూపొందించిన అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఓటర్ల తుది జాబితా ప్రకటించగా ఎన్నికల కోడ్ అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న వారిపై ఫిర్యాదులు అందుతుండడంతో అధికార యంత్రాంగం ఉల్లంఘనులను కట్టడి చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతోంది. అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఇక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఏ ఇబ్బంది రావొద్దు.. ఓటింగ్ రోజున పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు ఏ ఇబ్బంది కలగకుండా మౌళిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు పోలింగ్ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి కావాల్సిన ఏర్పాట్లపై నివేదికలు రూపొదించారు. జిల్లాలో మొత్తం 1,312 పోలింగ్ కేం ద్రాలు ఉండగా.. ఓటర్లకు సౌకర్యాలు కల్పించేం దుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులను నిర్మిస్తున్నారు. మహబూబ్నగర్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలైన మహబూబ్నగర్, జడ్చర్ల, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాలపై సంబందిత ఈఆర్వోలు, ఏఈఆర్వోలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. డిసెంబర్ 7న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే సౌకర్యాల కల్పన పనులు తుది దశకు చేరాయి. ప్రచారాలతో పార్టీల అభ్యర్థులు ఓ పక్క హోరెత్తిస్తుండగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం మరోపక్క చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వసతుల కల్పన పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన ఏర్పాట్లపై జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి ఏర్పాటుచేయడంతో పాటు వెలుతురు, ఫ్యాన్లు ఉండేలా విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నారు. 2014 ఎన్నికల కంటే ఈసారి మెరుగైన సౌకర్యాలతో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఈఆర్వోలు పరిశీలించి స్వయంగా అక్కడి పరిస్థితులు తెలుసుకుని సౌకర్యాల కల్పనపై సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్దులకు సదుపాయాలు ఎన్నికల కమిషన్ ఆదేశల మేరకు జిల్లాలో దివ్యాంగులను ఓటర్ల జాబితాలు పరిశీలించి మార్క్ చేస్తున్నారు. దివ్యాంగులు ఈసారి వంద శాతం ఓటు హక్కు నమోదు చేసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ఓటు హక్కును ఎలాంటి ఇబ్బందులు లేకుండా వినియోగించుకునేలా ప్రతీ పోలింగ్ కేంద్రం వద్ద యుద్ధ ప్రాతిపదికన ర్యాంపుల నిర్మాణాన్ని చేపడుతున్నారు. అంతేకాకుండా పోలింగ్ కేంద్రానికి దివ్యాంగులు చేరుకునేందుకు రవాణా సౌకర్యం కల్పించనున్నారు. ఈ మేరకు దివ్యాంగులు, వృద్ధు లు పోలింగ్ కేంద్రాలకు రాగానే నిరీక్షించకుండా నేరుగా వెళ్లి ఓటు వేసేందుకు ఏ ర్పాట్లు చేయనున్నారు. అవసరమైన చోట్ల వీల్చైర్లు అవసరమున్న వారికి అందుబాటులో ఉంచుతారు. ఇలా ఓ పక్క ఉద్యోగుల నియామకం, ప్రచార సరళిపై నజర్ వేసిన అధికారులు.. మరోపక్క పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. -
ఎన్నికల సర్వే పేరుతో ఓట్ల తొలగింపు
-
'ఇతరుల’ కథ
ఓటర్ల జాబితాను ఎప్పుడైనా చూశారా? అందులో స్త్రీ, పురుష ఓటర్లతో పాటు మరో కాలమ్ ఉంటుంది. అదేమిటో గమనించారా? అదే ఇతర ఓటర్లు. అటు మహిళ, ఇటు పురుషులుగా గాకుండా థర్డ్జెండర్గా నమోదు చేసుకున్న వారిని ‘ఇతరులు’గా ఎన్నికల సంఘం పరిగణిస్తోంది. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును ట్రాన్స్జెండర్లకు ఇవ్వాలని, మానవ హక్కులను కాపాడాలని పలు సంస్థలు అభ్యర్థించడంతో 2012లో కేంద్ర ఎన్నికల సంఘం వీరిని ఓటర్లుగా గుర్తించేందుకు పచ్చజెండా ఊపింది. ఈ విప్లవాత్మక మార్పునకు అప్పటి సీఈసీ చీఫ్ కమిషనర్ నవీన్ బీ చావ్లా శ్రీకారం చుట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా థర్డ్జెండర్స్ 2014 ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రేటర్లో అధికం మన రాష్ట్రంలో ఈ కేటగిరీ ఓటర్లు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2,663 ఓటర్లలో దాదాపు సగం రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్ (పట్టణ) జిల్లాలో నమోదయ్యారు. సిరిసిల్ల