breaking news
Football
-
ఫుట్బాల్ ఆడిన ఏనుగులు... ఆకట్టుకున్న అందాల పోటీ...
ఏనుగు ప్రశాంతంగా ఉన్నంత సేపే.. వాటికి గానీ కోపం వచ్చిందంటే మనల్ని ఫుట్ బాల్ ఆడేస్తాయి... అంటూ మనం చెప్పుకుంటుంటాం. కానీ ఇప్పుడు కోపం రాకుండానే ఏనుగులు ఫుట్బాల్ ఆడేశాయి. అయితే అది మనుషులతో కాదు... మనుషులు ఆడే నిజమైన ఫుట్బాల్ కావడం విశేషం. పర్యాటక రంగానికి ఊపు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ దేశం తనదైన ప్రత్యేక ఫెస్టివల్స్ను నిర్వహించడం పరిపాటి. ఆయా ఫెస్టివల్స్ పాప్యులర్ అయితే దశాబ్ధాల పాటు అవి సదరు దేశాలకు టూరిస్ట్లను రప్పించగలగుతాయి.ప్రస్తుతం మన పొరుగు దేశమైన నేపాల్ కూడా అదే పనిచేస్తోంది. తమదైన ఒక ప్రత్యేక ఫెస్టివల్ను పునరుద్ధరించింది. హిమాలయ దేశమైన నేపాల్లోని సౌరహా పర్యాటక పట్టణంలో గత శుక్రవారం జరిగిన వార్షిక ఏనుగుల ఉత్సవంలో ఎలిఫెంట్ ఫుట్బాల్ను నిర్వహించారు. ఈ ఫుట్బాల్ ను కూడా అచ్చంగా ఫుట్బాల్ నియమాలతోనే ఆడతారు, ఆటగాళ్లు ఏనుగులపై స్వారీ చేస్తుండగా, ఏనుగులు గోల్ చేయడానికి ప్రత్యర్థి జట్టు వలలోకి బంతిని తన్నడానికి ఫుట్బాల్ క్రీడాకారుల్లాగే తమ వంతు ప్రయత్నిస్తాయి. ఈ ఫెస్టివల్ సందర్భంగా ఏనుగులు చిత్వాన్ లోని ప్రధాన పర్యాటక కేంద్రమైన సౌరహా లో చిత్వాన్ నేషనల్ పార్క్ గేట్ నుంచి ఉత్సవ వేదిక వరకు ఏనుగులు వీధుల గుండా కవాతు చేశాయి, అక్కడ అవి పెనాల్టీ షూటౌట్ పోటీలో పాల్గొని అందరినీ ఆకర్షించాయి.జంతు హక్కుల కార్యకర్తల అభ్యంతరాల కారణంగా ఆగిపోయిన నేపధ్యంలో... చాలా సంవత్సరాల విరామం తర్వాత ఈ ఏనుగుల పర్యాటక ఉత్సవం 19వ ఎడిషన్ ను నిర్వహించారు. ఈ సంవత్సరమే తొలిసారిగా పెనాల్టీ షూటౌట్ పోటీని ప్రవేశపెట్టారు. ఇది పర్యాటకాన్ని పునరుద్ధరించడానికి ఏనుగుల సంరక్షణను ప్రోత్సహించడానికి సహాయపడుతుందని భావిస్తున్నారు.‘చిత్వాన్ ఏనుగుల ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తోంది. ఇది మాకు దీనికి హాజరు కావడానికి వచ్చే ప్రజలకు కూడా ఒక కానుక. ఈ ఉత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకే ఈ ఏనుగుల ఫుట్బాల్ను ప్రారంభించాం, మూడు రోజుల పాటు ఉత్సవం ఉంటుంది‘ అని సౌరహాకు చెందిన ఏనుగుల సంరక్షకుడు శాంతే మహతో తెలిపారు. సౌరహాలోని బాగ్మారా బఫర్ జోన్ కమ్యూనిటీ ఫారెస్ట్లో జరుగుతున్న ఈ ఉత్సవం గత సోమవారంతో ముగిసింది. సౌరహాకు దేశీయ అంతర్జాతీయ పర్యాటకుల రాకపోకలను పెంచడమే ప్రాథమిక లక్ష్యంగా సాగిన ఈ ఉత్సవాల పొడవునా అనేక రకాల సాంస్కృతిక క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించారు.మొదటి రోజు, చిత్వాన్ నేషనల్ పార్క్ ప్రవేశ ద్వారం నుంచి ఊరేగింపు ఆ తర్వాత ఏనుగుల పెనాల్టీ షూటౌట్ పోటీ, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, అలాగే రెండవ రోజు, ఈ ఉత్సవంలో సాంప్రదాయ సంగీతంతో కూడిన ఏనుగుల అందాల పోటీలు, ఏనుగుల ఆరోగ్య శిబిరం, సంభాషణ కార్యక్రమాలు, పడవ పందాలు, అదనపు క్రీడా పోటీలు జానపద పాటలు, నృత్యాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజున ఏనుగుల పూజ, ఏనుగులతో విందు, పోటీల ఫలితాల ప్రకటన, బహుమతులు థృవ పత్రాల పంపిణీ, అధికారిక ముగింపు వేడుక నిర్వహించారు. -
గుగులోత్ సౌమ్య ‘హ్యాట్రిక్’
కోల్కతా: భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ గుగులోత్ సౌమ్య... భారత మహిళల లీగ్ (ఐడబ్ల్యూఎల్)లో ‘హ్యాట్రిక్’తో విజృంభించింది. లీగ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్న గుగులోత్ సౌమ్య... మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకు తన ఆటతీరుతో కట్టిపడేసింది. సౌమ్యతో పాటు ఫాజిలా కూడా హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో... భారత మహిళల లీగ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు రికార్డు విజయం ఖాతాలో వేసుకుంది. లీగ్లో భాగంగా మంగళవారం జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ జట్టు 9–0 గోల్స్ తేడాతో... సెసా ఫుట్బాల్ అకాడమీపై విజయం సాధించింది. సౌమ్య (6వ, 54వ, 86వ నిమిషాల్లో) మూడు గోల్స్తో దుమ్ము రేపగా... ఫాజిలా ఇక్వాపుట్ (9వ, 22వ, 25వ, 72వ నిమిషాల్లో) నాలుగు గోల్స్తో సత్తా చాటింది. సులాజన రౌల్ (18వ నిమిషంలో), రెస్టీ నాన్జిరి (40వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. డిఫెండింగ్ చాంపియన్ ఈస్ట్ బెంగాల్ జట్టు తమ స్థాయిని ప్రదర్శిస్తూ ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయాలు సాధించిన ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ 9 పాయింట్లతో... పట్టిక రెండో స్థానంలో ఉంది. నీతా ఫుట్బాల్ అకాడమీ 4 మ్యాచ్లాడి మూడు విజయాలు ఒక ‘డ్రా’తో 10 పాయింట్లతో ‘టాప్’లో ఉంది. తదుపరి మ్యాచ్లో శుక్రవారం నీతా ఫుట్బాల్ అకాడమీతో ఈస్ట్ బెంగాల్ జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సుష్మిత చక్కటి అవకాశాన్ని కల్పించుకొని ప్రత్యర్థి పోస్ట్పై దాడి చేయగా... ప్రత్యర్థి గోల్కీపర్ దాన్ని అడ్డుకుంది. అయితే బాక్స్ సమీపంలో బంతిని అందుకున్న తెలంగాణ స్ట్రయికర్ సౌమ్య... గోల్కీపర్ను బోల్తా కొట్టిస్తూ చక్కటి గోల్తో ఈస్ట్ బెంగాల్ ఖాతా తెరిచింది. మరో మూడు నిమిషాల తర్వాత సుష్మిత డీప్ నుంచి ఇచ్చిన పాస్ను చక్కగా అందుకున్న షాజిలా మరో గోల్తో జట్టు స్కోరును రెట్టింపు చేసింది. ఇక అక్కడి నుంచి ఈస్ట్ బెంగాల్ పదేపదే దాడులతో రెచ్చిపోగా... వాటిని అడ్డుకోవడంలో సెసా జట్టు విఫలమైంది. ఈ క్రమంలో మూడు నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్ కొట్టిన ఫాజిలా ‘హ్యాట్రిక్ పూర్తి చేసుకోగా... సులాజన రౌల్, రెస్టీ చెరో గోల్ సాధించారు. దీంతో హాఫ్ టైమ్ ముగిసే సరికి ఈస్ట్ బెంగాల్ జట్టు 6–0తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలో సౌమ్య చెలరేగి మరో రెండు గోల్స్ బాదగా... ఫాజిలా మరో గోల్ చేసింది. దీంతో ఈస్ట్బెంగాల్ జట్టు భారీ విజయం ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ఈస్ట్బెంగాల్ జట్టు తరఫున ఆల్టైమ్ టాప్ గోల్ స్కోరర్ (11)గా సౌమ్య నిలిచింది. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. మెస్సీ రికార్డు బ్రేక్
సౌదీ ప్రీమియర్ లీగ్లో అల్ అఖ్దూద్తో జరిగిన మ్యాచ్లో 3-0 తేడాతో అల్-నస్ర్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్, అల్-నస్ర్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. రొనాల్డోరెండు మెరుపు గోల్స్తో అల్-నస్ర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.ఈ ఫుట్బాల్ స్టార్ మ్యాచ్ 31వ నిమిషంలో ఒక గోల్ చేయగా.. ఫస్ట్ హాఫ్ ఆఖరిలో మరో అద్భుతమైన గోల్ వేశాడు. అతడితో పాటు జోవో ఫెలిక్స్ కూడా ఓ గోల్ సాధించాడు. ఈ విజయంతో సౌదీ ప్రో లీగ్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్లు గెలిచిన మొదటి క్లబ్గా అల్-నస్ర్ రికార్డు సృష్టించింది.అదేవిధంగా రొనాల్డో కూడా ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. 202 ఏడాదిలో రొనాల్డో 40 గోల్స్ను పూర్తి చేసుకున్నాడు. ఒకే క్యాలెండర్ ఈయర్లో అత్యధిక సార్లు నాలభైకి పైగా గోల్స్ సాధించిన ప్లేయర్గా రోనాల్డో చరిత్ర సృష్టించాడు. అతడు తన కెరీర్లో 14 వేర్వేరు సంవత్సరాల్లో 40 పైగా గోల్స్ సాధించాడు.2010 నుంచి దాదాపు ప్రతీ ఏటా రోనాల్డో నాలభైకి పైగా గోల్స్ సాధిస్తున్నాడు. ఒక్క 2019లోనే ఈ మార్క్ను అందుకోలేకపోయాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పేరిట ఉండేది. మెస్పీ తన కెరీర్లో ఇప్పటివరకు 13 సార్లు 40 పైగా గోల్స్ సాధించాడు. తాజా మ్యాచ్తో మెస్సీని రొనాల్డో అధిగమించాడు.చదవండి: మహ్మద్ షమీకి బీసీసీఐ భారీ షాక్..! -
మెస్సీ మోజులో 'మన హీరో'పై చిన్నచూపు..!
అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఇటీవల (డిసెంబర్ 13-15) గోట్ టూర్ పేరిట భారత్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ టూర్ ఆధ్యాంతం అద్భుతంగా సాగింది. మెస్సీని చూసేందుకు లక్షల సంఖ్యలో అభిమానులు ఎగబడ్డారు. ఈ పర్యటనలో మెస్సీ కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాలను సందర్శించాడు. ప్రతి చోటా మెస్సీకి అనూహ్యమైన ఆదరణ లభించింది. కోల్కతాలో 70 అడుగుల మెస్సీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొత్తంగా చూస్తే భారత్లో మెస్సీ పర్యటన విజయవంతమైంది.ఇంతవరకు అంతా బాగానే ఉంది. అయితే మెస్సీ పర్యటనలో భారత స్టార్ ఫుట్బాలర్ సునీల్ ఛెత్రీకి అవమానం జరిగిందని ఫుట్బాల్ ప్రేమికులు వాపోతున్నారు. ముంబైలో జరిగిన ప్రొగ్రాంలో నిర్వహకులు ఛెత్రీ పట్ల అవమానకరంగా ప్రవర్తించారని వారంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ముంబైలోని జరిగిన కార్యక్రమంలో నిర్వహకులు ఛెత్రీని అస్సలు పట్టించుకోలేదు.వీఐపీలంతా మెస్సీతో ఫోటోలకు ఫోజులిస్తుంటే, ఛెత్రీ మాత్రం తన వారి మధ్యే అనామకుడిలా స్టేజీ కింద నిల్చుండిపోయాడు. అంతర్జాతీయ స్థాయిలో నాలుగో టాప్ గోల్ స్కోరర్ అయిన ఛెత్రీని నిర్వహకులు మెస్సీ ఫోటో ఉన్న టీ షర్ట్ వేయించి మరింత అవమానించారు. అంతర్జాతీయ స్థాయిలో మెస్సీది, ఛెత్రీది ఇంచుమించు ఒకే స్థాయి. అయినా మెస్సీ ఏదో గొప్ప అయినట్లు అతని ఫోటోను మన హీరో ధరించిన టీ షర్ట్పై వేయించడం అవమానకరమని చాలామంది ఫీలవుతున్నారు.ముంబై ప్రొగ్రామ్లో వీఐపీలంతా స్టేజీపై అత్యుత్సాహం ప్రదర్శిస్తుంటే ఛెత్రీ స్టేజీ కింద సామాన్యుడిలా అటు ఇటూ తిరుగుతున్న వీడియో సోషల్మీడియాలో వైరలైంది. ఈ వీడియోను చూసిన వారంతా ఛెత్రీకి అతని స్థాయి గౌరవం దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మెస్సీ గొప్ప ఆటగాడే, అయినా మన దేశంలో ఫుట్బాల్ ఉనికిని కాపాడిన ఛెత్రీకి కూడా సమాంతర గౌరవం లభించాలన్నది వారి భావన. విదేశీయుల మోజులో పడి 20 ఏళ్లు భారత్లో ఫుట్బాల్ వ్యాప్తికి కృషి చేసిన మన హీరోని చిన్నచూపు చూడటం సమంజసం కాదని ప్రతి ఒక్కరి అభిప్రాయం.నిర్వహకులు, పాలకులు సరైన గౌరవాన్ని ఇవ్వకపోయినా మెస్సీ మాత్రం ఛెత్రీ పట్ల చాలా మర్యాదగా ప్రవర్తించి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. మెస్సీ స్వయంగా ఛెత్రీని పలకరించి, హత్తుకుని, తన సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. ఈ దృశ్యం భారత ఫుట్బాల్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. భారత ఫుట్బాల్ దిగ్గజాన్ని నిర్వహకులు పట్టించుకోకపోయినా మెస్సీ మాత్రం సరైన రీతిలో గౌరవించాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాలర్ల జాబితాలో ఛెత్రీ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో లాంటి దిగ్గజాలు మాత్రమే ఛెత్రీ కంటే కాస్త ముందున్నారు. 2024 జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఛెత్రీ 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ చేసి ఆల్టైమ్ హయ్యెస్ట్ గోల్ చేసిన ఆటగాళ్లలో ముఖ్యుడిగా నిలిచాడు. -
కాలితో తన్నడంతో గాల్లోకి లేచి పడిన చిన్నారి
కర్ణాటక: రోడ్డు మీద ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి ఫుట్బాల్ తరహాలో కాలితో తన్నాడు. దీంతో బాలిక గాల్లోకి లేచి కిందపడి గాయపడింది. ఈ అమానుష సంఘటన బెంగళూరు త్యాగరాజగనర్లో చోటుచేసుకుంది. ఐదేళ్ల చిన్నారి తన తల్లితో కలిసి ఇంటి బయట బ్యాడ్మింటన్ ఆడుతుండగా వెనుక నుంచి వచ్చిన రంజన్ అనే వ్యక్తి కాలితో తన్నాడు. దీంతో ఆ చిన్నారి గాల్లోకి లేచి కిందపడింది. చిన్నారి తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఎందుకు అలా తన్నాడో తెలియరాలేదు. ఈ దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటనకు సంబంధించి రంజన్(35)ను బనశంకరి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి మానసిక పరిస్థితి బాగాలేదని తెలిసింది. What’s wrong??https://t.co/pbux7NWQ0T— Divya Gandotra Tandon (@divya_gandotra) December 19, 2025 -
భారత ఫుట్బాల్కు ఉజ్వల భవిత: మెస్సీ
న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ అన్నాడు. ‘మీ ఆదరణ, మీరు పంచిన ప్రేమాభిమానాలను నాతోపాటు తీసుకెళ్తున్నా. మ్యాచ్ ఆడేందుకైనా... మరో కార్యక్రమానికైనా ఇంకోసారి భారత్కు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా తిరిగి వచ్చే ఆలోచనైతే నాకుంది’ అని మెస్సీ అన్నాడు. తను సందర్శించిన ప్రాంతాల్ని, కలుసుకున్న భారత దిగ్గజాలతో ఉన్న ఒక నిమిషం నిడివిగల వీడియోను మెస్సీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకున్నాడు. ఈ వీడియోలో భారత ప్రముఖ క్రీడాకారులు, సినీ స్టార్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులెందరో ఉన్నారు. కానీ... హైదరాబాద్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీలతో ఉన్న ఫుటేజీ మాత్రం క్షణమైనా కనిపించలేదు. భారత్లో తన ఐదు రోజుల పర్యటన అద్భుతంగా సాగిందన్నాడు. బుధవారం ముంబై నుంచే మయామికి బయలుదేరాడు. 38 ఏళ్ల అర్జెంటీనా స్ట్రయికర్ తన మయామి క్లబ్ జట్టు సహచరులు స్వారెజ్, రోడ్రిగో డి పాల్లతో కలిసి 13, 14, 15 తేదీల్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం వచ్చాడు. అయితే మరో రెండు రోజులు పొడిగించాడు. భారత్లోని వివిధ రంగాల ప్రముఖులను, క్రికెట్, ఫుట్బాల్, సినీ స్టార్లను కలుసుకున్నాడు. ముంబైలో సచిన్, మెస్సీల భేటీ వాంఖెడే మైదానానికే వన్నె తెచ్చింది. బాలీవుడ్ స్టార్లు షారుక్ ఖాన్, కరీనా కపూర్, భారత ఫుట్బాల్ మాజీ కెపె్టన్ సునీల్ ఛెత్రి తదితరులు మెస్సీని కలిసిన వారిలో ఉన్నారు. మంగళవారం దేశీ కార్పోరేట్ సంస్థ రిలయన్స్ యాజమాన్యం వంతారాలో అచ్చెరువొందే సదుపాయాలతో ఏర్పాటు చేసిన వన్యప్రాణుల సంరక్షిత ప్రాంతాన్ని సందర్శించాడు. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ... మెస్సీకి ఆత్మీయ స్వాగతం పలికి ఆతిథ్యమిచ్చాడు. ప్రముఖ క్రీడా ఉపకరణాల సంస్థ అడిడాస్ నిర్వహించిన ఫొటో షూట్లోనూ పాల్గొన్నాడు. ఈ ఫొటో షూట్లో మెస్సీతోపాటు తెలంగాణ స్టార్ బాక్సర్, ప్రపంచ మాజీ చాంపియన్ నిఖత్ జరీన్, క్రికెటర్లు కుల్దీప్ యాదవ్, రేణుక సింగ్, పారాథ్లెట్స్ నిశాద్ కుమార్, సుమింత్ అంటిల్ పాల్గొన్నారు. -
వంతారలో మెస్సీ.. వన్య ప్రాణులతో సందడి (ఫోటోలు)
-
అక్షరాలా రూ.8 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ఫుట్బాల్ ఆల్టైమ్ గ్రేట్లలో ఒకడైన లయోనల్ మెస్సీ గత మూడు రోజులుగా భారత్లో పర్యటిస్తున్నాడు. నాలుగు నగరాలు కోల్కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో అతని ఈవెంట్లు జరిగాయి. అయితే ఒక్క చోట కూడా అతను అభిమానుల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడలేదు కదా... కనీసం సెమీ సీరియస్ తరహా ఆటను కూడా చూపించలేదు. టీ షర్ట్, ట్రాక్తో ఏదో పార్క్లో జాగింగ్కు వెళుతూ తన వద్దకు వచ్చిన బంతిని అవతలి వారికి ఇచి్చనట్లుగా పాస్లు మాత్రమే అందించాడు! కొద్దిగానైనా అతను మైదానంలో చురుగ్గా పరుగెత్తుతూ ఆడినట్లుగా కనిపించలేదు. ఫోటో సెషన్లు, మైదానంలో అభిమానులకు చేతులు ఊపడం, కొన్ని కిక్లకు మాత్రమే మెస్సీ పరిమితయ్యాడు. దీనికి బలమైన కారణం ఉంది. తన ఆటకు ఆయువుపట్టులాంటి ఎడమ పాదానికి అతను బీమా చేయించుకున్నాడు. ఈ బీమా విలువ అక్షరాలా 900 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 8 వేల కోట్లు)! మ్యాచ్ ఆడుతూ మైదానంలో అతని పాదానికి గాయమైతే బీమా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. అయితే ఈ బీమాలో ఉన్న షరతుల ప్రకారం ఇది జాతీయ జట్టు (అర్జెంటీనా) లేదా తన క్లబ్ (ఇంటర్ మయామి) తరఫున ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. సరదాగానైనా సరే... మరో చోట ఎక్కడైనా ఆడుతూ పొరపాటున గాయమైతే ఇది వర్తించకపోగా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయి. భారత్లాంటి చోట ఏదైనా అనూహ్యం జరిగి గాయపడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మెస్సీ అలాంటి సాహసం చేయలేదు! కేవలం అలా పైపై హడావిడితో అతను పర్యటన ముగించాడు. ఒకప్పుడు బాస్కెట్బాల్ దిగ్గజం మైకేల్ జోర్డాన్కు కూడా కెరీర్ ఆరంభంలో ఇలాంటి సమస్యే వచ్చింది. అయితే తర్వాతి రోజుల్లో కాంట్రాక్ట్ పునరుద్ధరణ చేసుకునే సమయానికి సూపర్ స్టార్గా మారిపోయిన అతను తనకు అనుకూలంగా ఒక క్లాజ్ను అందులో చేర్పించాడు. ‘లవ్ ఆఫ్ ద గేమ్’ అంటూ తాను ఎప్పుడైనా, ఎక్కడైనా తనకు నచి్చనట్లుగా ఆడతానని, ఎలాంటి షరతులు పెట్టరాదని, మామూలు మ్యాచ్లో గాయపడినా బీమా చెల్లించాల్సిందేనంటూ అతను ఒప్పందం చేసుకున్నాడు! -
టీమిండియా జెర్సీ, బ్యాట్, వరల్డ్ కప్ టికెట్!
న్యూఢిల్లీ: ఫుట్బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ టూర్లో భాగంగా నాలుగు నగరాల్లో పర్యటించిన మెస్సీ అభిమానులకు వీడ్కోలు పలుకుతూ స్వదేశం బయల్దేరాడు. చివరి రోజు సోమవారం ఫిరోజ్షా కోట్లా మైదానంలో మెస్సీ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్, ముంబైల తరహాలోనే ఇక్కడి షో కూడా సరదాగా సాగింది. అభిమానుల మధ్య దాదాపుగా అవే దృశ్యాలు ఇక్కడా పునరావృతమయ్యాయి. చిరునవ్వుతో తిరుగుతూ అభివాదం చేసిన అతను ఆ తర్వాత 7x7 సెలబ్రిటీ మ్యాచ్ను తిలకించాడు. సహచరులు స్వారెజ్, రోడ్రిగోలతో కలిసి మెస్సీ తన కిక్లతో కొన్ని బంతులను స్టాండ్స్లోకి పంపించడంతో ఫ్యాన్స్ సంబరపడ్డారు. మైదానంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ జై షా పాల్గొన్న కార్యక్రమం విశేషంగా నిలిచింది. మెస్సీ, స్వారెజ్, రోడ్రిగోల పేర్లు, నంబర్లు రాసి ఉన్న భారత క్రికెట్ జట్టు ప్రత్యేక ‘బ్లూ’ జెర్సీలను వారికి కానుకగా ఇవ్వడంతో పాటు 2024 టి20 వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టు సభ్యుల సంతకాలతో కూడిన ప్రత్యేక బ్యాట్ను కూడా బహుకరించారు. భారత్లో జరిగే 2026 టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్ (భారత్ x అమెరికా) టికెట్ను కూడా మెస్సీకి జై షా ఇచ్చారు. ప్రధానితో భేటీ లేదు... ఢిల్లీ కార్యక్రమంలో ముందుగా అనుకున్న విధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని మెస్సీ కలవలేదు. వీరిద్దరి భేటీ కోసం ప్రత్యేకంగా 21 నిమిషాల ప్రొటోకాల్ను కూడా అధికారులు సిద్ధం చేశారు. అయితే ప్రధాని జోర్డాన్ పర్యటనకు వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం రద్దయింది. ‘మళ్లీ వస్తా’ భారత్లో నాకు లభించిన ప్రేమాభిమానాలకు ఎంతో కృతజు్ఞడను. ఈ పర్యటన చిన్నదే కావచ్చు కానీ నిజంగా చాలా గొప్ప అనుభవం. నన్ను ఇక్కడి వాళ్లు ఎంతో అభిమానిస్తారని వింటూ వచ్చిన మాటలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను. ఇక్కడ ఉన్నన్ని రోజులు మాతో వ్యవహరించిన తీరు చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. మీ ప్రేమను మాతో పాటు తీసుకెళుతున్నాను. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇక్కడికి తిరిగి వస్తాను. అది మ్యాచ్ ఆడటానికి కావచ్చు లేదా మరో సందర్భం కావచ్చు కానీ భారత్లో మాత్రం మళ్లీ అడుగు పెడతా. అందరికీ కృతజ్ఞతలు. –మెస్సీ -
స్టాండ్స్లోకి కిక్ చేసి.. ఉప్పల్లో మెస్సీ చర్య వైరల్
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరం మెస్సీ మంత్రం జపించింది. గజగజ వణికే చలిలో వేడి రగిల్చింది. దిగ్గజ ఫుట్బాల్ క్రీడాకారుడి నామ జపంతో ఉప్పల్ స్టేడియం ఉర్రూతలూగింది. గోట్ పర్యటనలో భాగంగా శనివారం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా వెళ్లారు. అక్కడ వందమందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్లో పాల్గొన్నా రు. అనంతరం ఆయన ఉప్పల్ స్టేడియానికి వచ్చారు. అభిమాన క్రీడాకారుణ్ని ఒక్కసారైనా దూరం నుంచైనా చూడాలని అభిమానులు పోటెత్తారు. వేలాది మంది అభిమానుల కోలాహలం మధ్య ఉప్పల్ స్టేడియంలో తన ఆటతో మైమరిపించారు. స్టాండ్స్లోకి కిక్ చేసివీవీఐపీలు, ఫుట్బాల్ ప్రేమికులు, మెస్సీ అభిమానులు దిగ్గజ క్రీడాకారుణ్ని చూసేందుకు పోటీపడ్డారు. స్టేడియంలో మెస్సీ, సీఎం రేవంత్ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆద్యంతం ప్రేక్షకుల కేరింతల మధ్య కోలాహలంగా సాగింది. ఇక అభివాదం చేస్తు న్న సమయంలో ఫుట్బాల్ను స్టాండ్స్లోకి కిక్ చేసి మెస్సీ అభిమానులను అలరించిన తీరు వైరల్గా మారింది. ✨𝐀𝐧 𝐔𝐧𝐟𝐨𝐫𝐠𝐞𝐭𝐭𝐚𝐛𝐥𝐞 𝐌𝐨𝐦𝐞𝐧𝐭 ✨Football's Greatest Of All Time Lionel Messi in Hyderabad. pic.twitter.com/5z5gXCKbG9— Congress (@INCIndia) December 13, 2025మ్యూజిక్.. మ్యాజిక్.. ఫుట్బాల్ మ్యాచ్లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గాయకుడు రాహుల్ సిప్లీగంజ్, గాయని మంగ్లీ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఆస్కార్ పాట నాటు.. నాటు పాట పాడుతూ సిప్లీగంజ్ అభిమానులను ఉర్రూతలూగించారు. మెస్సీతో పాటు వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఈ పాటకు ఊగిపోయారు. ఎన్నడూ లేనివిధంగా స్టేడియంలో లైట్లు, లేజర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో ఆదంత్యం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి తోడు ఫోక్ సాంగ్స్తో మంగ్లీ మెస్మరైజింగ్ షో అదరగొట్టింది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, సినీతారలు సైతం స్టేడియంలో సందడి చేశారు. ఫలించిన పోలీసుల వ్యూహం..ఉప్పల్: అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ రాక సందర్శంగా శనివారం మధ్యాహ్నం నుంచే ఉప్పల్ స్టేడియం దారులన్నీ జనసంద్రాన్ని తలపించాయి. టికెట్, పాస్లున్న వారిని స్డేడియంలోనికి మూడు గంటలు ముందుగానే అనుమతించడంతో పొలీసులు వ్యూహం ఫలించింది. మ్యాచ్ను తిలకించడానికి తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల నుంచి అభిమానులు అధిక సంఖ్యలో వచ్చినట్లు సమాచారం. మ్యాచ్ను వీక్షించేందుకు వస్తున్న యువత కాగా.. గతంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లను సమర్థంగా నిర్వహించిన రాచకొండ పోలీసులు అంతకన్నా ఎక్కువ శ్రద్ధతో చేపట్టిన భద్రతా చర్యలు, ట్రాఫిక్ తదితర వ్యూహాలు ఫలించాయి. ఎక్కడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకపోవడం విశేషం. రాచకొండ సీపీ సుదీర్ బాబు పిలుపు మేరకు అభిమానులు క్రమశిక్షణతోనే మెలిగారు. పాసులు లేనివారు స్టేడియం వైపు రాకపోవడం గమనార్హం. స్టేడియంలోకి అభిమానులంతా దాదాపుగా మెస్సీ టీ షర్ట్ను ధరించి వెళ్లడం కనిపించింది. -
మెస్సీ మాయలో...
‘మెస్సీ కిక్ కొట్టిన బంతి నా వైపే దూసుకొచ్చింది. ఒక్కసారిగా ఎంతో భావోద్వేగానికి గురయ్యాను’... ఒక పదో తరగతి పిల్లాడి ఆనందం... ‘పదేళ్ల క్రితం మెస్సీ చాంపియన్స్ లీగ్ గెలిచినప్పటి నుంచి అతని ఆటంటే చాలా ఇష్టం. ఇప్పుడు ప్రత్యక్షంగా చూడటంతో నా కల నెరవేరింది’... ఒంటిపై మెస్సీ టాటూ వేసుకున్న ఒక వీరాభిమాని సంతోషమిది. మెస్సీ మైదానంలో గడిపింది గంట సమయం మాత్రమే కావచ్చు. కానీ ఫ్యాన్స్కు సంబంధించి అది అమూల్యమైన సమయం... అతని ప్రతీ కదలిక, వేసిన ప్రతీ అడుగు వారిలో అమిత ఉత్సాహాన్ని రేపింది. మెస్సీ కూడా ఉన్నంత సేపు చాలాసరదాగా, జాలీగా కనిపించడం ఈ మెగా ఈవెంట్ సక్సెస్కు సరైన సూచిక. సాక్షి, హైదరాబాద్: నగర ఫుట్బాల్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూసిన లయోనల్ మెస్సీ షో విజయవంతంగా ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్’లో భాగంగా రెండో నగరమైన హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు, ప్రతిబంధకాలు లేకుండా సాఫీగా సాగింది. శనివారం ఉదయం కోల్కతాలో జరిగిన ఘటన నేపథ్యంలో హైదరాబాద్ కార్యక్రమంపై కాస్త సందేహాలు తలెత్తాయి. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్ట ఏర్పాట్లు చేసి ఉప్పల్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడింది. దాంతో అటు మెస్సీ బృందంతోపాటు ఇటు అభిమానులు కూడా సంతృప్తిగా మైదానాన్ని వీడారు. రేవంత్కు పాస్లు... మెస్సీ టూర్ ఖరారైన రోజు నుంచి ప్రభుత్వం హడావిడి చేసిన మెస్సీ వర్సెస్ రేవంత్ మ్యాచ్ మాత్రం జరగలేదు కానీ... మెస్సీ, సీఎం మధ్య కొన్ని సరదా కిక్లు, పాస్లు మాత్రం నడిచాయి. మెస్సీ ఇచ్చిన పాస్లు చక్కగా అందుకున్న రేవంత్ రెడ్డి వాటిని మళ్లీ రిటర్న్ కూడా చేశారు. స్వారెజ్, రోడ్రిగో కూడా దీనికి జత కలిశారు. ఈ నలుగురు కలిసి ఆడుతున్న సమయంలో స్టేడియంలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున విజిల్స్, కేకలతో సందడి చేశారు. చివరకు మెస్సీ కొట్టిన ఒక కిక్ రేవంత్ను దాటి గోల్ పోస్ట్లోకి వెళ్లడంతో ఈ ఆట ముగిసింది. దీనికి ముందు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సింగరేణి ఆర్ఆర్ టీమ్, అపర్ణ మెస్సీ ఆల్స్టార్స్ టీమ్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ జరిగింది. ఇందులో సింగరేణి టీమ్ విజేతగా నిలిచింది. చిన్నారులతో సందడి... ముందుగా ఎంపిక చేసిన వర్ధమాన ఫుట్బాలర్లు, చిన్నారులతో కూడా మెస్సీ కొద్దిసేపు ఆడాడు. వీటి కోసం నాలుగు వేర్వేరు జోన్లను ఏర్పాటు చేయగా, ప్రతీ చోటికి వెళ్లి ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్టైమ్’ కొంత సమయం కేటాయించాడు. మెస్సీతో కలిసి ఆడిన వారిలో అంతుపట్టలేని ఆనందం కనిపించింది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి మనవడు కూడా సందడి చేశాడు. అతని వైపు కూడా మెస్సీ రెండు పాస్లు ఇవ్వడం విశేషం. స్టాండ్స్లోకి బంతులు... స్టేడియంలో అభిమానులను బాగా అలరించి వారంతా పూర్తిగా ఎంజాయ్ చేసింది మాత్రం మెస్సీ స్పెషల్ కిక్లతోనే. ఆ సమయంలో మాత్రం స్టేడియంలో పూర్తి స్థాయిలో హోరెత్తిపోయింది. అతను ప్రత్యేకంగా పెనాల్టీలు ఆడకపోయినా... నిర్వాహకులు ఇచ్చిన బంతులను తనదైన శైలిలో కిక్లతో స్టాండ్స్లోకి పంపించాడు. బంతిని అందుకొని అర్జెంటీనా స్టార్ కిక్కు సిద్ధమైన ప్రతీ సారి ఉప్పల్ ఊగిపోయింది. ఆ బంతులను అందుకోవడంలో స్టాండ్స్లో ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగబడ్డారు. కానీ కొందరు అదృష్టవంతులకే ఆ అవకాశం దక్కింది! ఉల్లాసంగా...ఉత్సాహంగా... మెస్సీ మొత్తం ‘షో’లో అతను మైదానంలో గడిపిన తీరే చెప్పుకోదగ్గ విశేషం. అక్కడ ఉన్నంతసేపు అతను చాలా ఉత్సాహంగా, నవ్వుతూ గడిపాడు. ముందుగా ప్రేక్షకుల హర్షధ్వానాలతో మైదానంలోకి రావడం మొదలు చివరి వరకు అతను దీనిని కొనసాగించాడు. ఉదయం కోల్కతాలో రసాభాసగా మారిన ఈవెంట్లో పూర్తి అసౌకర్యంగా కనిపించిన అతను హైదరాబాద్లో మాత్రం అలాంటి ఛాయలు కూడా కనపడనివ్వలేదు. ఇరు జట్ల ఆటగాళ్లతో కరచాలనం, రేవంత్తో ఆడిన కొద్దిసేపు, ఆపై చిన్నారులతో ఆట, స్టాండ్స్లోకి కిక్ కొడుతూ ఉత్సాహం నింపడం, చివర్లో గ్రూప్ ఫోటోలు... ఇలా ఎక్కడైనా అతనిలో చిరునవ్వు చెక్కుచెదర్లేదు. ఎక్కడా ఎలాంటి అసహనాన్ని ప్రదర్శించలేదు. ఆఖర్లో ‘హైదరాబాద్కు రావడం సంతోషంగా ఉంది. మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు’ అంటూ కృతజ్ఞతలు చెప్పడం వరకు చూస్తే అతను కూడా హైదరాబాద్ టూర్ను బాగానే ఎంజాయ్ చేసినట్లు కనిపించాడు. ఆఖర్లో మెస్సీకి ముఖ్యమంత్రి జ్ఞాపిక అందించగా, స్వారెజ్కు రాహుల్ గాంధీ జ్ఞాపిక ఇచ్చారు. వీరిద్దరికీ మెస్సీ తన ఆటోగ్రాఫ్తో కూడిన జెర్సీలను అందించాడు. -
కోల్కతా మెస్సీ ఈవెంట్ : టికెట్ ధరలు వాపసు
కోల్కతా, సాక్షి: కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్ బాల్ లెజెండ్ లియెనెల్ మెస్సీ కార్యక్రమం గందరగోళంగా మారింది. తమ అభిమాన క్రీడాకారుడిని చూడటానికి వచ్చేందుకు నిర్వహణా లోంపతో జనం తీవ్ర నిరాశకు లోనయ్యారు. అదీ 20 నిమిషాల్లోనే లియోనెల్ మెస్సీ వేదిక నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహించిన అభిమానులు సాల్ట్ లేక్ స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. చివరికి పోలీసుల జోక్యంతోవారిని అదుపు చేశారు. అయితే ఎంతో ఖరీదు పెట్టి టికెట్లను కొని, దూర ప్రాంతాలనుంచి వచ్చినప్పటికీ, కనీసం మెస్సీ ముఖం కూడా చూడలేకపోయామని చాలామంది అభిమానులు ఆగ్రమం వ్యక్తం చేశారు.టికెట్ డబ్బులు వాపసుమరోవైపు లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025 నిర్వాహకుడిని అరెస్టు చేశారు. కోల్కతాలో విలేకరులతో మాట్లాడుతూ అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) లా అండ్ ఆర్డర్ జావేద్ షమీమ్ ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. అంతేకాదు అభిమాలను టికెట్ రుసుమును నిర్వాహకులు వెనక్కి ఇస్తారని కూడా ఆయన హామీ ఇచ్చారు. అయితే ఈ రీఫండ్ ఎలా జరుగుతుంది అనేది పరిశీలించాలన్నారు.చదవండి: రూ. 12వేలు పోసాం...కనీసం ముఖం కూడా చూడలేదు, ఫ్యాన్స్ పైర్#WATCH | Kolkata: On the Chaos at Messi's Kolkata event, Additional Director General (ADG) Law and Order Jawed Shamim says, "There is normalcy now. The second part is the investigation; the FIR has been lodged, and the chief organiser has been arrested... I'm telling you, they… pic.twitter.com/GRqz03wPvp— ANI (@ANI) December 13, 2025 దీనిపై స్పందించిన రాష్ట్ర గవర్నర్ సీవీ ఆనంద బోస్ కోల్కతా క్రీడాభిమానులకు ఇదొక చీకటి రోజుగా వ్యాఖ్యానించారు. నిర్వాహక లోపం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనీ, దీనికి నిర్వాహకులే పూర్తి బాధ్యత వహించాలన్నారు. అలాగే ముందుజాగ్రత్తలు తీసుకోని పోలీసు అధికారును సస్పెండ్ చేయాలని కూడా అన్నారు. దీనిపై తక్షణమే విచారణ జరిపి, దోషులను అరెస్టు చేయాలన్నారు.ఈ కార్యక్రమానికి టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపసు ఇవ్వాలని, స్టేడియం ,ఇతర బహిరంగ ప్రదేశాలకు జరిగిన నష్టానికి నిర్వాహకులపై ఛార్జీలు విధించాలని, పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని గవర్నర్ అన్నారు.ఇదీ చదవండి: 90 ఏళ్లకు మించి బతుకుతామా? ఈ ఐదు పరీక్షలు నెగ్గితే! -
హైదరాబాద్కు మెస్సీ.. పూర్తి షెడ్యూల్ ఇదే
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన కొనసాగుతోంది. మరి కాసేపటిలో హైదరాబాద్కు మెస్సీ చేరుకోనున్నాడు. కోల్కతా స్టేడియంలో ఉద్రిక్త నెలకొన్ని నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఉప్పల్ స్టేడియంతో పాటు మెస్సీ ప్రయాణించే మార్గాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మెస్సీ హైదరాబాద్ షెడ్యూల్పై ఓ లుక్కేద్దాం.హైదరాబాద్లో మెస్సీ షెడ్యూల్కోల్కతా నుంచి మెస్సీ 4 గంటల సమయంలో హైదరాబాద్లో అడుగుపెట్టనున్నాడు. శంషాబాద్ విమానశ్రాయం నుంచి నేరుగా తాజ్ ఫలక్నుమా ప్యాలెస్కు వెళ్లనున్నారు. అక్కడ గంటపాటు అభిమానులతో ప్రత్యేకమైన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గోనున్నాడు. అనంతరం హోటల్లో విశ్రాంతి తీసుకోన్నాడు.👉ఆ తర్వాత సాయంత్రం 7:30 గంటలకు ఉప్పల్ స్టేడియంకు చేరుకుంటాడు.👉7:50 నిమిషాలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రారంభం కానుంది.👉8:6 నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిచ్పైకి ఎంట్రీ ఇవ్వనున్నారు.👉8:6 నిమిషాలకు మెస్సీ ఎంట్రీ ఉండనుంది.👉8:8 నిమిషాలకు మెస్సీ సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ ఎంట్రీ ఇవ్వనున్నారు.👉 8:10 నిమిషాలకు హార్డ్ స్టాప్ ఉండనుంది👉8:13 నిమిషాలకు పెనాల్టీ షూటౌట్👉8:15 నిమిషాలకు పిల్లలతో కలిసి మెస్సీ గ్రూపు ఫోటో దిగనున్నాడు.👉8:18 నిమిషాలకు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మైదానంలో రానున్నారు.👉8:38 నిమిషాలకు మెస్సీ, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కలిసి పరేడ్ వాక్లో పాల్గోనున్నారు.👉రాత్రి 9 గంటల సమయంలో మెస్సీకి సన్మానం చేయనున్నారు.👉ఆ తర్వాత మెస్సీ హైదరాబాద్ నుంచి వెళ్లిపోనున్నాడు.చదవండి: IND vs SA: 'టాస్ వేయడం ఒక్కటే అతడి పనికాదు' -
14 ఏళ్ల తర్వాత ఇండియాలో అడుగు పెట్టిన లియోనెల్ మెస్సీ
-
70 అడుగుల విగ్రహం.. మెస్సీ తొలి రియాక్షన్ ఇదే!
