breaking news
Ranji Trophy 2025-26
-
రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కాశ్మీర్.. భారీ నజరానా ప్రకటించిన సీఎం
భారత దేశవాళీ క్రికెట్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. జమ్మూ కాశ్మీర్ 67 ఏళ్ల నిరీక్షణకు తెరిదించుతూ మొట్టమొదటి రంజీ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. రంజీ ట్రోఫీ 2025-26 టైటిల్ను జమ్మూ కాశ్మీర్ కైవసం చేసుకుంది.ఫైనల్లో కర్ణాటకపై జమ్మూ విజయం సాధించింది. మ్యాచ్ డ్రా ముగిసినప్పటికి తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యపరంగా జే అండ్ కేను విజేతగా నిర్ణయించారు. ఈ విజయంతో జమ్మూ కాశ్మీర్ అంతటా సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రూ.2 కోట్ల నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాకుండా, అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఆటగాళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఒమర్ అబ్దుల్లా చివరి రోజు ఆట చూసేందుకు స్టేడియం వచ్చి తమ జట్టును ఉత్సహపరిచారు. ఈ క్రమంలో విజయం సాధించిన అనంతరం తమ ఆటగాళ్లను అబ్దుల్లా అభినందించారు.ఈ ఏడాది సీజన్లో జమ్మూ కాశ్మీర్ ప్లేయర్లు దుమ్ములేపారు. ఆకిబ్ నబీ,అబ్దుల్ సమద్, పరాస్ డోగ్రా, సునీల్ కుమార్ అసాధరణ ప్రదర్శనలు కనబరిచారు. ఆకిబ్ నబీ 60 వికెట్లతో ఈ సీజన్ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. ఫైనల్లో కూడా 5 వికెట్లతో సత్తాచాటాడు. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ సమద్ ఈ సీజన్లో 10 మ్యాచ్ల్లో 748 పరుగులు చేశాడు. కెప్టెన్ పరాస్ డోగ్రా 637 పరుగులతో జట్టును ముందుండి నడిపించాడు. -
అతడు అద్బుతాలు చేస్తాడు.. టీమిండియాకు ఎంపిక చేయండి: గంగూలీ
ఫిబ్రవరి 28, 2026.. భారత దేశవాళీ క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. జమ్మూ అండ్ కాశ్మీర్ తమ 67 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరిదించుతూ తొలి రంజీ ట్రోఫీ టైటిల్ను సొంతం చేసుకుంది. హుబ్లీ వేదికగా జరిగిన జరిగిన రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకను ఓడించి జమ్మూ కశ్మీర్ ఛాంపియన్గా అవతరించింది. ఈ చారిత్రత్మక విజయంలో ఆ జట్టు పేసర్ ఆకిబ్ నబీ ధార్ది కీలక పాత్ర. ఈ సీజన్ అసాంతం ఆకిబ్ నబీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.ఈ సీజన్లో మొత్తం 60 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒక పేసర్ 60 వికెట్ల మార్కును అందుకోవడం ఇది కేవలం మూడవసారి మాత్రమే. ఫైనల్ మ్యాచ్లో కూడా ఆకిబ్ దుమ్ములేపాడు. 29 ఏళ్ల నబీ తన స్వింగ్ బౌలింగ్తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.మొత్తంగా 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక ఓటమిని శాసించాడు. కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్ వంటి స్టార్ బ్యాటర్లను సైతం నబీ బోల్తా కొట్టించాడు. నబీ తన సంచలన ప్రదర్శనలతో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సైతం ఆకర్షించాడు.రాబోయే ఇంగ్లండ్ పర్యటనకు ఆకిబ్ నబీని ఎంపిక చేయాలని గంగూలీ సెలెక్టర్లకు సూచించాడు. ఇంగ్లండ్ పిచ్లపై ఆకిబ్ స్వింగ్ బౌలింగ్ భారత్కు ఉపయోగపడుతుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు."ప్రయత్నం, దృడ సంకల్పం ఉంటే ఏం చేయగలరో జమ్మూ కశ్మీర్ ప్రపంచానికి చాటి చెప్పింది. జమ్మూ కశ్మీర్ చారిత్రత్మక విజయంతో ఆ ప్రాంతం మొత్తం గర్వించేలా చేశారు. కఠిన పరిస్థితులే ఛాంపియన్లను తాయారు చేస్తాయి. ఆకిబ్ నబీ నిజంగా ఒక అద్భుతం.నబీ ఇప్పుడు టీమిండియా జెర్సీ ధరించేందుకు సమయం అసన్నమైంది. ఈ ఏడాది వేసవిలో ఇంగ్లండ్తో జరిగే వైట్బాల్ సిరీస్కు నబీని ఎంపిక చేస్తే బాగుంటుంది" అని ఎక్స్లో దాదా రాసుకొచ్చాడు. కాగా బారముల్లాకు చెందిన నబీ.. ఐపీఎల్లో కూడా సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో రూ. 8.4 కోట్ల భారీ ధరకు ఆకిబ్ను ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. -
చరిత్ర ఆవిష్కృతం.. భావోద్వేగాలతో ఉక్కిరిబిక్కిరి
జమ్మూ కశ్మీర్ సరికొత్త చరిత్ర ఆవిష్కరించింది. తొలిసారి రంజీ ట్రోఫీని ముద్దాడింది. కర్ణాటకతో ఫైనల్లో విజయ లాంఛనాన్ని శనివారం ముగించి కొత్త చాంపియన్గా అవతరించింది. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ ఆటగాళ్లు భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.అసాధారణ విజయాలతోదేశవాళీ ప్రతిష్టాత్మక క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో జమ్మూ కశ్మీర్ అసాధారణ విజయాలతో ఫైనల్కు చేరుకుంది. ఆద్యంతం నిలకడైన ఆటతీరుతో ప్రధాన జట్లను సైతం ఓడిస్తూ టైటిల్ రేసులో నిలిచింది.ఈ క్రమంలో హుబ్లి వేదికగా కర్ణాటకతో ఫైనల్లో తలపడిన జమ్మూ కశ్మీర్ ఇక్కడా జోరు కనబరిచి తమది గాలివాటం గెలుపు కాదని నిరూపించింది. KSCA హుబ్లి క్రికెట్ గ్రౌండ్లో టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 584 పరుగులు సాధించింది.సమిష్టిగా రాణించిన బ్యాటర్లుయావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోట్రా (72) అర్ధ శతకాలతో రాణించగా.. శుభం పండిర్ శతక్కొట్టడం (121)తో ఈ మేర భారీ స్కోరు సాధ్యమైంది. ఇక ఇందుకు బదులిచ్చేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. 293 పరుగులకే కుప్పకూలింది.చెలరేగిన ఆకిబ్ నబీస్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (13) విఫలం కాగా.. మరో సీనియర్ ఓపెనర్ మయాంక్ అగర్కాల్ (160) భారీ శతకంతో రాణించాడు. మిగిలిన వారిలో శ్రేయస్ గోపాల్ (27), కృతిక్ క్రిష్ణ (36) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. జమ్మూ కశ్మీర్ఎక్స్ప్రెస్ ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగి కర్ణాటక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు.అజేయ సెంచరీల సాక్షిగా ఈ క్రమంలో 291 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్.. శుక్రవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి కర్ణాటకపై ఓవరాల్గా 477 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆఖరిదైన శనివారం రోజు ఆటలో భాగంగా ఓపెనర్ కమ్రాన్ అక్మల్ అజేయ శతకం (160) పూర్తి చేసుకోగా.. సాహిల్ లోట్రా కూడా సెంచరీ (101)తో నాటౌట్గా నిలిచాడు.సాహిల్ శతకం పూర్తి చేసుకోగానే జమ్మూ కశ్మీర్ కెప్టెన్ పారస్ డోగ్రా తమ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. రెండో ఇన్నింగ్స్లో కశ్మీర్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 342 పరుగులు సాధించింది. అయితే, నిబంధనల ప్రకారం ఫలితం తేలనట్లయితే తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా నిర్ణయిస్తారు.సీఎం అభినందనలుపారస్ డోగ్రా ఈ విషయాన్ని ముందుగానే వెల్లడించినప్పటికీ ఆఖరి రోజు కమ్రాన్, సాహిల్ సెంచరీల సాక్షిగా.. చారిత్రాత్మక విజయాన్ని జమ్మూ కశ్మీర్కు అందించాడు. కాగా సాహిల్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇదే తొలి శతకం. అది కూడా చారిత్రాత్మక విజయం సందర్భంగా సాధించడం విశేషం. చదవండి: IND vs WI: విండీస్ను ఓడిస్తే సెమీ ఫైనల్లో.. ప్రత్యర్థి ఎవరంటే?A maiden First-Class century 💯On the grandest stage of all 🏟️A moment he will never forget ✨Sahil Lotra puts up a performance that he will remember for a lifetime 🫡Updates ▶️ https://t.co/G0ytZLEyNB#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/YOl1SgTEmD— BCCI Domestic (@BCCIdomestic) February 28, 2026 ఇక జమ్మూ కశ్మీర్ తొలిసారి రంజీ టైటిల్ గెలిచిన క్షణాలను ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రత్యక్షంగా తిలకించారు. భారత క్రికెట్ నియంత్రణమండలి (BCCI) అధ్యక్షుడు మిథున్ మన్హాస్ సైతం ఈ చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచాడు. వీరిద్దరు కరతాళ ధ్వనులతో సాహిల్తో పాటు కశ్మీర్ జట్టును అభినందించారు. -
టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆకిబ్ నబీ
ప్రస్తుత రంజీ సీజన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ పట్టపగ్గాల్లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రతి మ్యాచ్లో అదిరిపోయే ప్రదర్శనలతో ప్రత్యర్ది బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లోనూ అదే పునరావృతం చేశాడు. తొలి ఇన్నింగ్స్లో కర్ణాటక బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేశాడు. కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, మయాంక్ అగర్వాల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఆట కట్టించాడు. ఈ క్రమంలో మరో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. నబీ విజృంభించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 293 పరుగులకే ఆలౌటై, జమ్మూ అండ్ కశ్మీర్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు (584) చాలా వెనుకపడి పోయింది. జమ్మూ బౌలర్లలో నబీతో పాటు సునీల్ కుమార్ (19-6-51-2), యుద్ద్వీర్ సింగ్ (14.3-3-55-2), సాహిల్ లోత్రా (12-1-50-1) సత్తా చాటారు. కర్ణాటక తరఫున ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (160) ఒంటరిపోరాటం చేసినా తన జట్టు పటిష్ట స్థితికి చేర్చలేకపోయాడు. అతనికి మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లభించలేదు. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్ (13), దేవ్దత్ పడిక్కల్ (11), కరుణ్ నాయర్ (0), స్మరణ్ రవిచంద్రన్ (0) దారుణంగా విఫలమయ్యారు.అంతకుముందు షుభమ్ పుండిర్ (121) అద్భుత సెంచరీతో, యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధావన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో సత్తా చాటడంతో జమ్మూ టీమ్ తొలి ఇన్నింగ్స్లో 584 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్లో జమ్మూ అండ్ కశ్మీర్ ఫైనల్కు చేరడంలో ఆకిబ్ నబీ పాత్ర చాలా కీలకం. అతను దాదాపుగా ప్రతి మ్యాచ్లో సత్తా చాటి జమ్మూను తొలిసారి రంజీ ఫైనల్కు చేర్చాడు. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్ల్లో (క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ తొలి ఇన్నింగ్స్) నబీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు.. సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు, ఇప్పుడు ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశాడు. తాజా ప్రదర్శన తర్వాత నబీ ఈ రంజీ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అవతరించాడు. నబీ ఈ సీజన్లో ఏకంగా 60 వికెట్లు తీశాడు.ఎలా ఎంపిక చేయరో చూస్తా..!ఈ ప్రదర్శనల తర్వాత నబీ టీమిండియా సెలెక్టర్లకు స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ పంపిచినట్లైంది. ఇంతటి అద్భుత ప్రదర్శన కనబర్చిన నన్ను టీమిండియాకు ఎలా ఎంపిక చేయరో చూస్తా అన్న సందేశాన్ని పంపాడు. 29 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. స్వింగ్ బౌలింగ్లో దిట్ట. ఎంతటి బ్యాటర్నైనా ఇబ్బంది పెట్టగలిగే శక్తి అతని దగ్గర ఉంది. అలాగే యార్కర్లు సంధించడంలోనూ అతను దిట్ట. కేఎల్ రాహుల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్ నబీని ఎదుర్కోలేక ఇబ్బంది పడ్డాడంటే అతను ఎంత ప్రమాదకారో అర్దమవుతుంది. భారత సెలెక్టర్లు షమీలా కాకుండా నబీకి అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మేలు చేయాలని ఆశిద్దాం. -
కర్ణాటకకు చుక్కలు చూపిస్తున్న జమ్మూ అండ్ కాశ్మీర్
హుబ్లీ వేదికగా జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటకపై జమ్మూ అండ్ కాశ్మీర్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది.మయాంక్ అగర్వాల్(130 బ్యాటింగ్) సెంచరీతో కదం తొక్కగా.. మిగితా బ్యాటర్లంతా విఫలమయ్యారు. కెప్టెన్ దేవ్దత్త్ పడిక్కల్ 11 పరుగులు చేయగా.. సీనియర్ బ్యాటర్లు స్మరన్ రవిచంద్రన్, కరుణ్ నాయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరారు. జమ్మూ కాశ్మీర్ బౌలర్లలో అకిబ్ నబీ మూడు వికెట్లు పడగొట్టగా.. యుద్ద్వీర్ సింగ్, సునీల్ కుమార్ తలా వికెట్ సాధించారు. ప్రస్తుతం క్రీజులో అగర్వాల్తో పాటు కృతిక్ కృష్ణ(27) ఉన్నారు. కర్ణాటక ఇంకా తొలి ఇన్నింగ్స్లో జమ్మూ కంటే 364 పరుగుల వెనకంజలో ఉంది.అంతకుముందు బ్యాటింగ్ చేసిన జమ్మూ అండ్ కాశ్మీర్ 584 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జమ్మూ బ్యాటర్లలో దాదాపు ఆరుగురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం విశేషం. శుభమ్ పుందిర్ 121 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. యావర్ హసన్(88), పారస్ డోగ్రా(70), కన్హయ్య వధావన్( 70 పరుగులు) రాణించారు. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయితే మొదటి ఇన్నింగ్స్లో ఏ జట్టు అయితే ఎక్కువ పరుగులు సాధిస్తుందో వారికే టైటిల్ దక్కుతుంది. -
కెప్టెన్గా సూపర్ హిట్!.. భారీ షాకిచ్చిన బీసీసీఐ!
రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు అదరగొట్టింది. కర్ణాటక బౌలింగ్ను చితక్కొడుతూ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోరు సాధించింది. హుబ్లీ వేదికగా గురువారం నాటి మూడో రోజు ఆటను ఓవర్నైట్ స్కోరు 527/6తో మొదలు పెట్టిన కశ్మీర్.. మరో 57 పరుగులు జతచేసి ఆలౌట్ అయింది.కెప్టెన్గా సూపర్ హిట్!ఓపెనర్ యావర్ హసన్ (88), కెప్టెన్ పారస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), వికెట్ కీపర్ బ్యాటర్ కన్హయ్య వాధవాన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ధ శతకాలతో అదరగొట్టగా.. వన్డౌన్ బ్యాటర్ శుభం పండిర్ (121) శతకంతో దుమ్ములేపాడు. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో 584 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ పటిష్ట స్థితిలో నిలిచింది.ఇదిలా ఉంటే.. ఆట పరంగా అటు బ్యాటర్గా.. ఇటు కెప్టెన్గా మంచి ప్రదర్శన కనబరిచిర పారస్ డోగ్రా.. వ్యక్తిగతంగా మాత్రం విమర్శలు మూటగట్టుకున్నాడు. రెండో రోజు ఆటలో భాగంగా బుధవారం కర్ణాటక ఫీల్డర్ను హెల్మెట్తో ఢీకొట్టాడు. రంజీ ట్రోఫీలో సీనియర్ ఆటగాడిగా అపార అనుభవం ఉన్న పారస్ డోగ్రా... కర్ణాటక ప్లేయర్తో వాగ్వాదానికి దిగి వార్తల్లోకి ఎక్కాడు.పదే పదే కామెంట్దేశవాళీల్లో 21వ సీజన్ ఆడుతున్న జమ్ముకశ్మీర్ సారథి... బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సబ్స్టిట్యూట్ ఫీల్డర్ అనీశ్తో గొడవకు దిగాడు. పారస్ సంయమనంతో షాట్లు ఆడుతుండగా... కర్ణాటక ప్లేయర్లు అతడి ఏకాగ్రత దెబ్బతీసేందుకు ప్రయత్నించారు. సిల్లీ పాయింట్లో సబ్స్టిట్యూట్గా ఫీల్డింగ్ చేస్తున్న అనీశ్... పారస్ను పదే పదే కామెంట్ చేశాడు. దీంతో ప్రసిధ్ బౌలింగ్లో బౌండరీ కొట్టిన అనంతరం పారస్... అతడి వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు.హెల్మెట్తో ఢీకొట్టిఈ క్రమంలో అనీశ్ను పారస్ హెల్మెట్తో ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపించింది. అనీశ్ కూడా హెల్మెట్ పెట్టుకొని ఉండగా... ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఇది గమనించిన కర్ణాటక సీనియర్ ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వారిద్దరినీ వేరు చేశాడు. ఫీల్డ్ అంపైర్లు రోహాన్ పండిట్, ఉల్హాస్ గంధె కలుగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పారు. భారీ షాకిచ్చిన బీసీసీఐ!అయితే, ఈ వివాదం కారణంగా పారస్ డోగ్రాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారతక్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అతడికి భారీ జరిమానా విధించింది. ఈ విషయం గురించి.. మ్యాచ్ రిఫరీ నారాయణ్ కుట్టీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. జమ్మూకశ్మీర్ సారథి పారస్ డోగ్రా మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు తెలిపాడు. కాగా రంజీ చరిత్రలో తొలిసారి జమ్మూ కశ్మీర్ను ఫైనల్ చేర్చిన కెప్టెన్గా పారస్ డోగ్రా చరిత్రకెక్కాడు.చదవండి: T20 WC 2026: చరిత్ర సృష్టించిన న్యూజిలాండ్ ఆటగాళ్లు -
చెలరేగిన ప్రసిద్ద్ కృష్ణ
జమ్మూ అండ్ కశ్మీర్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో కర్ణాటక పేసర్ ప్రసిద్ద్ కృష్ణ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. అయితే కర్ణాటక జట్టుకు అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన జమ్యూ టీమ్ భారీ స్కోర్ చేసేసింది. షుభమ్ పుండిర్ (121) సెంచరీతో.. యావర్ హస్సన్ (88), కెప్టెన్ పరాస్ డోగ్రా (70), అబ్దుల్ సమద్ (61), కన్హయ్య వధవన్ (70), సాహిల్ లోత్రా (72) అర్ద సెంచరీలతో రాణించారు. చివరి వరుస ఆటగాళ్లు అబిద్ ముస్తాక్ (28), యుద్వీర్ సింగ్ (30) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మూడో రోజు తొలి సెషన్లోనే జమ్మూ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రసిద్ద్ కాకుండా కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్, విజయ్ కుమార్ వైశాక్, శ్రేయస్ గోపాల్, శిఖర్ షెట్టి తలో వికెట్ తీశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటకకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్, ఇన్ ఫామ్ ప్లేయర్ కేఎల్ రాహుల్ 13 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. రాహుల్ త్వరగా ఔట్ కావడం ఈ మ్యాచ్లో కర్ణాటక గెలుపోటములను తప్పక ప్రభావితం చేస్తుంది. మూడో రోజు లంచ్ విరామం సమయానికి కర్ణాటక స్కోర్ 35-1గా ఉంది. మయాంక్ అగర్వాల్ (16), కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (4) క్రీజ్లో ఉన్నారు. జమ్మూ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు కర్ణాటక ఇంకా 549 పరుగులు వెనుకపడి ఉంది. -
రంజీ ట్రోఫీ ఫైనల్లో ఉద్రిక్తత.. కర్ణాటక ఆటగాడిపై జమ్మూ కెప్టెన్ దాడి
కర్ణాటక-జమ్మూ అండ్ కశ్మీర్ మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ 2025-26 ఫైనల్లో హైటెన్షన్ చోటు చేసుకుంది. మ్యాచ్ రెండో రోజు ఫీల్డింగ్ చేస్తున్న కర్ణాటక ఆటగాడు కేవీ అనీష్పై జమ్మూ కెప్టెన్ పరాస్ డోగ్రా దాడికి దిగాడు. ఈ హఠాత్పరిణామంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. తొలిసారి రంజీ ఫైనల్కు చేరిన జమ్మూ అండ్ కశ్మీర్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ ఎడిషన్ ఆధ్యాంతం రాణించినట్లుగానే ఈ మ్యాచ్లోనూ ఆ జట్టు బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. pic.twitter.com/pddcZJCrgs— crictalk (@crictalk7) February 25, 2026షుభమ్ పుండిర్ (121) అద్భుత శతకంతో, అరంగేట్రం ఓపెనర్ యావెర్ హస్సన్ (88), అబ్దుల్ సమద్ (61) అర్ద శతకాలతో సత్తా చాటారు. ఫలితంగా జమ్మూ జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు తొలి సెషన్ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 380 పరుగులు చేసింది. కెప్టెన్ పరాస్ డోగ్రా (36), కన్హయ్య వధావన్ (45) క్రీజ్లో ఉన్నారు.కాగా, రెండో రోజు ఆట ప్రారంభంలో కర్ణాటక బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, వైశాక్ విజయ్కుమార్, విద్యాధర్ పాటిల్ బౌన్సర్లతో డోగ్రాను ఇబ్బంది పెట్టారు. ఫీల్డర్లు నిరంతరం స్లెడ్జింగ్ చేస్తూ డోగ్రాను రెచ్చగొట్టారు. 101వ ఓవర్లో డోగ్రా ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్లో బౌండరీ కొట్టిన తర్వాత, షార్ట్ ఫైన్ లెగ్లో నిలిచిన సబ్స్టిట్యూట్ ఫీల్డర్ కేవీ అనీష్ వైపు దూసుకెళ్లి, తన హెల్మెట్తో అతని తలపై కొట్టాడు. ఊహించని ఈ ఘటనతో మ్యాచ్ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.కర్ణాటక సీనియర్ ఆటగాడు, టీమిండియా ప్లేయర్ మయాంక్ అగర్వాల్ వెంటనే జోక్యం చేసుకొని డోగ్రాపై సీరియస్ అయ్యాడు. అంపైర్లు ఉల్హాస్ గాంధే, రోహన్ పండిట్ గొడవను మరింత పెద్దది కాకుండా ఆటగాళ్లను వేరు చేశారు. కర్ణాటక కెప్టెన్ దేవదత్ పడిక్కల్ ఈ ఘటనను మ్యాచ్ రిఫరికి నివేదించాడు. ఈ ఘటనకు ముందు కూడా జమ్మూ ఆటగాళ్లు డోగ్రా, కన్హయ్య కర్ణాటక ఆటగాళ్లతో చాలాసార్లు వాగ్వాదానికి దిగారు. ఇది చివరికి ఘర్షణకు దారి తీసింది. -
టీమిండియావైపు దూసుకొస్తున్న కర్ణాటక యువ సంచలనం
భారత దేశవాలీ క్రికెట్లో ప్రస్తుతం స్మరణ్ రవిచంద్రన్ అనే పేరు మార్మోగిపోతుంది. 22 ఏళ్ల ఈ కర్ణాటక యువ బ్యాటర్ ఫార్మాట్లకతీతంగా వరుస సెంచరీలు, డబుల్ సెంచరీలతో చెలరేగిపోతూ భారత క్రికెట్లో పెను సంచలనంగా మారాడు. ఎడమ చేతి వాటం అటాకింగ్ మిడిల్డార్ బ్యాటర్ అయిన స్మరణ్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా విజృంభిస్తున్నాడు.13 ఇన్నింగ్స్ల్లో 2 డబుల్ సెంచరీలు, 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 950 పరుగులు (95 సగటున) చేసిన స్మరణ్.. ఈ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. ఈ క్రమంలో ఢిల్లీ బ్యాటర్ ఆయుశ్ దొసేజాను (949 పరుగులు) అధిగమించాడు. స్మరణ్ భీకర ఫామ్ చూసి సహచర క్రికెటర్లు అవాక్కవుతున్నారు. విశ్లేషకులు సైతం అబ్బురపడుతున్నారు.ట్విన్ సెంచరీస్ప్రస్తుతం ఉత్తరాండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్లో స్మరణ్ ఉగ్రరూపం దాల్చాడు. రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు (135, 127) చేసి భీకర ఫామ్ను కొనసాగించాడు. స్మరణ్ సహా దేవదత్ పడిక్కల్ (232), కేఎల్ రాహుల్ (141, 70 నాటౌట్) శివాలెత్తడంతో ఈ మ్యాచ్లో కర్ణాటక బంపర్ విక్టరీ దిశగా సాగుతోంది. మొత్తం 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలుతాజా ప్రదర్శనతో స్మరణ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1500 పరుగుల మైలురాయిని దాటాడు. 25 ఇన్నింగ్స్ల స్వల్ప కెరీర్లో 3 డబుల్ సెంచరీలు, 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీల సాయంతో 1500 పరుగుల మార్కును క్రాస్ చేశాడు. అతని కెరీర్ సగటు 72కు పైగా ఉండటం విశేషం.లిస్ట్-ఏ క్రికెట్లోనూ తిరుగలేని మొనగాడే..!స్మరణ్ సెంచరీల మోత, పరుగుల ప్రవాహం ఫస్ట్ క్లాస్ క్రికెట్కు మాత్రమే పరిమితం కాలేదు. ఈ మైసూరు కుర్రాడు లిస్ట్-ఏ క్రికెట్లోనూ అదరగొడుతున్నాడు. ఇటీవల (2024-25) కర్ణాటక విజయ్ హజారే వన్డే ట్రోఫీ సాధించడంలో స్మరణ్ అత్యంత కీలకపాత్ర పోషించాడు. సెమీఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీతో (76) పాటు, ఫైనల్లో మెరుపు సెంచరీ (101) చేసి తన జట్టును ఛాంపియన్గా నిలిపాడు. లిస్ట్-ఏ ఫార్మాట్లో మొత్తం 14 ఇన్నింగ్స్లు ఆడిన స్మరణ్ 96.48 స్ట్రయిక్రేట్తో 50కి పైగా సగటున 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 604 పరుగులు చేశాడు.పొట్టి ఫార్మాట్లోనూ పర్వాలేదుఫస్ట్క్లాస్, లిస్ట్-ఏ ఫార్మాట్లతో పోలిస్తే స్మరణ్ టీ20 ఫార్మాట్ రికార్డు ఓ మోస్తరుగా ఉంది. పొట్టి ఫార్మాట్లో స్మరణ్ 13 ఇన్నింగ్స్ల్లో బ్యాటింగ్ చేసి 162.45 స్ట్రయిక్రేట్తో 3 అర్ద సెంచరీల సాయంతో 489 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు.బౌలింగ్లోనూ మెరిపిస్తాడుస్మరణ్ విధ్వంసకర బ్యాటింగ్తో మాత్రమే కాకుండా బౌలింగ్లోనూ మెరిపించగల సమర్దుడు. కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేసే స్మరణ్ కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగలడు. లోకల్ క్రికెట్లో అతను బౌలింగ్లోనూ ప్రూవ్ చేసుకున్నాడు.అనుకోకుండా వచ్చిన ఐపీఎల్ అవకాశంస్మరణ్కు ఐపీఎల్ 2025లో ఊహించని విధంగా అవకాశం వచ్చింది. ఆసీస్ స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపా గాయపడంతో సన్రైజర్స్ హైదరాబాద్ స్మరణ్కు అక్కున చేర్చుకుంది (30 లక్షలు). అయితే స్మరణ్కు ఆ సీజన్లో అవకాశాలు దక్కలేదు. స్మరణ్పై భారీ అంచనాలు ఉన్న ఎస్ఆర్హెచ్ అతన్ని 2026 సీజన్కు కూడా రీటైన్ చేసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్లో స్మరణ్కు అవకాశం దొరికి ఇదే తరహాలో చెలరేగితే, త్వరలోనే టీమిండియా తలుపులు తట్టడం ఖాయమని క్రికెట్ పండితులు అంచనా వేస్తున్నారు. -
సంచలన విజయం.. చరిత్ర సృష్టించిన జమ్మూ కశ్మీర్
జమ్మూ కశ్మీర్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర లిఖించింది. దేశవాళీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీస్ మ్యాచ్లో అనూహ్య రీతిలో బెంగాల్ను మట్టికరిపించి తమ క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్లో భాగంగా బెంగాల్- జమ్మూ కశ్మీర్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది. బెంగాల్లోని కళ్యాణి వేదికగా టాస్ గెలిచిన కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఘరామి సెంచరీఈ క్రమంలో బ్యాటింగ్కు దగిన బెంగాల్.. తొలి ఇన్నింగ్స్లో 328 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ కుమార్ ఘరామి (146) సెంచరీ సాధించి టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు. కశ్మీర్ బౌలర్లలో పేస్ సంచలన ఆకిబ్ నబీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సునిల్ కుమార్ మూడు వికెట్లతో సత్తా చాటాడు. యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు.అనంతరం జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్కు దిగి 302 పరుగులకు ఆలౌట్ అయింది. అబ్దుల్ సమద్ 82 పరుగులతో రాణించగా.. కెప్టెన్ పారసస్ డోగ్రా (58), ఆకిబ్ నబీ (42) కూడా మెరుగైన స్కోర్లు సాధించారు. బెంగాల్ పేసర్ మొహమ్మద్ షమీ ఎనిమిది వికెట్లు కూల్చగా.. ముకేశ్ కుమార్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.చెలరేగిన కశ్మీర్ బౌలర్లుఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన బెంగాల్కు కశ్మీర్ బౌలర్లు దిమ్మదిరిగే షాకిచ్చారు. పటిష్ట బెంగాల్ బ్యాటింగ్ ఆర్డర్ను కకావికలం చేస్తూ 99 పరుగులకే కుప్పకూల్చారు. టాపార్డర్లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ ఐదు పరుగేల చేయగా.. సుదీప్ ఛటర్జీ, సుదీప్ కుమార్ ఘరామి డకౌట్ అయ్యారు. ఓపెనర్ల వికెట్లతో పాటు సూరజ్ (14), షాకిర్ హబీబ్ గాంధీ (10) వికెట్లను ఆకిబ్ తన ఖాతాలో వేసుకున్నాడు.మిగిలిన వారిలో సునిల్ కుమార్ నాలుగు వికెట్లతో సత్తా చాటగా.. యుధ్వీర్ రెండు వికెట్లు దక్కించకున్నాడు. ఈ క్రమంలో బెంగాల్ విధించిన 126 పరుగుల లక్ష్యాన్ని జమ్మూ కశ్మీర్నాలుగో రోజు ఆటలో పూర్తి చేసింది. ఓపెనర్లు శుభం ఖజూరియా (1), యావర్ హసన్ (6, కెప్టెన్ డోగ్రా (9) విఫలమైనా.. శుభం పందిర్ (27), వన్షజ్ శర్మ (43 నాటౌట్), అబ్దుల్ సమద్ (30 నాటౌట్) పనిపూర్తి చేశారు. తొలిసారి రంజీ ఫైనల్లోలక్ష్య ఛేదనలో నాలుగు వికెట్లు నష్టపోయి 126 పరుగులు చేసిన జమ్మూ కశ్మీర్ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్లో మొత్తంగా తొమ్మిది వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అందుకున్నాడు.చదవండి: IND vs PAK: అసలైన హీరో మీరే: పీసీబీ చైర్మన్ 𝙎𝘾𝙀𝙉𝙀𝙎 𝙊𝙁 𝙋𝙐𝙍𝙀 𝙅𝙐𝘽𝙄𝙇𝘼𝙏𝙄𝙊𝙉 🤩J&K create history as they defeat Bengal by 7️⃣ wickets to book their ticket to the #RanjiTrophy Final for the very first time 🫡Scorecard ▶️ https://t.co/QXyCuRHJ6e@IDFCFIRSTBank pic.twitter.com/VBKPD9I9mX— BCCI Domestic (@BCCIdomestic) February 18, 2026 -
కెప్టెన్ నిర్ణయం... జట్టు పాలిట శాపం!