జిల్లాలో అత్పల్పంగా ముగ్గురు మాత్రమే ‘ఇతరులు’ ఉన్నారు. గతంతో పోలిస్తే ఇలా నమోదు చేసుకున్న వారి సంఖ్య పెరిగింది. రంగారెడ్డి జిల్లాలో 401, మేడ్చల్ 338, హైదరాబాద్ 317, వరంగల్ (పట్టణ) 172 మంది ఓటర్లు ఉన్నట్లు ఇటీవల ఈసీ విడుదల చేసిన ఓటర్ల తుది జాబితాలో పేర్కొంది. వాస్తవానికి ఈ ఓటర్ల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నప్పటికీ, ఫారం–6లో ఇతరులుగా పేర్కొన్నవారినే ఈ కేటగిరీ కింద ఎన్నికల సంఘం నమోదు చేస్తోంది. ఇందులో లింగమార్పిడి చేసుకున్నవారే కాకుండా నడవడికలోనూ తేడాగా ఉన్నవారినీ ఈ కేటగిరీ కింద ఓటరుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. అయితే, ఇదీ పూర్తిగా వారి విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. - డి.వెంకటేశ్వరరెడ్డి, సాక్షి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి -
తొలి నియోజకవర్గం తొలి గ్రామం తొలి ఓటరు
కాగజ్నగర్(సిర్పూర్) : సిర్పూర్.. మారుమూల నియోజకవర్గం. కానీ, ఓటరు జాబితా, ఎన్నికల ప్రక్రియలో మాత్రం ఈ నియోజకవర్గం ముందు వరుసలో నిలుస్తోంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉండగా.. ప్రతి సెగ్మెంట్కు ఒక వరుస సంఖ్య ఉంటుంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు సిర్పూర్ నియోజకవర్గం వరుస సంఖ్య 246. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత ఇది తెలంగాణలోని నియోజకవర్గాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక, ఈ నియోజకవర్గంలోని మాలిని గ్రామంలో తొలి పోలింగ్ స్టేషన్ ఉంది. ఇదే గ్రామానికి చెందిన కినాక సుమనబాయి.. తెలంగాణ రాష్ట్ర ఓటరు జాబితాలో తొలి ఓటరుగా గుర్తింపు పొందారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన సుందరబాయి రాష్ట్రంలో తొలి ఓటరుగా ఉండేవారు. ఆమె మరణానంతరం సుమనబాయి తొలి ఓటరయ్యారు. ఎన్నికల లెక్కల్లో ముందు వరుసలో ఉన్న మాలిని గ్రామం.. అభివృద్ధిలో మాత్రం ఆమడదూరంలోనే ఉండిపోయింది. ఈ గ్రామ జనాభా 600. ఓటర్లు 460 మంది. మండల కేంద్రం కాగజ్నగర్కు ఈ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ‘ప్రతి ఎన్నికల్లోనూ నిస్వార్థంగా ఓటు వినియోగించుకుంటున్నా. ఎన్ని పనులున్నా పక్కనపెట్టి ఆ రోజు తప్పకుండా ఓటు వేస్తుంటాను’ అని తొలి ఓటరు సుమనబాయి అంటున్నారు. -
ఉర్దూ, మరాఠీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 16 శాసన సభ నియోజక వర్గాల్లో ఉర్దూ.. 3 నియోజక వర్గాల్లో మరాఠీ భాషల్లో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రచురించింది. ఈ ఓటర్ల జాబితాను తమ కార్యాలయ వెబ్సైట్లో కూడా పొందుపరిచినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) రజత్కుమార్ బుధవారం ఓ ప్రకట నలో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఒక శాసన సభ నియోజకవర్గంలో అధికార భాష కాకుండా ఇతర భాష మాట్లాడేవారు 20% మించి ఉన్నా, ఇతర భాష అక్షరాస్యులు చెప్పుకో దగ్గ సంఖ్యలో ఉన్నా వారి కోసం ఓటర్ల జాబితా ఆ భాషల్లో ప్రచురించాలి. హైదరాబాద్ జిల్లాలో ని ముషీరాబాద్, మలక్పేట, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, నాంపల్లి, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రా యణ్గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గాలు.. ఇటు నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ (అర్బన్) నియోజక వర్గంలో ఓటర్ల జాబితాను ఉర్దూలో ప్రచురించా రు. అలాగే అదిలాబాద్ జిల్లాలోని బోధ్, నిర్మల్ జిల్లాలోని ముధోల్, నిజామాబాద్ జిల్లాల్లోని జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో మరాఠీలో నూ ఓటర్ల జాబితా ప్రచురించారు. -
పోలింగ్ శాతంపై ప్రత్యేక దృష్టి