మెస్సీ.. మెస్సీ.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఇదే పేరు వినిపిస్తోంది. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం ది గోట్ టూర్లో భాగంగా భారత్కు చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు కోల్కతా విమానాశ్రయంలో అడుగుపెట్టిన మెస్సీకి ఘన స్వాగతం లభించింది. తమ ఆరాధ్య ఆటగాడిని చూసేందుకు వేలాది సంఖ్యలో అభిమానులు ఎయిర్పోర్ట్కు తరలివచ్చారు. మెస్సీతో పాటు అతని ఇంటర్ మియామీ జట్టు సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ కూడా ఇండియా టూర్కు వచ్చారు. ది గోట్ రాకతో కోలకతా సాకర్ సిటీని తలపిస్తోంది. ఎక్కడ చూసిన మెస్సీ కటౌట్లే కన్పిస్తున్నాయి. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ.. కోల్కతా లేక్ టౌన్లోని శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్లో ఏర్పాటు చేసిన 70 అడుగుల విగ్రహాన్ని వర్చువల్గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెస్సీతో పాటు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ పాల్గోన్నారు.అయితే తన విగ్రహాం ఏర్పాటుపై మెస్సీ చాలా సంతోషంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ మంత్రి, శ్రీ భూమి స్పోర్టింగ్ క్లబ్ అధ్యక్షుడు సుజిత్ బోస్ తెలిపారు. "మేము ఇప్పటికే మెస్సీ మేనేజర్తో మాట్లాడాము. ఈ రోజు మెస్సీని కలుస్తాము. తన విగ్రహాన్ని నిర్మించేందుకు అతడు అనుమతి ఇచ్చాడు.తన విగ్రహంపై కూడా మెస్సీ సంతోషంగా ఉన్నాడు. ఇది చాలా పెద్ద విగ్రహం. 70 అడుగుల ఎత్తు ఉంది. ప్రపంచంలో మెస్సీకి ఇంత పెద్ద విగ్రహం మరొకటి లేదు. అతడి రాకతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారని" సుజిత్ బోస్ ఎఎన్ఐతో పేర్కొన్నారు.City of Joy welcomes the G.O.A.T Lionel Messi enters a packed Salt Lake Stadium #MessiInIndia #Messi𓃵 pic.twitter.com/zGdlRFQPUL— Kamit Solanki (@KamitSolanki) December 13, 2025 -
మెస్సీ మేనియా!
సాక్షి, హైదరాబాద్: ఎన్నాళ్లో వేచిన సాయంత్రం.. ఈ రోజే సాకారం.. నగరమంతా మంత్రముగ్ధం.. ప్రేక్షకుల కేరింతలు.. అభిమానుల కోలాహలం.. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ మెస్మరైజ్లో మునిగితేలే అపూర్వ ఘట్టం.. భాగ్య నగరం క్రీడా స్ఫూర్తితో ఓలలాడే అరుదైన సమయం.. శనివారం ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ మైదానం వేదిక కానుంది. అర్జెంటీనా సూపర్స్టార్ లియోనెల్ మెస్సీ పాల్గొనే ప్రత్యేక మ్యాచ్ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా మెస్సీతో కలిసి 20 నిమిషాల పాటు మ్యాచ్లో పాల్గొననుండటం మరో విశేషం. భావి ఫుట్బాల్కు నాంది.. ప్రస్తుతం హైదరాబాద్లో క్రికెట్, టెన్నిస్, హాకీ, బ్యాడ్మింటన్, ఆర్చరీ, బాక్సింగ్ వంటి క్రీడలకు మంచి అభిమాన వలయం ఉన్నప్పటికీ, ఫుట్బాల్ అంతగా పెద్ద స్థానాన్ని సంపాదించలేదు. అయితే.. మెస్సీ వంటి అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారుడు, అంతర్జాతీయ ప్రమాణం ఉన్న ఈవెంట్ ఇంతకుముందు లేకపోవడంతో ఈ మ్యాచ్ నగరానికి భవిష్యత్ ఫుట్బాల్ అభివృద్ధికి నాందిగా మారుతుందనే విశ్లేషణ నగర క్రీడాభిమానుల్లో వినిపిస్తోంది. అంబరాన్నంటే అతిపెద్ద సంబరం.. ⇒ మ్యాచ్లో మెస్సీతో పాటు లూయిస్ సూయారేజ్, రోడ్రిగో డి పాల్ వంటి అంతర్జాతీయ స్టార్లు పాల్గొంటారు. ఈ మ్యాచ్తో నగరంలో ఫుట్బాల్ పట్ల ఆసక్తిని పెంచే ప్రేరణగా భావిస్తూ, పాఠశాలలు, యూనివర్సిటీలలో ఫుట్బాల్ క్లబ్లు, ట్రైనింగ్ సెషన్ల పట్ల అభిరుచిని పెంచే అవకాశాలు పెరగనున్నాయి. హైదరాబాద్లో ఇప్పటి వరకు బ్యాడ్మింటన్, క్రికెట్ ప్రధానంగా ఉండగా.. ఫుట్బాల్కు పెద్ద సంబరంగా ఈ ఈవెంట్ నిలుస్తోంది. ⇒ మెస్సీ వంటి ప్రపంచ విజేత కావడంతో ఫుట్బాల్ అంటే అభిమానమున్న యువతకు ఆదర్శంగా మారనుంది. మెస్సీ కొత్త క్రీడా దశదిశలను నిర్దేశించనున్నారు. ప్రత్యేకించి యువ ఆటగాళ్లలో ఫుట్బాల్ శిక్షణ, స్థానిక క్లబ్లు, క్రీడా స్థాయి పెంచే అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా, మెస్సీ ఫుట్బాల్ క్లినిక్ ద్వారా చిన్న పిల్లలు, యువతకు అవకాశం ఇస్తున్నందున, స్థానిక క్రీడా సంబంధిత ప్రమాణాలు పెరిగేందుకు ఇది పెద్ద ప్రేరణగా ఉండనుందని క్రీడా విశ్లేషకుల అభిప్రాయం. మొత్తంగా.. నగరంలో మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కేవలం ఒక ఆట మాత్రమే కాకుండా, ఇక్కడి క్రీడా సంప్రదాయానికి కొత్త చైతన్యం తీసుకొచ్చే అవకాశం వంటిదేనని చెప్పుకోవచ్చు. -
హైదరాబాద్కు మెస్సీ ‘కిక్’
ఓ మారడోనా... ఓ పీలే... ఓ డుంగా... ఓ రొనాల్డిన్హో... వీళ్ల సరసన నిలిచేందుకు తాజాగా అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (జీఓఏటీ) టూర్ ఆఫ్ ఇండియా’లో ఓ పండుగలా దిగి వస్తున్నాడు. అభిమానుల్ని ‘కిక్’ ఎక్కించనున్నాడు. అతి కొద్దిమంది ఎంపిక చేసిన వారితో కలిసి విందు కూడా చేయబోతున్నాడు. ఫొటోలు దిగబోతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్ స్టార్ ఇంత తీరిగ్గా భారత్కు రావడం ఇదే మొదటిసారి. గతంలో 14 ఏళ్ల క్రితం వచ్చాడు. కానీ వచ్చిన పని మాత్రమే చూసుకొని (అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి) వెళ్లాడు. కానీ ఇప్పుడలా కాదు... పని గట్టుకొని మరీ తన భారతీయ అభిమాన గణాన్ని అలరించేందుకే వస్తున్నాడు. సాక్షి, హైదరాబాద్: మెస్సీ... మెస్సీ... మెస్సీ... కొన్ని రోజులుగా బంగారం ధరల కంటే, స్టాక్ మార్కెట్ సూచీల కంటే, రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన కంటే కూడా పతాక శీర్షికల్లో ఎక్కుతున్న పేరిది. అందరి నోటా ఇదే మాట. ఏ నలుగురు క్రీడాభిమానులు కలిసినా ఇదే ముచ్చట. అధికార వర్గాలు, పోలీస్ బందోబస్తు (4 నగరాలకు సంబంధించి) ఏర్పాట్లు కూడా అతని కోసమే! అయితే ఎవరీ మెస్సీ! ఎందుకంత క్రేజ్? క్రికెట్ మతమైన భారత్లో ఓ ఫుట్బాల్ స్టార్ను ఇంతలా తలకెక్కించుకుంటారా! అంటే... అవును మరి... అతను ఆడే ఆట ఫుట్బాల్కు మన దేశంలో ప్రాచుర్యం లేకపోవచ్చు. కానీ అతను ఆడే మ్యాచ్లకు మాత్రం దేశం, రాష్ట్రం, మతంతో సంబంధం లేకుండా అభిమాన హారతులిస్తారు. నిజానికి అతను ఆడితే లోకమే చూస్తుంది. ఆ లోకంలో మనమూ ఉన్నాం. అందుకే ఆ క్రేజ్!గతంలో వచ్చి ఏం చేశాడు జగద్విఖ్యాత ఫుట్బాలర్ మెస్సీ 2011లోనూ భారత్కు వచ్చాడు. కానీ ఇది ప్రైవేట్ లేదంటే స్పాన్సర్, చారిటీ కోసం కాదు. క్రికెట్ క్రేజీ భారత్లో ఫుట్బాల్కు ప్రాచుర్యం కల్పించేందుకు ‘ఫిఫా’ ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు లయోనల్ వచ్చాడు. కోల్కతాలో సాల్ట్లేక్ మైదానంలో వెనుజులాతో జరిగిన ఈ మ్యాచ్లో మెస్సీ టీమ్ అర్జెంటీనా 1–0తో జయభేరి మోగించింది. ఈ అంతర్జాతీయ ‘ఫిఫా’ మ్యాచ్ ముగిసిన వెంటనే మరే కార్యక్రమం పెట్టుకోకుండానే అక్కడి (కోల్కతా) నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. అప్పటికి, ఇప్పటికీ తేడా ఏంటంటే అప్పుడు జట్టులో ఒకడు. ఇప్పుడు అతడొక్కడే ఆకాశమంత ఆనందం!డే–1 ఫస్ట్ హాఫ్ కోల్కతా మెస్సీ ఈవెంట్కు పెట్టిన పేరు ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’. నాలుగు నగరాల్లో ముందుగా అడుగు పెట్టేది కోల్కతాలో. అక్కడ తన 70 అడుగుల విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తాడు. భద్రతా కారణాల రీత్యా మెస్సీ ప్రత్యక్షంగా వెళ్లి రిబ్బన్ కట్ లాంటివి కాకుండా... వర్చువల్గా బస చేసిన హోటల్ నుంచే తన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటాడు. తర్వాత 10 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు జరిగే ‘యువభారతి క్రీడాంగణ్’ సత్కారానికి వెళ్తాడు. ఆ రాష్ట్ర వివిధ జిల్లాల నుంచి వచ్చిన చిన్నారులతోనూ కాసేపు ముచ్చటిస్తాడుఎవరిని కలుస్తాడు: ‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్, టీమిండియా మాజీ కెప్టెన్సౌరభ్ గంగూలీ, సీఎం మమతా బెనర్జీలతోపాటు పలువురు సెలబ్రిటీలను మెస్సీ కలుసుకుంటాడు. తర్వాత మధ్యాహ్నం 2 గంటల దాకా సాల్ట్లేక్ మైదానాన్ని మోతేక్కిస్తాడు.డే–1 సెకండ్ హాఫ్ హైదరాబాద్ మొదటి రోజే అక్కడి నుంచి సాయంత్రం 4 కల్లా మెస్సీ నేరుగా హైదరాబాద్కు చేరుకుంటాడు. విరామం లేకుండా బిజిబిజీగా షెడ్యూల్ ప్రకారం ఏర్పాటు చేసిన కార్యక్రమాల్ని పూర్తి చేసుకొని రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులతో కలిసి ‘గోట్ కప్’ ఫుట్బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడతాడు. ఎవరిని కలుస్తాడు: ఫలక్నుమా ప్యాలెస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చే విందులో మెస్సీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతారు. డే–2 ముంబై పర్యటనలో రెండో రోజంతా వాణిజ్య రాజధాని ముంబైలో మెస్సీ బిజీబిజీగా గడుపుతాడు. వాంఖెడేలో చారిటీ మ్యాచ్ ఆడతాడు. ఇందులో క్రికెట్ స్టార్స్ తదితరులతో కలిసి చారిటీ మ్యాచ్ బరిలోకి దిగుతాడు. తర్వాత ఫ్యాషన్ షోలో స్వయంగా పాల్గొని ర్యాంప్ వాక్ చేయనున్నాడు. ఇది ముగిసిన వెంటనే ఖతర్–2022 ప్రపంచకప్ సాకర్కు సంబంధించిన వేలం జరుగుతుంది. ఇందులో మెస్సీ ఈ మెగా ఈవెంట్లో వేసుకున్న జెర్సీలు, కిట్లను వేలం వేయనున్నారు. ఎవరిని కలుస్తాడు: సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్, ‘హిట్మ్యాన్’ రోహిత్ శర్మ, శుబ్మన్ గిల్లతో చారిటీ మ్యాచ్, బాలీవుడ్ స్టార్స్ జాన్ అబ్రహాం, కరీనా కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులతో ర్యాంప్ వాక్ చేస్తాడు.డే–3 ఢిల్లీ మూడో రోజు మెస్సీ దేశ రాజధానికి విచ్చేస్తాడు. ఇక్కడ అరుణ్ జైట్లీ స్టేడియంలో నిర్వహించే ఫుట్బాల్ శిక్షణ కార్యక్రమంలో ప్రతిభావంతులైన భారత చిన్నారులను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగమవుతాడు. ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఢిల్లీ వాసుల్ని అలరించనున్నాడు. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో కలిసి పెనాల్టీ కిక్ షోలో పాల్గొంటాడు. సాకర్ ప్రియుల్ని ఉత్సాహపరిచే ఈవెంట్లలో భాగమవుతాడు. ఎవరిని కలుస్తాడు: ప్రముఖ సెలబ్రిటీలను కలిసాక... మెస్సీ ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలుసుకొని ఫుట్బాల్ ముచ్చటలో భాగమవుతాడు.» దేశంలో సాకర్ దిగ్గజం గడిపేది 72 గంటలే! కానీ.... ఈ కాస్త సమయంలోనే తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర దిక్కుల్ని కవర్ చేయడమే అతిపెద్ద విశేషం. » కోల్కతా (తూర్పు), హైదరాబాద్ (దక్షిణ), ముంబై (పశ్చిమ), ఢిల్లీ (ఉత్తర) నగరాల్లో ఊపిరి సలపని బిజీ బిజీ షెడ్యూల్లో పాల్గొననున్నాడు. » నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాటామంతీ కలిపాక ఆఖర్లో ఢిల్లీలోని ప్రధాని నరేంద్ర మోదీతో జరిగే భేటీతో ఈ పర్యటన ముగుస్తుంది. » భారత టెస్టు, వన్డే కెప్టెన్శుబ్మన్ గిల్... దర్మశాలలో 14న మ్యాచ్ ముగిసిన వెంటనే తన ఫేవరెట్ ఫుట్బాలర్ను కలుసుకోనున్నాడు. » ఈ పర్యటన పూర్తిగా భారత సాకర్ ప్రియుల్ని అలరించడానికే తప్ప సీరియస్ ఫుట్బాల్ మ్యాచో, లేదంటే ఫ్రెండ్లీ మ్యాచో ఆడేందుకు మాత్రం కాదు. » ఫ్యాన్స్కు ఇది కాస్త లోటే అయినా... బోలెండత వినోదాన్ని ఈ నాలుగు నగరాల్లో పంచనున్నాడు. » కోల్కతాలో 78 వేల సీటింగ్ సామర్థ్యమున్న సాల్ట్లేక్ స్టేడియం కిక్కిరిసిపోనుంది. »‘గోట్ టూర్’ మొదలవుతోందే బెంగాల్లో... శనివారం ఉదయమే స్టేడియమంతా నిండిపోతోంది. 45 నిమిషాల పాటు మెస్సీ స్టేడియంలో సరదాగా ఆడుతూ పాడుతూ చేసే కిక్స్, ఫ్రీ కిక్స్ ముమ్మాటికి సాకర్ క్రేజీ బెంగాలీలను ఊపేయనున్నాయి. 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి...సింగరేణి ఆర్ఆర్9, అపర్ణ మెస్సీ ఆల్ స్టార్స్ ఈ రెండు జట్ల మధ్య 15 నిమిషాల పాటు సరదా మ్యాచ్ జరుగుతుంది. 39 వేల సీటింగ్ సామర్థ్యమున్న ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో ఇప్పటికే 27 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. నేటి ఉదయం కల్లా హౌజ్ ఫుల్ అవుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. మెస్సీతో ఫొటో సెషన్ కోసం ఇప్పటికే 60 మంది రూ. 10 లక్షల చొప్పున చెల్లించి రిజిస్టర్ చేయించుకున్నారని..., ఈ 60 మందితో మెస్సీ ఫొటోలు దిగుతారని హైదరాబాద్ గోట్ టూర్ సలహాదారు పార్వతి రెడ్డి తెలిపారు.Hello, Messi fans of Bengal and India.First exclusive video of Messi from Kolkata Airport, shared by me.Follow me for every update on the GOAT’s Kolkata tour, I’ll guide everyone on where to go to see Messi.#MessiInIndia#Messi #GOATTourIndia #GOAT #FCBarcelona pic.twitter.com/clG27zZCWt— Arjya : ) (@ArjyaNeel) December 12, 2025 -
మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్.. సీఎం రేవంత్ రెడీ (ఫొటోలు)
-
ఫుట్బాల్ ఆడిన సీఎం
మునిపల్లి (అందోల్): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్లోని వోక్సన్ యూనివర్సిటీ క్రీడాకారులతో సీఎం రేవంత్రెడ్డి ఫుట్బాల్ ఆడారు. గురువారం రాత్రి యూనివర్సిటీ క్రీడాకారులతో రెండు బ్యాచ్లతో ఆడారు.అంతకుముందు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. వర్సిటీ లోకి 6.32 గంటలకు వచ్చిన సీఎం రాత్రి 8.15 గంటలకు వెళ్లిపోయారు. రేవంత్కు వర్సి టీ యాజమాన్యం జ్ఞాపికను అందజేసింది. -
మయన్మార్ సైన్యం దాడిలో 18 మంది మృతి
బ్యాంకాక్: మయన్మార్లోని సగాయింగ్ ప్రాంతం మయకాన్ గ్రామంలో ఘోరం జరిగిపోయింది. టీ షాపులోని టీవీలో ఫుట్బాల్ మ్యాచ్ తిలకిస్తుండగా, మయన్మార్ సైన్యం వైమానిక దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది సాధారణ ప్రజలు మృతిచెందారు. ఈ నెల 5వ తేదీన జరిగిన ఈ సంఘటన వివరాలను స్థానిక స్వతంత్ర ఆన్లైన్ మీడియా సంస్థ సోమవారం వెల్లడించింది. మరో 20 మందికి గాయపడినట్లు తెలియజేసింది. ప్రజాస్వామ్య అనుకూల సాయుధ పోరాటాలపై మయన్మార్ విరుచుకుపడుతోంది. త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తాజా దాడి చర్చనీయాంశంగా మారింది. మయన్మార్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఆంగ్ సాన్ సూకీ ప్రభుత్వాన్ని 2021 ఫిబ్రవరి 1న సైన్యం కూలదోసింది. అప్పటినుంచి దేశంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. జనం భయంభయంగా బతుకుతున్నారు. -
రేవంత్ vs మెస్సీ.. ఉప్పల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించిన భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనల్ మెస్సీ మ్యాచ్ అంటే ఫుట్బాల్ ప్రేమికులు ఊగిపోతారు. హైదరాబాద్లో జరిగే మ్యాచ్ కోసం దేశం నలుమూలల నుంచి ఈ నెల 13న ఉప్పల్ స్టేడియానికి ప్రేక్షకులు భారీగా తరలివస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆయనకు ప్రత్యేక భద్రత వ్యవస్థ ఉంటుందని చెప్పుకొచ్చారు. ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ నేపథ్యంలో పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయని వాటిని పరిశీలిస్తున్నట్టు డిప్యూటీ సీఎం తెలిపారు.ఈనెల 13న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కలిసి పర్యవేక్షించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ ఉంది. తెలంగాణ రైజింగ్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు లియోనల్ మెస్సీ సైతం ఆసక్తి చూపారు. దేశం నలుమూలల నుంచి వేలాది మంది ఫుట్బాల్ క్రీడాభిమానులు మ్యాచ్ కోసం వస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రత, సౌకర్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్దేశించిన సమయం కంటే ముందే అభిమానులు స్టేడియంలోకి చేరుకోవాలి. వారికి కేటాయించిన సీట్లలో కూర్చోవాలి. ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఫుట్బాల్ క్రీడా అభిమానులకు అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశాం. ఫుట్బాల్ మ్యాచ్ ఏర్పాట్లను రాచకొండ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టి భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అలాగే, గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తులు, సంస్థల అధిపతులు, సీఈవోలు వస్తున్నారు.ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లను పోలీసులు, హెచ్సీఏ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం మెస్సీ.. వచ్చి, వెళ్లే మార్గాలు, ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర వీఐపీలు వచ్చి వెళ్లే మార్గాలను డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా పరిశీలించారు. మొత్తంగా హాజరవుతున్న అభిమానుల సంఖ్య, సులభంగా వచ్చి వెళ్ళేందుకు ఏర్పాటుచేసిన గేట్ల సంఖ్య, పార్కింగ్ ప్రాంతాలను పర్యవేక్షించారు. క్రీడా అభిమానుల కోసం మెట్రో, ఆర్టీసీ వంటి రవాణా సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తున్న రవాణా సౌకర్యాలను డిప్యూటీ సీఎం సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. -
రాష్ట్రంలో రెండు ‘ఫిఫా’ అకాడమీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటనలు చేయనుంది. దేశ తొలి మహిళల ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ ఫుట్బాల్ అకాడమీతోపాటు పురుషుల రెండో ఫిఫా–ఏఐఎఫ్ఎస్ ఫుట్బాల్ అకాడమీని రాష్ట్రంలో ఏర్పాటు చేసే అంశంపై ప్రకటన చేయనుంది. ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్లో ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ (ఫిఫా), ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) భాగస్వామ్యంతో ఈ రెండు అంతర్జాతీయ స్థాయి ఫుట్బాల్ అకాడమీల ఏర్పాటుపై ప్రకటన వెలువడనుంది. ఫిఫా మహిళల ఫుట్బాల్ తొలి అకాడమీ హాంగ్కాంగ్లో ఏర్పాటవగా రెండోది తెలంగాణలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్ నిర్వహణపైనా సమ్మిట్లో ప్రభుత్వం ప్రకటన చేయనుంది. అతిథులకు ప్రత్యేక బాస్కెట్లు ప్రపంచం నలుమూలల నుంచి సమ్మిట్కు హాజరుకానున్న అతిథులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బాస్కెట్లను అందించి స్వాగతం పలకనుంది. కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు హైదరాబాద్కు చేరుకున్న వెంటనే వారికి ఎప్పటికీ గుర్తిండిపోయేలా సంప్రదాయ కిట్లు, రుచికరమైన వంటకాలతో కూడిన ఫుడ్ బాస్కెట్లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతి బాస్కెట్లో పోచంపల్లి ఇక్కత్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లోగోతో కూడిన సావనీర్ కిట్లు, పోచంపల్లి శాలువా, చేర్యాల మాస్క్ (పెయింటిగ్స్), హైదరాబాదీ అత్తర్, ముత్యాలతో చేసిన ఆభరణాలు ఉండనున్నాయి. అలాగే మహువా లడ్డూలు, సకినాలు, అప్పాలు, బాదామ్ కీ జాలి వంటి తెలంగాణ సంప్రదాయ వంటకాలు ఉండనున్నాయి. ఈ సమ్మిట్ ద్వారా తెలంగాణ కళలు, సంస్కృతి, వంటకాల ప్రత్యేకతను ప్రపంచ వేదికపై రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించనుంది. రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వివిధ రాష్ట్రాల సీఎంలను ప్రత్యేకంగా ఆహ్వానించే బాధ్యతను మంత్రులకు సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. జమ్మూకశ్మీర్, గుజరాత్ సీఎంలను మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆహ్వానించనుండగా మంత్రి దామోదర రాజనర్సింహకు పంజాబ్, హరియాణా సీఎంలను ఆహ్వానించనున్నారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏపీ, మంత్రి శ్రీధర్బాబు కర్ణాటక, తమిళనాడు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి యూపీ సీఎంను ఆహ్వానం పలకనున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్కు రాజస్తాన్, మంత్రి కొండా సురేఖకు ఛత్తీస్గఢ్, మంత్రి సీతక్కకు పశ్చిమ బెంగాల్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్యప్రదేశ్, మంత్రి జూపల్లి కృష్ణారావుకు అస్సాం, మంత్రి వివేక్ వెంకటస్వామికి బిహార్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్కు హిమాచల్ ప్రదేశ్, మంత్రి వాకిటి శ్రీహరికి ఒడిశా, మంత్రి అజహరుద్దీన్కు మహారాష్ట్ర సీఎంలను ఆహ్వానించే బాధ్యతను సీఎం రేవంత్ అప్పగించారు. సీఎంలతోపాటు ఆయా రాష్ట్రాల ఎంపీలను సైతం ఆహ్వానించాలని కోరారు. -
కలిసికట్టుగా పోరాడి భారత్ను గెలిపించిన కుకి-మీతై ఫుట్బాలర్లు
వచ్చే ఏడాది సౌదీ అరేబియాలో జరిగే ఆసియా కప్కు అర్హత సాధించడం ద్వారా భారత అండర్-17 పురుషుల ఫుట్బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆదివారం జరిగిన క్వాలిఫయర్ ఫైనల్లో ఆసియా పవర్ హౌస్ ఇరాన్ను ఓడించడం ద్వారా ఈ ఘనత సాధించింది. అహ్మదాబాద్లోని ఈకే ఏరినాలో జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 2-1 తేడాతో ఇరాన్ను చిత్తు చేసింది. గత 20 ఏళ్లలో భారత్ ఆసియా కప్ ఫైనల్స్కు చేరడం ఇది మూడోసారి మాత్రమే. ఆసియా కప్లో భారత్ ఇదే సంచలన ప్రదర్శనలు చేసి టాప్-4లో నిలిస్తే, 2027 FIFA U-17 వరల్డ్ కప్ (ఖతార్) అర్హత సాధిస్తుంది. మ్యాచ్ విషయానికొస్తే.. మ్యాచ్ 19వ నిమిషంలో ఇరాన్ గోల్ చేసి ముందంజలోకి వెళ్లింది. హాఫ్ టైమ్కు ముందు దల్లాల్ముయోన్ గాంగ్టే (కుకి) పెనాల్టీని గోల్గా మలిచి స్కోర్ను సమం చేశాడు. రెండో అర్దభాగంలో గున్లైబా వాంక్హైరక్పం (మీతై) కౌంటర్ అటాక్లో గోల్ కొట్టి భారత్ను చారిత్రక విజయం దిశగా నడిపించాడు.జాతి ఘర్షణలు పక్కకు పెట్టి దేశం కోసం పోరాడిన యువకులుమణిపూరి జాతి ఘర్షణల్లో ప్రత్యర్థులుగా పోరాడిన కుకి-మీతై తెగలకు చెందిన ఆటగాళ్లు కలిసికట్టుగా గోల్స్ చేసి భారత్ను గెలిపించారు. మణిపూర్లో 2023 నుంచి మీతై–కుకిల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. భూస్వామ్య హక్కులు, రాజకీయ ప్రతినిధిత్వం, భద్రతా సమస్యలు వంటి అంశాలపై వివాదాలు కొనసాగుతున్నాయి.కుకి అంటే ఈశాన్య భారతదేశంలోని ఓ ప్రధాన గిరిజన సమూహం. వీరి మతం క్రైస్తవం. మీతై అంటే ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రధాన జాతి సమూహం. వీరు హిందుమతాన్ని ఆచరిస్తారు. ప్రస్తుత భారత జట్టులో 9 మంది మణిపూర్ ఆటగాళ్లు ఉన్నారు. వీరిలో 7 మంది మీతై, 2 మంది కుకి తెగలకు చెందిన వాళ్లు. మణిపూర్ ఎప్పటినుంచో భారత ఫుట్బాల్కు ప్రతిభావంతుల్ని అందిస్తున్న టాలెంట్ ఫ్యాక్టరీగా కీర్తించబడుతుంది. -
మెస్సీతో మ్యాచ్.. ప్రాక్టీస్లో చెమటోడ్చిన సీఎం రేవంత్ (ఫొటోలు)
-
ఆసక్తికర పోరుకు సీఎం రేవంత్ సిద్ధం!
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ తో సీఎం రేవంత్రెడ్డి తలపడనున్నారు. అదేంటి... మెస్సీతో రేవంత్ తలపడటమేంటని అనుకుంటున్నారా...ఇద్దరూ కలిసి ఫుట్బాల్ మ్యాచ్ ఆడనున్నారు. మ్యాచ్ ఆడటమే కాదు.. ఇద్దరూ రెండు టీంలతో ప్రత్య ర్థులుగా తలపడనున్నారు. ఇందుకు ఈనెల 13న ఉప్పల్ స్టేడియం వేదిక కానుంది. మ్యాచ్ ఖరారైందని, ఆర్ఆర్–9, ఎల్ ఎం–10 టీంల మధ్య ఫ్లడ్లైట్ల వెలుతురులో ఈ మ్యాచ్ జరుగుతుంది. -
హైదరాబాద్కు మెస్సీ..ఫోటో దిగాలంటే రూ. 10 లక్షలు! (ఫొటోలు)
-
రొనాల్డో కల నెరవేరిన వేళ.. పోర్చు‘గోల్’ చేరింది!
దోహ: పోర్చుగల్ ఫుట్బాల్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు క్రిస్టియానో రొనాల్డో. వరుసగా ఆరో ప్రపంచకప్ ఆడబోతున్న రొనాల్డోకు ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే ఉంది. అయితే రొనాల్డో కలను పోర్చుగల్ యువ జట్టు మరో రూపంలో నెరవేర్చింది. తొలిసారి అండర్–17 ప్రపంచకప్లో పోర్చుగల్ జట్టు చాంపియన్గా అవతరించింది. సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన పోర్చుగల్ యువ జట్టు గురువారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో 1–0 గోల్ తేడాతో ఆ్రస్టియాపై విజయం సాధించింది. ఈ టోర్నీ నిర్వహించడం ఇది 20వ సారి కాగా... పోర్చుగల్ తొలిసారి విజేతగా నిలిచింది. మూడో స్థానం కోసం జరిగిన ‘షూటౌట్ పోరు’లో ఇటలీ 4–2 గోల్స్ తేడాతో బ్రెజిల్పై విజయం సాధించింది. తుదిపోరులో పోర్చుగల్ జట్టు తరఫున అన్సియో కాబ్రాల్ (32వ నిమషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఈ టోర్నీలో కాబ్రాల్కు ఇది ఏడో గోల్ కావడం విశేషం. ఆ్రస్టియాకు చెందిన జొహన్నెస్ మోసెర్ 8 గోల్స్తో ‘గోల్డెన్ బాల్’ అవార్డు అందుకున్నాడు. మొత్తం 48 దేశాల జట్లు పోటీపడిన ఈ టోర్నమెంట్లో తొలి మూడు స్థానాలు యూరప్ జట్లే దక్కించుకోవడం విశేషం. ఖతర్ వేదికగా జరిగిన ఈ టోర్నీ లీగ్ దశలో గ్రూప్ ‘బి’లో రెండో స్థానంలో నిలిచిన పోర్చుగల్ ఆ తర్వాత 2–1 గోల్స్ తేడాతో బెల్జియంపై, ప్రిక్వార్టర్స్లో 5–0తో మెక్సికోపై గెలిచింది. క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ జట్టు 2–0 గోల్స్ తేడాతో స్విట్జర్లాండ్ను చిత్తు చేసింది. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో షూటౌట్లో 6–5 గోల్స్ తేడాతో నాలుగుసార్లు చాంపియన్ బ్రెజిల్పై గెలిచి ఫైనల్లో అడుగు పెట్టింది. తుదిపోరులో సంపూర్ణ ఆధిపత్యం కనబరుస్తూ ప్రపంచకప్ ట్రోఫీ కైవసం చేసుకుంది. -
చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) (పోర్చుగల్) చరిత్ర సృష్టించాడు. ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో (FIFA World Cup 2026 Qualifiers) అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా అవతరించాడు. హంగేరీతో జరిగిన మ్యాచ్లో రెండు గోల్స్ చేసిన అనంతరం ఈ ఘనత సాధించాడు. గతంలో ఈ రికార్డు గ్వాటెమాలా ఆటగాడు కార్లోస్ రుయిజ్ పేరిట ఉండేది. రూయిజ్ ఖాతాలో 39 గోల్స్ ఉండగా.. తాజా ప్రదర్శన అనంతరం రొనాల్డో గోల్స్ సంఖ్య 41కి చేరింది.వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ చరిత్రలో టాప్-5 గోల్ స్కోరర్లు..రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)- 41కార్లోస్ రుయిజ్ (గ్వాటెమాలా)- 39లియోనెల్ మెస్ (అర్జెంటీనా )- 36అలీ దయీ (ఇరాన్)- 35లెవండోవ్స్కీ (పోలాండ్)- 33కాగా, లిస్బన్ వేదికగా పోర్చుగల్, హంగేరి మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున నమోదైన రెండు గోల్స్ రొనాల్డోనే చేశాడు. ఈ రెండు గోల్స్తో రొనాల్డో ఓవరాల్ గోల్స్ సంఖ్య 947కు చేరింది. ప్రత్యేకించి అంతర్జాతీయ మ్యాచ్ల్లో అతని గోల్స్ సంఖ్య 143కు పెరిగింది. 40 ఏళ్ల వయసులో రొనాల్డో రేసు గుర్రంలా పరిగెడుతూ 1000 గోల్స్ దిశగా దూసుకెళ్తున్నాడు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయర్స్లో పోర్చుగల్ గ్రూప్-ఎఫ్ టాపర్గా కొనసాగుతోంది. నవంబర్ 14న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్లో గెలిస్తే, ప్రపంచకప్కు అర్హత సాధిస్తుంది.చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్ -
అమెరికాలో కాల్పుల కలకలం.. ఆరుగురు దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. మిసిసిప్పీ రాష్ట్రంలోని ఓ పాఠశాల సమీపంలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 12మందికిపైగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి మిస్సిస్సిప్పి రాష్ట్రం లేలాండ్ నగరంలో అర్ధరాత్రి ఫుట్బాల్ ఆట ముగిసిన తర్వాత 18ఏళ్ల బాలుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆరుగురు మరణించగా, 12 మంది గాయపడ్డారని బీబీసీ నివేదించింది. శుక్రవారం రాత్రి రద్దీగా ఉండే సమయంలో లేలాండ్ ప్రధాన వీధిలో కాల్పులు జరిగాయని నగర మేయర్ మేయర్ జాన్ లీ తెలిపారు. ఈ కాల్పుల ఘటనకు ముందు ఓ స్కూల్ సమీపంలో పాఠశాలల పూర్వ విద్యార్థులను స్వాగతించే వార్షిక అమెరికన్ సంప్రదాయ ఫుట్బాల్, ఇతర కమ్యూనిటీ ఈవెంట్లు జరిగాయి. ఈ ఈవెంట్లో నిందితుడు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పులతో వేడుక విషాదంగా ముగిసింది. అధికారులు దర్యాప్తును కొనసాగిస్తున్నాయని, నిందితుల్ని గుర్తించేందు ప్రత్యక్షసాక్షులు ముందుకు రావాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉంటే, కాల్పులు జరిపింది 18 ఏళ్ల యువకుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానితుడి కోసం పోలీసులు గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. -
టీ తాగారు.. భారత్ దెబ్బకు తోకముడిచారు!.. పాక్ బుద్ధి మారదు!