కెప్టెన్ తీసుకున్న నిర్ణయం ఉత్తరాఖండ్ పాలిట శాపంగా మారింది. ప్రత్యర్థి జట్టులో మేటి బ్యాటర్లు ఉన్న సంగతి విస్మరించి... తొలుత బౌలింగ్ ఎంచుకున్నందుకు భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. రంజీ ఫైనల్ 2025-26 ఫైనల్ చేరే అవకాశం దాదాపుగా ఉత్తరాఖండ్ చేజారినట్లే!లక్నో వేదికగా రంజీ తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ కెప్టెన్ కునాల్ చండేలా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన కర్ణాటక అదరగొట్టింది.కర్ణాటక బ్యాటర్ల అద్భుత ప్రదర్శనకర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232) డబుల్ సెంచరీ... కేఎల్ రాహుల్ (141) సెంచరీ... రవిచంద్రన్ స్మరణ్ (135) సెంచరీ... కరుణ్ నాయర్ (60), కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ అర్ధ సెంచరీలు సాధించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు సాధించి ఆలౌటైంది.ఓవర్నైట్ స్కోరు 689/6తో మంగళవారం నాటి మూడో రోజు ఆట కొనసాగించిన కర్ణాటక మరో 47 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ సెంచరీ హీరో స్మరణ్ తన వ్యక్తిగత స్కోరుకు మరో 14 పరుగులు జోడించి 135 పరుగులకు అవుటయ్యాడు. విద్యాధర్ (54) అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ 154 పరుగులిచ్చి 4 వికెట్లు, మయాంక్ మిశ్రా 173 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టారు. అభయ్ నేగి, అవనీశ్, లక్ష్యలకు ఒక్కో వికెట్ దక్కింది. 588 పరుగులుఇక కర్ణాటక నమోదు చేసిన భారీ స్కోరుకు జవాబుగా... మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ ఆట ముగిసే సమయానికి 69 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉన్న ఈ మ్యాచ్ను ‘డ్రా’గా ముగించి, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదిస్తేనే ఉత్తరాఖండ్ జట్టుకు ఫైనల్ చేరే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సగం వికెట్లు కోల్పోయిన ఉత్తరాఖండ్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందాలంటే మరో 588 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో మాజీ చాంపియన్ కర్ణాటక గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.చదవండి: T20 WC 2026: నేపాల్ సంచలన విజయం -
నిప్పులు చెరిగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
టీమిండియా వెటరన్ పేసర్, బెంగాల్ బౌలింగ్ స్టార్ మొహమ్మద్ షమీ మరోసారి సత్తా చాటాడు. రంజీ ట్రోఫీ 2025-26 రెండో సెమీస్ మ్యాచ్లో ఎనిమిది వికెట్లతో చెలరేగాడు. కళ్యాణిలోని బెంగాల్ క్రికెట్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్ వేదికగా జమ్మూ కశ్మీర్- బెంగాల్ మధ్య ఆదివారం మ్యాచ్ మొదలైంది.328 పరుగులకు ఆలౌట్టాస్ గెలిచిన జమ్మూ కశ్మీర్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. బెంగాల్ బ్యాటింగ్కు దిగింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (49), షాబాజ్ అహ్మద్ (42) రాణించగా.. సుదీప్ కుమార్ ఘరామి (146) శతక్కొట్టాడు. మిగిలిన వారిలో సుమంత గుప్తా 39 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 97.1 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌట్ అయింది.జమ్మూ కశ్మీర్ బౌలర్లలో స్టార్ పేసర్ అకీబ్ నబీ (Auqib Nabi) ఐదు వికెట్లతో సత్తా చాటగా.. సునిల్ కుమార్ (Sunil Kumar) మూడు, యుధ్వీర్ సింగ్ చరఖ్, అబిద్ ముస్తాక్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం జమ్మూ కశ్మీర్ మొదటి ఇన్నింగ్స్ మొదలుపెట్టగా.. మంగళవారం నాటి మూడో రోజు ఆటలో 302 పరుగులకు ఆలౌట్ అయింది.ఆది నుంచే నిప్పులు చెరిగిన షమీఆది నుంచే నిప్పులు చెరిగిన బెంగాల్ పేసర్ షమీ.. ఓపెనర్లు శుభం ఖజూరియా (3), యావర్ హసన్ (2)లను వచ్చీరాగానే వెనక్కి పంపాడు. అదే విధంగా అబ్దుల్ సమద్ (82), కన్హయ్య వాధవాన్ (29) రూపంలో రెండు కీలక వికెట్లు తీశాడు.అంతేకాదు.. అబిద్ ముస్తాక్ (27), వన్షజ్ శర్మ (3), ఆకిబ్ నబీ (42), యుధ్వీర్ సింగ్ చరఖ్ (33)ల వికెట్లు కూడా షమీ తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా ఎనిమిది వికెట్లు కూల్చి సత్తా చాటాడు. మిగిలిన బెంగాల్ బౌలర్లలో టీమిండియా స్టార్ ముకేశ్ కుమార్ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ విజృంభణ కారణంగా తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 26 పరుగుల ఆధిక్యం సంపాదించగలిగింది.ఆడినా లాభమేంటి?గతేడాది మార్చిలో చివరగా టీమిండియా తరఫున వన్డే బరిలో దిగాడు షమీ. అంతకు ముందు నెలలో టీ20లు ఆడాడు. అయితే, అతడు భారత్ తరఫున టెస్టులు ఆడి దాదాపు మూడేళ్లు కావస్తోంది.ఫస్ట్క్లాస్ క్రికెట్లో సత్తా చాటినా టీమిండియా సెలక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. తాజా రంజీ సీజన్లోనూ ఆకట్టుకున్నా అతడికి పిలుపునివ్వలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి మ్యాచ్ ఫిట్నెస్ లేదని వ్యాఖ్యానించగా.. తాను ఆటతోనే సమాధానం చెబుతున్నానని షమీ కౌంటర్ ఇచ్చాడు. అందుకు తగ్గట్టుగానే తాజా మ్యాచ్లోనూ సత్తా చాటి మరోసారి టీమిండియా సెలక్ట ర్లకు గట్టి వార్నింగే ఇచ్చాడు.An 8️⃣-wicket masterpiece 🫡Watch 🎥Mohd. Shami wreaks havoc with his career-best First Class figures of 8/90 🔥 Updates ▶️ https://t.co/QXyCuRIgVM#RanjiTrophy | @IDFCFIRSTBank pic.twitter.com/f4F3TYnSWi— BCCI Domestic (@BCCIdomestic) February 17, 2026చదవండి: గంభీర్కు గోల్డెన్ ఆఫర్!.. హెడ్కోచ్ పదవికి గుడ్బై? -
పడిక్కల్ డబుల్ సెంచరీ.. కర్ణాటక అతి భారీ స్కోరు
రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో కర్ణాటక అతి భారీ స్కోరు సాధించింది. ఉత్తరాఖండ్ బౌలింగ్ను చితక్కొట్టి తొలి ఇన్నింగ్స్లో ఏకంగా 736 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (141), స్మరణ్ రవిచంద్రన్ (135) భారీ శతకాలతో మెరవగా.. కెప్టెన్ దేవదత్ పడిక్కల్ డబుల్ సెంచరీ (232)తో కదం తొక్కాడు.736 పరుగులుమిగిలిన వారిలో కరుణ్ నాయర్ (60), వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ కృష్ణ (60), విద్యాధర్ పాటిల్ (54) అర్ధ శతకాలతో రాణించారు. ఫలితంగా కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 194.4 ఓవర్లలో 736 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అయితే, ఈ మ్యాచ్లో స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) విఫలం కాగా.. శ్రేయస్ గోపాల్ (0), విజయ్కుమార్ వైశాఖ్ (0) డకౌట్ అయ్యారు. శిఖర్ శెట్టి 12 పరుగులు చేయగా.. ప్రసిద్ కృష్ణ ఒక పరుగుతో అజేయంగా నిలిచాడు.ఇక ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్య రావత్ నాలుగు వికెట్లు తీయగా.. మయాంక్ మిశ్రా మూడు వికెట్లు దక్కించుకున్నాడు. మిగతా వారిలో అభయ్ నేగి, అన్వీశ్ సుధా, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.రెండో రోజు ఆట సాగిందిలా..కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (232; 29 ఫోర్లు, 3 సిక్స్లు) డబుల్ సెంచరీ... స్మరణ్ (121 బ్యాటింగ్; 11 ఫోర్లు) అజేయ శతకం... వెరసి ఉత్తరాఖండ్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో కర్ణాటక భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 355/2తో సోమవారం నాటి రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన కర్ణాటక... ఆట ముగిసే సమయానికి 180 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 689 పరుగులు సాధించింది.కరుణ్ నాయర్ (60; 8 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి పడిక్కల్ మూడో వికెట్కు 129 పరుగులు ... స్మరణ్తో కలిసి నాలుగో వికెట్కు 59 పరుగులు జత చేశాడు. శ్రేయస్ గోపాల్ (0) డకౌట్కాగా ... కృతిక్ కృష్ణ ( 60; 6 ఫోర్లు, 1 సిక్స్)తో కలిసి స్మరణ్ ఆరో వికెట్కు 123 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో స్మరణ్ కెరీర్లో ఐదో ఫస్ట్క్లాస్ సెంచరీ సాధించాడు. కృతిక్ వెనుదిరిగాక ... విద్యాధర్ పాటిల్ (35 బ్యాటింగ్; 1 ఫోర్, 1 సిక్స్), స్మరణ్ మరో వికెట్ పడకుండా రెండో రోజు ఆటను ముగించారు. చదవండి: T20 WC 2026: ఆస్ట్రేలియాకు భారీ షాకిచ్చిన శ్రీలంక.. ఇక లగేజి సర్దుకోవడమే! -
భీకర ఫామ్.. ఈసారి డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ ఎలైట్ 2025-26 సెమీ ఫైనల్లో కర్ణాటక కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వన్డౌన్లో వచ్చిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ డబుల్ సెంచరీతో మెరిశాడు. రంజీ ట్రోఫీ తాజా సీజన్లో తొలి సెమీస్ మ్యాచ్లో కర్ణాటక- ఉత్తరాఖండ్ (karnataka vs uttarakhand) తలపడుతున్నాయి. లక్నో వేదికగా ఇరుజట్ల మధ్య ఆదివారం మ్యాచ్ మొదలుకాగా.. మాజీ చాంపియన్ కర్ణాటక కర్ణాటక భారీ స్కోరు దిశగా సాగుతోంది.తొలిరోజే ఆధిపత్యంఇక ఈ దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ తొలిసారి సెమీఫైనల్ చేరిన ఉత్తరాఖండ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన కర్ణాటక మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 355 పరుగులు సాధించింది. టీమిండియా స్టార్లు కేఎల్ రాహుల్ (KL Rahul- 141; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ దేవ్దత్ పడిక్కల్ (148 బ్యాటింగ్; 16 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీలతో అదరగొట్టారు.ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal- 5) తక్కువ స్కోరుకే వెనుదిరగ్గా... రాహుల్, పడిక్కల్ రెండో వికెట్కు 278 పరుగుల భారీ భాగస్వామ్యం జోడించారు. రాహుల్ అవుటయ్యాక వచ్చిన కరుణ్ నాయర్ (37 బ్యాటింగ్; 5 ఫోర్లు, 1 సిక్స్) కూడా నిలకడ కనబరిచాడు.రెండో రోజు కెప్టెన్ డబుల్ సెంచరీ పూర్తిఈ నేపథ్యంలో 355/2 ఓవర్నైట్ స్కోరుతో సోమవారం నాటి రెండో రోజు ఆట మొదలుపెట్టిన కర్ణాటక.. 125 ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్ల నష్టానికి 512 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ పడిక్కల్ 330 బంతుల్లో 29 ఫోర్లు, మూడు సిక్స్లు బాది 232 పరుగులు చేశాడు.పడిక్కల్ ఫస్ట్క్లాస్ కెరీర్లో డబుల్ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక కరుణ్ నాయర్ అర్ధ శతకం (105 బంతుల్లో 60) బాదగా.. శ్రేయస్ గోపాల్ డకౌట్ (0) అయ్యాడు. మిగిలిన వారిలో స్మరణ్ రవిచంద్రన్ 33, వికెట్ కీపర్ బ్యాటర్ కృతిక్ క్రిష్ణ 15 పరుగులతో క్రీజులో నిలిచారు. ఉత్తరాఖండ్ బౌలర్లలో ఆదిత్యా రావత్ మూడు వికెట్లు తీయగా.. అభయ్ నేగి, లక్ష్య రాజేశ్ రాయ్చందాని తలా ఒక వికెట్ పడగొట్టారు.సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న పడిక్కల్టీమిండియాకు దూరమైన పడిక్కల్ దేశీ క్రికెట్లో దుమ్ములేపుతున్నాడు. లిస్ట్-ఎ క్రికెట్లో పుదుచ్చేరి, త్రిపుర జట్లపై వరుస శతకాలు బాదిన ఈ కర్ణాటక స్టార్.. అనంతరం రాజస్తాన్ (91), ముంబై (81 నాటౌట్) జట్లపై కూడా రాణించాడు. ఇక రంజీ ఎడిషన్లో చివరగా పంజాబ్తో మ్యాచ్లో సెంచరీ చేసిన పడిక్కల్.. తాజాగా సెమీ ఫైనల్లో ఉత్తరాఖండ్పై ‘ద్వి’శతక్కొట్టం విశేషం.చదవండి: IND vs PAK: అందుకే ఓడిపోయాం.. ప్రధాన కారణం వాళ్లే: పాక్ కెప్టెన్A captain’s masterpiece! 🎨Watch the moment Devdutt Padikkal brings up his maiden First-Class double ton 💯💯He soaks in the applause as the dressing room rises to acknowledge a special knock 👏Updates ▶️ https://t.co/SztwjvwUiI#RanjiTrophy @IDFCFIRSTBank @devdpd07 pic.twitter.com/0Qaa5DNU9z— BCCI Domestic (@BCCIdomestic) February 16, 2026 -
రాహుల్, పడిక్కల్ అద్భుత శతకాలు
ఉత్తరాఖండ్తో ఇవాళ (ఫిబ్రవరి 15) మొదలైన రంజీ ట్రోఫీ 2025-26 తొలి సెమీఫైనల్లో కర్ణాటక జట్టు భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (125 నాటౌట్), కెప్టెన్ దేవదత్ పడిక్కల్ (111 నాటౌట్) అద్భుత సెంచరీలతో చెలరేగిపోయారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ఱాటక టీ విరామం సమయానికి వికెట్ నష్టానికి 263 పరుగులు చేసింది. రాహుల్, పడిక్కల్ సెంచరీల తర్వాత కూడా నిలకడగా ఆడుతూ డబుల్ సెంచరీల దిశగా సాగుతున్నారు.టాస్ ఓడి ఉత్తరాఖండ్ ఆహ్వానం మేరకు బ్యాటింగ్కు దిగిన కర్ణాటక 18 పరుగుల వద్దనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) వికెట్ కోల్పోయింది. అయితే రాహుల్, పడిక్కల్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించారు. వీరిద్దరు రెండో వికెట్కు అజేయమైన 245 పరుగులు జోడించారు. మయాంక్ అగర్వాల్ వికెట్ ఆదిత్య రావత్కు దక్కింది.భీకర ఫామ్లో రాహుల్, పడిక్కల్కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ భీకర ఫామ్ను కొనసాగిస్తున్నారు. టీమిండియా షెడ్యూల్ లేకపోవడంతో రంజీ బాట పట్టిన రాహుల్ ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్లోనూ (130) అద్భుత శతకంతో మెరిశాడు. రాహుల్ అద్భుత శతకం కారణంగానే కర్ణాటక ముంబైపై గెలిచి సెమీస్కు చేరింది. అంతకుముందు పంజాబ్తో జరిగిన లీగ్ మ్యాచ్లోనూ రాహుల్ అర్ద సెంచరీతో రాణించాడు. దీనికి ముందు న్యూజిలాండ్తో జరిగిన రాజ్కోట్ వన్డేలోనూ (112) రాహుల్ అజేయ శతకంతో సత్తా చాటాడు. అంతకుముందు సౌతాఫ్రికాపై వరుసగా రెండు వన్డేల్లో అర్ద సెంచరీలతో రాణించాడు.పడిక్కల్ విషయానికొస్తే.. ఇతను కూడా ఫార్మాట్లకతీతంగా చెలరేగిపోతున్నాడు. ఈ సెంచరీకి ముందు పంజాబ్తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో సెంచరీతో మెరిసిన పడిక్కల్.. దానికి ముందు లిస్ట్-ఏ ఫార్మాట్లో పరుగుల వరద పారించాడు. పుదుచ్చేరి, త్రిపురపై వరుస శతకాలు, ఆతర్వాత రాజస్థాన్పై 91, ముంబైపై 81 (నాటౌట్) పరుగులు చేశాడు. రాహుల్, పడిక్కల్ ఇదే భీకర ఫామ్ను కొనసాగిస్తే.. కర్ణాటక మరోసారి రంజీ టైటిల్ గెలవడం ఖాయం. -
మధ్యప్రదేశ్కు దిమ్మతిరిగే షాకిచ్చిన జమ్మూ కశ్మీర్
రంజీ ట్రోఫీ నాకౌట్ దశలో మరో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో ఆదివారం జార్ఖండ్ను ఓడించి చిన్న జట్టు ఉత్తరాఖండ్ తొలి సారి టోర్నీ సెమీస్ చేరగా... తర్వాతి రోజే దేశవాళీ క్రికెట్లో మరో చిన్న జట్టు జమ్మూ కశ్మీర్ జట్టు ఇలాంటి ఫలితాన్నే పునరావృతం చేసింది. 67 ఏళ్ల తమ రంజీ చరిత్రలో జమ్మూ కశ్మీర్ మొదటి సారి సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 1959–60 సీజన్లో తొలి సారి ఈ టోర్నీలో ఆడిన జట్టు ఇన్నేళ్ల తర్వాత సెమీస్ చేరడం విశేషం. సోమవారం ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో కశ్మీర్ 56 పరుగుల తేడాతో 2021–22 చాంపియన్ మధ్యప్రదేశ్పై విజయం సాధించింది. ఐదేసిన ఆఖిబ్ నబీఇండోర్ వేదికగా 291 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్నైట్ స్కోరు 87/5తో నాలుగో రోజు ఆట కొనసాగించిన మధ్య ప్రదేశ్.. 68.3 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. సారాంశ్ జైన్ (81 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీతో పోరాడగా...శుభమ్ శర్మ (32) మాత్రమే ఫర్వాలేదనిపించాడు. వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (17) విఫలం కావడంతో జట్టు గెలుపు ఆశలు కోల్పోయింది. పేస్ బౌలర్ ఆఖిబ్ నబీ (5/70) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీయగా...ఆబిద్ ముస్తాక్కు 3 వికెట్లు దక్కాయి. రెండు ఇన్నింగ్స్లు కలిపి 12 వికెట్లు పడగొట్టిన ఆఖిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సెంచరీతో గెలిపించిన రాహుల్... భారత బ్యాటర్ కేఎల్ రాహుల్ (182 బంతుల్లో 130; 14 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో ముందుండి నడిపించగా చిరకాల ప్రత్యర్థి, 42 సార్లు విజేత అయిన ముంబైని ఓడించి కర్నాటక సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. ఎనిమిది సార్లు చాంపియన్ కర్నాటక సోమవారం ఆసక్తికరంగా ముగిసిన క్వార్టర్స్ పోరులో 4 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది. 325 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఓవర్నైట్ స్కోరు 113/2తో కర్నాటక నాలుగో రోజు ఆట కొనసాగించింది. కరుణ్ నాయర్ ((13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... రాహుల్, రవిచంద్రన్ స్మరణ్ (123 బంతుల్లో 83 నాటౌట్; 11 ఫోర్లు) కలిసి జట్టును విజయం దిశగా నడిపించారు. వీరిద్దరు నాలుగో వికెట్కు 147 పరుగులు జోడించారు. తొలి సెషన్లోనే 147 బంతుల్లో రాహుల్ శతకం పూర్తి చేసుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతనికి ఇది 24వ సెంచరీ కావడం విశేషం. లంచ్ తర్వాత కర్నాటక ఇన్నింగ్స్ కొంత తడబాటుకు గురైంది. 19 పరుగుల వ్యవధిలో రాహుల్, శ్రేయస్ గోపాల్ (1), కృతిక్ కృష్ణ (2) అవుట్ కావడంతో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య కొద్ది సేపు మైదానంలో వాదనలు కూడా జరిగాయి. అయితే స్మరణ్, విద్యాధర్ పాటిల్ (30 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి జట్టును గట్టెక్కింటారు. వీరిద్దరు ఏడో వికెట్కు అభేద్యంగా 40 పరుగులు జత చేశారు. ఆదివారం నుంచి జరిగే తొలి సెమీఫైనల్లో ఉత్తరాఖండ్తో కర్నాటక తలపడుతుంది. -
ముంబై జట్టుకు సచిన్ సలహాలు
ముంబై: కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని ఎలా జయించాలనే అంశంపై ముంబై రంజీ జట్టుకు... క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పలు సూచనలు చేశాడు. గ్రూప్ దశలో చక్కటి ప్రదర్శన కనబర్చిన ముంబై జట్టు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో కర్ణాటకతో తలపడనుంది. ఇప్పటి వరకు ముంబై జట్టు రికార్డు స్థాయిలో 42 సార్లు రంజీ ట్రోఫీ కైవసం చేసుకోగా... కర్ణాటక జట్టు ఎనిమిదిసార్లు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో బుధవారం సచిన్ టెండూల్కర్ ముంబై జట్టుతో ముచ్చటించాడు.ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్తో సుదీర్ఘంగా సంభాషించాడు. ‘డ్రెస్సింగ్ రూమ్లో సచిన్ సార్ను కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మాటలు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. విజయ పరంపర కొనసాగించడం, మానసిక దృఢత్వం, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి ఎన్నో అంశాలపై కీలక సూచనలు చేశారు. ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆయన మాటలు ఎంతో ఉత్సాహాన్నిచ్చాయి. కీలక సమరాల్లో ఒత్తిడిని ఎలా అధిగమించవచ్చో చక్కగా వివరించారు. రంజీ ట్రోఫీలో ఆ సూచనలు పాటిస్తూ విజయాలు సాధించాలని భావిస్తున్నాం’ అని ముంబై కెప్టెన్ శార్దుల్ ఠాకూర్ పేర్కొన్నాడు. -
జైస్వాల్ రీఎంట్రీ
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ దేశవాలీ క్రికెట్లో ముంబై తరఫున రీఎంట్రీ ఇచ్చాడు. ఫిబ్రవరి 6 నుంచి కర్ణాటకతో జరిగే రంజీ ట్రోఫీ 2025-26 క్వార్టర్ ఫైనల్ కోసం ఎంపిక చేసిన 16 మంది సభ్యుల జట్టులో అతనికి చోటు లభించింది. జైస్వాల్ ఈ సీజన్లో ఒక్క రంజీ మ్యాచ్ కూడా ఆడలేదు. అంతర్జాతీయ బాధ్యతలు లేకపోయినా జైస్వాల్ ముంబై జట్టులో లేకపోవడం కొద్ది రోజుల కిందటి వరకు చర్చనీయాంశంగా ఉండింది. ఎట్టకేలకు అతనికి ముంబై జట్టులో చోటు దక్కడంతో ఊహాగానాలకు తెరపడింది. తాజాగా ప్రకటించిన జట్టులో జైస్వాల్తో పాటు శార్దూల్ ఠాకూర్కు కూడా చోటు దక్కింది. శార్దూల్ గాయాల కారణంగా గత కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. శార్దూల్ ముంబై జట్టుకు రెగ్యులర్ కెప్టెన్గానూ ఉన్నాడు. రహానే వైదొలగడంతో శార్దూల్కు కెప్టెన్సీ లభించింది. జైస్వాల్, శార్దూల్ చేరికతో ముంబై జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. కర్ణాటకతో జరిగే క్వార్టర్ ఫైనల్ కోసం ముంబై జట్టు.. - శార్దూల్ ఠాకూర్ (కెప్టెన్) - యశస్వి జైస్వాల్- ముషీర్ ఖాన్ - అఖిల్ హెర్వడ్కర్ - సిద్ధేశ్ లాడ్ - సర్ఫరాజ్ ఖాన్ - ఆకాష్ ఆనంద్ (wk) - హార్దిక్ తమోరే (wk) - సైరాజ్ పటిల్ - శంస్ ములానీ - తనుష్ కోటియన్ - తుషార్ దేశ్పాండే - మోహిత్ అవస్థ - ఓంకార్ తర్మలే - దివ్యేష్ సక్సేనా - సూర్యాంశ్ షెడ్గే -
తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పడిక్కల్ విధ్వంసకర శతకం
కర్ణాటక బ్యాటర్ దేవదత్ పడిక్కల్ దేశవాలీ క్రికెట్లో అరివీర భయంకర ఫామ్ను కొనసాగిస్తున్నాడు. ఇటీవల విజయ్ హజారే వన్డే టోర్నీలో 9 ఇన్నింగ్స్ల్లో 90కి పైగా సగటుతో 4 సెంచరీల సాయంతో 725 పరుగులు చేసిన అతను.. తాజాగా రంజీ ట్రోఫీలో పంజాబ్పై విధ్వంసకర శతకంతో చెలరేగాడు. క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో పడిక్కల్ ఉగ్రరూపం దాల్చాడు. 40 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 85 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 120 పరుగులు చేసి, తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గానూ వ్యవహరించాడు. కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే సెంచరీ సహా మ్యాచ్ను గెలిపించి చిరస్మరణీయం చేసుకున్నాడు. ఛేదనలో పడిక్కల్కు మయాంక్ అగర్వాల్ (53), శ్రేయస్ గోపాల్ (33) సహకరించారు. ఈ ఇన్నింగ్స్లో టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 13 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. పడిక్కల్ విధ్వంసకర శతకంతో కదంతొక్కడంతో కర్ణాటక 27.5 ఓవర్లలోనే (5 వికెట్లు కోల్పోయి) లక్ష్యాన్ని ఛేదించింది. పంజాబ్ బౌలర్లలో అన్మోల్జీత్ సింగ్ 3 వికెట్లు తీయగా.. సుఖ్దీప్, ఎమన్జోత్ చహల్ తలో వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 256 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ ఉదమ్ సహారన్ 93 పరుగులతో రాణించాడు. పంజాబ్ ఇన్నింగ్స్లో సహారన్ మినహా ఎవ్వరూ రాణించలేదు. అన్మోల్ప్రీత్ (44), అభిజీత్ (33), హర్ప్రీత్ బ్రార్ (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, శ్రేయస్ గోపాల్ తలో 3 వికెట్లు తీయగా.. శిఖర్ షెట్టి 2, విధ్యాదర్ పాటిల్, మొహిసిన్ ఖాన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.దీనికి ముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 316 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ గోపాల్ (77), కేఎల్ రాహుల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. మయాంక్ అగర్వాల్ (32), విధ్యాదర్ పాటిల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ 4, సుఖ్దీప్ 3, అన్మోల్ 2, చహల్ ఓ వికెట్ తీశారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్ (81), చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించగా.. సహారన్ (44) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. విధ్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
