breaking news
Gold Price
-
తారుమారు బంగారం! గంటల్లో మారిపోయిన ధరలు
దేశంలో బంగారం ధరలు నేడు (Today Gold Rate) తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఉదయం భారీగా పడిపోయిన పసిడి ధరలు గంటల వ్యవధిలో తారుమారయ్యాయి. సాయంత్రానికే పెరుగుదల బాట పట్టాయి. దీంతో పుత్తడి ప్రియులకు అంతలనే తీవ్ర నిరాశ తప్పలేదు.హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు సహా తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం తులం (10 గ్రాములు) 22 క్యారెట్ల బంగారం రూ.2900 తగ్గి రూ.1,46,500 వద్ద ఉండగా సాయంత్రం తిరిగే సరికి రూ.1,47,700 వద్దకు చేరింది. అంటే రూ.3350 పెరిగింది. ఇక 24 క్యారెట్ల పుత్తడి ఉదయం రూ.3160 తగ్గి రూ.1,59,820 వద్ద ఉండగా సాయంత్రానికే రూ.3650 ఎగిసి రూ.1,61,130 లను తాకింది.చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,48,000 వద్దకు, 24 క్యారెట్ల బంగారం రూ.1,61,460 వద్దకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.1,47,850, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.1,61,280 పలుకుతున్నాయి.ఇక వెండి ధరల్లో హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. హైదరాబాద్లో ఈరోజు ఉదయం వెండి ధర కేజీకి రూ.5000 తగ్గి రూ.2,60,000 వద్దకు చేరగా సాయంత్రానికి రూ.5000 పెరిగి మళ్లీ రూ.2,65,000 వద్దకే ఎగిసింది. ఢిల్లీలో వెండి ధర మాత్రం మారలేదు. ఈరోజు ఉదయం రూ.5000 తగ్గి రూ.2,55,000 వద్దకు వచ్చిన కేజీ వెండి సాయంత్రానికీ అదే ధర కొనసాగింది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. కచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఒకేరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేటు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం ధరలు తగ్గే ఛాన్స్.. కేంద్రం కీలక ఆలోచన
-
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గోల్డ్, సిల్వర్పై పన్ను తగ్గే ఛాన్స్.. కారణం ఇదే!
బంగారం, వెండిపై భారీగా ఉన్న దిగుమతి సుంకాలను తగ్గించే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అధిక పన్నుల కారణంగా.. చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం కంటే, అక్రమ మార్గాల్లో వచ్చే బంగారం చౌకగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని.. సుంకం తగ్గిస్తే స్మగ్లింగ్ను అడ్డుకోవచ్చా?, అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే.. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. బులియన్ వ్యాపారులు, జ్యువెలరీ రంగం మాత్రం ప్రస్తుత 15 శాతం సుంకాన్ని.. 6 శాతానికి తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇదే జరిగితే ధరలు కొంత తగ్గే అవకాశం ఉంటుంది.సుంకం ఎందుకు పెంచారు?బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందన్న ఆందోళనతో ప్రభుత్వం మే 13, 2026న దిగుమతి సుంకాన్ని పెంచింది. భారత్ ప్రతి ఏడాది సుమారు 700-800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. సుంకం పెంచడానికి ముందు ఏప్రిల్లో బంగారం దిగుమతులు ఏకంగా 82 శాతం పెరిగాయి. ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటే డాలర్లకు డిమాండ్ పెరగడంతో పాటు కరెంట్ అకౌంట్ లోటు కూడా పెరుగుతుంది. దీంతో రూపాయిపై ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉంటుంది.పన్ను పెంచినా దిగుమతులు తగ్గలేదే?ప్రభుత్వం సుంకాన్ని పెంచినప్పటికీ బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. మేలో దిగుమతులు దాదాపు 34 శాతం పెరిగాయి. ఆ తర్వాత జూన్, జూలై నెలల్లో కలిపి బంగారం దిగుమతుల విలువ 5.5 శాతం పెరిగి 6.13 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో అధిక సుంకం విధించడం ద్వారా దిగుమతులను నియంత్రించాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎంతవరకు నెరవేరిందనే ప్రశ్నలు వస్తున్నాయి.స్మగ్లింగ్ ఎందుకు పెరుగుతోంది?పరిశ్రమ వర్గాల వాదన ప్రకారం.. అధిక పన్ను కారణంగా చట్టబద్ధంగా దిగుమతి చేసుకునే బంగారం ఖరీదుగా మారుతుంది. అదే సమయంలో అక్రమ మార్గంలో వచ్చే బంగారంపై ఇలాంటి పన్ను ఉండదు. దీంతో రెండు మార్గాల మధ్య ధర వ్యత్యాసం పెరుగుతుంది. ఈ పరిస్థితి స్మగ్లింగ్కు ప్రోత్సాహం ఇవ్వొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అందుకే సుంకాన్ని తగ్గిస్తే చట్టబద్ధమైన దిగుమతులు పెరగడంతో పాటు అక్రమ మార్గాల్లో బంగారం వచ్చే ప్రోత్సాహం కూడా తగ్గవచ్చని వారు భావిస్తున్నారు.వెండి, ప్లాటినంపైనా ప్రభావంకేంద్రం కేవలం బంగారం గురించే కాకుండా వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి ఆభరణాల రంగంతో పాటు పారిశ్రామికంగా కూడా భారీ డిమాండ్ ఉంది. వెండిని సౌర విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. ప్లాటినం ఆటోమొబైల్, వైద్య రంగాల్లో కీలకంగా ఉంటుంది. కాబట్టి వీటిపై అధిక సుంకాలు విధించడం వల్ల పరిశ్రమలకు ముడి పదార్థాల ఖర్చులు పెరిగి, చివరకు ఉత్పత్తుల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది.ప్రస్తుతం ప్రభుత్వం ఒకవైపు దేశ విదేశీ మారక నిల్వలను కాపాడుకోవాలని చూస్తోంది. మరోవైపు అధిక పన్నుల వల్ల స్మగ్లింగ్ పెరగడం, పరిశ్రమల ఖర్చులు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే.. సుంకాలను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే 15 శాతం నుంచి 6 శాతానికి సుంకం తగ్గిస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఒకవేళ సుంకం తగ్గిస్తే అధికారిక మార్గంలో బంగారం దిగుమతులు పెరగవచ్చు. అదే సమయంలో స్మగ్లింగ్ తగ్గుతుందా, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఎలా ఉంటుంది అనేది కీలకంగా మారనుంది.ఇదీ చదవండి: బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం! -
బంగారం ధరలకు బ్రేక్.. ఒక్కరోజులో భారీ పతనం!
బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి తగ్గాయి. పసిడి ధరలు భారీగా పెరిగి మే 14 తర్వాత అత్యధిక స్థాయికి చేరుకున్నప్పటికీ, బుధవారం మాత్రం ధరల తగ్గుదల నమోదైంది. దీనికి తోడు అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ బలపడటం వంటి అంశాలు కూడా బంగారం ధరపై ప్రభావం చూపాయి.అమెరికా ద్రవ్యోల్బణంఅమెరికాలో ద్రవ్యోల్బణ పరిస్థితిని అంచనా వేయడానికి ఫెడరల్ రిజర్వ్ ఉపయోగించే ముఖ్యమైన సూచికల్లో పీసీఈ ప్రైస్ ఇండెక్స్ ఒకటి. జూలై వరకు 12 నెలల్లో పీసీఈ ద్రవ్యోల్బణం 3.7 శాతంగా నమోదైంది. అయితే.. మార్కెట్ నిపుణులు దీనిని 3.6 శాతంగా అంచనా వేశారు. అంటే.. ద్రవ్యోల్బణం అంచనాల కంటే కొద్దిగా ఎక్కువగా నమోదైంది. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు కొంత బలపడ్డాయి.వడ్డీ రేట్లు పెరిగితేబంగారం ఎలాంటి వడ్డీ ఆదాయం ఇవ్వదు. అందువల్ల వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు బంగారం కంటే వడ్డీ వచ్చే బాండ్లు, ఇతర ఆర్థిక సాధనాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. ఇదే కారణంగా అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అయితే వచ్చే నెలలో రేట్లు పెరిగే అవకాశం 38 శాతంగా ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది.డాలర్ బలపడటంబంగారం అంతర్జాతీయంగా అమెరికన్ డాలర్లలోనే ధర నిర్ణయించబడుతుంది. బుధవారం డాలర్ విలువ 0.3 శాతం పెరిగింది. డాలర్ బలపడితే ఇతర దేశాల కరెన్సీలు ఉపయోగించే వారికి బంగారం ఖరీదుగా మారుతుంది. దీంతో బంగారం కొనుగోళ్లపై కొంత ప్రభావం పడుతుంది. అందుకే డాలర్ పెరుగుదల కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణం అని తెలుస్తోంది.బంగారం ధర ఎంత తగ్గింది?బుధవారం స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం తగ్గి ఔన్సుకు 4,594.84 డాలర్లకు చేరింది. అమెరికా గోల్డ్ ఫ్యూచర్స్ కూడా 0.9 శాతం తగ్గి 4,650.90 డాలర్లకు చేరాయి. అయితే దీనిని చూసి బంగారం భారీగా పతనమవుతోందని భావించాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ధరలు బాగా పెరగడంతో పెట్టుబడిదారులు తమ లాభాలను కొంతవరకు తీసుకోవడం కూడా ఈ తగ్గుదలకు కారణం.మళ్లీ 5,000 డాలర్లకు బంగారంధరలు ప్రస్తుతం తగ్గినప్పటికీ, బంగారం దీర్ఘకాలికంగా మళ్లీ పెరిగే అవకాశం ఉందని కొందరు నిపుణులు భావిస్తున్నారు.పీటర్ గ్రాంట్ ప్రకారం.. ప్రస్తుత తగ్గుదల ఒక తాత్కాలిక స్థిరీకరణ మాత్రమే కావచ్చు. బంగారం మళ్లీ 5,000 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఈ ఏడాదిలోనే ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే 2027 రెండో త్రైమాసికం నాటికి బంగారం కొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసే అవకాశం కూడా ఉందని ఆయన చెప్పారు.ప్రపంచ రాజకీయ పరిస్థితుల ప్రభావంబంగారం ధరను కేవలం అమెరికా వడ్డీ రేట్లు మాత్రమే నిర్ణయించవు. ప్రపంచంలో జరిగే రాజకీయ పరిణామాలు కూడా ప్రభావం చూపుతాయి. ఇరాన్, ఒమన్ మధ్య 'హర్ముజ్'కు సంబంధించిన ఆదాయ పంపకంపై ఒప్పందం కుదిరినప్పటికీ, అమెరికా తమ షరతులను అంగీకరించకపోతే ఈ కీలక సముద్ర మార్గాన్ని తిరిగి తెరవబోమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొన్నాయి.ఇలాంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి పెరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా చూస్తారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు భవిష్యత్తులో బంగారం ధరకు మద్దతు ఇవ్వవచ్చు.ఇతర లోహాల పరిస్థితివెండి: 1.1 శాతం తగ్గి 67.91 డాలర్లకు చేరిందిప్లాటినం: 1.2 శాతం తగ్గి 1,837.78 డాలర్లకు చేరిందిపల్లాడియం: 0.1 శాతం తగ్గి 1,325.10 డాలర్లకు చేరింది -
వరుసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు
-
పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి పరుగు.. వెండి వెనకడుగు!
పసిడి పరుగు నాన్స్టాప్గా కొనసాగుతోంది. వరుసగా నాలుగో సెషన్లోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో రూ. 2,700 పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 1,67,100కి చేరింది.మరోవైపు, మూడు రోజుల ర్యాలీ అనంతరం ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో వెండి జోరు కాస్త ఆగింది. కేజీ ధర రూ. 3,500 తగ్గి రూ. 2,50,000కి పరిమితమైంది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లలో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 11.87 డాలర్లు (సుమారు 0.26 శాతం) క్షీణించి 4,639.51 డాలర్లకు, వెండి 1.04 శాతం తగ్గి 67.88 డాలర్లకు దిగి వచ్చాయి. -
రాసిపెట్టుకోండి.. తులం రెండు లక్షలు..!
-
ఐదు నెలల గరిష్ఠానికి బంగారం ధర!
అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్స్, అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తత వల్ల డిమాండ్ పుంజుకోవడంతో పసిడి ధరలు మళ్లీ పరుగులు తీస్తున్నాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర మరో రూ. 900 పెరిగి రూ. 1,64,400కి చేరింది. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి.చివరిసారిగా మార్చి 9న పుత్తడి రేటు రూ. 1,64,300 పలికింది. అటు వెండికూడా వరుసగా మూడో సెషన్లోనూ పెరిగింది. కేజీకి రూ. 3,500 పెరిగి రూ. 2,53,500కి చేరింది. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో బంగారం రేటు ఔన్సుకి (31.1 గ్రాములు) 42.45 డాలర్లు (1 శాతం) పెరిగి 4,646.54 డాలర్లు పలికినట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ (కమోడిటీ రీసెర్చ్) కైనాత్ చైన్వాలా తెలిపారు.వెండి ధర ఫ్లాట్గా 69 డాలర్ల వద్ద ట్రేడయినట్లు పేర్కొన్నారు. బంగారం కీలకమైన 4,650 డాలర్ల చేరువకు వచ్చిన నేపథ్యంలో తదుపరి కదలికలు భౌగోళిక-రాజకీయ పరిస్థితుల కన్నా ద్రవ్యోల్బణంపైనే ఆధారపడి ఉంటాయని వివరించారు.ఇదీ చదవండి: దూసుకెళ్తున్న బిట్కాయిన్.. కారణాలివే! -
బంగారం కొనాలంటే జేబు ఖాళీ..! భారీగా పెరిగిన బంగారం ధరలు
-
దూసుకెళ్తున్న రేటు.. వచ్చేవారం బంగారం ధరలు ఇలా!
బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరుగుతున్న వేళ.. నిపుణులు కొత్త అంచనాలు వెల్లడించారు. వచ్చే వారం కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. అయితే.. ఇప్పటికే ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కొంతమంది పెట్టుబడిదారులు లాభాలను తీసుకునే అవకాశం ఉంది.దేశీయ మార్కెట్లో బంగారం ధర ఒక్క వారంలోనే సుమారు రూ.7,900 పెరిగి 10 గ్రాములకు రూ.1.63 లక్షలకు చేరుకుంది. అంటే దాదాపు 5.13 శాతం పెరిగింది. వెండి కూడా అంతే జోరుగా పెరిగింది. కేజీ రేటు రూ.2.70 లక్షలకు చేరుకుంది.బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణాల్లో పెట్టుబడిదారుల కొనుగోళ్లు పెరగడం, అమెరికా బాండ్ యీల్డ్స్ తగ్గడం, మార్కెట్లో నగదు లభ్యత మెరుగుపడటం వంటివి ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అమెరికా మార్కెట్లో బంగారం ధర సుమారు 5.5 శాతం, వెండి ధర దాదాపు 7 శాతం పెరిగాయి.అయితే.. వచ్చే వారం బంగారం ధరల దిశను నిర్ణయించడంలో అమెరికా ఆర్థిక గణాంకాలు చాలా కీలకం కానున్నాయి. ముఖ్యంగా అమెరికా కోర్ పర్సనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్స్, జీడీపీ డేటాపై మార్కెట్లు దృష్టి పెట్టనున్నాయి. అమెరికా ఆర్థిక పరిస్థితి, ద్రవ్యోల్బణం ఆధారంగా.. వడ్డీ రేట్లపై పెట్టుబడిదారులు తమ అంచనాలను మార్చుకోవచ్చు. దీని ప్రభావం డాలర్, బాండ్ యీల్డ్స్తో పాటు బంగారం ధరలపైనా పడుతుంది.పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు, హర్ముజ్ పరిస్థితి మార్కెట్లకు చాలా కీలకం. ప్రపంచంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగినప్పుడు చాలామంది పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. కాబట్టి పసిడి ధరలు పెరిగే అవకాలు మెండుగా ఉన్నాయి.ఇక ఆగస్టు 27 నుంచి 29 వరకు జరిగే జాక్సన్ హోల్ సమావేశంపైనా మార్కెట్ దృష్టి ఉంటుంది. ఫెడరల్ రిజర్వ్ ఛైర్ కెవిన్ వార్ష్ అక్కడ చేసే ప్రసంగంలో అమెరికా వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై ఏమైనా సంకేతాలు ఇస్తే.. వాటిని పెట్టుబడిదారులు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఇది బంగారం ధరలను తప్పకుండా ప్రభావితం చేస్తుంది.ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. మూడు రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..ఇదీ చదవండి: బాండ్లు అమ్మేయండి.. బంగారం కొనేయండి: బిలియనీర్ ఇన్వెస్టర్ హెచ్చరిక.. సూచన -
పసిడి ప్రియులకు షాక్.. భారమైపోతున్న బంగారం!
