బంగారం, వెండి ధరలు కొంత కాలంగా పెరుగుతూ, తగ్గుతూ ముందుకు సాగుతున్నాయి. ఈ వారం (ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 21) రోజుల్లో గోల్డ్ రేటులో గణనీయమైన మార్పు ఏర్పడింది. ఈ కథనంలో ఏడు రోజుల్లో పసిడి ధరలు ఎంతలా మారాయనే విషయాలు తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడలలో ఫిబ్రవరి 15న 1,57,750 రూపాయల వద్ద ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు శనివారం నాటికి (ఫిబ్రవరి 21) 1,59,280 రూపాయల వద్దకు చేరింది. అంటే వారం రోజుల్లో 1530 రూపాయలు పెరిగిందన్న మాట. 22 క్యారెట్ల గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,44,600 నుంచి 1,46,000 వద్దకు (రూ.1400 పెరిగింది) చేరింది.
ఢిల్లీలో 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు వారం రోజుల్లో 1,57,900 రూపాయల నుంచి రూ. 1,59,430 వద్దకు (రూ.1530 పెరిగింది) చేరింది. 22 క్యారెట్ల ధర 1,44,750 రూపాయల నుంచి రూ. 1,46,150 వద్దకు (1400 రూపాయలు పెరిగింది) చేరింది.
చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 1,58,840 రూపాయల నుంచి 1,60,150 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల రేటు 1,45,600 రూపాయల నుంచి రూ. 1,46,800 వద్దకు (రూ. 1200 పెరిగింది) చేరింది.
వెండి ధరలు
బంగారం మాదిరిగానే వెండి ధరలు కూడా మారాయి. గత ఆదివారం (ఫిబ్రవరి 15) రూ. 2.80 లక్షల వద్ద ఉన్న సిల్వర్ రేటు.. ఈ రోజుకు (శనివారం) పెరుగుతూ.. తగ్గుతూ.. రూ. 2.90 లక్షలకు చేరింది.
ఇదీ చదవండి: బంగారం రూ.2 లక్షలకు?