అభిరథ్ రెడ్డి, హిమతేజ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఛత్తీస్గఢ్తో జింఖానా మైదానంలో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 56/0తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 105 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 415 పరుగులు చేసింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (121; 16 ఫోర్లు, 1 సిక్స్), మిడిలార్డర్ బ్యాటర్ కొడిమెల హిమతేజ (125 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీలు సాధించారు. అమన్ రావు (52; 8 ఫోర్లు, 1 సిక్స్)తో తొలి వికెట్కు 96 పరుగులు జోడించిన అభిరథ్... మూడో వికెట్కు హిమతేజతో 147 పరుగులు జత చేశాడు. ప్రజ్ఞయ్ రెడ్డి (52 బ్యాటింగ్; 8 ఫోర్లు, 1 సిక్స్), హిమతేజ ఐదో వికెట్కు అజేయంగా 91 పరుగులు జోడించాడు. శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి హైదరాబాద్ 132 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఆంధ్ర 267/5 నాగాలాండ్ జట్టుతో సొవిమాలో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ రంజీ ట్రోఫీ లీగ్ మ్యాచ్లో... రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు కోల్పోయి 267 పరుగులు చేసింది. అభిషేక్ రెడ్డి (51; 7 ఫోర్లు), కరణ్ షిండే (51; 5 ఫోర్లు, 1 సిక్స్), సీఆర్ జ్ఞానేశ్వర్ (87 బ్యాటింగ్; 11 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ప్రస్తుతం నాగాలాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 366కు ఆంధ్ర మరో 99 పరుగుల దూరంలో ఉంది. జ్ఞానేశ్వర్తో కలిసి శశికాంత్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజులో ఉన్నాడు. -
సత్తా చాటిన కేఎల్ రాహుల్
టీమిండియా మోస్ట్ ప్రామిసింగ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దేశవాలీ క్రికెట్లోనూ సత్తా చాటుతున్నాడు. జాతీయ విధులకు దూరంగా ఉండటంతో రంజీ బాట బట్టిన ఈ కర్ణాటక వికెట్కీపర్ బ్యాటర్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో (87 బంతుల్లో 59; 9 ఫోర్లు) మెరిశాడు. క్వార్టర్ ఫైనల్కు చేరాలంటే కర్ణాటక ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి.Highlights of KL Rahul’s 59 (87) in the Ranji Trophy. pic.twitter.com/AeV5DXI2aQ— Mufaddal Vohra (@mufaddal_vohra) January 30, 2026కీలకమైన ఈ మ్యాచ్లో ఓపెనర్గా బరిలోకి దిగిన రాహుల్.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్తో కలిసి తొలి వికెట్కు 102 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. రాహుల్, మయాంక్ రాణించినా, ఈ మ్యాచ్లో కర్ణాటక ఎదురీదుతోంది. రెండో రోజు టీ విరామం సమయానికి సగం వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్కు చేరుకోవాలంటే ఇంకా 110 పరుగులు చేయాల్సి ఉంది.శ్రేయస్ గోపాల్ (17), కృతిక్ కృష్ణ (20) కర్ణాటకను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. రాహుల్ ఔటయ్యాక కర్ణాటక స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్తో కెప్టెన్గా అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్, స్మరణ్ రవిచంద్రన్ తలో 9 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. వన్డౌన్లో వచ్చిన కేవీ అనీశ్ (32) క్రీజ్లో కుదురుకున్న సమయంలో ఔటయ్యాడు. హర్ప్రీత్ బ్రార్ 4 వికెట్లు తీసి కర్ణాటకను దారుణంగా దెబ్బకొట్టాడు. ఎమన్జోత్ సింగ్ చహల్ కీలకమైన మయాంక్ అగర్వాల్ వికెట్ తీశాడు.అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో 309 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ అభిజీత్ గార్గ్ (81), ఎమన్జోత్ సింగ్ చహల్ (83) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ ఉదయ్ సహారన్ (44) ఓ మోస్తరుగా రాణించగా.. అన్మోల్ మల్హోత్రా (25), ఆయుశ్ గోయల్ (23), సుఖ్దీప్ బజ్వా (20) రెండంకెల స్కోర్లు చేశారు. కర్ణాటక బౌలర్లలో విద్యాదర్ పాటిల్ 4, శ్రేయస్ గోపాల్ 3, మొహిసిన్ ఖాన్ 2, ప్రసిద్ద్ కృష్ణ ఓ వికెట్ తీశారు. -
నిప్పులు చెరిగిన సిరాజ్
రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా ఛత్తీస్ఘడ్తో ఇవాళ (జనవరి 29) మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ చెలరేగిపోయాడు. జింఖానా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. 17 ఓవర్లలో 56 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. సిరాజ్తో పాటు రక్షన్ (9.3-1-28-2), తనయ్ త్యాగరాజన్ (20-3-81-1), హిమతేజ (4-0-18-1), అనికేత్ రెడ్డి (12-0-65-1) సత్తా చాటడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఛత్తీస్ఘడ్ 283 పరుగులకే పరిమితమైంది. ఏడో స్థానంలో బరిలోకి దిగిన ప్రతీక్ యాదవ్ (99 బంతుల్లో 106; 10 ఫోర్లు, సిక్స్) అనూహ్యంగా సెంచరీ చేసి ఛత్తీస్ఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. ప్రతీక్కు వికల్ప్ తివారి (94) సహకరించారు. వీరిద్దరు ఆరో వికెట్కు 183 పరుగులు జోడించారు. వీరి భాగస్వామ్యాన్ని త్యాగరాజన్ విడగొట్టాడు. రెండు పరుగుల వ్యవధిలోనే సిరాజ్ సెంచరీకి చేరువైన వికల్ప్ తివారిని ఔట్ చేసి ఛత్తీస్ఘడ్ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. వికల్ప్, ప్రతీక్ మినహా ఛత్తీస్ఘడ్ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఆయుశ్ పాండే 11, అనుజ్ తివారి 4, సంజీత్ దేశాయ్ 1, కెప్టెన్ అమన్దీప్ ఖారే 16, మయాంక్ వర్మ 3, సహబాన్ ఖాన్ 20, ఆదిత్య సర్వటే 4, దేవ్ ఆదిత్య సింగ్ 16 పరుగులకు ఔటయ్యారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్రావ్ 32, అభిరథ్ రెడ్డి 23 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో సిరాజ్ హైదరాబాద్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. -
సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్న జురెల్
టీమిండియా భవిష్యత్ తారగా పేరు తెచ్చుకుంటున్న ఉత్తర్ప్రదేశ్ వికెట్కీపర్ కమ్ బ్యాటర్ ధృవ్ జురెల్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఇటీవల జరిగిన విజయ్ హజారే వన్డే టోర్నీలో 7 ఇన్నింగ్స్ల్లో 93 సగటున, 122.90 స్ట్రయిక్రేట్తో 558 పరుగులు చేసిన ఇతను.. ఇవాళ (జనవరి 29) ప్రారంభమైన రంజీ మ్యాచ్లోనూ అదే సూపర్ ఫామ్ను కొనసాగించాడు. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జురెల్ ఒంటరిపోరాటం చేశాడు. 122 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 96 పరుగులు చేసి, నాలుగు పరుగుల తేడాతో ఎంతో అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. జురెల్కు మరో ఎండ్లో శివమ్ మావి (47) సహకరించడంతో ఉత్తర్ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 237 పరుగులు చేయగలిగింది. జురెల్, మావి మినహా యూపీ ఇన్నింగ్స్లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. విదర్భ స్పిన్నర్ హర్ష్ దూబే 6 వికెట్లతో చెలరేగి యూపీని ఘెరంగా దెబ్బ తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 33 పరుగులు చేసింది. ఓపెనర్లు అమన్ మోఖడే (19), సత్యం భోయార్ (13) క్రీజ్లో ఉన్నారు.సూపర్ ఫామ్జురెల్ ఇటీవల కాలంలో అద్భుత ఫామ్లో ఉన్నాడు. గత ఏడు లిస్ట్-ఏ ఇన్నింగ్స్ల్లో రెండు సెంచరీలు, నాలుగు సెంచరీలు బాదాడు. అంతకుముందు సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఘోరంగా విఫలమైన (14 & 13, 0 & 2) జురెల్.. దానికి ముందు సౌతాఫ్రికా-ఏతో జరిగిన ఫస్ట్క్లాస్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలతో అదరగొట్టాడు. దీనికి ముందే టెస్ట్ సిరీస్లో అరంగేట్రం చేసిన జురెల్.. అరంగేట్రం మ్యాచ్లోనే సెంచరీతో కదంతొక్కాడు. అనంతరం రెండో టెస్ట్లోనూ 44 పరుగులతో పర్వాలేదనిపించాడు. -
దేవదత్ పడిక్కల్కు ప్రమోషన్
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్కు ప్రమోషన్ లభించింది. ఇటీవల ముగిసిన విజయ్ హజారే వన్డే టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతన్ని (725 పరుగులు 90.62 సగటుతో) కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తమ రంజీ కెప్టెన్గా నియమించింది. ఈనెల 29 నుంచి పంజాబ్తో జరుగబోయే మ్యాచ్లో పడిక్కల్ కర్ణాటక కెప్టెన్గా వ్యవహరిస్తాడు. గ్రూప్ దశలో కర్ణాటకకు ఇదే చివరి మ్యాచ్. కీలకమైన ఈ మ్యాచ్కు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కేవలం రెండు మ్యాచ్ల అనుభవమున్న పడిక్కల్కు కెప్టెన్గా అవకాశమిచ్చి సాహసోపేత నిర్ణయం తీసుకుంది. రెడ్ బాల్ ఫార్మాట్లో పడిక్కల్ కెప్టెన్సీ చేపట్టడం ఇదే తొలిసారి. 2023లో అతను సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఓ మ్యాచ్కు కెప్టెన్గా వ్యవహరించాడు. పెద్దగా ఫామ్లో లేని మయాంక్ అగర్వాల్ను తప్పించి పడిక్కల్కు రంజీ కెప్టెన్గా అవకాశం ఇచ్చారు.పంజాబ్తో మ్యాచ్కు ప్రకటించిన జట్టులో మరిన్ని ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. టీమిండియా ప్లేయర్లు కేఎల్ రాహుల్, ప్రసిద్ద్ కృష్ణ జట్టులోకి వచ్చారు. ప్రస్తుతం టీమిండియా విధులు లేకపోవడంతో వీరిద్దరూ రంజీ బాట పట్టారు.మరో స్టార్ బ్యాటర్ కరుణ్ నాయర్ గాయం కారణంగా ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. మధ్యప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో గాయపడ్డ కరుణ్ స్థానాన్ని నికిన్ జోస్ భర్తీ చేశాడు. మరో స్టార్ ఆటగాడు అభినవ్ మనోహర్పై వేటు పడింది. మనోహర్ గత కొంతకాలంగా ఫామ్లో లేడు. మయాంక్ అగర్వాల్ను కెప్టెన్సీ నుంచి తప్పించినా సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగనున్నాడు.కీలక పోరాటం గ్రూప్ బి పాయింట్ల పట్టికలో కర్ణాటక మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ముందంజలో ఉండగా, సౌరాష్ట్ర వెనుక నుంచి (నాలుగో స్థానం) ఒత్తిడి పెంచుతోంది. క్వార్టర్ ఫైనల్ నేపథ్యంలో పంజాబ్తో మ్యాచ్ కర్ణాటకకు అత్యంత కీలకంగా మారింది. కర్ణాటక జట్టు (పంజాబ్ మ్యాచ్ కోసం) - మయాంక్ అగర్వాల్ - కేఎల్ రాహుల్ - అనీష్ KV - దేవదత్ పడిక్కల్ (కెప్టెన్) - స్మరణ్ R - శ్రేయస్ గోపాల్ - కృతిక్ కృష్ణ (wk) - వెంకటేష్ M - విద్యాధర్ పటిల్ - విద్యవత్ కావేరప్ప - ప్రసిద్ధ్ కృష్ణ - మొహ్సిన్ ఖాన్ - శిఖర్ శెట్టి - శ్రీజిత్ (wk) - ధ్రువ్ ప్రభాకర్ -
యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయము!
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తీరుపై విమర్శలు వస్తున్నాయి. అతడి పట్ల ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) గుర్రుగా ఉంది. కాగా జాతీయ జట్టు తరఫున విధుల్లో లేని సమయంలో దేశీ క్రికెట్లో ఆడాలని బీసీసీఐ టీమిండియా ఆటగాళ్లను ఆదేశించిన విషయం తెలిసిందే.ఇందుకు అనుగుణంగా దిగ్గజ బ్యాటర్లు విరాట్ కోహ్లి (Virat Kohli), రోహిత్ శర్మ (Rohit Sharma) సైతం ఈసారి వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ బరిలో దిగారు. కోహ్లి ఢిల్లీ తరఫున.. రోహిత్ ముంబైకి ఆడి సత్తా చాటారు. ఇక యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సైతం సొంతజట్టు ముంబై తరఫున ఈ టోర్నీలో రెండు మ్యాచ్లు ఆడాడు.రంజీ ట్రోఫీ రెండో దశ మ్యాచ్లుప్రస్తుతం ముంబై జట్టు రంజీ ట్రోఫీ రెండో దశ (Ranji Trophy 2025-26) మ్యాచ్లతో బిజీగా ఉంది. ఇందులో భాగంగా హైదరాబాద్తో ఆదివారం ముగిసిన మ్యాచ్లో ముంబై తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా నాకౌట్ దశకు అర్హత సాధించింది. తదుపరి సొంత మైదానంలో ఢిల్లీ జట్టుతో ముంబై తలపడనుంది.కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ సహా వెటరన్ స్టార్ అజింక్య రహానే వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పటికే జట్టుకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఎంసీఏ సెలక్టర్లు.. ఢిల్లీతో మ్యాచ్కు అందుబాటులో ఉండే విషయమై యశస్వి జైస్వాల్ను సంప్రదించారు. అయితే, అతడి నుంచి ఎలాంటి స్పందనా లేదని తెలుస్తోంది. దీంతో జైసూను ఎంపిక చేయబోమని ఎంసీఏ వర్గాలు స్పష్టం చేశాయి.స్పందన కరువు.. ఈ విషయం గురించి MCA అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ.. “హైదరాబాద్తో మ్యాచ్కు జట్టును ఎంపిక చేసే సమయంలోనూ అతడిని సంప్రదించాము. అయితే, అటు వైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. తనకు నచ్చినపుడు నచ్చిన మ్యాచ్లలో మాత్రమే అతడు ఆడాలని అనుకుంటున్నట్లు అర్థమవుతోంది.యశస్వి జైస్వాల్ను ఎంపిక చేయము!తదుపరి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంటాడా? లేదా? అని అడిగినపుడు కూడా అతడి నుంచి స్పందన లేదు. అందుకే ఢిల్లీతో మ్యాచ్కు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదు. అతడిని ఎంపిక చేయడం లేదు’’ అని పేర్కొన్నారు. కాగా ఢిల్లీతో మ్యాచ్కు పదిహేను మంది సభ్యులతో కూడిన జట్టును ఎంసీఏ ఆదివారం ప్రకటించింది. సిద్దేశ్ లాడ్ కెప్టెన్సీలోని ఈ జట్టులో సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి స్టార్లు ఉన్నారు.చదవండి: ICC: వెనక్కి తగ్గిన బంగ్లాదేశ్.. ఆ పని చేయబోము -
అతడొక అటాకింగ్ ప్లేయర్: సెలక్టర్లపై అజారుద్దీన్ ఫైర్
టీమిండియా సెలక్టర్ల తీరును భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ విమర్శించాడు. కొంతమంది ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నా వారికి అవకాశాలు ఇస్తున్న యాజమాన్యం.. సర్ఫరాజ్ ఖాన్ వంటి అద్భుత ఆటగాడిని మాత్రం పక్కనపెట్టిందన్నాడు.కాగా గత కొంతకాలంగా సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. దేశవాళీ టీ20, వన్డే టోర్నీలలో శతక్కొట్టిన ఈ ముంబై బ్యాటర్.. తాజాగా హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో మెరిశాడు. ఉప్పల్లో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో ద్విశతకం పూర్తి చేసుకుని ముంబైకి భారీ స్కోరు అందించాడు. మొత్తంగా 219 బంతుల్లో 19 ఫోర్లు, 9 సిక్స్ల సాయంతో 227 పరుగులు సాధించాడు.ఐదో డబుల్ సెంచరీ ఫలితంగా హైదరాబాద్తో జట్టుతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో ముంబై భారీ స్కోరు నమోదు చేసింది. ఓవర్నైట్ స్కోరు 332/4తో శుక్రవారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై జట్టు చివరకు 123.2 ఓవర్లలో 560 పరుగులకు ఆలౌటైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఐదో డబుల్ సెంచరీ చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సువేద్ పార్కర్ (98 బంతుల్లో 75; 11 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.ఈ సీజన్లో సర్ఫరాజ్ విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీలో గోవాపై (157)పై సెంచరీ... ముస్తాక్ అలీ ట్రోఫీ టీ20 టోర్నీపై అస్సాంపై (100 నాటౌట్) సెంచరీ సాధించాడు. ఇక హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీ చేసిన అనంతరం సర్ఫరాజ్ క్రిక్బజ్తో మాట్లాడుతూ.. అజారుద్దీన్కు క్రెడిట్ ఇచ్చాడు.ఎలా ఆడాలో చూపించారు‘‘నా కెరీర్లో పెద్దగా రివర్స్ స్వింగ్ షాట్లు ఆడలేదు. అజర్ సర్ని కలవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఆయనతో క్రికెట్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఇప్పటికి ఇది సాధ్యమైంది. ఆయన ఆఫీసుకు వెళ్లాను.ఇక్కడ (ఉప్పల్) ఆరంభంలోనే ఎక్కువ రివర్స్ స్వింగ్కు అనుకూలంగా ఉంటుందని అజర్ సర్ చెప్పారు. ఇన్స్వింగ్ ఎలా రాబట్టాలో వివరించారు. ఇంకా ఎన్నో విషయాలు చెప్పారు. కుర్చీ నుంచి లేచి నిలబడి మరీ వివిధ రకాల షాట్లు ఎలా ఆడాలో చూపించారు. దాదాపు రెండు గంటల పాటు మా సంభాషణ కొనసాగింది’’ అని సర్ఫరాజ్ ఖాన్ అజారుద్దీన్ పట్ల కృతజ్ఞతా భావాన్ని చాటుకున్నాడు.అతడొక అటాకింగ్ బ్యాటర్ఇక ఇందుకు స్పందనగా.. ‘‘డబుల్ సెంచరీ విషయంలో క్రెడిట్ మొత్తం సర్ఫరాజ్కే దక్కాలి. తను నా ఆఫీస్కు వచ్చి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాడు. నేనూ కొన్ని విషయాలు అతడికి చెప్పాను. అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్కు శుభాకాంక్షలు.అతడు గొప్పగా ఆడాడు. టీమిండియాకు అతడిని మళ్లీ ఎంపిక చేయాలి. సర్ఫరాజ్కు తగినన్ని అవకాశాలు ఇవ్వడం లేదు. అతడొక అటాకింగ్ బ్యాటర్. మిగిలిన ప్లేయర్లకు ఇచ్చినట్లు అతడికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని టీమిండియా సెలక్టర్ల తీరును అజారుద్దీన్ విమర్శించాడు.చదవండి: ఇషాన్ ఏం తిన్నాడో ఏమో.. నాకైతే కోపమొచ్చింది: సూర్య కుమార్ -
500 వికెట్లు.. 7000కు పైగా పరుగులు
భారత క్రికెట్లో అత్యంత అన్ లక్కీ ఆటగాళ్లలో మధ్యప్రదేశ్కు చెందిన జలజ్ సక్సేనా ఒకరు. 39 ఏళ్ల ఈ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ (ఆఫ్ స్పిన్) ఆల్ రౌండర్ దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నా, ఒక్కసారి కూడా టీమిండియా తలుపులు తట్టలేకపోయాడు.20 ఏళ్లకు పైగా స్థిరంగా రాణిస్తున్నా జలజ్ను టీమిండియా సెలెక్టర్లు ఏనాడూ గుర్తించలేదు. జలజ్ కంటే తక్కువ స్థాయి ప్రదర్శనలు చేసిన చాలామంది ఆటగాళ్లు టీమిండియా ఛాన్స్లు కొట్టి, కెరీర్లు మలచుకున్నారు. కానీ జలజ్ మాత్రం దేశవాలీ క్రికెట్లో పరిమితమయ్యాడు.టెస్ట్ ఫార్మాట్లో జలజ్ సూపర్గా సెట్ అయ్యే ఆటగాడు. అతని కుడి చేతి ఆఫ్ స్పిన్ బౌలింగ్.. మిడిలార్డర్ బ్యాటింగ్ టీమిండియాకు చాలా ఉపయోగపడి ఉండేది. రవీంద్ర జడేజా జట్టులో నాటుకు పోయినందుకో లేక ఇతరత్రా కారణాలో తెలియదు కానీ, జలజ్కు ఏనాడూ టీమిండియా అవకాశానికి నోచుకోలేకపోయాడు.2005లో మధ్యప్రదేశ్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేసిన జలజ్.. ఇప్పటివరకు 150 మ్యాచ్ల్లో 500 వికెట్లు తీసి, 7000కు పైగా పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు సహా 35 ఐదు వికెట్ల ప్రదర్శనలు, 10 పది వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. జలజ్కు లిస్ట్-ఏ ఫార్మాట్లోనూ మంచి ట్రాక్ రికార్డే ఉంది. ఈ ఫార్మాట్లో 109 మ్యాచ్ల్లో 2000కు పైగా పరుగులు (3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు) చేసి, 123 వికెట్లు తీశాడు. జలజ్ టీ20 ఫార్మాట్లోనూ ఓ మోస్తరు ట్రాక్ రికార్డు కలిగి ఉన్నాడు. ఈ ఫార్మాట్లో 73 మ్యాచ్ల్లో 77 వికెట్లు (2 ఐదు వికెట్ల ప్రదర్శనలు) తీసి, 688 పరుగులు చేశాడు.మూడు ఫార్మాట్లలో ఇంత ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్నా జలజ్ భారత-ఏ జట్టు స్థాయి వరకే వెళ్లగలిగాడు. అక్కడు కూడా స్థిరమైన ప్రదర్శనలు చేసినా, భారత సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదు. 2013లో జలజ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-ఏ జట్లపై అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శనలు చేశాడు.జలజ్ అరంగేట్రం నుంచి దాదాపు ప్రతి రంజీ సీజన్లో స్థిరమైన ప్రదర్శనలు చేస్తూ వస్తున్నాడు. 39 ఏళ్ల వయసులోనే జలజ్ ఏమాత్రం తగ్గడం లేదు.ప్రస్తుత రంజీ సీజన్కు ముందే కేరళ నుంచి మహారాష్ట్రకు మారిన జలజ్.. గోవాతో జరుగుతున్న మ్యాచ్లో 6 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటడు. ఈ క్రమంలోనే జలజ్ ఓ చారిత్రక మైలురాయిని తాకాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 500 వికెట్లు పూర్తి చేసుకొని, అత్యంత అరుదైన జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు.జలజ్ కెరీర్లో అత్యుత్తమ రికార్డులు..రంజీ ట్రోఫీ చరిత్రలో 6000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి ఆటగాడుఒకే మ్యాచ్లో రెండు సెంచరీలు, 8 వికెట్లు తీసిన తొలి భారతీయుడుగోవా-మహారాష్ట్ర మ్యాచ్ విషయానికొస్తే.. జలజ్ చెలరేగడంతో (34-6-79-6) తొలుత బ్యాటింగ్ చేసిన గోవా 209 పరుగులకే ఆలౌటైంది. జలజ్తో పాటు రామకృష్ణ ఘోష్ (15.1-4-34-2), విక్కీ ఓస్వాల్ (22-5-47-2) కూడా రాణించారు. గోవా ఇన్నింగ్సలో కెప్టెన్ స్నేహల్ కౌతాంకర్ (73) ఒక్కడే రాణించాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర 67 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది. రుతరాజ్ గైక్వాడ్ (66) అర్ద సెంచరీతో రాణించి మహారాష్ట్రను ఆదుకున్నాడు. ప్రస్తుతం సౌరభ్ నవలే (46), జలజ్ సక్సేనా (4) క్రీజ్లో ఉన్నారు. లలిత్ యాదవ్ 3 వికెట్లతో మహారాష్ట్రను దెబ్బతీశాడు. -
టీమిండియాలో చోటిస్తారా? లేదా?.. సెలక్టర్లకు వార్నింగ్!