బంగారం ధరలకు రెక్కలొచ్చాయా అన్నట్లుగా.. గోల్డ్ రేటు రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా గరిష్టంగా రూ.1520 పెరిగిన పసిడి ధర.. వారం రోజుల్లో ఏకంగా రూ.7,960 పెరిగి, జీవితకాల గరిష్టాలను తాకింది. ఈ కథనంలో ఏడు (ఆగస్టు 16 నుంచి 22 వరకు) రోజుల్లో బంగారం ధర ఏ నగరంలో ఎంత పెరిగిందనే వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఆగస్టు 16న రూ.1,55,130 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర, ఆగస్టు 22 నాటికి 1,63,090 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో పెరిగిన గోల్డ్ రేటు రూ. 7960 అన్నమాట. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఏడురోజుల్లో 1,42,200 రూపాయల నుంచి రూ.1,49,500 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,55,130 నుంచి రూ. 1,63,090 వద్దకు చేరింది. అంటే ఏడురోజుల్లో రూ. 7960 పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,42,200 నుంచి రూ.1,49,500 (రూ.7300 పెరిగింది) వద్దకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పు కనిపించింది. ఇక్కడ రూ.1,55,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,63,240 వద్దకు (రూ.7960 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల రేటు రూ.1,42,350 నుంచి రూ.1,49,650 వద్దకు (రూ.7300 పెరిగింది) చేరింది.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! -
తగ్గేదే లేదా? ఈ వారం బంగారం ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ర్యాలీ కొనసాగుతోంది. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ను అనూహ్యంగా పెంచడం, డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం వంటి పరిణామాలు పసిడి ధరలకు మద్దతుగా నిలిచాయి. దీంతో వరుసగా మూడో వారంలోనూ బంగారం లాభాలతో ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్కు 0.4 శాతం పెరిగి సుమారు 4,537 డాలర్ల వద్ద ట్రేడైంది. వారానికి దాదాపు 3.6 శాతం లాభపడింది.బైబ్యాక్ పెంపుతో మార్కెట్లలో కలకలంఅమెరికా ట్రెజరీ ఆగస్టు 19న 10 నుంచి 30 ఏళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ బాండ్ల బైబ్యాక్ కార్యకలాపాల పరిమాణాన్ని ఒక్కో ఆపరేషన్కు 2 బిలియన్ డాలర్ల నుంచి కనీసం 4 బిలియన్ డాలర్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీర్ఘకాలిక బాండ్ మార్కెట్లో లిక్విడిటీని మెరుగుపరచడం, ఇటీవల పెరిగిన ఈల్డ్స్ను అదుపులోకి తీసుకురావడం ఈ చర్య లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రకటన అనంతరం అమెరికా బాండ్ ఈల్డ్స్ గణనీయంగా తగ్గడంతోపాటు డాలర్ కూడా బలహీనపడింది. ఈ రెండు పరిణామాలు డాలర్లలో ధర నిర్ణయించే బంగారానికి అనుకూలంగా మారాయి.ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ మాత్రం ఈ స్థాయితో ఆగబోమన్న సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే బాండ్ బైబ్యాక్లను మరింత పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. ఇదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం, వడ్డీ చెల్లింపులు భారీగా పెరుగుతుండటం పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచుతున్నాయి.చమురు ధరలూ కీలకమే..మరోవైపు ఇరాన్తో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు పెరగడం బంగారం ర్యాలీకి మరో ముఖ్యమైన అంశంగా మారింది. ఇంధన ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరగవచ్చు. దీంతో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడంలో వెనుకడుగు వేసే అవకాశం ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. సాధారణంగా అధిక వడ్డీ రేట్లు బంగారానికి ప్రతికూలం. అయితే ప్రస్తుతం బలహీనమైన డాలర్, భౌగోళిక-రాజకీయ అనిశ్చితి, అమెరికా ప్రభుత్వ రుణభారం వంటి అంశాలు ఆ ప్రభావాన్ని కొంతమేర అధిగమిస్తున్నాయి.ఈ నెలలో 11 శాతానికి పైగా..ఆగస్టులో ఇప్పటివరకు అంతర్జాతీయ బంగారం ధర దాదాపు 11 శాతానికి పైగా పెరిగింది. ఆగస్టు 19న ఒక్కరోజే స్పాట్ గోల్డ్ 3 శాతానికి పైగా దూసుకెళ్లి 4,500 డాలర్ల స్థాయికి చేరువైంది. ఆ సమయంలో అమెరికా ట్రెజరీ చర్యతో ఈల్డ్స్, డాలర్ రెండూ తగ్గడం ప్రధాన కారణంగా నిలిచింది.అయితే బంగారం జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయి 5,318.40 డాలర్లతో పోలిస్తే ఇంకా సుమారు 15 శాతం దిగువనే ఉంది. దీంతో ప్రస్తుత ర్యాలీ బలమైనదే అయినప్పటికీ, రికార్డు స్థాయిని తిరిగి అందుకోవడానికి మరింత ఊతం అవసరమని మార్కెట్ పరిశీలకులు భావిస్తున్నారు.దేశీయంగానూ ధరలకు జోష్అంతర్జాతీయ ప్రభావం దేశీయ మార్కెట్పైనా స్పష్టంగా కనిపిస్తోంది. ఆగస్టు 21న ఎంసీఎక్స్లో బంగారం ఫ్యూచర్స్ 0.36 శాతం పెరిగి 10 గ్రాములకు సుమారు రూ.1.60 లక్షల వద్ద కదిలాయి. దేశీయ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,59,280గా నమోదైంది. వెండి ధర కూడా కిలోకు రూ.2.45 లక్షల స్థాయిని దాటింది.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
ఒక్కసారిగా తారుమారు అయినా బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
3 నెలల గరిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: డాలరు బలహీనపడి, ఇన్వెస్టర్లు ఇతరత్రా కమోడిటీలవైపు మళ్లుతున్న నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గురువారం భారీగా పెరిగాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 4,300 ఎగసి రూ. 1,62,300కి చేరుకుంది. ఇది మూడు నెలల గరిష్టం కావడం గమనార్హం. చివరిసారిగా మే 26న బంగారం ధర రూ. 1,62,400 వద్ద ట్రేడయ్యింది.అటు వెండి కూడా ర్యాలీ చేసి, ఏడు వారాల గరిష్టానికి ఎగసింది. కేజీకి రూ. 10,000 పెరిగి రూ. 2,45,000 వద్ద ముగిసింది. వెండి చివరిసారిగా జూలై 3న ఈ స్థాయిలో ట్రేడయ్యింది. డాలరు, ట్రెజరీ ఈల్డ్లు గణనీయంగా క్షీణించడంతో పసిడి రెండు నెలల గరిష్టానికి ఎగసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.డాలర్ ఇండెక్స్ మూడు నెలల కనిష్టానికి పడిపోగా, ట్రెజరీ బాండ్ ఈల్డ్లు కూడా తగ్గుతుండటం వల్ల బంగారానికి ఆకర్షణీయత పెరిగిందని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 1.47 శాతం క్షీణించి 4,456.72 డాలర్లకు, వెండి ధర 65.82 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.ఇదీ చదవండి: బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్ -
బంగారం భారీ ధరలు.. కియోసాకి కామెంట్స్
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర మళ్లీ భారీగా పుంజుకుని ఔన్సుకు 4,400 డాలర్ల స్థాయిని దాటడంపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ గురూ రాబర్ట్ కియోసాకి స్పందించారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని తాను ఏళ్లుగా చెబుతున్నానని పేర్కొంటూ తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేశారు.ప్రస్తుతం బంగారం ధర 4,400 డాలర్ల స్థాయిలో ఉండటాన్ని ప్రస్తావించిన కియోసాకి.. ఈ సంఖ్య వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోవాలని సూచించారు. ఇటీవల భారీ పతనం తర్వాత బంగారం మళ్లీ పుంజుకుందని, ఆగస్టులోనే ధర సుమారు 9 శాతం పెరిగిందని రాయిటర్స్ నివేదించింది. ఆగస్టు 19న స్పాట్ గోల్డ్ 4,487.91 డాలర్లకు చేరగా, 20న లాభాల స్వీకరణతో 4,484.95 డాలర్లకు తగ్గింది.యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి కీలకంబంగారం పెరుగుదలకు ప్రధాన కారణాల్లో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఒకటని కియోసాకి పేర్కొన్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, హోర్ముజ్ జలసంధిపై నెలకొన్న పరిస్థితులు, ఇంధన మౌలిక వసతులపై దాడులు వంటి పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళన పెంచుతున్నాయని తెలిపారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెట్టుబడులు సాధారణంగా సురక్షిత ఆస్తులైన బంగారం వైపు మళ్లుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాయిటర్స్ కూడా ఇరాన్ యుద్ధం, చమురు సరఫరా ఆందోళనలు బంగారం మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయని పేర్కొంది.ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్ల ప్రభావంఅమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయని కియోసాకి వివరించారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గితే ఫెడ్ వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం తగ్గుతుందన్న అంచనాలు బంగారానికి మద్దతు ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. వాస్తవానికి ఆగస్టులో అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో సెప్టెంబరులో రేట్ల పెంపు అవకాశాలు తగ్గుతాయన్న అంచనాలు పెరిగి బంగారం 4,400 డాలర్లకు పైగా వెళ్లింది.అప్పులు కూడా కారణమే..అమెరికా ప్రభుత్వ రుణభారం, భారీగా పెరుగుతున్న ప్రభుత్వ వ్యయం కూడా బంగారానికి అనుకూలంగా మారుతున్నాయని కియోసాకి అన్నారు. ప్రభుత్వాలు తమ ఖర్చులను నియంత్రించలేనప్పుడు, కరెన్సీ విలువపై ఆందోళనలు పెరిగినప్పుడు బంగారం ప్రాధాన్యం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక రుణాల బైబ్యాక్ కార్యక్రమాన్ని పెంచనున్నట్లు ప్రకటించిన తర్వాత బాండ్ ఈల్డ్స్, డాలర్పై ప్రభావం పడటంతో బంగారం ధర ఒక్క రోజులో 4 శాతానికి పైగా పెరిగింది.కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లను ప్రస్తావించిన కియోసాకిప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం తన వాదనకు కీలక ఆధారమని కియోసాకి పేర్కొన్నారు. చైనా, భారత్, పోలాండ్, టర్కీ, సింగపూర్ వంటి దేశాలు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని ఆయన తెలిపారు. రాయిటర్స్ ప్రకారం, తాజా దశలో కేంద్ర బ్యాంకులు, సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి బంగారంపై డిమాండ్ తిరిగి పెరుగుతోంది.‘బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు’తాను ఔన్సు బంగారం 300 డాలర్ల కంటే తక్కువగా ఉన్నప్పటి నుంచే కొనుగోలు చేశానని కియోసాకి తెలిపారు. అలాగే చౌకగా ఉన్నప్పుడు వెండిని, బిట్కాయిన్ను 6,000 డాలర్ల వద్ద కొనుగోలు చేశానని చెప్పారు. బంగారం, వెండి, బిట్కాయిన్ వంటి పరిమిత సరఫరా ఉన్న ఆస్తులపై తనకు దీర్ఘకాలిక నమ్మకం ఉందన్నారు.“బంగారం పెట్టుబడి కాదు.. డబ్బు. నిజమైన డబ్బు” అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన కియోసాకి.. పేపర్ కరెన్సీల విలువ కాలక్రమంలో ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గింపు వంటి కారణాలతో దెబ్బతింటుందని అన్నారు. బంగారం మాత్రం వేల సంవత్సరాలుగా విలువను నిలబెట్టుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. -
బంగారానికి ఏమైంది? ఒక్కరోజే ఇంత జంప్ ఎందుకు?
బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో గురువారం (ఆగస్టు 20) 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు ఏకంగా రూ.4,300 పెరిగి రూ.1,59,270కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.3,950 పెరిగి రూ.1,46,000 పలికింది.అంటే ఒక్కరోజులోనే 24 క్యారెట్ల బంగారం దాదాపు 2.8 శాతం పెరిగింది.ఇంత భారీ పెరుగుదలకు కారణమేంటి?అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరల్లో ఇటీవల చోటుచేసుకున్న భారీ కదలికలు దేశీయ మార్కెట్పైనా ప్రభావం చూపుతున్నాయి. అమెరికా డాలర్ విలువ, ట్రెజరీ బాండ్ ఈల్డ్స్లో మార్పులు, ఫెడ్ వడ్డీ రేట్లపై అంచనాలు వంటి అంశాలు పసిడి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. తాజాగా అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక బాండ్ల బైబ్యాక్ను పెంచుతుందన్న వార్తల నేపథ్యంలో డాలర్, బాండ్ ఈల్డ్స్ బలహీనపడటంతో అంతర్జాతీయంగా బంగారం ధర ఒక్క సెషన్లో 4 శాతానికి పైగా ఎగిసింది.దీనికి తోడు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ పరిణామాలు వంటి భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కూడా పెట్టుబడిదారులను బంగారం వైపు మళ్లిస్తున్నాయి. అనిశ్చితి పెరిగినప్పుడు సురక్షిత పెట్టుబడి సాధనంగా పరిగణించే బంగారానికి డిమాండ్ పెరగడం సహజం.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ప్రయత్నం.. ‘డబుల్ ట్రేడింగ్’! -
బంగారం, వెండి ధరల్లో భారీ జంప్.. తులం ఎంతంటే?
-
ఆకాశమే హద్దుగా బంగారం ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
బంగారం షాపింగ్ చేసేవారికి రిలీఫ్! పడిన ధర..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఇలా అయితే బంగారం కొనేదెలా?: పెరిగిన ధరలు..
బంగారం ధరలు ఊహకందని రీతిలో పెరుగుతూనే ఉన్నాయి. ఇలా అయితే కొనేదెలా అంటూ.. పసిడి కొనుగోలుదారులు నిరాశ చెందుతున్నారు. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం ధరలో సడన్ మార్పు.. తులం ఎంతంటే?
-
మారిన గోల్డ్ రేటు.. కొత్త ధరలు ఇలా..
బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూ.. ఈ రోజు కూడా పెరుగుదల దిశగానే అడుగులు వేసాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేటులో మార్పులు జరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్, సిల్వర్ ధరలకు సంబంధించిన వివరాలు చూసేద్దాం. -
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇలా..
భారతదేశంలో కొన్నాళ్లుగా భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. నేడు (ఆదివారం) గోల్డ్ రేటు హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో స్థిరంగా ఉంది. వెండి ధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. కాబట్టి ఈ కథనంలో తాజా ధరలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200చెన్నైలో 10 గ్రాముల బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో తులం బంగారం24 క్యారెట్స్: రూ.1,55,13022 క్యారెట్స్: రూ.1,42,200దేశ రాజధాని నగరం దిల్లీలో24 క్యారెట్స్: రూ.1,55,28022 క్యారెట్స్: రూ.1,42,350ఢిల్లీలో కేజీ వెండి ధర: రూ.2,50,000హైదరాబాద్లో కేజీ వెండి ధర: రూ.2,55,000(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
అమెరికా అప్పులు.. కియోసాకి సంచలన వ్యాఖ్యలు!
రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న అప్పులు పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తులో డబ్బు విలువ తగ్గే అవకాశం ఉందని, అందుకే బంగారం, వెండి వంటి ఆస్తులపై దృష్టి పెట్టాలని ఆయన సూచిస్తున్నారు.అమెరికా అప్పులుఅమెరికా అప్పు త్వరలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరొచ్చని కియోసాకి పేర్కొన్నారు. ప్రభుత్వం ఎక్కువగా అప్పులు చేస్తే.. భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. అప్పులు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగితే.. చేతిలో ఉన్న డబ్బు విలువ తగ్గుతుంది. ఇది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది.బంగారం, వెండి భారీగా పెరుగుతాయా?కియోసాకి తనకు తెలిసిన ఆర్థిక నిపుణుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు బంగారం, వెండి ధరలపై భారీ అంచనాలు వేస్తున్నారని చెప్పారు. వెండి ధర ఔన్సుకు 200 డాలర్లకు, బంగారం ధర ఔన్సుకు 10,000 డాలర్లకు చేరొచ్చన్న అంచనాలను ఆయన ప్రస్తావించారు. అయితే.. ఇవి ఖచ్చితమైన ధరలు కావు. కొందరు నిపుణులు చేస్తున్న అంచనాలు మాత్రమే. మార్కెట్ పరిస్థితులు మారితే ఈ అంచనాలు కూడా మారవచ్చు.కియోసాకి బంగారం, వెండి రెండింటినీ ప్రస్తావించినప్పటికీ.. 2026 ఆగస్టులో తనకు మాత్రం వెండే మంచి ఎంపికగా కనిపిస్తోందని కియోసాకి చెప్పారు. వెండికి ప్రత్యేకత ఏమిటంటే.. ఇది కేవలం పెట్టుబడి లోహం మాత్రమే కాదు. సౌర విద్యుత్, ఎలక్ట్రానిక్స్, ఇతర పారిశ్రామిక రంగాల్లో కూడా వెండిని ఉపయోగిస్తారు. దీంతో భవిష్యత్తులో పారిశ్రామిక డిమాండ్ పెరిగితే వెండికి అదనపు మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు.$40 TRILLION US NATIONAL soon!!Q: What are you doing about it?Friends who are much smarter than me, such as Jim Rickards are predicting $200 an ounce for silver and $10,000 an ounce gold soon.Of the two…. I think silver is the best choice in August 2026.Q: What do you…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 15, 2026 -
80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు! -
అది పసిడి మెరుపు కాదు.. డాలర్ పతనమే..
అమెరికా డాలర్ విలువ, బంగారం ధరలపై ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15న తన ఫేస్బుక్ ఖాతాలో సుదీర్ఘ పోస్టు చేసిన ఆయన.. 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ బంగారం ప్రమాణాన్ని (గోల్డ్ స్టాండర్డ్) నిలిపివేసిన పరిణామాలను ప్రస్తావించారు. అప్పటి నుంచి డాలర్ కొనుగోలు శక్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొన్నారు.1971లో ఒక ఔన్స్ బంగారం విలువ 35 డాలర్లు ఉండేదని, ప్రస్తుతం అది 4,342 డాలర్లకు చేరిందని కియోసాకి తన పోస్టులో పేర్కొన్నారు. అంటే బంగారం ధర 124 రెట్లు పెరిగిందని చెప్పారు. అయితే ఇది బంగారం విలువ పెరగడం కంటే.. డాలర్ కొనుగోలు శక్తి భారీగా క్షీణించడాన్ని సూచిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.‘రిచ్ డాడ్’ తనకు 21 ఏళ్ల వయసులో డాలర్ గురించి చెప్పిన విషయాన్ని కూడా కియోసాకి గుర్తు చేసుకున్నారు. నిక్సన్ ఒక్క రాత్రిలో డాలర్ను విలువ తగ్గించలేదని, అప్పటికే దాని విలువ తగ్గిపోయిందనే విషయాన్ని మాత్రమే వెల్లడించారని తన ‘రిచ్ డాడ్’ చెప్పేవారని పేర్కొన్నారు. అప్పట్లో ఈ పరిణామాలను గమనించిన వారు భూములు, చమురు, గనులు వంటి హార్డ్ అసెట్స్లో పెట్టుబడులు పెట్టారని, ఇతరులు బ్యాంకు ఖాతాల్లో పొదుపు చేసి కొనుగోలు శక్తిని కోల్పోయారని వ్యాఖ్యానించారు.బంగారం కొనుగోలు గురించి అందరూ మాట్లాడుతున్నప్పటికీ, వాస్తవంగా కొద్దిమందే పెట్టుబడి పెడుతున్నారని కియోసాకి అన్నారు. నాణేలు లేదా గోల్డ్ ఆధారిత పెట్టుబడి సాధనాల కంటే బంగారం ఉత్పత్తి చేసే గనుల్లో యాజమాన్య వాటా కలిగి ఉండటమే మెరుగైన వ్యూహమని తన ‘రిచ్ డాడ్’ సూచించేవారని చెప్పారు.ఈ నేపథ్యంలో ‘క్యాపిటల్ క్లబ్’ పేరుతో ఒక ప్రైవేట్ పెట్టుబడి వేదిక గురించి కూడా కియోసాకి తన పోస్టులో ప్రస్తావించారు. నాలుగు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న బంగారం, వెండి మైనింగ్ కంపెనీలో ప్రీ-పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా పెట్టుబడి అవకాశాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. కొలరాడో, ఘనా, దక్షిణాఫ్రికా, పపువా న్యూ గినియాలో కార్యకలాపాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ ప్రైవేట్ రౌండ్లో ఇప్పటికే సగానికి పైగా పెట్టుబడులు సమీకరించబడ్డాయని, తదుపరి అవకాశం ఈ నెలలో అందుబాటులోకి వస్తుందని కియోసాకి తెలిపారు. అయితే ప్రైవేట్ పెట్టుబడులు, మైనింగ్ కంపెనీల్లో వాటాలు వంటి అంశాల్లో అధిక రిస్క్ ఉండొచ్చన్న విషయాన్ని పెట్టుబడిదారులు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. -
ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గంటల వ్యవధిలోనే.. బంగారం ధరల్లో భారీ మార్పు!
భారతదేశంలో భారీగా పెరిగిన బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (గురువారం) ఉదయం రూ.1,55,130 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు, సాయంత్రానికి రూ.1,53,600 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలోనే పసిడి ధరలు తారుమారైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గురువారం (13 ఆగస్టు) రూ.1,55,130 (24 క్యారెట్స్) రూ.1,42,200 (22 క్యారెట్స్) వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి రూ.153600, రూ.140800 వద్దకు చేరింది. అంటే ధరలు వరుసగా రూ.1530, రూ.1400 తగ్గాయన్నమాట. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి.ఇక ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ కూడా సాయంత్రానికి, ఉదయానికి రేట్లలో చాలా తేడా కనిపించింది. ఉదయం 1,42,350 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,40,950 వద్దకు చేరగా.. 24 క్యారెట్ల రేటు 1,55,280 రూపాయల నుంచి 1,53,750 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఈ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,42,200 వద్ద, 24 క్యారెట్ల ధర రూ.1,55,130 వద్దనే ఉన్నాయి. వెండి రేటు మాత్రం రూ.2.60 లక్షలు (కేజీ ధర) వద్ద ఉంది. -
ఇన్వెస్టర్లకు పండగే మళ్లీ పెరిగిన బంగారం ధరలు
-
బంగారం భారీ ధరలకు అదే కారణం..
అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు బుధవారం భారీగా పుంజుకున్నాయి. ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్ సమావేశంలో వడ్డీ రేట్లను పెంచకపోవచ్చన్న అంచనాలు బలపడటంతో ఇన్వెస్టర్లు పసిడిపై ఆసక్తి చూపారు. స్పాట్ గోల్డ్ ధర ఔన్స్కు 1శాతానికిపైగా పెరిగింది.అమెరికా జూలై వినియోగదారుల ధరల సూచీ (CPI) నెలవారీగా 0.1 శాతం పెరిగింది. జూన్లో ఇది 0.4 శాతం తగ్గింది. జూలై గణాంకాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉండటంతో ఫెడ్ సెప్టెంబర్లో రేట్ల పెంపు చేసే అవకాశం తగ్గిందన్న అభిప్రాయం మార్కెట్లో నెలకొంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే లేదా స్థిరంగా ఉండే పరిస్థితుల్లో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.ఈ పరిణామానికి తోడు అమెరికా డాలర్ బలహీనపడటం కూడా పసిడికి కలిసొచ్చింది. డాలర్లో ధర నిర్ణయించే బంగారం ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు చౌకగా మారడంతో కొనుగోళ్లు పెరిగాయి. దీంతో స్పాట్ గోల్డ్ 100 రోజుల మూవింగ్ యావరేజ్ పైకి ఎగబాకింది.తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయ ధరలపైనా కనిపించింది. హైదరాబాద్, విజయవాడ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు (ఆగస్ట్ 12) 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1040 పెరిగి రూ.1,54,860 లకు, 22 క్యారెట్ బంగారం రూ.950 ఎగిసి రూ.1,41,950 వద్దకు చేరింది.ఇదిలా ఉంటే, సెప్టెంబర్లో ఫెడ్ నిర్ణయంపై మార్కెట్ల దృష్టి కొనసాగుతోంది. జూలై 29న జరిగిన సమావేశంలో అమెరికా కేంద్ర బ్యాంకు బెంచ్మార్క్ పాలసీ రేటును 3.50%-3.75% పరిధిలోనే కొనసాగించింది. అయితే ముగ్గురు ఫెడ్ అధికారులు రేటు పెంపునకు అనుకూలంగా ఓటు వేయడం ద్రవ్యోల్బణంపై ఇంకా ఆందోళనలు ఉన్నాయని సూచించింది.ఇక బంగారం తదుపరి కదలికకు అమెరికా ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) కీలకం కానుంది. PPI అంచనాల కంటే ఎక్కువగా వస్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతున్నాయన్న సంకేతాలు వెలువడి, ఫెడ్ రేట్లపై అంచనాలు మళ్లీ మారే అవకాశం ఉంది. అదే సమయంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, డాలర్ కదలికలు, చమురు ధరలు కూడా బంగారం ధరను ప్రభావితం చేయనున్నాయి. -
దివాలా తీయనున్న బ్యాంకులు? భారీగా పెరుగుతున్న GOLD LOANS
-
రికార్డు స్థాయికి బంగారం ధరలు..
-
మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి తగ్గేదేలే..
న్యూఢిల్లీ: ఆయిల్ రేట్లు అంతర్జాతీయంగా అధిక స్థాయిలోనే కొనసాగుతున్నప్పటికీ బులియన్పై పెట్టుబడులకు సంబంధించి ట్రేడర్ల నుంచి గణనీయంగా డిమాండ్ నెలకొనడంతో పసిడి ధరలు పరుగులు తీస్తున్నాయి. వరుసగా ఆరో సెషన్లోనూ ర్యాలీ కొనసాగించి, మంగళవారం ఏకంగా రెండు నెలల గరిష్ట స్థాయికి చేరాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,200 పెరిగి రూ. 1,57,200కి చేరింది. గత 6 ట్రేడింగ్ సెషన్లలో బంగారం రేటు రూ. 9,800 (సుమారు 6.65%) పెరిగింది. మరోవైపు, వెండి కూడా అదే ధోరణిలో కేజీకి ఇంకో రూ. 2,000 పెరిగి రూ. 2,42,000కి చేరింది. ఇది కూడా దాదాపు 2 నెలల గరిష్ట స్థాయి. -
ఇక సామాన్యులు గోల్డ్ కొనలేరా? తులం 2 లక్షలు?
-
ఆకాశమే హద్దుగా పసిడి ధరలు.. ఒక్కరోజే ఇంతలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
కేంద్రానికి పసిడి పంట
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతి సుంకాలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేంద్ర ఖజానాకు కాసుల వర్షం కురిపించింది. ఈ ఏడాది మే 13 నుంచి ఆగస్టు 2 వరకు స్వల్ప వ్యవధిలోనే విలువైన లోహాల దిగుమతుల ద్వారా కస్టమ్స్ సుంకాల రూపంలో ఏకంగా రూ.10,463 కోట్ల రాబడి సమకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.ఆదాయంలో పసిడిదే అగ్రస్థానంమొత్తం కస్టమ్స్ వసూళ్లలో సింహభాగం బంగారం నుంచే లభించింది. బంగారం దిగుమతులపై రూ.10,040 కోట్లు, వెండి దిగుమతులపై రూ.328 కోట్లు, ప్లాటినం దిగుమతులపై రూ.95 కోట్లు సమకూరింది.సుంకాల పెంపునకు కారణాలుపశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ సంక్షోభం, హార్మూజ్ జలసంధి ఆటంకాల కారణంగా అంతర్జాతీయంగా ముడిచమురు, ఎరువుల ధరలు పెరిగాయి. దేశీయ విదేశీ మారక నిల్వలను (ఫారెక్స్) పరిరక్షించుకోవడానికి, అనవసర దిగుమతులకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం మే 13న పసిడి, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతాల నుంచి 15 శాతానికి, ప్లాటినం సుంకాన్ని 6.4 శాతం నుంచి 15.4 శాతానికి పెంచిన విషయం విదితమే. చమురు, నిత్యావసర పారిశ్రామిక ముడిసరుకుల దిగుమతులకు ఫారెక్స్ నిల్వలను ప్రాధాన్యత క్రమంలో కేటాయించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.స్మగ్లింగ్పై ఉక్కుపాదంపన్ను రేట్లు పెరగడంతో అక్రమ రవాణా పెరిగే అవకాశం ఉండటంతో తనిఖీ ఏజెన్సీలు నిఘాను తీవ్రతరం చేశాయి. మే 13 నుంచి జూన్ 30 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ సరిహద్దుల్లో దాడి చేసి 161 కిలోల అక్రమ బంగారాన్ని జప్తు చేయడమే కాకుండా 116 మంది స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రపంచంలో చైనా తర్వాత రెండో అతిపెద్ద పసిడి వినియోగదారైన భారత్లో దిగుమతి సుంకాల పెంపు వల్ల పసిడి విక్రయాలు కొంత మందగించినప్పటికీ ప్రభుత్వానికి మాత్రం త్వరితగతిన భారీగా రెవెన్యూ సమకూరిందని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.ఇదీ చదవండి: పబ్లిక్ వైఫై వాడే ప్రయాణికులే టార్గెట్! -
పసిడి ప్రియులకు షాక్.. తులం 2 లక్షలు?