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత మైదానంలో పాకిస్తాన్ ఆటగాళ్ల వెకిలి చేష్టలు ఎక్కువయ్యాయి. భారత్పై తమదే పైచేయి అని నమ్మించే ప్రయత్నంలో బొక్కబోర్లా పడుతున్నా వారి తీరు మాత్రం మారడం లేదు. సీనియర్ క్రికెటర్లకు తామేమీ తీసిపోమన్మట్లుగా ఫుట్బాల్ యువ ఆటగాళ్లు కూడా ఓవరాక్షన్తో వివాదాలకు కారణమవుతున్నారు.కాగా జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందుకు భారత ఆర్మీ ఉగ్రమూకలకు గట్టి కౌంటర్ ఇచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ‘ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)’తో నేలమట్టం చేసింది. అయితే, ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం దాడి చేస్తే.. అందుకు ప్రతిగా పాక్ ఆర్మీ ముందుకు వచ్చి మరోసారి తమ బుద్ధిని చాటుకుంది. ఈ క్రమంలో పాక్తో అన్ని సంబంధాలు.. ముఖ్యంగా క్రీడల్లోనూ వారితో ఎలాంటి పోటీ వద్దంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే, ఆసియాకప్-2025 (Asia Cup 2025) టోర్నీలో మాత్రం టీమిండియా పాక్తో ఆడేందుకు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది. బహుళ దేశాలు పాల్గొంటున్న టోర్నీ కావున ఇందుకు సమ్మతించింది.పప్పులు ఉడకపోవడంతోఈ నేపథ్యంలో లీగ్ దశలో పాక్ ఆటగాళ్లతో టీమిండియా కరచాలనానికి నిరాకరించింది. దీనిని అవమానంగా భావించిన పాక్.. ఐసీసీకి ఫిర్యాదు చేసింది. తమ పప్పులు ఉడకపోవడంతో ఆదివారం నాటి సూపర్-4 మ్యాచ్లో ఆటగాళ్లు మైదానంలో ఆటతో కాకుండా తమ చేష్టలతో కవ్వింపులకు పాల్పడ్డారు.ఇక పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అర్ధ శతకం (58) పూర్తి చేసుకోగానే.. ఏకే-47 మాదిరి బ్యాట్ ఎక్కుపెట్టి ప్రేక్షకులను కాలుస్తున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. మరోవైపు.. హ్యారిస్ రవూఫ్ (Haris Rauf).. ‘మీ యుద్ధ విమానాలను కూల్చామన్నట్లుగా’ టీమిండియా అభిమానులకు సైగ చేశాడు.టీ తాగారు.. తోక ముడిచారుతాజాగా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా పాక్కు చెందిన ఓ ఆటగాడు ఇదే తరహాలో భారత జట్టును రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కొలంబో వేదికగా దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా సోమవారం గ్రూప్-‘బి’లోని చివరి మ్యాచ్లో భారత్- పాక్ తలపడ్డాయి. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే 31వ నిమిషంలో గోల్ చేయగా.. 43వ నిమిషంలో పాక్ ప్లేయర్ మొహమ్మద్ అబ్దుల్లా ఒక గోల్ సాధించాడు. ఈ క్రమంలోనే పాక్ ఆటగాళ్లు అతి చేశారు. టీ తాగుతున్నట్లుగా అభినయిస్తూ భారత జట్టును టీజ్ చేశారు. కాగా గతంలో సర్జికల్ స్ట్రైక్స్ సందర్భంగా ఎయిర్ఫోర్స్ వింగ్ అభినందన్ వర్ధమాన్ అనూహ్య రీతిలో పాక్ ఆర్మీ చేతికి చిక్కగా.. ఆయన టీ తాగుతున్నట్లుగా ఉన్న ఫొటోను విడుదల చేసింది.అయితే, 2019 నాటి ఈ ఘటనలో అభినందన్ దాదాపు 60 గంటలపాటు పాక్ నిర్బంధంలో ఉండగా.. జనీవా ఒప్పందం ప్రకారం తిరిగి భారత్కు అప్పగించారు. ఇపుడు ఇదే విషయాన్ని గుర్తుచేస్తున్నట్లుగా పాక్ యువ ఆటగాడు వ్యవహరించడం విశేషం.భారత్ చేతిలో ఓటములేఅయితే, ఈ మ్యాచ్లో భారత్- పాకిస్తాన్ను 3-2తో ఓడించడంతో పరాజయ భారంతో దాయాది తోకముడిచింది. ఇక ఈ గెలుపుతో భారత్ గ్రూప్-బి టాపర్గా సెమీస్ చేరగా.. రెండో స్థానంలో పాక్ కూడా క్వాలిఫై అయింది. సెమీ ఫైనల్లో భారత్- నేపాల్తో, పాకిస్తాన్ బంగ్లాదేశ్తో తలపడతాయి. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ లీగ్, సూపర్ దశలో పాక్ను చిత్తు చేసింది.చదవండి: ఎవర్నీ లెక్కచేయను.. నా తీరే అంత.. నచ్చినట్లు చేస్తా: పాక్ బ్యాటర్ ఎక్స్ట్రాలుSuch a disgraceful celebration by Pakistani U17 Team at SAFF, Glad we beat them 3-2 today! pic.twitter.com/kfksfrP4h3— The Khel India (@TheKhelIndia) September 22, 2025 -
ఫుట్బాల్లోనూ పాక్పై భారత్దే పైచేయి
కొలంబో: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో పాకిస్తాన్ జట్టును భారత జట్టు చితక్కొట్టగా... మరోవైపు ఫుట్బాల్లోనూ పాకిస్తాన్ జట్టుపై భారత్ తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–17 టోర్నమెంట్లో భాగంగా పాకిస్తాన్తో సోమవార జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 3–2 గోల్స్ తేడాతో గెలిచింది. భారత్ తరఫున దలాల్మువాన్ గాంగ్టే (31వ నిమిషంలో), గున్లేబా వాంగ్ఖెరాక్పమ్ (64వ నిమిషంలో), రహాన్ అహ్మద్ (74వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. పాకిస్తాన్ జట్టుకు హంజా యాసిర్ (71వ నిమిషంలో), మొహమ్మద్ అబ్దుల్లా (43వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ విజయంతో భారత్ గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి తొమ్మిది పాయింట్లతో టాపర్గా నిలిచింది. ఆరు పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానాన్ని దక్కించుకుంది. గ్రూప్ ‘బి’ నుంచి భారత్, పాకిస్తాన్ జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి బంగ్లాదేశ్, నేపాల్ జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. ఈనెల 25న జరిగే సెమీఫైనల్స్లో బంగ్లాదేశ్తో పాకిస్తాన్; నేపాల్తో భారత్ తలపడతాయి. -
తెలంగాణ శుభారంభం
నారాయణ్పూర్ (ఛత్తీస్గఢ్): సీనియర్ మహిళల జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ రాజ్మాత జిజాబాయ్ ట్రోఫీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి పోరులో తెలంగాణ జట్టు 8–1 గోల్స్ తేడాతో ఆంధ్రప్రదేశ్పై విజయం సాధించింది. తెలంగాణ జట్టు తరఫున రంజిత దేవి (36వ, 40వ, 51వ, 60వ నిమిషాల్లో) నాలుగు గోల్స్తో అదరగొట్టింది. గుగులోత్ సౌమ్య (6వ, 25వ నిమిషంలో), పుల్లూరి సోనీ (21వ, 67వ నిమిషంలో) చెరో రెండు గోల్స్తో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున వ్యాసపురం నందిని (49వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించింది. మ్యాచ్ ఆరంభమైన ఆరో నిమిషంలోనే సౌమ్య గోల్తో ఖాతా తెరిచిన తెలంగాణ... ఇక ఏ దశలోనూ వెనక్కి తగ్గలేదు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్న సౌమ్య... రెండు గోల్స్ చేయడంతో పాటు జట్టుకు ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించింది. శనివారమే జరిగిన ఇతర మ్యాచ్ల్లో పశ్చిమ బెంగాల్ 7–0 గోల్స్ తేడాతో మేఘాలయపై, సిక్కీం 2–1తో రైల్వేస్పై, అస్సాం 7–0తో త్రిపురపై గెలుపొందాయి. ఛత్తీస్గఢ్, కర్ణాటక మధ్య మ్యాచ్ 1–1 గోల్స్తో ‘డ్రా’ కాగా... మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. తదుపరి మ్యాచ్ల్లో సోమవారం ఛత్తీస్గఢ్తో తెలంగాణ... కర్ణాటకతో ఆంధ్రప్రదేశ్ జట్లు తలపడనున్నాయి. -
ఒక్కసారి కూడా కలవలేదు.. వ్యక్తిత్వం నచ్చి రూ. 8400 కోట్ల ఆస్తి రాసిచ్చేశాడు..!
ఫుట్బాల్ ప్రపంచంలో సంచలనంగా మారిన ఓ వార్త ప్రస్తుతం అంతర్జాతీయ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బ్రెజిల్కు చెందిన ఓ 31 ఏళ్ల వ్యాపారవేత్త తన యావదాస్తిని (సుమారు ₹8,400 కోట్లు (USD 6.1 బిలియన్)) తన దేశానికే చెందిన స్టార్ ఫుట్బాలర్ నెయ్మార్కు రాసిచ్చాడు. ఈ వార్త సోషల్మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది.బ్రెజిల్లోని రియో గ్రాండ్ డో సల్కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇటీవలే మరణించాడు. అతనికి భార్య, పిల్లలు లేరు. అతనికి నెయ్మార్ అంటే అపారమైన ప్రేమ, అభిమానం. ఆ వ్యక్తి తన జీవితంలో ఒక్కసారి కూడా నెయ్మార్ను కలవలేదు. కేవలం నెయ్మార్ వ్యక్తిత్వం నచ్చి ఇదే ఏడాది జూన్లో తన యావదాస్తిని వారసత్వంగా ఇస్తున్నట్లు వీలునామా రాశాడు.ఆ విల్లో సదరు వ్యాపారవేత్త ఈ విషయాలను ప్రస్తావించాడు. నేను ఎవరి ప్రమేయం లేకుండా, ఇష్టపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు నెయ్మార్ అంటే చాలా ఇష్టం, అతనిలో నన్ను నేను చూసుకుంటాను. నెయ్మార్ చాలా నిస్వార్థమైన వ్యక్తి. ఎంత ఎదిగినా చాలా తగ్గి ఉంటాడు. అతనిలో గర్వం కొంచమైనా లేదు. నెయ్మార్ కుటుంబానికి ఇచ్చే విలువ, తండ్రితో అతని బాండింగ్ నాకు చాలా నచ్చుతుంది. అతన్ని చూసినప్పుడు నాకు నా తండ్రితో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. ఈ కాలంలో నెయ్మార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న వారిని చూడలేము. అందుకే అతనికి నా యావదాస్తి రాసిస్తున్నాను. నెయ్మార్కు నా ఆస్తి దక్కితే ఖచ్చితంగా మంచి పనికే ఉపయెగపడుతుందని సదరు వ్యాపారవేత్త తన విల్లో రాసుకొచ్చాడు.ఈ వీలునామా ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. ఈ విల్కు ఆ వ్యాపారవేత్త బంధువులు అభ్యంతరం చెప్పకపోతే అతి త్వరలో నెయ్మార్ చేతుల్లోకి ఆస్తి వస్తుంది. అయితే ఈ విల్పై నెయ్మార్ ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయం తెలిసి యావత్ ప్రపంచం నిర్ఘాంతపోతుంది. వ్యక్తిత్వం నచ్చినంత మాత్రనా, ఇంత ఆస్తిని ధారాదత్తం చేస్తారా అని జనాలు నోరెళ్లబెడుతున్నారు.వాస్తవానికి ప్రపంచం మొత్తానికి నెయ్మార్ ఓ స్టార్ ఫుట్బాలర్గా మాత్రమే తెలుసు. అతనిది చిన్నపిల్లల మనస్తత్వం అని దగ్గరి వారు అంటుంటారు. నెయ్మార్ ఆన్ఫీల్డ్, ఆఫ్ ద ఫీల్డ్ చాలా సరదాగా ఉంటాడు. సహచరులతో నెయ్మార్ చిలిపి చేష్ఠలు సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. తాజా ఉదంతంతో నెయ్మార్లోని కొత్త కోణం ప్రపంచానికి తెలిసింది. ఓ వ్యక్తి ఒక్క సారి కూడా కలవకుండానే వేల కోట్ల ఆస్తి రాసిచ్చాడంటే నెయ్మార్ వ్యక్తిత్వం ఎంత గొప్పదై ఉంటుందో ఊహించుకోవచ్చు. మొత్తానికి ఈ వార్త నెయ్మార్ను ఫుట్బాల్కు పరిచయం లేని వారికి కూడా పరిచయం చేసింది.33 ఏళ్ల నెయ్మార్ ప్రస్తుతం సాంటోస్ క్లబ్కు ఆడుతున్నాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా గత కొంతకాలంగా జాతీయ జట్టుకు (బ్రెజిల్) దూరంగా ఉన్నాడు. 2026 వరల్డ్కప్ సమయానికంతా జట్టులోకి రావాలని భావిస్తున్నాడు. అయితే కొత్త కోచ్ కార్లో అంచెలొట్టి నెయ్మార్ను జాతీయ జట్టులోకి రాకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తుంది. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
హిసర్ (తజికిస్తాన్): అందివచ్చిన అవకాశాల్ని చేజార్చుకున్న భారత ఫుట్బాల్ జట్టు అఫ్గానిస్తాన్తో మ్యాచ్ను ‘డ్రా’గా ముగించుకుంది. సీఏఎఫ్ఏ నేషన్స్ కప్ ఫుట్బాల్ టోరీ్నలో గురువారం భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య జరిగిన మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే 0–0తో ‘డ్రా’ అయ్యింది. ‘ఫిఫా’ ర్యాంకుల్లో 127వ స్థానంలో ఉన్న భారత్ తమకన్నా దిగువ ర్యాంకు 160లో ఉన్న అఫ్గానిస్తాన్పై ప్రభావం చూపలేకపోయింది. మ్యాచ్ మొత్తం మీద బంతిని తమ ఆధీనంలో ఉంచుకోవడంలోనూ విఫలమైంది. ప్రత్యర్థి గోల్ పోస్ట్పై చేసిన దాడుల్లోనూ నిరాశపరిచింది. అఫ్గానిస్తాన్ మూడుసార్లు భారత్ గోల్పోస్ట్పై గురిపెడితే... భారత్ కేవలం రెండుసార్లే గోల్ ప్రయత్నాలు చేయగలిగింది. భారత్ కన్నా అఫ్గానిస్తాన్ రక్షణ శ్రేణి మెరుగ్గా ఆడింది. తాజా ఫలితంలో భారత్ గ్రూప్ ‘బి’లో 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా ఫైనల్ చేరే అవకాశాల్ని కోల్పోయిన భారత్ ఇప్పుడు మూడు, నాలుగో స్థానాల కోసం ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. ఈ నెల 8న ఈ కాంస్య పతకపోరు జరుగుతుంది. -
ప్రియుడితో పాప్ సింగర్ ఎంగేజ్మెంట్ : రూ. 5 కోట్ల డైమండ్ రింగ్
ప్రముఖ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ తన చిరకాల ప్రియుడు ప్రముఖ అమెరికన్ ఫుట్బాల్ క్రీడాకారుడు ట్రావిస్ కెల్సీ నిశ్చితార్థం చేసుకుంది. ఈ సంతోషకరమైన వార్తను ప్రకటిస్తూ పోస్ట్ చేయడంతో ‘స్వెల్స్’ అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట సందడిగా మారింది. దీనికి తోడు టేలర్ స్విఫ్ట్ భారీ డైమండ్ ఉంగరం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 7-20 క్యారెట్లు, 18 కేరట్ల బంగారం టేలర్ స్విఫ్ట్ నిశ్చితార్థ ఉంగరం ధర ఎంత? అనే చర్చ నడుస్తోంది.'నేను కాగితపు ఉంగరాలతో నిన్ను పెళ్లి చేసుకుంటాను' అని ఒకప్పుడు పాడిన టేలర్ స్విఫ్ట్, భారీ విలువైన ఉంగరంతో ఆగస్టు 26న, తన డ్రీమ్ బోయ్ ట్రావిస్ కెల్స్తో తన నిశ్చితార్థాన్ని ప్రకటించడం విశేషంగా నిలిచింది. డిజైన్, టేలర్ స్విఫ్ట్ అభిరుచికి తగినట్టుగా ఎంతో ప్రత్యేకంగా ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ రింగ్లో పురాతన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వ జ్రాన్ని పొదిగారు. దీని విలువ సుమారు రూ. 4.8 కోట్లు.చదవండి: లైవ్ ఈవెంట్లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్పై చికిత్సప్రియురాలి కోసం ప్రత్యేకంగా ఈ ఉంగరాన్ని న్యూయార్క్కు చెందిన ఆర్టిఫెక్స్ ఫైన్ జ్యువెలరీతో కలిసి స్వయంగా డిజైన్ చేయించారటట్రావిస్ కెల్సీ . ఇందులో 7 నుంచి 10 క్యారెట్ల బరువున్న అరుదైన 'ఓల్డ్ మైన్ బ్రిలియంట్' కట్ వజ్రాన్ని 18 క్యారెట్ల బంగారంతో చేశారు. దీనిపై నిపుణులు అంచనా వేస్తున్న విలువ అక్షరాలా 5,50,000 డాలర్లు.ప్రముఖ ఆభరణాల వ్యాపారి జార్జ్ ఖలీఫ్, అలియాస్ జార్జ్ ది జ్యువెలర్ అంచనా వజ్రం దాదాపు 20 క్యారెట్ల బరువు ఉంటుంది. ఈ ఉంగరం ఖచ్చితంగా విక్టోరియన్ యుగానికి చెందినదై ఉంటుందని మరో నిపుణుడి అంచనా. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఊహలు మరింత జోరుగా వ్యాపిస్తున్నాయి. -
అందుకే ఫుట్బాల్ తీసుకొచ్చా: కొండా విశ్వేశ్వర్రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీ ఫుట్ బాల్ పాలిటిక్స్లో ట్విస్ట్ చోటు చేసుకుంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రచురితమవుతున్న అసంతృప్తి కథనాలను తోసిపుచ్చుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ వ్యవహారంపై అసంతృప్తితోనే తాను ఫుట్బాల్ గిఫ్ట్ ఇచ్చినట్లు వస్తున్న కథనాలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడాలనే తీసుకొచ్చానంటూ ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్తోనే బీజేపీకి పోటీ. రేవంత్ మంచి ఫుట్బాల్ ప్లేయర్. అందుకే ఎలా ఆడుకోవాలో తెలియజేయడానికే ఫుట్బాల్ తీసుకొచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్తో ఫుట్బాల్ ఆడుతాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్బాల్ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్రెడ్డి గుర్రుగా ఉన్నారని.. అధిష్టానం పెద్దలు ఒకరి దగ్గరకు వెళ్తే.. మరొకరి దగ్గరికి వెళ్లమంటూ ఫుట్బాల్ ఆడుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే ఇలా ఫుట్బాల్ ఇచ్చి నిరసన తెలిపారనే చర్చ నడిచింది.ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందిస్తూ.. కొండా విశ్వేశ్వర్రెడ్డికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఫుట్బాల్స్ బయటకు వస్తాయంటూ తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈలోపే కొండా విశ్వేశ్వర్రెడ్డి ఖండనకు దిగడం గమనార్హం.‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి అభయ్పాటిల్ను కలవమని చెబుతూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను.. మంగళవారం కొండా చేసిన వ్యాఖ్యలు..ఇదీ చదవండి: ఎంత బాధ ఉంటే ఆయన అలా చేస్తారు? -
కిషన్రెడ్డికి ఆ అవసరమేంటి?.. రాజాసింగ్ హాట్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ నేతలపై గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్తో పోటీ లేదని.. బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తోందని, అలాంటి పార్టీని ఇక్కడి నేతలే నట్టేట ముంచుతున్నారని వ్యాఖ్యానించారాయన. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ రాజాసింగ్ ఓ వీడియో వీడియో విడుదల చేశారు. ఎంత బాధలో ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు?. ఆయనతోనే కాదు.. గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?. నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టీ నన్ను ఇబ్బంది పెట్టారు. వారికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డికి ఏముంది?. తెలంగాణలో ఇక్కడున్న నేతలే బీజేపీని ముంచుతున్నారు. దీనిపై బిజెపి జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. .. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. బిజెపిలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా!. బిజెపి కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని రాజాసింగ్ ఆ వీడియోలో చెప్పారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నిరసనకు దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్పటేల్ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని చర్చ నడిచింది. -
పిల్లలను కన్నాక ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ ఫుట్బాలర్
ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాలర్, పోర్చుగీస్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో తన దీర్ఘకాలిక ప్రేయసి జార్జినా రోడ్రిగ్జ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ జంట ఎనిమిదేళ్ల ప్రేమ, ఐదుగురు పిల్లల పెంపకం తర్వాత తమ బంధాన్ని అధికారికం చేసింది. రొనాల్డోతో ఎంగేజ్మెంట్ విషయాన్ని జార్జినా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించింది.రొనాల్డో-జార్జినా ఇప్పటికే ఇద్దరు పిల్లలకు (అలానా మార్టినా (2017), బెల్లా ఎస్మెరాల్డా (2022)) తల్లిదండ్రులు. రొనాల్డోకు మరో ముగ్గురు సంతానం కూడా ఉన్నారు. వీరిలో క్రిస్టియానో రొనాల్డో జూనియర్ రొనాల్డో మొదటి భార్య కుమారుడు. క్రిస్టియానో రొనాల్డో జూనియర్ తర్వాత రొనాల్డో సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలను కన్నాడు. ఎవా మారియా , మటేయో అనే వీరు 2017లో జన్మించారు. వీరి తర్వాత రొనాల్డో జార్జినాతో అలానా మార్టినా, బెల్లా ఎస్మెరాల్డా, ఆంజెల్ను కన్నాడు. అయితే బెల్లా ట్విన్ బ్రదర్ అయిన ఆంజెల్ జన్మ సమయంలోనే మరణించాడు.రొనాల్డో-జార్జినా ప్రేమ కథరొనాల్డో-జార్జినా 2016లో మాడ్రిడ్లోని Gucci షాప్లో మొదటి సారి కలుసుకున్నారు. 2017 ఫిఫా అవార్డుల ప్రధానోత్సవంలో వీరిద్దరు మొదటిసారి పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చారు. జార్జినా రోడ్రిగ్జ్ (31, అర్జెంటీనా) ఓ ప్రముఖ మోడల్, ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్, ఎంటర్టైనర్ మరియు వ్యవసాయదారురాలు. ఆమె జీవిత ప్రయాణం సాధారణ వెయిట్రెస్ ఉద్యోగంతో మొదలైంది. ఆమె నెట్ఫ్లిక్స్లో I Am Georgina అనే డాక్యుమెంటీతో బాగా పాపులరైంది. -
స్పాన్సర్లు లేరు, ప్రభుత్వ మద్దతు లేదు.. అయినా చరిత్ర సృష్టించిన భారత యువ జట్టు
భారత్కు చెందిన ఓ యువ జట్టు ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్బాల్ టోర్నీని నెగ్గి చరిత్ర సృష్టించింది. కొద్ది రోజుల కిందట నార్వేలో జరిగిన నార్వే కప్ 2025లో పంజాబ్కు చెందిన మినర్వా అకాడమీ అబ్బురపరిచే ప్రదర్శనలతో టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ అండర్-13 జట్టుకు బ్రాండింగ్ లేకపోయనా, స్పాన్సర్లు లేకపోయినా, ప్రభుత్వ మద్దతు లేకపోయనా సంచలనాలు సృష్టించింది. ఈ యువ జట్టు తమ అభిరుచి, పట్టుదలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఫైనల్లో మినర్వా అకాడమీ స్థానిక జట్టు ఎస్ఐఎఫ్పై 14-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. మినర్వా అకాడమీ తరఫున దనమోని, రాజ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించారు. చింగ్కే, కే చేతన్, పున్షిబా, అమర్సన్, ఆజమ్, రీసన్ గోల్స్ చేశారు.ఈ టోర్నీలో మినర్వా అకాడమీ ఆది నుంచి సంచలన ప్రదర్శనలు నమోదు చేసింది. గ్రూప్ స్టేజీలో అలస్కా ఐఎల్పై 25-0, ఫోర్డ్ ఐఎల్-3పై 15-0, క్కొకెల్వ్డలాన్ ఐఎల్పై 22-0 గోల్స్ తేడాతో గెలుపొందింది.నాకౌట్ మ్యాచ్ల్లో రోగ్లాండర్స్పై (Round of 32) 11-0, అమ్డాల్ టొక్కెపై (Round of 16) 17-0, క్వార్టర్ ఫైనల్లో ఫైల్లింగ్స్డలెన్పై 18-1, సెమీస్లో రదథెల్ చరిఫ్ క్లబ్పై (పాలస్తీన్) 8-2 గోల్స్ తేడాతో నెగ్గి ఫైనల్కు చేరింది. ఈ టోర్నీలో మినర్వ అకాడమీ 8 మ్యాచ్ల్లో మొత్తం 130 గోల్స్ చేసింది. ఈ యూరప్ సీజన్లో భారత్కు చెందిన జట్లు మూడు టైటిళ్లు సాధించాయి. నార్వే కప్కు ముందు భారత జట్లు గోథియా కప్, డానా కప్లు గెలిచాయి.అనామక కుర్రాళ్లు ప్రతిష్టాత్మక నార్వే కప్ గెలిచిన తర్వాత స్వదేశంలో వారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ జట్టు యూరప్లో ట్రోఫీని మాత్రమే కైవసం చేసుకోలేదు. ప్రతి భారత ఫుట్బాల్ ప్రేమికుడి కలను సాకారం చేసింది. ఎక్కడో మారుమూల అకాడమీ నుంచి వచ్చి విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఆట పట్ల అభిరుచి ఏమి చేయించగలదో నిరూపించింది. మొత్తంగా దేశం గర్వపడేలా చేసింది. -
అహ్మదాబాద్లో ఆసియా కప్ అండర్–17 క్వాలిఫయర్స్ టోర్నీ
న్యూఢిల్లీ: ఆసియా కప్ అండర్–17 ఫుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత్ కూడా ఓ వేదికైంది. ఆసియా కప్–2026 కోసం నిర్వహించే క్వాలిఫయర్స్కు ఏడు దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఇందులో భారత్ కూడా ఉంది. భారత్కు సంబంధించిన పోటీలను ఈ నవంబర్ 22 నుంచి 30 వరకు అహ్మదాబాద్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. పాల్గొనే మొత్తం 38 దేశాల జట్లను ఏడు గ్రూప్లుగా విభజిస్తారు. మూడు గ్రూప్ల్లో ఆరేసి జట్లు, నాలుగు గ్రూప్ల్లో ఏడేసి జట్లు ఉంటాయి. దీనికి సంబంధించిన ‘డ్రా’ను రేపు తీయనున్నారు. ఈ ఏడు గ్రూప్ల విజేత జట్లు సౌదీ అరేబియాలో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్కు నేరుగా అర్హత సాధిస్తాయి. ఇంతకుముందే 9 జట్లకు డైరెక్ట్ ఎంట్రీ లభించింది. ఈ ఏడాది ఖతర్లో జరిగిన అండర్–17 ప్రపంచకప్లో తలపడటం ద్వారా 9 జట్లకు ఈ అవకాశం లభించింది. ఆసియాకప్ క్వాలిఫయర్స్ టోర్నీలో భారత్ కూడా వేదికవడం పట్ల అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అధ్యక్షుడు కళ్యాణ్ చౌబే హర్షం వ్యక్తం చేశారు.అండర్–17 ఫిఫా ప్రపంచకప్ నిర్వహించే సత్తా తమకు ఉందని ఏఎఫ్సీ క్వాలిఫయర్స్ ద్వారా నిరూపించుకుంటామని చెప్పారు. అహ్మదాబాద్లో అంతర్జాతీయ ప్రమాణాలకు తీసిపోని విధంగా తీర్చిదిద్దిన స్టేడియంలో పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
మెస్సీ మేనియా షురూ!
కోల్కతా: ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెపె్టన్ లియోనెల్ మెస్సీ ఈ ఏడాది చివర్లో భారత్లో పర్యటించనున్నాడు. 2011లో చివరిసారిగా భారత్కు విచ్చేసిన మెస్సీ... రెండు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్లో కోల్కతా, అహ్మదాబాద్, ముంబై, న్యూఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. ఫుట్బాల్ను అమితంగా ఇష్టపడే కోల్కతా నుంచి మెస్సీ పర్యటన ప్రారంభం కానుంది. అందకు తగ్గట్లే ఏర్పాట్లు సైతం జరుగుతున్నట్లు సమాచారం. అయితే భారత పర్యటనపై ఇప్పటి వరకు మెస్సీ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. అతి త్వరలో అది వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ‘మెస్సీ పర్యటన ఖరారైంది. అతడి నుంచి అధికారిక స్పందన రావడమే తరువాయి. అది సామాజిక మాధ్యమాల ద్వారా ఏ క్షణమైనా రావచ్చు’ అని నిర్వాహకులు వెల్లడించారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 12న మెస్సీ కోల్కతాలో అడుగు పెట్టనున్నాడు. 70 అడుగుల విగ్రహం... ఫుట్బాల్ను విపరీతంగా అభిమానించే కోల్కతా వాసులు... మెస్సీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీఐపీ రోడ్లోని లేక్టౌన్ శ్రీభూమిలో మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. పర్యటనలో భాగంగా మెస్సీ ఈ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నాడు. ప్రపంచంలో మెస్సీకి ఇదే అతి ఎత్తయిన విగ్రహం కానుంది. డిసెంబర్ 13 మధ్యాహ్నం ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ‘గోట్ కాన్సెర్ట్’లో మెస్సీ పాల్గొననున్నాడు. మెస్సీ ఘనతలను వివరించేలా సాగే ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ‘అభిమానులను తప్పుదోవ పట్టించాలనుకోవడం లేదు. గోట్ కాన్సెర్ట్తో పాటు ఏడుగురు ప్లేయర్లతో కూడిన ‘సెవెన్–ఎ–సైడ్’ గోట్ కప్ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నాడు. ఇందులో భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ సౌరవ్ గంగూలీ, టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, భారత ఫుట్బాల్ జట్టు మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా, ప్రముఖ నటుడు జాన్ అబ్రహం తదితరులు పాల్గొననున్నారు. ఇది మెస్సీ గౌరవార్ధం నిర్వహిస్తున్నాం. ఈడెన్ గార్డెన్స్లో నిర్వహించే ఈ మ్యాచ్ చూసేందుకు అభిమానులు ఎగబడే అవకాశం ఉండగా... టికెట్ ధరలు సైతం ఎక్కువగానే ఉండనున్నాయి. సుమారు గంటన్నర పాటు మెస్సీ మైదానంలో ఉంటాడు. అతడిని దగ్గర నుంచి చూసేందుకు స్టేడియం నిండిపోవడం ఖాయమే’ అని నిర్వాహకులు వెల్లడించారు. ఈ మ్యాచ్ అనంతరం బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీని సత్కరించే అవకాశముంది. ముంబైలో క్రికెట్ మ్యాచ్! కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ అహ్మదాబాద్, ముంబైలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు. డిసెంబర్ 14న ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరగనున్న ‘గోట్ కాన్సెర్ట్’, ‘గోట్ కప్’లో మెస్సీ పాల్గొననున్నాడు. దీని కోసం ఇప్పటికే మైదానాన్ని బుక్ చేసినట్లు సమాచారం. ముంబైలో మెస్సీ క్రికెట్ మ్యాచ్ ఆడనున్నట్లు వార్తలు వస్తుండగా... నిర్వాహకులు మాత్రం వాటిని ఖండించారు. ‘మెస్సీ ఎలాంటి క్రికెట్ మ్యాచ్ ఆడబోవడం లేదు. భారత సెలెబ్రిటీలతో సరదాగా సాఫ్ట్బాల్ ఆడుతాడు’ అని వెల్లడించారు. అదే సమయంలో భారత ఫుట్బాల్ జట్టును సైతం మెస్సీ కలిసే అవకాశముంది. అనంతరం డిసెంబర్ 15న ఢిల్లీ చేరుకోనున్న మెస్సీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో మర్యాద పూర్వకంగా భేటీ కానున్నాడు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రతి నగరంలో మెస్సీ చిన్నారులతో ప్రత్యేకంగా గడపనున్నాడు. ఈ టూర్లో మెస్సీ కేరళకు వెళ్లడం లేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. అప్పుడేం జరిగిందంటే...2011 ఆగస్టు 31న మెస్సీ తొలిసారి భారత్లో పర్యటించాడు. వెనిజులాతో ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం కోల్కతాకు విచ్చేసిన మెస్సీకి అభిమానులు బ్రహ్మరథం పట్టారు. అర్జెంటీనా జట్టుతో పాటు వచి్చన మెస్సీ కోసం వేలాది మంది అభిమానులు ఎయిర్పోర్ట్లో స్వాగతం పలకగా... మ్యాచ్ జరుగుతున్నంత సేపు ‘సాల్ట్లేక్’ స్టేడియం మెస్సీ నామస్మరణతో మార్మోగిపోయింది. కోల్కతా నగరం మొత్తం ‘మెస్సీ మేనియా’తో ఊగిపోయింది. ఇప్పుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత... ప్రపంచ చాంపియన్ హోదాలో మెస్సీ భారత్లో అడుగుపెట్టనుండటంతో... ఈ సారి మరింత మంది అభిమానులు అర్జెంటీనా స్టార్ను చూసేందుకు ఎగబడటం ఖాయమే. -
భారత్కు రానున్న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ.. ధోని, రోహిత్, కోహ్లితో క్రికెట్ మ్యాచ్
భారత ఫుట్బాల్ ప్రేమికులకు శుభవార్త. దిగ్గజ ఫుట్బాలర్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ త్వరలో భారత పర్యటనకు రానున్నాడు. ఈ ఏడాది డిసెంబర్లో (13-15) కోల్కతా, ముంబై, ఢిల్లీ నగరాల్లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు.మెస్సీకి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగనుంది. కోల్కతా పర్యటనలో మెస్సీ చిన్న పిల్లల కోసం ఫుట్బాల్ వర్క్ షాప్ నిర్వహింస్తాడు. ఇదే సందర్భంగా మెస్సీ చేతుల మీదుగా ఫుట్బాల్ క్లినిక్ లాంచ్ కానుంది. ఈడెన్ గార్డెన్స్లో మెస్సీ పలువురు భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది.కోల్కతా పర్యటన అనంతరం మెస్సీ డిసెంబర్ 14న ముంబైలో పర్యటిస్తాడు. ఈ పర్యటనలో భాగంగా వాంఖడే స్టేడియంలో జరిగే ఓ ప్రైవేట్ ఈవెంట్లో (విజ్క్రాఫ్ట్ నిర్వహించే కార్యక్రమం) పాల్గొంటాడు. దీనికి ముందు భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోనిలతో కలిసి సెవెన్-ఏ-సైడ్ క్రికెట్ మ్యాచ్ ఆడే అవకాశం ఉంది. ముంబై పర్యటన తర్వాత మెస్సీ ఢిల్లీలో కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొంటాడు. మెస్సీ భారత పర్యటనకు సంబంధించిన వాస్తవిక షెడ్యూల్ అధికారికంగా ఖరారు కాలేదు. మెస్సీ తొలిసారి 2011లో భారత్లో పర్యటించాడు. నాడు కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఓ ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు. -
భారత్కు క్లిష్టమైన ‘డ్రా’
సిడ్నీ: ఆసియా ఫుట్బాల్ సమాఖ్య (ఏఎఫ్సీ) మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత జట్టుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. వచ్చే ఏడాది ఆ్రస్టేలియాలో మార్చి 1 నుంచి 21 వరకు జరిగే ఈ టోర్నీలో ఆసియా ఘనాపాటి జపాన్ సహా మాజీ చాంపియన్లు చైనీస్ తైపీ, వియత్నాం జట్లున్న గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టుకు చోటు దక్కింది. దీనికి సంబంధించిన ‘డ్రా’ వేడుక సిడ్నీ టౌన్ హాల్లో మంగళవారం అట్టహాసంగా జరిగింది. భారత స్టార్ మిడ్ఫీల్డర్ సంగీత బస్ఫొరె ప్రత్యేక ఆహ్వానితులుగా ‘డ్రా’ ఈవెంట్లో పాల్గొంది. మొత్తం 12 ఆసియా జట్లను మూడు గ్రూప్లుగా విభజించారు. ఒక్కో జట్టులో నాలుగేసి టీమ్లు తలపడతాయి. గ్రూప్ ‘సి’లో భారత అమ్మాయిల జట్టు తమ తొలి మ్యాచ్లో మార్చి 4న వియత్నాంతో... రెండో మ్యాచ్లో మార్చి 7న ప్రపంచ మాజీ చాంపియన్ జపాన్తో... మూడో మ్యాచ్లో మార్చి 10న చైనీస్ తైపీతో ఆడుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో జపాన్ 7వ స్థానంలో, వియత్నాం 37వ స్థానంలో, చైనీస్ తైపీ 42వ స్థానంలో, భారత్ 70వ స్థానంలో ఉన్నాయి. సెమీస్ చేరితే ప్రపంచకప్ టోర్నీకి... ఆసియా కప్ గ్రూప్ ‘ఎ’లో ఆతిథ్య ఆ్రస్టేలియా, దక్షిణ కొరియా, ఇరాన్, ఫిలిప్పీన్స్... గ్రూప్ ‘బి’లో డిఫెండింగ్ చాంపియన్ చైనా, ఉత్తర కొరియా, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్ జట్లున్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. అలాగే ఈ మూడు గ్రూప్ల్లో మెరుగైన మూడో స్థానం పొందిన రెండు జట్లు కూడా నాకౌట్కు క్వాలిఫై అవుతాయి. ఈ 8 జట్ల మధ్య జరిగే క్వార్టర్ ఫైనల్స్ విజేతలు అంటే సెమీఫైనల్ చేరిన నాలుగు జట్లు 2027లో బ్రెజిల్లో జరిగే ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత పొందుతాయి. క్వార్టర్స్లో ఓడిన జట్లు ప్లే ఆఫ్స్ ఆడాల్సి ఉంటుంది. ఆసియా నుంచి మరో రెండు జట్లకు ప్రపంచకప్ బెర్త్లు లభిస్తాయి. -
‘యునైటెడ్ ఇన్ మాంచెస్టర్’
మాంచెస్టర్: భారత క్రికెట్ జట్టు ఒకవైపు నాలుగో టెస్టుకు సన్నద్ధమవుతూనే మరోవైపు విరామ సమయాన్ని సరదాగా గడుపుతోంది. తాజాగా విఖ్యాత ఫుట్బాల్ క్లబ్ ‘మాంచెస్టర్ యునైటెడ్’ ప్రాక్టీస్ గ్రౌండ్ను టీమిండియా ఆటగాళ్లు సందర్శించారు. ఇరు జట్లకు ప్రధాన స్పాన్సర్గా ఉన్న స్పోర్ట్స్వేర్ ‘అడిడాస్’ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. క్రికెట్, ఫుట్బాల్ టీమ్ల సభ్యులు పరస్పర గౌరవాన్ని ప్రదర్శిస్తూ జెర్సీలు మార్చుకున్నారు. భారత ఆటగాళ్లతో పాటు మాంచెస్టర్ ఆటగాళ్లంతా రెండు జట్లుగా విడిపోయి ముందుగా ఫుట్బాల్ ఆడారు. ఆపై మాంచెస్టర్ ప్లేయర్లు క్రికెట్లో తమ ఆసక్తి ప్రదర్శిస్తూ బ్యాటింగ్ చేశారు. స్టార్ డిఫెండర్ హ్యారీ మేగ్వైర్కు సిరాజ్ బౌలింగ్ చేయగా... ‘రెడ్ డెవిల్స్’ టీమ్ సభ్యులు డియాలో, మేసన్ మౌంట్ తదితరులతో ఫుట్బాల్ ఆడేందుకు పంత్, బుమ్రా ప్రత్యేక ఆసక్తి కనబర్చారు. మాంచెస్టర్ యునైటెడ్, పోర్చుగల్ జట్లకు కెపె్టన్ అయిన బ్రూనో ఫెర్నాండెజ్తో భారత కెపె్టన్ శుబ్మన్ గిల్ కబుర్లాడాడు. మరోవైపు భారత్, మాంచెస్టర్ యునైటెడ్ హెడ్ కోచ్లు గంభీర్, రూబెన్ అమోరిమ్ మధ్య కూడా సుదీర్ఘ సంభాషణ చోటు చేసుకుంది. శిక్షణ, నాయకత్వం, స్టార్ ఆటగాళ్లతో జట్లను నడిపించడంవంటి అంశాలపై చివర్లో ఇరు జట్ల కోచ్లు తమ అభిప్రాయాలు వెల్లడించడంతో కార్యక్రమం ముగిసింది. బుధవారం నుంచి ఓల్ట్ ట్రఫోర్డ్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. -
ఆరు స్థానాలు పడిపోయి...