ముంబై క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్తో మెరిశాడు. హైదరాబాద్తో రంజీ ట్రోఫీ మ్యాచ్లో డబుల్ సెంచరీతో దుమ్ములేపాడు. తద్వారా టెస్టు జట్టు నుంచి తనను తప్పించిన సెలక్టర్లకు మరోసారి బ్యాట్ ద్వారానే గట్టి హెచ్చరికలు జారీ చేశాడు.కాగా ఫార్మాట్లకు అతీతంగా సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) దేశీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇటీవల టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా డిసెంబరు 2న శతక్కొట్టిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా డిసెంబరు 31న మరోసారి సెంచరీ బాదాడు.ఈసారి ద్విశతకంతో తాజాగా హైదరాబాద్తో రంజీ మ్యాచ్లో ద్విశతకంతో చెలరేగాడు సర్ఫరాజ్ ఖాన్. ఉప్పల్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డిలో భాగంగా గురువారం హైదరాబాద్- ముంబై మధ్య మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన సిరాజ్ సేన.. ముంబైని బ్యాటింగ్కు ఆహ్వానించింది.227 పరుగులుఈ క్రమంలో తొలిరోజు శతక్కొట్టిన సర్ఫరాజ్.. శుక్రవారం నాటి రెండో రోజు ఆట సందర్భంగా డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా 219 బంతులు ఎదుర్కొన్న అతడు 227 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్లో 19 ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉండటం విశేషం. అయితే, రక్షణ్ బౌలింగ్లో బౌల్డ్ కావడంతో సర్ఫరాజ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.ఇక సర్ఫరాజ్కు తోడు కెప్టెన్ సిద్దేశ్ లాడ్ (104) శతక్కొట్టాడు. సువేద్ పార్కర్ 75, అథర్వ అంకోలేకర్ 35 పరుగులతో రాణించారు. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో ముంబై 560 పరుగుల భారీ స్కోరు చేసి ఆలౌట్ అయింది. హైదరాబాద్ బౌలర్లలో రక్షణ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. రోహిత్ రాయుడు రెండు, నితిన్ సాయి యాదవ్, కొడిమెల హిమతేజ, కెప్టెన్ మొహమ్మద్ సిరాజ్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.టీమిండియాలో పునరాగమనం చేసేనా?దేశీ క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టి సత్తా చాటాడు. అయితే, చివరగా 2024లో స్వదేశంలో న్యూజిలాండ్తో టెస్టు సిరీస్లో ఆడిన సర్ఫరాజ్ను సెలక్టర్లు మళ్లీ జట్టుకు ఎంపిక చేయలేదు.ఈ క్రమంలో దేశీ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో రాణిస్తూ సర్ఫరాజ్ సెలక్టర్లకు సవాల్ విసురుతున్నాడు. కాగా ఇప్పటి వరకు అతడు టీమిండియా తరఫున టెస్టులు మాత్రమే ఆడాడు. వన్డే, టీ20 జట్లలో అరంగేట్రం చేయలేదు.ఇదిలా ఉంటే ప్రస్తుతం న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో బిజీగా ఉన్న టీమిండియా తదుపరి టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటుంది. ఆ తర్వాత ఐపీఎల్-2026తో బిజీ కానున్నారు భారత ఆటగాళ్లు. ఆ తర్వాత జూలైలో ఇంగ్లండ్ పర్యటనతో మళ్లీ టీమిండియా విధుల్లో చేరతారు. చదవండి: ODI WC 2027: ‘గిల్పై వేటు.. మళ్లీ వన్డే కెప్టెన్గా రోహిత్ శర్మ’ -
చెలరేగిన ఆంధ్ర బౌలర్.. అద్భుత ప్రదర్శన
డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో రంజీ మ్యాచ్లో ఆంధ్ర బౌలర్ కలిదిండి నరసింహ (కేఎస్ఎన్) రాజు అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఐదు వికెట్లతో చెలరేగి ప్రత్యర్థి జట్టును నామమాత్రపు స్కోరకు పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు.దేశీ ఫస్ట్క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో దశ మ్యాచ్లు గురువారం మొదలయ్యాయి. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-ఎలో భాగమైన విజయనగరం వేదికగా ఆంధ్రతో మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్ చేసింది.యశ్ రాథోడ్ శతకంమ్యాచ్ ఆరంభం నుంచే ఆంధ్ర బౌలర్లు కట్టిపడేయడంతో విదర్భ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే, యశ్ రాథోడ్ (Yash Rathod- 104 బ్యాటింగ్; 12 ఫోర్లు) అజేయ శతకంతో ఆదుకున్నాడు. మరోవైపు.. ఈ సీజన్లో దంచి కొడుతున్న అమన్ మోఖడే (21), దానిశ్ మాలేవర్ (0), అథర్వ తైడె (13), సమర్థ్ (9)లను కేఎస్ఎన్ రాజు తన వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. దీంతో విదర్భ ఒక దశలో 45/4తో కష్టాల్లో పడింది.ఈ సమయంలో యశ్ రాథోడ్ గొప్ప సంయమనం కనబర్చాడు. మొదట రోహిత్తో ఐదో వికెట్కు 93 పరుగులు జోడించి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. ఆ తర్వాత లోయర్ ఆర్డర్ అండతో జట్టును ముందుకు నడిపాడు. ఫలితంగా గురువారం నాటి తొలి రోజు ఆట ముగిసేసరికి విదర్భ తొలి ఇన్నింగ్స్లో 81 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది.మరో 28 పరుగులు జతచేసి ఈ క్రమంలో 267/7 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆట మొదలుపెట్టిన విదర్భ మరో 28 పరుగులు మాత్రమే జతచేసి ఆలౌట్ అయింది. ఆంధ్ర బౌలర్లలో రాజు ఐదు వికెట్లు (5/62) కూల్చగా.. కావూరి సాయితేజ యశ్ రాథోడ్ (115), రోహిత్ బింకర్ (37) రూపంలో రెండు కీలక వికెట్లు పడగొట్టడంతో పాటు పార్థ్ రేఖడే వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఇక టీమిండియా స్టార్ నితీశ్ కుమార్ రెడ్డి, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా విదర్భ తొలి ఇన్నింగ్స్లో 89.3 ఓవర్లు ఆడి 295 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. ఆంధ్ర జట్టు బ్యాటింగ్ మొదలుపెట్టింది.చదవండి: IND vs NZ: అతడు అవుట్!.. భారత తుదిజట్టులో మార్పు! -
ఒకే రోజు 23 వికెట్లు
రాజ్కోట్: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్మన్ గిల్... దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్ కెప్టెన్గా బరిలోకి దిగిన గిల్ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్ బౌలింగ్లో డకౌట్గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి. మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్ గోహిల్ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్ దేశాయ్ (13), చిరాగ్ జానీ (8), అర్పిత్ (2), సమర్ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుసకట్టారు. ప్రేరక్ మన్కడ్ (32) ఫర్వాలేదనిపించాడు. పంజాబ్ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్సిమ్రన్ సింగ్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్మోల్ప్రీత్ సింగ్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఫర్వాలేదనిపించారు. గిల్తో పాటు హర్నూర్ సింగ్ (0), నేహల్ వధేరా (6), ప్రేరిత్ దత్తా (11), ఉదయ్ శరణ్ (23) విఫలమయ్యారు. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (6), చిరాగ్ జానీ (5), జయ్ గోహిల్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది. ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది. కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో మధ్యప్రదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్తో మ్యాచ్లో కేరళ తొలి ఇన్నింగ్స్లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. -
సర్ఫరాజ్, సిద్ధేశ్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: సర్ఫరాజ్ ఖాన్ (142 బ్యాటింగ్; 11 ఫోర్లు, 5 సిక్స్లు), కెప్టెన్ సిద్ధేశ్ లాడ్ (104; 10 ఫోర్లు, 2 సిక్స్లు) ‘శత’క్కొట్టారు. ఫలితంగా రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ముంబై 87 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఓపెనర్లు అఖిల్ (27), ఆకాశ్ ఆనంద్ (35)లతో పాటు ముషీర్ ఖాన్ (11) విఫలమయ్యారు. 82/3తో కష్టాల్లో పడ్డ ముంబైను సిద్ధేశ్, సర్ఫరాజ్ ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 249 పరుగులు జత చేశారు. తొలి రోజు ఆట ముగుస్తుందనగా సిద్ధేశ్ అవుటయ్యాడు. హిమాన్షు (0 బ్యాటింగ్)తో కలిసి సర్ఫరాజ్ క్రీజులో ఉన్నాడు. హైదరాబాద్ బౌలర్లలో రోహిత్ రాయుడు రెండు వికెట్లు పడగొట్టగా... సిరాజ్, నితిన్ సాయి యాదవ్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. -
శుబ్మన్ గిల్ ఫెయిల్.. జడ్డూ విఫలమైనా..
టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ దేశవాళీ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్ తరఫున ఒక్క మ్యాచ్ ఆడాడు గిల్. అనంతరం న్యూజిలాండ్తో వన్డే సిరీస్తో బిజీ అయ్యాడు.ఈ సిరీస్లో గిల్ సేన కివీస్ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్తో టీ20 సిరీస్, టీ20 ప్రపంచకప్-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్ కెప్టెన్గా రంజీ సెకండ్ లీగ్ బరిలో దిగాడు.పంజాబ్ తొలుత బౌలింగ్రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్లో టాస్ ఓడిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. హర్ప్రీత్ బ్రార్ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్ సింగ్ రెండు, సన్వీర్ సింగ్, ప్రేరిత్ దత్తా చెరో వికెట్తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 172 పరుగులకే ఆలౌట్ అయింది.జడ్డూ విఫలంసౌరాష్ట్ర ఇన్నింగ్స్లో వన్డౌన్ బ్యాటర్ జై గోహిల్ 82 పరుగులతో టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. ప్రేరక్ మన్కడ్ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్ బ్యాటింగ్ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్, కెప్టెన్ జయదేవ్ ఉనాద్కట్ దెబ్బకు పంజాబ్ ఓపెనర్ హర్నూర్ సింగ్ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.అయితే, మరో ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్డౌన్ బ్యాటర్ ఉదయ్ సహారన్ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్కు పంపాడు. ఇక నాలుగో నంబర్ బ్యాటర్ నేహాల్ వధేరా (6)ను పార్థ్ భూట్ అవుట్ చేశాడు.గిల్ డకౌట్ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన గిల్ను సైతం పార్థ్ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్ లెగ్ బిఫోర్ వికెట్ (LBW)గా పెవిలియన్ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్ తరఫున గిల్ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.పంజాబ్ ఆలౌట్.. సౌరాష్ట్రకుకు ఆధిక్యంకాగా పంజాబ్ తరఫున ప్రభ్సిమ్రన్ (44), అన్మోల్ప్రీత్ సింగ్ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్ ఒక వికెట్ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్లో మాత్రం ఫర్వాలేదనిపించాడు.చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!During today’s Ranji match, Shubman Gill was actually not out. It was clearly bat first, but since there is no DRS in domestic matches, he was given out. BCCI, if you can’t provide DRS or even a proper live stream, then don’t conduct tournaments like this. pic.twitter.com/0LEZFFANgd— MARCUS (@MARCUS907935) January 22, 2026 -
శుభ్మన్ గిల్ కీలక నిర్ణయం
టీమిండియా వన్డే కెప్టెన్గా శుభ్మన్ గిల్ వరుసగా రెండో సిరీస్ ఓటమిని ఎదుర్కొన్నాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడో వన్డేల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కోల్పోయింది. గతేడాది ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా మెన్ బ్లూ ఓడిపోయింది. గిల్ కెప్టెన్సీలో భారత్ కేవలం వెస్టిండీస్తో టెస్టు సిరీస్ను మాత్రమే సొంతం చేసుకుంది.దీంతో గిల్ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్కప్ 2026 జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన గిల్.. మళ్లీ దాదాపు ఏడు నెలల తర్వాత మళ్లీ జాతీయ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్ పర్యటనకు భారత్ వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్లో ఆతిథ్య జట్టుతో భారత తలపడనుంది.ఈ టూర్లో వన్డే సిరీస్లో గిల్ జట్టును ముందుకు నడిపించనున్నాడు. ఇప్పటికే టీ20 జట్టుకు అతడు దూరం అయ్యాడు కాబట్టి... ఈ టూర్ మొదలయ్యే వరకు గిల్ భారత్ తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే సూచనలు కన్పించడం లేదు. ఈ క్రమంలో గిల్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో ఆడాలని గిల్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ దేశవాళీ టోర్నీ సెకెండ్ లీగ్లో పంజాబ్ ఆడే తొలి మ్యాచ్లో గిల్ బరిలోకి దిగే అవకాశముంది. జనవరి 22న రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో సౌరాష్ట్రతో పంజాబ్ తలపడనుంది. ఈ మ్యాచ్లో సౌరాష్ట్ర తరపున సీనియర్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆడనున్నాడు.న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జడేజా అటు బ్యాటింగ్లో, ఇటు బౌలింగ్లోనూ విఫలమయ్యాడు. దీంతో తన ఫామ్ను తిరిగి అందుకోవడానికి జడేజాకు రంజీ ట్రోఫీ కీలకం కానుంది. అవేవిధంగా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ జట్టు కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.చదవండి: ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లి -
రింకూ సింగ్ విధ్వంసం.. వణకిపోయిన బౌలర్లు
టీమిండియా వైట్ బాల్ స్పెషలిస్ట్ రింకూ సింగ్ టెస్టు క్రికెట్లో అరంగేట్రం దిశగా అడుగులు వేస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025/26 సీజన్లో రింకూ అద్భుతమైన ఫామ్తో దూసుకుపోతున్నాడు. తమిళనాడుతో కోయంబత్తూరు వేదికగా జరుగుతున్న ఎలైట్ గ్రూపు-ఎ మ్యాచ్లో ఈ యూపీ బ్యాటర్ భారీ శతకంతో చెలరేగాడు.149 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రింకూ.. వన్డే తరహాలో తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు. అప్పటివరకు బంతిని గింగరాలు తిప్పిన తమిళనాడు స్పిన్నర్లు పి. విద్యుత్, కెప్టెన్ సాయి కిషోర్లను రింకూ సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. పిచ్ కండీషన్స్ ఆర్ధం చేసుకోవడానికి కాస్త సమయం తీసుకున్న రింకూ సింగ్.. ఆ తర్వాత తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రింకూ సింగ్ ఓవరాల్గా 248 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్లతో 176 పరుగులు చేసి ఔటయ్యాడు. లోయార్డర్ బ్యాటర్ శివమ్ మావితో కలిసి 104 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని ఈ కేకేఆర్ బ్యాటర్ నెలకొల్పాడు. ఫలితంగా యూపీ తమ తొలి ఇన్నింగ్స్లో 460 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంతకుముందు తమిళనాడు మొదటి ఇన్నింగ్స్లో 455 పరుగులు చేసింది. దీంతో యూపీకి కేవలం 5 పరుగుల ఆధిక్యం మాత్రమే లభించింది.అంతకుముందు ఆంధ్రప్రదేశ్తో మ్యాచ్లో కూడా రింకూ(165) శతక్కొట్టాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడిన సింగ్.. 341 పరుగులు చేశాడు. -
అభిషేక్ రెడ్డి డబుల్ సెంచరీ
జంషెడ్పూర్: ఓపెనర్ అభిషేక్ రెడ్డి (348 బంతుల్లో 247; 20 ఫోర్లు, 2 సిక్స్లు) భారీ డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఆంధ్ర జట్టు కొండంత స్కోరు చేసింది. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఆంధ్ర జట్టు 128 ఓవర్లలో 567/6 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 224/2తో మంగళవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. అభిషేక్ రెడ్డి సంయమనంతో కూడిన ఇన్నింగ్స్తో జట్టుకు వెన్నెముకలా నిలిచాడు. కరణ్ షిండే (129 బంతుల్లో 94; 7 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. శ్రీకర్ భరత్, షేక్ రషీద్ అర్ధశతకాలు సాధించగా... త్రిపురణ విజయ్ (27), కెప్టెన్ రికీ భుయ్ (18) ఎక్కువసేపు నిలవలేకపోయారు. అయితే ఐదో వికెట్కు కరణ్ షిండేతో కలిసి అభిõÙక్ రెడ్డి 208 పరుగులు జోడించడంతో ఆంధ్ర జట్టు భారీ స్కోరు చేయగలిగింది. ఆఖర్లో సౌరభ్ కుమార్ (13 బంతుల్లో 28 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడాడు. జార్ఖండ్ బౌలర్లలో అనుకూల్ రాయ్, రిషవ్ రాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జార్ఖండ్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 15 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసింది. శిఖర్ మోహన్ (3), కుమార్ కుషాగ్ర (16) అవుట్ కాగా... శరణ్దీప్ సింగ్ (13 బ్యాటింగ్) మానిషి (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్, సౌరభ్ కుమార్ చెరో వికెట్ పడగొట్టారు. మంగళవారం ఆట ముగిసే సరికి చేతిలో 8 వికెట్లు ఉన్న జార్ఖండ్ జట్టు... ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 205 పరుగులు వెనుకబడి ఉంది. -
రవిచంద్రన్ డబుల్ సెంచరీ.. కర్ణాటక ఘనవిజయం
రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘బి’లో కర్ణాటక జట్టు రెండో విజయం నమోదు చేసుకుంది. చండీగఢ్తో మంగళవారం ముగిసిన పోరులో కర్ణాటక ఇన్నింగ్స్, 185 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్నైట్ స్కోరు 72/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన చండీగఢ్... 63.2 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మనన్ వోహ్రా (161 బంతుల్లో 106 నాటౌట్; 12 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లంతా విఫలమయ్యారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 7 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దక్కించుకున్న కర్ణాటక జట్టు... ప్రత్యరి్థని ఫాలోఆన్ ఆడించింది. రెండో ఇన్నింగ్స్లోనూ అదే వైఫల్యం కొనసాగించిన చండీగఢ్ 33.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌటైంది. శివమ్ బాంబ్రీ (43) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మనన్ వోహ్రా (6) సహా మిగిలిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 3, శిఖర్ శెట్టి 5 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు కర్ణాటక తొలి ఇన్నింగ్స్ను 547/8 వద్ద డిక్లేర్ చేసింది. డబుల్ సెంచరీతో చెలరేగిన కర్ణాటక బ్యాటర్ రవిచంద్రన్ స్మరణ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన కర్ణాటక 2 విజయాలు, 3 ‘డ్రా’లతో 21 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో కొనసాగుతోంది. షాబాజ్ అహ్మద్ సెంచరీ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ (122 బంతుల్లో 101; 11 ఫోర్లు, 2 సిక్స్లు) సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అస్సాంతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘సి’ మ్యాచ్లో బెంగాల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 109.1 ఓవర్లలో 442 పరుగులకు ఆలౌటైంది. సుమంత గుప్తా (97) మూడు పరుగుల తేడాతో శతకం చేజార్చుకున్నాడు. టీమిండియా ప్లేయర్ మొహమ్మద్ షమీ (14 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్) క్రీజులో ఉన్నంతసేపు ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అస్సాం జట్టు... మూడో రోజు ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 3 వికెట్లకు 98 పరుగులు చేసింది. షమీ (2/29) వరుస ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి అస్సాంను కట్టడి చేశాడు. నేడు ఆటకు ఆఖరి రోజు కాగా... చేతిలో 7 వికెట్లు ఉన్న అస్సాం ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరు సమం చేసేందుకే ఇంకా 144 పరుగులు చేయాల్సి ఉంది. విహారి, విజయ్ విఫలం రంజీ ట్రోఫీలో త్రిపుర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత ఆటగాళ్లు హనుమ విహారి, విజయ్ శంకర్ మరోసారి విఫలమయ్యారు. ఎలైట్ గ్రూప్ ‘సి’లో భాగంగా రైల్వేస్తో జరిగిన పోరులో ఈ ఇద్దరూ విఫలమయ్యారు. రెండో ఇన్నింగ్స్లో విహారి 42 బంతులాడి 6 పరుగులు చేయగా... విజయ్ శంకర్ (11) కూడా ఫ్రభావం చూపలేకపోయాడు. దీంతో త్రిపుర రెండో ఇన్నింగ్స్లో 193 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా రైల్వేస్ జట్టు ఇన్నింగ్స్ 117 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు త్రిపుర తొలి ఇన్నింగ్స్లో 136 పరుగులే చేయగా... రైల్వేస్ 446/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రాజ్ చౌదరీకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సౌరాష్ట్రతో మ్యాచ్లో గోవా పోరాడుతోంది. సౌరాష్ట్ర 585/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... గోవా జట్టు తొలి ఇన్నింగ్స్లో 358 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. మధ్యప్రదేశ్తో మ్యాచ్లో కేరళ జట్టు 315 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్లో 192 పరుగులకు ఆలౌట్ కాగా... కేరళ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. సచిన్ బేబీ (85 బ్యాటింగ్), బాబా అపరాజిత్ (89 బ్యాటింగ్) అజేయ అర్ధశతకాలతో రాణించారు. ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా పాండిచ్చేరితో మ్యాచ్లో ముంబై జట్టు విజయానికి చేరువైంది. ముంబై 630/5 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా... పాండిచ్చేరి తొలి ఇన్నింగ్స్లో 132 పరుగులకు ఆలౌటైంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 231 పరుగులు చేసింది. రాజస్తాన్తో మ్యాచ్లో ఢిల్లీ జట్టు తొలి ఇన్నింగ్స్లో 296 పరుగులకు ఆలౌటైంది. 570/7 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన రాజస్తాన్కు 274 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. విదర్భతో జరుగుతున్న మ్యాచ్లో బరోడా జట్టు విజయానికి 203 పరుగుల దూరంలో ఉంది. విదర్భ తొలి ఇన్నింగ్స్లో 169 పరుగులు చేయగా... బరోడా 166 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో విదర్భ 272 పరుగులు చేసి బరోడా ముందు 276 పరుగుల లక్ష్యం నిలిపింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా రెండో ఇన్నింగ్స్లో 32 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లో టీమిండియా ప్లేయర్ రింకూ సింగ్ (157 బంతుల్లో 98 బ్యాటింగ్; 9 ఫోర్లు, 3 సిక్స్లు) పోరాడటంతో ఉత్తర ప్రదేశ్ జట్టు 113 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో తమిళనాడు జట్టు 455 పరుగులకు ఆలౌట్ కాగా... ఉత్తరప్రదేశ్ ప్రస్తుతం 116 పరుగులు వెనుకబడి ఉంది. -
రూ. 30 లక్షలతో రిటైన్.. కట్ చేస్తే! ఎస్ఆర్హెచ్ బ్యాటర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025/26 సీజన్లో కర్ణాటక స్టార్ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తున్నాడు. హుబ్లీ వేదికగా చండీగఢ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్లో రవిచంద్రన్ అజేయ డబుల్ సెంచరీతో చెలరేగాడు. స్మరణ్ 362 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్లతో 227 పరుగులు చేశాడు. ఈ సీజన్లో ఇది అతడికి రెండో ద్విశతకం కావడం గమనార్హం. అంతకుముందు కేరళతో జరిగిన మ్యాచ్లోనూ డబుల్ సెంచరీ సాధించాడు. ఓవరాల్గా స్మరణ్కు ఇది మూడో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ. ఈ మ్యాచ్లోనే అతడు 1,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ను కేవలం 13 ఫస్ట్-క్లాస్ మ్యాచ్లలోనే సాధించడం విశేషం.రవిచంద్రన్ డబుల్ సెంచరీ ఫలితంగా కర్ణాటక తమ తొలి ఇన్నింగ్స్ను 547/8 భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. స్మరణ్తో పాటు కరుణ్ నాయర్(95), శ్రేయస్ గోపాల్(62), శిఖర్ శెట్టి(59) హాఫ్ సెంచరీలతో రాణించారు. చండీఘడ్ బౌలలర్లలో జగజీత్ సింగ్, విషు తలా రెండు వికెట్లు సాధించారు.ఎస్ఆర్హెచ్లో స్మరణ్..ఐపీఎల్లో స్మరణ్ రవిచంద్రన్ సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.. గత సీజన్లో గాయపడిన ఆడమ్ జంపా స్థానంలో స్మరణ్ను ఎస్ఆర్హెచ్ తమ జట్టులోకి తీసుకుంది. అతని బేస్ ధర రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే ప్రాక్టీస్ సెషన్లో స్మరణ్ గాయపడడంతో సీజన్ మధ్యలోనే వైదొలిగాడు. అతడి స్దానంలో హర్ష్ దూబేకి అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్-2026 మినీ వేలానికి ముందు సన్రైజర్స్ అతడిని రిటైన్ చేసుకుంది.చదవండి: 'ఏమి చేయాలో అతడికి తెలుసు.. మధ్యలో నీ జోక్యమెందుకు' -
అభిషేక్ సూపర్ సెంచరీ.. ఆంధ్ర స్కోరెంతంటే?