-
వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!
బంగారం, వెండి ధరలు గత వారం రోజుల్లో భారీగా పెరిగాయి. ఇది వచ్చే వారం కూడా కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఎంతవరకు ధరలు పెరగనున్నాయి?, అనే విషయాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ద్రవ్యోల్బణ గణాంకాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతమున్న పాజిటివ్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే.. 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1.57 లక్షలు, వెండి ధర కేజీ రూ.2.80 లక్షల వరకు చేరే అవకాశం ఉందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణుడు ప్రణవ్ మేర్ అంచనా వేశారు.దేశీయ మార్కెట్లో పసిడి ధరలు.. ఈ వారంలో దాదాపు 6 శాతం పెరిగి రూ.1.51 లక్షలకు చేరింది. వెండి రూ.2.49 లక్షలకు చేరింది. అమెరికా కార్మిక మార్కెట్.. అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో.. అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కొంత సడలింపు చూపించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి. దీంతో బంగారం, వెండిపై కొనుగోళ్లు పెరిగాయి. మరోవైపు డాలర్ బలహీనపడటం కూడా ధరలు పెరగడానికి కారణం అవుతోంది.అంతర్జాతీయ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. బంగారం ధర దాదాపు 7 శాతం పెరగగా.. వెండి ఏకంగా 10 శాతం వరకు ఎగబాకింది. వచ్చే వారం అమెరికా ఆర్థిక గణాంకాలతో పాటు అమెరికా - ఇరాన్ మధ్య పరిణామాలు కూడా కీలకం కానున్నాయి. పశ్చిమాసియాలో ఏదైనా అనూహ్య పరిణామం చోటుచేసుకుంటే బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా మారే అవకాశం ఉంది.ఇదీ చదవండి: అమెరికా వెళ్లాలంటే.. ఎవరు ఏ వీసా తీసుకోవాలి? -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. తలకిందులైన రేట్లు!
బంగారం ధరలు ఈ వారం మళ్లీ పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఏకంగా 7 శాతానికి పైగా లాభపడి, ఎనిమిది నెలల్లోనే అత్యుత్తమ వారపు పనితీరును నమోదు చేసింది. స్పాట్ గోల్డ్ ఔన్సుకు సుమారు 4,336 డాలర్లకు చేరగా, ట్రేడింగ్లో 4,350 డాలర్ల సమీపంలో ఏడు వారాల గరిష్ఠాన్ని తాకింది. బలహీనమైన అమెరికా ఉద్యోగాల డేటా, తగ్గుతున్న ముడిచమురు ధరలు, వడ్డీ రేట్లపై మారుతున్న అంచనాలు పసిడి ర్యాలీకి ప్రధాన కారణాలుగా నిలిచాయి.బంగారానికి పెరిగిన డిమాండ్అమెరికా జూలై నాన్-ఫార్మ్ పేరోల్స్ అనూహ్యంగా 23 వేల ఉద్యోగాలు తగ్గడం మార్కెట్లను ఆశ్చర్యానికి గురిచేసింది. జూన్ గణాంకాలను కూడా దిగువకు సవరించడంతో అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరిగాయి. దీంతో ఫెడరల్ రిజర్వ్ సమీప సమావేశంలో వడ్డీ రేట్లను పెంచే అవకాశం తగ్గిందన్న అంచనాలు బలపడ్డాయి. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు పెరిగినప్పుడు బాండ్లపై రాబడులు, డాలర్ బలహీనపడే అవకాశం ఉండటంతో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.మరోవైపు ముడిచమురు ధరలు తగ్గడం కూడా బంగారానికి కలిసొచ్చింది. చమురు ధరలు తగ్గితే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో ‘హయ్యర్ ఫర్ లాంగర్’ వడ్డీ రేట్ల అంచనాలు బలహీనపడతాయి. అదే సమయంలో భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సురక్షిత పెట్టుబడుల వైపు మళ్లుతున్న నిధులు పసిడి ధరలకు అదనపు మద్దతు ఇస్తున్నాయి.సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కూడా ప్రస్తుత ర్యాలీలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం 2026 రెండో త్రైమాసికంలో సెంట్రల్ బ్యాంకులు 288.9 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఏడాది ప్రాతిపదికన ఇది 62 శాతం పెరుగుదల. దక్షిణ కొరియా సెంట్రల్ బ్యాంక్ కూడా 13 ఏళ్ల విరామం తర్వాత తిరిగి బంగారం కొనుగోలు చేయడం అధికారిక రంగంలో పసిడిపై ఆసక్తి ఇంకా బలంగానే ఉందన్న సంకేతాలను ఇస్తోంది.పెరిగింది రూ.8వేలు పైనే..ఇక హైదరాబాద్ రిటైల్ మార్కెట్ను పరిశీలిస్తే.. ఆగస్టు 8న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.1,39,650గా నమోదైంది. వారం ప్రారంభంలో అంటే ఆగస్టు 1న 24 క్యారెట్ల ధర రూ.1,44,220, 22 క్యారెట్ల ధర రూ.1,32,200గా ఉండగా.. వారం రోజుల్లో 24 క్యారెట్లపై రూ.8,130, 22 క్యారెట్లపై రూ.7,450 పెరిగింది.మరో భారీ బుల్రన్ అవుతుందా?అయితే ఈ ర్యాలీని నేరుగా మరో భారీ బుల్రన్గా నిర్ధారించడం తొందరపాటు అవుతుందని విశ్లేషకుల అంచనా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి బలంగా కొనసాగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ పెరగడం, మార్కెట్లలో రిస్క్ అప్పటైట్ తిరిగి రావడం వంటి అంశాలు బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు. అలాగే ధరలు ఇప్పటికే అధిక స్థాయిలో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగితే స్వల్పకాలంలో తీవ్ర హెచ్చుతగ్గులు కనిపించే అవకాశం ఉంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కూడా ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొంతకాలం పరిమిత శ్రేణిలో కదలవచ్చని పేర్కొంది.అదే సమయంలో ఆర్థిక మందగమనం, కొత్త భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు లేదా ధరలు తగ్గినప్పుడు కొనుగోళ్లు పెరగడం వంటి అంశాలు కలిసి వస్తే బంగారం మళ్లీ 4,500 డాలర్ల స్థాయిని దాటే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంటే ప్రస్తుత ర్యాలీకి దీర్ఘకాలిక బలం ఉన్నప్పటికీ, మధ్యలో ధరల కరెక్షన్, లాభాల స్వీకరణ వంటి పరిణామాలు తప్పక చూడాల్సి ఉంటుంది. -
“బంగారం ధరలపై మళ్లీ షాక్.. పసిడి ప్రియులకు భారీ దెబ్బ!”
-
మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి ఈ రోజు తులం ఎంతంటే?
-
బంగారం కొనాలనుకుంటున్నారా? నేడు మళ్లీ షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్లు!
-
నిప్పులు కక్కిన బంగారం! వెండి ఒక్కరోజులో రూ.10 వేలు..
దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు భారీగా ఎగిశాయి. ఇక వెండి ధరలు కూడా నేడు మరింత పెరిగాయి. దీంతో బంగారం, వెండి కొనేవాళ్లకు ఈరోజు కూడా భారీ నిరాశ తప్పలేదు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
-
మళ్లీ నింగినంటుతున్న బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు
-
మెరుపు తగ్గిన మేలిమి బంగారం
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం, వెండి.. ఇంకా అవే ధరలు
దేశంలో బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు నిలకడగా కొనసాగడం ఇది వరుసగా ఆరో రోజు. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం కొనసాగింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం (Today Gold Rate), వెండి ధరలు (Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో బంగారం ధరలకు బ్రేక్ పడింది. రెండు రోజులుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు ధరలు క్రితం రోజున తగ్గుముఖం పట్టాయి. నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈరోజు బంగారం, వెండి కొనేవాళ్లకు ఉపశమనం లభించింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
భారీగా తగ్గిన బంగారం ధర నేడు తులం ఎంతంటే?
-
గంటల్లోనే మారిన ధరలు తులం ఎంతంటే?
-
దేశంలో పసిడికి తగ్గిన డిమాండ్... ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 6 శాతం డౌన్
-
బంగారం కొనుగోళ్లు.. రూ.1.98 లక్షల కోట్లు!
భారతీయులకు బంగారం అంటే ప్రత్యేకమైన అభిమానం. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. అయితే.. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇతర శుభకార్యాలకు ప్రజలు గోల్డ్ కొనుగోలు చేస్తూనే ఉంటారు. కానీ.. ఈసారి పసిడి ధరలు భారీగా పెరగడంతో 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో కొనుగోళ్ల పరిమాణం కొంత తగ్గినప్పటికీ.. బంగారంపై ప్రజలు ఖర్చు చేసిన మొత్తం మాత్రం రికార్డు స్థాయికి చేరుకోవడం విశేషం.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ 130.9 టన్నులుగా నమోదైంది. గత ఏడాది(139.1 టన్నులు)తో పోలిస్తే ఈ ఏడాది 6 శాతం తక్కువే, కానీ.. ధరలు మాత్రమే గత సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది దాదాపు 59 శాతం పెరిగింది. దీనివల్ల కొనుగోళ్లపై ప్రభావం పడిందని నివేదిక వెల్లడించింది.2026 ఏప్రిల్-జూన్ కాలంలో భారతీయులు బంగారం కొనుగోలు కోసం రూ.1.98 లక్షల కోట్లను ఖర్చు చేసినట్లు నివేదిక చెబుతోంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 50 శాతం ఎక్కువ. అంటే ప్రజలు తక్కువ పరిమాణంలో బంగారం కొనుగోలు చేసినప్పటికీ, పెరిగిన ధరల కారణంగా ఖర్చు చేసిన మొత్తం పెరిగిందన్నమాట.ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే ఎక్స్చేంజ్ పద్ధతులు, ఈఎంఐ సౌకర్యాలు, తక్కువ బడ్జెట్లో విలువైన ఆభరణాల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో బంగారం డిమాండ్ అనేది ధరలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పెళ్లిళ్లు, పండుగల సీజన్ కారణంగా రెండో అర్ధభాగంలో కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ.. ధరలు ఇలాగే అధికంగా కొనసాగితే ఆభరణాల కొనుగోళ్లపై కొంత ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు.ఇదీ చదవండి: రైలు ఏసీ కోచ్లో రెండు బెడ్షీట్లు ఎందుకు ఇస్తారో తెలుసా? -
ఏకంగా 13 వేలు తగ్గిన బంగారం నేడు తులం ఎంతంటే?
-
బంగారం ఎందుకో చిన్నబోయింది!
అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులను కొనుగోళ్లకు దూరంగా ఉంచుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న గోల్డ్ విక్రయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికం కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా ‘క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి వినియోగం నమోదైంది.పరిమాణం తగ్గినా.. విలువలో ఆల్టైమ్ రికార్డు!బంగారం కొనుగోలు పరిమాణంలో తగ్గుదల కనిపించినప్పటికీ ఆకాశాన్నంటిన ధరల కారణంగా విలువ రూపంలో బంగారం వాణిజ్యం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగ విలువ గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరింది. 2025 క్యూ2లో ఇది రూ.1,32,500 కోట్లుగా ఉంది. భౌతిక పరిమాణం తగ్గినా భారతీయుల పెట్టుబడి పోర్ట్ఫోలియోలో పసిడికే ప్రథమ స్థానం దక్కుతోందని డబ్ల్యూజీసీ భారత ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.ఆభరణాల విక్రయాలపై దెబ్బ.. కారణాలివే..డబ్ల్యూజీసీ సమాచారం ప్రకారం, అత్యధిక క్షీణత ఆభరణాల (జువెల్లరీ) విభాగంలోనే నమోదైంది. క్యూ2లో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు (గతేడాది 88.8 టన్నులు) పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలు..పసిడి ధరలు నిరంతరం రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనుకావడం, వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం.దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్లో రీటైల్ ధరలు మరింత పెరిగాయి.సుంకాలు పెరగడంతో అక్రమ రవాణా పెరిగిపోతోందని, ఇది అధికారిక బులియన్ మార్కెట్పై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.కోలుకునే అవకాశం!వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది మొత్తానికి భారత్లో పసిడి డిమాండ్ 650-750 టన్నుల మధ్య నమోదుకావచ్చు. రాబోయే పండుగల సీజన్లో (దసరా, దీపావళి) ధరలు కొంత సద్దుమణిగితే బంగారం కొనుగోళ్లు తిరిగి పుంజుకుని మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్లో మార్పులు -
భారీగా పడిపోయిన బంగారం ధరలు ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే?
-
వసివాడిన పసిడి మెరుపులు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
తగ్గిన పసిడి,వెండి
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్ నెలకొనడంతో దేశీయంగా పసిడి ధరలు తగ్గాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,640 తగ్గి రూ. 1,47,000కు దిగి వచ్చింది. అటు వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైంది. కేజీకి రూ. 5,200 తగ్గి రూ. 2,24,800కి పరిమితమైంది.రూపాయి బలపడటంతో దిగుమతి చేసుకున్న బులియన్ వ్యయం తగ్గిందని, అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై ఆసక్తిగా ఉన్న ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తున్నారని, దీనితో పసిడి ధర నెమ్మదించిందని ట్రేడర్లు తెలిపారు. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 1.31 శాతం తగ్గి 4,023.50 డాలర్లకు, వెండి 2 శాతం క్షీణించి 57.24 డాలర్లకు నెమ్మదించింది. -
బంగారం ధర ఒక్కసారిగా భారీగా పడిపోయింది..!
-
ఇంకా తగ్గనున్న బంగారం ధరలు!
బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కారణం అనే చెప్పాలి. గత కొన్ని రోజులుగా పసిడి ధరల్లో పెద్దగా మార్పులు కనిపించలేదు. అంటే మార్కెట్లో ఊహకందని పరిణామాలు జరగలేదన్నమాట. అయినప్పటికీ త్వరలోనే బంగారం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ప్రస్తుతం బంగారం ధరలపై అత్యధిక ప్రభావం చూపుతున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థ. యూఎస్ డాలర్ విలువ పెరగడం, ప్రభుత్వ బాండ్లపై వడ్డీ రాబడులు అధికంగా ఉండటం వల్ల పెట్టుబడిదారులు బంగారం కంటే బాండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గి, ధరలు కూడా పతనమవుతున్నాయి.దేశీయ మార్కెట్లో ఈ రోజు (మంగళవారం) బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు 1550 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ ధర రూ.750 తగ్గింది. ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.ఇదీ చదవండి: రూ.200 రీఛార్జ్ ప్లాన్.. జియో vs వొడాఫోన్ ఐడియా! -
కరుగుతోన్న బంగారు కొండ!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!
-
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..(బంగారం కొనేవాళ్లకు అలర్ట్.. ఆ మార్క్, కోడ్ ఉన్నాయా?) -
రూ.1.45 లక్షలకు చేరిన బంగారం ధర!
