-
Droupadi Murmu In Ayodhya: అయోధ్య రాముని సేవలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (ఫొటోలు)
-
Draupadi Murmu: అయోధ్యలో రాష్ట్రపతి
అయోధ్య: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బుధవారం అయోధ్య సందర్శించారు. నూతన మందిరంలో ఇటీవలే కొలువుదీరిన బాలరామున్ని తొలిసారిగా దర్శించుకున్నారు. స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి హారతిచ్చారు. అంతకుముందు సరయూ నది హారతి కార్యక్రమంలో కూడా రాష్ట్రపతి పాల్గొన్నారు. అంగవస్త్రం ధరించి సంప్రదాయబద్ధంగా హారతిచ్చారు. అనంతరం నదికి పూలమాలలు సమరి్పంచి మొక్కుకున్నారు. తర్వాత ప్రఖ్యాత హనుమాన్ గఢి ఆలయాన్ని సందర్శించారు. పూజల్లో పాల్గొని ఆంజనేయునికి హారతిచ్చారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం రామాలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్రదాస్ రాష్ట్రపతికి దగ్గరుండి దర్శనం చేయించారు. రామ్ లల్లా పట్ల ఆమె భక్తిశ్రద్ధలు అపూర్వమని కొనియాడారు. ‘‘స్వామికి రాష్ట్రపతి హారతిచ్చారు. సాష్టాంగం చేసి భక్తిని చాటుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని ఇద్దరూ గొప్ప రామ భక్తులు కావడం నిజంగా గొప్ప విషయం’’ అని సత్యేంద్రదాస్ అన్నారు. అప్పట్లో విపక్షాల రగడ... అయోధ్యలో నూతన రామాలయం నిర్మాణానంతరం రాష్ట్రపతి అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. ఆలయం జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమవడం తెలిసిందే. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కూడా ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది. దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వేలాది మంది ప్రముఖులను కార్యక్రమానికి ఆహా్వనించారు. రాష్ట్రపతి మాత్రం అందులో పాల్గొనలేదు. దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వెల్లువెత్తాయి. ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని పూర్తిగా పక్కన పెట్టి సర్వం మోదీమయంగా కార్యక్రమం జరిపించారని కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ తదితరులు దుయ్యబట్టారు. ముర్ము ఆదివాసీ కాబట్టే రాష్ట్రపతి అని కూడా చూడకుండా కావాలనే కార్యక్రమానికి దూరంగా ఉంచారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న వేళ బుధవారం ఆమె అయోధ్య వెళ్లి నూతన ఆలయాన్ని, బాలరామున్ని దర్శించుకోవడం విశేషం. -
మరోసారి మా అధ్యక్షునిగా మంచు విష్ణు!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షునిగా మంచు విష్ణునే కొనసాగించాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును కమిటీ ఖరారు చేసింది. ఇప్పటికే విష్ణు మా అధ్యక్షునిగా ఉన్నారు. మా అధ్యక్ష భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ఆయననే కొనసాగించాలని 26 మంది సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!
భారత రాష్ట్రపతిగా ఆ అత్యున్నత పదవిని అలంకరించిన అతి పిన్న వయస్కురాలు ద్రౌపది ముర్ము. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవిని చేపట్టిన రెండో మహిళ ఆమె. అంతేగాదు ఈ పదవిని అలంకరించిన తొలి గిరిజన మహిళ కూడా ఆవిడే కావడం విశేషం. రాష్ట్రపతిగా అనునిత్యం బిజీగా ఉండే ఆమె ఎలాంటి ఆహారం తీసుకుంటారు? ఆమె డైట్ ఎలా ఉంటుందనే కుతుహలం ఉంటుంది. అయితే ఆమె ఏం డైట్ ఫాలో అవ్వుతారో రాష్ట్రపతి భవన్ చెఫ్లు వెల్లడించడమేగాక పలు ఆసక్తికర విషయాలు కూడా చెప్పుకొచ్చారు. అవేంటంటే.. ద్రౌపది ముర్ము సాత్విక ఆహారాన్నే ఇష్టపడతారని, ప్రధానంగా శాకాహారమే ఇష్టంగా తింటారని రాష్ట్రపతి భవన్ చెఫ్లు పేర్కొన్నారు. ఆమె 2022లో షెడ్యూల్డ్ తెగకు చెందిన మొదటి సభ్యురాలిగా, భారత రాష్ట్రపతిగా ఎన్నికైన రెండో మహిళగా చరిత్ర సృష్టించారు. అంతేగాదు ఆమె తన తెగకు చెందిన ప్రజల గొంతుకగా మారి వారి సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల ఆదరాభిమానలను పొందారు. అలాంటి మహోన్నత వ్యక్తి ముర్ము తను తీసుకునే ఆహారం విషయంలో సాత్వికాహారానికే పెద్దపీట వేస్తారని చెఫ్లు చెబుతున్నారు. ముఖ్యంగా పసుపు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి బొప్పాయితో చేసే వంటకాన్ని కచ్చితంగా చేయాల్సిందేనని అన్నారు. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా వండిన భోజనాన్నే తినడానికి ఇష్టపడతారట ఆమె. ఇక ఆమె ఓట్స్, సంప్రదాయ పూరీ ఆలు సబ్జీ కలియకతో కూడిన అల్పాహారంతో రోజుని ప్రారంభిస్తారని సీనియర్ కుక్ చెఫ్ సంజయ్ కుమార్ చెప్పారు. ఆమెకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లలో రైస్ చిల్లాస్ ఒకటని అన్నారు. తరచుగా ఆమె ఒడియా వంటకాలనే ఇష్టపడతారని తెలిపారు. 2000 నుంచి 2009 వరకు రాయ్రంగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒడిశా శాసనసభ సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేయడంతో ఆ రాష్ట్రంతో ఆమెకున్న విడదీయరాని అనుబంధం అమె అభిరుచిలో ప్రతిబింబిస్తోందని అన్నారు. అందువల్లే ఆమె భోజనంలో ఒడియా వంటకాలైన దాల్మా, సంతులా వంటకాలు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. దాల్మా అనే వంటకం చిక్పీస్, మునగకాయలు, బొప్పాయి వంటి కూరగాయాలతో కూడిన ఆహారం. ఇక సంతులా అంటే కాలానుగుణ కూరగాయాలతో చేసే మిశ్రమ వంటకం. ఈ రెండు సాత్వికాహారానికి చెందినవేనని చెబుతున్నారు చెఫ్లు. ఆమె కాలానుగుణ కూరగాయాలకు, పండ్లకు ప్రాముఖ్యత నిస్తారని తెలిపారు. కాగా, ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే ఈ సాత్వికాహార డైట్ వల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. సాత్వికాహారంతో ఒనగురే ప్రయోజనాలు.. మెరుగైన జీర్ణక్రియ, పోషకాల శోషణ శరీరానికి అవసరమయ్యే శక్తి స్థాయిలు అందిస్తుంది మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అద్భుతమైన ఏకాగ్రత ఉంటుంది. ఒత్తిడి, ఆందోళనలను నివారిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది రోగనిరోధక వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది బరువుని అదుపులో ఉంచుతుంది సుదీర్ఘ ఆయుర్ధాయం ఉంటుంది. (చదవండి: విమాన సిబ్బందిని చీరకట్టుకునేలా చేసింది, ఆ మహిళే) -
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
ధోని నా తండ్రి లాంటి వారు: ‘బేబీ మలింగ’ కామెంట్స్ వైరల్
వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి
మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆ సమస్యతో చాలా బాధపడ్డా, కానీ అదే కాపాడింది : సారా టెండూల్కర్
సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
బెంగాల్ గవర్నర్పై ఆరోపణలు: విచారణ జరపాలన్న మిసా భారతి
డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు
Pooja Hegde: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
తప్పక చదవండి
- మా భూమి మాది కాకపోతే మరెవరిది రామోజీ..?: మంత్రి బొత్స
- మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
- తప్పుడు ప్రచారాలతో చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్
- షుగర్ వచ్చిందని బెదిరిపోకండి.. ఇవి ఖచ్చితంగా పాటిస్తే షుగర్ పరార్!
- చంద్రబాబు, కోట్లకు కౌంటరిచ్చిన మంత్రి బుగ్గన
- మరీ అంత చెత్త ఆటగాళ్లలా కనిపిస్తున్నారా?: సెహ్వాగ్ చురకలు
- భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
- Happy Birthday Trisha : 25 ఏళ్ల కెరియర్లో వివాదాలతో పాటు కోట్లలో ఆస్తులు
- Hindupur: కుచ్చుటోపీ చుట్టాలొచ్చారోచ్! ఉండండి టోపీ పెడతాం...
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
Advertisement