టాప్ ఆర్డర్ బ్యాటర్లు బాధ్యతాయుతంగా ఆడటంతో... జార్ఖండ్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్లో ఆంధ్ర జట్టు ప్రత్యర్ధికి దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 60 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 224 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (156 బంతుల్లో 103 బ్యాటింగ్; 11 ఫోర్లు, 1 సిక్స్) అజేయ సెంచరీతో క్రీజులో ఉండగా... భారత జట్టు మాజీ సభ్యుడు కోన శ్రీకర్ భరత్ (67 బంతుల్లో 51; 8 ఫోర్లు), అండర్–19 ప్రపంచకప్ విజేత టీమిండియా సభ్యుడు షేక్ రషీద్ (117 బంతుల్లో 58; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు నమోదు చేశారు. భరత్తో తొలి వికెట్కు 94 పరుగులు జోడించిన అభిషేక్... రషీద్తో రెండో వికెట్కు 122 పరుగులు జత చేశాడు. అభిషిక్తో కలిసి నైట్వాచ్మన్ త్రిపురాణ విజయ్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఆంధ్ర మరో 104 పరుగుల దూరంలో ఉంది. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 259/6తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జార్ఖండ్ జట్టు 112.3 ఓవర్లలో 328 పరుగులకు ఆలౌటైంది. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 67 పరుగులిచ్చి 4 వికెట్లు... సౌరభ్ కుమార్ 77 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. -
ఐపీఎల్-2026 వేలానికి ముందు పిచ్చెక్కించిన బౌలర్
ఐపీఎల్-2026 వేలానికి ముందు ఓ దేశవాలీ బౌలర్ పిచ్చెక్కించే ప్రదర్శనతో చెలరేగాడు. రంజీ ట్రోఫీ 2025-26లో భాగంగా హర్యానాతో జరుగుతున్న మ్యాచ్లో అదిరిపోయే గణాంకాలతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో సర్వీసస్ స్పిన్నర్ అమిత్ శుక్లా 20 ఓవర్లలో కేవలం 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశాడు. ఓ దశలో శుక్లా (Amit Shukla) పరుగులేమీ ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు.ఈ సంచలన ప్రదర్శనతో శుక్లా ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శించాడు. వచ్చే నెలలో జరుగబోయే వేలంలో ఫ్రాంచైజీలు ఇతగాడి కోసం ఎగబడే అవకాశం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ కావడం శుక్లా అదనంగా కలిసి రావచ్చు. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యకు చెందిన శుక్లా అడపాదడపా బ్యాటింగ్ (కుడి చేతి) కూడా చేయగలడు. 22 ఏళ్ల శుక్లా అండర్-19 విభాగంలో పంజాబ్ తరఫున ఆడాడు.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 7 మ్యాచ్లు ఆడిన శుక్లా 32 వికెట్లు తీశాడు. అలాగే బ్యాటింగ్లో ఓ అర్ద సెంచరీ సాయంతో 138 పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో శుక్లా కేవలం ఏడు ఇన్నింగ్స్ల్లోనే 23 వికెట్లు తీసి ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్శిస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సర్వీసస్ 216 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.అంతకుముందు అమిత్ శుక్లా మాయాజాలం దెబ్బకు హర్యానా తొలి ఇన్నింగ్స్లో 111 పరుగులకే కుప్పకూలింది. శుక్లా కెరీర్లో అత్యుత్తమ గణాంకాలతో హర్యానా నడ్డి విరిచాడు. దీనికి ముందు సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే ఆలౌటైంది. చదవండి: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాక్ క్రికెటర్లు -
మయాంక్ అగర్వాల్ సూపర్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26లో కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (Mayank Agarwal) సూపర్ ఫామ్లో ఉన్నాడు. ఈ ఎడిషన్లో ఇప్పటికే రెండు హాఫ్ సెంచరీలు చేసిన అతను.. ఇవాళ (నవంబర్ 11) మహారాష్ట్రపై అద్భుతమైన శతకాన్ని (103) బాదాడు. ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇది వచ్చింది. ఇదే మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లోనూ (80) మయాంక్ సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.తాజా సెంచరీ మయాంక్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 20వది. ఈ ఇన్నింగ్స్తో అతను 8500 ఫస్ట్ క్లాస్ పరుగుల మార్కును (118 మ్యాచ్ల్లో 8533 పరుగులు) కూడా దాటాడు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక 313 పరుగులకే ఆలౌటైంది.మయాంక్, స్మరణ్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించారు. అభినవ్ మనోహర్ (47), అనీశ్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మహారాష్ట్ర బౌలర్లలో జలజ్ సక్సేనా 4, ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓత్సాల్ 2, రామకృష్ణ ఘోష్ ఓ వికెట్ తీశారు.అనంతరం బ్యాటింగ్కు దిగిన మహారాష్ట్ర కర్ణాటక స్కోర్కు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. పృథ్వీ షా (71), జలజ్ సక్సేనా (72) రాణించడంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 300 పరుగులు చేసింది. కర్ణాటక బౌలర్లలో శ్రేయస్ గోపాల్ 4, మొహిసిన్ ఖాన్ 3, విధ్వత్ కావేరప్ప 2 వికెట్లు తీశారు.13 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక మ్యాచ్ ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. మయాంక్ సెంచరీతో సత్తా చాటగా.. అభినవ్ మనోహర్ (96) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మహారాష్ట్ర బౌలర్లలో ముకేశ్ చౌదరీ 3, విక్కీ ఓస్వాల్ 2, జలజ్, రజనీష్, సిద్దేశ్ వీర్ తలో వికెట్ తీశారు. చదవండి: రాణించిన బంగ్లా బౌలర్లు -
చరిత్ర సృష్టించిన జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ టీమ్
జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ జట్టు (Jammu & Kashmir Cricket Team) చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) తొలిసారి ఢిల్లీని ఓడించింది (7 వికెట్ల తేడాతో). టోర్నీ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 43 సార్లు తలపడగా జమ్మూ తొలిసారి విజయం సాధించింది. ఏడు సార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీని జమ్మూ వారి సొంత మైదానంలో (అరుణ్ జైట్లీ స్టేడియం) ఓడించింది. 🚨 A HISTORIC DAY IN JAMMU & KASHMIR CRICKET 🚨- Jammu & Kashmir has defeated Delhi for the first time in Ranji Trophy history. 🔥🤯 pic.twitter.com/VxNFBOj7QW— Johns. (@CricCrazyJohns) November 11, 2025ఈ గెలుపుతో రంజీ ట్రోఫీలో జమ్మూ కశ్మీర్పై ఢిల్లీ ఆధిపత్యానికి తెర పడింది. యువకులు, అనుభవజ్ఞులతో కూడిన ప్రస్తుత జమ్మూ జట్టు ఆ ప్రాంత క్రికెట్ అభిమానుల దశాబ్దాల కలను నెరవేర్చింది. ఢిల్లీ లాంటి అగ్రశ్రేణి జట్టును, వారి సొంత మైదానంలో ఓడించడమంటే ఆషామాషీ విషయం కాదు. ఈ గెలుపుతో ప్రస్తుత జమ్మూ జట్టు వారి ప్రాంత యువ క్రికెటర్లకు స్పూర్తిదాయకంగా నిలిచింది. 179 పరుగుల లక్ష్య ఛేదనలో కమ్రాన్ ఇక్బాల్ చారిత్రక శతకం (133 నాటౌట్) సాధించి జమ్మూ గెలుపులో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన జమ్మూ.. ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను 211 పరుగులకే కుప్పకూల్చింది. సంచలన పేసర్ ఆకిబ్ నబీ 5 వికెట్ల ప్రదర్శనతో ఢిల్లీ పతనాన్ని శాసించాడు. వన్ష్రాజ్ శర్మ, ఆబిద్ ముస్తాక్ తలో 2 వికెట్లు తీసి ఢిల్లీ పతనంలో తమవంతు పాత్ర పోషించారు.అనంతరం బరిలోకి దిగిన జమ్మూ.. కెప్టెన్ పరాస్ డోగ్రా (106) సెంచరీతో కదంతొక్కడంతో 310 పరుగులు చేసింది. అబ్దుల్ సమద్ (85), కన్హయ్య (47) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో సిమర్జీత్ 6 వికెట్లు తీశాడు.99 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఢిల్లీ.. ఈసారి కూడా తడబడింది. ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించినా చివరికి 277 పరుగులకే పరిమితమై, జమ్మూ ముందు 179 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని జమ్మూ ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ కమ్రాన్ అజేయ శతకంతో జమ్మూను గెలుపు తీరాలకు చేర్చాడు. ఈ గెలుపు జమ్మూ అండ్ కశ్మీర్ క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోతుంది.చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం! -
ఒకే రోజు 20 వికెట్లు.. గుజరాత్ ఘన విజయం
రంజీ సీజన్ 2025-26 సీజన్లో గుజరాత్ ఎట్టకేలకు నాలుగో మ్యాచ్లో బోణీ కొట్టింది. గ్రూప్ ‘సి’లో సరీ్వసెస్తో జరిగిన పోరులో గుజరాత్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఒక్క మూడో రోజే మూడు ఇన్నింగ్స్లు జరిగాయి. 20 వికెట్లు కూలాయి. మ్యాచ్ ఫలితం కూడా ఓ రోజు ముందే వచ్చింది. సోమవారం 171/4 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన గుజరాత్ 85.4 ఓవర్లలో 256 పరుగుల వద్ద ఆలౌటైంది. క్రితం రోజు బ్యాటర్లు క్షితిజ్ పటేల్ (56; 4 ఫోర్లు, 1 సిక్స్), ఉర్విల్ పటేల్ (48; 5 ఫోర్లు, 1 సిక్స్) ఆడినంత వరకే ఇన్నింగ్స్ సాగింది. తర్వాత వాళ్లిద్దరు అవుటయ్యాక మిగతా వికెట్లు కేవలం 20 పరుగుల వ్యవధిలోనే పడ్డాయి. పులకిత్ నారంగ్ 5, అమిత్ శుక్లా 4 వికెట్లు తీశారు. గుజరాత్కు తొలి ఇన్నింగ్స్లో 8 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన సర్వీసెస్ 37.3 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. మోహిత్ అహ్లావత్ (56; 5 ఫోర్లు, 1 సిక్స్) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లెవరూ కనీసం 15 పరుగులను మించి చేయలేకపోయారు. విశాల్ 6, సిద్ధార్థ్ దేశాయ్ 4 వికెట్లు తీశారు. 118 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ 21.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసి గెలిచింది. క్షితిజ్ (36 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఆ 4 వికెట్లు అమిత్ శుక్లాకే దక్కాయి. -
తమిళనాడుపై ఆంధ్ర పైచేయి
సాక్షి, విశాఖపట్నం: రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్లో పటిష్టమైన తమిళనాడు జట్టుపై తమ అజేయ రికార్డును ఆంధ్ర జట్టు నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా తమిళనాడుతో జరిగిన జరిగిన మ్యాచ్లో ఆంధ్ర జట్టు నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టుకిది వరుసగా రెండో విజయం కావడం విశేషం. రంజీ ట్రోఫీలో ఆంధ్ర, తమిళనాడు జట్లు ఎనిమిదిసార్లు ముఖా ముఖిగా తలపడ్డాయి. నాలుగు మ్యాచ్ల్లో ఆంధ్ర నెగ్గగా... మరో నాలుగు మ్యాచ్లు ‘డ్రా’గా ముగి శాయి. తమిళనాడుతో పోరులో మొదట ఆంధ్ర బౌలర్లు, లక్ష్యఛేదనలో బ్యాటర్లు సత్తా చాటారు. సోమవారం ఆటలో 7 వికెట్లు పడగొట్టిన ఆంధ్ర... బ్యాటింగ్లో 201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి మూడే రోజుల్లో మ్యాచ్ను ముగించింది. ఓవర్నైట్ స్కోరు 102/3తో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన తమిళనాడు 70.3 ఓవర్లలో 195 పరుగులకే కుప్పకూలింది. సౌరభ్ (4/46), విజయ్ (2/16), పృథీ్వరాజ్ (2/31) తమిళ నాడును దెబ్బ కొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 5 పరుగుల ఆధిక్యం ఉన్న తమిళనాడు జట్టు... ఆంధ్ర ముందు 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆంధ్ర 41.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిõÙక్ రెడ్డి (70; 11 ఫోర్లు), కరణ్ షిండే (51; 8 ఫోర్లు) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. ఆంధ్ర స్వల్ప వ్యవధిలో 4 వికెట్లను కోల్పోయినా... అశ్విన్ హెబ్బర్ (21 నాటౌట్; 2 ఫోర్లు), సత్యనారాయణ రాజు (20 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) మరో వికెట్ పడకుండా మ్యాచ్ను ముగించారు. ఈ నెల 16 నుంచి జంషెడ్పూర్లో జరిగే తదుపరి మ్యాచ్లో జార్ఖండ్తో ఆంధ్ర ఆడుతుంది. -
ఐదేసిన ములానీ.. మావి ఆల్రౌండ్ షో
రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 10) ఏడు మ్యాచ్ల్లో ఫలితాలు వచ్చాయి. సౌరభ్ కుమార్ 4 వికెట్ల ఘనత.. అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) అర్ద శతకాలతో రాణించడంతో తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మయాంక్ వర్మ సెంచరీ (121 నాటౌట్), ఆదిత్య సర్వటే 6, రవికిరణ్ 3 వికెట్లతో రాణించడంతో పుదుచ్చేరిపై ఛత్తీస్ఘడ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.ముషీర్ ఖాన్ (112), సిద్దేశ్ లాడ్ (127) శతకాలు.. షమ్స్ ములానీ 7 వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో హిమాచల్ ప్రదేశ్పై ముంబై ఇన్నింగ్స్ 120 పరుగుల తేడాతో గెలుపొందింది.శివమ్ మావి (101 నాటౌట్, 5 వికెట్లు) ఆల్రౌండ్ షోతో చెలరేగడంతో నాగాలాండ్ను ఉత్తర్ప్రదేశ్ ఇన్నింగ్స్ 265 పరుగుల తేడాతో చిత్తు చేసింది.జగదీశ్ సుచిత్ (11 వికెట్లు, హాఫ్ సెంచరీ) ఆల్రౌండ్ షోతో ఇరగదీయడంతో ఉత్తరాఖండ్పై హర్యానా ఇన్నింగ్స్ 28 పరుగుల తేడాతో గెలుపొందింది.సిద్దార్థ్ దేశాయ్ 10 వికెట్లు, విశాల్ జైస్వాల్ 8 వికెట్లు తీయడంతో సర్వీసెస్పై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఉదయ్ సహరన్ అజేయ సెంచరీతో (117) చెలరేగడంతో ఛండీఘడ్పై పంజాబ్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఇవాల్టి బ్యాటింగ్ హైలైట్స్ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో విదర్భ ఆటగాడు ధ్రువ్ షోరే రెండో ఇన్నింగ్స్లోనూ సెంచరీ చేశాడు. మరో విదర్భ ఆటగాడు అమన్ మోఖడే కూడా సెంచరీతో సత్తా చాటాడు.కేరళతో జరుగుతున్న మ్యాచ్లో సౌరాష్ట్ర ఆటగాడు చిరాగ్ జానీ (152) భారీ సెంచరీతో కదంతొక్కాడు.జార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో బరోడా ఆటగాడు శాశ్వత్ రావత్ సెంచరీతో సత్తా చాటాడు.బౌలింగ్ హైలైట్స్కర్ణాటక బౌలర్లు శ్రేయాస్ గోపాల్ (4), మోహ్సిన్ ఖాన్ (3) రాణించి మహారాష్ట్రను 300 పరుగులకే కట్టడి.మధ్యప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో గోవా బౌలర్ వాసుకి కౌశిక్ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో జమ్మూ కశ్మీర్ బౌలర్ వంశ్రాజ్ శర్మ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: నిప్పులు చెరిగిన స్టార్క్ -
పారస్ డోగ్రా 33వ సెంచరీ..
ఢిల్లీ గడ్డపై తొలిరోజు ఆటలో ఆతిథ్య జట్టు బ్యాటర్ల పనిపట్టిన జమ్మూ కశ్మీర్ రెండో రోజు బ్యాటింగ్లోనూ సత్తా చాటింది. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో ఇక్కడ జరుగుతున్న మ్యాచ్లో కశీ్మర్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 99 పరుగుల ఆధిక్యం సంపాదించింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన జమ్మూ కశ్మీర్ 91.2 ఓవర్లలో 310 పరుగుల వద్ద ఆలౌటైంది.టాప్–4 బ్యాటర్లు ఇక్బాల్ (14), శుభం (4), వివ్రాంత్ శర్మ (14), సునీల్ (1) వరుసగా విఫలమవడంతో జట్టు ఆరంభంలో తడబడింది. దీంతో 46 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన జమ్మూ కశీ్మర్ను కెపె్టన్ పారస్ డోగ్రా (106; 11 ఫోర్లు, 1 సిక్స్) ఆదుకున్నాడు.రంజీ ట్రోఫీలో పారస్ డోగ్రా 33వ సెంచరీ సాధించి జమ్మూ కశ్మీర్కు కీలకమైన ఆధిక్యాన్ని అందించాడు. సహచరుల్లో అబ్దుల్ సమద్ (85; 12 ఫోర్లు, 1 సిక్స్), కన్హయ్య (47; 4 ఫోర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్కు 6 వికెట్లు దక్కాయి. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ ఆట ముగిసే సమయానికి 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. అర్పిత్ (2 బ్యాటింగ్), సనత్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. త్రిపుర 602/7 డిక్లేర్డ్ అగర్తలా: గ్రూప్ ‘సి’లో అస్సాంతో జరుగుతున్న మ్యాచ్లో త్రిపుర తొలి ఇన్నింగ్స్లో భారీస్కోరు చేసింది. 316/4 ఓవర్నైట్ స్కోరుతో ఆదివారం ఆట ప్రారంభించిన త్రిపుర 602/7 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సెంచరీ హీరో హనుమ విహారి (156; 18 ఫోర్లు, 2 సిక్స్లు) తన క్రితం రోజు స్కోరుకు కేవలం 13 పరుగులు చేసి నిష్క్రమించగా, విజయ్ శంకర్ (150 నాటౌట్; 14 ఫోర్లు, 4 సిక్స్లు) శతక్కొట్టాడు. రాణా దత్త (51; 8 ఫోర్లు), మురాసింగ్ (51; 3 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు. తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆడిన అస్సాం 4 వికెట్లకు 67 పరుగులు చేసింది. అభిజిత్ సర్కార్ 2 వికెట్లు తీశాడు. -
శతక్కొట్టిన మావీ.. కుషాగ్రా డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీలో ఇవాళ (నవంబర్ 9) చాలామంది ప్లేయర్లు సత్తా చాటారు. యూపీ ఆటగాడు శివమ్ మావీ కెరీర్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. జార్ఖండ్ ఆటగాడు కుమార్ కుషాగ్రా డబుల్ సెంచరీ పూర్తి చేశాడు. జమ్యూ కశ్మీర్ ఆటగాడు పరస్ డోగ్రా కెరీర్లో 34వ ఫస్ట్ క్లాస్ సెంచరీ నమోదు చేశాడు.మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరీ 8 బంతుల్లో వరుసగా సిక్సర్లు బాది 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఫస్ట్ క్లాస్ ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరూ వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదలేదు.హైదరాబాద్ వికెట్ కీపర్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ సూపర్ సెంచరీతో మెరిశాడు. బెంగాల్ ఆటగాడు సుమంత్ గుప్తా, చత్తీస్ఘడ్ ఆటగాడు మయాంక్ వర్మ కెరీర్లో తొలి సెంచరీలు నమోదు చేశారు. మణిపూర్ ప్లేయర్ అల్ బషిద్ సెంచరీతో మెరిశాడు. త్రిపురకు ఆడుతున్న తమిళనాడు ఆటగాడు విజయ్ శంకర్ భారీ శతకంతో కదంతొక్కాడు. మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా తన 26వ బర్త్ డే రోజున అర్ద సెంచరీతో రాణించాడు.బౌలింగ్ విషయానికొస్తే.. కర్ణాటక శ్రేయస్ గోపాల్, తమిళనాడు సందీప్ వారియర్, సౌరాష్ట్ర కెప్టెన్ జయదేశ్ ఉనద్కత్, బెంగాల్ బౌలర్ సూరజ్ సింధు తలో నాలుగు వికెట్లతో సత్తా చాటారు. గుజరాత్ బౌలర్ సిద్దార్థ్ దేశాయ్ ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఢిల్లీ బౌలర్ సిమర్జీత్ సింగ్ 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. చదవండి: సూపర్ ఫామ్లో పృథ్వీ షా -
సూపర్ ఫామ్లో పృథ్వీ షా
రంజీ ట్రోఫీ 2025-26లో మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. కొద్ది రోజుల కిందట చండీఘడ్తో జరిగిన మ్యాచ్లో మెరుపు డబుల్ సెంచరీ (141 బంతుల్లో) చేసిన షా.. ప్రస్తుతం కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్లో బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో రాణించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో షా 92 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 71 పరుగులు చేశాడు.ఇవాళ షా 26వ జన్మదినం. తన పుట్టిన రోజున షా అర్ద సెంచరీ బాది తనకు తనే గిఫ్ట్ ఇచ్చుకున్నాడు. ఈ రంజీ ట్రోఫీకి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. సెంచరీల మోత మోగిస్తూ, పరుగుల వరద పారిస్తున్నాడు. చండీఘడ్పై డబుల్ సెంచరీకి ముందు కేరళపై అర్ద సెంచరీ (75) చేశాడు.అంతకుముందు ముంబైతో జరిగిన రంజీ వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు చేశాడు. దానికి ముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. షా ప్రస్తుత ఫామ్ చూస్తే మరోసారి టీమిండియా తలుపులు తట్టేలా ఉన్నాడు. అయితే ఇది అంత ఈజీ ఏమీ కాదు. టెస్ట్ల్లో టీమిండియా ఓపెనర్ స్థానానికి చాలా పోటీ ఉంది. యువ ఓపెనర్లంతా రాణిస్తున్నారు. షా సహచరుడు రుతురాజ్ గైక్వాడ్ సైతం పరుగుల వరద పారిస్తున్నా అతనికే చోటు దక్కడం లేదు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓపెనర్లుగా స్థిర పడిపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర 113 పరుగులు వెనుకపడి ఉంది. కర్ణాటక తొలి ఇన్నింగ్స్లో 313 పరుగులు చేయగా.. మహారాష్ట్ర 6 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తుంది.కర్ణాటక తరఫున కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (80), స్మరన్ రవిచంద్రన్ (54), శ్రేయస్ గోపాల్ (71) అర్ద సెంచరీలతో రాణించగా.. మహారాష్ట్ర తరఫున పృథ్వీ షా ఒక్కడే అర్ద సెంచరీతో మెరిశాడు. శ్రేయస్ గోపాల్ (23-3-46-3) బంతితోనూ రాణించి మహారాష్ట్రను దెబ్బ కొట్టాడు.చదవండి: భారీ లక్ష్యాన్ని ఊదేసిన సౌతాఫ్రికా -
వరుసగా 8 సిక్సర్లు.. క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
క్రికెట్ చరిత్రలో కనీవినీ ఎరుగని రికార్డు నమోదైంది. రంజీ ట్రోఫీ 2025-26లో మేఘాలయ ఆటగాడు ఆకాశ్ చౌదరి (Akash Choudhary) వరుసగా 8 బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఓ ఆటగాడు వరుసగా 8 సిక్సర్లు బాదడం ఇదే మొదటిసారి. గతంలో క్రికెట్ దిగ్గజాలు రవిశాస్త్రి, గ్యారీ సోబర్స్ వరుసగా 6 సిక్సర్లు మాత్రమే బాదగలిగారు.అరుణాచల్ ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో (తొలి ఇన్నింగ్స్) ఆకాశ్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఆకాశ్ తొలి బంతిని వృధా చేశాడు. ఆతర్వాతి బంతికి సింగిల్ తీశాడు. ఆతర్వాత వరుసగా 8 బంతుల్లో 8 సిక్సర్లు బాదాడు. మొత్తంలో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (Fastest Half Century) రికార్డును కూడా నమోదు చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన మేఘాలయ 6 వికెట్ల నష్టానికి 628 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అర్పిత్ భటేవారా (207) డబుల్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కిషన్ లింగ్డో (119), దలాల్ (144) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో ఆకాశ్ చౌదరీ మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసి అజేయంగా నిలిచాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్లో అరుణాచల్ ప్రదేశ్ 73 పరుగులకే కుప్పకూలింది. ఆర్యన్ బోరా 4 వికెట్లు తీసి ఏపీ పతనాన్ని శాసించాడు. అరుణాచల్ ఇన్నింగ్స్లో నలుగురు మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ప్రస్తుతం రెండో రోజు చివరి సెషన్ ఆట కొనసాగుతుంది. మేఘాలయ 555 పరుగుల లీడ్ను సాధించింది.చదవండి: టీమిండియాకు మరో షాక్ -
రాణించిన రాహుల్.. హైదరాబాద్ స్కోరెంతంటే?
ఓపెనర్ల వైఫల్యంతో శుభారంభం కరువైన హైదరాబాద్ను మిడిలార్డర్ బ్యాటర్లు రాహుల్ రాదేశ్, కెప్టెన్ రాహుల్ సింగ్ అర్ధ శతకాలతో ఆదుకున్నారు. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’లో సొంతగడ్డపై రాజస్తాన్తో శనివారం మొదలైన మ్యాచ్లో హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టులో ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్ (6), అభిరథ్ రెడ్డి (9) నిరాశపరిచారు. దీంతో 21 పరుగులకే ఓపెనర్లిద్దరిని కోల్పోయింది.ఈ దశలో వన్డౌన్ బ్యాటర్ హిమతేజ (68 బంతుల్లో 39; 6 ఫోర్లు)తో జతకలిసిన కెప్టెన్ రాహుల్ సింగ్ మొదట వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. తర్వాత రాజస్తాన్ బౌలింగ్పై అవలీలగా పరుగులు సాధించడంతో తొలి సెషన్లో మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. ఇద్దరు కలిసి మూడో వికెట్కు 80 పరుగులు జోడించారు. రెండో సెషన్ మొదలయ్యాక సాఫీగా సాగిపోతున్న ఈ జోడీని రాహుల్ చహర్ విడగొట్టాడు. జట్టు స్కోరు 101 వద్ద హిమతేజను అవుట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన వరుణ్ గౌడ్ అండతో రాహుల్ (84 బంతుల్లో 55; 7 ఫోర్లు) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు.కానీ కాసేపటికే అతను కూడా పెవిలియన్ చేరాడు. స్వల్ప వ్యవధిలో వరుణ్ (23; 2 ఫోర్లు) వికెట్ పారేసుకోవడంతో 150 పరుగుల వద్ద హైదరాబాద్ జట్టు ఐదో వికెట్ను కోల్పోయింది. రెండో సెషన్లో సగం వికెట్లను కోల్పోయిన జట్టును రాహుల్ రాదేశ్ ఆదుకున్నాడు. రోహిత్ రాయుడు (86 బంతుల్లో 47; 4 ఫోర్లు) కుదురుగా ఆడటంతో ఆరో వికెట్కు 117 పరుగులు జోడించాడు. అర్ధసెంచరీకి చేరువైన రోహిత్ నిష్కమ్రించగా, రాహుల్ రాదేశ్ నిలకడను ప్రదర్శించి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే దశలో సీవీ మిలింద్ (14; 2 ఫోర్లు) రూపంలో హైదరాబాద్ ఏడో వికెట్ను కోల్పోయినప్పటికీ తొలి రోజు ఆటలో సంతృప్తికర స్థాయిలో పరుగులు సాధించింది. రాజస్తాన్ బౌలర్లలో అనికేత్, అశోక్ శర్మ చెరో 2 వికెట్లు తీశారు. ఆకాశ్, రాహుల్ చహర్, సచిన్ యాదవ్లకు తల ఒక వికెట్ దక్కింది. -
టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్తో నిప్పులు చేరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా కెరీర్ను ఎంచుకున్న ఆ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi).రంజీల్లో అదుర్స్..29 ఏళ్ల ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆకిబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీ.. రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒకే ఇన్నింగ్స్లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్లో నబీ తొలి ఇన్నింగ్స్లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో నకీబ్ ఇప్పటివరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్లు ఆడి 115 వికెట్లు సాధించాడు.డెయిల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లాఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్కు ఉంది. అయితే జమ్మూలోని బారాముల్లాకు చెందిన ఆకిబ్ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్కు మాత్రం క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత ప్రదర్శనలతో భారత సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. నబీ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు. -
హైదరాబాద్, ఆంధ్ర బోణీ విజయాలు
నాదౌన్: రంజీ ట్రోఫీ తాజా సీజన్లో హైదరాబాద్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. హిమాచల్ ప్రదేశ్ జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘డి’ మూడో లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. 344 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు ఓవర్నైట్ స్కోరు 8/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ జట్టు... 75.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 347 పరుగులు సాధించింది. ఓపెనర్ అభిరథ్ రెడ్డి (200 బంతుల్లో 175 నాటౌట్; 19 ఫోర్లు, 3 సిక్స్లు) వీరోచిత సెంచరీ సాధించి హైదరాబాద్ను విజయతీరాలకు చేర్చాడు. వన్డౌన్ బ్యాటర్ రాహుల్ రాధేశ్ (127 బంతుల్లో 66; 8 ఫోర్లు)తో కలిసి అభిరథ్ రెడ్డి రెండో వికెట్కు 145 పరుగులు జోడించాడు. రాధేశ్ అవుటయ్యాక కెప్టెన్ రాహుల్ సింగ్ (24; 2 ఫోర్లు), హిమతేజ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్), తనయ్ త్యాగరాజన్ (25 బంతుల్లో 29; 2 ఫోర్లు) సహకారంతో అభిరథ్ హైదరాబాద్ను లక్ష్యం దిశగా నడిపించాడు. మూడో వికెట్కు రాహుల్ సింగ్తో 74 పరుగులు జోడించిన అభిరథ్æ.... నాలుగో వికెట్కు హిమతేజతో 53 పరుగులు... ఐదో వికెట్కు తనయ్తో 47 పరుగులు జత చేశాడు. హిమాచల్ జట్టు బౌలర్లలో ఆర్యమాన్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. తొలి రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకున్న హైదరాబాద్జట్టు ఈ గెలుపుతో తమ ఖాతాలో ఆరు పాయింట్లు వేసుకుంది. హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 318 పరుగులు చేయగా... హైదరాబాద్ జట్టు 278 పరుగులకు ఆలౌటైంది. 40 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పొందిన హిమాచల్ 303 పరుగులు చేసి హైదరాబాద్కు 344 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గ్రూప్ ‘డి’లో మూడు మ్యాచ్లు పూర్తి చేసుకున్న హైదరా బాద్ జట్టు పది పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. ఆంధ్ర బోణీకటక్: తొలి రెండు లీగ్ మ్యాచ్లను ‘డ్రా’తో సరిపెట్టుకున్న ఆంధ్ర క్రికెట్ జట్టు రంజీ ట్రోఫీలో తొలి విజయం నమోదు చేసింది. ఒడిశా జట్టుతో మంగళవారం ముగిసిన గ్రూప్ ‘ఎ’ మూడో లీగ్ మ్యాచ్లో ఆంధ్ర ఇన్నింగ్స్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఫాలోఆన్ ఆడుతూ ఓవర్నైట్ స్కోరు 190/2తో ఆఖరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా జట్టు 104.2 ఓవర్లలో 274 పరుగులకు ఆలౌటైంది. రెండు వికెట్లకు 198 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఒడిశా జట్టు చివరి ఎనిమిది వికెట్లను 80 పరుగుల తేడాలో కోల్పోయింది. ఓపెనర్ గౌరవ్ చౌధురీ (80; 10 ఫోర్లు), వన్డౌన్ బ్యాటర్ సందీప్ పటా్నయక్ (63; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేశారు. మూడో వికెట్గా గౌరవ్ అవుటయ్యాక ఒడిశా ఇన్నింగ్స్ తడబడింది. ఈసారి ఆంధ్ర జట్టుకు ఆడుతున్న ఉత్తరప్రదేశ్కు చెందిన ఎడంచేతి వాటం స్పిన్నర్ సౌరభ్ కుమార్ 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... ఆఫ్ స్పిన్నర్ త్రిపురణ విజయ్ 89 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. కావూరి సాయితేజ, శశికాంత్, పృథ్వీరాజ్లకు ఒక్కో వికెట్ దక్కింది. ఆంధ్ర తొలి ఇన్నింగ్స్లో 475 పరుగులు చేయగా... ఒడిశా తొలి ఇన్నింగ్స్లో 151 పరుగులకు ఆలౌటైంది. ఇన్నింగ్స్ తేడాతో గెలిచినందుకు ఆంధ్ర జట్టుకు ఏడు పాయింట్లు లభించాయి. ఈ మ్యాచ్లో 69 పరుగులు చేయడంతోపాటు ఆరు వికెట్లు పడగొట్టిన సౌరభ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చదవండి: భారీ విజయంతో కర్ణాటక బోణీ -
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం..