బంగారం ధరల్లో రోజురోజుకి ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. ఒకరోజు తగ్గుముఖం పడితే.. మరోరోజు భారీగా పెరగడం. ఇంకోరోజు ధరలు స్థిరంగా ఉండిపోవడం. ఇలా గోల్డ్ రేటు ముందుకు సాగుతోంది. ఈ కథనంలో వారం (జులై 19 నుంచి 25 వరకు) రోజుల్లో పసిడి ధరలు ఎలాంటి మార్పునకు లోనైంది. తాజా ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో గత ఆదివారం (జులై 19) రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర జులై 25 నాటికి రూ.1,44,930 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,31,350 నుంచి రూ.1,32,850 వద్దకు (రూ.1500 పెరిగింది) చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల తులం బంగారం ధర ఏడు రోజుల్లో రూ.1,43,440 నుంచి రూ.1,45,080 వద్దకు (రూ.1640 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,450 నుంచి రూ.1,33,000 వద్దకు (రూ.1550 పెరిగింది) చేరింది. దీన్ని బట్టి చూస్తే వారం రోజుల్లో గోల్డ్ రేటు ఎంత పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది.చెన్నైలో కూడా బంగారం ధరల్లో గణనీయమైన మార్పులు కనిపించాయి. జులై 19న రూ.1,43,290 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం పసిడి ధర జులై 25 నాటికి రూ.1,45,090 వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర రూ.1,31,350 నుంచి రూ.1,33,000 వద్దకు చేరింది.వెండి ధరలుభారతదేశంలో సిల్వర్ రేటు కూడా వారం రోజుల్లో గణనీయమైన మార్పుకునకు లోనైంది. దీంతో కేజీ వెండి రేటు ఏడు రోజుల్లో రూ.2.35 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు చేరింది. అంటే రూ.5000 పెరిగిందన్నమాట. -
తారుమారైన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?
-
పాతాళానికి పడిపోయిన బంగారం ధరలు ఈరోజు తులం ఎంతంటే?
-
గంటల వ్యవధిలో.. భారీగా తగ్గిన బంగారం రేటు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు (గురువారం) ఉదయం రూ.770 పెరిగి రూ.1,47,280 వద్ద ఉన్న 24 క్యారెట్ల గోల్డ్ రేటు, సాయంత్రానికి భారీగా తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి రేట్లలో స్వల్ప మార్పు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు క్షుణ్ణంగా తెలుసుకుందాం.గురువారం (జులై 23) ఉదయం రూ.1,47,280 (తులం 24 క్యారెట్స్ గోల్డ్), రూ.1,35,000 (తులం 22 క్యారెట్స్ గోల్డ్) వద్ద బంగారం రేటు, సాయంత్రానికే రూ.1,46,180.. రూ.1,34,000 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1100, రూ.1000 తగ్గింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు ఎంత మారిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.ఢిల్లీలో కూడా బంగారం ధరలో గణనీయమైన మార్పు ఏర్పడింది. దీంతో ఉదయం, సాయంత్రం ధరలకు చాలా వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.146330 వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ.1,34,150 వద్ద ఉంది. అయితే.. చెన్నైలో మాత్రం ఈ రోజు సాయంత్రానికి ధరల్లో మార్పు కనిపించలేదు. -
బంగారం @ 1,50,000? ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే..
-
ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి తగ్గినా.. ‘గోల్డ్ బాండ్ల’ జోరు తగ్గేదేలే..
బంగారం ధరలు ఇటీవల స్వల్పంగా తగ్గినప్పటికీ సార్వభౌమ పసిడి బాండ్లలో (సావరీన్ గోల్డ్ బాండ్స్-ఎస్జీబీ) పెట్టుబడి పెట్టిన వారికి గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికీ 34-44 శాతం వరకు లబ్ధి చేకూరుతోంది. కొత్తగా ఎస్జీబీల జారీని ప్రభుత్వం నిలిపివేసినప్పటికీ 2032 ఫిబ్రవరి వరకు గడువు తీరే దాదాపు 45 బాండ్లు ప్రస్తుతం స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్లాట్ఫామ్ల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవి వార్షికంగా 2.50 శాతం వడ్డీని అందిస్తూనే గడువు ముగిసే సమయానికి నాటి పసిడి మార్కెట్ ధర ఆధారంగా మెచ్యూరిటీ సొమ్మును చెల్లిస్తాయి.900 శాతానికి పైగా పెరుగుదలరిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి 2024లో చివరిసారిగా ఎస్జీబీని జారీ చేసింది. 2015 చివరిలో ఈ పథకం ప్రారంభమైనప్పుడు 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.25,000 ఉండగా ప్రస్తుతం అది దాదాపు రూ.1.29 లక్షలకు చేరింది. ఫలితంగా, ప్రభుత్వంపై ఎస్జీబీల బాధ్యత సుమారు రూ.1.12 లక్షల కోట్ల- రూ.1.20 లక్షల కోట్లకు (సుమారు 130 టన్నుల బంగారం) పెరిగింది. ఇది 2015తో పోలిస్తే 900 శాతానికి పైగా పెరుగుదల.ఈ క్రమంలోనే ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి కేంద్ర బడ్జెట్ 2026లో కీలక పన్ను సవరణ చేసింది. ఇకపై ఆర్బీఐ ద్వారా ప్రాథమికంగా బాండ్లు కొనుగోలు చేసి ఎనిమిదేళ్ల గడువు వరకు ఉంచుకునే వారికి మాత్రమే మూలధన లాభాల పన్ను మినహాయింపు లభిస్తుంది. సెకండరీ మార్కెట్ (NSE/BSE)లో ఇతరుల నుంచి ఎస్జీబీలు కొనుగోలు చేసేవారికి ఈ పన్ను మినహాయింపు వర్తించదని నిపుణులు చెబుతున్నారు. బాండ్ల పన్ను విధానంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో కొత్తగా పసిడిలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటీఎఫ్లు మెరుగైన ప్రత్యామ్నాయమని సూచిస్తున్నారు.ఇదీ చదవండి: కోకా-కోలా ‘ఫెయిర్లైఫ్’పై సైబర్ దాడి -
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు తులం ఎంతంటే?
-
బంగారం సెగ ఇప్పట్లో తగ్గేలాలేదు!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
బంగారం, వెండిలో ఇన్వెస్ట్ చేయొచ్చా?
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు ప్రపంచ మార్కెట్లను కుదిపేస్తున్న నేపథ్యంలో సురక్షిత పెట్టుబడిగా భావించే పసిడి, వెండి ధరలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. జులై ఆరంభంలో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల కారణంగా పసిడి ధరలు ఒక్కసారిగా మళ్లీ పెరిగాయి. తదనంతరం సాగిన లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్), కీలక వడ్డీ రేట్లపై కేంద్ర బ్యాంకుల వైఖరి వల్ల ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ అనిశ్చిత వాతావరణంలో సాధారణ మదుపరులు ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే దానిపై ఆర్థిక నిపుణులు కొన్ని అంశాలను ప్రస్తావిస్తున్నారు.ధరల కదలికలు.. కారణాలుయుద్ధం, ఆర్థిక అనిశ్చితి కాలంలో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఆస్తిగా బంగారానికి ప్రాధాన్యం ఇస్తారు. జులై నెలలో అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు పెరగడం, చమురు ధరలు మండిపోవడం వల్ల పసిడికి భారీగా డిమాండ్ పెరిగింది. అయితే, అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ గణాంకాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల సవరణ అంచనాలు, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ నిర్ణయాలు బంగారంలో కదలికలను పరిమితం చేశాయి. మరోవైపు, వెండి కేవలం సురక్షిత పెట్టుబడిగా మాత్రమే కాకుండా పారిశ్రామిక డిమాండ్ (సోలార్, ఎలక్ట్రానిక్స్) కలిగిన లోహం కావడంతో రెసిస్టెన్స్ లెవల్స్ వద్ద కొంత ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది.ఇప్పుడేం చేయాలి?దీర్ఘకాలిక మదుపరులు: ఇప్పటికే మీ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారం, వెండి ఉంటే వాటిని వెంటనే విక్రయించాల్సిన అవసరం లేదు. భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతున్నంత కాలం బంగారం రీ-రేటింగ్ అయ్యే అవకాశం ఉన్నందున హోల్డ్ చేయడం ఉత్తమం.కొత్తగా పెట్టుబడి పెట్టేవారు: మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ప్రమాదకరం. ధరలలో దిద్దుబాటు వచ్చిన ప్రతిసారి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) విధానంలో సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ-ప్రస్తుతానికి ప్రభుత్వం వీటిని తాత్కాలికంగా నిలిపేసింది. మళ్లీ తీసుకొస్తే పెట్టుబడి పెట్టడం), గోల్డ్ ఈటీఎఫ్లు లేదా డిజిటల్ గోల్డ్ ద్వారా 5-10% మేర కేటాయింపులు చేసుకోవడం శ్రేయస్కరం.స్వల్పకాలిక ట్రేడర్లు: ఫ్యూచర్స్, ఆప్షన్స్ లో ట్రేడింగ్ చేసేవారు గరిష్ట ధరల వద్ద కొంతమేర లాభాలను స్వీకరించి ‘స్టాప్ లాస్’ విధానాన్ని పాటించాలి.అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు సమసిపోయే వరకు పసిడి, వెండి ధరల్లో అస్థిరత కొనసాగుతుంది. ప్రతికూల ఆర్థిక వాతావరణంలో ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోకు రక్షణ కల్పించే ఇంధనంగా పసిడి ఉంటుంది. దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడులను కొనసాగించడమే మెరుగైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.ఇదీ చదవండి: హోమ్ లోన్ కడుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారా? -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో క్రితం రోజున మోస్తరుగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
మూడు వారాల కనిష్టానికి పసిడి
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల క్రూడాయిల్ రేట్లు ర్యాలీ చేస్తుండటం, ఇన్వెస్టర్ల సెంటిమెంటు బలహీనపడటంలాంటి ప్రతికూల అంశాలతో పసిడి ధరలు మూడు వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం శుక్రవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం 10 గ్రాముల రేటు రూ. 800 మేర క్షీణించి రూ. 1,45,500కి తగ్గింది. బంగారం చివరిసారిగా జూన్ 25న రూ. 1,45,300 వద్ద ట్రేడయ్యింది. అటు వెండి ధర కేజీకి రూ. 2,000 క్షీణించి రూ. 2,22,500కి పడిపోయింది. ఈ వారంలో పసిడి ధర 3,000, వెండి రూ. 14,500 మేర క్షీణించాయి. -
హైదరాబాద్లో దిగొచ్చిన బంగారం ధర!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
-
భారీగా తగ్గిన బంగారం ఈ రోజు ఎంత తగ్గాయంటే?
-
మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
భారీగా తగ్గిన బంగారం ధరలు 10 గ్రాముల ధర @1,07,100
-
బంగారం ధరల్లో స్పల్ప ఊరట
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మారిన పరిస్థితి.. బంగారం భారీ పతనం!
ఇరాన్తో యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. బంగారం ధరలు మరోసారి ఒత్తిడికి గురవుతున్నాయి. సాధారణంగా ప్రపంచంలో యుద్ధాలు, భౌగోళిక ఉద్రిక్తతలు పెరిగిన సమయంన్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారం ధరలు పెరగడం సహజం. కానీ.. ప్రస్తుతం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. యుద్ధం తీవ్రతరం అవుతున్నప్పటికీ బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.మార్కెట్లోని చాలామంది ట్రేడర్లు యుద్ధం జరిగితే.. బంగారం ధరలు పెరగవని, పైగా తగ్గుతాయని భావించే పరిస్థితికి అలవాటు పడుతున్నారు. ఈ అభిప్రాయంతో కొందరు ట్రేడర్లు బంగారం ధరలు మరింత తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. బహుశా ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని ప్రముఖ మార్కెట్ విశ్లేషకులు పీటర్ డేవిడ్ షిఫ్ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు.యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చినట్లయితే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో పెట్టుబడిదారులు మళ్లీ బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశాలు పెరుగుతాయి.ప్రస్తుతం కనిపిస్తున్న ధరల పతనం తాత్కాలికమే కావచ్చు, త్వరలోనే బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, పెట్టుబడిదారుల సెంటిమెంట్ వంటి అంశాలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది.Once again, gold is selling off as the war with Iran escalates. Traders are being conditioned to believe that war is now bearish for gold. Shorts will be in for a world of hurt when they are blindsided by the reality that the opposite is true. Conditions are set for a huge rally.— Peter Schiff (@PeterSchiff) July 12, 2026 -
బంగారం తగ్గిందోచ్.. లేటెస్ట్ ధరలు ఇవే!
-
కొనుగోలుదారులకు ఊరట.. దిగొచ్చిన బంగారం..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం కొనాలా? వద్దా?
గ్లోబల్ మార్కెట్ల ఒడిదొడుకులు, ఆర్థిక అనిశ్చితి నడుమ పసిడి ధరలు ఊగిసలాడుతున్నాయి. గడిచిన వారం రోజులుగా దేశీయ మార్కెట్లో బంగారం ధరలు అస్థిరతకు లోనయ్యాయి. నేడు, ఆదివారం (12 జులై 2026) మార్కెట్ సెలవు దినం కావడంతో ప్రధాన నగరాల్లో పసిడి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న అధికారిక సమాచారం ప్రకారం.. దేశంలోని ప్రముఖ నగరాలు (హైదరాబాద్, విజయవాడలతో సహా), ప్రముఖ జ్యువెలరీ నెట్వర్క్ల పరిధిలో ఇవాల్టి పసిడి రేట్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి.పసిడి ధరలు (10 గ్రాములకు)22 క్యారెట్ల ఆభరణాల బంగారం: రూ.1,32,75024 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం: రూ.1,44,000 నుంచి రూ.1,44,960 వరకు ట్రేడ్ అవుతోంది.వారం రోజుల ధరల సరళిగడిచిన వారంలో జులై మొదటి వారంతో పోలిస్తే బంగారం మార్కెట్ మిశ్రమ ధోరణిని కనబరిచింది. వారం ప్రారంభంలో పెరిగిన ధరలు తర్వాత స్వల్ప లాభాల స్వీకరణ కారణంగా ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. జులై మొదటి వారంలో 22 క్యారెట్ల బంగారం దాదాపు రూ.1,35,000 మార్కును తాకి, వినియోగదారులకు షాక్ ఇచ్చింది. అయితే, వారం మధ్యలో ఒక్కసారిగా రూ.1,31,650 కి పడిపోయి, మళ్లీ వారాంతానికి కోలుకుని రూ.1,32,750 వద్ద ముగిసింది. దీన్ని బట్టి మార్కెట్లో కొనుగోలుదారుల కంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ఎక్కువగా నడుస్తోందని స్పష్టమవుతోంది.ధరల ఒడిదొడుకులకు కారణాలుబంగారం ధరల ఈ స్థాయి అస్థిరతకు కేవలం స్థానిక డిమాండ్ మాత్రమే కారణం కాదు. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న కొన్ని కీలక ఆర్థిక పరిణామాలు దీనిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రాబోయే సెప్టెంబర్ ద్రవ్యోల్బణ సమీక్షలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై ఒత్తిడి పెరిగింది. వడ్డీ రేట్లు పెరిగితే ఇన్వెస్టర్లు సురక్షిత సాధనమైన బాండ్ల వైపు మొగ్గు చూపుతారు. దాంతో బంగారం ధరలు తగ్గుతాయి.బలపడుతున్న డాలర్ ఇండెక్స్అంతర్జాతీయ మార్కెట్లో అమెరికన్ డాలర్ విలువ పుంజుకోవడం కూడా పసిడి రేట్ల దిగువ ముగింపునకు కారణమైంది. డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్న దేశాలకు బంగారం దిగుమతి భారం అవుతుంది.ముడిచమురు ధరల ప్రభావంగ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయంగా ద్రవ్యోల్బణ భయాలను పెంచుతోంది. ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో ధరలు పడిపోకుండా మద్దతు లభిస్తోంది.మున్ముందు ఎలా ఉండనుంది?ప్రస్తుత సాంకేతిక విశ్లేషణల ప్రకారం, మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ట్రెండ్ ఇంకా బుల్లిష్ (సానుకూల) మార్గంలోనే ఉంది. రాబోయే వారంలో మార్కెట్ కొంత జాగ్రత్తగా లేదా స్వల్ప క్షీణతతో సాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ ముగిసినప్పటికీ అంతర్జాతీయ అనిశ్చితి కొనసాగినంత కాలం బంగారం ధరలు లక్ష రూపాయల దిగువకు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పసిడి ప్రేమికులు ధరలు స్వల్పంగా తగ్గిన ప్రతిసారీ కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వడం సూచించదగిన వ్యూహం.ఇదీ చదవండి: శామ్సంగ్ కొత్త ఫోన్ వివరాలు లీక్? -
పెరిగిన బంగారం ధరలు.. ప్రస్తుతం తులం ఎంతంటే?