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలో 2014 ఎన్నికల కంటే ఈసారి పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా అధికారయంత్రాంగం చర్యలు ప్రారంభించింది. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికా రి సర్ఫరాజ్ అహ్మద్ ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వివరాలపై ఒకటికి రెండు సార్లు పరిశీలన చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లోని అసౌకర్యాలతోపాటు ఆ కేంద్రాలకు వచ్చే ఓటర్ల ఇబ్బందులను తెలుసుకోవాలని ఆయన అధికారగణాన్ని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై తగు చర్యలు తీసుకునే అవకాశముంటుందని అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో సూచించారు. ఈ మేరకు జిల్లా అధికార యంత్రాంగం నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం పెంపుపై దృష్టి సారించి ఏర్పాట్లను పరిశీలిస్తోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటర్లు.. సగటున 72.47 శాతం పోలింగ్.. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటర్ల సవరణ, నమో దు తర్వాత ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం 42,305 ఓటర్లు తగ్గారు. గత ఎన్నికల పో లింగ్ నాటికి 9,32,534 ఓటర్లుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 8,90,229గా ఉంది. ఆ ఎన్నికల్లో నాలుగు నియోజకవర్గాల్లో సగటున 72.47 శా తం నమోదు కాగా, అత్యధికంగా మానకొండూ రు నియోజకవర్గం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, అత్యల్పంగా పోలింగ్ శా తం కరీంనగర్లో నమోదైంది. కరీంనగర్ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోగా 58.77 శాతంగా నమోదైంది. హుజూ రాబాద్లో 2,09,783కు 1,62,675 మంది ఓటు వేయగా 77.54 శాతం, చొప్పదండి(ఎస్సీ)లో 2,04,776లకు 1,50,049 మంది ఓట్లేయగా 73.27 శాతంగా నమోదైంది. అదేవిధంగా మానకొండూరు(ఎస్సీ) నియోజకవర్గంలో 1,95,380 ఓటర్లకు గాను 1,56,907 మంది తమ ఓటుహక్కుని వినియోగించుకోగా 80.31 శాతంగా పో లింగ్ నమోదైంది. ఈ నేపథ్యంలో ఓటర్ల సంఖ్య తగ్గినా.. పోలింగ్ శాతం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి నియోజకవర్ల ఓటర్లనే జిల్లా ఓటర్లుగా పరిగణిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయ్యింది. అక్కడి సౌకర్యాల విషయంలోనూ సమగ్ర సమాచారాన్ని అధికారయంత్రాంగం సేకరించింది. ఈ క్రమంలో ఇటీవల కొత్తగా అన్ని మండలాలకు తహసీల్దార్లు విధుల్లో చేరారు. కిందటి ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదు కావడాన్ని గమనించిన పాలనాధికారి మరోమారు పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని వారిని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్లోనే మరీ తక్కువ.. పోలింగ్ శాతంపై కసరత్తు.. నాలుగు నియోజకవర్గాలను పరిశీలిస్తే గత ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. ఈ నియోజకవర్గంలో 3,22,595 మంది ఓటర్లుంటే 1,89,580 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నా రు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే చాలా తక్కువగా 58.77 శాతం మంది మాత్రమే ఓట్లు వేశారు. హుజూరాబాద్, చొప్పదండిలో ఫరవాలేదనిపించినా.. మానకొండూరులో అత్యధికంగా 80.31 శాతం నమోదైంది. ఈసారి నాలుగు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం మరింత పెంచే దిశగా ఎదురయ్యే అవరోధాలను అధిగమించాలని పాలనాధికారి భావిస్తున్నారు. అవసరమైతే పోలింగ్ కేంద్రాన్ని ఒక చోటు నుంచి దగ్గరగా ఉన్న మరో చోటికి మార్చడం లేదంటే గుర్తించిన పోలింగ్ కేంద్రానికి రాని పరిస్థితి ఉంటే ఏం చేయాలన్న దానిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికా రులను ఆదేశించడం చూస్తుంటే పాలనాధికారి పోలింగ్ నమోదుపై పక్కా ప్రణాళికతో వెళ్తున్నారన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా కొత్తగా వచ్చిన తహసీల్దార్లు సరైన నివేదికను, ప్రతిపాదనలు సరిగ్గా రూపొందిస్తేనే పాలనాధికారి సంకల్పం నెరవేరే అవకాశముంది. కాగా.. ఇటీవల ప్రకటించిన జాబితా ప్రకారం జిల్లాలో 8,90,229 మంది ఓటర్లుండగా ఇందులో 4,42,342 పురుషులు, 4,46,832 మహిళా ఓటర్లు, 55 మంది ఇతరులు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా చూస్తే కరీంనగర్లో అత్యధికంగా మొత్తం ఓటర్లు 2,77,236 ఉండగా, అత్యల్పంగా 1,99,098 మంది మానకొండూరులో ఉన్నారు. చొప్పదండిలో 2,08,056, హుజూరాబాద్లో 2,05,839 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. పోలింగ్ నాటికి స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నా.. ఇప్పుడున్న జాబితా ఆధారంగా పోలింగ్ శాతం పెంచడంపై అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.