రంజీ ట్రోఫీ 2025-26లో టీమిండియా అండర్-19 స్టార్ వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. ఈ దేశవాళీ టోర్నీలో బిహార్కు ప్రాతినిథ్యం వహిస్తున్న సూర్యవంశీ.. పాట్నా వేదికగా మేఘాలయతో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్లో 166 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యపడినప్పటికి, వైభవ్ మాత్రం తన విధ్వంసకర బ్యాటింగ్తో అందరిని అలరించాడు.14 ఏళ్ల వైభవ్ ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. కేవలం 67 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్స్లతో 93 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని స్ట్రైక్ రేట్ 138.81గా ఉంది. కేవలం 7 పరుగుల దూరంలో తన తొలి ఫస్ట్-క్లాస్ సెంచరీని వైభవ్ కోల్పోయాడు. బిజోన్ డే బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. కాగా ఈ టోర్నీలో బిహార్ వైస్ కెప్టెన్ సూర్యవంశీ వ్యవహరిస్తున్నాడు. ఇక తాజాగా రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం ప్రకటించిన భారత్-ఎ జట్టులో సూర్యవంశీకి చోటు దక్కింది. వైభవ్ గత కొంత కాలంగా ఫార్మాట్తో సంబంధం లేకుండా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఇక ఈ మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన మేఘాలయ తమ తొలి ఇన్నింగ్స్లో 408 పరుగుల భారీ స్కోర్ సాధించింది. మెఘాలయ ఇన్నింగ్స్లో అజయ్ దుహాన్(129) శతక్కొట్టగా.. ఛెత్రి(94) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అయితే వర్షం కారణంగా తొలి రెండు రోజుల పాటు ఆట పూర్తిగా రద్దు అయింది. కేవలం ఆఖరి రెండు రోజుల ఆట మాత్రమే జరిగింది. దీంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. బిహార్ తమ తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ కోసం భారత్ ఏ జట్టు : ప్రియాంశ్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహాల్ వధేర, నమన్ ధిర్ (వైస్ కెప్టెన్), సూర్యాంశ్ షెడ్జే, జితేశ్ శర్మ (కెప్టెన్, వికెట్ కీపర్), రమణ్దీప్ సింగ్, హర్ష్ దూబె, అశుతోశ్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్రీత్ సింగ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుధ్వీర్ సింగ్ చరక్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుయాంశ్ శర్మస్టాండ్ బై: గుర్నూర్ సింగ్ బ్రార్, కుమార్ కుశాగ్ర, తనుష్ కోటిన్, సమీర్ రిజ్వీ, షేక్ రషీద్చదవండి: IPL 2026: ఎస్ఆర్హెచ్ షాకింగ్ నిర్ణయం.. విధ్వంసకర వీరుడికి గుడ్ బై!? -
జైస్వాల్ సూపర్ సెంచరీ
రాజస్థాన్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్లో (Ranji Trophy 2025-26) ముంబై ఆటగాడు, టీమిండియా ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. తొలి ఇన్నింగ్స్లో సైతం అర్ద సెంచరీతో (67) రాణించిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్లో మూడంకెల మార్కును తాకాడు. 120 బంతుల్లో 11 బౌండరీల సాయంతో ఈ మార్కును చేరుకున్నాడు.జైస్వాల్కు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఇది ఐదో సెంచరీ (21 ఇన్నింగ్స్ల్లో). ఓవరాల్గా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 17వది (టెస్ట్ల్లో 7 సెంచరీలు, భారత్-ఏ తరఫున 1, ముంబై తరఫున రంజీల్లో 5, రెస్ట్ ఆఫ్ ఇండియా తరఫున 2, వెస్ట్ జోన్ తరఫున 2).2019లో రంజీ అరంగేట్రం చేసిన జైస్వాల్ ఈ సెంచరీతో 1000 పరుగుల మార్కును కూడా తాకాడు. 10 మ్యాచ్ల్లో 57కు పైగా సగటుతో ఈ పరుగులు చేశాడు. తాజా సెంచరీని జైస్వాల్ తన ఐపీఎల్ హోం గ్రౌండ్ అయిన సువాయ్ మాన్ సింగ్ స్టేడియంలో (జైపూర్) చేయడం విశేషం.చెలరేగిన రాజస్థాన్ బౌలర్లుతొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులకే ఆలౌటైంది. ముంబై ఇన్నింగ్స్ మొత్తంలో యశస్వి జైస్వాల్ (67) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ముషీర్ ఖాన్ 49, షమ్స్ ములానీ 32, హిమాన్షు సింగ్ 25, తుషార్ దేశ్పాండే 25 (నాటౌట్) పరుగులతో పర్వాలేదనిపించారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా అజయ్ సింగ్ 4, అశోక్ శర్మ 3, అంకిత్ చౌదరి, ఆకాశ్ మహారాజ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.దీపక్ హుడా ద్విశతకంఅనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రెండో ఇన్నింగ్స్లో దీపక్ హూడా ద్విశతకంతో (248), కార్తిక్ శర్మ (139) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ (617/6) చేసింది. సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే, షమ్స్ ములానీ తలో 2 వికెట్లు తీశారు. యశస్వి జైస్వాల్ బంతితోనూ రాణించి డబుల్ సెంచరీ వీరుడు దీపక్ హుడాను ఔట్ చేశాడు.363 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ముంబై నాలుగో రోజు తొలి సెషన్ సమయానికి (52 ఓవర్లలో) 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (63), అజింక్య రహానే (18) ఔట్ కాగా.. జైస్వాల్ 105, సిద్దేశ్ లాడ్ 0 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. ప్రస్తుతానికి ముంబై రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్ స్కోర్ కంటే ఇంకా 170 పరుగులు వెనుకపడి ఉంది.చదవండి: భారత జట్టులో వైభవ్ సూర్యవంశీ, ప్రియాంశ్ ఆర్య -
టీమిండియా నుంచి తీసేశారు.. కట్ చేస్తే! అక్కడ డబుల్ సెంచరీతో
టీమిండియా బ్యాటర్, రాజస్తాన్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా జైపూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో హుడా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 121 పరుగుల ఓవర్ నైట్స్కోర్తో మూడో రోజు ఆటను ప్రారంభించిన హుడా.. వన్డే తరహాలో తన బ్యాటింగ్ను కొనసాగించాడు.ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే తన రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. మొత్తంగా 335 బంతులు ఎదుర్కొన్న హుడా.. 22 ఫోర్లు, 2 సిక్స్లతో 248 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 293గా ఉంది. ఇక మ్యాచ్లో హుడా ద్విశతకం ఫలితంగా రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్ను 617/6 వద్ద డిక్లేర్ చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్లో హుడాతో కార్తీక్ శర్మ(139), సచిన్ యాదవ్(92) రాణించారు. దీంతో రాజస్తాన్కు మొదటి ఇన్నింగ్స్లో 363 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే, ములానీ తలా రెండు వికెట్లు సాధించారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(56), ముషీర్ ఖాన్(32) ఉన్నారు. ఇక దీపక్ హుడా విషయానికి వస్తే.. భారత తరపున చివరగా 2023లో న్యూజిలాండ్పై ఆడాడు. అయితే ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీతో మెరిసిన హుడా, ఆ తర్వాత వరుస మ్యాచ్ల విఫలమయ్యాడు. దీంతో అతడిని నుంచి జట్టు నుంచి తప్పించారు. గత రెండు ఐపీఎల్ సీజన్లలోనూ అతడు విఫలమయ్యాడు.చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్లు.. -
రాణించిన జైస్వాల్.. దీపక్ హుడా అజేయ శతకం
రంజీ ట్రోఫీ 2025-26లో (Ranji Trophy) భాగంగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ ఆటగాడు దీపక్ హుడా (Deepak Hooda) సెంచరీతో కదంతొక్కాడు. 159 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 121 పరగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. హుడా సెంచరీ సాయంతో రాజస్థాన్ తొలి ఇన్నింగ్స్లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు స్కోర్ 4 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. దీపక్ హుడాకు జతగా కార్తిక్ శర్మ (26) క్రీజ్లో ఉంది. రాజస్థాన్ ఇన్నింగ్స్లో సచిన్ యాదవ్ (92) తృటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు. కెప్టెన్ మహిపాల్ లోమ్రార్ (41) ఓ మోస్తరు స్కోర్తో పర్వాలేదనిపించాడు. అభిజీత్ తోమర్ 14, కునాల్ సింగ్ 31 పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్పాండే 2, షమ్స్ ములానీ ఓ వికెట్ పడగొట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ 85 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోందిరాణించిన జైస్వాల్అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్లో 254 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) (67), ముషీర్ ఖాన్ (49) రాణించగా.. మిడిలార్డర్ విఫలమైంది. రహానే 3, సిద్దేశ్ లాడ్ 8, సర్ఫరాజ్ ఖాన్ 15, ఆకాశ్ ఆనంద్ 5 పరుగులకు ఔటయ్యారు. లోయర్డార్ ఆటగాళ్లలో షమ్స్ ములానీ (32), కెప్టెన్ శార్దూల్ ఠాకూర్ (18), హిమాన్షు సింగ్ (25), తుషార్ దేశ్పాండే (25 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో కుక్నా సింగ్ 4 వికెట్లు పడగొట్టగా.. ఆశోక్ శర్మ 3, అనికేత్ చౌదరీ, ఆకాశ్ సింగ్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు. చదవండి: శివాలెత్తిన గుర్బాజ్.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ -
రంజీ క్రికెటర్ దుర్మరణం
త్రిపుర రంజీ జట్టు మాజీ కెప్టెన్ రాజేష్ బానిక్ (Rajesh Banik) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పశ్చిమ త్రిపుర ప్రాంతంలోని ఆనంద్ నగర్లో ఈ ప్రమాదం జరిగింది. 40 ఏళ్ల బానిక్ తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి జీవనం సాగించే వాడు. నిత్యం కళ్లెదుటే ఉండే బానిక్ ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరవుతున్నారు. బానిక్ మరణవార్త భారత క్రికెట్ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ బానిక్కు నివాళులర్పించింది.కుడి చేతి వాటం బ్యాటర్, అకేషనల్ లెగ్ స్పిన్నర్ అయిన బానిక్ 2001-02 సీజన్లో త్రిపుర తరఫున రంజీ అరంగేట్రం చేశాడు. అనతికాలంలోనే నమ్మదగ్గ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడు. బానిక్ 42 మ్యాచ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో 1469 పరుగులు చేశాడు. అలాగే 24 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 378 పరుగులు, 18 టీ20ల్లో 203 పరుగులు చేశాడు. క్రికెటర్గా బానిక్ కెరీర్ 17 ఏళ్ల పాటు సాగింది.అనంతరం అతడు త్రిపుర అండర్-16 జట్టుకు స్టేట్ సెలెక్టర్గా సేవలందించాడు. అండర్-15 రోజుల్లో బానిక్ టీమిండియా మాజీ ఆటగాళ్లు ఇర్ఫాన్ పఠాన్, అంబటి రాయుడుతో డ్రస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అగర్తలలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో త్రిపుర జట్టు ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ ధరించి బానిక్ను నివాళులర్పించారు. చదవండి: IND vs AUS: టీ20 క్రికెట్లో అతి భారీ సిక్సర్.. వరల్డ్ రికార్డు బ్రేక్ -
కరుణ్ నాయర్ డబుల్ సెంచరీ
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్ సూపర్ ఫామ్ను కొనసాగించాడు. తొలి మ్యాచ్లో సౌరాష్ట్రపై హాఫ్ సెంచరీ (73), రెండో మ్యాచ్లో గోవాపై భారీ సెంచరీ (174 నాటౌట్) చేసిన అతడు.. తాజాగా కేరళతో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా డబుల్ సెంచరీతో (233) చెలరేగాడు. ఇదే ఇన్నింగ్స్లో మరో కర్ణాటక ఆటగాడు స్మరణ్ రవిచంద్రన్ (171 నాటౌట్) కూడా డబుల్ సెంచరీ దిశగా సాగుతున్నాడు.కరుణ్, స్మరణ్ చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక భారీ స్కోర్ (514/4) చేసింది. స్మరణ్తో పాటు అభినవ్ మనోహర్ (15) క్రీజ్లో ఉన్నాడు. కృష్ణణ్ శ్రీజిత్ (65) అర్ద సెంచరీతో రాణించాడు. బాసిల్ 2, నిధీష్, బాబా అపరాజిత్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్ ఆట కొనసాగుతుంది.చదవండి: PAK Vs SA: రాణించిన బాబర్, అఫ్రిది.. పాకిస్తాన్దే టీ20 సిరీస్ -
ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. అయినా పృథ్వీ షాకు తప్పని భంగపాటు!
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో మహారాష్ట్రతో తన ప్రయాణం మొదలుపెట్టాడు టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw). తొలుత కేరళతో జరిగిన మ్యాచ్లో డకౌట్ అయినా.. రెండో ఇన్నింగ్స్లో అర్ధ శతకం (75)తో సత్తా చాటాడు. తాజాగా చండీగఢ్తో మ్యాచ్లో మాత్రం పృథ్వీ షా విశ్వరూపం ప్రదర్శించాడు. ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీచండీగఢ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే పృథ్వీ పరిమితమయ్యాడు. అయితే, రెండో ఇన్నింగ్స్లో విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడి మహారాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రంజీ చరిత్రలో రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ (Fastest Double Century) నమోదు చేశాడు.222 Runs of pure statement. 💥Prithvi Shaw lights up the Ranji stage with a jaw-dropping 222 — his maiden double ton for Maharashtra, laced with 28 fours and 5 sixes against Chandigarh. A knock that screams class, confidence, and comeback. #mca #mcacricket #teammaharashtra… pic.twitter.com/g3vcoropH8— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025పృథ్వీ షాకు భంగపాటు!మొత్తంగా 156 బంతుల్లో 222 పరుగులు సాధించిన పృథ్వీ షా.. ఇన్నింగ్స్లో 29 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అయితే, అర్జున్ ఆజాద్ బౌలింగ్లో నిషాంక్ బిర్లాకు క్యాచ్ ఇవ్వడంతో పృథ్వీ షా ఇన్నింగ్స్కు తెరపడింది. ఏదేమైనా డబుల్ సెంచరీతో సత్తా చాటిన పృథ్వీ షాను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వరిస్తుందని అంతా భావించారు.పృథ్వీ షాకు రుతురాజ్ సర్ప్రైజ్అయితే, పృథ్వీని కాదని.. తొలి ఇన్నింగ్స్లో సెంచరీ (163 బంతుల్లో 116) సాధించిన రుతురాజ్ గైక్వాడ్కు ఈ బహుమానం దక్కింది. ఈ నేపథ్యంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రుతు.. పృథ్వీకి స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. పృథ్వీని దగ్గరికి పిలిచి అతడితో కలిసి అవార్డును పంచుకున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియోను మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమిష్టి కృషి, పరస్పర గౌరవం, క్రీడాస్ఫూర్తికి ఇది నిదర్శనం అంటూ హర్షం వ్యక్తం చేసింది. కాగా ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా చండీగఢ్పై మహారాష్ట్ర 144 పరుగుల తేడాతో విజయం సాధించింది.Shared Glory, True Spirit 🫡Ruturaj Gaikwad shared his Player of the Match award with Prithvi Shaw, recognising Shaw’s sensational 222-run knock that set up Maharashtra’s victory. A gesture that speaks volumes — teamwork, respect, and mutual excellence at its best.#mca… pic.twitter.com/yMWHsW7Miq— Maharashtra Cricket Association (@MahaCricket) October 28, 2025చండీగఢ్ వర్సెస్ మహారాష్ట్ర సంక్షిప్త స్కోర్లు👉మహారాష్ట్ర: 313 & 359/3 డిక్లేర్డ్👉చండీగఢ్ : 209 &319👉ఫలితం: చండీగఢ్పై 144 పరుగుల తేడాతో మహారాష్ట్ర గెలుపు.. మహారాష్ట్రకు ఆరు పాయింట్లు.చదవండి: నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది.. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్? -
నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుంది: షమీ
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధానికి తెరపడినట్లే కనిపిస్తోంది. రంజీ ట్రోఫీ 2025-26 మ్యాచ్లో గుజరాత్పై బెంగాల్ విజయం సాధించిన తర్వాత షమీ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ ట్రోఫీలో బెంగాల్కు ఆడుతున్న షమీ (3/44; 5/38) తన పేస్లో పదును ఏమాత్రం తగ్గలేదని బౌలింగ్తో నిరూపించాడు. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా గ్రూప్ ‘సి’లో మంగళవారం ముగిసిన మ్యాచ్లో బెంగాల్.. 141 పరుగుల భారీతేడాతో గుజరాత్ (Bengal Vs Gujarat)పై ఘనవిజయం సాధించింది.185 పరుగులకే కుప్పకూలిన గుజరాత్ఆఖరి రోజు 170/6 ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బెంగాల్ 214/8 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ బ్యాటర్ అనుస్తుప్ (58; 9 ఫోర్లు) అర్ధసెంచరీ పూర్తి చేసుకోగా, ఆకాశ్దీప్ (25 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్లు) మోస్తరు పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 112 పరుగులు కలుపుకొని గుజరాత్ ముందు 327 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.5 కీలక వికెట్లు తీసిన షమీఈ టార్గెట్ను చేదించేందుకు బరిలోకి దిగిన గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 185 పరుగులకే కుప్పకూలింది. ఉర్విల్ పటేల్ (109 నాటౌట్; 16 ఫోర్లు) అజేయ శతకం సాధించాడు. షమీ పదే ఓవర్లు వేసి 5 కీలక వికెట్లు తీసి జట్టు విజయానికి బాటవేశాడు. షహబాజ్ అహ్మద్కు 3 వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్లో 6 వికెట్లు తీసిన షహబాజ్కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.నేను మాట్లాడితే కథ వేరేలా మారుతుందిఇదిలా ఉంటే.. గుజరాత్పై విజయం తర్వాత షమీని విలేకరులు పలకరించగా అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను మాట్లాడితే కథ వేరేలా మారుతుందని పేర్కొన్నాడు. ‘‘నేను ఎల్లప్పుడు వివాదాల్లో చిక్కుకుపోతున్నాను. మీరే (మీడియా) నన్ను కాంట్రవర్సీ బౌలర్గా మార్చేశారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇబ్బందుల్లో పడటం ఖాయం.కాబట్టి ఇప్పుడేం చెప్పగలను? నేను మిమ్మల్ని కూడా నిందించను. ప్రతి ఒక్కరు నా విషయంలో ఇలాగే చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడుతున్నారు’’ అంటూ షమీ యూటర్న్ తీసుకున్నాడు. దీంతో ఆశ్చర్యపోవడం రిపోర్టర్ల వంతైంది.షమీ వర్సెస్ అగార్కర్కాగా ఆస్ట్రేలియాతో వన్డేలకు షమీని ఎంపిక చేయకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ.. అతడి ఫిట్నెస్ గురించి అప్డేట్ లేదని చెప్పాడు. ఇందుకు ప్రతిగా షమీ తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘రంజీల్లో ఆడేవాడిని.. వన్డేల్లో ఆడలేనా?.. నేను పూర్తి ఫిట్గా ఉన్నాను’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.ఈ క్రమంలో అగార్కర్ స్పందిస్తూ.. షమీ ఫిట్గా లేనందు వల్లే జట్టుకు ఎంపిక చేయలేదని పునరుద్ఘాటించగా... తాను కాదు తన ఆటే మాట్లాడుతుందంటూ షమీ మరోసారి గట్టిగానే ఇచ్చిపడేశాడు. సెలక్టర్ జోక్యంతో షమీ యూటర్న్?ఈ నేపథ్యంలో తాజాగా గుజరాత్పై ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. చెప్పినట్లుగానే ఆటతోనే అగార్కర్కు సమాధానమిచ్చాడని ప్రశంసలు కురిశాయి. అయితే, అతడు మాత్రం తాను వివాదాల్లో చిక్కుకోవడానికి మీడియానే కారణమని చెప్పడం గమనార్హం.కాగా కోల్కతాలో జరిగిన ఈ రంజీ మ్యాచ్ సందర్భంగా.. ఈస్ట్జోన్ నుంచి టీమిండియా కొత్త సెలక్టర్గా ఎంపికైన ఆర్పీ సింగ్.. షమీతో మంతనాలు జరిపాడు. అతడి నుంచి హామీ లభించిన నేపథ్యంలోనే షమీ ఇలా ప్లేట్ తిప్పేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.చదవండి: కాంట్రాక్టర్ నుంచి శ్రేయస్ దాకా.. మైదానంలో తీవ్రంగా గాయపడిన క్రికెటర్లు వీరే..! -
ఎనిమిది వికెట్లతో చెలరేగిన షమీ.. టీమిండియా సెలక్టర్లకు వార్నింగ్!
టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami) రంజీ మ్యాచ్లో అదరగొట్టాడు. గుజరాత్తో పోరులో ఈ రైటార్మ్ బౌలర్ మొత్తంగా ఎనిమిది వికెట్లతో చెలరేగి బెంగాల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా తనకు ఫిట్నెస్ లేదంటూ కామెంట్ చేసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్క (Ajit Agarkar)ర్కు ‘బంతి’తోనే దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ రెండో మ్యాచ్లో భాగంగా బెంగాల్.. గుజరాత్ జట్టును ఢీకొట్టింది. ఎలైట్ గ్రూప్-‘సి’లో భాగంగా ఇరుజట్ల మధ్య కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో శనివారం మ్యాచ్ మొదలుకాగా.. టాస్ గెలిచిన గుజరాత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.మూడు హాఫ్ సెంచరీలుఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన బెంగాల్ తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులకు ఆలౌట్ అయింది. సుదీప్ ఘరామి (56), వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ధ శతకాల కారణంగా ఈమాత్రం స్కోరు సాధ్యమైంది.167 పరుగులకేఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన గుజరాత్ 167 పరుగులకే కుప్పకూలింది. మనన్ హింగ్రాజియా (80) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా.. మిగతా వారి నుంచి అతడికి సహకారం లభించలేదు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్ అహ్మద్ ఆరు వికెట్లు కూల్చగా.. షమీ మూడు, ఆకాశ్ దీప్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఈ క్రమంలో 112 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది బెంగాల్. ఎనిమిది వికెట్ల నష్టానికి 214 పరుగుల వద్ద ఉన్న వేళ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామి (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ధ శతకాలతో రాణించారు.ఐదు వికెట్లు కూల్చిన షమీఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని బెంగాల్.. గుజరాత్కు 327 పరుగుల లక్ష్యాన్ని విధించింది. అయితే, ఆది నుంచే చెలరేగిన షమీ గుజరాత్ ఓపెనర్ అభిషేక్ దేశాయిని డకౌట్ చేశాడు. జయమీత్ పటేల్ (45), విశాల్ జైస్వాల్ (1), సిద్దార్థ్ దేశాయ్ (0), అర్జాన్ నాగ్వాస్వల్లా (0)లను వెనక్కి పంపించాడు.మొత్తంగా 10 ఓవర్ల బౌలింగ్లో కేవలం 38 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు కూల్చాడు షమీ. మిగతా వారిలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షాబాజ్ అహ్మద్ మూడు వికెట్లు దక్కించుకోగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. బెంగాల్ బౌలర్ల ధాటికి గుజరాత్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ అజేయ శతకం (124 బంతుల్లో 109) వృథాగా పోయింది. 185 పరుగులకే గుజరాత్ ఆలౌట్ కావడంతో.. బెంగాల్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.షమీకి ఫిట్నెస్ లేదంటూ..కాగా టీమిండియా తరఫున ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో సత్తా చాటిన షమీని.. ఆ తర్వాత సెలక్టర్లు పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డేలకు కూడా అతడిని ఎంపిక చేయలేదు. ఈ విషయం గురించి చీఫ్ సెలక్టర్ అగార్కర్ మాట్లాడుతూ.. షమీకి ఫిట్నెస్ లేదని తెలిపాడు. ఇందుకు షమీ కౌంటర్ ఇచ్చాడు. రంజీల్లో ఆడేవాడిని వన్డేలు ఆడలేనా? అన్ని ప్రశ్నించాడు. బెంగాల్ తరఫున ఎలా ఆడుతున్నానో అందరూ చూస్తున్నారని పేర్కొన్నాడు. సౌతాఫ్రికాతో స్వదేశంలో టెస్టులకు ముందు.. తాజా ప్రదర్శనతో మరోసారి అగార్కర్కు గట్టి సందేశమే ఇచ్చాడు షమీ.చదవండి: స్పృహ తప్పి పడిపోయాడు!.. ప్రాణాపాయమే!;.. కీలక అప్డేట్ ఇచ్చిన సూర్య -
శతక్కొట్టిన సీఎస్కే చిచ్చరపిడుగు
రంజీ ట్రోఫీ 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా బెంగాల్తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ ఆటగాడు ఉర్విల్ పటేల్ (Urvil Patel) విధ్వంసకర శతకం బాదాడు. 327 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం 96 బంతుల్లోనే 16 ఫోర్ల సాయంతో సెంచరీ చేశాడు. వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన ఉర్విల్.. టీమిండియా పేసర్లు మహ్మద్ షమీ, ఆకాశ్దీప్ను సమర్దవంతంగా ఎదుర్కొని శతక్కొట్టాడు.34 ఓవర్ల అనంతరం గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. ఇప్పటివరకే వచ్చిన జట్టు స్కోర్లో ఉర్విల్దే సింహభాగం. అతనికి జతగా జైమీత్ పటేల్ (34) క్రీజ్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో గుజరాత్ గెలవాలంటే మరో 177 పరుగులు చేయాలి. చివరి రోజు ఆటలో రెండో సెషన్ కొనసాగుతుంది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగాల్.. సుదీప్ ఘరామీ (56), ఇషాన్ పోరెల్ (51), సుమంత గుప్తా (63) అర్ద సెంచరీలతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్లో 279 పరుగులు చేసింది. సిద్దార్థ్ దేశాయ్ 4 వికెట్లతో సత్తా చాటాడు.అనంతరం బరిలోకి దిగిన గుజరాత్.. షాబాజ్ అహ్మద్ (19-5-34-6) చెలరేగడంతో 167 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ మనన్ హింగ్రాజియా (80 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. బెంగాల్ బౌలర్లలో షాబాజ్తో పాటు మహ్మద్ షమీ (18.3-6-44-3) కూడా సత్తా చాటాడు.112 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్.. 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. సుదీప్ ఘరామీ (54), అనుస్తుప్ మజుందార్ (58) అర్ద సెంచరీలతో రాణించారు. సిద్దార్థ్ దేశాయ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.27 ఏళ్ల ఉర్విల్ పటేల్ గత ఐపీఎల్ సీజన్ మధ్యలో వన్ష్ బేడీ స్థానంలో సీఎస్కేలో చేరాడు. 3 మ్యాచ్ల్లో అద్బుతమైన స్ట్రయిక్రేట్తో (212.50) 68 పరుగులు చేశాడు.ఉర్విల్కు భారత టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు ఉంది. 2024 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై అతను 28 బంతుల్లోనే శతక్కొట్టాడు. చదవండి: సిక్సర్ కొట్టి అదే బంతికి ఔటయ్యాడు..! -
మరోసారి 'మరో ఛాన్స్' అంటున్న కరుణ్ నాయర్..!