-
తగ్గిన బంగారం, వెండి ధరలు!
దేశీయ విఫణిలో బంగారం ధరలు మరోమారు తగ్గుముఖం పట్టాయి. ఈ రోజు (శనివారం) గోల్డ్ రేటు గరిష్టంగా రూ.490 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. కాగా వెండి ధరలు కూడా ఈ రోజు రూ.5000 తగ్గడంతో.. కేజీ సిల్వర్ రేటు రూ.2.40 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో గోల్డ్, సిల్వర్ లేటెస్ట్ ధరల వివరాలు వివరంగా చూసేద్దాం. -
తగ్గేదేలే అంటున్న బంగారం.. వరుసగా రెండోరోజు పెరిగిన ధరలు
-
పసిడి ప్రియులకు అలర్ట్.. మారిన బంగారం, వెండి ధరలు!
బంగారం ధరలు పెరుగుదల మళ్లీ మొదలైంది. వరుసగా రెండో రోజు దేశీయ విఫణిలో గోల్డ్ రేటు గరిష్టంగా రూ.380 పెరిగింది. దీంతో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు మొదలైన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు కనిపించాయి. కాగా వెండి ధర మాత్రం రూ.5000 పెరిగింది. తాజా ధరలకు సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం. -
Gold Price: గంటల వ్యవధిలో మారిపోయిన ధరలు!
నాలుగు రోజుల తరువాత గోల్డ్ రేటు ఒక్కసారిగా పెరిగింది. ఈ రోజు (గురువారం) ఉదయం గరిష్టంగా రూ.110 పెరిగిన బంగారం ధర, సాయంత్రానికి మరో 20 రూపాయలు పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇంకాస్త ముందుకు వెళ్ళింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. -
ఒక్క రోజులో అమాంతం పెరిగిన బంగారం ధరలు
-
బంగారం ధరల్లో స్వల్ప మార్పు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
దిగొచ్చిన బంగారం ధర.. తులం ఎంతంటే?
-
చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి రూ. 1,400 డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బలహీన ట్రెండ్స్, రూపాయి బలపడటం తదితర అంశాల నేపథ్యంలో పసిడి ధర నెమ్మదించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల 10 గ్రా. బంగారం ధర రూ. 1,400 తగ్గి రూ. 1,49,250కి పరిమితమైంది. వెండి కేజీ రేటు రూ. 200 తగ్గి రూ. 2,39,800కి చేరింది.అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ సమావేశ మినిట్స్, నిరుద్యోగ గణాంకాలు, ద్రవ్యోల్బణం డేటా గురించి ఎదురుచూస్తున్న ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కైనాత్ చైన్వాలా తెలిపారు. రూపాయి మారకం విలువ 48 పైసలు బలపడటం కూడా బంగారంపై ప్రభావం చూపింది. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాములు) పసిడి రేటు 24.54 డాలర్లు క్షీణించి 4,140.59 డాలర్లకు, వెండి దాదాపు 2% తగ్గి 60.89 డాలర్లకు చేరింది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు ప్రస్తుతం తులం ఎంతంటే?
-
ఈరోజు మారిన బంగారం ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఏకంగా 10 వేలు తగ్గిన బంగారం
-
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజుల భారీగా పెరుగుదల తర్వాత స్వల్పంగా క్షీణించిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం అంత పెరగదులే!
ప్రపంచ బంగారం మార్కెట్పై ప్రముఖ అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ‘జేపీ మోర్గాన్’ తన స్వల్పకాలిక అంచనాలను తగ్గించింది. కీలక రంగాల నుంచి బంగారం కొనుగోళ్లు గతంలో ఊహించినంత బలంగా ఉండకపోవడంతో ఈ ఏడాది ధరల పెరుగుదల పరిమితంగానే ఉండొచ్చని పేర్కొంది. తాజా నివేదిక ప్రకారం.. మూడో త్రైమాసికంలో (Q3) బంగారం సగటు ధర ఔన్స్కు 4,300 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.32 లక్షలు), నాలుగో త్రైమాసికంలో (Q4) 4,500 డాలర్లు (10 గ్రాములకు సుమారు రూ.1.38 లక్షలు)చేరే అవకాశం ఉందని అంచనా వేసింది.ఇది గత నెలలో ప్రకటించిన ఏడాది చివరినాటికి 6,000 డాలర్ల (10 గ్రాములకు సుమారు రూ.1.84 లక్షలు) లక్ష్యంతో పోలిస్తే గణనీయమైన తగ్గింపే. బ్యాంకు ప్రకారం.. అమెరికా ఆర్థిక గణాంకాలు వేసవి కాలంలో అంచనాల కంటే బలంగా వస్తే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ముందుగానే పెంచే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిలో వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం ఆకర్షణ తగ్గి, పెట్టుబడిదారులు అధిక రాబడులు ఇచ్చే ఇతర ఆస్తులవైపు మొగ్గు చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో బంగారం ధరలపై దిగువ ఒత్తిడి ఏర్పడవచ్చని తెలిపింది.అయితే దీర్ఘకాలికంగా మాత్రం జేపీ మోర్గాన్ తన సానుకూల దృక్పథాన్ని కొనసాగించింది. ప్రపంచ కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌతిక డిమాండ్ మళ్లీ బలపడడం వంటి అంశాలతో 2027లో బంగారం మరోసారి బలమైన ర్యాలీ చేసే అవకాశముందని పేర్కొంది.ఇదిలా ఉండగా, జూలై 3 ట్రేడింగ్లో స్పాట్ గోల్డ్ ధర 1.3 శాతం పెరిగి ఔన్స్కు 4,174.21 డాలర్ల వద్ద ట్రేడైంది. ఇది జూన్ 23 తర్వాత అత్యధిక స్థాయి కాగా, వారాంతానికి బంగారం ధరలు 2 శాతానికి పైగా లాభపడ్డాయి.ఇతర విలువైన లోహాలపై కూడా బ్యాంకు అంచనాలు వెల్లడించింది. వెండి ధరలు ఔన్స్కు 60–65 డాలర్ల మధ్య సగటున ఉండొచ్చని, దక్షిణాఫ్రికాలో సరఫరా పరిమితుల కారణంగా ప్లాటినం ధరలు 2026 చివరికి 1,800 డాలర్లు, 2027 చివరికి 1,950 డాలర్లు చేరవచ్చని తెలిపింది. మరోవైపు, పల్లాడియం ధరలు 2026 చివరికి ఔన్స్కు 1,350 డాలర్లు, 2027లో సగటున 1,300 డాలర్ల వద్ద ఉండొచ్చని అంచనా వేసింది. -
మోడీ వల్లే బంగారం రేట్లు పడిపోతున్నాయా ?
-
పసిడి ధర మళ్లీ లక్షన్నర పైకి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లలో బుల్లిష్ ట్రెండ్తో పాటు యూఎస్ కరెన్సీ డాలర్ బలహీనత కారణంగా దేశీయంగా పసిడి ధర మళ్లీ లక్షన్నర (రూ.1.50 లక్షలు) మార్కును దాటింది. ఢిల్లీ మార్కెట్లో శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.3,300 పెరిగి రూ.1,50,800 స్థాయికి చేరింది. అటు వెండి ధర కూడా తన లాభాల ర్యాలీని కొనసాగిస్తూ కేజీకి రూ. 5,000 పెరిగి రూ.2,45,000 స్థాయికి ఎగిసింది.అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అవకాశాలు తగ్గడం, డాలర్ ఇండెక్స్ 101 పాయింట్ల దిగువకు పడిపోవడంతో బులియన్ మార్కెట్లో తాజా కొనుగోళ్లు పెరిగాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ తెలిపారు. అమెరికాలో ఉపాధి గణాంకాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందంటూ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ కెవిన్ వార్‡్ష చేసిన వ్యాఖ్యలు కూడా పసిడి, వెండి ధరల పెరుగుదలకు కారణమయ్యాయి.రూ.4,200 డాలర్ల దిశగా..అంతర్జాతీయంగాబంగారం ధర ఔన్సుకు 1.4 శాతం లాభపడి 4,181.50 డాలర్లకు చేరింది. వెండి 2.44 శాతం పెరిగి 62.45 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ప్రపంచ మార్కెట్లో పసిడి ధర త్వరలో 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ప్రతినిధి కైనాత్ చైన్వాలా తెలిపారు. -
ఒక్కరోజులోనే భారీగా పెరిగిన ధరలు..
-
ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. గత మూడు సెషన్ల నుంచి తగ్గిన పసిడి ధరలు ఒక్కసారిగా ఈరోజు పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం అమ్మేసుకుంటున్నారు..
బంగారం ధరలు ఇటీవలి నెలల్లో రికార్డు స్థాయిని తాకిన తర్వాత క్రమంగా తగ్గుముఖం పట్టడంతో భారతీయ కుటుంబాల పసిడి కొనుగోలు ధోరణిలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. సాధారణంగా పాత బంగారు ఆభరణాలను కొత్త నగలుగా మార్చుకునే వినియోగదారులు, ఇప్పుడు వాటిని నేరుగా విక్రయించి నగదుగా మార్చుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాలే ఈ ధోరణికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.3 నెలల్లో 50 టన్నుల బంగారంఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) గణాంకాల ప్రకారం.. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశవ్యాప్తంగా దాదాపు 50 టన్నుల పాత బంగారం మార్కెట్లోకి వచ్చింది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 43 శాతం అధికం. పాత ఆభరణాలను అమ్మి నగదు పొందేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. ఈ ఏడాది ప్రారంభంలో 10 గ్రాముల బంగారం ధర కొన్ని సందర్భాల్లో రూ.1.8 లక్షల వరకు చేరుకోగా, ప్రస్తుతం అది సుమారు రూ.1.4 లక్షల స్థాయికి దిగివచ్చింది. ధరలు ఇంకా రూ.1.2 లక్షల వరకు పడిపోవచ్చనే అంచనాలతో చాలామంది ఇప్పుడే విక్రయించి లాభాలను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వస్తున్నారు.బంగారం అధిక ధరలను నగదుగా మార్చుకునే అవకాశంగా వినియోగదారులు చూస్తున్నారని ఐబీజేఏ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా పేర్కొన్నారు. గతంలో పాత నగలను ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకునే పద్ధతి ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం మాత్రం నేరుగా విక్రయించి నగదు పొందడానికే ప్రాధాన్యం పెరిగిందన్నారు.రీసైక్లింగ్ పరిశ్రమకు ఊతంఈ పరిణామం దేశంలోని సంఘటిత బంగారం రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా ఊతమిస్తోంది. ఇళ్లలో ఉపయోగం లేకుండా పడి ఉన్న బంగారం తిరిగి మార్కెట్లోకి రావడం వల్ల దిగుమతులపై ఆధారపడే అవసరం కొంత మేర తగ్గే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు, అధిక ధరల కారణంగా కొత్త బంగారు ఆభరణాల కొనుగోళ్లు మాత్రం మందగించినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. -
బంగారం ధరలు కూల్ఆఫ్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ప్రియులకు షాక్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతున్నాయి. అయితే నేడు (మంగళవారం) పసిడి ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. దీంతో ఒక్కసారిగా గోల్డ్ రేటు పెరిగిపోయింది. ఈ కథనంలో లేటెస్ట్ ధరలు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో ఈ రోజు (జూన్ 30) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర.. సాయంత్రానికి రూ.1,30,200 రూపాయల వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలోనే పసిడి ధరల్లో భారీ మార్పు (రూ.1750 పెరిగింది) జరిగిందని స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల ధర రూ.1,40,130 నుంచి రూ.1,42,040 (రూ.1910 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పు సంభవించింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,28,600 రూపాయల నుంచి రూ.1,30,350 వద్దకు, 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,42,190 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1000 తగ్గి రూ.1,32,000 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1090 తగ్గి రూ.1,44,000 వద్ద నిలిచాయి.మొత్తం మీద దేశంలో గోల్డ్ రేటు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరుగుదల దిశగా అడుగులు వేయడం వల్ల, పసిడి ప్రియులలో ఆందోళన మొదలైంది. అయితే రాబర్ట్ కియోసాకి వంటి నిపుణులు మాత్రం రానున్న రోజుల్లో మరింత తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. -
కరుగుతోన్న పసిడి కాంతులకు కారణాలు ఇవే..
గడిచిన కొన్ని నెలలుగా రికార్డు స్థాయిలకు చేరుకుంటూ సామాన్యులకు చుక్కలు చూపించిన పసిడి ధరలు, ఇటీవల అనూహ్యంగా కిందికి దిగివస్తున్నాయి. ఈ రోజు (జూన్ 30, 2026) హైదరాబాద్తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు రూ.1,40,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతుండగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర సుమారు రూ.1,29,000 స్థాయికి దిగివచ్చింది. గత వారంతో పోలిస్తే ఇది భారీ పతనమనే చెప్పాలి. ఈ ఆకస్మిక మార్పునకు గల ఆర్థిక కారణాలు, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బంగారంపై రాబడులు అందుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై విశ్లేషణాత్మక కథనం మీకోసం.ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలుపసిడి మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తే ప్రస్తుతం మూడు ప్రధానాంశాలు ఈ పతనానికి కారణమవుతున్నట్లు స్పష్టమవుతోంది.1. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిఅమెరికా కేంద్రీయ బ్యాంక్ (యూఎస్ ఫెడరల్ రిజర్వ్) వడ్డీ రేట్లను తగ్గిస్తుందని ఈ ఏడాది ఆరంభంలో అంచనా వేసినప్పటికీ తాజా పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపును 2027కు వాయిదా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చనే సంకేతాలు ఇచ్చింది. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర స్థిర ఆదాయ వనరులపై రాబడి పెరుగుతుంది. దీంతో వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వని బంగారం వైపు నుంచి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు.2. బలపడుతున్న అమెరికన్ డాలర్, బాండ్ ఈల్డ్స్ఫెడ్ నిర్ణయాలతో అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ ఇండెక్స్ ఏడాది కాలంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలలో బంగారం కొనడం ఖరీదైనదిగా మారుతుంది. తద్వారా డిమాండ్ తగ్గి ధరలు క్షీణిస్తాయి. గ్లోబల్ గోల్డ్ ఈటీఎఫ్ల నుంచి, ముఖ్యంగా ఆసియా మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లడం దీనికి అద్దం పడుతోంది.3. పశ్చిమాసియాలో సడలిన ఉద్రిక్తతలుగత కొద్ది నెలల్లో బంగారం ధరలు భారీగా పెరగడానికి రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా (ఇరాన్-అమెరికా/ఇజ్రాయెల్) సంక్షోభాలు ప్రధాన కారణం. అయితే ఇటీవల ఇరాన్, అమెరికాల మధ్య శాంతి చర్చల సరళి, కీలకమైన హార్ముజ్ జలసంధి పాక్షికంగా తెరచుకోవడం వంటి పరిణామాల వల్ల గ్లోబల్ మార్కెట్లో ముడిచమురు ధరలు దాదాపు 30% తగ్గాయి. దాంతో అంతర్జాతీయ ఒడిదొడుకులు తగ్గి సురక్షిత పెట్టుబడిగా బంగారానికి ఉన్న డిమాండ్ ప్రీమియం ఒక్కసారిగా ఆవిరైపోయింది.భవిష్యత్తులో ఇన్వెస్ట్మెంట్ మార్గాలుప్రస్తుత ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఒక అవకాశంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర బ్యాంకుల వద్ద డీ-డాలరైజేషన్ (డాలర్పై ఆధారపడటం తగ్గించడం) ప్రక్రియలో భాగంగా బంగారాన్ని నిల్వ చేసుకునే ధోరణి ఇంకా కొనసాగుతోంది. అయితే కేవలం భౌతిక బంగారం (నగలు) రూపంలో కాకుండా కొన్ని మార్గాల్లో పెట్టుబడి పెడితే మెరుగైన రాబడులు సాధించవచ్చు.గోల్డ్ ఈటీఎఫ్లు: స్టాక్ మార్కెట్ ద్వారా డిజిటల్ రూపంలో బంగారం కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ మార్గం. ఇందులో ఎలాంటి మేకింగ్ ఛార్జీలు, తరుగు ఉండవు. మనకు నచ్చినప్పుడు కరెంట్ మార్కెట్ ధరకే విక్రయించుకోవచ్చు. లాకర్ ఖర్చులు, దొంగతనం భయాలు ఉండవు.సవరీన్ గోల్డ్ బాండ్లు: ప్రభుత్వం/ఆర్బీఐ జారీ చేసే ఈ బాండ్లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు వరం. దీని ద్వారా బంగారం ధర పెరిగితే వచ్చే లాభంతో పాటు, ఏటా స్థిర వడ్డీ (అదనపు ఆదాయం) లభిస్తుంది. అంతేకాకుండా గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ ఉండదు. అయితే, ప్రస్తుతానికి ఈ బాండ్లను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది.డిజిటల్ గోల్డ్: మొబైల్ వాలెట్లు, సర్టిఫైడ్ ప్లాట్ఫారమ్ల ద్వారా కేవలం రూ.100తో కూడా పెట్టుబడిని ప్రారంభించవచ్చు. క్రమానుగత పెట్టుబడి విధానం ద్వారా ప్రతి నెలా కొద్దికొద్దిగా బంగారం జమ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.భౌతిక బంగారం (కాయిన్స్/బిస్కెట్లు): ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కావాలనుకుంటే నగల రూపంలో కాకుండా 24 క్యారెట్ల హాల్మార్క్ ఉన్న కాయిన్స్ లేదా బిస్కెట్లు కొనడం మేలు. దీనివల్ల రీసేల్ (తిరిగి అమ్మే) సమయంలో పూర్తి విలువ లభిస్తుంది.మీ మొత్తం ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10% నుంచి 15% వరకు మాత్రమే పరిమితం చేయడం మంచిది. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకోవడానికి ఒకేసారి కాకుండా ప్రస్తుత ధరల పతనాన్ని ఆసరాగా చేసుకుని విడతల వారీగా పెట్టుబడులు పెట్టడం ద్వారా భవిష్యత్తులో స్థిరమైన, సురక్షితమైన రాబడులను అందుకోవచ్చు.ఇదీ చదవండి: బిగ్ రిలీఫ్.. బంగారం ధరలు ఢమాల్! -
బంగారం, వెండి ధరల్లో భారీ పతనం.. ఈరోజు తాజా రేట్లు ఇవే!
-
బంగారం ధరలు ఢమాల్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పసిడి ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!
బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.భారతదేశంలో బంగారం ధరలుమన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.I was wrong. Gold still crashing!Thats real life. RD Lesson: Profuts are made when you buy…. Not when you sell.I still believe gold will be $35 k in about 5-years.But that is real life: All markets go up and down.Another RD lesson: The richest investors invest for…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 29, 2026 -
పసిడి పరుగుకు పగ్గాలు.. దిగొచ్చిన ధరలు
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు!
భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు చెబుతున్నారు.మే 10న ప్రధానమంత్రి బంగారం కొనుగోలును ఒక ఏడాది వాయిదా వేయాలని చెప్పినప్పుడు, 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.1,53,140గా ఉండగా, వెండి ధర కేజీ సుమారు రూ.2,62,350గా ఉంది. అయితే నేటికి (జూన్ 28) ఆ ధర బంగారం ధర రూ.1,39,873కి తగ్గగా, వెండి ధర రూ.2,16,541కి పడిపోయింది. అంటే.. మోదీ ప్రకటన తరువాత గోల్డ్ రేటు సుమారు రూ.13,267 తగ్గగా, వెండి దాదాపు రూ.45,809 తగ్గింది.భారత్లో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉండటం వల్ల విదేశీ మారక ద్రవ్యంపై భారీ ఒత్తిడి పడుతోంది. ఈ పరిస్థితుల్లో విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి అవసరం ఉంటే తప్పా.. బంగారం కొనుగోళ్లు, విదేశీ ప్రయాణాలను వాయిదా వేయాలని కోరారు.ప్రధాని విజ్ఞప్తి తరువాత ప్రభుత్వం బంగారం, వెండి దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. దీని ద్వారా దిగుమతులను తగ్గించడంతో పాటు.. దేశీయ మార్కెట్పై నియంత్రణ సాధించాలని భావించారు. అనుకున్న విధంగానే.. ఈ నిర్ణయం వినియోగదారులపై తక్షణ ప్రభావం చూపించిందని తెలుస్తోంది. -
బంగారం, వెండి ధరలు ఇప్పుడిలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
పసిడి పరుగు ఆగేలా లేదు: కియోసాకి
'రిచ్ డాడ్ పూర్ డాడ్' రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి మరోసారి బంగారంపై తన బలమైన ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేశారు. తాను బంగారం కొనుగోలు చేసిన మరుసటి రోజే ఔన్స్కు 62 డాలర్లు పెరిగిందని పేర్కొంటూ, ఇది కొత్త బుల్రన్కు సంకేతం కావచ్చని సోషల్ మీడియా వేదిక ఎక్స్లో తెలిపారు. మార్కెట్ విశ్లేషకుడు జిమ్ రికార్డ్స్ అంచనాను ప్రస్తావిస్తూ, బంగారం ధర ఔన్స్కు 35,000 డాలర్ల వరకు వెళ్లే అవకాశం ఉందని తాను కూడా నమ్ముతున్నట్లు వెల్లడించారు.కియోసాకి ప్రకారం.. ఇన్వెస్టర్లు కేవలం వార్తలు లేదా భావోద్వేగాల ఆధారంగా కాకుండా టెక్నికల్ అనాలిసిస్ (TA) నేర్చుకోవడం అత్యంత అవసరం. మార్కెట్లు ఎప్పుడు ఎగుస్తాయి, ఎప్పుడు పడిపోతాయి అన్న సంకేతాలను చార్టుల ద్వారా అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటే, మార్కెట్ పెరిగినా, కుప్పకూలినా అవకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన సూచించారు. అయితే టెక్నికల్ అనాలిసిస్ను నేర్చుకోవడానికి తనకు ఎన్నో సంవత్సరాలు పట్టిందని కూడా చెప్పారు.ఇటీవలే బంగారం ధరలు తగ్గుతున్న సమయంలో తాను వెంటనే కొనుగోళ్లు చేయబోనని, ముందు మార్కెట్లో బాటమ్ ఏర్పడిందని చార్టులు నిర్ధారించేవరకు వేచి చూస్తానని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు ఆ మలుపు వచ్చినట్లు కనిపిస్తోందని చెబుతూ మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడించారు.Yay: I may have picked the turnin price of gold.Gold up $62 since I purchased yesterday. Possibly on a bull run to $35k if Jim Rickards is correct…. and I think he is. LESSON: An important study for you to increase your financial education is Technical Analysis,how…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 27, 2026 -
ఆగని పసిడి పరుగులు.. నేడు కొత్త ధరలు
దేశంలో బంగారం ధరల పరుగులు కొనసాగుతున్నాయి. వరుసగా రెండో రోజూ పసిడి ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు మాత్రం కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. క్రితం రోజున భారీగా ఎగిసిన వెండి ధరలు నేడు ఎటువంటి పెరుగుదల లేకుండా నిలకడగా ఉన్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
భారతదేశంలో వరుసగా తగ్గుముఖం పడుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఎందుకంటే ఈ రోజు (జూన్ 26) గోల్డ్ రేటు ఊహకందని రీతిలో ఒక్కసారిగా పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు జరిగింది. ఈ కథనంలో తాజా ధరల వివరాలు చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడలలో శుక్రవారం ఉదయం రూ.250 పెరిగి రూ.1,29,800 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం రేటు.. సాయంత్రానికి రూ.1,30,850 వద్దకు చేరింది. అంటే గంటల వ్యవధిలో రూ.1050 పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,600 నుంచి రూ.142750 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా గోల్డ్ ధరలో మార్పులు కనిపించాయి. దేశ రాజధానిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర ఉదయం నుంచి సాయంత్రానికి రూ.1,29,950 నుంచి రూ.1,31,050 వద్దకు (రూ.1100 పెరిగింది) చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 1,41,750 రూపాయల నుంచి 1,42,950 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,33,000 (రూ.1600 పెరిగింది) వద్ద, 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,45,090 (రూ.1740 పెరిగింది) వద్ద నిలిచింది. -
35 వేల డాలర్లకు గోల్డ్?: కియోసాకి ట్వీట్
బంగారం, వెండి ధరలు తారుమారవుతున్న వేళ 'రాబర్ట్ కియోసాకి' ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగారం ఇప్పుడే మలుపు తిరిగింది. నా అంచనా తప్పయినప్పటికీ.. గోల్డ్, సిల్వర్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.పెట్టుబడిదారుడు జిమ్ రికార్డ్స్ వంటి వారు భవిష్యత్తులో బంగారం ధర 35,000 డాలర్ల వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారని కియోసాకి తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. అంతే కాకుండా.. గత అనుభవాలను పరిశీలిస్తే, 2000 సంవత్సరంలో ప్రారంభమైన పెద్ద బుల్ రన్ సమయంలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. అప్పట్లో కొందరు పెట్టుబడిదారులు మంచి లాభాలను పొందారు. ఇప్పుడు కూడా అదే తరహా పరిస్థితులు మళ్లీ ఏర్పడవచ్చని ఆయన పేర్కొన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అప్పుల భారంతో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంప్రదాయ కరెన్సీలపై నమ్మకం తగ్గి, బంగారం వంటి సురక్షితమైన ఆస్తులపై డిమాండ్ పెరుగుతుందని కియోసాకి చెప్పారు.'బంగారం అనేది నిజమైన డబ్బు, మిగతావన్నీ క్రెడిట్ మాత్రమే' అనే జేపీ మోర్గాన్ అభిప్రాయాన్ని కూడా కియోసాకి ఉదహరించారు. దీన్నిబట్టి చూస్తే.. అమెరికన్ డాలర్ కూడా ఒక రకమైన అప్పు ఆధారిత వ్యవస్థగా కనిపిస్తుందని వారు అంటున్నారు. అందువల్ల ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారం, వెండి వంటి ఆస్తులు మరింత బలపడతాయని చెబుతున్నారు.అంతే కాకుండా.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇది భవిష్యత్తులో ఆర్థిక, ఉద్యోగ, పెట్టుబడి రంగాల్లో పెద్ద మార్పులను తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఈ మార్పుల మధ్య పెట్టుబడిదారులు తమ ఆర్థిక నిర్ణయాలను మరింత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది.GOLD just made the turn.I think and I have been wrong, the price of gold and silver are about to rise for a long time. Jim Rickards predicts $35,000 gold in near future.As I stated in my previous X the last big bull run began in 2000 and I bought gold at $300.In 2026 the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 25, 2026 -
మళ్లీ కొండెక్కిన బంగారం తులంపై ఎంత పెరిగిందంటే
-
బంగారం, వెండి ధరలు.. ఒక్క రోజులో రివర్స్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనానికి బ్రేక్ పడింది. మూడు రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు నేడు పెరుగుదల బాటపట్టాయి. ఇక వెండి ధరల్లో కూడా నేడు పెరుగుదల నమోదైంది. దీంతో కొనుగోలుదారులకు నిరాశ ఎదురైంది. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అంతలోనే ఇంతలా.. బంగారం కొత్త ధరలు ఇలా!
భారతదేశంలో బంగారం తగ్గుదలకు బ్రేక్ పడింది. వరుసగా తగ్గుతున్న గోల్డ్ రేటు.. పెరుగుదల దిశగా అడుగులు వేసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరల్లో మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలో ఈ రోజు (జూన్ 25) ఉదయం రూ.1,28,450 వద్ద ఉన్న తులం 22 క్యారెట్స్ బంగారం ధర సాయంత్రానికి రూ.1,29,550 వద్దకు చేరింది. 24 క్యారెట్ల బంగారం రేటు రూ.1,40,130 నుంచి రూ.1,41,330 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే గంటల వ్యవధిలో పసిడి ధరలు ఎంతగా మారాయో స్పష్టంగా తెలుస్తోంది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో మార్పులు జరిగాయి. ఇక్కడ ఉదయం రూ.1,28,600 వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం గోల్డ్ రేటు రూ.1,29,700 వద్దకు చేరింది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,40,280 నుంచి రూ.1,41,480 వద్దకు చేరింది.అయితే చెన్నైలో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పు జరగలేదు. కాబట్టి ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం రేటు రూ.131400 వద్ద, 24 క్యారెట్ల రేటు రూ.1,43,350 వద్ద ఉంది. -
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం.. ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
-
హ్యాట్రిక్.. మరింత పడిపోయిన బంగారం, వెండి!
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. రెండు రోజులుగా భారీగా తగ్గిన పసిడి ధరలు వరుసగా నేడు వరుసగా మూడో రోజూ పతనమై హ్యాట్రిక్ తగ్గుదలను నమోదు చేశాయి. ఇక వెండి ధరలు కూడా వరుసగా మూడో రోజు భారీగా క్షీణించాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి ఢమాల్!
న్యూఢిల్లీ: పసిడి, వెండి ధరలు బుధవారం అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యాయి. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 3 శాతం నష్టంతో 3,980 డాలర్ల స్థాయికి పడిపోయింది. వెండి ధర అయితే ఔన్స్కు 8 శాతం నష్టపోయి 57 డాలర్లకు దిగొచ్చింది. దీంతో వీటి ధరలు ఈ ఏడాది కనిష్టాలకు చేరినట్టయింది.జనవరి 29న పసిడి ఆల్టైమ్ గరిష్టం 5,626 డాలర్లు, వెండి 121.78 డాలర్లను నమోదు చేయడం తెలిసిందే. అక్కడి నుంచి చూస్తే బంగారం 29 శాతం, వెండి 50 శాతానికి పైనే నష్టపోయినట్టు లెక్క. అమెరికా–ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందంతో పశ్చిమాసియాలో పరిస్థితులు కుదుటపడడానికి తోడు యూఎస్ ఫెడ్ సమీప కాలంలోనే వడ్డీ రేట్ల పెంపును చేపడుతుందన్న అంచనాలతో పసిడి, వెండి ధరలు దిగొస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీలో రూ.1,200 డౌన్ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. బంగారం ధర రూ.1,200 నష్టాన్ని చవిచూసింది. రూ.1,48,100 వద్ద ముగిసింది. వెండి కిలోకి రూ.4,000 తగ్గి రూ.2,31,000కు పరిమితమైంది. అంతక్రితం రోజు వెండి రూ.10,500 నష్టపోవడం తెలిసిందే. యూఎస్ డాలర్ పవర్ఫుల్ ర్యాలీకి తోడుగా కఠిన ద్రవ్య విధానంపై ఏర్పడిన అంచనాలతో బంగారం, వెండి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ పేర్కొన్నారు. -
పాతాళానికి పసిడి ధరలు ఒక్క రోజులో ఎన్ని వేలు తగ్గిందంటే..
-
కరుగుతోన్న బంగారు కొండ.. వెండి ఢమాల్!
దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. క్రితం రోజున అత్యంత భారీగా పడిపోయిన పసిడి ధరలు నేడు కూడా కాస్త క్షీణించాయి. ఇక వెండి ధరలు క్రితం రోజుతో పోలిస్తే రెట్టింపు స్థాయిలో పతనమయ్యాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం(Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
గంటల వ్యవధిలో.. మారిపోయిన బంగారం ధరలు!
బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు ఊహకందని మార్పు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు 24 గంటలు గడవక ముందే.. గోల్డ్ రేటు భారీ పతనం చవి చూసింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లోని పసిడి ధరల్లో మార్పు సంభవించింది. ఈ కథనంలో లేటెస్ట్ గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో చూసేద్దాం.హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఈ రోజు ఉదయం రూ.1900 (22 క్యారెట్స్ తులం), రూ.2070 (24 క్యారెట్స్ తులం) తగ్గి వరుసగా రూ. 133750, రూ.145910 వద్ద నిలిచిన 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రాని మరోమారు తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం పసిడి ధరలు రూ.132500, రూ.144600 వద్దకు చేరాయి. దీన్నిబట్టి చూస్తే బంగారం ధర గంటల వ్యవధిలో ఎంతలా మారిపోయిందో స్పష్టమవుతోంది. ఇదే ధరలు ముంబై, బెంగళూరులలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3100 రూపాయలు తగ్గి రూ.132700 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 3380 రూపాయలు తగ్గి రూ.144750 వద్దకు చేరాయి.చెన్నైలో మాత్రం బంగారం ధరల్లో సాయంత్రానికి ఏ మాత్రం మార్పు చెందలేదు. కాబట్టి ఇక్కడ తులం 24 క్యారెట్ల గోల్డ్ రేటు 147930 రూపాయల వద్ద, 22 క్యారెట్ల పసిడి ధర రూ.135600 వద్ద ఉంది.ఇదీ చదవండి: డిఫ్లేషన్ భయం.. బంగారం, వెండి ధరలు పడిపోతాయా? -
మళ్లీ తగ్గిన బంగారం ధరలు తులం ఎంతంటే?
-
బంగారం, వెండి ధరల్లో అనూహ్య మార్పు..
దేశంలో బంగారం, వెండి ధరల్లో అనూహ్యంగా మార్పు వచ్చింది. మూడు రోజులుగా పెరుగుతున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా భారీగా పతనమయ్యాయి. ఇక వెండి ధరలైతే మూడు రోజుల తర్వాత దిగివచ్చాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
పసిడి పరుగు.. వెండి వెలుగు
న్యూఢిల్లీ: బంగారం, వెండి ధరలు సోమవారం కోలుకున్నాయి. గత వారం వరుసగా నాలుగు రోజుల పాటు ఇవి నష్టాలను చవిచూడడం గమనార్హం. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రా. పసిడి ధర రూ.1,700 పెరిగి రూ.1,52,300 స్థాయికి చేరింది. వెండి ధర కిలోకి రూ.4,800 జంప్ చేసి రూ.2,45,500 వద్ద ముగిసింది.గత శుక్రవారం వెండి కిలోకి ఏకంగా రూ.8,040 నష్టపోవడం తెలిసిందే. అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లోనూ బంగారం, వెండి లాభాలతో ట్రేడయ్యాయి. ఔన్స్ బంగారం ధర 50 డాలర్లు (1.2 శాతం) పెరిగి 4,210 డాలర్ల వద్ద ట్రేడ్ కాగా, వెండి 2 శాతానికి పైగా లాభపడి 66.47 డాలర్ల వద్ద కొనసాగింది.రూపాయి బలహీనపడడానికి తోడు గత వారం నష్టాలతో కొనుగోళ్లకు మద్దతు లభించినట్టు ట్రేడర్లు పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీ రేట్ల దీర్ఘకాలం పాటు గరిష్టాల్లో ఉంటాయన్న అంచనాలకు వ్యతిరేకంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మెరుగుపడడం పసిడికి మద్దతిచ్చినట్టు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమోడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. -
పసిడి ప్రియులకు నిరాశే.. తులం ఎంతంటే..
దేశంలో బంగారం ధరల పెరుగుదల కొనసాగుతోంది. రెండు రోజుల కిందట స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు ఒక్క రోజు గ్యాప్ ఇచ్చి నేడు మరింత పెరిగాయి. దీంతో పసిడి ప్రియులకు మళ్లీ నిరాశ తప్పలేదు. ఇక వెండి ధరలు మాత్రం నేడు కూడా ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం (Today Gold Rate), వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో కొన్ని రోజులుగా భారీగా తగ్గుతూ వచ్చి క్రితం రోజున పెరుగుదలబాట పట్టిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాలలో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం ధరల్లో ఊహకందని మార్పు!
బంగారం ధరల భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.5670 తగ్గింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో ఏడురోజుల్లో పసిడి ధరలలో జరిగిన మార్పులు, తాజా ధరల గురించి వివరంగా తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో జూన్ 14(ఆదివారం)న రూ.1,49,080 వద్ద ఉన్న 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు జూన్ 20(శనివారం) నాటికి రూ.1,46,080 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే కేవలం ఏడు రోజుల్లో రూ.3000 తగ్గినట్లు తెలుస్తోంది. 22 క్యారెట్ల రేటు 1,36,650 రూపాయల నుంచి 1,33,900 రూపాయల (రూ.2750 తగ్గింది) వద్దకు చేరింది.వారం ప్రారంభంలో స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేటు.. ఆ తరువాత వరుసగా తగ్గడం మొదలైంది. వారాంతంలో ధరలు కొంత పెరిగాయి. దీంతో బంగారం ధరలలో ఊహకందని మార్పులు జరిగాయి.ఇక ఢిల్లీలో కూడా బంగారం ధరలలో మార్పులు కనిపించాయి. దేశ రాజధాని నగరంలో గత ఆదివారం (జూన్ 14) రోజు 1,49,230 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు శనివారం (జూన్ 20) నాటికి రూ.1,46,230 వద్దకు చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర 1,36,800 రూపాయల నుంచి 1,34,050 రూపాయల వద్దకు చేరింది.చెన్నైలో కూడా గోల్డ్ రేటు తగ్గింది. ఇక్కడ జూన్ 14న రూ.1,51,200 వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర జూన్ 20 నాటికి 1,48,370 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం బంగారం రేటు 1,38,600 రూపాయల నుంచి రూ.1,36,000 వద్దకు చేరింది.ఇదీ చదవండి: కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్! -
బంగారం రూ.2 లక్షలు దాటుతుందా.. ఎప్పుడు?
బంగారం ధరలు మరోసారి భారీ ఎత్తున పెరిగే అవకాశాలపై అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రముఖ పెట్టుబడి బ్యాంక్ జేపీ మోర్గాన్ చేస్ (JPMorgan Chase) తాజాగా విడుదల చేసిన నివేదికలో 2026 చివరి నాటికి బంగారం ధర ఔన్స్కు 6,000 డాలర్లకు, 2027 నాటికి 6,300 డాలర్లకు చేరే అవకాశముందని పేర్కొంది.ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు జనవరిలో నమోదైన రికార్డు గరిష్ఠ స్థాయిల కంటే తక్కువగా ట్రేడవుతున్నప్పటికీ, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణ ఆందోళనలు, అమెరికా ఆర్థిక పరిస్థితులపై అనిశ్చితి దీర్ఘకాలంలో బంగారానికి మద్దతుగా నిలుస్తాయని జేపీ మోర్గాన్ అభిప్రాయపడింది.ఈ అంచనాలు నిజమైతే భారతీయ మార్కెట్లో బంగారం ధరలు చరిత్రాత్మక స్థాయికి చేరే అవకాశం ఉంది. డాలర్ మారకపు విలువ, దిగుమతి సుంకాలు, సెస్సులు, జీఎస్టీ వంటి పన్నులను పరిగణనలోకి తీసుకుంటే 10 గ్రాముల బంగారం ధర రూ.2 లక్షల మార్కును దాటవచ్చని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది సుమారు 30–40 శాతం వరకు పెరుగుదల అవుతుంది.5,000 డాలర్లే ఎక్కువఅయితే అందరు విశ్లేషకులు ఇదే అభిప్రాయంలో లేరు. ఇటీవల బంగారం ధరలు కొంత బలహీనత చూపుతున్నాయని, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, డాలర్ బలం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపవచ్చని మరికొన్ని సంస్థలు సూచిస్తున్నాయి. కొందరు విశ్లేషకులైతే 5,000 డాలర్ల పరిధినే మరింత వాస్తవిక లక్ష్యంగా భావిస్తున్నారు.అందువల్ల బంగారం రూ.2 లక్షలకు చేరుతుందనే అంచనా ప్రస్తుతం ఒక అవకాశంగా మాత్రమే చూడాలి. అంతర్జాతీయ మార్కెట్ల దిశ, కేంద్ర బ్యాంకుల కొనుగోలు ధోరణి, వడ్డీ రేట్ల మార్పులు, రూపాయి-డాలర్ మారకపు విలువలు వచ్చే రెండేళ్లలో కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రస్తుతం మాత్రం బంగారం ధరల భవిష్యత్తుపై ఆశావహ అంచనాలు మళ్లీ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. -
పసిడి ధరల పతనం.. ఒకే రోజులో భారీ తగ్గుదల!
గురువారం ఉదయం స్థిరంగా ఉన్న బంగారం ధరలు, సాయంత్రానికి భారీ తగ్గుదలను నమోదు చేశాయి. దీంతో గోల్డ్ రేటు ఒక్కసారిగా పతనమైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయనే విషయం తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో ఉదయం 1,38,500 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల తులం బంగారం ధర, సాయంత్రానికి 1450 రూపాయలు తగ్గి, రూ.1,37,050 వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు రూ.1,51,100 నుంచి 1590 రూపాయలు తగ్గి రూ.1,49,510 వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరలు తగ్గాయి. ఇక్కడ 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల రేటు 1,38,650 రూపాయల నుంచి 1,37,200 రూపాయల (రూ.1,450 తగ్గింది) వద్దకు చేరింది. 24 క్యారెట్ల రేటు 1,51,250 రూపాయల నుంచి 1,49,660 రూపాయల (రూ.1590 తగ్గింది) వద్దకు చేరింది.చెన్నైలో ఈ రోజు (జూన్ 18) స్వల్పంగా తగ్గిన బంగారం రేటు, సాయంత్రానికి మరింత తగ్గింది. 22 క్యారెట్ల తులం పసిడి ధర రూ.1,40,600 వద్ద నుంచి రూ.1,39,500 వద్దకు (రూ.1100 తగ్గింది) చేరింది. 24 క్యారెట్ల రేటు 1,53,380 రూపాయల నుంచి 1,52,180 రూపాయలకు (రూ.1200 తగ్గింది) చేరింది. -
గోల్డ్ మార్కెట్లో కలకలం..! తులం రూ.1,50,000కు చేరుతుందా?
-
ఒక్కసారిగా పడిన వెండి.. పదిలంగా పసిడి
దేశంలో పసిడి ధరలు నిలకడగా ఉన్నాయి. రెండు రోజులుగా స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఒక్కసారిగా క్షీణించాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
పసిడి రూ.4,800 పతనం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన పవనాలు, బలమైన రూపాయి వెరసి పసిడి, వెండి బుధవారం భారీగా నష్టపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం రూ.4,800 తగ్గి రూ.1,54,400 స్థాయికి దిగొచ్చింది. వెండి సైతం కిలోకి రూ.5,300 నష్టపోయి రూ.2,55,400 వద్ద స్థిరపడింది. ఈక్విటీ మార్కెట్లు మెరుగైన పనితీరు నేపథ్యంలో వరుసగా రెండో రోజు దేశీ బులియన్ మార్కెట్లో బలహీన ధోరణి నెలకొన్నట్టు విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొత్త చైర్మన్ కెవిన్ వార్‡్ష సారథ్యంలో యూఎస్ ఫెడ్ తొలి సమావేశం వివరాలు బుధవారం విడుదల కానున్నాయి.వడ్డీ రేట్లపై కొత్త చైర్మన్ వ్యాఖ్యలు ఎలా ఉంటాయన్నది ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆసక్తిగా గమనిస్తున్నారు. బుధవారం రాత్రి (భారత కాలమానం) యూఎస్ ఫెడ్ నిర్ణయాలు వెల్లడి కానుండడంతో బంగారం ధర స్పాట్ మార్కెట్లో స్థిరీకరణను చూసినట్టు మిరే అసెట్ షేర్ఖాన్ కమోడిటీస్ హెడ్ ప్రవీణ్సింగ్ తెలిపారు. ముఖ్యంగా యూఎస్–ఇరాన్ ఇంకా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉన్న విషయం గమనార్హం.వచ్చే శుక్రవారం ఇది చోటు చేసుకుంటుందని అంచనా. ఈలోపు ఎలాంటి పరిణామాలు ఉంటాయేమోనన్న ఆందోళనతో ఇన్వెస్టర్లు అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం, వెండి లాభాలతో ట్రేడవుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 4,396 డాలర్లు, వెండి ధర 71.5 డాలర్ల వద్ద ఉన్నాయి. -
పసిడి ధరలు.. కొనుగోలుదారులవైపే..
దేశంలో పసిడి ధరల తగ్గుదల కొనసాగుతోంది. భారీ పెరుగుదల నుంచి క్రితం రోజున రివర్స్ అయి తగ్గుదల బాట పట్టిన బంగారం ధరలు నేడు (Today Gold Rate) కూడా స్వల్పంగా తగ్గి కొనుగోలుదారుల వైపు మొగ్గాయి. ఇక వెండి ధరలు (Today Silver Rate) మాత్రం నేడు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.. -
Gold Marker Crash : డబుల్ ధమాకా! గోల్డ్ రేట్స్ డౌన్
-
బంగారం ధరలో మార్పు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేడు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం. -
అమాంతం దూసుకెళ్లిన బంగారం, వెండి ధరలు
దేశంలో పసిడి ధరల పెరుగుదల కొనసాగుతోంది. మూడు రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నేడు (Today Gold Rate) అమాంతం దూసుకెళ్లాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు భారీ భారం తప్పలేదు. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు ఒక్కసారిగా ఎగిశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం.. -
బంగారం, వెండి ధరలు ఇలా..
దేశంలో రెండు రోజులుగా భారీగా పెరిగిన పసిడి ధరలు ధరలు నేడు (Today Gold Rate) నిలకడగా ఉన్నాయి. దీంతో ఈరోజు బంగారం కొనేవాళ్లకు కాస్త ఉపశమనం లభించింది. ఇక వెండి ధరలు (Today Silver Rate) కూడా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత మూడు రోజులుగా వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో కింద చూద్దాం..