డియర్ క్రికెట్ మరో ఛాన్స్ ఇవ్వు అంటూ ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ (Karun Nair).. ఇచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకోలేక, ఇలా వచ్చి అలా మాయమయ్యాడు. ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనలో భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన నాయర్.. 7 ఇన్నింగ్స్ల్లో ఒకే ఒక హాఫ్ సెంచరీ సాయంతో 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఫలితంగా తదుపరి సిరీస్కే జట్టులో స్థానం కోల్పోయాడు. ఆతర్వాత అతనికి 'ఏ' జట్టులోనూ స్థానం లభించలేదు. సెలెక్టర్లు కరుణ్ నుంచి చాలా ఆశించామని చెప్పి చేతులు దులుపుకున్నారు. తాజాగా కరుణ్ మరోసారి 'మరో ఛాన్స్' అంటూ ముందుకు వచ్చాడు.ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తొలి మ్యాచ్లో అర్ద సెంచరీ (73), రెండో మ్యాచ్లో భారీ సెంచరీ (174 నాటౌట్) చేసి సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. సెంచరీ అనంతరం కరుణ్ విలేకరులతో మాట్లాడుతూ ఇలా అన్నాడు."టీమిండియా నుంచి తప్పించడం బాధ కలిగించింది. ఒక్క సిరీస్ కంటే ఎక్కువ అర్హుడినని నన్ను నేను ఒప్పించుకుంటూ ఉంటాను. గత రెండు సంవత్సరాల నా ప్రదర్శన చూస్తే, ఆ స్థాయికి అర్హుడిననే అనిపిస్తుంది. ప్రస్తుతం నా పని పరుగులు చేయడం ఒక్కటే. దేశం కోసం ఆడాలన్నదే నా లక్ష్యం. అది సాధపడకపోతే, నా జట్టుకు విజయాన్ని అందించడమే తదుపరి లక్ష్యం"కరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అతనిలో నిరాశతో కూడిన ఆశ కనిపిస్తుంది. క్రికెట్.. మరోసారి మరో ఛాన్స్ ఇవ్వు అంటూ అర్దించినట్లనిపిస్తుంది. దేశం కోసం ఆడాలన్న తాపత్రయం స్పష్టమవుతుంది.33 ఏళ్ల కరుణ్కు ఇంగ్లండ్ పర్యటనలో మంచి ఆరంభాలు లభించినా దురదృష్టవశాత్తు వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాడు. ఐదో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కరుణ్ కష్టమైన పిచ్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడినా తగిన గుర్తింపు దక్కలేదు. ఆ ఇన్నింగ్స్లో ఇరు జట్లలో కరుణే టాప్ స్కోరర్గా నిలిచాడు.వాస్తవానికి కరుణ్కు అతి భారీ ఇన్నింగ్స్లు ఆడగల సామర్థ్యం ఉంది. ఇది చాలాసార్లు నిరూపితమైంది. ఇలాంటి ఆటగాడికి కొన్ని అవకాశాలు మాత్రమే ఇవ్వడం సబబు కాదు. కరుణ్కు కనీసం దక్షిణాఫ్రికా 'ఏ' సిరీస్తో అయినా భారత ఏ జట్టుకు ఎంపిక చేసి ఉండాల్సింది. అక్కడ ప్రదర్శనను బట్టి అతని భవిష్యత్తును డిసైడ్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకో సెలెక్టర్లు కరుణ్ విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే భావన కలుగుతుంది.చదవండి: చారిత్రక ఘట్టం.. భారత క్రికెట్ ప్రయాణంలో మరిచిపోలేని అధ్యాయం -
పది పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చిన పున్నయ్య
పుదుచ్చేరి: హైదరాబాద్ సీమర్ పున్నయ్య (6–2–10–3) నిప్పులు చెరిగే బౌలింగ్తో పుదుచ్చేరి బ్యాటర్ల పనిపట్టాడు. వర్షం వల్ల కేవలం 25 ఓవర్ల ఆటే జరిగినా... పుదుచ్చేరి పతనావస్థకు చేరింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్లో 25/1 ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన పుదుచ్చేరి వర్షంతో ఆట నిలిచే సమయానికి 34 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్ ఆనంద్ బైస్ (41; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేకపోయారు. పది మంది క్రీజులోకి రాగా... సిద్దాంత్ (16), గంగా శ్రీధర్ రాజు (11) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. హైదరాబాద్ సీమర్ పున్నయ్య ఆరు ఓవర్ల స్పెల్తోనే పుదుచ్చేరి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఇతనికి జతగా తనయ్ త్యాగరాజన్ (2/41) స్పిన్ మాయాజాలంతో కీలకమైన వికెట్లను తీయడంతో పుదుచ్చేరి ఆలౌట్కు సిద్ధమైంది. ప్రస్తుతం చేతిలో 2 వికెట్లు మాత్రమే మిగిలున్న పుదుచ్చేరి ఇంకా 343 పరుగులు వెనుకడి ఉంది. ఆటకు నేడు ఆఖరి రోజు. వర్షం వల్ల ఆట ఇంకా మొదలుకానేలేదు.మూడో రోజు ఆట రద్దు రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో ఆంధ్ర, బరోడా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు మోంథా తుపాను అడ్డుపడింది. దీంతో మూడో రోజు ఒక్కబంతి కూడా పడకుండానే ఆట రద్దు అయ్యింది. బరోడా తొలి ఇన్నింగ్స్లో 363 పరుగులు చేయగా, ఆంధ్ర రెండో రోజు ఆట వరకే 43/2 స్కోరు చేసింది. -
జైస్వాల్ కీలక నిర్ణయం
భారత టెస్ట్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా తరఫున ఎలాంటి కమిట్మెంట్స్ లేకపోవడంతో దేశవాలీ క్రికెట్ ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. త్వరలో జరుగనున్న రంజీ ట్రోఫీ 2025/26 (Ranji Trophy) మూడో రౌండ్ మ్యాచ్ ఆడేందుకు సన్నద్దత వ్యక్తం చేస్తూ.. తన హోం టీమ్ మేనేజ్మెంట్కు లేఖ రాశాడు. ఈ విషయాన్ని సోషల్మీడియా వేదికగా వెల్లడించాడు.జైస్వాల్ కొద్ది కాలం క్రితం తన హోం టీమ్ ముంబైని కాదని గోవాకు ఆడాలని నిర్ణయించుకున్నాడు. అయితే తదనంత పరిణామాల్లో యూటర్న్ తీసుకున్నాడు. తాజాగా రాజస్తాన్తో జరిగబోయే మూడో రౌండ్ మ్యాచ్కు ముంబై తరఫున ఆడేందుకు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.ఈ మ్యాచ్ నవంబర్ 1 నుంచి జైపూర్లో జరుగుతుంది. ఎలైట్ గ్రూప్ D భాగంగా ఈ మ్యాచ్ జరుగనుంది. ముంబై మేనేజ్మెంట్ తమను కాదని వెళ్లిపోవాలని చూసిన జైస్వాల్కు అవకాశం ఇస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ అవకాశం ఇస్తే అతను ముంబై జట్టులో కీలకమవుతాడు.జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో పాల్గొన్నాడు. అయితే అక్టోబర్ 29 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్ల టీ20ల సిరీస్కు అతను ఎంపిక కాలేదు. దీంతో దేశీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు.టీమిండియా తరఫున కమిట్మెంట్స్ లేని సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్లు దేశీయ క్రికెట్ ఆడాలని బీసీసీఐ కండిషన్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకే జైస్వాల్ కూడా రంజీ ఆడాలని నిర్ణయించుకున్నాడు. మూడో రౌండ్కు ముంబై జట్టును త్వరలో ప్రకటిస్తారు.జైస్వాల్ గత సీజన్లో జమ్మూ అండ్ కాశ్మీర్తో జరిగిన మ్యాచ్లో ముంబై తరఫున చివరిసారి ఆడాడు. ఆ మ్యాచ్లో రోహిత్ శర్మ కూడా పాల్గొన్నాడు. జైస్వాల్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ను ఈ ఏడాది ఆగస్ట్లో ఆడాడు. దులీప్ ట్రోఫీ 2025లో వెస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగాడు.రంజీ ట్రోఫీలో ఆడటం జైస్వాల్కు వ్యక్తిగతంగా కలిసొస్తుంది. నవంబర్ 14 నుంచి దక్షిణాఫ్రికాతో జరుగబోయే హోం సిరీస్కు ముందు మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఆ సిరీస్లో భారత్ రెండు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. జైస్వాల్కు టెస్ట్ జట్టులో చోటు పక్కా కాగా.. వన్డే, టీ20ల్లో అవకాశం లభిస్తుందో లేదో చూడాలి. సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్లు నవంబర్ 14 (కోల్కతా), నవంబర్ 22 (గౌహతి) తేదీల్లో జరుగనున్నాయి.చదవండి: వెస్టిండీస్ బోణీ -
ఉగ్రరూపం దాల్చిన పృథ్వీ షా.. సెకెండ్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన రెండో రంజీ మ్యాచ్లోనే ఉగ్రరూపం దాల్చాడు. 2025-26 ఎడిషన్లో (Ranji Trophy) భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 141 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ చరిత్రలో ఇది రెండో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.ఈ ఇన్నింగ్స్లో మొత్తం 156 బంతులు ఎదుర్కొన్న షా.. 29 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 222 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసే క్రమంలో షా కేవలం 72 బంతుల్లోనే శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. మొత్తంగా షాకు ఇది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14వ సెంచరీ.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని డబుల్ సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర.. 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఫలితంగా 463 పరుగుల భారీ ఆధిక్యం సాధించి, ప్రత్యర్దికి 464 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.చదవండి: పక్కటెముకల్లో రక్తస్రావం.. సీరియస్గా శ్రేయస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి -
పృథ్వీ షా విధ్వంసకర శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ
వివాదాస్పద బ్యాటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రంజీ ట్రోఫీలో (Ranji Trophy) మహారాష్ట్ర (Maharashtra) తరఫున తన తొలి సెంచరీ సాధించాడు. 2025-26 ఎడిషన్లో భాగంగా చండీఘడ్తో జరుగుతున్న మ్యాచ్లో (రెండో ఇన్నింగ్స్) కేవలం 72 బంతుల్లోనే (13 ఫోర్ల సాయంతో) శతక్కొట్టాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఇది ఆరో వేగవంతమైన శతకం. తొలి ఐదు ఫాస్టెస్ట్ సెంచరీలు రిషబ్ పంత్ (48), రాజేశ్ బోరా (56), రియన్ పరాగ్ (56), రూబెన్ పాల్ (60), రజత్ పాటిదార్ (68) పేరిట ఉన్నాయి. రంజీ మహారాష్ట్ర తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. షాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇది 14వ సెంచరీ. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 8 పరుగులకే ఔటైన షా.. రెండో ఇన్నింగ్స్లో అద్భుతంగా పుంజుకుని సెంచరీ సాధించాడు. మహారాష్ట్ర తరఫున రంజీ అరంగేట్రాన్ని (ఈ ఎడిషన్ తొలి మ్యాచ్) డకౌట్తో ప్రారంభించిన షా (కేరళపై).. రెండో ఇన్నింగ్స్లో 75 పరుగులతో రాణించాడు.ప్రస్తుత రంజీ సీజన్ ప్రారంభానికి ముందే ముంబై నుంచి మహారాష్ట్రకు మారిన షా.. కొత్త జట్టు తరఫున అదరగొడుతున్నాడు. ముంబైతో జరిగిన వార్మప్ మ్యాచ్లో 181 పరుగులు.. అంతకుముందు బుచ్చిబాబు టోర్నీలో చత్తీస్ఘడ్పై 111 పరుగులు చేశాడు. వరుస సెంచరీలతో షా మరోసారి టీమిండియావైపు దూసుకొస్తున్నాడు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్లో రుతురాజ్ గైక్వాడ్ (116) సెంచరీతో కదంతొక్కడంతో మహారాష్ట్ర 313 పరుగులు చేసింది. అనంతరం విక్కీ ఓస్త్వాల్ (21-6-40-6) ఆరేయడంతో చంఢీఘడ్ తొలి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. రమన్ బిష్ణోయ్ (54), పదో నంబర్ ఆటగాడు నిషంక్ బిర్లా (56 నాటౌట్) చండీఘడ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు.104 పరుగుల కీలక ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మహారాష్ట్ర, మూడో రోజు తొలి సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 164 పరుగులు చేసి, 268 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. షా 105, సిద్దేశ్ వీర 28 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. చదవండి: IND vs AUS T20 Series: తొలి పంజా మనదే..! -
రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యద్భుతం
రంజీ ట్రోఫీ 2025-26 (Ranji Trophy) ఎడిషన్లో అద్భుతం జరిగింది. అస్సాం, సర్వీసస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ (Assam vs Services) కేవలం 90 ఓవర్లలోనే ముగిసింది. 91 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగంగా (బంతుల పరంగా) పూర్తైన మ్యాచ్ ఇదే.గతంలో ఈ రికార్డు 1961-62 ఎడిషన్లో ఢిల్లీ, రైల్వేస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ పేరిట ఉండేది. ఈ మ్యాచ్ 547 బంతుల్లో ముగియగా.. అస్సాం-సర్వీసస్ మ్యాచ్ కేవలం 540 బంతుల్లోనే పూర్తైంది.అస్సామ్లోని టిన్సుకియా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ గ్రౌండ్లో నిన్న (అక్టోబర్ 25) మొదలైన ఈ మ్యాచ్ కేవలం నాలుగు సెషన్లలోనే (రెండో రోజు తొలి సెషన్) ముగిసింది. ఎలైట్ గ్రూప్-సిలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్లో అస్సాంపై సర్వీసస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అస్సాం తొలి ఇన్నింగ్స్లో 17.2 ఓవర్లు (103 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 29.3 ఓవర్లు (75 ఆలౌట్) ఆడగా.. సర్వీసస్ తొలి ఇన్నింగ్స్లో 29.2 ఓవర్లు (108 ఆలౌట్), రెండో ఇన్నింగ్స్లో 13.5 ఓవర్లు (73/2) ఆడింది.మ్యాచ్ మొత్తంలో ఇరు జట్లు కలిపి 359 పరుగులు చేశాయి. 32 వికెట్లు పడ్డాయి. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు రియాన్ పరాగ్ (Riyan Parag) (అస్సాం) బంతితో అద్భుత ప్రదర్శనలు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 5, రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీశాడు.చరిత్రాత్మక హ్యాట్రిక్స్ఈ మ్యాచ్లో మరో అద్భుతం కూడా చోటు చేసుకుంది. సర్వీసస్ బౌలర్లు అర్జున్ శర్మ (లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్), మోహిత్ జాంగ్రా (లెఫ్ట్ ఆర్మ్ సీమర్) ఒకే ఇన్నింగ్స్లో (అస్సాం తొలి ఇన్నింగ్స్) హ్యాట్రిక్లు నమోదు చేశారు. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో డబుల్ హ్యాట్రిక్లు నమోదు కావడం ఇదే తొలిసారి.ఇన్నింగ్స్ విశ్లేషణ:- అస్సాం తొలి ఇన్నింగ్స్: 103 పరుగులు (17.2 ఓవర్లు) టాప్ స్కోరర్: ప్రద్యున్ సైకియా – 52 - సర్వీసస్ తొలి ఇన్నింగ్స్: 108 పరుగులు (29.2 ఓవర్లు) అస్సాం బౌలర్ రియాన్ పరాగ్: కెరీర్ బెస్ట్ 5/25 - అస్సాం రెండో ఇన్నింగ్స్: 75 పరుగులు (29.3 ఓవర్లు) అర్జున్ శర్మ: 4/20 అమిత్ శుక్లా: 6 ఓవర్లు – 3 వికెట్లు – కేవలం 6 పరుగులు - సర్వీసస్ లక్ష్యం- 71 పరుగులు 13.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి విజయాన్ని సాధించిందిచదవండి: Women's CWC: అద్వితీయ ప్రస్థానం.. చరిత్ర తిరగేస్తే అంతా వారే..! -
టీమిండియా పొమ్మంది.. కట్ చేస్తే! సెంచరీతో సెలక్టర్లకు వార్నింగ్
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు ముందు టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్ అద్భుత సెంచరీతో సెలక్టర్లకు సవాల్ విసిరాడు. భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయిన వెటరన్ కరుణ్ నాయర్.. ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో కర్ణాటకకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.ఈ క్రమంలో శిమొగా వేదికగా గోవాతో జరుగుతున్న మ్యాచ్లో నాయర్ శతక్కొట్టాడు. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన కర్ణాటకను నాయర్ తన సెంచరీతో ఆదుకున్నాడు. తొలుత అభినవ్ మనోహర్తో భాగస్వామ్యం నెలకొల్పిన నాయర్.. తర్వాత శ్రేయస్ గోపాల్తో కలిసి స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.కరుణ్ ప్రస్తుతం 129 పరుగులతో తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్లో ఇప్పటివరకు 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతకుముందు సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి ఇన్నింగ్స్లో 95 ఓవర్లు ముగిసే సరికి కర్ణాటక 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది.నాయర్ మళ్లీ వస్తాడా?కాగా దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్.. ఇంగ్లండ్ గడ్డపై తనను లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆ సిరీస్లో నాలుగు టెస్టులు ఆడి కేవలం 25.63 సగటుతో 205 పరుగులు మాత్రమే చేశాడు. భారత బ్యాటర్లు సెంచరీల మోత మ్రోగించిన చోట.. నాయర్ కనీసం ఒక్కసారి కూడా మూడెంకెల స్కోర్ సాధించకపోవడం సెలక్టర్లను తీవ్రంగా నిరాశపరిచింది.దీంతో స్వదేశంలో వెస్టిండీస్తో జరిగిన టెస్టు సిరీస్కు కరుణ్ నాయర్ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో దేవ్దత్త్ పడిక్కల్కు అవకాశమిచ్చారు. ఇప్పుడు మళ్లీ తన ఫామ్ను తిరిగి అందుకోవడంతో నాయర్ను సౌతాఫ్రికా సిరీస్కు ఎంపిక చేస్తారో లేదో వేచి చూడాలి.చదవండి: రోహిత్ శర్మ రిటైర్మెంట్ అప్పుడే.. కన్ఫర్మ్ చేసిన కోచ్ -
ఆసీస్ టూర్కు నో ఛాన్స్.. రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం!
టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దాదాపు పది నెలల తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్కు ప్రకటించిన సౌరాష్ట్ర జట్టులో జడేజాకు చోటు దక్కింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్కు జడేజా ఎంపిక కాకపోవడంతో ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు.ఈ క్రమంలో ఎంపీతో మ్యాచ్కు అందుబాటులో ఉంటాని జడేజా తనంతట తానే సౌరాష్ట్ర సెలక్టర్లకు తెలియజేసినట్లు తెలుస్తోంది. జడేజా జట్టులోకి వచ్చినప్పటికి సౌరాష్ట్ర కెప్టెన్గా జయదేవ్ ఉనద్కట్ కొనసాగనున్నాడు. అక్టోబర్ 25 నుంచి రాజ్కోట్ వేదికగా సౌరాష్ట్ర-మధ్యప్రదేశ్ మ్యాచ్ ప్రారంభం కానుంది.సూపర్ ఫామ్లో జడ్డూ..కాగా జడేజా ప్రస్తుతం అద్బుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇటీవల వెస్టిండీస్తో టెస్టు సిరీస్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన జడ్డూ.. ప్లేయర్ ఆఫ్ది సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే ఆసీస్తో వన్డేలకు జడేజాను ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం ఎడమ చేతి వాటం స్పిన్నర్గా జడేజాకు బదులుగా అక్షర్ పటేల్ను తీసుకున్నారు.వాషింగ్టన్ సుందర్, పటేల్ను స్పిన్ ఆల్రౌండర్లగా ఎంపిక చేసిన సెలక్టర్లు.. జడేజాకు ఛాన్స్ ఇవ్వలేదు. అయితే జడ్డూతో చర్చించాకే సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సౌరాష్ట్ర క్రికెట్ తిరిగి వచ్చే నెలలో భారత జెర్సీలో కన్పించనున్నాడు. సౌతాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్లో జడ్డూ భాగంగా కానున్నాడు. ఈ సిరీస్ సన్నాహకంగా రంజీ ట్రోఫీ మ్యాచ్ను ఉపయోగించుకోవాలని జడేజా భావిస్తున్నాడు.సౌరాష్ట్ర జట్టు: హార్విక్ దేశాయ్ (వికెట్ కీపర్), తరంగ్ గోహెల్, రవీంద్ర జడేజా, యువరాజ్సిన్హ్ దోడియా, సమ్మర్ గజ్జర్, అర్పిత్ వాసవాడ, చిరాగ్ జానీ, ప్రేరక్ మన్కడ్, జయదేవ్ ఉనద్కత్ (కెప్టెన్), ధర్మేంద్రసింగ్ జడేజా, చేతన్ సకారియా, అన్ష్ గోసాయి, జే గోహిల్, పార్త్ భుట్, కెవిన్ జీవరాజని, హెత్విక్ కోటక్ మరియు అంకుర్ పన్వర్. -
చరిత్ర సృష్టించిన రింకూ సింగ్
టీమిండియా టీ20 స్పెషలిస్టు రింకూ సింగ్ (Rinku Singh) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ను అద్భుతంగా ఆరంభించాడు. ఈ దేశవాళీ రెడ్బాల్ టోర్నీలో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ మొదటి మ్యాచ్లోనే భారీ శతకంతో మెరిశాడు. తద్వారా ఫస్ట్క్లాస్ క్రికెట్లో తన సగటును 54.68 నుంచి 57.39కి పెంచుకున్నాడు.దిగ్గజాలను దాటేసి..తద్వారా యాభై ఇన్నింగ్స్ పూర్తి చేసుకున్న తర్వాత అత్యుత్తమ సగటు కలిగి ఉన్న ఆటగాడిగా రింకూ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో దిగ్గజ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid), సబా కరీం, జడేజాతో పాటు టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)ను అధిగమించాడు. ఓవరాల్గా ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యుత్తమ సగటు కలిగి ఉన్న భారత ఆటగాళ్ల జాబితాలో పదో స్థానంలో నిలిచాడు.ఈ లిస్టులో విజయ్ మర్చంట్ 71.64 సగటుతో 13 వేల పరుగులు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. షంతను సుగ్వేకర్, కేసీ ఇబ్రహీం 60కి పైగా సగటుతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. కాగా రంజీ టోర్నీ తాజా సీజన్ బుధవారం మొదలైంది.ఆంధ్ర క్రికెటర్ల శతకాలుఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా కాన్పూర్ వేదికగా ఉత్తరప్రదేశ్- ఆంధ్ర జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఆంధ్ర తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్, వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (142), వన్డౌన్ బ్యాటర్ షేక్ రషీద్ (136) భారీ శతకాలతో సత్తా చాటారు.ఈ క్రమంలో ఆంధ్ర జట్టు తమ తొలి ఇన్నింగ్స్లో 143 ఓవర్లలో 470 పరుగులకు ఆలౌట్ అయింది. యూపీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ నాలుగు వికెట్లు తీయగా.. ఆకిబ్ ఖాన్ రెండు, శివం మావి, శివం శర్మ, కెప్టెన్ కరణ్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.రింకూ సింగ్ భారీ శతకంఅనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన యూపీ శుభారంభమే అందుకుంది. ఓపెనర్లలో అభిషేక్ గోస్వామి (24) నిరాశపరచగా.. మాధవ్ కౌశిక్ (54), వన్డౌన్ బ్యాటర్ ఆర్యన్ జుయాల్ (66) అర్ధ శతకాలతో రాణించారు. అయితే, కెప్టెన్ కరణ్ శర్మ (2) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో ప్రియమ్ గార్గ్ (18), ఆరాధ్య యాదవ్ (17) ఇలా వచ్చి అలా వెళ్లారు.ఇలాంటి దశలో ఐదో నంబర్ బ్యాటర్ రింకూ సింగ్ పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. మొత్తంగా 273 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 165 పరుగులు సాధించి.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడికి తోడుగా విప్రజ్ నిగమ్ 42, శివం శర్మ 38, శివం మావి 20 (నాటౌట్) రాణించారు.యూపీదే పైచేయిఫలితంగా 169 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఉత్తరప్రదేశ్ జట్టు 471 పరుగులు సాధించింది. శనివారం ఆఖరి రోజు ఆట కావడంతో ఫలితం తేలకుండానే మ్యాచ్ ముగిసిపోయింది. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఆంధ్ర కంటే ఒక్క పరుగు ఆధిక్యం సంపాదించిన యూపీ.. మూడు పాయింట్లు ఖాతాలో వేసుకుంది. మరోవైపు.. ఆంధ్రకు ఒక పాయింట్ దక్కింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ముందు రింకూ రెడ్బాల్ క్రికెట్లో ఈ మేరకు సెంచరీతో సత్తా చాటడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. రింకూకు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది ఎనిమిదో సెంచరీ కావడం విశేషం.చదవండి: రోహిత్ శర్మతో విభేదాలు!.. స్పందించిన శుబ్మన్ గిల్ -
అందరికీ తెలుసు: అగార్కర్కు ఇచ్చిపడేసిన షమీ.. స్ట్రాంగ్ కౌంటర్
టీమిండియా సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)- చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు షమీని ఎంపిక చేయలేదు యాజమాన్యం. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. అతడి ఫిట్నెస్ గురించి తమకు సమాచారం లేదని అగార్కర్ జట్టు ప్రకటన సందర్భంగా మీడియా ముఖంగా వెల్లడించాడు.ఇందుకు షమీ ఘాటుగానే స్పందించాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్లు ఆడేవాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. తాను పూర్తి ఫిట్గా ఉన్నానని స్పష్టం చేశాడు. సెలక్షన్ అనేది తన చేతుల్లో లేదని.. ఫిట్నెస్ గురించి ఎవరూ అడగకపోయినా చెప్పడం సరికాదంటూ.. సెలక్టర్లు జట్టు ఎంపిక సమయంలో తనను సంప్రదించలేదని సంకేతాలు ఇచ్చాడు.ఫిట్గా లేకపోవడం వల్లేఈ క్రమంలో షమీ వ్యాఖ్యలపై అగార్కర్ శుక్రవారం స్పందించాడు. ఎన్డీటీవీ వేదికగా మాట్లాడుతూ.. ‘‘షమీ నా ముందు ఉండి ఉంటే సమాధానం ఇచ్చేవాడిని. అతడు నిజంగా ఫిట్గా ఉంటే అలాంటి బౌలర్ను ఎవరైనా కాదనుకుంటారా. గత ఆరు నుంచి ఎనిమిది నెలల వ్యవధిలో నేను అతడితో చాలాసార్లు మాట్లాడాను.ఫిట్గా లేకపోవడం వల్లే ఇంగ్లండ్తో సిరీస్కు ఎంపిక చేయలేకపోయాం’ అని ఈ భారత మాజీ పేసర్ స్పష్టం చేశాడు. తాము ఆడిన రోజుల్లో సెలక్టర్లకు ఏనాడూ ఫోన్ చేయలేదని, ఇప్పుడు కాలం మారిందన్న అగార్కర్... జట్టుకు ఎంపిక కాని యువ ఆటగాళ్లు తనకు వెంటనే ఫోన్ చేస్తారని, వారికి వంద శాతం నిజాయితీగా తాను సమాధానం ఇస్తానని చెప్పాడు.అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!ఈ నేపథ్యంలో అగార్కర్కు షమీ మరోసారి గట్టిగానే కౌంటర్ ఇచ్చిపడేశాడు. హిందుస్తాన్ టైమ్స్తో మాట్లాడుతూ.. ‘‘అతడు ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. నేను ఎలా బౌలింగ్ చేస్తున్నారో మీరే చూస్తున్నారు. నేనెంత ఫిట్గా ఉన్నానో.. ఎలా ఆడుతున్నానో.. అంతా మీ కళ్ల ముందే ఉంది కదా!’’ అంటూ అగార్కర్కు దిమ్మతిరిగేలా సమాధానం ఇచ్చాడు.కాగా షమీ చివరగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా ప్రాతినిథ్యం వహించాడు. ఈ మెగా వన్డే టోర్నమెంట్లో తొమ్మిది వికెట్లు కూల్చిన ఈ కుడిచేతి వాటం పేసర్.. వరుణ్ చక్రవర్తితో కలిసి భారత్ తరఫున సంయుక్తంగా లీడ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే, ఐపీఎల్-2025లో మాత్రం ఈ సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ సీజన్లో షమీ ఆడిన తొమ్మిది మ్యాచ్లలో కలిపి.. 11.23 ఎకానమీతో కేవలం ఆరు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. కాగా ఫామ్లేమి, పనిభారం కారణంగా ఇంగ్లండ్తో టెస్టులకు షమీని ఎంపిక చేయలేదనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆసీస్తో పరిమిత ఓవర్ల సిరీస్ నుంచి కూడా అతడిని తప్పించడం గమనార్హం.దుమ్ములేపిన షమీఇదిలా ఉంటే.. షమీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్నాడు. బెంగాల్ తరఫున బరిలోకి దిగిన ఈ యూపీ బౌలర్.. ఉత్తరాఖండ్తో జరిగిన తొలి మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్లో 14.5 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసిన షమీ.. రెండో ఇన్నింగ్స్లో 24.4 ఓవర్లలో కేవలం 38 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు.తద్వారా బెంగాల్ విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు షమీ. కాగా ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్లో భాగంగా బెంగాల్ జట్టు ఉత్తరాఖండ్పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలుపొందింది.చదవండి: సెలక్షన్ విషయంలో ద్రవిడ్తో విభేదాలు.. మా నిర్ణయమే ఫైనల్: అగార్కర్ -
రీఎంట్రీలో అదరగొట్టిన సంజూ శాంసన్.. ‘మెరుపు’ అర్ధ శతకం
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.రుతురాజ్ గైక్వాడ్ పోరాటంఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్ను సంజూ చక్కదిద్దాడు.సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకంఐదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది. ఆధిక్యంలో మహారాష్ట్రతొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.ఆసీస్తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూకాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది. చదవండి: షమీ విమర్శలు.. స్పందించిన చీఫ్ సెలక్టర్ అగార్కర్ -
డబుల్ సెంచరీతో చెలరేగిన ఆర్సీబీ కెప్టెన్.. కెరీర్లో తొలి సారి
దేశవాళీ క్రికెట్లో మధ్యప్రదేశ్ కెప్టెన్, టీమిండియా ఆటగాడు రజత్ పాటిదార్ తన సూపర్ ఫామ్ను కొనసాగిస్తున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో భాగంగా ఇండోర్ వేదికగా పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో పాటిదార్ డబుల్ సెంచరీతో చెలరేగాడు.పాటిదార్ 330 బంతుల్లో 26 ఫోర్ల సాయంతో తొలి ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్ను అందుకున్నాడు. 107 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో తన ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఈ ఆర్సీబీ కెప్టెన్.. ఆచితూచి ఆడుతూ మూడంకెల ఫిగర్ను సాధించాడు.ఇప్పటివరకు అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 196గా ఉండేది. ఈ ఎంపీ కెప్టెన్ 203 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అతడి ద్విశతకం ఫలితంగా మధ్యప్రదేశ్ జట్టు 145 ఓవర్లు ముగిసే సరికి తొలి ఇన్నింగ్స్లో 8 వికెట్ల నష్టానికి 489 పరుగులు చేసింది. ఎంపీ టీమ్ ప్రస్తుతం 257 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడా?ఇటీవల కాంలో పటిదార్ దుమ్ములేపుతున్నాడు. గత 8 ఇన్నింగ్స్ల్లో అతడు సాధించిన స్కోర్లు ఇవే 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 203*(332). పాటిదార్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే భారత టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చే అవకాశముంది. పాటిదార్ గతేడాది ఇంగ్లండ్పై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకోలేకపోయాడు. భారత్ తరపున మూడు టెస్టుల్లో కేవలం 63 పరుగులు మాత్రమే చేశాడు.దీంతో అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు మళ్లీ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుగ్గా రాణించి టీమిండియాలోకి తిరిగి రావాలని పట్టుదలతో పాటిదార్ ఉన్నాడు.చదవండి: IND vs AUS: ఈసారైనా కంగారులను కంగారు పెట్టిస్తారా? -
అస్సలు ఊహించలేదు.. సొంతగడ్డపై తిలక్ డకౌట్
రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూపులో భాగంగా నెక్స్జెన్ క్రికెట్ గ్రౌండ్(తూముకొండ) వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో హైదరాబాద్ కెప్టెన్ తిలక్ వర్మ(Tilak varma) తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో బ్యాటింగ్కు వచ్చిన తిలక్.. రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే పెవిలియన్కు చేరాడు.ఢిల్లీ కెప్టెన్ అయూష్ బదోని బౌలింగ్లో వికెట్ల ముందు ఆసియాకప్ హీరో దొరికిపోయాడు. తిలక్ విఫలమైనప్పటికి హైదరాబాద్ బ్యాటర్లు ఢిల్లీకి ధీటైన జవాబు ఇస్తున్నారు. 50 ఓవర్లు ముగిసే హైదరాబాద్ మూడు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. క్రీజులో తన్మయ్ అగర్వాల్(90), హిమతేజ(7) ఉన్నారు. అంతకముందు అంకిత్ రెడ్డి(87), రాహుల్ సింగ్(35) రాణించారు. హైదరాబాద్ ప్రస్తుతం ఢిల్లీ కంటే 306 పరుగులు వెనుకబడి ఉంది.సాంగ్వాన్, దొసెజా డబుల్ సెంచరీలు..ఇక మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ తమ తొలి ఇన్నింగ్స్ను 4 వికెట్ల నష్టానికి 529 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓవర్నైట్ స్కోరు 256/3తో ఆట కొనసాగించిన జట్టు గురువారం మరో 68 ఓవర్లు ఆడి 273 పరుగులు జోడించింది. ఢిల్లీ బ్యాటర్లలో సనత్ సాంగ్వాన్ (470 బంతుల్లో 211 నాటౌట్; 21 ఫోర్లు, 3 సిక్స్లు), ఆయుశ్ దొసెజా (279 బంతుల్లో 209; 25 ఫోర్లు, 5 సిక్స్లు) డబుల్ సెంచరీలతో సత్తాచాటారు.చదవండి: పాకిస్తాన్ టీమ్కు కొత్త కెప్టెన్!? -
‘వైభవ్ సూర్యవంశీ గురించి ఆ మాట అస్సలు నమ్మను’
భారత్తో పాటు ప్రపంచ క్రికెట్ వర్గాల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) పేరు ఓ సంచలనం. పదమూడేళ్ల వయసులోనే ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ. 1.10 కోట్లకు అమ్ముడు పోయిన ఈ బిహారీ పిల్లాడు.. పద్నాలుగేళ్ల వయసులోనే క్యాచ్ రిచ్ లీగ్లో ఎంట్రీ ఇచ్చాడు.ఐపీఎల్-2025 (IPL 2025)లో రాజస్తాన్ రాయల్స్ (Rajasthan Royals)కు ప్రాతినిథ్యం వహించిన వైభవ్.. కేవలం 35 బంతుల్లోనే శతక్కొట్టి అతిపిన్న వయసులో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత భారత అండర్-19 క్రికెట్ జట్టు తరఫున ఇంగ్లండ్, ఆస్ట్రేలియా గడ్డపై ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ సత్తా చాటాడు.బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ఇక వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం రంజీ ట్రోఫీ 2025-26 సీజన్తో బిజీగా ఉన్నాడు. బిహార్ జట్టు వైస్ కెప్టెన్గా ప్రమోషన్ కొట్టేసిన వైభవ్.. ప్లేట్ గ్రూప్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో విఫలమయ్యాడు.టీ20 తరహాలో చెలరేగి.. నిరాశపరిచిరంజీలోనూ టీ20 తరహా విధ్వంసకర బ్యాటింగ్కు దిగిన వైభవ్.. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్ యాబ్ నియా బౌలింగ్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాది.. ఆ వెంటనే క్లీన్బౌల్డ్ అయ్యాడు. తద్వారా ఐదు బంతుల్లో 14 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఆశ్చర్యపోయాఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ గురించి ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్ గతంలో చేసిన వ్యాఖ్యలు తాజాగా తెరమీదకు వచ్చాయి. టీమిండియా మాజీ హెడ్కోచ్ రవిశాస్త్రి ఈ విషయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆరోజు నిజంగా నేను ఆశ్చర్యపోయా. జైపూర్లో కామెంట్రీ చేస్తున్నా.నాలుగో ఓవర్లో లైవ్లోకి వెళ్లా. అయితే, ఆ సమయంలో మాకు ఓ కామెంటేటర్ తక్కువగా ఉన్నారు. తొమ్మిది, పదో ఓవర్.. అప్పుడే వైభవ్ సెంచరీ చేశాడు. తనదైన శైలిలో శతక్కొట్టేశాడు. మొహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ వంటి మేటి బౌలర్లను చితక్కొడుతూ.. ఎక్స్ట్రా కవర్, మిడ్ వికెట్ మీదుగా షాట్లు బాదాడు.అతడి వయసు పద్నాలుగే అంటే నమ్మనుఆ సమయంలో హైడోస్ (మాథ్యూ హెడెన్) అక్కడే ఉన్నాడు. అప్పుడు తను.. ‘ఓహ్.. అతడి వయసు పద్నాలుగే అంటే నేను అస్సలు నమ్మను’ అంటూ ఎగ్జైట్ అయ్యాడు. ఇందుకు నేను బదులిస్తూ.. ‘కమాన్.. కామ్డౌన్’ అన్నాను’’ అంటూ విల్లో టాక్ షోలో రవిశాస్త్రి పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు. కాగా ఐపీఎల్-2025లో గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్ సందర్భంగా వైభవ్ ఫాస్టెస్ట్ సెంచరీ బాదిన విషయం తెలిసిందే.చదవండి: అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్నే.. నువ్వు చైర్మన్వి కదా! -
సూపర్ సెంచరీతో కదంతొక్కిన ఆర్సీబీ కెప్టెన్
ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ (Rajat Patidar) రంజీ ట్రోఫీ (Ranji Trophy 2025-26) తొలి మ్యాచ్లోనే చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో మధ్యప్రదేశ్ కెప్టెన్గానూ వ్యవహరిస్తున్న పాటిదార్.. పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. పాటిదార్కు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇది 16వ సెంచరీ. దేశవాలీ క్రికెట్లో పాటిదార్ గత కొంతకాలంగా అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. గత 8 ఇన్నింగ్స్ల్లో అతను 3 సెంచరీలు, 3 అర్ద సెంచరీలు చేశాడు. ఆ స్కోర్లు ఇలా ఉన్నాయి. 100*(160), 10(25), 66(132), 13(27), 101(115), 77(84), 66(72) & 125(96)పంజాబ్తో మ్యాచ్లో పాటిదార్ వెంకటేశ్ అయ్యర్తో (73) కలిసి ఐదో వికెట్కు 147 పరుగులు జోడించాడు. 92 ఓవర్ల తర్వాత (రెండో రోజు) మధ్యప్రదేశ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 304 పరుగులుగా ఉంది. పంజాబ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్తో పోలిస్తే 72 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుందిపాటిదార్తో పాటు సరాన్ష్ జైన్ (2) క్రీజ్లో ఉన్నాడు. మధ్యప్రదేశ్ ఇన్నింగ్స్లో హిమాన్షు మంత్రి (40), శుభమ్ శర్మకు (41) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు.ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 232 పరుగులకు ఆలౌటైంది. సరాన్ష్ జైన్ 6 వికెట్లు తీసి పంజాబ్ను దెబ్బకొట్టాడు. కుమార్ కార్తికేయ, ఆర్యన్ పాండే, అర్షద్ ఖాన్ తలో వికెట్ తీశారు. పంజాబ్ ఇన్నింగ్స్లో ఉదయ్ సహరన్ (75) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. విధ్వంసకర ఆటగాడు ప్రభ్సిమ్రన్ సింగ్ 4 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. చదవండి: విధ్వంసకర వీరుడికే ప్రతిష్టాత్మక అవార్డు.. సహచరుడు పోటీ పడినా..! -
అతడు టీమిండియాకు ఆడనే లేదా?.. నేను సెలక్టర్నే.. నువ్వు చైర్మన్వి కదా!
జలజ్ సక్సేనా (Jalaj Saxena).. దేశవాళీ క్రికెట్లో అతడొక దిగ్గజం. రంజీ ట్రోఫీ (Ranji Trophy) చరిత్రలో ఇప్పటి వరకు ఏడు వేలకు పరుగులు సాధించాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్. అంతేకాదు.. ఈ స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ ఖాతాలో 484 పైగా వికెట్లు కూడా ఉన్నాయి.టీమిండియాకు ఆడే అవకాశమే రాలేదుటీమిండియాకు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev), మదన్ లాల్, రవీంద్ర జడేజా తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టడంతో పాటు.. వికెట్లు తీసిన ఘనత జలజ్ సక్సేనాదే. అయితే, 38 ఏళ్ల ఈ మధ్యప్రదేశ్ వెటరన్ ప్లేయర్కు టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదు.కేరళ టు మహారాష్ట్రఇదిలా ఉంటే.. దేశీ క్రికెట్లో సుదీర్ఘ కాలం పాటు కేరళకు ప్రాతినిథ్యం వహించిన జలజ్ సక్సేనా.. తాజా రంజీ సీజన్లో మహారాష్ట్రకు మారాడు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ 2025-26 ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా మహారాష్ట్ర బుధవారం కేరళతో మ్యాచ్ మొదలుపెట్టింది.తిరునంతపురం వేదికగా టాస్ ఓడిన మహారాష్ట్ర.. కేరళ జట్టు ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసింది. అయితే, కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యారు.హాఫ్ సెంచరీ మిస్.. అయినా భేష్కెప్టెన్ అంకిత్ బవానే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (91) నెమ్మదిగా క్రీజులో నిలదొక్కుకోగా.. ఏడో స్థానంలో వచ్చిన జలజ్ సక్సేనా కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా 106 బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్ల సాయంతో 49 పరుగులు చేశాడు.ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యమేఈ క్రమంలో కామెంట్రీ బాక్స్లో ఉన్న టీమిండియా మాజీ సెలక్టర్లు సలీల్ అంకోలా, చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జలజ్ సక్సేనాను ఉద్దేశించి..‘‘సక్సేనా టీమిండియాకు ఒక్కసారి కూడా ఆడలేదంటే ఆశ్చర్యంగా ఉంది’’ అని సలీల్ అన్నాడు.నువ్వు చైర్మన్వి కూడానూఇందుకు బదులిస్తూ.. ‘‘సలీల్.. నువ్వు.. ఆశ్చర్యకరం అనే మాటను ఉపయోగించావు. అయితే, నీకో విషయం చెప్పాలి. మన ఇద్దరం మాజీ సెలక్టర్లమే’’ అని చేతన్ శర్మ నవ్వులు చిందించాడు. ఇందుకు స్పందిస్తూ.. ‘‘నువ్వు చైర్మన్వి కూడానూ’’ అంటూ చేతన్కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు సలీల్.దీంతో.. ‘‘నిజమే.. వేళ్లన్నీ మన వైపే చూపించేవి’’ అని చేతన్ శర్మ కవర్ చేశాడు. ఏదేమైనా ప్రతిభ ఉన్న జలజ్ సక్సేనాకు అంతర్జాతీయ క్రికెట్లో కనీసం అరంగేట్రం చేసే అవకాశం రాకపోవడం పట్ల నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. నవ్వుతూనే అయినా తప్పును ఒప్పుకొన్నారంటూ మాజీ సెలక్టర్లకు చురకలు అంటిస్తున్నారు.239 పరుగులకు ఆలౌట్ఇదిలా ఉంటే.. కేరళతో మ్యాచ్లో మహారాష్ట్ర తమ తొలి ఇన్నింగ్స్లో 239 పరుగులకు ఆలౌట్ అయింది. రుతు, జలజ్తో పాటు విక్కీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) రాణించడంతో ఈ మేర నామమాత్రపు స్కోరు సాధ్యమైంది. కేరళ బౌలర్లలో నిధీశ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. నెడుమంకులి బాసిల్ మూడు, ఈడెన్ ఆపిల్, అంకిత్ శర్మ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.చదవండి: టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...When they showed Jalaj Saxena's domestic stats one commentator said he has such great stats but it's surprising that he hasn't played for India and the other commentator replied"Surprisingly" both of us were the selectors and you were the chairman. pic.twitter.com/QvtzZEbWkG https://t.co/q8kHY6rkkv— Aditya Soni (@imAdsoni) October 15, 2025 -
టీమిండియా సెలక్టర్లకు ఇషాన్ స్ట్రాంగ్ కౌంటర్.. అంతలోనే...
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ను జార్ఖండ్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఘనంగా ఆరంభించాడు. ఎలైట్ గ్రూప్-‘ఎ’లో భాగంగా తమిళనాడు (Tamil Nadu vs Jharkhand)తో మ్యాచ్లో భారీ శతకంతో చెలరేగాడు. ఒకానొక సమయంలో డబుల్ సెంచరీ దిశగా పయనించిన ఇషాన్.. ద్విశతకానికి ఇరవై ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు.సెలక్టర్లకు గట్టి వార్నింగ్ఏదేమైనా ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రదర్శన పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. అద్భుత సెంచరీతో టీమిండియా సెలక్టర్లకు గట్టి వార్నింగ్ ఇచ్చాడంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ను చాన్నాళ్లుగా టీమిండియా నుంచి పక్కన పెట్టడం గురించి మాట్లాడుతూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన వ్యాఖ్యలను తెరమీదకు తెస్తున్నారు.మెరుగైన ప్రదర్శనతో‘‘ఇషాన్ కిషన్ మంచి ఆటగాడు. అయితే, అతడు దేశీ క్రికెట్లో తరచుగా ఆడుతూ.. నిలకడైన ప్రదర్శనలు ఇస్తేనే పరిగణనలోకి తీసుకునేందుకు సెలక్టర్లు సిద్ధంగా ఉన్నారు’’ అని అగార్కర్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో దేశవాళీ మ్యాచ్లు ఆడకుండా బీసీసీఐ ఆగ్రహానికి గురైన ఈ యువ ఆటగాడు... ఈసారి మెరుగైన ప్రదర్శనతో సీజన్ను ఆరంభించడం విశేషం.తొలిరోజే శతకంఇక మ్యాచ్ విషయానికొస్తే... కోయంబత్తూర్ వేదికగా తమిళనాడుతో బుధవారం మొదలైన పోరులో టాస్ గెలిచిన జార్ఖండ్.. తొలుత బ్యాటింగ్కు దిగింది. తొలిరోజు టీమిండియా ప్లేయర్, జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (183 బంతుల్లో 125 బ్యాటింగ్; 14 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ సెంచరీతో కదంతొక్కాడు. ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది.ఇషాన్ అజేయ శతకంతో ఆకట్టుకోగా... సాహిల్ రాజ్ (105 బంతుల్లో 64 బ్యాటింగ్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) అజేయ అర్ధశతకంతో కెప్టెన్కు అండగా నిలిచాడు. శరణ్దీప్ సింగ్ (102 బంతుల్లో 48; 6 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. మిగిలినవాళ్లు విఫలమవడంతో ఒక దశలో జార్ఖండ్ జట్టు 157 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.ఈ దశలో సాహిల్తో కలిసి ఇషాన్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. తమిళనాడు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఈ జోడీ... క్రీజులో కుదురుకున్న తర్వాత చక్కటి షాట్లతో ఆకట్టుకుంది. ఈ జంట అబేధ్యమైన ఏడో వికెట్కు 150 పరుగులు జోడించడంతో జార్ఖండ్ కోలుకుంది. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా... చంద్రశేఖర్ 2 వికెట్లు తీశాడు.డబుల్ సెంచరీ మిస్ఇక రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్ తన ఓవర్నైట్ స్కోరు 125కు మరో 48 పరుగులు జోడించి అవుటయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో మొత్తంగా ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 247 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 173 పరుగులు చేశాడు. ఆర్ఎస్ అంబరీశ్ బౌలింగ్లో షారుఖ్ ఖాన్కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.మరోవైపు సాహిల్ రాజ్ 77 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గురప్జీత్ సింగ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఇక అనుకూల్ రాయ్ను (12)ను సందీప్ వారియర్ వెనక్కి పంపించాడు. ఈ నేపథ్యంలో 122 ఓవర్లు ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి జార్ఖండ్ 379 పరుగులు చేసింది. జతిన్ పాండే 4, రిషావ్ రాజ్ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
వైభవ్ సూర్యవంశీ అట్టర్ ప్లాప్.. టీ20 మ్యాచ్ అనుకున్నావా?
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ వైస్ కెప్టెన్గా తొలి మ్యాచ్లోనే విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ ప్లేట్ గ్రూపులో భాగంగా పాట్నా వేదికగా అరుణాచల్ ప్రదేశ్-బిహార్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన అరుణాచాల్ కెప్టెన్ తొలుత బిహార్ను బ్యాటింగ్ అహ్హనించాడు.అయితే బ్యాటింగ్కు దిగిన బిహార్ ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న సూర్యవంశీ.. ఈ మ్యాచ్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోయాడు. టీ20 తరహాలో తన బ్యాటింగ్ను ప్రారంభించిన వైభవ్ కేవలం 5 బంతుల్లో 280.00 స్ట్రైక్ రేటుతో 14 పరుగులు చేసి ఔటయ్యాడు. బిహార్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్ వేసిన యాబ్ నియా బౌలింగ్లో తొలి నాలుగు బంతుల్లో ఒక సిక్స్, రెండు ఫోర్లు బాదిన వైభవ్.. ఐదో బంతికి క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో సోషల్ మీడియా వేదికగా అతడిపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు."వైభవ్ ఫార్మాట్ తగ్గట్టు ఆడడం నేర్చుకోవాలి. అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగులు మాత్రమే చేశాడు. ప్రతీ బంతికి షాట్ ఆడే అవసరం లేదు. ఇది రెడ్ బాల్ క్రికెట్. సహనం, టెక్నిక్ కూడా కావాలి" ఓ యూజర్ ఎక్స్లో పోస్ట్ చేశాడు. కాగా 12 ఏళ్ల వయసులోనే ఫస్ట్-క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన వైభవ్ సూర్యవంశీ.. తన టాలెంట్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఐపీఎల్-2025, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టూర్లలో దుమ్ములేపాడు. ఈ క్రమంలోనే అతడికి బిహార్ క్రికెట్ అసోయేషిన్ వైస్ కెప్టెన్గా ప్రమోషన్ ఇచ్చింది.అతడి బిహార్ జట్టును అత్యున్నత స్ధాయికి తీసుకు వెళ్తాడని బీసీఎ భావించింది. కానీ వైభవ్ మాత్రం తొలి మ్యాచ్లోనే విఫలమై నిరాశపరిచాడు. తర్వాతి మ్యాచ్లలోనైనా సూర్యవంశీ తన బ్యాట్కు పని చెబుతాడో లేదో చూడాలి.భారీ స్కోర్ దిశగా బిహార్..సూర్యవంశీ నిరాశపరిచినప్పటికి తొలి ఇన్నింగ్స్లో బిహార్ భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి బిహార్ రెండు వికెట్ల నష్టానికి 283 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో ఆయుష్ లోహరుక(155), సకిబుల్ గని(56) ఉన్నారు.చదవండి: 20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ -
20 నెలలుగా టీమిండియా వద్దంది.. కట్ చేస్తే! విధ్వంసకర సెంచరీ
రంజీ ట్రోఫీ సీజన్ను ఆంధ్ర జట్టు మెరుగైన రీతిలో మొదలు పెట్టింది. కాన్పూర్ వేదికగా గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఉత్తరప్రదేశ్తో మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన ఆంధ్ర బ్యాటింగ్ ఎంచుకుంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో జట్టు 85.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.వికెట్ కీపర్ కేెఎస్ భరత్ (244 బంతుల్లో 142; 13 ఫోర్లు) భారీ శతకంతో చెలరేగాడు. అద్భుతమైన బ్యాటింగ్తో ప్రత్యర్ధి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. భరత్ మరో యువ ఆటగాడు షేక్ రషీద్తో కలిసి మూడో వికెట్కు 194 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రషీద్ కూడా సెంచరీ దిశగా దూసుకుపోతున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సరికి రషీద్ 197 బంతుల్లో 8 ఫోర్లు సాయంతో 94 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఓపెనర్ అభిషేర్ రెడ్డి(36) పర్వాలేదన్పించగా.. కెప్టెన్ రికీ భుయ్(2) మాత్రం విఫలమయ్యాడు. యూపీ బౌలర్లలో ఆఖిబ్ ఖాన్కు 2 వికెట్లు దక్కగా, విప్రాజ్ నిగమ్ మరో వికెట్ తీశాడు. గోల్డెన్ ఛాన్స్ మిస్..కేఎస్ భరత్ టీమిండియా తరపున 2023లో ఆస్ట్రేలియాపై టెస్టు అరంగేట్రం చేశాడు. కానీ తనకు వచ్చిన అవకాశాన్ని ఈ విశాఖ కుర్రాడు సద్వినియోగపరుచుకోలేకపోయాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ గాయ పడడంతో గతేడాది స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో కూడా భరత్కు ఆడే అవకాశం లభించింది.కానీ ఈ వికెట్ కీపర్ బ్యాటర్ తన మార్క్ చూపించలేకపోయాడు. దీంతో సెలక్టర్లు అతడిని పక్కన పెట్టారు. పంత్కు ప్రత్నమ్నాయంగా మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ను సెలక్టర్లు జట్టులోకి తీసుకున్నారు. జురెల్ తన అద్భుతమైన ప్రదర్శనలతో పంత్కే పోటీ ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటిలో భరత్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. భరత్ చివరగా టీమిండియా తరపున గతేడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్పై ఆడాడు. మొత్తంగా తన కెరీర్లో ఇప్పటివరకు 7 టెస్టులు ఆడిన భరత్.. 417 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: టి20 ప్రపంచకప్ టోర్నీకి నేపాల్, ఒమన్ అర్హత -
చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్
ఆస్ట్రేలియా పర్యటనకు తనను ఎంపిక చేయని భారత సెలెక్టర్లకు వెటరన్ పేసర్, బెంగాల్ ఆటగాడు మహ్మద్ షమీ (Mohammed Shami) దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. ఇవాళ (అక్టోబర్ 15) ప్రారంభమైన రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) ఉత్తరాఖండ్పై 4 బంతుల్లో 3 వికెట్లు తీసి టీమిండియాకు అడేందుకు 100 శాతం అర్హుడినన్న సందేశం పంపాడు.షమీ తీసిన 3 వికెట్లలో రెండు క్లీన్ బౌల్డ్లు కాగా.. మరొకటి క్యాచ్ ఔట్. షమీతో పాటు ఇషాన్ పోరెల్ (15-3-40-3), సూరజ్ సింధు జైస్వాల్ (19-4-54-4) చెలరేగడంతో ఉత్తరాఖండ్ 72.5 ఓవర్లలో 213 పరుగులకే చాపచుట్టేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్లో భుపేన్ లాల్వాని (71) ఒక్కడే రాణించాడు. మిగతా ఆటగాళ్లలో కనీసం ఒక్కరూ 30 పరుగుల మార్కును తాకలేకపోయారు.ఇదిలా ఉంటే, గత కొంతకాలంగా షమీని భారత సెలెక్టర్లు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెడుతున్నారన్న ప్రచారం జరుగుతుంది. 2023 వన్డే ప్రపంచకప్లో ఊహలకందని రీతిలో రాణించిన షమీ.. గాయం కారణంగా ఏడాదికాలం పాటు ఆటకు దూరంగా ఉన్నాడు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడిన షమీ.. ఏడు నెలలుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించి, దేశవాలీ క్రికెట్లో రాణిస్తున్నా సెలెక్టర్లు షమీని పట్టించుకోవడం లేదు. అతను చివరిగా 2023 జూన్లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు.ఇటీవలి ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలా జరగలేదు. తాజాగా ఆస్ట్రేలియా పర్యటనకైనా ఎంపిక చేస్తారని షమీ పూర్తి విశ్వాసంతో ఉన్నాడు. సెలెక్టర్లు ఈసారి కూడా పట్టించుకోలేదు. తాజాగా అతను ఆసీస్ పర్యటనకు ఎంపిక కాకపోవడంపై స్పందించాడు.ఫిట్నెస్ సాకుగా చూపిస్తూ నన్ను పక్కకు పెట్టారు. ఫిట్నెస్ లేకపోతే రంజీ ట్రోఫీలో ఎలా ఆడతానన్న అర్దం వచ్చేలా వ్యాఖ్యానించాడు. సెలెక్లరు, కోచ్, కెప్టెన్ అనుకుంటేనే తాను జట్టులో ఉంటానని అన్నాడు. ఈ వాఖ్యలు చేసిన తర్వాత షమీ బంతితోనే సెలెక్టర్లను సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అలాగే చేశాడు. మున్ముందైనా సెలెక్టర్లు షమీని పరిగణలోకి తీసుకుంటారో లేదో చూడాలి.చదవండి: శతక్కొట్టిన ఇషాన్ కిషన్ -
శతక్కొట్టిన ఇషాన్ కిషన్
రంజీ ట్రోఫీలో (Ranji Trophy 2025-26) భాగంగా తమిళనాడుతో ఇవాళ (అక్టోబర్ 15) మొదలైన మ్యాచ్లో జార్ఖండ్ ఆటగాడు, ఆ జట్టు కెప్టెన్ కూడా అయిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) సెంచరీతో కదంతొక్కాడు. ఈ మ్యాచ్లో జార్ఖండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. ఐదో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్ 137 బంతుల్లో 12 బౌండరీలు, 2 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు.75 ఓవర్ల తర్వాత జార్ఖండ్ స్కోర్ 6 వికెట్ల నష్టానికి 251 పరుగులుగా ఉంది. ఇషాన్కు జతగా సాహిల్ రాజ్ (33) క్రీజ్లో ఉన్నాడు. జార్ఖండ్ ఇన్నింగ్స్లో శిఖర్ మోహన్ 10, శరన్దీప్ సింగ్ 48, కుమార్ సూరజ్ 3, విరాట్ సింగ్ 28, కుమార్ కుషాగ్రా 11, అనుకూల్ రాయ్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. తమిళనాడు బౌలర్లలో గుర్జప్నీత్ సింగ్ 3, డీటీ చంద్రశేఖర్ 2, సందీప్ వారియర్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ప్రస్తుత రంజీ ఎడిషన్ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 16 మ్యాచ్లు జరుగతున్నాయి. ఈ ఎడిషన్లో ఇషాన్ కిషన్దే మొదటి శతకం. వేర్వేరు మ్యాచ్ల్లో టీమిండియా ఆటగాళ్లు దేవ్దత్ పడిక్కల్ (Devdutt Padikkal), రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) సెంచరీలకు చేరువై ఔటాయ్యరు. సౌరాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్లో పడిక్కల్ (కర్ణాటక) 96 పరుగుల వద్ద ఔటాయ్యడు. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో రుతురాజ్ (మహారాష్ట్ర) 9 పరుగుల తేడాతో అత్యంత అర్హమైన సెంచరీని మిస్ అయ్యాడు. ఈ మ్యాచ్లో రుతురాజ్ తన జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు (18/5) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్తో ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కిన టీమిండియా మాజీ వికెట్కీపర్ఉత్తర్ప్రదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మాజీ వికెట్కీపర్ శ్రీకర్ భరత్ (Srikar bharat) (ఆంధ్రప్రదేశ్) సెంచరీతో కదంతొక్కాడు. 213 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 117 పరుగులు చేసి ఇన్నింగ్స్ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా షేక్ రషీద్ (69) క్రీజ్లో ఉన్నాడు. 73 ఓవర్ల తర్వాత ఆంధ్ర స్కోర్ 235/1గా ఉంది.చదవండి: దుమ్మురేపిన రషీద్ ఖాన్ -
పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారి
రంజీ ట్రోఫీ తాజా సీజన్ తొలి మ్యాచ్లోనే మహారాష్ట్ర ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw)కు చేదు అనుభవం ఎదురైంది. కేరళతో బుధవారం మొదలైన మ్యాచ్లో ఈ కుడిచేతి వాటం బ్యాటర్ డకౌట్ అయ్యాడు. నాలుగు బంతులు ఎదుర్కొన్న పృథ్వీ.. పరుగుల ఖాతా తెరవకుండానే నిధీశ్ (Nidheesh) బౌలింగ్లో లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు.మహారాష్ట్ర Vs కేరళ ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీ (Ranji Trophy) 91వ ఎడిషన్కు బుధవారం తెరలేచింది. ఇందులో భాగంగా ఎలైట్ గ్రూప్-బిలోని మహారాష్ట్ర- కేరళ మధ్య తిరువనంతపురం వేదికగా మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పృథ్వీ షా డకౌట్.. టాపార్డర్ సున్నా.. కెప్టెన్దీ అదే దారిఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు ఊహించని రీతిలో వరుస షాకులు తగిలాయి. ఓపెనర్లు పృథ్వీ షా, అర్షిన్ కులకర్ణితో పాటు వన్డౌన్ బ్యాటర్ సిద్ధేశ్ వీర్ డకౌట్ అయ్యాడు. అర్షిన్ బాసిల్ బౌలింగ్లో కణ్ణుమ్మల్కు క్యాచ్ ఇచ్చి అర్షిన్ గోల్డెన్ డకౌట్ కాగా.. సిద్ధేశ్.. నిధీశ్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే అజారుద్దీన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఖాతా తెరిచిన రుతువీరితో పాటు కెప్టెన్ అంకిత్ బావ్నే కూడా పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. అయితే, ఏడు బంతుల పాటు క్రీజులో నిలిచిన అతడు బాసిల్ బౌలింగ్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో నాలుగో నంబర్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 25 బంతులు ఎదుర్కొన్న తర్వాత కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. పది ఓవర్ల ఆట ముగిసే సరికి రుతు 28 బంతుల్లో ఒక పరుగు చేయగా.. సౌరభ్ నవాలే 20 బంతుల్లో 10 పరుగులతో క్రీజులో ఉన్నాడు.మొత్తానికి తొలిరోజు పది ఓవర్ల ఆటలో కేరళ బౌలర్ల ధాటికి మహారాష్ట్ర నాలుగు వికెట్ల నష్టానికి కేవలం 16 పరుగులే చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వరుస సెంచరీల తర్వాతకాగా కెరీర్ ఆరంభం నుంచి ముంబైకి ఆడిన పృథ్వీ షా.. ఈ ఏడాది మహారాష్ట్రకు మారాడు. ఇటీవల బుచ్చిబాబు ఇన్విటేషనల్ రెడ్బాల్ టోర్నీలో, ముంబైతో వార్మప్ మ్యాచ్లో సెంచరీలతో అలరించిన పృథ్వీ.. అసలైన పోరులో మాత్రం ఆదిలోనే తుస్సుమనిపించాడు.రంజీ ట్రోఫీ-2025: మహారాష్ట్ర వర్సెస్ కేరళ తుదిజట్లుమహారాష్ట్రఅంకిత్ బావ్నే (కెప్టెన్), పృథ్వీ షా, రుతురాజ్ గైక్వాడ్, సౌరభ్ నవాలే (వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, రజనీశ్ గుర్బానీ, విక్కీ ఓస్త్వాల్, సిద్ధేష్ వీర్, ముఖేష్ చౌదరి, అర్షిన్ కులకర్ణి, రామకృష్ణ ఘోష్.కేరళమహ్మద్ అజారుద్దీన్ (కెప్టెన్, వికెట్ కీపర్), బాబా అపరాజిత్, సంజూ శాంసన్, సచిన్ బేబీ, ఎండీ నిధీశ్, అక్షయ్ చంద్రన్, రోహన్ కుణ్ణుమ్మల్, అంకిత్ శర్మ, ఈడెన్ యాపిల్ టామ్, నెడుమాన్కులి బాసిల్, సల్మాన్ నిజార్.చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ