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించడంలో విఫలమవుతోన్న భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ దిగజారింది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో భారత జట్టు ఆరు స్థానాలు పడిపోయి 133వ ర్యాంక్లో నిలిచింది. గత తొమ్మిదేళ్లలో భారత్కిదే అత్యల్ప ర్యాంక్ కావడం గమనార్హం. ఈ ఏడాది జూన్ 4న థాయ్లాండ్తో జరిగిన అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత బృందం 0–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీలో హాంకాంగ్ చేతిలో 0–1తో పరాజయం పాలైంది. భారత జట్టు నిరాశాజనక ప్రదర్శన నేపథ్యంలో హెడ్ కోచ్ మనోలో తన పదవి నుంచి వైదొలిగాడు. 2016 డిసెంబర్లో భారత జట్టు అత్యల్పంగా 135వ ర్యాంక్లో నిలువగా... 1996 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా 94వ స్థానాన్ని దక్కించుకుంది.1113.22 రేటింగ్ పాయింట్లతో భారత జట్టు ఆసియాలో 24వ స్థానంలో ఉంది. 210 దేశాలు ఉన్న ‘ఫిఫా’ ర్యాంకింగ్స్లో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, బ్రెజిల్ జట్లు వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. -
భారత్ జైత్రయాత్ర
చియాంగ్ మాయ్ (థాయ్లాండ్): ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు ‘హ్యాట్రిక్’ నమోదు చేసుకుంది. గత రెండు మ్యాచ్ల్లో అద్వితీయ విజయాలు సాధించిన భారత్... బుధవారం మూడో మ్యాచ్లో 5–0 గోల్స్ తేడాతో ఇరాక్ను చిత్తుచేసింది. మ్యాచ్ ఆరంభం నుంచే సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన టీమిండియా... ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగింది. భారత్ తరఫున సంగీత (14వ నిమిషంలో), మనీషా (44వ నిమిషంలో), కార్తీక అంగముత్తు (48వ నిమిషంలో), నిర్మలా దేవి (64వ నిమిషంలో), రతన్బాలా దేవి (80వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఓవరాల్గా ఈ టోర్నీలో మూడు మ్యాచ్లు ఆడిన భారత జట్టు... 22 గోల్స్ సాధించి ప్రత్యర్థికి ఒక్కటి కూడా ఇవ్వకపోవడం విశేషం. తొలి మ్యాచ్లో 13–0 గోల్స్ తేడాతో మంగోలియాను చిత్తుచేసిన టీమిండియా... తిమోర్ లెస్టెపై 4–0 గోల్స్ తేడాతో నెగ్గింది. తాజా పోరులో సంగీత గోల్తో ఖాతా తెరిచిన భారత్... మనీషా గోల్తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ప్రత్యర్థి నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవడంతో తొలి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 2–0తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది. ద్వితీయార్ధంలోనూ అదే జోరు కొనసాగిస్తూ మరో మూడు గోల్స్ కొట్టి మ్యాచ్ను ఏకపక్షం చేసింది. గాయం కారణంగా తెలంగాణ అమ్మాయి గుగులోత్ సౌమ్య ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోగా... మరింత ఆధిక్యం సాధించే పలు అవకాశాలను మన ప్లేయర్లు సది్వనియోగం చేసుకోలేకపోయారు. గ్రూప్ ‘బి’లో భాగంగా ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచిన భారత్ 9 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో ఉండగా... బుధవారమే జరిగిన మరో మ్యాచ్లో 11–0 గోల్స్ తేడాతో మంగోలియాపై గెలిచిన థాయ్లాండ్ కూడా 9 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. థాయ్లాండ్ కూడా టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలవగా... ఓవరాల్గా 22 గోల్సే చేసిన థాయ్లాండ్ అచ్చం టీమిండియా లాగే ప్రత్యర్థికి ఒక్క గోల్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నుంచి ఒక్క జట్టే ముందంజ వేసే అవకాశం ఉండటంతో... ఇరు జట్ల మధ్య శనివారం జరిగే ఆఖరి గ్రూప్ మ్యాచ్కు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చివరిసారి భారత జట్టు 2003లో ఆసియా కప్ ప్రధాన టోర్నీలో ఆడింది. ఆ తర్వాత భారత జట్టు ఈ టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. -
ఎక్సలెన్సియా అద్భుత విజయం.. Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్ కైవసం
సాక్షి, మొయినాబాద్: డెక్కన్ అరేనాలో జరిగిన 2025 Varsity ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో ఎక్సలెన్సియా జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గార్డియంను ఓడించి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు 1,000 మంది అభిమానుల కోలాహలం మధ్య జరిగిన ఈ మ్యాచ్ భారతదేశ పాఠశాల క్రీడల చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.ఆట ప్రారంభంలో గార్డియం ఆధిక్యత ప్రదర్శించినా, ఎక్సలెన్సియా పట్టుదలతో నిలబడి తొలి అర్ద భాగంలో గోల్స్ పడకుండా 0-0తో ముగించింది. సగం సమయం విరామంలో ఒక అద్భుతమైన వాతావరణం కనిపించింది. విద్యార్థుల బ్యాండ్ ప్రదర్శన, స్వచ్ఛంద సంస్థలు పెట్టిన ఆహార స్టాల్స్, ఉత్సాహంగా ఉన్న ప్రేక్షకుల సందడితో స్టేడియంలో పండుగ వాతావరణం నెలకొంది.అనంతరం రెండో అర్ద భాగం 58వ నిమిషంలో నిమిష్ 30 అడుగుల యార్డ్ నుంచి కొట్టిన అద్భుతమైన షాట్ స్టేడియం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ఆ ఒక్క గోల్తో ఎక్సలెన్సియా 1-0తో విజయాన్ని ఖాయం చేసుకుంది. చివరి విజిల్ మోగగానే ఎక్సలెన్సియా అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మూడు నెలల క్రితం క్వాలిఫైయర్స్తో మొదలైన ఎక్సలెన్సియా ప్రస్థానం ఛాంపియన్షిన్ కైవసం చేసుకోవడంతో ముగిసింది.మ్యాచ్ అనంతరం నిమిష్కు బ్యాలన్ డి'ఓర్(Ballon d’Or), గోల్డెన్ బూట్ అవార్డులు లభించాయి. అభిమానులు రాత్రంతా నిమిష్ పేరుతో విజయ నినాదాలు చేశారు. ఇది కేవలం ఒక చివరి ఆట మాత్రమే కాదు. Varsity అనే ఒక కొత్త క్రీడా ఉద్యమం ఆవిర్భావం అని చెప్పొచ్చు. -
జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా
బెర్లిన్: జర్మనీ ఆతిథ్యమిచ్చిన 2006 ప్రపంచకప్ పన్ను ఎగవేత కేసులో జర్మనీ ఫుట్బాల్ సమాఖ్యకు జరిమానా పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనల అనంతరం ఫ్రాంక్ఫర్ట్ స్థానిక కోర్టు బుధవారం తీర్పు వెల్లడించింది. పన్ను ఎగవేతకు పాల్పడిన జర్మనీకి 1,28,000 డాలర్లు (రూ. 1 కోటీ 10 లక్షలు) జరిమానా విధించింది. ప్రపంచకప్ ప్రారంభానికి ఒక ఏడాది ముందు అంటే 2005లో ‘ఫిఫా’ నిర్దేశించిన పన్నులు చెల్లించడంలో జర్మనీ విఫలమైంది.దీంతో జరిమానా భారీ మొత్తంలో ఉండాలని ‘ఫిఫా’ తరఫున న్యాయవాదులు పట్టుబట్టారు. ప్రపంచకప్ ప్రారంబోత్సవం కోసం తీసుకున్న రుణాన్ని దాచిపెట్టిన జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య.. ఓ ఏడాది తర్వాత దాన్ని వ్యాపార ఖర్చుగా తప్పుగా వెల్లడించింది. ఆ తర్వాత దాన్ని రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంతో సంబంధం ఉన్న జర్మనీ ఫుట్బాల్ సమాఖ్య ప్రతినిధులు జ్వాన్జిగర్, వోల్ఫ్గ్యాంగ్, నీర్స్బాచ్, హోర్ట్స్ స్మిత్లపై తొలుత విచారణ సమయంలో అభియోగాలు మోపారు. వాటిని ఖండించిన ఈ ముగ్గురూ జరిమానాలు చెల్లించిన తర్వాత వారిపై వేసిన విచారణలను రద్దు చేశారు. -
ఆసియా కప్ పుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నీకి సౌమ్య
న్యూఢిల్లీ: ఆసియా కప్–2026 మహిళల ఫుట్బాల్ క్వాలిఫయర్స్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 24 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. దేశవాళీ లీగ్లో ఈస్ట్ బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సౌమ్య గత సీజన్లో భారత మహిళల ఉత్తమ ఫుట్బాలర్ అవార్డును అందుకుంది. ఆసియా కప్ క్వాలిఫయర్స్లో భాగంగా భారత జట్టు గ్రూప్ ‘బి’లో ఉంది. భారత జట్టుతోపాటు గ్రూప్ ‘బి’లో థాయ్లాండ్, మంగోలియా, తిమోర్ లెస్టె, ఇరాక్ జట్లున్నాయి. ఈనెల 23 నుంచి జూలై 5 వరకు జరిగే గ్రూప్ ‘బి’ మ్యాచ్లకు బ్యాంకాక్ ఆతిథ్యమిస్తుంది. ఈనెల 23న తమ తొలి మ్యాచ్లో మంగోలియాతో ఆడనున్న భారత జట్టు ఆ తర్వాత వరుసగా తిమోర్ లెస్టె (జూన్ 29న), ఇరాక్ (జూలై 2న), థాయ్లాండ్ (జూలై 5న) జట్లతో పోటీపడుతుంది. 2026 ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీకి మార్చి 1 నుంచి 21 వరకు ఆ్రస్టేలియా ఆతిథ్యమిస్తుంది. మొత్తం 12 దేశాలు బరిలోకి దిగుతాయి. ఆతిథ్య దేశం హోదాలో ఆ్రస్టేలియా, 2022 టోర్నీ చాంపియన్ చైనా, 2022 టోర్నీ రన్నరప్ దక్షిణ కొరియా, 2022 టోర్నీలో మూడో స్థానం పొందిన జపాన్ జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది బెర్త్లు క్వాలిఫయర్స్ టోర్నీ ద్వారా ఖరారవుతాయి. క్వాలిఫయర్స్ టోర్నీలో మొత్తం 34 జట్లు పాల్గొంటున్నాయి. 34 జట్లను ఎనిమిది గ్రూప్లుగా విభజించారు. ‘ఎ’, ‘బి’ గ్రూపుల్లో 5 జట్ల చొప్పున... మిగిలిన ‘సి’, ‘డి’, ‘ఈ’, ‘ఎఫ్’, ‘జి’, ‘హెచ్’ గ్రూపుల్లో 4 జట్ల చొప్పున ఉన్నాయి. ఎనిమిది గ్రూప్ల విజేత జట్లు వచ్చే ఏడాది ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, మోనాలీసా దేవి, పాయల్ బసుదె (గోల్కీపర్లు), హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్దా, మార్టినా థోక్చోమ్, స్వీటీ దేవి, నిర్మలా దేవి, పూర్ణిమ కుమారి, సంజు, రంజన చాను (డిఫెండర్లు), అంజు తమాంగ్, గ్రేస్ డాంగ్మె, కార్తీక అంగముత్తు, రత్నబాలా దేవి, ప్రియదర్శిని సెల్లాదురై, సంగీత బస్ఫోరె (మిడ్ ఫీల్డర్లు), లిండా కోమ్ సెర్టో, మాళవిక, మనీషా కల్యాణ్, మనీషా నాయక్, ప్యారీ జక్సా, రింపా హల్దర్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
ఫుట్ బాల్ నేపథ్యంలో ‘డ్యూడ్’
మల్టీ టాలెంటెడ్ తేజ్ నటించిన త్రిభాషా చిత్రం ‘డ్యూడ్. ఫుట్ బాల్ నేపథ్యంలో బలమైన భావోద్వేగాలతో సాగే ఈ చిత్రాన్ని ఫుట్ బాల్ ప్రేమికుడైన స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న "డ్యూడ్" చిత్రం టీజర్ త్వరలో విడుదల చేయనున్నారు!!హీరో కమ్ డైరెక్టర్ తేజ్ మాట్లాడుతూ... "హీరోగా, డైరెక్టర్ గా 'డ్యూడ్" చిత్రం ఔట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. రష్ చూసుకుంటుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా ఉంది. ఎప్పుడెప్పుడు ఆడియన్స్ తో కలిసి థియేటర్స్ లో సినిమా చూసుకుంటామా అని చాలా ఆత్రంగా ఉంది. సినిమా ఇంత బాగా రావడానికి కారకులైన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. త్వరలో టీజర్ రిలీజ్ చేసి, అప్పటి నుంచి ప్రచార కార్యమాలు ముమ్మరం చేస్తాం" అని అన్నారు!!రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇదే ఏడాదిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది!!ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్... ఈ చిత్రానికి 'స్క్రిప్ట్ కన్సల్టెంట్'గా కూడా వ్యవహరించడం విశేషం. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, ధృతి, అనర్ఘ్య, దిపాలి పాండే, సిరి, ఎవాంజిలిన్, సోను తీర్ధ గౌడ్, యశశ్విని, మెర్సి, మోనిష... ఫుట్ బాల్ అంటే పడి చచ్చే ధీర వనితలుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సుందర్ రాజా, స్పర్శ రేఖ, విజయ్ చెందూర్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు -
ఈ ఏడాది... కలిసొచ్చింది!
ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు...అది క్రీడా రంగమైతే ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పోరాడతారు!ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధైర్యంగా నిలబడతారు....అడ్డంకులను అధిగమిస్తూ గమ్యానికి చేరువవుతారు! సర్వశక్తులు ధారపోసినా కొన్నిసార్లు ఆశించిన ఫలితం రాదు...అయినా వెనకడుగు వేయకుండా ఎట్టకేలకు గెలుపు రుచి చూస్తారు! తాజా ఐపీఎల్ ఫలితాన్ని విశ్లేషిస్తే ఈ విషయం అవగతమవుతుంది. లీగ్ ప్రారంభం నుంచి ట్రోఫీ చేజిక్కించుకోవడం కోసం తహతహలాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో తమ కల నెరవేర్చుకుంది. ఐపీఎల్ ఆరంభం నుంచి బెంగళూరు జట్టుతోనే కొనసాగుతున్న ‘కింగ్’ విరాట్ కోహ్లి ఆ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఈ ఏడాది వివిధ క్రీడాంశాల్లో 11 జట్లు ఇలా తొలిసారి తమ ‘కప్పు కల’ను తీర్చుకున్నాయి. ఐపీఎల్లో ఆర్సీబీ తరహాలో... ఆ్రస్టేలియాలోని బిగ్బాష్ టి20 లీగ్లో హోబర్ట్ హరికేన్స్, చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ), ఎఫ్ఏ కప్లో క్రిస్టల్ ప్యాలెస్ జట్లు ఈసారే తొలి టైటిల్ సాధించాయి. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇలా వేర్వేరు ఆటల్లో తొలిసారి ట్రోఫీ చేజిక్కించుకున్న జట్లపై ప్రత్యేక కథనం... – సాక్షి క్రీడావిభాగం90 ఏళ్ల తర్వాత... బెల్జియంకు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ రాయల్ యూనియన్ సెయింట్ గిల్లోయిస్ ఇప్పటి వరకు 12 టైటిల్స్ సాధించింది. అందులో 11 ట్రోఫీలను 1904 నుంచి 1935 మధ్య గెలుచుకున్న రాయల్ యూనియన్ 90 ఏళ్ల పోరాటం తర్వాత పన్నెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఒకదశలో ద్వితీయ డివిజన్కు పడిపోయిన ఆ జట్టు... తిరిగి పుంజుకొని విజయం సాధించడం విశేషం.క్రిస్టల్ ప్యాలెస్... 119 ఏళ్ల తర్వాత!ఐపీఎల్లో తొలి టైటిల్ గెలిచేందుకు బెంగళూరుకు 18 సీజన్లు ఎదురు చూడాల్సి వచ్చిందని అనుకుంటుంటే... ఫుట్బాల్ అసోసియేషన్ చాలెంజ్ కప్ (ఎఫ్ఏ కప్)లో క్రిస్టల్ ప్యాలెస్ జట్టు 119 సంవత్సరాల తర్వాత తొలిసారి చాంపియన్గా నిలిచింది. మే 17న జరిగిన ఫైనల్లో క్రిస్టల్ ప్యాలెస్ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ సిటీ జట్టును ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. శతాబ్దకాలంగా ఒక్కసారి కూడా కప్పు గెలవకపోయినా... తమ జట్టుకు అండగా నిలుస్తున్న అభిమానులకు ఈ విజయాన్ని అంకితమిచ్చింది. హోబర్ట్ హరికేన్స్ తొలిసారి...ఆస్ట్రేలియా ప్రఖ్యాత టి20 టోర్నమెంట్ బిగ్బాష్ లీగ్ లో కొత్త విజేత అవతరించింది. 2011 నుంచి నిర్వహిస్తున్న ఈ లీగ్లో హోబర్ట్ హరికేన్స్ మొదటిసారి ట్రోఫీ ముద్దాడింది. జనవరి 27న జరిగిన ఫైనల్లో హోబర్ట్ హరికేన్స్ 7 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్పై గెలిచి విజేతగా నిలిచింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (42 బంతుల్లో 108; 6 ఫోర్లు, 11 సిక్స్లు) సెంచరీతో చెలరేగడంతో ఫైనల్లో హరికేన్స్ సునాయాసంగా గెలుపొందింది. అదే బాటలో ఇండియానా పేసర్స్..నేషనల్ బాస్కెట్బాల్ సంఘం (ఎన్బీఏ) లీగ్లో కూడా ఈ ఏడాది కొత్త చాంపియన్ అవతరించడం ఖాయమైంది. ఇండియానా పేసర్స్, ఒక్లాహోమా థండర్ సిటీ జట్ల మధ్య ‘బెస్ట్ ఆఫ్ సెవెన్’ పద్ధతిలో టైటిల్ పోరు జరగనుంది. గతంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఇండియానా పేసర్స్ జట్టు... ఈ ఏడాది చక్కటి ఆటతీరుతో ఎన్బీఏ ఫైనల్కు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి ఫైనల్లో ఇండియానా పేసర్స్ 111–110తో ఒక్లాహోమా సిటీ థండర్పై నెగ్గగా... ఆదివారం జరిగిన రెండో ఫైనల్లో ఒక్లాహోమా సిటీ థండర్ 123–107తో ఇండియానా పేసర్స్ జట్టును ఓడించింది. ఏడింటిలో తొలుత నాలుగు మ్యాచ్ల్లో గెలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది. పీఎస్జీ 43 ఏళ్ల తర్వాత...ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్బాల్ టోర్నమెంట్లో పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్జీ) జట్టు తొలిసారి విజేతగా నిలిచింది. జూన్ 1న జరిగిన తుదిపోరులో పీఎస్జీ జట్టు 5–0 గోల్స్ తేడాతో ఇంటర్ మిలాన్ జట్టుపై గెలుపొందింది. సుదీర్ఘ చరిత్రగల యూరోపియన్ కప్లో పీఎస్జీ జట్టుకు 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటి టైటిల్ కావడంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ...టి20 ఫార్మాట్లో నిర్వహించిన తొలి ఐసీసీ ప్రపంచకప్ విజయవంతం కావడంతో ఆ మరుసటి ఏడాదే (2008)... ప్రతిష్టాత్మక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటి నుంచి లీగ్లో పోటీ పడుతున్న ఆర్సీబీ జట్టు... ఎట్టకేలకు 18వ సీజన్లో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. లీగ్ దశలో రెండో స్థానంలో నిలిచిన బెంగళూరు... క్వాలిఫయర్–1తో పాటు తుదిపోరులోనూ పంజాబ్ కింగ్స్ను ఓడించి టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక ప్లేయర్గా రికార్డుల్లోకి ఎక్కిన కోహ్లి ఎట్టకేలకు చాంపియన్ హోదా దక్కించుకున్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన కోహ్లి... కప్పును చేతబట్టి చిన్నపిల్లాడిలా సంబరాల్లో మునిగిపోవడం అభిమానులను ఎంతగానో అలరించింది. అర్ధశతాబ్దం తర్వాత...సుదీర్ఘ చరిత్ర ఉన్న బొలోగ్నా ఫుట్బాల్ క్లబ్... అర్ధశతాబ్దం తర్వాత కోపా ఇటాలియా కప్ చేజిక్కించుకుంది. మే 15న మిలాన్ వేదికగా జరిగిన తుదిపోరులో బొలోగ్నా జట్టు 1–0 గోల్స్ తేడాతో ఏసీ మిలాన్ జట్టుపై గెలిచింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు ప్రమాదకర జట్టుగా ముద్రపడ్డ బొలోగ్నా... ఎట్టకేలకు 51 సంవత్సరాల తర్వాత ఒక మేజర్ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. 1933 తర్వాత తొలిసారి...నెదర్లాండ్స్లోని డెవెంటర్ నగరానికి చెందిన ‘గో అహెడ్ ఈగల్స్’ ఫుట్బాల్ జట్టు... సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ ఏడాది తమ తొలి టైటిల్ సాధించింది. 1920 నుంచి 1930 వరకు ప్రత్యర్థులను భయపెట్టిన ఈగల్స్... 1933 తర్వాత తొలి సారి డచ్ కప్ గెలుచుకుంది. ఏప్రిల్ 21న జరిగిన తుదిపోరు ‘షూటౌట్’లో ఈగల్స్ విజయం సాధించి కప్పు కల తీర్చుకుంది. స్టుట్గార్ట్ 28 ఏళ్ల తర్వాత... జర్మనీకి చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ వీఎఫ్బీ స్టుట్గార్ట్.. 28 ఏళ్ల తర్వాత డీఎఫ్బీ పోకల్ ఫైనల్లో విజేతగా నిలిచింది. మే 24న జరిగిన తుది పోరులో స్టుట్గార్ట్ 4–2 గోల్స్ తేడాతో అరిమినియా బీలెఫెల్డ్ జట్టును ఓడించింది. ఈ టోర్నీలో స్టుట్గార్ట్ విజేతగా నిలవడం ఇది నాలుగోసారి. అయితే దాదాపు మూడు దశాబ్దాలకు ముందే మూడుసార్లు చాంపియన్గా నిలిచిన స్టుట్గార్ట్... మళ్లీ ఇన్నాళ్లకు తమ టైటిల్స్ సంఖ్యను నాలుగుకు పెంచుకుంది.హ్యారీ కేన్కు మరింత ప్రత్యేకం...ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు స్టార్ హ్యారీ కేన్కు కూడా ఈ ఏడాది చాలా గొప్పగా సాగింది. కెరీర్లో ఎన్నో అద్భుత విజయాలు సాధించిన కేన్కు టైటిల్ లోటు మాత్రం ఉండిపోయింది. అయితే ఈ ఇంగ్లండ్ స్ట్రయికర్ ఈ ఏడాది తన కప్పు కలను నెరవేర్చుకున్నాడు. బేయర్న్ మ్యూనిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ... బుండెస్లిగా ట్రోఫీ కైవసం చేసుకున్నాడు. ఈ లీగ్లో అత్యధిక గోల్స్ కొట్టిన కేన్... జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 ఏళ్ల తర్వాత...1955లో చివరిసారిగా ఎఫ్ఏ కప్ సొంతం చేసుకున్న న్యూ క్యాజిల్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్... ఏడు దశాబ్దాల తర్వాత ఇన్నాళ్లకు ఈ ఏడాది ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్ గెలుచుకుంది. ఈ ఏడాది మార్చి 16న జరగిన తుదిపోరులో న్యూ క్యాజిల్ జట్టు 2–1 గోల్స్ తేడాతో లివర్పూల్ను మట్టికరిపించి చాంపియన్గా అవతరించింది. 17 ఏళ్ల తర్వాత...ఇంగ్లండ్కు చెందిన ప్రముఖ ఫుట్బాల్ క్లబ్ టోటెన్హామ్ హాట్స్పర్... 17 ఏళ్ల పోరాటం తర్వాత ఈ ఏడాది యూరోపా లీగ్ ట్రోఫీ దక్కించుకుంది. మే 22న జరిగిన ఫైనల్లో టోటెన్హామ్ ఎఫ్సీ 1–0 గోల్స్ తేడాతో మాంచెస్టర్ యునైటెడ్పై గెలిచి సంబరాల్లో మునిగిపోయింది. -
భారత్ను సెమీస్కు చేర్చిన రోహెన్ సింగ్
దక్షిణాసియా అండర్–19 పురుషుల ఫుట్బాల్ చాంపియన్షిప్లో భారత జట్టు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అరుణాచల్ప్రదేశ్లో మంగళవారం జరిగిన గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్లో భారత్ 4–0 గోల్స్ తేడాతో నేపాల్ జట్టును ఓడించి గ్రూప్ ‘టాపర్’గా నిలిచి సెమీఫైనల్కు అర్హత పొందింది. భారత్ తరఫున చాపామాయుమ్ రోహెన్ సింగ్ (28వ, 76వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా... ఒమంగ్ డోడుమ్ (29వ నిమిషంలో), డానీ మీటీ (84వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. ఈనెల 16న జరిగే సెమీఫైనల్లో మాల్దీవులు జట్టుతో భారత్ తలపడుతుంది. -
నెరవేరిన కేన్ కల
బెర్లిన్: ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు కాదు... ఏకంగా ఆరుసార్లు కెరీర్లో మేజర్ ట్రోఫీలు సాధించే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు కెప్టెన్ హ్యారీ కేన్ ఏడో ప్రయత్నంలో విజయవంతమయ్యాడు. ప్రతిష్టాత్మక జర్మనీ అంతర్జాతీయ ఫుట్బాల్ లీగ్ బుండెస్లీగాలో హ్యారీ కేన్ తన స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. 2024–2025 బుండెస్లీగా సీజన్లో బాయెర్న్ మ్యూనిక్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టును విజేతగా నిలబెట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో లోటుగా ఉన్న మేజర్ ట్రోఫీని అందుకున్నాడు.బొరుసియా మొంచెన్గ్లాడ్బాచ్ క్లబ్తో జరిగిన 33వ లీగ్ మ్యాచ్లో మాన్యుయెల్ నెయుర్ సారథ్యంలోని బాయెర్న్ మ్యూనిక్ జట్టు 2–0 గోల్స్ తేడాతో గెలిచింది. తద్వారా ఈ సీజన్లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే బాయెర్న్ మ్యూనిక్ జట్టు రికార్డుస్థాయిలో 33వసారి బుండెస్లీగా టైటిల్ను హస్తగతం చేసుకుంది. మ్యూనిక్ జట్టుకు హ్యారీ కేన్ (31వ నిమిషంలో), మైకేల్ ఒలిస్ (90వ నిమిషంలో) ఒక్కో గోల్ అందించారు. ఈ సీజన్లు 30 మ్యాచ్లు ఆడిన హ్యారీ కేన్ 25 గోల్స్తో టాప్ స్కోరర్గా ఉన్నాడు. సీజన్లోని చివరి మ్యాచ్ మే 17న హఫెన్హీమ్ జట్టుతో బాయెర్న్ మ్యూనిక్ జట్టు ఆడుతుంది.మొత్తం 18 జట్లు ఇంటా, బయట పద్ధతిలో బుండెస్లీగాలో పోటీపడుతున్నాయి. ఒక్కో జట్టు 34 మ్యాచ్లు ఆడుతుంది. 33 మ్యాచ్లు పూర్తి చేసుకున్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు 24 విజయాలు సాధించింది. 7 మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, 2 మ్యాచ్ల్లో ఓడిపోయింది. 95 గోల్స్ సాధించి, 32 గోల్స్ను సమర్పించుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 79 పాయింట్లతో టాప్ ర్యాంక్ను ఖరారు చేసుకుంది.68 పాయింట్లతో బాయెర్ 04 లెవెర్కుసెన్ జట్టు రన్నరప్ ట్రోఫీని ఖరారు చేసుకుంది. 31 హ్యారీ కేన్ సారథ్యంలో ఇంగ్లండ్ జట్టు 2021, 2024 ‘యూరో’ టోరీ్నలో రన్నరప్గా నిలిచింది. హ్యారీ కేన్ సభ్యుడిగా ఉన్న టోటెన్హామ్ హాట్స్పర్ క్లబ్ జట్టు 2015, 2019లలో ఇంగ్లిష్ ఫుట్బాల్ లీగ్ కప్లో రన్నరప్గా... 2019 చాంపియన్స్ లీగ్లో రన్నరప్గా నిలిచింది. 2023లో కేన్ సభ్యుడిగా ఉన్న బాయెర్న్ మ్యూనిక్ జట్టు జర్మన్ సూపర్ కప్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. దాంతో ఆరుసార్లు హ్యారీ కేన్కు టైటిల్ దక్కినట్టే దక్కి చేజారిపోయింది. అయితే ఏడో ప్రయత్నంలో హ్యారీ కేన్ ఖాతాలో బుండెస్లీగా రూపంలో మేజర్ టైటిల్ చేరింది. -
జాతీయ ప్రాబబుల్స్కు 39 మంది ప్లేయర్లు
న్యూఢిల్లీ: మహిళల ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ క్వాలిఫయర్స్ కు ముందు నిర్వహించనున్న జాతీయ శిబిరానికి 39 మంది ప్లేయర్లు ఎంపికయ్యారు. జూన్, జూలైలో జరగనున్న ఈ అర్హత పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చడమే లక్ష్యంగా... జాతీయ మహిళల సీనియర్ ఫుట్బాల్ టీమ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రీ శనివారం 39 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. ఈ ప్రాబబుల్స్లో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ చోటు దక్కించుకుంది.ఇటీవల ఇండియన్ ఉమెన్ లీగ్ (ఐడబ్ల్యూఎల్) ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) తరఫున 9 గోల్స్తో సత్తాచాటిన సౌమ్య... ఇప్పటికే జాతీయ జట్టు తరఫున 33 మ్యాచ్లాడింది. మహిళల ఆసియాకప్ 2026 క్వాలిఫయింగ్ టోర్నీకి థాయ్లాండ్ ఆతిథ్యమిస్తోంది. జూన్ 23 నుంచి జూలై 5 వరకు జరగనున్న ఈ టోర్నీలో భారత జట్టు గ్రూప్ ‘బి’ నుంచి బరిలోకి దిగనుంది. ఆతిథ్య థాయ్లాండ్, మంగోలియా, టిమొర్ లెస్ట్, ఇరాక్తో భారత జట్టు తలపడుతుంది. దానికి ముందు భారత ప్లేయర్ల కోసం మే1 నుంచి బెంగళూరులో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నారు. సీనియర్ ప్లేయర్లు బాలా దేవి, ఆశాలత దేవికి ఈ ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు. ఇటీవల ఐడబ్ల్యూఎల్లో రాణించిన యంగ్ ప్లేయర్లకు ఎక్కువ అవకాశాలు లభించాయి. ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్బమ్ చాను, కైశమ్ మెలోడీ చాను, మోనాలిసా దేవి (గోల్ కీపర్స్), పూర్ణిమ కుమారి, నిర్మలా దేవి, మార్టినా థోక్చమ్, శుభాంగి సింగ్, సంజూ, మాలతీ, టోయిజమ్ చాను, రంజనా చాను, స్వీటి దేవి, విక్సిత్ బారా, షిల్కీ దేవి (డిఫెండర్స్), కిరణ్, రత్నబాలా దేవి, ముస్కాన్, బబీనా దేవి, కార్తీక అంగముత్తు, కోల్నీ, సంగీత, ప్రియదర్శిని, బేబే సనా, సంతోష్, అంజూ తమాంగ్ (మిడ్ఫీల్డర్స్), మౌసుమీ ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాజన, లిండా కామ్, రింపా హల్దార్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తమ్, సుమతి, మనీషా, గ్రేస్ డాంగ్మెయి (ఫార్వర్డ్స్). -
127వ స్థానంలో...
లుసానే (స్విట్జర్లాండ్): ఏడాది కాలంగా అంతర్జాతీయస్థాయి మ్యాచ్ల్లో ఆశించిన ఫలితాలు సాధించడంలో భారత పురుషుల ఫుట్బాల్ జట్టు విఫలమవుతోంది. ఈ నిరాశాజనక ప్రదర్శన ప్రభావం ప్రపంచ ర్యాంకింగ్స్లో భారత జట్టుపై పడింది. గురువారం విడుదల చేసిన ప్రపంచ ఫుట్బాల్ ర్యాంకింగ్స్లో భారత జట్టు 127వ స్థానానికి చేరుకుంది. క్రితంసారి భారత జట్టు 126వ స్థానంలో ఉంది. షిల్లాంగ్లో ఇటీవల బంగ్లాదేశ్తో జరిగిన ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. తమకంటే మెరుగైన స్థానంలో ఉన్న భారత జట్టుతో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకోవడం బంగ్లాదేశ్ జట్టుకు కలిసొచ్చిoది. ర్యాంకింగ్స్లో బంగ్లాదేశ్ రెండు స్థానాలు పురోగతి సాధించి 183 ర్యాంక్లో నిలిచింది. గత ఏడాది జూన్లో భారత స్టార్ ప్లేయర్ సునీల్ ఛెత్రి అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. సునీల్ ఛెత్రి గుడ్బై చెప్పాక భారత ప్రదర్శన తీసికట్టుగా మారింది. దాంతో గత నెలలో సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ను వెనక్కి తీసుకొని మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో, అంతకుముందు మాల్దీవులుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో భారత జట్టుకు సునీల్ ఛెత్రి నాయకత్వం వహించాడు. కొత్త కోచ్ మనోలో మార్క్వెజ్ వచ్చాక భారత జట్టు ఆడిన 13 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. భారత్ తమ అత్యుత్తమ ర్యాంక్ 94ను 1996లో సాధించింది. ఆ తర్వాత టీమిండియా తమ అత్యుత్తమ ర్యాంక్ను అధిగమించడంలో విఫలమవుతోంది. వరుసగా మూడోసారి ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించాలనే లక్ష్యంతో ఉన్న భారత జట్టు గ్రూప్ ‘సి’లో తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న హాంకాంగ్తో ఆడుతుంది. మరోవైపు ప్రపంచ ర్యాంకింగ్స్లో ప్రస్తుత విశ్వవిజేత అర్జెంటీనా టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా... స్పెయిన్ ఒక స్థానం మెరుగుపర్చుకొని రెండో ర్యాంక్కు చేరుకోగా... ఫ్రాన్స్ ఒక స్థానం పడిపోయి మూడో ర్యాంక్లో నిలిచింది. ఇప్పటికే 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించిన ఆసియా దేశాలు జపాన్ 15వ స్థానంలో, ఇరాన్ 18వ స్థానంలో ఉన్నాయి. -
బంగ్లాదేశ్తో భారత్ మ్యాచ్ ‘డ్రా’
షిల్లాంగ్: ఆసియా కప్–2027 క్వాలిఫయింగ్ టోర్నమెంట్ మూడో రౌండ్ను భారత జట్టు ‘డ్రా’తో ప్రారంభించింది. బంగ్లాదేశ్ జట్టుతో మంగళవారం జరిగిన మ్యాచ్ను భారత్ 0–0తో ‘డ్రా’గా ముగించింది. నిర్ణీత 90 నిమిషాల్లో రెండు జట్లు గోల్స్ చేయడంలో విఫలమయ్యాయి. తొలి అర్ధభాగంలో బంగ్లాదేశ్ దూకుడు ప్రదర్శించగా... రెండో అర్ధభాగంలో భారత్ జోరు కనబరిచింది. రెండు జట్లు గోల్స్ అవకాశాలు సృష్టించుకున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాయి. 68వ నిమిషంలో శుభాశీష్ బోస్, 81వ నిమిషంలో భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి బంగ్లాదేశ్ గోల్పోస్ట్ లక్ష్యంగా కొట్టిన షాట్లు బయటకు వెళ్లాయి. గ్రూప్ ‘సి’లో భారత్తోపాటు బంగ్లాదేశ్, హాంకాంగ్, సింగపూర్ జట్లున్నాయి. భారత్ తమ తదుపరి మ్యాచ్ను జూన్ 10న సింగపూర్తో ఆడుతుంది. గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు 2027 ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధిస్తుంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టును గట్టెక్కించిన కాస్టనెడా
పనాజీ: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఆరో ‘డ్రా’ నమోదు చేసుకుంది. చర్చిల్ బ్రదర్స్ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 1–1 గోల్స్తో ‘డ్రా’ చేసుకుంది. ఇంటర్ కాశీ జట్టుతో జరిగిన గత మ్యాచ్లో స్టాపేజ్ టైమ్లో గోల్ సమరి్పంచుకొని గెలవాల్సిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు ‘డ్రా’తో సరిపెట్టుకోగా... చర్చిల్ బ్రదర్స్ జట్టుతో స్టాపేజ్ టైమ్లో (90+11వ నిమిషంలో) గోల్ సాధించి ఓడిపోవాల్సిన మ్యాచ్లో ‘డ్రా’తో గట్టెక్కింది. స్టాపేజ్ టైమ్లో లభించిన పెనాల్టీ కిక్ను శ్రీనిధి డెక్కన్ జట్టు స్టార్ ప్లేయర్ డేవిడ్ కాస్టనెడా గోల్గా మలిచాడు. ఈ లీగ్లో ‘టాప్ గోల్స్కోరర్’గా కొనసాగుతున్న కాస్టనెడాకిది 15వ గోల్ కావడం విశేషం. అంతకుముందు 29వ నిమిషంలో పాపె గసామా చేసిన గోల్తో చర్చిల్ బ్రదర్స్ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 13 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 20 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. ఇందులో 7 మ్యాచ్ల్లో గెలిచి, 7 మ్యాచ్ల్లో ఓడి, 6 మ్యాచ్లను ‘డ్రా’గా ముగించి 27 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. శ్రీనిధి జట్టు తమ తదుపరి మ్యాచ్లో ఈనెల 30 గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆడుతుంది. -
రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్న టీమిండియా మాజీ కెప్టెన్
భారత ఫుట్బాల్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీ మళ్లీ నీలం రంగు జెర్సీతో బరిలోకి దిగనున్నాడు. 40 ఏళ్ల ఛెత్రీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నట్లు ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ ప్రకటించింది. ఛెత్రీ త్వరలో జరుగనున్న ఫిఫా ఇంటర్నేషనల్ విండోలో భారత్ తరఫున బరిలోకి దిగనున్నాడు. ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం ప్రకటించిన 26 మంది సభ్యుల భారత జట్టులో ఛెత్రీకి చోటు దక్కింది. ఏడాది గడుస్తున్నా భారత జట్టులో తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేకపోవడంతో రిటైర్మెంట్ విషయంలో ఛెత్రీ మనసు మార్చుకున్నాడు. పదేళ్లకు పైగా భారత జట్టుకు నాయకత్వం వహించిన ఛెత్రీ.. గతేడాది జూన్ 6న రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్కతాలో కువైట్తో జరిగిన ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్ ఛెత్రీకి చివరిది.2005లో భారత్ తరఫున అరంగ్రేటం చేసిన ఛెత్రీ.. భారత ఆల్టైమ్ లీడింగ్ గోల్ స్కోరర్గా కెరీర్ ముగించాడు. ఛెత్రీ భారత్ తరఫున అత్యధిక మ్యాచ్లు ఆడిన ఆటగాడిగానూ రికార్డు కలిగి ఉన్నాడు. ఛెత్రీ తన కెరీర్లో 94 అంతర్జాతీయ గోల్స్ సాధించాడు. పురుషుల అంతర్జాతీయ ఫుట్బాల్లో నాలుగో అత్యధిక గోల్ స్కోరర్గా ఛెత్రీ కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ ఫుట్బాల్లో దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో, లియోనల్ మెస్సీ, అలీ డై మాత్రమే ఛెత్రీ కంటే ఎక్కువ గోల్స్ చేశారు.ఛెత్రీ అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇండియన్ సూపర్ లీగ్లో బెంగళూరు ఎఫ్సీకి ప్రాతినిథ్యం వహిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ఛెత్రీ 12 మ్యాచ్ల్లో 23 గోల్స్ చేసి ఐఎస్ఎల్లో భారత్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కాగా, భారత ఫుట్బాల్ జట్టు ఏఎఫ్సీ ఆసియా కప్ సౌదీ అరేబియా 2027 క్వాలిఫయర్స్ ఫైనల్ రౌండ్ సన్నాహకాల్లో భాగంగా మార్చి 19న మాల్దీవ్స్తో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. అనంతరం భారత్ ఏఎఫ్సీ ఆసియా కప్-2027 క్వాలిఫయర్స్లో (మార్చి 25) బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ టోర్నీలో భారత్.. బంగ్లాదేశ్, హాంగ్కాంగ్, సింగపూర్ జట్లతో పోటీపడనుంది. ఈ టోర్నీలో భారత్ మ్యాచ్లు షిల్లాంగ్లోని జవహర్ లాల్ స్టేడియంలో జరుగనున్నాయి.ఫిఫా ఇంటర్నేషనల్ విండో కోసం భారత జట్టు..గోల్ కీపర్స్- అమరిందర్ సింగ్, గుర్మీత్ సింగ్, విశాల్ కైత్డిఫెండర్స్- ఆషికి కురునియన్, ఆయుశ్ దేవ్ ఛెత్రీ, బ్రాండన్ ఫెర్నాండెస్, బ్రైసన్ ఫెర్నాండెస్, జీక్సన్ సింగ్ థౌనౌజమ్, లాలెంగ్మావియా, లిస్టన్ కొలాకో, మహేశ్ సింగ్ నోరెమ్, సురేశ్ సింగ్ వాంగ్జమ్ఫార్వర్డ్స్- సునీల్ ఛెత్రీ, ఫరూక్ ఛౌదరీ, ఇర్ఫాన్ యద్వాద్, లల్లియన్జువాలా ఛంగ్టే, మన్వీర్ సింగ్ -
ఖేలో.. అమెరికన్ ఫ్లాగ్ ఫుట్బాల్
ఎన్నో విశిష్టతలున్న భాగ్యనగరం అంతర్జాతీయ క్రీడల్లోనూ తన ప్రశస్తిని కొనసాగిస్తుంది. ముఖ్యంగా క్రికెట్, టెన్నిస్ వంటి ప్రజాధరణ ఉన్న క్రీడలతో పాటు బ్యాడ్మింటన్ వంటి క్రీడలతో దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ అందించిన ఘనత నగరానికి ఉంది. ఇదే కోవలో మరిన్ని అంతర్జాతీయ క్రీడలు నగరంలో రాణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికన్ ఫుట్బాల్ సైతం ఈ మధ్య తన ప్రశస్తిని పెంచుకుంటుంది. నగరవాసులు అమెరికన్ ఫుట్బాల్పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆదరణ దృష్ట్యా తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రారంభమై ఈ క్రీడ అభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది. అమెరికన్ ఫుట్బాల్ క్రీడను నగరంతో పాటు రాష్ట్రంలో మరింత అభివృద్ధి చేసేందుకు అమెరికన్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థ అయిన తెలంగాణ అమెరికన్ ఫుట్బాల్ అసోసియేషన్ (టాఫా) కృషి చేస్తుంది. ఇందులో భాగంగా 2025–28 మధ్య కాలానికి అధ్యక్షుడిగా చాగన్ల బల్వీర్ందర్ నాథ్ను నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో అమెరికన్ ఫుట్బాల్, ఫ్లాగ్ ఫుట్బాల్ ప్రోత్సహించి, ఒలింపిక్స్ వేదికల పై మన క్రీడాకారుల నైపుణ్యాలను ప్రదర్శించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అమెరికా వంటి దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడగా ఈ అమెరికన్ ఫుట్బాల్ ప్రసిద్ధి చెందింది. సాకర్, రగ్బీ నుంచి వచ్చిన ఈ గేమ్ 2022లో లీగ్ వార్షిక ఆదాయం 18.6 బిలియన్ డాలర్లుగా నమోదు చేసి ప్రపంచంలోనే విలువైనస్పోర్ట్స్ లీగ్లో భాగంగా చేరింది. రాష్ట్ర వ్యాప్త గుర్తింపు దిశగా..ఈ క్రీడను హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వృద్ధిలోకి తీసుకురావడమే లక్ష్యంగా కృషి చేస్తున్నాం. దీని కోసం ప్రత్యేకంగా అన్ని పట్టణాల్లో, జిల్లాల్లో శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసి, వారికి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను కల్పిస్తాం. ఈ ప్రయత్నంలో భాగంగా అసోసియేషన్స్, క్లబ్స్ ఏర్పాటు చేయనున్నాం. మరో రెండేళ్లలో నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ స్థాయి లీగ్ను నిర్వహించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందులో దాదాపు 22 దేశాలను భాగం చేస్తున్నాం. యూనివర్సిటీలు, కాలేజీలు, స్కూల్స్లో ఔత్సాహిక క్రీడాకారులకు, యువతకు ప్రత్యేక శిక్షణ అందించనున్నాం. టాఫా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రావు నడిపల్లి, ఏఎఫ్ఎఫ్ఐ సీఈఓ సందీప్ చౌదరి వంటి దార్శనికుల ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందించాలని కొరనున్నాం. – చాగన్ల బల్వీర్ందర్ నాథ్, టాఫా అధ్యక్షులు.అమెరికన్ ఫుట్బాల్ గేమ్లో కాంటాక్ట్, నాన్కాంటాక్ట్ అనే ఈ విభాగాల్లో పోటీ ఉంటుంది. నాన్ కాంటాక్ట్ విభాగంలోని ఫ్లాగ్ గేమ్ ఇక్కడ అభివృద్ధిలో ఉంది. రగ్బీలా ఇందులో మ్యాన్ పుల్లింగ్ ఉండదు. నేను 13 ఏళ్ల నుంచి ఈ గేమ్ ఆడుతున్నాను. అంతేకాకుండా ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాను. ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రం నాలుగు నేషనల్స్ గెలిచింది. 2028 ఒలింపిక్స్ లక్ష్యంగా ప్రస్తుతం సన్నద్ధమవుతున్నాం. ఇందులో స్థానిక క్రీడాకారులను భాగం చేసేందుకు టాఫా ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి మాదిరిగా ఇక్కడ కూడా ఈ క్రీడకు పాపులారిటీ తీసుకురానున్నాం. – జీవీ మణికంఠ రెడ్డి, ఇండియన్ ఫ్లాగ్ ఫుట్బాల్ కెప్టెన్ -
భారత ఫుట్బాల్ జట్టులో తెలంగాణ ప్లేయర్
న్యూఢిల్లీ: నాలుగు దేశాలు పాల్గొనే పింక్ లేడీస్ కప్ అంతర్జాతీయ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్ కోసం భారత జట్టును ప్రకటించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని షార్జాలో ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు ఈ టోర్నీ జరుగుతుంది. 23 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణ అమ్మాయి, నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగులోత్ సౌమ్య చోటు సంపాదించింది. ఈనెల 7 నుంచి అనంతపురంలో శిక్షణ శిబిరంలో పాల్గొంటున్న భారత జట్టు నేడు యూఏఈకి బయలుదేరి వెళుతుంది. భారత జట్టు తమ తొలి మ్యాచ్ను ఈనెల 20న జోర్డాన్తో... రెండో మ్యాచ్ను 23న రష్యాతో... మూడో మ్యాచ్ 26న దక్షిణ కొరియా జట్టుతో ఆడుతుంది. ఈ ఏడాది మే–జూన్లలో జరిగే ఆసియా కప్–2027 క్వాలిఫయర్స్ టోర్నీకి సన్నాహాల్లో భాగంగా పింక్ లేడీస్ కప్లో భారత జట్టు బరిలోకి దిగుతోంది.‘పింక్ లేడీస్ కప్ టోర్నీ ద్వారా భారత క్రీడాకారిణులకు తమ సామర్థ్యమేంటో తెలుస్తుంది. రష్యాతో పోలిస్తే దక్షిణ కొరియా జట్టు పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండు జట్ల వీడియోలు పరిశీలించాను. రష్యా శైలితో పోలిస్తే కొరియా ఆటలో చాలా వేగం ఉంది. ఫలితంగా భారత జట్టు రెండు రకాలుగా వ్యూహాలు రచించి ఆడాల్సి ఉంటుంది’ అని భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి తెలిపాడు. భారత మహిళల ఫుట్బాల్ జట్టు: ఎలాంగ్బమ్ పంథోయ్ చాను, పాయల్ బసుదె, శ్రేయా హుడా (గోల్కీపర్లు), అరుణ బాగ్, కిరన్ పిస్దా, మార్టినా థోక్చోమ్, నిర్మలా దేవి ఫాన్జుబమ్, పూరి్ణమ కుమారి, సంజు, సిల్కీ దేవి హెమమ్, స్వీటీ దేవి ఎన్గాంగ్బమ్ (డిఫెండర్లు), బబీనా దేవి లిషామ్, గ్రేస్ డాంగ్మె, మౌసుమి ముర్ము, ప్రియదర్శిని సెల్లాదురై, ప్రియాంక దేవి నోరెమ్, రత్నబాల దేవి నోంగ్మైథెమ్ (మిడ్ ఫీల్డర్లు), కరిష్మా పురుషోత్తమ్, లిండా కోమ్ సెర్టో, మనీషా, రేణు, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్ (ఫార్వర్డ్స్). -
మెస్సీ కాదు!.. నేనే అత్యుత్తమ ఆటగాడిని: రొనాల్డో
దాదాపు దశాబ్ద కాలానికి పైగా ఫుట్బాల్ ప్రపంచంలో మకుటం లేని మహారాజులుగా వెలుగొందుతున్నారు పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo)- అర్జెంటీనా లెజెండ్ లియోనల్ మెస్సీ(Lionel Messi). అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకునే ఈ ఇద్దరికీ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. అయితే, ఈ వీళ్లిద్దరిలో ఎవరు గొప్ప అన్న చర్చ ఎప్పుడూ ఆసక్తికరమే.ఈ విషయంపై రొనాల్డో స్వయంగా స్పందించాడు. చాలా మంది మెస్సీకే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(GOAT) బిరుదు ఇచ్చేందుకు మొగ్గుచూపవచ్చని అభిప్రాయపడ్డాడు. అయితే, తాను మాత్రం పరిపూర్ణ ఫుట్బాలర్ని అని పేర్కొన్న రొనాల్డో.. ఫుట్బాల్ చరిత్రలో తన కంటే గొప్ప ఆటగాడు లేడని అనడం విశేషం.నేనే ‘కంప్లీట్ ప్లేయర్’స్పానిష్ మీడియా అవుట్లెట్ లాసెక్టా టీవీకి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టియానో రొనాల్డో మాట్లాడుతూ.. ‘‘నాలాగా ప్రపంచంలో పరిపూర్ణమైన ఫుట్బాలర్ మరెవరూ లేరని అనుకుంటా. ఇప్పటి వరకు ఉన్న ఫుట్బాల్ ఆటగాళ్లందరిలో నేనే ‘కంప్లీట్ ప్లేయర్’. నేను అన్ని రకాలుగా ఫుట్బాల్ ఆడగలను. చాలా మంది మెస్సీ, మారడోనా లేదంటే.. పీలే పేరు చెప్తారేమో!చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాడినివాళ్ల అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. ఏదేమైనా మోస్ట్ కంప్లీట్ ప్లేయర్ మాత్రం నేనే! ఫుట్బాల్ చరిత్రలోనే నేను అత్యుత్తమ ఆటగాడిని. నా కంటే మెరుగ్గా ఆడే ఫుట్బాలర్ను ఇంత వరకూ చూడలేదు. ఇవి నా మనస్ఫూర్తిగా చెబుతున్న మాటలు’’ అని పేర్కొన్నాడు.అదే విధంగా మెస్సీతో తన అనుబంధం గురించి చెబుతూ.. ‘‘మెస్సీతో నాకు ఎప్పుడూ ఎలాంటి సమస్యా లేదు. గత పదిహేనేళ్లుగా మేము అవార్డులు పంచుకుంటున్నాం. మా మాధ్య ఎలాంటి గొడవలు లేవు. అంతా సవ్యంగానే ఉంది.తనకోసం నేను ఆంగ్లాన్ని తర్జుమా చేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో భలే సరదాగా ఉండేవాళ్లం. ఇక ఆటగాళ్లుగా మేము ప్రత్యర్థులమే కదా. తను తన క్లబ్కి, నేను నా క్లబ్కి మద్దతుగా ఉంటాం. జాతీయ జట్ల విషయంలోనూ అంతే. అయితే, ఆటతీరు ఎలా ఉందన్న అంశంపై పరస్పరం చర్చించుకుంటూ.. ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. మా మధ్య ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన పోటీయే ఉంటుంది’’ అని రొనాల్డో తెలిపాడు.కాగా 2002లో పోర్చుగీస్ క్లబ్ స్పోర్టింగ్ జీపీ తరఫున ప్రొఫెషనల్ ఫుట్బాలర్గా ఎంట్రీ ఇచ్చిన రొనాల్డో.. క్లబ్, అంతర్జాతీయ స్థాయిలో కలిపి ఓవరాల్గా 923 గోల్స్తో టాప్ గోల్స్కోరర్గా కొనసాగుతున్నాడు. తన సుదీర్ఘ కెరీర్లో ఎన్నో రికార్డులు సాధించిన రొనాల్డోకు ఫిఫా వరల్డ్కప్ మాత్రం అందని ద్రాక్షగా మిగిలిపోయింది. 648 మిలియన్ల మంది ఫాలోవర్లుఅయితే, ఈ విషయంలో మెస్సీదే పైచేయి. కెప్టెన్గా అర్జెంటీనాకు ప్రపంచకప్ అందించిన ఘనత అతడికి దక్కింది. ఇక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫాలోవర్ల విషయంలోనూ రొనాల్డో- మెస్సీ మధ్య పోటీ ఉంది. అయితే, ఇందులో పోర్చుగీస్ ఆటగాడిదే ఆధిపత్యం. ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్లు రొనాల్డోకు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అతడికి ఏకంగా 648 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా.. మెస్సీకి 504 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: CT 2025: సమయం మించిపోలేదు.. అతడిని జట్టులోకి తీసుకోండి: అశ్విన్ -
కళ్లు చెదిరే ఇన్స్టా రీల్ : 55.4 కోట్లతో రికార్డులు బద్దలు
సోషల్ మీడియాలో ఒక పోస్ట్కు, లేదా ఒక వీడియోకు లేదా ఒక రీల్కు దక్కిన వ్యూస్, కామెంట్స్ ఆధారంగా దాని ప్రాధాన్యతను అంచనా వేస్తుంటాం సాధారణంగా. క్రియేట్ చేసినవాళ్లే ఆశ్చర్యపోయేలా మిలియన్ల వ్యూస్తో ప్రజాదరణ పొంది, రికార్డులను క్రియేట్ చేసే కొన్ని విశేషమైన వీడియోలను కూడా చూస్తుంటాం. ఇలా సరదాగా సృష్టించిన ఒక రీల్ రికార్డు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా చూసిన ఈ వైరల్ క్లిప్ నెట్టింట వైరల్గా మారింది. రండి.. ఆ రికార్డ్ స్టంట్ రీల్ కథాకమామిష్షు ఏంటో తెలుసుకుందాం.ఒకటీ రెండూ ఏకంగా 55.4 కోట్ల (554 మిలియన్ల) మంది ఆ రీల్ను వీక్షించారంటే మరి ప్రపంచ రికార్డు కాక మరేమిటి. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఈ ఫీట్ సాధించింది ఎవరో తెలుసా? భారతదేశంలోని కేరళకు చెందిన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ ఆటగాడు 21 ఏళ్ల ముహమ్మద్ రిజ్వాన్. ఈ స్టార్ ప్లేయర్ కంటెంట్ క్రియేటర్గా కూడా పాపులర్ అయ్యాడు. 2023 నవంబరులో ఈ రీల్ పోస్ట్ చేశాడు. అప్పటినుంచి ఇది వైరల్ అవుతూ రికార్డును కొట్టేసింది. మలప్పురంలోని కేరళంకుండు జలపాతం వద్ద చిత్రీకరించిన రీల్ను పోస్ట్ చేశాడు. ఈ రీల్లో ఒక జలపాతం వద్ద బంతిని బలంగా తంతాడు. దీంతో ఆ బంతి జలపాతం వెనుక ఉన్న రాళ్ల నుండి ఎగిరి పడుతుంది. అద్భుతమైన ఈ దృశ్యం చూసి రిజ్వాన్ కూడా ఆశ్చర్యపోయాడు. కేవలం క్రీడాకారులను మాత్రమే కాదు, కోట్లాదిమంది నెటిజనులను కూడా ఆకట్టుకుంది. అప్పటి నుండి, రీల్ ప్రజాదరణ పొందింది, 92 లక్షలకు పైగా (9.2 మిలియన్లు) లైక్లు మరియు 42,000 కంటే ఎక్కు లక్షల కొద్దీ లైక్స్, కామెంట్లను దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించిన ఇన్స్టాగ్రామ్ రీల్తో అవార్డు కూడా పొందాడు. ఇదీ చదవండి: మార్కెట్లో విరివిగా పచ్చి బఠాణీ : పిల్లలుమెచ్చే, ఆరోగ్యకరమైన వంటకాలువిశేషం ఏమిటంటేఅతని రీల్ జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్ జనాభా కంటే ఎక్కువ వీక్షణలను సాధించడం విశేషమే మరి. జర్మనీ, ఫ్రాన్స్ స్పెయిన్ల ఉమ్మడి జనాభా కంటే ఎక్కువ వ్యూస్ అంటూ నెటిజన్లను రిజ్వాన్ను పొగడ్తలతో ముంచెత్తారు.రిజ్వాన్ స్పందన“నేను దీన్ని ఎప్పుడూ ఊహించలేదు. ఇది స్నేహితులతో సరదాగా గడిపిన వీడియో. 10 నిమిషాల్లోనే, దీనికి 2లక్షలవీక్షణలు వచ్చాయి . నేను ఇంటికి చేరుకునే సమయానికి, అది మిలియన్కు చేరుకుంది.” అంటూ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ గుర్తింపురిజ్వాన్ అసాధారణ విజయాన్ని ఈ ఏడాది జనవరి 8న అధికారికంగా గుర్తించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిజ్వన్ షేర్ చేశాడు. అదే జలపాతం వద్ద, ఒక చేతిలో వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ను, మరో చేతిలో ఫుట్బాల్ను పట్టుకుని, తనను ఆదరించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. (బామ్మకు స్వీట్ సర్ప్రైజ్ : 20 లక్షలకు పైగా వ్యూస్) View this post on Instagram A post shared by muhammed riswan (@riswan_freestyle) కేవలం 21 సంవత్సరాల వయస్సులో, రిజ్వాన్ తన వైరల్ రీల్కు మాత్రమే కాకుండా తన అద్భుతమైన ఫ్రీస్టైల్ ఫుట్బాల్ నైపుణ్యాలకు కూడా ప్రపంచ సంచలన ఆటగాడు. ఆటలోని విన్యాసాలకు పరిమితం కాలేదు రిజ్వాన్ పర్వత శిఖరాలపై, కారు పైకప్పులపై మకా, నీటి అడుగున కూడా విన్యాసాలు చేయడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఫుట్బాల్తో పాటు, రిజ్వాన్ రోజువారీ వస్తువులతో కూడా సృజనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. -
తెలంగాణ ‘డ్రా’తో మొదలు
సాక్షి, హైదరాబాద్: ఐదున్నర దశాబ్దాల తర్వాత హైదరాబాద్ గడ్డపై జరుగుతున్న ప్రతిష్టాత్మక సంతోష్ ట్రోఫీ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్ (రెండో రౌండ్)లో తెలంగాణ ‘డ్రా’తో మొదలు పెట్టింది. శ్రీనిధి ఫుట్బాల్ క్లబ్ గ్రౌండ్లో శనివారం జరిగిన మ్యాచ్లో తెలంగాణ, రాజస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ 1–1 స్కోరుతో ‘డ్రా’గా ముగిసింది. తొలి అర్ధ భాగంలో ఇరు జట్లు రక్షణాత్మక ధోరణితో ఆడాయి. అడపాదడపా తెలంగాణ స్ట్రయికర్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్ లక్ష్యంగా స్కోరు చేసేందుకు చేసిన ప్రయత్నాల్ని రాజస్తాన్ డిఫెండర్లు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.అలాగే రాజస్తాన్ దాడుల్ని తెలంగాణ రక్షణ పంక్తి నిలువరించడంతో మొదటి అర్ధభాగం ఒక్క గోల్ అయినా నమోదుకు కాకుండానే 0–0తో ముగిసింది. ద్వితీయార్ధం మొదలైన ఎనిమిది నిమిషాలకే రాజస్తాన్ ఖాతా తెరిచింది. 53వ నిమిషంలో ఫార్వర్డ్ ఆటగాడు అమిత్ గోడార చక్కని సమన్వయంతో తెలంగాణ డిఫెండర్లను బోల్తాకొటిస్తూ గోల్ను లక్ష్యానికి చేర్చడంతో రాజస్తాన్ 1–0తో ఆధిక్యంలో వెళ్లింది. తర్వాత స్కోరు సమం చేసేందుకు తెలంగాణ స్ట్రయికర్లు ఎంతగా శ్రమించినా ఫినిషింగ్ లోపాలతో గోల్ అయితే కాలేదు. ఇక పరాజయం ఖాయమనుకున్న దశలో అనూహ్యంగా తేజావత్ సాయి కార్తీక్ ఆఖరి నిమిషంలో అద్భుతం చేశాడు. 90వ నిమిషంలో చాకచక్యంగా సాయి కార్తీక్ చేసిన గోల్తో తెలంగాణ 1–1తో గట్టెక్కింది. గోల్ పోస్ట్ వద్ద రాజస్తాన్ స్ట్రయికర్లను నిలువరించిన తెలంగాణ డిఫెండర్ తజాముల్ హుస్సేన్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. టోర్నీ రెండో రౌండ్లో మొత్తం 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. టాప్–4లో నిలిచిన టీమ్లు క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. శనివారం జరిగిన ఇతర మ్యాచ్లలో బెంగాల్ 3–1తో జమ్మూ కశీ్మర్పై... మణిపూర్ 1–0తో సరీ్వసెస్పై గెలుపొందాయి. -
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్లో భారత్కు తొలి పతకం
టెక్బాల్ వరల్డ్ ఛాంపియన్షిప్స్-2024లో భారత్కు తొలి పతకం లభించింది. పురుషుల డబుల్స్ విభాగంలో అనాస్ బేగ్, డెక్లన్ గొంజాల్వెస్ జోడీ కాంస్య పతకం కైవసం చేసుకుంది. టెక్బాల్ క్రీడలోకి ఇటీవలే ప్రవేశించిన బేగ్-గొంజాల్వెస్ జోడీ అంచనాలకు మించి రాణించి అభిమానులను ఆకట్టుకుంది. తృటిలో స్వర్ణం రేసు నుంచి తప్పుకున్న భారత జోడీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. బేగ్-గొంజాల్వెస్ జోడీ సెమీఫైనల్లో పటిష్టమైన థాయ్లాండ్ జోడీ చేతిలో ఓటమిపాలైంది. టెక్బాల్లో పతకం సాధించిన 11వ దేశంగా భారత్ రికార్డుల్లోకెక్కింది.On our photo of the day none other than team India! The duo who achieved a historical bronze medal!•#Teqball #WTCH24 #WorldChampionships #Vietnam pic.twitter.com/AGzzVv8sRI— TEQBALL (@Teqball) December 8, 2024టెక్బాల్ అంటే.. టెక్బాల్ అనేది సెపక్ తక్రా మరియు టేబుల్ టెన్నిస్ అంశాలతో కూడిన క్రీడ. ఈ క్రీడను కర్వ్డ్ (వంగిన) టేబుల్పై ఆడతారు. ఈ క్రీడలో ఆటగాళ్ళు చేతులు మినహా మిగతా అన్ని శరీర భాగాలను వాడతారు. ఈ క్రీడలో ఫుట్బాల్ తరహా బంతిని వాడతారు. టెక్బాల్ను సింగిల్స్ లేదా డబుల్స్ గేమ్గా ఆడవచ్చు. ఈ క్రీడ 2014లో పరిచయం చేయబడింది. ఈ క్రీడ అంతర్జాతీయ టెక్బాల్ ఫెడరేషన్ (FITEQ) ద్వారా అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించబడుతుంది. ప్రపంచ స్థాయి ఫుట్బాల్ ఆటగాళ్లు ఈ క్రీడ పట్ల ఆకర్షితులవుతున్నారు. -
రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్బాలర్ నాని
పోర్చుగీస్ స్టార్ ఫుట్బాలర్, మాంచెస్టర్ యునైటెడ్ మాజీ ఆటగాడు నాని రిటైర్మెంట్ ప్రకటించాడు. 32 ఏళ్ల నాని సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. నాకు ఇష్టమైన క్రీడకు వీడ్కోలు చెప్పే సమయం అసన్నమైంది. ప్రొఫెషనల్ ప్లేయర్గా నా కెరీర్ను ముగించాలని నిర్ణయించుకున్నాను.నా ఈ 20 ఏళ్ల అద్భుత ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు. నా కొత్త లక్ష్యాలపై దృష్టి సారించేందుకు ప్రయత్నిస్తాను. మళ్లీ మనం కలుద్దాం అని ఇన్స్టాగ్రామ్లో నాని రాసుకొచ్చాడు. కాగా నాని 2007 మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ తరపున తన కెరీర్ను ఆరంభించాడు. ఈ ప్రతిష్టాత్మక క్లబ్ తరపున 230 మ్యాచ్లు ఆడి 41 గోల్స్ చేశాడు. గోల్స్ సమయంలో మరో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కీలక సహచరుడిగా నానికి పేరుంది. నాని తన వాలెన్సియా, లాజియో, ఓర్లాండో సిటీ, వెనిజియా, మెల్బోర్న్ విక్టరీ అదానా డెమిర్స్పోర్ల వంటి మొత్తం 10 క్లబ్ల తరపున ఆడాడు.నాని తన జాతీయ జట్టు పోర్చుగల్ తరపున 112 మ్యాచ్లు ఆడి 24 గోల్స్ చేశాడు. అదే విధంగా 2016లో యూరోపియన్ ఛాంపియన్షిప్ విజేత నిలిచిన పోర్చుగల్ జట్టులో అతడు సభ్యునిగా ఉన్నాడు.చదవండి: ENG vs NZ: ఓటమి బాధలో ఉన్న న్యూజిలాండ్కు భారీ షాక్ -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు రెండో విజయం
సాక్షి, హైదరాబాద్: దేశవాళీ ఫుట్బాల్ లీగ్ ఐ–లీగ్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు రెండో విజయం నమోదు చేసింది. డెక్కన్ ఎరీనాలో గురువారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టు 2–1 గోల్స్ తేడాతో రాజస్తాన్ యునైటెడ్ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున ఏంజెల్ ఒరెలీన్ (21వ, 86వ నిమిషంలో) రెండు గోల్స్ చేశాడు. రాజస్తాన్ యునైటెడ్ జట్టుకు మన్చోంగ్ (57వ నిమిషంలో) ఏకైక గోల్ అందించాడు. 12 జట్లు పోటీపడుతున్న ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు ఆరు పాయింట్లతో ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్లో ఈనెల 9న ఢిల్లీ ఎఫ్సీతో శ్రీనిధి డెక్కన్ జట్టు తలపడుతుంది. -
57 ఏళ్ల తర్వాత హైదరాబాద్లో సంతోష్ ట్రోఫీ ఫైనల్
న్యూఢిల్లీ: సుదీర్ఘ విరామం తర్వాత జాతీయ సీనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ ‘సంతోష్ ట్రోఫీ’ ఫైనల్ రౌండ్ పోటీలు హైదరాబాద్లో జరగనున్నాయి. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 14 నుంచి 31 వరకు క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ను నిర్వహిస్తామని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) సోమవారం ప్రకటించింది. చివరిసారి హైదరాబాద్ 1967లో సంతోష్ ట్రోఫీ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది. ఈసారి ఫైనల్ రౌండ్ టోర్నీలో మొత్తం 12 జట్లు పోటీపడతాయి. ఇందులో తొమ్మిది గ్రూప్ విజేతలుగా కాగా... గత ఏడాది చాంపియన్ సర్వీసెస్, రన్నరప్ గోవా జట్లు ఉన్నాయి. 12 జట్లను రెండు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ దశ మ్యాచ్లు డెక్కన్ ఎరీనాలో జరుగుతాయి. నాకౌట్ మ్యాచ్లు గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తారు. రెండు గ్రూప్ల్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు డిసెంబర్ 26, 27వ తేదీల్లో జరిగే క్వార్టర్ ఫైనల్స్లో తలపడతాయి. సెమీఫైనల్స్ డిసెంబర్ 29న, ఫైనల్ డిసెంబర్ 31న ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సంతోష్ ట్రోఫీ 77 సార్లు జరిగింది. పశ్చిమ బెంగాల్ జట్టు రికార్డుస్థాయిలో 32 సార్లు విజేతగా నిలిచింది. -
ఫుట్బాల్ మ్యాచ్లో గొడవ.. 100 మంది మృతి
సౌత్ ఆఫ్రికాలోని గినియా దేశంలో పెను విషాదం చోటుచేసుకుంది. గినియాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఎన్జెరెకోర్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా అభిమానుల మధ్య భారీ ఘర్షణ జరిగింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు 100 మందికి పైగా మరణించారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.కాగా గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ గౌరవార్థం జెరెకొరె నగరంలో ఆదివారం ఫుట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు. దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది.అనంతరం వందలాది మంది వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులు చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ను కూడా ధ్వంసం చేసి, నిప్పంటించారు. ఈ క్రమంలో వంద మందికిపైగా మరణించగా.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీధులంతా రక్తసిక్తంగా మారాయి. ఎక్కడ చూసినా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.⚠️🔞 WARNING: GRAPHIC 18+ 🔞⚠️❗️🇬🇳 - At least 100 people lost their lives in violent clashes between rival fans during a football match in N'zerekore, Guinea. This tragic event, which occurred at the end of a game, resulted in hundreds of fatalities. Medical sources confirmed… pic.twitter.com/xV3COoViUE— 🔥🗞The Informant (@theinformant_x) December 2, 2024 -
బ్రెజిలియన్ సాకర్ స్టార్ నెయ్మార్.. అదిరిపోయే లగ్జరీ పెంట్ హౌస్ (ఫోటోలు)
-
దుబాయ్లో ఫుట్బాల్ సూపర్స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్లో బ్రెజిలియన్ ఫుట్బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్లోని బుగాట్టి రెసిడెన్స్లో ఉన్న ఈ పెంట్హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్బాల్ సూపర్స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియోలో లగ్జరీ పెంట్హౌస్ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
హైదరాబాద్: గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫుట్బాల్ సందడి (ఫొటోలు)
-
కొడుకు పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసిన సానియా మీర్జా.. వారం తర్వాత ఇలా (ఫొటోలు)
-
పిడుగుపాటుకు ఫుట్బాల్ ఆటగాడి మృతి.. వైరల్ వీడియో
ఫుట్బాల్ మైదానంలో ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా పిడుగు పడి ఓ ఫుట్బాలర్ ప్రాణాలు కోల్పోయాడు. రిఫరీ, మరో నలుగురు ఆటగాళ్లు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషాద ఘటన పెరూ దేశంలో గత ఆదివారం జరిగింది.వివరాల్లోకి వెళితే.. పెరూలోని హ్యూయాన్కాయోలో నవంబర్ 3వ తేదీన దేశీయ ఫుట్బాల్ క్లబ్లు అయిన జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొకా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్లుండి వర్షం మొదలుకావండతో రిఫరీ మ్యాచ్ను నిలిపివేశాడు. ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్ బాట పడుతుండగా.. 39 ఏళ్ల జోస్ హ్యూగో లా క్రూజ్ మెసాపై పిడుగు పడింది. In Peru, a soccer player died after being struck by lightning during a matchThe tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ— NEXTA (@nexta_tv) November 4, 2024పిడుగు నేరుగా హ్యూగోపై పడటంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పిడుగు ప్రభావం సమీపంలో గల రిఫరీ సహా నలుగురు ఆటగాళ్లపై పడటంతో వారు ఆసుపత్రిపాలయ్యారు. ఈ ఐదుగురికి కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది.గతంలో కూడా పిడుగుపాటు కారణంగా ఫుట్బాల్ మైదానంలో ఆటగాళ్లు మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేసియాలో ఇలాగే ఓ స్థానిక ఆటగాడిపై పిడుగు పడటంతో అతను కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. -
ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న రోడ్రి
స్పానిష్ ఫుట్బాలర్, మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ రోడ్రీ ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్-2024 అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం రోడ్రీతో రియల్ మాడ్రిడ్కు చెందిన వినిసియస్ జూనియర్, జూడ్ బెల్లింగ్హమ్తో పోటీ పడ్డారు. మాంచెస్టర్ సిటీ గత సీజన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలవడంతో రోడ్రీ కీలకపాత్ర పోషించాడు. అలాగే స్పెయిన్ ఈ ఏడాది యూరో టైటిల్ గెలవడంలోనూ కీ రోల్ ప్లే చేశాడు. ఇంగ్లీష్ క్లబ్ నుంచి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న తొలి ఫుట్బాలర్ రోడ్రీనే. మహిళల విషయానికొస్తే.. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ అవార్డు స్పెయిన్ కే చెందిన ఐటానా బొన్మాటీకి దక్కింది. బొన్మాటీ బార్సిలోనా క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తుంది. ఉత్తమ యువ ఫుట్బాలర్ అవార్డు విషయానికొస్తే.. ఈ అవార్డు లామిన్ యామల్కు దక్కింది. ఉత్తమ పురుషుల జట్టుగా రియల్ మాడ్రిడ్, ఉత్తమ మహిళల జట్టుగా బార్సిలోనా అవార్డులు దక్కించుకున్నాయి. పారిస్లో ఈ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. -
జంషెడ్పూర్కు మూడో విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో జంషెడ్పూర్ జట్టు 2–0తో ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్పై విజయం సాధించింది. జంషెడ్పూర్ జట్టు తరఫున రెయి తెచికవా (21వ నిమిషంలో), లాల్చుంగ్నుంగా (70వ ని.లో) చెరో గోల్ చేశారు. నిర్ణీత సమయంలో జంషెడ్పూర్ జట్టు కన్నా ఎక్కువసేపు బంతిని తమ ఆ«దీనంలో ఉంచుకున్న ఈస్ట్బెంగాల్ జట్టు వరుస దాడులతో ఒత్తిడి పెంచినా.. జంషెడ్పూర్ రక్షణ శ్రేణిని ఛేదించలేకపోయింది. జంషెడ్పూర్కు ఆడిన నాలుగు మ్యాచ్ల్లో ఇది మూడో విజయం కాగా.. 9 పాయింట్లతో ఆ జట్టు పట్టికలో మూడో స్థానానికి చేరింది. ఇక నాలుగో పరాజయం మూటగట్టుకున్న ఈస్ట్ బెంగాల్ జట్టు పట్టిక అట్టడుగున ఉంది. శనివారమే జరిగిన మరో మ్యాచ్లో మోహన్ బగాన్ సూపర్ జెయింట్ 3–0తో మొహమ్మదాన్ స్పోరి్టంగ్ క్లబ్పై గెలిచింది. మోహన్ బగాన్ తరఫున జేమీ మెక్లారెన్ (8వ నిమిషంలో), సుభాశీష్ బోస్ (31వ ని.లో), గ్రెగ్ స్టెవార్ట్ (36వ ని.లో) తలా ఒక గోల్ కొట్టారు. తాజా సీజన్లో మోహన్ బగాన్ జట్టుకు ఇది రెండో విజయం కాగా... 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న ఆ జట్టు పట్టికలో నాలుగో స్థానానికి చేరింది. మొహమ్మదన్ జట్టు రెండో ఓటమి మూటగట్టుకుంది. గత నెల 13న మొదలైన ఐఎస్ఎల్లో ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరిగాయి. ఇందులో ఎనిమిది మ్యాచ్ల్లో ఫలితాలు రాగా... ఏడు మ్యాచ్లు ‘డ్రా’గా ముగిశాయి. 11 రోజుల విరామం అనంతరం ఈ నెల 17న నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్తో చెన్నైయిన్ ఫుట్బాల్ క్లబ్ ఆడనుంది. -
12న భారత్, వియత్నాం ఫుట్బాల్ మ్యాచ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు ఈ నెల 12న వియత్నాంతో అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనుంది. నిజానికి వియత్నాంలో ఈనెల 7 నుంచి 15 వరకు భారత్ ముక్కోణపు టోర్నీలో పాల్గొనాల్సి ఉండగా... మూడో దేశం లెబనాన్ టోర్నీ నుంచి తప్పుకుంది. ప్రస్తుతం లెబనాన్లోని హెజ్»ొల్లా ఉగ్రవాద సంస్థ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర స్థాయిలో వైమానిక దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో లెబనాన్లో గగనతల ప్రయాణం క్లిష్టమైంది. దీంతో లెబనాన్ తప్పుకోవాల్సి వచ్చింది. ముక్కోణపు టోర్నీ సాధ్యపడకపోవడంతో ఇరు దేశాల ఫుట్బాల్ సమాఖ్యలు ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహణకు మొగ్గుచూపాయి. ‘లెబనాన్ వైదొలగడంతో ముక్కోణపు టోర్నీ రద్దయ్యింది. దీంతో ఆతిథ్య వియత్నాం జట్టుతో భారత సీనియర్ జట్టు ఏకైక ఫ్రెండ్లీ మ్యాచ్ను ఆడుతుంది’ అని అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది. వియత్నాం రాజధాని హనోయ్కి 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న తియెన్ తువోంగ్ స్టేడియంలో ఈ నెల 12న ఇరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. అక్కడికి బయలుదేరే ముందు భారత ఫుట్బాల్ ఆటగాళ్లంతా 5న కోల్కతాలో కలుసుకుంటారు. హెడ్కోచ్ మనొలో మార్కెజ్ నేతృత్వంలో 6న ట్రెయినింగ్ సెషన్లో పాల్గొంటారు. ఆ మరుసటి రోజే కోల్కతా నుంచి వియత్నాంకు భారత జట్టు పయనమవుతుంది. ఇదివరకే ఈ మ్యాచ్ కోసం 26 మంది సభ్యులతో కూడిన ప్రాబబుల్స్ను ప్రకటించారు. వియత్నాం బయలుదేరేముందు తుది 23 సభ్యుల జట్టును ఖరారు చేస్తారు. -
ప్రత్యర్థిని కొరికేశాడు
ప్రిస్టన్ (ఇంగ్లండ్): హోరాహోరీగా సాగుతున్న ఫుట్బాల్ మ్యాచ్లో ఒక ఆటగాడు తన ప్రత్యర్థి మెడ దగ్గర గట్టిగా కొరికేశాడు. అంతే ఇంగ్లండ్ ఫుట్బాల్ సంఘం (ఈఎఫ్ఏ) ఆగ్రహానికి గురయ్యాడు. నిషేధం, జరిమానా రెండు పడ్డాయి. ఇక వివరాల్లోకెళితే... ఇంగ్లండ్లో సెకండ్ డివిజన్ ఫుట్బాల్ పోటీలు జరుగుతున్నాయి. ప్రిస్టన్, బ్లాక్బర్న్ల మధ్య పోటాపోటీగా మ్యాచ్ జరుగుతోంది. ప్రిస్టన్ ఆటగాడు మిలుటిన్ ఉస్మాజిక్ ఉన్నపళంగా తనను నిలువరిస్తున్న బ్లాక్బర్న్ డిఫెండర్ ఒవెన్ బెక్ మెడ వెనుక కొరికేశాడు. ఇంత జరిగినా... రిఫరీకి చెప్పినా ఉస్మాజిక్కు మాత్రం రెడ్కార్డ్ చూపలేదు. బయటికి పంపలేదు. గత నెల 22న ఈ మ్యాచ్ జరుగగా... అప్పీల్ తదుపరి విచారణ అనంతరం తాజాగా ఈఎఫ్ఏ ఉస్మాజిక్పై ఎనిమిది మ్యాచ్ల నిషేధం విధించడంతో పాటు 15 వేల పౌండ్లు (రూ.16.80 లక్షలు) జరిమానాగా విధించింది. ఇలా కొరకడంలో ఉరుగ్వే స్ట్రయికర్ లూయిస్ స్వారెజ్ ఫుట్బాల్ అభిమానులకు చిరపరిచితుడు. 2013లో జరిగిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్లో బార్సిలోనా స్ట్రయికర్ స్వారెజ్... చెల్సియా డిఫెండర్ బ్రానిస్లావ్ ఇవానోవిచ్ను కొరకడంతో ఏకంగా 10 మ్యాచ్ల నిషేధం విధించారు. అయినా అతని బుద్ధి మారలేదు. ఆ మరుసటి ఏడాది బ్రెజిల్లో జరిగిన ఫుట్బాల్ ప్రపంచకప్ (2014)లో స్వారెజ్ ఇటలీ డిఫెండర్ జియోర్జియో చిలినిని కొరికాడు. దీంతో మళ్లీ నాలుగు మ్యాచ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. -
ఇండియన్ సూపర్ లీగ్.. జంషెడ్పూర్ ఎఫ్సీ కీలక విజయం
జంషెడ్పూర్: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో జంషెడ్పూర్ ఎఫ్సీ కీలక విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్లో జంషెడ్పూర్ 3–2 గోల్స్ తేడాతో ముంబై సిటీ ఎఫ్సీని ఓడించింది. జంషెడ్పూర్ తరఫున 36వ నిమిషంలో జె.ముర్రే...44వ, 50వ నిమిషాల్లో జేవీ హెర్నాండెజ్ గోల్స్ నమోదు చేశారు. ముంబై ఆటగాళ్లలో ఎన్.కరేలిస్ 18వ నిమిషంలో, వాన్ నీఫ్ 77వ నిమిషంలో గోల్స్ సాధించారు.కోల్కతాలో మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్, ఎఫ్సీ గోవా మధ్య జరిగిన మరో మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. మొహమ్మదాన్ తరఫున 66వ నిమిషంలో పెనాల్టీ ద్వారా ఎ.గోమెజ్ గోల్ కొట్టగా...గోవా ఆటగాళ్లలో ఎ.సాదికు (90+4) ఏకైక గోల్ సాధించాడు. కొచ్చిలో నేడు జరిగే మ్యాచ్లో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ తలపడుతుంది. -
ఇటలీ మేటి ఫుట్బాలర్ స్కిలాచీ కన్నుమూత
రోమ్: ఇటలీ మాజీ ఫుట్బాల్ ప్లేయర్ సాల్వటోర్ స్కిలాచీ(Salvatore Schillaci) బుధవారం కన్నుమూశాడు. 59 ఏళ్ల స్కిలాచీ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్నాడు. స్వదేశంలో జరిగిన 1990 ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నీలో స్కిలాచీ 6 గోల్స్తో టాప్ స్కోరర్గా నిలిచి ‘గోల్డెన్ బూట్’ అవార్డు గెలిచాడు. అదే విధంగా..‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’కి ఇచ్చే ‘గోల్డెన్ బాల్’ అవార్డును కూడా దక్కించుకున్నాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇటలీ మూడో స్థానం సాధించింది. ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను ఓడించిన జర్మనీ విజేతగా నిలిచింది. అయితే వ్యక్తిగత ప్రదర్శనతో ఇటలీ స్ట్రయికర్ స్కిలాచీ అభిమానుల్ని అలరించాడు.చదవండి: మాళవిక సంచలనం -
స్నేహితులతో వెకేషన్లో ధోని (ఫొటోలు)
-
పురోగతి కోసం ప్రక్షాళన!
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) అన్ని రకాలుగా అథమ స్థితికి చేరిందని, దీనిలో సమూల మార్పులు అవసరమని భారత మాజీ ఆటగాడు, మాజీ కెపె్టన్ భైచుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ ఫుట్బాల్లో మన టీమ్ పరిస్థితి మరింత దిగజారడానికి ఏఐఎఫ్ఎఫ్ కారణమని అతను తీవ్రంగా విమర్శించాడు. జట్టు ప్రణాళికల విషయంలో ఎలాంటి ముందు చూపు లేకపోవడం వల్లే ఇటీవల కాంటినెంటల్ కప్లో సిరియా చేతిలో ఓటమి ఎదురైందని... బలహీనమైన మారిషస్తో కూడా మ్యాచ్ గెలవలేకపోయామని భూటియా అన్నాడు. ‘భారత ఫుట్బాల్కు సంబంధించి గత కొంత కాలంగా ఎలాంటి మంచి పరిణామాలు జరగడం లేదు. నిలకడగా 100వ ర్యాంక్లో ఉంటూ వచ్చిన జట్టు ఇప్పుడు 125కు పడిపోయింది. ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గం ఏర్పాటు చేయడం ఎంతో అవసరం. లేదంటే పరిస్థితి మరింతగా దిగజారుతుంది. మన టీమ్కు సంబంధించి చర్చ అవసరం. ఏఐఎఫ్ఎఫ్ నియమావళిలోనే సమస్య ఉంది. దానిని మార్చాల్సిందే. సుప్రీం కోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుకు సంబంధించి అడ్డంకులు తొలగిపోతే కొత్త కార్యవర్గాన్ని వెంటనే ఎంచుకోవాలి’ అని భూటియా చెప్పాడు. ఏదో విజన్ 2046 అని కాగితాల్లో రాసుకుంటే కుదరదని, దాని కోసం పని చేయాల్సి ఉంటుందని అతను సూచించాడు. ‘గత రెండేళ్లుగా ఏఐఎఫ్ఎఫ్లో ఎన్నో ఆరోపణలు, వివాదాలు వచ్చి ఆటపై ప్రతికూల ప్రభావం చూపించాయి. నేను ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నప్పుడు ఫుట్బాల్కంటే కూడా సామాజిక అంశాలపై అంతా మాట్లాడటం చూసి ఆశ్చర్యమేసింది. ఫుట్బాల్ ఫెడరేషన్ ఒక స్వచ్ఛంద సంస్థలాగా పని చేస్తే కుదరదు. ఫుట్బాల్ అభివృద్ధి, జట్టు విజయం అనేదే ప్రధాన బాధ్యత. నేను పదవుల కోసం పోరాడదల్చుకోలేదు. ఆటను ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా అంతా పని చేయాలి’ అని భూటియా వివరించాడు. -
‘డ్రా’తో మొదలైన ఐఎస్ఎల్
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) 11వ సీజన్ ‘డ్రా’తో ప్రారంభమైంది. గత ఏడాది ఫైనలిస్ట్లు ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్, మోహన్ బగాన్ సూపర్ జెయింట్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ 2–2 గోల్స్తో సమంగా ముగిసింది. ముంబై సిటీ తరఫున థేర్ క్రూమ్ 90వ నిమిషంలో గోల్ సాధించాడు. మోహన్ బగాన్ తరఫున తిరి 70వ నిమిషంలో, ఆల్బర్టో రోడ్రిగ్వెజ్ 28వ నిమిషంలో గోల్స్ కొట్టారు. అయితే మ్యాచ్ ఆరంభంలోనే 9వ నిమిషంలో తిరి సెల్ఫ్ గోల్ చేయడం తుది ఫలితం సమంగా ముగిసేందుకు కారణమైంది. సొంత మైదానంలో భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య మోహన్ బగాన్ మ్యాచ్ ఆద్యంతం దూకుడు ప్రదర్శించినా... ఈ టీమ్ను నిలువరించడంలో ముంబై సఫలమైంది. ఐఎస్ఎల్లో భాగంగా నేడు రెండు వేర్వేరు వేదికల్లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. భువనేశ్వర్లో ఒడిషా ఎఫ్సీతో చెన్నైయిన్ ఎఫ్సీ... బెంగళూరులో ఈస్ట్ బెంగాల్ ఎఫ్సీతో బెంగళూరు ఎఫ్సీ తలపడతాయి. -
చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి వ్యక్తిగా
క్రిస్టియానో రొనాల్డో.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచ సాకర్ దిగ్గజాల్లో ఒకరిగా ఎదిగిన ఈ పోర్చుగల్ స్టార్ ఫుట్ బాలర్.. తనకంటూ ప్రత్యేకంగా అభిమాన ఘనాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మైదానంలోనే కాదు ఆఫ్ది ఫీల్డ్లో కూడా రికార్డులు కొల్లగొట్టడంలో రొనాల్డోకి మించిన వారే లేరు. ఇటీవలే తన కెరీర్లో 900 గోల్లను సాధించి చరిత్ర సృష్టించిన రొనాల్డో.. తాజాగా మరో అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.సోషల్ మీడియా కింగ్..రొనాల్డో తన సోషల్ మీడియా ఖాతాలన్నింటిలో కలిపి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 100 కోట్లను దాటింది. తద్వారా సోషల్మీడియాలో ఈ అరుదైన ఘనత సాధించిన తొలి వ్యక్తిగా రొనాల్డో సరికొత్త చరిత్ర సృష్టించాడు.తాజాగా ఈ విషయాన్ని రొనాల్డోనే అభిమానులతో పంచుకున్నాడు. "మనం చరిత్ర సృష్టించాము. 1 బిలియన్(100 కోట్లు) ఫాలోవర్స్ను సంపాదించుకున్నాము. ఇది కేవలం సంఖ్యమాత్రమే కాదు. కోట్లాది మంది ప్రేమకు, అభిమానానికి నిదర్శనం. మదీరా వీధుల్లో ఫుట్బాల్ ఆడే స్థాయి నుంచి ప్రపంచంలోని అతిపెద్ద వేదికలపై ఆడగలిగాను. నేను ఎల్లప్పుడూ నా కుటుంబం కోసం, మీ కోసమే ఆడాను. ఇప్పుడు ఏకంగా వంద కోట్ల మంది నా వెనక ఉన్నారు. నా కెరీర్లో నేను చవిచూసిన ఎత్తుపల్లాల్లో, నేను వేసే ప్రతీ అడుగులోనూ మీరున్నారు. అభిమానుల ఆదరాభిమానాలతోనే నా ఈ ప్రయాణం సాధ్యమైంది. మనమంతా కలిస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాం. నన్ను సపోర్ట్ చేసి నా జీవితంలో భాగమైనందుకు అందరికి ధన్యవాదాలు. మనం ఇంకా చాలా సాధించాలి. మనమంతా కలిసి ముందుకు సాగుతాం అని ఎక్స్లో రొనాల్డో రాసుకొచ్చాడు. కాగా రొనాల్డో ఇటీవలే యువర్ క్రిస్టియానో" పేరుతో యూట్యూబ్ చానెల్ను ప్రారంభించగా.. 90 నిమిషాల వ్యవధిలోనే ఇది ఒక మిలియన్ సబ్స్క్రైబర్స్ను పొందాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్ ఖాతాకు 6 కోట్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఇన్స్టాలో ఈ ఫుట్బాల్ స్టార్ను 63.9కోట్ల మందికి పైగా అనుసరిస్తున్నారు. ‘ఎక్స్’లో 11.3 కోట్ల మంది, ఫేస్బుక్లో 17 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.చదవండి: వాళ్లు వచ్చిన తరువాతే ఆడతామన్నారు... We’ve made history — 1 BILLION followers! This is more than just a number - it’s a testament to our shared passion, drive, and love for the game and beyond.From the streets of Madeira to the biggest stages in the world, I’ve always played for my family and for you, and now 1… pic.twitter.com/kZKo803rJo— Cristiano Ronaldo (@Cristiano) September 12, 2024 -
స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణపై ఏఐఎఫ్ఎఫ్ విచారణ
న్యూఢిల్లీ: భారత ఫుట్బాల్ కోచ్గా పని చేసిన ఐగర్ స్టిమాక్ కాంట్రాక్ట్ పునరుద్ధరణ, అతనికి చెల్లించాల్సి వచ్చిన నష్టపరిహారంపై అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన తప్పులు, స్టిమాక్కు అనుకూలంగా ఉన్న నిబంధనపై సమాఖ్య సర్వసభ్య సమావేశంలో చర్చ జరిగింది. దీనికి సంబంధించి స్వతంత్ర విచారణ జరపాలని ఏఐఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఎవరి కారణంగా స్టిమాక్కు భారీ మొత్తం చెల్లించాల్సి వచ్చిందనే అంశం విచారణలో తేలుతుందని ఏజీఎంలో సభ్యులు అభిప్రాయపడ్డారు.భారత జట్టు కోచ్గా ఐగర్ స్టిమాక్ పదవీకాలం 2023లో ముగిసింది. ఆ తర్వాత మళ్లీ దానిని జూన్ 2025 వరకు పునరుద్ధరించారు. అయితే స్టిమాక్ రెండోసారి కాంట్రాక్ట్పై సంతకం చేసినప్పుడు నిబంధనలు, షరతులు అతనికి అనుకూలంగా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఏఐఎఫ్ఎఫ్ కీలక పదవుల్లో పని చేసిన కొందరి పాత్ర ఉందని ఏజీఎంలో సభ్యులు ఆరోపించారు. ఈ ఏడాది జూన్లో ‘ఫిఫా’ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో సులువైన ‘డ్రా’ ఉన్నా భారత జట్టు చెత్త ప్రదర్శనతో రెండో రౌండ్లోనే నిష్క్రమించింది. దాంతో వెంటనే స్టిమాక్ను కోచ్ పదవి నుంచి తొలగించారు.ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్న స్టిమాక్ 9 లక్షల 20 వేల డాలర్లు (రూ. 7 కోట్ల 72 లక్షలు) నష్టపరిహారం కోరుతూ ఫిఫా ఫుట్బాల్ ట్రిబ్యునల్లో ఫిర్యాదు చేశాడు. మరో ఏడాది తన పదవీకాలం మిగిలి ఉన్నా తనను తీసేయడం నిబంధనలకు విరుద్ధమంటూ సవాల్ చేశాడు. చివరకు మధ్యవర్తిత్వం ద్వారా ఏఐఎఫ్ఎఫ్ సమస్యను పరిష్కరించుకుంది. స్టిమాక్కు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.20 కోట్లు) నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించి గొడవను ముగించింది. ఈ అంశంపై ప్రస్తుతం ఏజీఎంలో చర్చ జరుగుతుంది.చదవండి: భారత ఫుట్బాలర్ అన్వర్ అలీపై నిషేధం -
#Football : హైదరాబాద్ లో ఫుట్బాల్ కిక్ మొదలైంది (ఫొటోలు)
-
‘ఆటలు’ కావాలి : అమ్మాయిల ‘గోల్’ ఇది! ఆసక్తికరమైన వీడియో
పారిశ్రామికవేత్త ఆనంద్మహీంద్ర మరో ఆసక్తికరమైన వీడియోతో అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు29) సందర్భంగా క్రీడలు ప్రాముఖ్యతను వివరిస్తున్న ఒక వీడియోను పంచుకున్నారు. క్రీడలు మనల్ని మనుషులుగా చేస్తాయి అంటూ క్రీడల గొప్పతనాన్ని వివరించారు. ముఖ్యంగా బాలికావిద్య, సాధికారత ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ, రూపొందించిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. చదువుతోపాటు ఈరోజు కొత్తగా నేర్చుకుందాం అటూ ఈ వీడియో ప్రారంభమవుతుంది. ‘‘నీళ్ల కుండను మోయడానికి కాదు బాలిక శిరస్సు ఉన్నది, భయపడి పరిగెత్తడానికి కాదు కాళ్లున్నది, కేవలం సేద్యం కోసం చిందించడానికి మాత్రమే కాదు ఈ స్వేదం ఉన్నది. గోల్ అంటే రోటీలు చేయడానికి మాత్రమే కాదు’’ అంటూ ఫుట్బాల్ గోల్ సాధిస్తారు బాలికల బృందం. ఫుట్ బాల్ క్రీడ ద్వారా బాలికల విద్య, అభివృద్ధిని గురించి వివరించడం అద్భుతంగా నిలిచింది.బాలికలు విద్య ద్వారా సాధికారత పొందే ప్రపంచాన్ని సృష్టించే దృక్పథంతో 1996లో ఆనంద్ మహీంద్రా కేసీ మహీంద్రా ఎడ్యుకేషన్ ట్రస్ట్లో ప్రాజెక్ట్ నన్హీ కాలీ ప్రాజెక్టును తీసుకొచ్చారు. పలు విధాలుగా బాలికా వికాసం కోసం ఈ సంస్థ కృషి చేస్తోంది. దాదాపు 7లక్షల మంది బాలికలకు సాయం అందించినట్టు నన్హీ కాలీ వెబ్సైట్ ద్వారా తెలుస్తోంది.There is a very, very simple reason why Sports is important:Because it makes us better human beings.#NationalSportsDay pic.twitter.com/3IhiQmpB66— anand mahindra (@anandmahindra) August 30, 2024 -
డాక్టరమ్మ శిక్షణ చక్ దే..!
చక్దే ఇండియాలో మహిళా హాకీ జట్టును తీర్చిదిద్దుతాడు షారుక్ ఖాన్ . నిజామాబాద్లో ఫుట్బాల్లో బాలికలను మెరికల్లా తీర్చిదిద్దుతున్నారు డాక్టర్ కవితారెడ్డి. ప్రస్తుతం జాతీయ స్థాయిలో ఇక్కడి నుంచి సెలెక్ట్ అవుతున్న బాలికలు ఇంటర్నేషనల్ స్థాయిలో తెలంగాణ పేరును నిలబెట్టేలా చేయడమే లక్ష్యం అంటున్నారామె. కవితారెడ్డి ఈ క్రీడా శిక్షణ ఎందుకు ప్రారంభించారో తెలిపే కథనం.‘సహాయం చేసే వ్యక్తులు మన జీవితాల్లో ఉంటే సహాయం చేయడం మనక్కూడా అలవడుతుంది’ అంటారు డాక్టర్ శీలం కవితా రెడ్డి. నిజామాబాద్లో గైనకాలజిస్ట్గా పేరొందిన ఈ డాక్టర్ తన సేవా కార్యక్రమాలతో కూడా అంతే గౌరవాన్ని పొందుతున్నారు. ‘మా తాతగారిది నల్లగొండ. పేదవాళ్లకు ఆయన సహాయం చేయడం, వాళ్లకు ఫీజులు కట్టి హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదివించడం నేను బాల్యం నుంచి గమనించేదాన్ని. సాయం చేయడంలో సంతృప్తి నాకు అర్థమైంది. నేను డాక్టర్గా స్థిరపడ్డాక ‘డాక్టర్ కవితా రెడ్డి ఫౌండేషన్’ స్థాపించి స్త్రీల, బాలికల ఆరోగ్యం కోసం పని చేయాలని నిశ్చయించుకున్నాను. పేద మహిళల ఆరోగ్య సమస్యలను పట్టించుకోవడం అవసరం అనే భావనతో ఈ పని మొదలుపెట్టాను’ అన్నారామె.ఫుట్బాల్ మేచ్ చూసి...‘నిజామాబాద్ పట్టణంలో ఒకసారి బాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంటే నన్ను అతిథిగా ఆహ్వానించారు. అక్కడ ΄ాల్గొన్న అమ్మాయిల క్రీడానైపుణ్యం చూసి ఆశ్చర్య΄ోయాను. ఎంతటి పేదరికంలో ఉన్నా సరైన ΄ోషణ, డ్రస్, షూస్ లేక΄ోయినా వారు గ్రౌండ్లో చిరుతల్లా పరిగెడుతూ ఆడారు. అలాంటి పిల్లలకు సరైన శిక్షణ ఇస్తే మరింతగా దూసుకు΄ోతారని భావించి 2019లో డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను. నిజామాబాద్ జిల్లాలోని గ్రామీణప్రాంతం బాలికలకు హాస్టల్ ఏర్పాటు చేసి ఫుట్బాల్లో శిక్షణ ఇప్పిస్తున్నాను. పట్టణంలో ఉన్న బాలికలు రోజూ వచ్చి ఉచిత శిక్షణ పొందితే బయటి ఊళ్ల అమ్మాయిలు హాస్టల్లో ఉంటూ శిక్షణ పొందుతున్నారు’ అని తెలి΄ారామె.అదే ప్రత్యేకం...కవితారెడ్డి తన అకాడెమీని ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్కు అనుబంధంగా రిజిస్టర్ చేశారు. తెలంగాణ లో మొత్తం 8 ఫుట్బాల్ క్లబ్బులు ఉండగా మహిళా కార్యదర్శి ఉన్న క్లబ్ మాత్రం ఇదొక్కటే కావడం గమనార్హం. ప్రస్తుతం డాక్టర్ కవితారెడ్డి ఫుట్బాల్ అకాడమీలోని 41 మంది బాలికలు కోచ్ గొట్టి΄ాటి నాగరాజు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. గతంలో నాగరాజు శిక్షణలోనే అంతర్జాతీయ క్రీడాకారిణి సౌమ్య తయారైంది. శిక్షణ పొందుతున్న బాలికల్లో వివిధ జిల్లాలకు చెందిన ఇంటర్, డిగ్రీ చదువుతున్న గ్రామీణప్రాంతాల వారున్నారు. వీరందరికీ కవితారెడ్డి తన సొంత ఖర్చుతోనే వసతి, ఆహారం, డ్రెస్సులు, వైద్య సౌకర్యం కల్పిస్తున్నారు. ఇతరప్రాంతాల్లో టోర్నమెంట్లకు వెళ్లాల్సి వస్తే అవసరమైన సామగ్రి, ప్రయాణ ఖర్చులన్నీ డాక్టరమ్మే భరిస్తున్నారు. ఈ అకాడమీ నుంచి ఇప్పటివరకు 9 మంది బాలికలు పశ్చిమబెంగాల్, కర్ణాటక, జార్ఖండ్ రాష్ట్రాల్లో నేషనల్స్ ఆడారు. మరో ఐదుగురు ఇతర రాష్ట్రాల క్లబ్లకు ఆడారు. ఖేలో ఇండియా కార్యక్రమం కింద అండర్–13, అండర్–15లో 14మంది ఆడారు. ఇక తెలంగాణ ఉమెన్స్ లీగ్కు 22 మంది ఈ అకాడమీ బాలికలు ఆడనున్నారు. మిషన్ 2027లో భారత జట్టుకు ఎంపికై అంతర్జాతీయ ΄ోటీలకు వెళ్లేలా బాలికలు శిక్షణ పొందుతున్నారు. మరోవైపు బాక్సింగ్ క్రీడాకారులకు సైతం ఇప్పటివరకు అవసరమైనప్పుడల్లా కిట్లు కొనిస్తున్నారు.హెల్త్ కార్డ్లుడాక్టర్ కవితారెడ్డి తన హెల్త్ ఫౌండేషన్ ద్వారా 2017 నుంచి పేద గర్భిణులకు ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తూ వస్తున్నారు. నాలుగు వేల మందికి హెల్త్ కార్డులు ఇచ్చారు. ఈ కార్డ్ ఉన్నవారికి తన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలూ కల్పిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ ΄ాఠశాలల్లో 8, 9, 10 తరగతుల విద్యార్ధినులకు అనీమియా వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. సేవాకార్యక్రమాల విషయంలో తనను భర్త రవీందర్రెడ్డి, కుమారుడు డాక్టర్ పరీక్షిత్ సాయినాథ్రెడ్డి అన్నిరకాలుగా ్ర΄ోత్సహిస్తున్నారని కవితారెడ్డి చెబుతున్నారు.– తుమాటి భద్రారెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ -
ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు మాజీ మేనేజర్ కన్నుమూత
ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టు మాజీ మేనేజర్ స్వెన్ గొరాన్ ఎరిక్సన్ కన్నుమూశారు. కేన్సర్తో పోరాడుతున్న ఆయన 76 ఏళ్ల వయసులో మరణించారు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సోమవారం తుదిశ్వాస విడిచారు. ఎరిక్సన్ మరణ వార్తను ధ్రువీకరిస్తూ అతడి కుటుంబం ప్రకటన విడుదల చేసింది.స్వీడన్కు చెందిన ఎరిక్సన్ తొలినాళ్లలో ఫుట్బాలర్గా రాణించారు. ఆ తర్వాత మేనేజర్గా మారిన ఆయన.. 1977- 2001 మధ్యకాలంలో స్వీడన్, పోర్చుగల్, ఇటలీ క్లబ్ టోర్నీల్లో ఓవరాల్గా 18 ట్రోఫీలు తన ఖాతాలో వేసుకున్నారు. అంతేకాదు.. ఇంగ్లండ్ ఫుట్బాల్ జట్టుకు మేనేజర్గా నియమితుడైన తొలి విదేశీయుడిగా అరుదైన ఘనత సాధించారు.యూరోపియన్ చాంపియన్షిప్స్, వరల్డ్ కప్ ఈవెంట్లలో ఎరిక్సన్.. ఇంగ్లండ్కు చెప్పుకోదగ్గ విజయాలు అందించారు. ఆయన హయాంలో 2002- 2006 మధ్య ఇంగ్లండ్ మూడుసార్లు వరుసగా వరల్డ్కప్ క్వార్టర్ ఫైనల్ చేరింది. ఇక వీటితో పాటు మేనేజర్గా ఎన్నో విజయాలు సాధించిన ఎరిక్సన్.. తాను కేన్సర్ బారిన పడినట్లు ఈ ఏడాది జనవరిలో వెల్లడించారు. మహా అయితే, ఒక్క ఏడాది పాటు బతుకుతానేమోనంటూ ఉద్వేగానికి లోనయ్యారు. అయితే, టెర్మినల్ కేన్సర్తో పోరాటంలో ఓడి తాజాగా కన్నుమూశారు. కాగా ఎరిక్సన్ మృతి పట్ల ప్రిన్స్ విలియం సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.కాగా.. ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్లబ్ మేనేజర్గా ఉన్న వ్యక్తి.. జట్టు ఎంపిక మొదలు.. జట్టులో ఆటగాళ్ల పాత్ర, మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు రచించడం.. అదే విధంగా మ్యాచ్ సమయంలో ఆటగాళ్లలో స్ఫూర్తి నింపేలా మార్గదర్శనం వంటివి చేస్తాడు. క్లబ్ ఆర్థిక వ్యవహరాల్లో నిర్ణయాలు తీసుకోవడం సహా క్లబ్ గెలిచినా.. ఓడినా జవాబుదారిగా ఉంటారు.చదవండి: టెర్మినల్ కేన్సర్ ఇంత ప్రమాదకరమా..? -
భారత్ను గెలిపించిన మునీరుల్
లలిత్పూర్ (నేపాల్): దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) అండర్–20 చాంపియన్ప్లో భారత్ శుభారంభం చేసింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సోమవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0 గోల్ తేడాతో భూటాన్ను ఓడించింది. భారత్ తరఫున మునీరుల్ మౌలా (37వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి అర్ధభాగంలోనే గోల్ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన భారత్ చివరి వరకు దాన్ని కాపాడుకుంది. అయితే ఒత్తిడికి గురైన భూటాన్ ఆటగాళ్లు పదే పదే భారత ప్లేయర్లతో వాగ్వాదానికి దిగగా... మనవాళ్లు కూడా దీటుగా బదులిచ్చారు. దీంతో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఓ భూటాన్ ప్లేయర్కి రిఫరీ ‘రెడ్ కార్డు’ చూపి మైదానం నుంచి బయటకు పంపాడు. ఫలితంగా ఆట 67వ నిమిషం తర్వాత భారత్ కేవలం తొమ్మిది మంది ప్లేయర్లతోనే ఆధిక్యాన్ని కాపాడుకోవం విశేషం. శుక్రవారం జరిగే రెండో లీగ్ మ్యాచ్లో మాల్దీవులుతో భారత్ ఆడుతుంది. గ్రూప్ ‘ఎ’లో బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక జట్లున్నాయి. -
ఫ్రాన్స్ మళ్లీ 40 ఏళ్ల తర్వాత..
ఒలింపిక్స్ ఫుట్బాల్ ఫైనల్లో ఫ్రాన్స్ రెండోసారి ఒలింపిక్ చాంపియన్గా నిలిచేందుకు ఫ్రాన్స్ పురుషుల ఫుట్బాల్ జట్టు విజయం దూరంలో నిలిచింది. స్వదేశంలో జరుగుతున్న పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఫ్రాన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్తో ఈజిప్ట్ జట్టుపై విజయం సాధించి 1984 తర్వాత మళ్లీ ఒలింపిక్స్ క్రీడల్లో టైటిల్ పోరుకు అర్హత పొందింది.ఫ్రాన్స్ తరఫున మెటెటా జీన్ ఫిలిప్ (83వ, 99వ నిమిషాల్లో) రెండు గోల్స్తో మెరవగా... మైఖేల్ ఒలీస్ (108వ నిమిషంలో) ఒక గోల్ సాధించాడు. ఈజిప్ట్ తరఫున మహమూద్ సాబెర్ (62వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఫ్రాన్స్ ఫుట్బాల్ జట్టు ఫైనల్ చేరడం ఇది మూడోసారి. 1900 పారిస్ క్రీడల్లో రన్నరప్గా నిలిచిన ఫ్రాన్స్ ఆ తర్వాత 1984 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. -
హెజ్బొల్లా దాడిలో చిన్నారులు సహా... 12 మంది దుర్మరణం
టెల్అవీవ్: ఇజ్రాయెల్ ఆక్రమిత గొలాన్ హైట్స్ లోని ఫుట్బాల్ మైదానంపై శనివారం జరిగిన రాకెట్ దాడిలో చిన్నారులు, టీనేజర్లు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్ల పనేనని, ప్రతీకారం తప్పదని హెచ్చరించింది. ఇజ్రాయెల్లోని మిలటరీ ప్రాంతాలే లక్ష్యంగా తాము రాకెట్లను ప్రయోగించిన మాట వాస్తవమేనని హెజ్బొల్లా పేర్కొంది. అయితే, ఫుట్బాల్ మైదానంపై జరిగిన దాడికి బాధ్యత తమది కాదని స్పష్టం చేసింది. -
అర్జెంటీనాకు షాక్
సెయింట్ ఎటిన్ (ఫ్రాన్స్): పారిస్ ఒలింపిక్స్ అధికారికంగా శుక్రవారం మొదలు కావాల్సినా... ఫుట్బాల్, రగ్బీ సెవెన్స్ క్రీడాంశాల్లో బుధవారం పోటీలు ప్రారంభమయ్యాయి. పురుషుల ఫుట్బాల్ ఈవెంట్ సంచలనంతో ఆరంభమైంది. రెండుసార్లు స్వర్ణ పతక విజేత అర్జెంటీనా తొలి లీగ్ మ్యాచ్లో 1–2తో మొరాకో చేతిలో ఓడిపోయింది. ఇంజ్యూరీ టైమ్లో అర్జెంటీనా చేసిన గోల్ను ముందుగా రిఫరీ అనుమతించడంతో స్కోరు 2–2 తో సమమైంది. అయితే రిఫరీ నిర్ణయంతో ఆగ్రహించిన అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. వాటర్ బాటిళ్లను మైదానంలోకి విసిరేశారు. దాంతో రెండు గంటలపాటు ఆటకు అంతరాయం ఏర్పడింది. పరిస్థితి అదుపులోకి వచ్చాక ఆటను కొనసాగించారు. అర్జెంటీనా రెండో గోల్ను టీవీ రీప్లేలో పరిశీలించి ఆఫ్ సైడ్గా పరిగణించి గోల్ ఇవ్వలేదు. దాంతో మొరాకో 2–1తో గెలిచింది. -
యూరో ఛాంపియన్స్కు గ్రాండ్ వెల్కమ్.. జనసంద్రంలా మారిన మాడ్రిడ్ (ఫొటోలు)
-
‘యూరో’ చాంపియన్గా స్పెయిన్
యూరో ఫుట్బాల్ కప్-2024 ఛాంపియన్స్గా స్పెయిన్ జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ను 2-1 తేడాతో ఓడించిన స్పెయిన్.. నాలుగో సారి యూరో కప్ టైటిల్ను ముద్దాడింది. స్పెయిన్ విజయంలో మైకెల్ ఓయర్జాబల్ కీలక పాత్ర పోషించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు.చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ పోరులో 86వ నిమిషంలో గోల్కొట్టిన ఓయర్జాబల్ స్పెయిన్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ఫైనల్ మ్యాచ్ ఫస్ట్హాఫ్ నీవా నేనా అన్నట్లు సాగింది. ఇరు జట్లు కూడా తొలి ఆర్ధ భాగంలో ఒక్క గోల్కూడా సాధించలేకపోయాయి. ఫస్ట్హాప్ ముగిసే సమయానికి ఇరు జట్లు 0-0గా నిలిచాయి. ఆ తర్వాత సెకెండ్ హాఫ్లో 46వ నిమిషంలో నికో విలియమ్స్ అద్భుత గోల్తో స్పెయిన్ ఖాతా తెరిచాడు. ఇంగ్లండ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటకి గోల్ సాధించడంలో విఫలమైంది. ఈ క్రమంలో మ్యాచ్ 60 నిమిషంలో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ బయటకు వెళ్లిపోయాడు. అతడి స్ధానంలో సెమీఫైనల్ హీరో వాట్కిన్స్ వచ్చాడు. అతడు వచ్చిన కూడా ఫలితం మాత్రం మారలేదు. ఇంగ్లీష్ జట్టు నిరాశలో కూరుకుపోయిన వేళ మిడ్ఫీల్డర్ కోల్ పామర్ 73వ నిమిషంలో సంచలన గోల్తో తమ జట్టుకు తొలి గోల్ను అందించాడు.దీంతో స్కోర్లు 1-1తో సమమయ్యాయి. మళ్లీ ఇంగ్లండ్ కమ్బ్యాక్ ఇవ్వడంతో స్పెయిన్ కాస్త ఒత్తడికి గురైంది. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు.కానీ మ్యాచ్ 86వ నిమిషంలో ఓయర్జాబల్ సూపర్ గోల్తో స్పెయిన్కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. స్పెయిన్కు ఇది నాలుగో యూరో కప్ టైటిల్ కావడం గమనార్హం. 1964, 2008, 2012 యూరో కప్ టైటిల్స్ను స్పెయిన్ సొంతం చేసుకుంది. 🇪🇸 Spain are champions of Europe 🏆#EURO2024 pic.twitter.com/Ch0AF0iPWl— UEFA EURO 2024 (@EURO2024) July 14, 2024 -
ఫుట్బాల్ జోష్
ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ అభిమానులను గంటల వ్యవధిలో రెండు ఆసక్తికర సమరాలు అలరించబోతున్నాయి. జర్మనీలోని బెర్లిన్ వేదికగా జరిగే యూరో కప్ ఫైనల్లో ఇంగ్లండ్, స్పెయిన్ తలపడనున్నాయి. స్పెయిన్ గతంలో మూడు సార్లు విజేతగా నిలవగా...ఇంగ్లండ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. మరో వైపు అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరిగే కోపా అమెరికా కప్ ఫైనల్లో అర్జెంటీనాను కొలంబియా ఎదుర్కొంటుంది. ఈ టోర్నీలో అర్జెంటీనా ఏకంగా 15 సార్లు టైటిల్ నెగ్గగా...కొలంబియా ఒక సారి ట్రోఫీని సొంతం చేసుకుంది. -
Euro Cup 2024: సెమీస్లో నెదర్లాండ్స్కు షాక్.. ఫైనల్లో ఇంగ్లండ్
యూరో కప్-2024 ఫైనల్లో ఇంగ్లండ్ అడుగుపెట్టింది. డార్ట్మండ్ వేదికగా జరిగిన నెదర్లాండ్స్తో జరిగిన రెండో సెమీఫైనల్లో 2-1 తేడాతో విజయం సాధించిన ఇంగ్లీష్ జట్టు.. రెండో సారి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకుంది. ఆద్యంతం తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో ఆఖరి నిమిషం గోల్ సాధించిన ఇంగ్లండ్ ప్లేయర్ ఓలీ వాట్కిన్స్.. తన జట్టుకు సంచలన విజయాన్ని అందించాడు.ఈ సెమీస్ పోరులో ఫస్ట్హాఫ్ తొలి 10 నిమిషాల్లో ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. తొలి ఆర్ధబాగం 7వ నిమిషంలో డచ్ మిడ్ ఫీల్డర్ క్జేవీ సైమన్స్ తమ జట్టుకు మొదటి గోల్ను అందించాడు. దీంతో ఆరంభంలోనే డచ్ జట్టు 1-0 ఆధిక్యంలో దూసుకెళ్లింది. అయితే కొద్దిసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ కేన్ పెనాల్టీ గోల్తో స్కోర్ను సమం చేశాడు. ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు చెరో గోల్తో సమంగా నిలిచాయి.ఇక సెకెండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత ఇరు జట్లు కొన్ని వ్యూహాత్మక మార్పులు చేశాయి. డచ్ తరుపున డోనియెల్ మాలెన్ స్ధానంలో వుత్ వెఘోర్స్ట్ సబ్స్ట్యూట్గా రాగా.. మరోవైపు త్రీ లయన్స్ జట్టుకు కీరన్ ట్రిప్పియర్ స్థానంలో ల్యూక్ షా వచ్చాడు. అయినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఈ క్రమంలో ఇంగ్లండ్ ఆఖరి 20 నిమిషాలకు ముందు తమ జట్టులో మరో రెండు మార్పులు చేసింది. స్టార్ ప్లేయర్లు హ్యారీ కేన్, ఫిల్ ఫోడెన్లు బయటకు వెళ్లగా.. వారిస్ధానాల్లో ఒల్లీ వాట్కిన్స్ , కోల్ పామర్ మైదానంలో వచ్చారు. అయితే సెకెండ్ హాఫ్ సమయం ముగుస్తున్నప్పటికి గోల్ మాత్రం ఇరు జట్లు సాధించలేకపోయాయి. దీంతో పెనాల్టీ షుటౌట్ తప్పదని అంతా భావించారు. కానీ మ్యాచ్ ఆఖరి నిమిషం(90వ మినిట్)లో సబ్స్ట్యూట్గా వచ్చిన వాట్కిన్స్ అద్భుతం చేశాడు. సంచలన గోల్తో వాట్కిన్స్ తన జట్టును రెండో సారి ఫైనల్కు చేర్చాడు. ఇక జూలై 15న జరగనున్న ఫైనల్లో స్పెయిన్తో ఇంగ్లండ్ తలపడనుంది. -
COPA AMERICA CUP 2024: ఫైనల్లో అర్జెంటీనా.. సెమీస్లో కెనడాపై విజయం
కోపా అమెరికా కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో ఆ జట్టు.. కెనడాపై 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తొలి అర్ద భాగం 23వ నిమిషంలో అల్వరెజ్.. రెండో అర్ద భాగం 51వ నిమిషంలో మెస్సీ గోల్స్ సాధించారు. రేపు జరుగబోయే రెండో సెమీఫైనల్లో ఉరుగ్వే, కొలంబియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు జులై 15న జరిగే ఫైనల్లో అర్జెంటీనాతో అమీతుమీ తేల్చుకుంటుంది. -
EURO CUP 2024: సెమీస్లో ఫ్రాన్స్ ఓటమి.. ఫైనల్లో స్పెయిన్
యూరో కప్ ఫుట్బాల్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఇవాళ (జులై 10) జరిగిన తొలి సెమీఫైనల్లో స్పెయిన్.. ఫ్రాన్స్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలోనే మూడు గోల్స్ నమోదయ్యాయి. 8వ నిమిషంలో రాండల్ కోలో ముఆని గోల్ సాధించి ఫ్రాన్స్కు ఆధిక్యాన్ని అందించాడు. అనంతరం స్పెయిన్ ఆటగాళ్లు 21వ నిమిషంలో లామిన్ యమాల్, 25వ నిమిషంలో డానీ ఓల్మో గోల్స్ సాధించారు. రెండో అర్ద భాగంలో ఫ్రాన్స్ ఎంత ప్రయత్నించినా.. స్పెయిన్ ఆధిక్యతను తగ్గించలేక పోయింది. ఫలితంగా ఓటమిపాలైంది. లామిన్ యమాల్ యూరో కప్ చరిత్రలోనే అత్యంత పిన్నవయస్కుడైన గోల్ స్కోరర్గా రికార్డుల్లోకెక్కాడు.ఇదిలా ఉంటే, నెదర్లాండ్స్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీఫైనల్ రేపు (జులై 11) జరుగనుంది. ఈ మ్యాచ్లో విజేత జులై 15న జరిగే ఫైనల్లో స్పెయిన్తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
సెమీస్ సమరం.. స్పెయిన్తో ఫ్రాన్స్ ఢీ! ఫైనల్ బెర్త్ ఎవరిదో?
‘యూరో’ కప్ ఫుట్బాల్ టోర్నీ-2024 తొలి సెమీఫైనల్కు సర్వం సిద్దమైంది. మంగళవారం అలియాంజ్ ఎరీనా వేదికగా జరగనున్న సెమీఫైనల్-1లో ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు తాడో పేడో తెల్చుకోనున్నాయి. ఈ సెమీస్ పోరులో గెలిచి ఫైనల్ బెర్త్ను ఖారారు చేసుకోవాలని ఇరు జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. స్పెయిన్ ఫైనల్కు చేరుతుందా?అయితే ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ గెలిచి జోరు మీదున్న స్పెయిన్కు సెమీస్ ముందు గాయాలు, కార్డ్ సస్పెన్షన్ల బెడద వెంటాడుతోంది. ఇప్పటికే కీలక మ్యాచ్కు ముందు రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ ఇద్దరూ సస్పెండ్ అయ్యారు. మరోవైపు , యువ మిడ్ఫీల్డర్ పెడ్రీ టోని క్రూస్ గాయం కారణంగా టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో డిఫెన్స్లో రాబిన్ లే నార్మాండ్, డాని కార్వాజల్ స్ధానాలను నాచో, జీసస్ నెవాస్ భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పెడ్రీ ప్రత్యామ్నాయంగా వచ్చిన డాని ఓల్మో ప్లేయింగ్లో తన స్దానాన్ని సుస్థిరం చేసుకోనున్నాడు.స్పెయిన్ జోరును ఫ్రాన్స్ అడ్డుకుంటుందా?ఇక సెమీస్కు ముందు ఫ్రాన్స్ టీమ్లో ఎటవంటి గాయాలు, కార్డ్ సస్పెన్షన్లు లేవు. జట్టు మొత్తం క్లియర్గా ఉంది. కానీ ఫ్రాన్స్ సెమీస్కు వచ్చినప్పటికి తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. గోల్స్ సాధించడంలో ఫ్రాన్స్ తమ మార్క్ చూపించలేకపోయింది. కెప్టెన్ కైలియన్ ఎంబాపే గాయం కావడం ఫ్రాన్స్ను కాస్త దెబ్బతీసింది. అతడు తిరిగి జట్టులోకి వచ్చినప్పటి మునపటి జోరును ప్రదర్శించలేకపోతున్నాడు. సెమీఫైనల్లోనైనా ఎంబాపే సత్తాచాటుతాడో లేదో వేచి చూడాలి. కాగా సెమీఫైనల్ చేరే క్రమంలో స్పెయిన్ 11 గోల్స్ చేయగా... ఫ్రాన్స్ కేవలం మూడు గోల్స్ మాత్రమే సాధించింది. -
EURO CUP 2024: ఉత్కంఠ పోరులో ఆస్ట్రియాపై విజయం.. క్వార్టర్ ఫైనల్లో తుర్కియే
యూరో కప్ 2024 క్వార్టర్ ఫైనల్ బెర్త్లన్నీ ఖరారయ్యాయి. స్పెయిన్, జర్మనీ, పోర్చుగల్, ఫ్రాన్స్, ఇంగ్లండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, తుర్కియే జట్లు ఫైనల్ 8కి అర్హత సాధించాయి. ఇవాళ (జులై 3) జరిగిన చివరి రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఆస్ట్రియాపై తుర్కియే 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. Mert Günok's incredible 95th-minute save 🤯😱#EUROLastMinute | @Hublot pic.twitter.com/N2AImAbc7A— UEFA EURO 2024 (@EURO2024) July 2, 2024తుర్కియే తరఫున మెరి దెమిరల్ రెండు గోల్స్ చేయగా.. ఆస్ట్రియా తరఫున మైఖేల్ గ్రెగోరిచ్ గోల్ చేశాడు. చివరి నిమిషంలో తుర్కియే గోల్కీపర్ మెర్ట్ గునాక్ అద్భుతమైన స్టాప్తో మ్యాచ్ డ్రా కాకుండా చేశాడు. మరోవైపు, నిన్న జరిగిన మరో రౌండ్ ఆఫ్ 16 (ప్రీ క్వార్టర్ ఫైనల్స్) మ్యాచ్లో రొమేనియాపై నెదర్లాండ్స్ 3-0 గోల్స్ తేడాతో గెలుపొంది, క్వార్టర్ ఫైనల్కు అర్హత సాధించింది.క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్..స్పెయిన్ వర్సెస్ జర్మనీ (జులై 5)పోర్చుగల్ వర్సెస్ ఫ్రాన్స్ (జులై 6)ఇంగ్లండ్ వర్సెస్ స్విట్జర్లాండ్ (జులై 6)నెదర్లాండ్స్ వర్సెస్ తుర్కియే (జులై 7) -
ఎనిమిదేళ్ల తర్వాత...
లాస్ వేగస్: కోపా అమెరికా కప్ ఫుట్బాల్ టోర్నీలో ఈక్వెడార్ జట్టు ఎనిమిదేళ్ల తర్వాత తొలి విజయాన్ని అందుకుంది. గ్రూప్‘బి’లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్లో ఈక్వెడార్ 3–1తో నెగ్గింది. 13వ నిమిషంలో జమైకా ప్లేయర్ కేసీ పాల్మెర్ సెల్ఫ్ గోల్తో ఈక్వెడార్ ఖాతా తెరిచింది. కెండ్రీ పెజ్ (45+4వ ని.లో) గోల్తో ఈక్వెడార్ ఆధిక్యం 2–0కు పెరిగింది. 54వ నిమిషంలో ఆంటోనియో జమైకాకు తొలి గోల్ అందించాడు. అలాన్ మిండా (90+1వ ని.లో) గోల్తో ఈక్వెడార్ విజయాన్ని ఖాయం చేసుకుంది. మరో మ్యాచ్లో వెనిజులా 1–0తో మెక్సికోను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరింది. -
క్రేజ్ కా బాప్.. లియోనెల్ మెస్సీ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)
-
Euro Cup 2024: బోణీ కొట్టిన రొనాల్డో టీమ్
యూరో కప్ 2024లో దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్ బోణీ కొట్టింది. గ్రూప్-ఎఫ్లో భాగంగా ఇవాళ (జూన్ 19) జరిగిన మ్యాచ్లో పోర్చుగల్.. చెక్ రిపబ్లిక్పై 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్ కూడా సాధించలేదు. ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్ ప్రొవోద్) చెక్ రిపబ్లిక్, ఆతర్వాత పోర్చుగల్ (69వ నిమిషంలో, రాబిన్ హ్రనాక్) గోల్స్ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్ చేయడంతో పోర్చుగల్ 2-1 తేడాతో విజయం సాధించింది.చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డోచెక్ రిపబ్లిక్తో మ్యాచ్లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్, పోర్చుగల్ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్లు ఆడాడు.జార్జియాను చిత్తు చేసిన తుర్కియేగ్రూప్-ఎఫ్లో భాగంగా నిన్న జరిగిన మరో మ్యాచ్లో జార్జియాపై తుర్కియే 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. తుర్కియే తరఫున మెర్ట్ ముల్దర్ (25వ నిమిషం), ఆర్దా గులెర్ (65వ నిమిషం), ముహమ్మెద్ కెరెమ్ (97వ నిమిషం) గోల్స్ చేయగా.. జార్జియా తరఫున జార్జెస్ 32వ నిమిషంలో గోల్ చేశాడు.ఇవాల్టి మ్యాచ్లు..క్రొయేషియా వర్సెస్ అల్బేనియా (గ్రూప్-బి)జర్మనీ వర్సెస్ హంగేరీ (గ్రూప్-ఏ) -
ఫుట్బాల్ దిగ్గజం కాంప్బెల్ కన్నుమూత..
ఫుట్బాల్ దిగ్గజం, అర్సెనల్ ఎఫ్సీ లెజెండ్ కెవిన్ కాంప్బెల్(54) కన్నుమశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కాంప్బెల్.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస విడిచారు. విన్ కాంప్బెల్ మరణ వార్తను అర్సెనల్ ఎఫ్సీ సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించింది."మా క్లబ్ మాజీ స్ట్రైకర్ కెవిన్ కాంప్బెల్ అనారోగ్యం కారణంగా మృతిచెందాడు. అతడి మరణ వార్త మమ్మల్ని కలిచివేసింది. కెవిన్ని క్లబ్లో ప్రతీఒక్కరూ గౌరవించేవారు. ఆ కష్టసమయంలో కెవిన్ కుటంబసభ్యులకు ఆ దేవుడు అండగా నిలివాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కాంప్బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాము" అని అర్సెనల్ ఎఫ్సీ ఎక్స్లో రాసుకొచ్చింది. ఫుట్బాల్ వరల్డ్లో కాంప్బెల్ తనకంటూ ఒక ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో ఆర్సెనల్ ఫుట్బాల్ క్లబ్తో తన కెరీర్ను ప్రారంభించిన కాంప్బెల్.. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్బాల్ గేమ్లో కొనసాగారు. 1988లో ఆర్సెనల్ తరపున ఫుట్బాల్ ఆసోషియేషన్ యూత్ కప్ను గెలుచుకున్నాడు. అంతేకాకుండా ప్రీమియర్ లీగ్లో అర్సెనల్ , నాటింగ్హామ్ ఫారెస్ట్ , ఎవర్టన్ , వెస్ట్ బ్రోమ్విచ్ అల్బియన్ జట్ల తరపున కూడా అర్సెనల్ ఆడాడు. కాంప్బెల్ తన కెరీర్లో ఓవరాల్గా 148 గోల్స్ చేశాడు. We are devastated to learn that our former striker Kevin Campbell has died after a short illness.Kevin was adored by everyone at the club. All of us are thinking of his friends and family at this difficult time.Rest in peace, Kevin ❤️ pic.twitter.com/Kiywyo7nTr— Arsenal (@Arsenal) June 15, 2024 -
రిఫరీ చెత్త నిర్ణయం.. భారత్ ఆశలు ఆవిరి
దోహా: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించలేకపోయింది. గ్రూప్ ‘ఎ’లో భాగంగా ఆసియా చాంపియన్ ఖతర్ జట్టుతో మంగళవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో భారత జట్టు 1–2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. మూడో రౌండ్కు చేరాలంటే భారత జట్టు ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సింది. కానీ భారత జట్టు విజయాన్ని అందుకోలేకపోయింది. మరోవైపు అఫ్గానిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కువైట్ జట్టు 1–0తో గెలిచింది. దాంతో గ్రూప్ ‘ఎ’ నుంచి 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన ఖతర్... 7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచిన కువైట్ మూడో రౌండ్కు అర్హత సాధించాయి. 5 పాయింట్లతో భారత్, అఫ్గానిస్తాన్ సంయుక్తంగా మూడో స్థానంలో నిలువగా... మెరుగైన గోల్స్ సగటుతో భారత్కు మూడో స్థానం, అఫ్గానిస్తాన్కు నాలుగో స్థానం లభించాయి. రిఫరీ చెత్త నిర్ణయం... ఖతర్తో మ్యాచ్లో భారత జట్టుకు 37వ నిమిషంలో లాలియన్జువాల్ చాంగ్టె గోల్తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 73 నిమిషాల వరకు భారత్ ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ దశలో రిఫరీ చెత్త నిర్ణయం కారణంగా ఖతర్ జట్టు ఖాతాలో గోల్ చేరి స్కోరు సమమైంది. 73వ నిమిషంలో యూసుఫ్ ఐమన్ కొట్టిన హెడర్ను భారత గోల్కీపర్, కెపె్టన్ గుర్ప్రీత్ సింగ్ నిలువరించాడు. ఆ తర్వాతి బంతి గోల్ లైన్ దాటి బయటకు వెళ్లింది. కానీ అక్కడే ఉన్న ఖతర్ ఆటగాడు హాష్మీ అల్ హుస్సేన్ బంతిని వెనక్కి పంపించగా, యూసుఫ్ ఆ బంతిని లక్ష్యానికి చేర్చాడు. రిఫరీ దీనిని గోల్గా ప్రకటించాడు. దాంతో భారత ఆటగాళ్లు నివ్వెరపోయి రివ్యూ చేయాలని రిఫరీని కోరినా ఆయన అంగీకరించకుండా గోల్ సరైనదేనని ప్రకటించాడు. టీవీ రీప్లేలో బంతి గోల్లైన్ దాటి బయటకు వెళ్లిందని స్పష్టంగా కనిపించినా భారత ఆటగాళ్ల మొరను రిఫరీ ఖాతరు చేయలేదు. ఈ సంఘటనతో భారత బృందం ఏకాగ్రత చెదిరింది. 85వ నిమిషంలో అహ్మద్ అల్రావి గోల్తో ఖతర్ 2–1తో ఆధిక్యంలోకి వెళ్లి చివరి నిమిషం వరకు దీనిని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. -
Viral Video: కన్నీటి పర్యంతమైన క్రిస్టియానో రొనాల్డో
దిగ్గజ ఫుట్బాలర్, పోర్చుగల్ స్టార్, అల్ నసర్ క్లబ్ తురుపు ముక్క క్రిస్టియానో రొనాల్డో కన్నీటి పర్యంతమయ్యాడు. కింగ్ కప్ ఫైనల్లో తన జట్టు ఓటమిని జీర్ణించుకోలేని రొనాల్డో భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. సహచరులు ఎంత ఓదార్చే ప్రయత్నం చేసినా రొనాల్డో కన్నీళ్లు ఆగలేదు. మైదానంలో చాలా సేపు కూర్చుని బాధతో కృంగిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. రొనాల్డో బాధను చూసి నెటిజన్లు సైతం భావోద్వేగాలకు లోనవుతున్నారు. ఆట పట్ల స్టార్ ఫుట్బాలర్కు ఉన్న కమిట్మెంట్కు జేజేలు పలుకుతున్నారు. దేశానికి ప్రాతినిథ్యం వహించినా.. క్లబ్ తరఫున ఆడినా రొనాల్డో ప్యాషన్ ఒకే తీరులో ఉంటుందని కితాబునిస్తున్నారు.Nothing hurts a football fan more than seeing Ronaldo cry pic.twitter.com/YSMsZKBE9z— Trey (@UTDTrey) May 31, 2024కాగా, సౌదీ అరేబియాలోని జెద్దా వేదికగా నిన్న (మే 31) జరిగిన కింగ్ ఆఫ్ ఛాంపియన్ కప్ ఫైనల్లో రొనాల్డో ప్రాతినిథ్యం వహించిన అల్ నసర్ జట్టు.. చిరకాల ప్రత్యర్ది అల్ హిలాల్ చేతిలో ఓటమిపాలైంది. తొలుత ఈ మ్యాచ్ (ఎక్స్ట్రా సమయం తర్వాత) 1-1తో టై కాగా.. పెనాల్టీ షూటౌట్లో అల్ హిలాల్.. 5-4 తేడాతో అల్ నసర్పై పైచేయి సాధించి టైటిల్ ఎగరేసుకుపోయింది. నిర్ణీత సమయంలో అల్ హిలాల్ తరఫున అలెగ్జాండర్ మిత్రోవిచ్ (7వ నిమిషం).. ఆల్ నసర్ తరఫున అయ్మాన్ యాహ్యా (88వ నిమిషం) గోల్స్ చేశారు.ఇదిలా ఉంటే, అల్ హిలాల్ జట్టు ఇటీవల ముగిసిన సౌదీ ప్రో లీగ్లో కనీవినీ ఎరుగని ప్రదర్శనలు చేసి టైటిల్ను సొంతం చేసుకుంది. ఈ ఎడిషన్లో అల్ హిలాల్ రికార్డు స్థాయిలో 34 మ్యాచ్ల్లో 31 విజయాలు సాధించి టైటిల్ను ఎగరేసుకుపోయింది. క్లబ్ ఫుట్బాల్ చరిత్రలో ఏ జట్టు ఈ స్థాయి విజయాలు సాధించలేదు. ఈ లీగ్లో కూడా రొనాల్డో జట్టు అల్ నసర్ రన్నరప్తో సరిపెట్టకుంది. రొనాల్డో తదుపరి UEFA యూరో ఛాంపియన్షిప్ 2024లో పాల్గొననున్నాడు. ఈ టోర్నీలో క్రిస్ తన జాతీయ జట్టైన పోర్చుగల్కు ప్రాతినిథ్యం వహిస్తాడు. -
ఉజ్బెకిస్తాన్తో.. ఫుట్బాల్ మ్యాచ్లకు సౌమ్య!
తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ భారత మహిళల ఫుట్బాల్ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. తాషె్కంట్ నగరంలో ఉజ్బెకిస్తాన్ జట్టుతో మే 31, జూన్ 4వ తేదీల్లో జరిగే రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో పోటీపడే భారత జట్టులో ఆమె ఎంపికైంది.30 మంది ప్రాబబుల్స్కు ఇటీవల రెండు వారాలపాటు హైదరాబాద్లోని శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ మైదానంలో శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన టర్కీష్ కప్ టోరీ్నలో రన్నరప్గా నిలిచిన భారత జట్టులోనూ సౌమ్య సభ్యురాలిగా ఉంది.ఇవి చదవండి: నాలుగో ర్యాంక్లో జ్యోతి సురేఖ.. -
‘ఆ రోజు నేను ఏడుస్తూనే ఉంటా’
‘‘కఠిన శ్రమకోర్చే.. ఓ మంచి ఆటగాడిగా అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని మాత్రమే కోరుకుంటా. చూడటానికి చక్కగా కనిపించే హార్డ్ వర్కర్ ఉండేవాడని నన్ను గుర్తుంచుకుంటే చాలు’’ అని భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి అన్నాడు. అదే తాను ఇక్కడ విడిచి వెళ్తున్న జ్ఞాపకంగా మిగిలిపోవాలని పేర్కొన్నాడు.కాగా భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్ సునిల్ ఛెత్రి అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలికిన విషయం తెలిసిందే. జూన్ 6న తన చివరి మ్యాచ్ ఆడబోతున్నానని 39 ఏళ్ల ఛెత్రి గురువారం ప్రకటించాడు.ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతావచ్చే నెల 6న ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయర్స్లో భాగంగా కువైట్తో జరిగే మ్యాచే తన కెరీర్లో చివరిదని ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో షేర్ చేస్తూ ఉద్వేగానికి లోనయ్యాడు.అయితే ప్రైవేట్, క్లబ్, ఫ్రాంచైజీ లీగ్లలో కొనసాగుతానని ఛెత్రి స్పష్టం చేశాడు. 2005లో అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఫుట్బాలర్ దాదాపు రెండు దశాబ్దాల పాటు (19 ఏళ్లు) భారత జట్టుకు సేవలందించాడు. ఢిల్లీకి చెందిన ఆర్మీ అధికారి కేబీ ఛెత్రి, సుశీల దంపతులకు 1984, ఆగస్టు 3న సికింద్రాబాద్ (తెలంగాణ)లో జన్మించిన ఛెత్రి భారత ఫుట్బాల్లో అసాధారణ ఫార్వర్డ్ ఆటగాడిగా ఎదిగాడు. తదనంతరం నాయకత్వ పటిమతో విజయవంతమైన సారథి అయ్యాడు. భారత ఫుట్బాల్ చరిత్రలో చురుకైన దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. ఆరోజు ఏడుస్తూనే ఉంటాఇక తన రిటైర్మెంట్ ప్రకటన నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సునిల్ ఛెత్రి.. ‘‘జూన్ 6న నేను రిటైర్ అవుతాను.. జూన్ 7 మొత్తం ఏడుస్తూనే ఉంటాను. జూన్ 8న కాస్త రిలాక్స్ అవుతాను. జూన్ 8 నుంచి బ్రేక్ తీసుకుని నా కుటుంబానికి సమయం కేటాయిస్తాను’’ అని తెలిపాడు.సునిల్ ఛెత్రి సాధించిన ఘనతలు 👉150 అంతర్జాతీయ మ్యాచ్లాడిన సునీల్ 94 గోల్స్ కొట్టాడు. భారత్ తరఫున టాప్ స్కోరర్ కాగా... ఓవరాల్గా ఫుట్బాల్ చరిత్రలో జాతీయ జట్టు తరఫున ఎక్కువ గోల్స్ చేసిన క్రీడాకారుల జాబితాలో టాప్–3లో ఉన్నాడు. క్రిస్టియానో రోనాల్డో (128 గోల్స్; పోర్చుగల్), మెస్సీ (106 గోల్స్; అర్జెంటీనా) తర్వాతి స్థానం మన ఛెత్రిదే! 👉మూడు సార్లు భారత జట్టు నెహ్రూ కప్ అంతర్జాతీయ టోర్నీ (2007, 2009, 2012) టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. 👉దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య (శాఫ్) చాంపియన్షిప్లో భారత్ మూడు (2011, 2015, 2021) టైటిల్ విజయాలకు కృషి చేశాడు. 👉2008లో ఏఎఫ్సీ చాలెంజ్ కప్ను గెలిపించిన ఛెత్రి, ఏడుసార్లు ‘ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. భారత్లోని ప్రముఖ ఫుట్బాల్ క్లబ్లైన ఈస్ట్ బెంగాల్, డెంపో, ముంబై సిటీ ఎఫ్సీ, బెంగళూరు ఎఫ్సీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆయా జట్లకు లీగ్ ట్రోఫీలు అందించాడు.‘అతనో ఫుట్బాల్ శిఖరం’ భారత బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లి, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, భారత ఫుట్బాల్ మాజీ కెప్టెన్ బైచుంగ్ భూటియా తదితరులంతా ఛెత్రి ఘనతల్ని కొనియాడారు. సోషల్ మీడియా వేదికగా వారంతా అతనొక రియల్ లెజెండ్గా కితాబిచ్చారు. బీసీసీఐ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ సైతం ఛెత్రి సేవలకు సెల్యూట్ చేశాయి.నాకు ముందే తెలుసుఛెత్రి రిటైర్మెంట్ గురించి తనకు ముందే తెలుసన్నాడు క్రికెటర్ విరాట్ కోహ్లి. అతడిని చూసి తాను గర్వపడుతున్నానని.. ఏదేమైనా బాగా ఆలోచించిన తర్వాత సునిల్ ఛెత్రి ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలిపాడు. కాగా కోహ్లి, సునిల్ ఛెత్రి మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.చదవండి: IPLలో రూ. 20 లక్షలు.. అక్కడ అత్యధిక ధర! నితీశ్ రెడ్డి రియాక్షన్ ఇదే -
Sunil Chhetri Love Story: ‘చిన్నపిల్లవి చదువుకో అని చెప్పాను.. కానీ నా మనసే వినలేదు’
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి 39 ఏళ్ల వయసులో అంతర్జాతీయ కెరీర్కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. ఈ మేరకు .. గురువారం (మే 16) ప్రకటన విడుదల చేశాడు. తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి మొత్తంగా 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. భారత ఫుట్బాల్ కెప్టెన్గానూ సునిల్ ఛెత్రి సేవలు అందించాడు.సునిల్ ఛెత్రి వ్యక్తిగత జీవితం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. అతడి లవ్స్టోరీ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సునిల్ ఛెత్రి తన కోచ్, భారత మాజీ ఆటగాడు సుబ్రతా భట్టాచార్య కుమార్తె సోనం భట్టాచార్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తన ప్రేమ కథ గురించి సునిల్ ఛెత్రి గతంలో హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘‘నాకు అప్పుడు 18 ఏళ్లు. ఆమెకు 15 ఏళ్లు. వాళ్ల నాన్న గురించి అందరితో గొప్పగా చెప్పేవారు.ఆమె వాళ్ల నాన్న దగ్గరి నుంచి నా నా నెంబర్ దొంగతనం చేసి.. నాకు మెసేజ్లు పంపేది. ‘నేను సోనం.. నేను మీకు వీరాభిమానిని. మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను’ అని సందేశాలు పంపించేది.నాకు మాత్రం అప్పటికి తనెవరో తెలియదు. అయితే, ఆమె మాట్లాడే విధానం నచ్చి ఓ రోజు తనను కలవాలని నిర్ణయించుకున్నా. తనని చూడగానే ఇంత చిన్నపిల్లా నాకు మెసేజ్లు పంపేది అనుకున్నా. ‘నువ్వింకా చిన్నదానివి. వెళ్లి బుద్ధిగా చదువుకో’ అని చెప్పి వెళ్లిపోయా.అయితే, తన మెసేజ్లకు రిప్లై ఇవ్వడం మాత్రం మానలేకపోయా. రెండున్నర నెలల తర్వాత మా కోచ్ ఫోన్ పనిచేయడం లేదని.. ప్రాబ్లం ఏమిటో చూడాలని నాకు ఇచ్చారు. అప్పుడు మా కోచ్ వాళ్ల కూతురి నంబర్, నాకు మెసేజ్లు చేసే అమ్మాయి నంబర్ ఒకేలా అనిపించింది.అప్పుడే నాకు అర్థమైంది తను మరెవరో కాదు మా కోచ్ కూతురేనని! వెంటనే సోనంకు కాల్ చేసి.. ఈ విషయం గురించి మీనాన్నకు తెలిస్తే నా కెరీర్ ముగిసిపోతుంది. ఇక చాలు అని చెప్పేశా.అప్పుడు సోనం నాకు సారీ చెప్పింది. అయితే, విధి రాత మరోలా ఉంది. తను నా మనసులో అలాగే ఉండిపోయింది. ఆమెతో మాట్లాడాలని, మెసేజ్ చేయాలని మా మనసు తహతహలాడేది. సీక్రెట్గా కలిసేవాళ్లం. నా బిజీ షెడ్యూల్ కారణంగా ఏడాదిలో రెండు మూడుసార్లు మాత్రమే నేరుగా కలిసేందుకు వీలయ్యేది.సినిమాకు వెళ్లి రెండు టికెట్లు కొని.. ఒకటి తనకోసం కౌంటర్ దగ్గరే వదిలేసి వెళ్తే తను వచ్చి తీసుకునేది. చాలా ఏళ్లపాటు అలాగే ప్రేమలో మునిగితేలాం.నా కెరీర్తో పాటు మా ప్రేమ కూడా ట్రాక్లో పడింది. సరైన వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం.ఈ విషయం గురించి మా కోచ్తో మాట్లాడాలని నిర్ణయించుకున్నా. కానీ ధైర్యం చాల్లేదు. ఎలాగోలా ధైర్యం తెచ్చుకుని ‘సర్.. నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా’ అని చెప్పాను. ఆయన వెంటనే అవునా.. సరే అంటూ వాష్రూంలోకి వెళ్లిపోయారు. కాసేపటికి వచ్చి మాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.ఆతర్వాత కొన్ని నెలలకు మా పెళ్లి జరిగింది. 13 ఏళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాం. తనే నా ధైర్యం.సపోర్ట్ సిస్టం. ప్రతి అడుగులోనూ నా వెంటే ఉంటుంది. తను లేకుంటే నేను లేను. ఇప్పటికీ తను నాకు వీరాభిమానే!’’ అని సునిల్ ఛెత్రి తెలిపాడు. కాగా సునిల్- సోనం జంటకు 2023లో కుమారుడు జన్మించాడు. -
ఒకే ఒక్కడు.. పుట్బాల్ స్టార్ సునీల్ ఛెత్రి రిటైర్మెంట్ ప్రకటన (ఫొటోలు)
-
Sunil Chhetri: భారత ఫుట్బాల్ దిగ్గజం కీలక ప్రకటన
భారత ఫుట్బాల్ దిగ్గజం సునిల్ ఛెత్రి సంచలన ప్రకటన చేశాడు. అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు తొమ్మిది నిమిషాల నిడివితో కూడిన వీడియో సందేశం ద్వారా గురువారం ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఫిఫా వరల్డ్కప్ క్వాలిఫికేషన్ పోటీలో భాగంగా కువైట్తో జూన్ 6న జరిగే మ్యాచ్ తన కెరీర్లో చివరిదని సునిల్ ఛెత్రి తెలిపాడు. ‘‘గత 19 ఏళ్ల కాలంలో విధి నిర్వహణ, ఒత్తిడి.. సంతోషాలు.. ఇలా ఎన్నో భావోద్వేగాలను నెమరువేసుకుంటూనే వచ్చాను. దేశం కోసం నేను ఇన్ని మ్యాచ్లు ఆడతానని అస్సలు ఊహించలేదు. మంచో.. చెడో.. గత రెండున్నర నెలలుగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నా. ఈ అనుభూతి నాకు కొత్తగా ఉంది. కువైట్తో ఆడే మ్యాచ్ నా చివరి మ్యాచ్ అవుతుంది’’ అని సునిల్ ఛెత్రి భావోద్వేగానికి లోనయ్యాడు.రొనాల్డో, మెస్సీ తర్వాత..1984, ఆగష్టు 3న సికింద్రాబాద్లో జన్మించిన సునిల్ ఛెత్రి.. ప్రఖ్యాత మోహన్ బగాన్ క్లబ్ తరఫున 2002లో తన ఫ్రొఫెషనల్ ఫుట్బాలర్గా కెరీర్ మొదలుపెట్టాడు.ఆ తర్వాత మూడేళ్లకు అంటే 2005లో పాకిస్తాన్తో మ్యాచ్ సందర్భంగా జూన్ 12న భారత జట్టు తరఫున అంతర్జాతీయ కెరీర్ ఆరంభించాడు. దాయాది జట్టుపై గోల్ కొట్టి ఖాతా తెరిచాడు. అనతికాలంలోనే భారత జట్టు కెప్టెన్గా ఎదిగాడు.మొత్తంగా తన ఇంటర్నేషనల్ కెరీర్లో సునిల్ ఛెత్రి 150 మ్యాచ్లలో 94 గోల్స్ సాధించాడు. ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న ఫుట్బాలర్లలో క్రిస్టియానో రొనాల్డో(పోర్చుగీస్), లియోనల్ మెస్సీ(అర్జెంటీనా) తర్వాత ఛెత్రినే అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా ఉండటం విశేషం. అందుకున్న పురస్కారాలు👉అర్జున అవార్డు👉పద్మశ్రీ👉ఖేల్రత్న👉ఏఐఎఫ్ఎఫ్ వార్షిక అత్యుత్తమ ఆటగాడిగా ఏడుసార్లు అవార్డు👉మూడుసార్లు ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు👉శాఫ్ చాంపియన్షిప్లో నాలుగు సార్లు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీచదవండి: Sunil Chhetri Life Story In Telugu: సికింద్రాబాద్లో పుట్టిన ఛెత్రీ.. కుటుంబ నేపథ్యం ఇదే! కెప్టెన్ ఫెంటాస్టిక్గా ఘనతలు -
చాంపియన్ ముంబై సిటీ
కోల్కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) టోర్నీలో ముంబై సిటీ ఫుట్బాల్ క్లబ్ రెండో సారి విజేతగా నిలిచింది. దాదాపు 62 వేల సామర్థ్యం గల సాల్ట్లేక్ స్టేడియంలో జరిగిన తుది పోరులో ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. శనివారం జరిగిన ఫైనల్లో ముంబై 3–1 గోల్స్ తేడాతో మోహన్బగాన్ సూపర్ జెయింట్స్ను చిత్తు చేసింది. ఆరంభంలో ఇరు జట్లూ జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్స్పైనే దృష్టి పెట్టాయి. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ సాధించిన గోల్తో ముందుగా మోహన్బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే రెండో అర్ధభాగంలో 3 గోల్స్తో ముంబై చెలరేగింది. ముంబై తరఫున జార్జ్ పెరీరా డియాజ్ (53వ నిమిషం), బిపిన్ సింగ్ (81వ నిమిషం), జాకబ్ వోజస్ (90+7వ నిమిషం)లో గోల్స్ కొట్టారు. 2020–21 సీజన్లో ముంబై విజేతగా నిలిచిన మ్యాచ్లో కూడా ఇదే తరహాలో మోహన్బగాన్ 1–0తో ఆధిక్యంలో నిలిచినా...బిపిన్ సింగ్ సాధించిన గోల్తోనే ముంబై గెలిచింది. అదనపు సమయంలో మోహన్బగాన్కు స్కోరు సమం చేసే అవకాశం వచ్చినా... ఫార్వర్డ్లు పూర్తిగా విఫలమయ్యారు. కొన్ని క్షణాల్లో ఆట ముగుస్తుందనగా ముంబై మరో గోల్తో తిరుగులేని విజయా న్ని అందుకుంది. ముంబైకి చెందిన ఫుర్బా లచెన్పాకు ‘గోల్డెన్ గ్లవ్’, విక్రమ్ ప్రతాప్ సింగ్కు ‘ఎమర్జింగ్ ప్లేయర్’ అవార్డు, కేరళ బ్లాస్టర్స్ ప్లేయర్ దిమిత్రియోస్ దియామంతకూస్కు ‘గోల్డెన్ బూట్’ అవార్డులు దక్కగా, మోహన్ బగాన్ ఆటగాడు పెట్రాటోస్ ‘ప్లేయర్ ఆఫ్ ద లీగ్’గా నిలిచాడు. -
సంచలన నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ వెనక్కు
బ్రెజిల్ ఫుట్బాల్ దిగ్గజం రొమరియో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ నిర్ణయం వెనక్కు తీసుకున్నట్లు ప్రకటించాడు. స్థానిక టోర్నీలో ఉనికి కోల్పోయిన తన క్లబ్కు (అమెరికా ఆఫ్ రియో డి జనైరో) ఊపు తెప్పించేందుకు తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. ఇదే క్లబ్కు రొమారియో కుమారుడు రొమారిన్హో (30) కూడా ప్రాతినిథ్యం వహిస్తుండటం ఆసక్తికరం. బ్రెజిల్ బేస్డ్ ఫుట్బాల్ క్లబ్ అయిన అమెరికా ఆఫ్ రియో డి జనైరోకు రొమారియో అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. 80, 90 దశకాల్లో స్టార్ స్ట్రయికర్గా పేరొందిన రొమారియో 15 ఏళ్ల కిందట (2008) ప్రొఫెషనల్ ఫుట్బాల్కు గుడ్బై చెప్పాడు. ఆతర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సెనేటర్గా పలు మార్లు ఎన్నికయ్యాడు. రొమారియో 1994 వరల్డ్కప్ విన్నింగ్ జట్టులో (బ్రెజిల్) కీలక సభ్యుడిగా ఉన్నాడు. ప్రస్తుతం రొమారియో సెనేటర్గా ఉంటూనే తన క్లబ్ను కష్టాల్లో నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్న విషయాన్ని రొమారియో ఇన్స్టా ద్వారా వెల్లడించాడు. అమెరికా ఆఫ్ రియో డి జనైరో తరఫున ఆటగాడిగా బరిలోకి దిగేందుకు తన పేరును రిజిస్టర్ చేసుకున్నట్లు ప్రకటించాడు. అయితే తాను ఎన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటానన్న విషయాన్ని మాత్రం రొమారియో పేర్కొనలేదు. కాగా, బ్రెజిల్లో ప్రస్తుతం జరుగుతున్న రియో స్టేట్ ఛాంపియన్షిప్ పోటీల్లో అమెరికా ఆఫ్ రియో డి జనైరో క్లబ్ తడబతుంది. గతమెంతో ఘనంగా ఉన్న ఈ క్లబ్ ప్రస్తుతం పేలవ ప్రదర్శనలకు పరిమితమై ఉనికి కోల్పోయింది. రియో క్లబ్లో ఉత్సాహం నింపి పూర్వవైభవం తెచ్చేందుకే రొమారియో తిరిగి బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ జట్టుకు రెండో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ లీగ్ చాంపియన్షిప్ను హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు విజయంతో ముగించింది. శనివారం ఇక్కడ జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 3–2 గోల్స్ తేడాతో షిల్లాంగ్ లాజోంగ్ ఎఫ్సీ జట్టును ఓడించింది. శ్రీనిధి జట్టు తరఫున విలియమ్ అల్వెస్ ఒలివీరా (4వ ని.లో), గేబ్రియల్ రోసెన్బర్గ్ (16వ ని.లో), డేవిడ్ కాస్టనెడా మునోజ్ (84వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. షిల్లాంగ్ జట్టుకు ఫ్రాంగీ బువామ్ (46వ, 87వ ని.లో) రెండు గోల్స్ అందించాడు. 13 జట్లు పోటీపడ్డ ఐ–లీగ్లో శ్రీనిధి జట్టు నిరీ్ణత 24 మ్యాచ్లు పూర్తి చేసుకుంది. 14 మ్యాచ్ల్లో నెగ్గిన శ్రీనిధి జట్టు ఆరు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, నాలుగు మ్యాచ్ల్లో ఓడిపోయి మొత్తం 48 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకుంది. గత సీజన్లోనూ శ్రీనిధి జట్టు రెండో స్థానంలోనే నిలిచింది. 52 పాయింట్లతో ఐ–లీగ్ చాంపియన్గా నిలిచిన మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ ఇండియన్ సూపర్ లీగ్కు అర్హత సాధించింది. -
అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజం ఓజే సింప్సన్ కన్నుమూత
లాస్ వేగస్: వివాదాస్పద అమెరికన్ ఫుట్బాల్ దిగ్గజ క్రీడాకారుడు, హాలీవుడ్ నటుడు ఓజే సింప్సన్ కన్ను మూశాడు. 76 ఏళ్ల సింప్సన్ కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్నాడు. 1969 నుంచి 1979 వరకు అమెరికాలోని విఖ్యాత నేషనల్ ఫుట్బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో బఫెలో బిల్స్, శాన్ఫ్రాన్సిస్కో 49ఈఆర్ఎస్ జట్లకు సింప్సన్ ప్రాతినిధ్యం వహించాడు. 1994 జూన్లో తన మాజీ భార్య నికోల్ బ్రౌన్, ఆమె స్నేహితుడు రొనాల్డ్ గోల్డ్మన్ల జంట హత్య కేసులో ప్రమేయం ఉందంటూ సింప్సన్ను పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 11 నెలల విచారణ తర్వాత సింప్సన్ నిర్దోíÙగా బయటపడ్డాడు. అయితే 2007లో సింప్సన్ లాస్ వేగస్లోని ఓ క్యాసినోలో మారణాయుధాలతో ప్రవేశించి దోపిడికి పాల్పడ్డారు. విచారణ అనంతరం 2008లో సింప్సన్కు 33 ఏళ్ల జైలు శిక్ష విధించారు. తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించాక 2017లో సింప్సన్ పెరోల్పై విడుదలయ్యాడు. -
‘డ్రా’తో గట్టెక్కిన శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ
షిల్లాంగ్: ఐ–లీగ్ జాతీయ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఐదో ‘డ్రా’ నమోదు చేసింది. నెరోకా ఎఫ్సీతో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి జట్టు 1–1తో ‘డ్రా’ చేసుకుంది. నెరోకా తరఫున రోహిత్ (70వ ని.లో), శ్రీనిధి తరఫున డేవిడ్ కాస్టనెడా మునోజ్ (82వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 44 పాయింట్లతో రెండో స్థానంలో, మొహమ్మదాన్ స్పోర్టింగ్ 49 పాయింట్లో తొలి స్థానంలో ఉన్నాయి. శ్రీనిధి జట్టుకు టైటిల్ దక్కాలంటే చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు మొహమ్మదాన్ స్పోర్టింగ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్ల్లో తప్పనిసరిగా ఓడిపోవాలి. -
భారత ఫుట్బాలర్కు జాక్పాట్
న్యూఢిల్లీ: భారత ఫుట్బాలర్ బిజయ్ ఛెత్రి జాక్పాట్ కొట్టాడు. లాటిన్ అమెరికా క్లబ్కు ఆడే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. తద్వారా ఈ ఘనత సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫుట్బాలర్గా గుర్తింపు పొందనున్నాడు. మణిపూర్కు చెందిన 22 ఏళ్ల బిజయ్తో ఉరుగ్వేకు చెందిన కొలోన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) ఒప్పందం చేసుకుంది. ఇంకా భారత సీనియర్ జట్టుకు ఆడని బిజయ్ 2016లో షిల్లాంగ్ లాజోంగ్ క్లబ్ తరఫున అరంగేట్రం చేశాడు. ప్రస్తుతం ఇండియన్ సూపర్ లీగ్లో చెన్నైయన్ ఎఫ్సీ తరఫున ఆడుతున్న బిజయ్ గతంలో ఇండియన్ యారోస్, చెన్నై సిటీ, రియల్ కశ్మీర్, శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ తరఫున బరిలోకి దిగాడు. -
Afshan Ashiq: 'ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను'
ఆ అమ్మాయి ఒకప్పుడు గుంపులో రాళ్లు విసిరే కశ్మీరీ అమ్మాయి. ఇప్పుడు జమ్ము–కశ్మీర్లో కేవలం బాలికల కోసం ఫుట్బాల్ అకాడెమీ నడుపుతున్న ప్రొఫెషనల్ ఫుట్బాల్ ప్లేయర్. ఆమెలో వచ్చిన మార్పు ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ చేత కూడా మాట్లాడించేలా చేసింది. విరాట్ కోహ్లీ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. యువతకు సరైన దిశ ఉంటే వారు గెలిచి తీరుతారనడానికి అఫ్షాన్ ఆషిక్ ఒక ఉదాహరణ. కొన్నేళ్లు వెనక్కు వెళితే 2017 డిసెంబర్లో ఒక ఫోటో వైరల్ అయ్యింది. ఒకమ్మాయి... ముఖానికి దుపట్టా కట్టుకుని జమ్ము కశ్మీర్ పోలీసులపైకి రాళ్లు విసురుతున్న ఫొటో అది. ఆ అమ్మాయి పేరు అఫ్షాన్ ఆషిక్. ముఖం కనబడకుండా గుడ్డ కట్టుకోవడంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అఫ్షాన్ భావించింది. కానీ తర్వాత ఆమె గురించి అందరికీ తెలిసిపోయింది. సమాజం ఆమెపై ‘స్లోన్ పెల్టర్’ ముద్ర వేసింది. అప్పటికే ఆ అమ్మాయి ఫుట్బాల్ ఆటలో ప్రతిభ కనపరుస్తూ ఉంది. కాని ఈ ఫోటోతో ఆమె తన ఆటకే దూరమయ్యే స్థితి వచ్చింది. ‘ఆ రోజు నేను పోలీసుల మీద రాళ్లు రువ్వాను. అది కోపంలో చేసిన పని. దానికి కారణం పోలీసులు అకారణంగా మమ్మల్ని వేధించారు. విద్యార్థులను విచక్షణారహితంగా కొట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి రాళ్లు విసరడం మినహా మాకు గత్యంతరం లేదు. నేనేమి ప్రొఫెషనల్ స్టోన్ పెల్టర్ను కాదు. కాని నా మీద ముద్ర పడింది. దాని నుంచి బయటపడాలంటే నేను నా చదువు మీద నా ఫుట్బాల్ ఆట మీద దృష్టి పెట్టి విజయం సాధించాలని అనుకున్నాను’ అంది అఫ్షాన్ ఆషిక్. ఈ ఘటన తర్వాత ఆ అమ్మాయి నెల రోజులు ఇంటికే పరిమితమైంది. అఫ్షాన్ తండ్రి ఆమెను ఇంటి నుంచి బయటకు వెళ్లనీయలేదు. అరగంటపాటు ఆడుకుని వచ్చేస్తానని తల్లికి మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘ఒకరోజు చాలా ఏడుస్తుంటే నన్ను చూసిన నాన్న ఎందుకు ఏడుస్తున్నావని అడిగారు. ఇంట్లో కూర్చుని ఏం చేయాలని ప్రశ్నించాను. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతించడంతో మళ్లీ ఆట మొదలుపెట్టాను’ అందామె. ముంబై వెళ్లి.. కశ్మీర్ యువత తమ చదువు, క్రీడల పట్ల దృష్టి పెట్టాలని భావించిన ప్రభుత్వం అఫ్షాన్ను తగిన ప్రోత్సాహం అందించింది. జమ్మూ కశ్మీర్ క్రీడాశాఖ చేయూతతో అఫ్షాన్ ముంబై వెళ్లి ఆటలో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత జమ్ము కశ్మీర్ నుంచి తొలిప్రొఫెషనల్ ఫిమేల్ ఫుట్బాల్ ప్లేయర్ అయ్యింది. ‘నువ్వు ఆడపిల్లవి. ఫుట్బాల్ నేర్చుకుని ఏం చేస్తావ్ అని అందరూ అడిగేవారు. నేను ఆడే సమయానికి ఆడపిల్లలు ఎవరూ మా ప్రాంతం నుంచి ఫుట్బాల్లోకి రాలేదు. కాని నేను ఆగలేదు. పట్టుదలగా ముందుకెళ్లాను. ఇండియన్ విమెన్స్ లీగ్లో ఆడాను. గోల్ కీపర్గా విశేష ప్రతిభ కనపరిచాను. ఆ సమయంలో విదేశీ మహిళా ఫుట్బాల్ ప్లేయర్లని గమనించాను. వాళ్లకు చాలా మంచిశిక్షణ ఆ దేశాల్లో లభిస్తోంది. మా ్రపాంతం బాలికలకు కూడా లభించాలని భావించాను. అందుకే జమ్ము కశ్మీర్ బాలికల కోసం యునీక్ ఫుట్బాల్ అకాడెమీ స్థాపించాను’ అని తెలిపింది అఫ్షాన్. మరింత గుర్తింపు.. నేడు జమ్ము కశ్మీర్లో మహిళా ఫుట్బాల్ పేరు చెప్తే అఫ్షాన్ పేరే అందరికీ గుర్తుకొస్తుంది. ఆమెకు అక్కడ ఒక సెలబ్రిటీ హోదా ఉంది. ’నేను నా గతాన్ని జయించాను. ఇప్పుడు నేను స్టోన్ పెల్టర్ని కాను. గోల్ కీపర్ని. ఇకపై నన్ను జనం అలాగే గుర్తు పెట్టుకుంటారు’ అంటుందామె. ఇవి చదవండి: సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి! -
భారత్కు అఫ్గానిస్తాన్ షాక్
గువాహటి: ఫుట్బాల్లో భారత జట్టు దీనావస్థను చూపించే మరో ఉదాహరణ! ఆసియాలో అనామక జట్లలో ఒకటైన అఫ్గానిస్తాన్తో నాలుగు రోజుల క్రితం జరిగిన మ్యాచ్లో ఒక్క గోల్ కూడా చేయకుండా ‘డ్రా’గా ముగించిన భారత్ ఆటతీరు ఈసారి మరింత దిగజారింది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్లో భాగంగా ఇరు జట్ల మధ్య మంగళవారం సొంతగడ్డపై జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్లోనూ భారత్ కనీస ప్రదర్శనను ఇవ్వలేకపోయింది. చివరకు 1–2 గోల్స్ తేడాతో అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ఆసియా క్వాలిఫయర్స్లో భారత జట్టు మూడో రౌండ్కు అర్హత సాధించే అవకాశాలకు పెద్ద దెబ్బ పడింది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో నాలుగు మ్యాచ్ల తర్వాత భారత్ ఖాతాలో 4 పాయింట్లే ఉన్నాయి. మన టీమ్ తర్వాతి మ్యాచ్లలో కువైట్ (జూన్ 6న కోల్కతాలో), ఆసియా చాంపియన్ ఖతర్ (జూన్ 11న దోహాలో) జట్లతో తలపడాల్సి ఉంది. అఫ్గాన్తోనే ఓడిన మన టీమ్ ఈ నాణ్యమైన టీమ్లపై ఏమాత్రం ప్రభావం చూపిస్తుందనేది సందేహమే. చివరిసారి 2013లో అఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోయిన భారత జట్టు ఈ మ్యాచ్లో ముందుగా గోల్ చేసి ఆధిక్యంలోకి వెళ్లి కూడా ఆఖరికి మ్యాచ్ను ప్రత్యర్థికి అప్పగించింది. భారత్ తరఫున 38వ నిమిషంలో సునీల్ ఛెత్రి కెరీర్లో 94వ గోల్ నమోదు చేయగా... అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో రహ్మత్ అక్బరీ (70వ ని.లో), షరీఫ్ ముఖమ్మద్ (88వ ని.లో) గోల్స్ చేశారు. తన 150వ అంతర్జాతీయ మ్యాచ్లో ఛెత్రి గోల్ చేయడం విశేషమే అయినా... ఓటమి భారత్ను నిరాశకు గురి చేసింది. -
చరిత్ర సృష్టించనున్న భారత కెప్టెన్.. తొలి ఇండియన్గా రికార్డు
గువాహటి: భారత ఫుట్బాల్ జట్టు ఇప్పుడు సొంతగడ్డపై అఫ్గానిస్తాన్తో పోరుకు సిద్ధమైంది. 2026 ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయిర్స్లో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన అఫ్గానిస్తాన్ హోం మ్యాచ్ ఒక్క గోల్ నమోదు కాకుండానే ‘డ్రా’గా ముగిసింది. ఇప్పుడు సొంత ప్రేక్షకుల మధ్య మంగళవారం జరిగే పోరులో భారత్ గోల్సే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. రాత్రి 7 గంటలకు మొదలయ్యే ఈ మ్యాచ్ను స్పోర్ట్స్ 18 చానెల్స్, జియో సినిమా యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మరోవైపు భారత దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రికిది 150వ అంతర్జాతీయ మ్యాచ్ కానుంది. 2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లో అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రి... 19 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 93 గోల్స్ చేశాడు. భారత్ తరఫున 150 మ్యాచ్లు ఆడిన ఏకైక ఆటగాడు ఛెత్రినే కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం 40 మంది మాత్రమే 150 మ్యాచ్ల మైలురాయిని తాకారు. -
ఒకరు 6 సెకన్లలో... మరొకరు 7 సెకన్లలో....
బ్రాటిస్లావా (స్లొవేకియా): అంతర్జాతీయ ఫుట్బాల్లో ఆదివారం అద్భుతం జరిగింది. వేర్వేరు వేదికల్లో జరిగిన రెండు అధికారిక ఫ్రెండ్లీ మ్యాచ్ల్లో రెండు ఫాస్టెస్ట్ గోల్స్ నమోదయ్యాయి. బ్రాటిస్లావాలో స్లొవేకియాతో జరిగిన మ్యాచ్లో ఆ్రస్టియా 2–0తో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 6 సెకన్లకే ఆ్రస్టియా ప్లేయర్ క్రిస్టోఫ్ బామ్గార్ట్నర్ గోల్ చేశాడు. మిడ్ ఫీల్డ్ నుంచి క్షణాల్లో ముగ్గురు డిఫెండర్లను తప్పించుకొని ముందుకు దూసుకెళ్లిన క్రిస్టోఫ్ లాంగ్షాట్తో బంతిని గోల్పోస్ట్లోనికి పంపించాడు. మరోవైపు లియోన్లో ఫ్రాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో జర్మనీ జట్టు 2–0తో నెగ్గింది. ఈ మ్యాచ్లో ఆట మొదలైన 7 సెకన్లకే జర్మనీ ప్లేయర్ ఫ్లోరియన్ విట్జ్ గోల్ చేశాడు. ఇన్నాళ్లూ అంతర్జాతీయ ఫుట్బాల్లో ఫాస్టెస్ట్ గోల్ చేసిన రికార్డు లుకాస్ పొడోల్స్కీ పేరిట ఉంది. 2013లో ఈక్వెడార్తో జరిగిన మ్యాచ్లో పొడోల్స్కీ 9వ సెకనులో గోల్ సాధించాడు. పొడోల్స్కీ 11 ఏళ్ల రికార్డు ఒకేరోజు బద్దలు కావడం విశేషం. -
భారత్, అఫ్గానిస్తాన్ మ్యాచ్ ‘డ్రా’
అబా (సౌదీ అరేబియా): ‘ఫిఫా’ ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్లో బలహీన ప్రత్యర్థిపై గెలవాల్సిన మ్యాచ్లో భారత్ పేలవ ఆటతీరు కనబర్చి ‘డ్రా’గా ముగించింది. గ్రూప్ ‘ఎ’లో భారత్, అఫ్గానిస్తాన్ల మధ్య గురువారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్... ఒక్క గోల్ అయినా నమోదు కాకుండా ‘డ్రా’ అయ్యింది. తొలి అర్ధ భాగంలో మన్వీర్ సింగ్ రెండు సార్లు గోల్స్ చేసేందుకు ప్రత్యర్థి గోల్పోస్ట్ వైపు దూసుకెళ్లాడు. కానీ గోల్ మాత్రం చేయలేకపోయాడు. రెండో అర్ధ భాగంలో విక్రమ్ ప్రతాప్ కూడా గోల్ కోసం విఫల యత్నాలు చేశాడు. మళ్లీ ఫినిషింగ్ లోపాలతో భారత్ ఖాతా తెరవలేకపోయింది. సులువైన ప్రత్యర్థి జట్టు డిఫెన్స్ను ఛేదించలేకపోవడంపై భారత కోచ్ ఐగర్ స్టిమాక్ అసహనం వ్యక్తం చేశారు. తాజా ‘డ్రా’తో భారత్ ఈ గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో ఉంది. మూడు మ్యాచ్లాడిన భారత్ ఖాతాలో 4 పాయింట్లున్నాయి. 3 మ్యాచ్ల ద్వారా 9 పాయింట్లు సాధించిన ఖతర్ అగ్ర స్థానంలో ఉంది. మరో మ్యాచ్లో ఖతర్ 3–0తో కువైట్పై గెలుపొందింది. -
విజయమే లక్ష్యంగా...
అభా (సౌదీ అరేబియా): ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా నేడు అఫ్గానిస్తాన్తో భారత జట్టు తలపడనుంది. తటస్థ వేదిక సౌదీ అరేబియా ఆతిథ్యమివ్వనున్న ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి గం. 12:30 నుంచి జరుగుతుంది. నాలుగు జట్లున్న గ్రూప్ ‘ఎ’లో భారత జట్టు రెండు మ్యాచ్ లు ఆడింది. ఒక మ్యాచ్లో నెగ్గి, ఒక మ్యాచ్లో ఓడి మూడు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. సునీల్ ఛెత్రి కెప్టెన్సీలో భారత జట్టుకు మరో విజయం లభిస్తే మూడో రౌండ్కు అర్హత పొందేందుకు తమ అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది. అఫ్గానిస్తాన్తో ముఖాముఖిగా 11 సార్లు తలపడ్డ భారత్ ఏడుసార్లు గెలిచింది. మూడు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని, ఒక మ్యాచ్లో ఓడిపోయింది. -
శ్రీనిధి డెక్కన్ జట్టును గెలిపించిన ఒలివేరా
కొడుమన్ (కేరళ): ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు ఖాతాలో 12వ విజయం చేరింది. గోకులం కేరళ ఎఫ్సీ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో శ్రీనిధి డెక్కన్ జట్టు 2–1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 44వ నిమిషంలో నికోలా స్టొజనోవిచ్ గోల్తో గోకులం కేరళ జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే శ్రీనిధి తరఫున విలియమ్ అల్వెస్ డి ఒలివేరా (47వ ని.లో, 71వ ని.లో) రెండు గోల్స్ సాధించి తమ జట్టును విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం శ్రీనిధి జట్టు 39 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
సాక్షి, హైదరాబాద్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ టోర్నీలో శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు మూడో ‘డ్రా’ నమోదు చేసుకుంది. లీగ్ ‘టాపర్’ మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్తో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 1–1తో ‘డ్రా’గా ముగించింది. ఆట మూడో నిమిషంలో డేవిడ్ కాస్టనెడా గోల్తో శ్రీనిధి జట్టు 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 84వ నిమిషంలో మొహమ్మద్ జాసిమ్ గోల్తో మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ స్కోరును సమం చేసింది. రెండు జట్లకు చెరో పాయింట్ లభించింది. ప్రస్తుతం మొహమ్మదాన్ స్పోర్లింగ్ క్లబ్ 35 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... శ్రీనిధి డెక్కన్ జట్టు 33 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. -
మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకర ప్రవర్తన.. రొనాల్డోపై నిషేధం
స్టార్ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డోకు భారీ షాక్ తగిలింది. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినందుకు గాను ఇతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడింది. వివరాల్లోకి వెళితే.. పోర్చుగల్ స్టార్ ఫుట్బాలర్ అయిన రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ అయిన అల్ నస్ర్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. స్థానికంగా జరిగే ప్రో లీగ్లో భాగంగా అల్ నస్ర్.. రియాద్ క్లబ్ అయిన అల్ షబాబ్తో తలపడింది. ఈ మ్యాచ్ సందర్భంగా రొనాల్డో.. మెస్సీ ఫ్యాన్స్ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. 🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨🚨 تصرف كارثي جديد من كريستيانو رونالدو ضد جمهور الشباب بعد نهاية اللقاء! 😳😳😳😳😳 pic.twitter.com/Tzt632I20p — نواف الآسيوي 🇸🇦 (@football_ll55) February 25, 2024 మెస్సీ అభిమానులను టార్గెట్ చేస్తూ జుగుప్సాకరమైన సంజ్ఞలు చేశాడు. రొనాల్డో ప్రవర్తనను సీరియస్గా తీసుకున్న లీగ్ నిర్వహకులు అతనిపై ఓ మ్యాచ్ నిషేధం విధించారు. అలాగే జరిమానా కింద 20000 సౌదీ రియాల్స్ కట్టాల్సిందిగా ఆదేశించారు. రొనాల్డో వికృత ప్రవర్తనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ ఉదంతంపై రొనాల్డో తాజాగా స్పందించాడు. యూరప్ దేశాల్లో ఇది కామనేనని సమర్ధించుకున్నాడు. కాగా, అల్ నస్ర్ క్లబ్ రెండున్నర సంవత్సరాల కాలానికి గాను రొనాల్డోతో రూ. 4400 కోట్ల మొత్తానికి ఒప్పందం కుదుర్చుకుంది. -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్ష.. భారీ జరిమానా
లైంగిక వేధింపుల కేసులో స్టార్ ఫుట్బాలర్కు జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించింది స్పానిష్ కోర్టు. ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో బ్రెజిల్ మాజీ ఫుట్బాలర్ డానీ అల్వెస్కు (40) నాలుగున్నర సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ. 13 కోట్ల జరిమానా విధించింది స్పెయిన్లోని బార్సిలోనా కోర్టు. 2022 డిసెంబర్ 31న అల్వెస్.. సదరు మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో (నైట్ క్లబ్లో) పాటు అనుమతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడ్డాడని రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పునిచ్చింది. ఈ కేసులో అల్విస్ను ఈ ఏడాది జనవరి 20న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి అతను రిమాండ్లోనే ఉన్నాడు. అల్విస్ బెయిల్ ప్రయత్నాలను కోర్టు తిరస్కరించింది. తాను నిరపరాధినన్న వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో అల్వెస్ భార్య స్టేట్మెంట్ను కూడా కోర్టు పట్టించుకోలేదు. అల్వెస్ ఫుట్బాల్ కెరీర్ విషయానికొస్తే.. 2006 నుంచి 2022 వరకు బ్రెజిల్ జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అల్వెస్.. 126 మ్యాచ్లు ఆడి 8 గోల్స్ చేశాడు. అల్వెస్.. రైట్ బ్యాక్ స్థానంలో ఆడతాడు. ఇతను వివిధ సమయాల్లో బార్సిలోనా, పీఎస్జీ, జువెంటస్, సాపాలో క్లబ్ల తరఫున ఆడాడు. అల్వెస్.. 2022 ఫిఫా వరల్డ్కప్లో చివరిసారిగా బ్రెజిల్కు ప్రాతినిథ్యం వహించాడు. -
నింగిలో ఫుట్బాల్ గ్రౌండ్... ఆటగాళ్ల వీడియో వైరల్!
ప్రపంచంలోని పలు దేశాలు ఇతర దేశాల ప్రజలను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఈ విషయంలో చైనా ముందుంటుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ప్రపంచంలోని ఎవరికీ రాని ఆలోచనలు చైనా వారికి వస్తుంటాయి. అవి కార్యరూపం దాల్చినప్పుడు ప్రపంచాన్ని తనవైపునకు తప్పుకుంటాయి. తాజాగా చైనాలో మరో ఆకర్షణీయమైన ప్రాంతం ఏర్పాటయ్యింది. చైనా తాజాగా ఒక విచిత్రమైన ఫుట్బాల్ మైదానాన్ని నిర్మించింది. దానిని చూసినవారంతా విస్తుపోతున్నారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటున్నారు. పైగా ఈ ఫుట్బాల్ గ్రౌండ్లో ఏమాత్రం భయం లేనివారే ఆడగలరంటూ స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. చైనాకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫుట్బాల్ మైదానానం ఆకాశంలో తేలియాడుతూ కనిపిస్తుంది. ఈ మైదానం రెండు పర్వతాల మధ్య నున్న భాగంలో నెట్ సహాయంతో తయారు చేశారు. కొంతమంది ఆటగాళ్లు ఈ గ్రౌండ్లో ఉత్సాహంగా ఆడటం వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో చైనాలోని జెజియాంగ్లో చిత్రీకరించారు. ఈ వీడియో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫారమ్ ‘ఎక్స్’లో @gunsnrosesgirl3 అనే పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకూ రెండు లక్షల 70 వేల మంది వీక్షించారు. వీడియో చూసిన ఒక యూజర్ ‘వావ్ వాట్ ఎ గేమ్’అని రాయగా మరొక యూజర్ ‘ఇలా ఆడే ధైర్యం నాకు లేదు’ అని రాశాడు. Playing football in the sky, Zhejiang China 📹mychinatrip pic.twitter.com/36ivYq1Fcu — Science girl (@gunsnrosesgirl3) February 21, 2024 -
ఫుట్బాల్ మైదానంలో విషాదం.. అందరూ చూస్తుండగానే కబలించిన మృత్యువు
ఫుట్బాల్ మైదానంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ ఆటగాడిని మృత్యువు కబలించింది. పిడుగుపాటుకు గురై ఓ ఫుట్బాలర్ మృతి చెందాడు. ఈ దుర్ఘటన ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో జరిగింది. స్థానిక జట్ల మధ్య జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్ సందర్భంగా ఈ విషాదం సంభవించింది. This happened during a football match in Indonesia 🇮🇩 pic.twitter.com/JHdzafaUpV — Githii (@githii) February 11, 2024 మ్యాచ్ జరుగుతుండగా 35 ఏళ్ల ఫుట్బాలర్పై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా చురుగ్గా కదిలిన సహచరుడు ఒక్కసారిగా నిశ్రేష్ఠుడిగా మారడంతో ఆటగాళ్లలో దుఖం కట్టలు తెంచుకుంది. ఈ ఘటన చూసి ఆటగాళ్లతో పాటు మైదానంలో ఉన్నవారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది. ఏడాదికాలంలో ఇండోనేషియాలో ఫుట్బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురికావడం ఇది రెండోసారి. గతంలో తూర్పు జావాలోని ఓ యువ ఫుట్బాలర్ ఇలాగే పిడుగుపాటుకు గురయ్యాడు. పిడుగుపాటు కారణంగా ఆ ఫుట్బాలర్కు గుండెపోటు వచ్చింది. అయితే అదృష్టవశాత్తు అతను ప్రాణాలతో బయటపడ్డాడు. క్రీడా మైదానాల్లో ఇలాంటి దుర్ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. 25 సంవత్సరాల క్రితం కాంగోలో ఓ ఫుట్బాల్ మ్యాచ్ జరగుతుండగా పిడుగుపడి జట్టు మొత్తం ప్రాణాలు కోల్పోయింది,. -
మెస్సీ జట్టుకు షాకిచ్చిన రొనాల్డో టీమ్
ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాలు ప్రాతినిథ్యం వహిస్తున్న క్లబ్ల మధ్య నిన్న ఫెండ్లీ మ్యాచ్ జరిగింది. రియాద్లో జరిగిన ఈ మ్యాచ్లో అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ, పోర్చుగల్ ఐకాన్ క్రిస్టియానో రొనాల్డో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంటర్ మయామీ (అమెరికా), అల్ నస్ర్ (సౌదీ అరేబియా) జట్లు పోటీపడ్డాయి. ఈ మ్యాచ్లో రొనాల్డో జట్టు అల్ నస్ర్.. మెస్సీ జట్టు ఇంటర్ మయామీపై 6-0 గోల్స్ తేడాతో విజయం సాధించింది. Messi at full time pic.twitter.com/zvsmiuJqir — Messi Media (@LeoMessiMedia) February 1, 2024 The reaction of Ronaldo and Messi after Al Nassr third goal. https://t.co/DAhcNfTd7Z — CristianoXtra (@CristianoXtra_) February 1, 2024 గాయం కారణంగా క్రిస్టియానో రొనాల్డో ఈ మ్యాచ్ మొత్తంలో పాల్గొనలేదు. మెస్సీ మాత్రం కాసేపు అభిమానులను అలరించాడు. సమయ పరిమితి నిబంధన కారణంగా మెస్సీ గేమ్ చివర్లో కొద్ది నిమిషాలు మైదానంలో కనిపించాడు. రొనాల్డో, మెస్సీ ఆడకపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఈ మ్యాచ్ను ఎంతో ఆసక్తిగా తిలకించాడు. Puskas award 🏅 Goal of the year already🎖️ "Aymeric Laporte " 👑#InterMiami #AlNassr#Ronaldo #Messi #Goal pic.twitter.com/XFW1DJwd5p — Mehran Sofi (@sadistic3232) February 1, 2024 రొనాల్డో స్టాండ్స్లో కూర్చొని మ్యాచ్ను వీక్షించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రొనాల్డో, మెస్సీ ముఖాల్లోని హావభావాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. తమ ఆరాథ్య ఆటగాళ్లు మ్యాచ్ ఆడకపోయినా ఈ మ్యాచ్ను కొన్ని కోట్ల మంది తిలకించారు. ఈ మ్యాచ్లో అల్ నస్ర్ ఆటగాడు, బ్రెజిల్కు చెందిన టలిస్క హ్యాట్రిక్ గోల్స్ సాధించగా.. టెల్లెస్, ఆక్టేవియో, లాపోర్టే తలో గోల్ కొట్టారు. Turki Sheikh reminding Lionel Messi his team is losing 6-0 to Cristiano Ronaldo's Al-Nassr. Unbelievable reaction 🤯🤯🤯 #AlNassrvsInterMiamiCF pic.twitter.com/Zy3lw33piq — Farid Khan (@_FaridKhan) February 2, 2024 -
ఒక్క గోల్, ఒక్క పాయింట్ లేకుండానే ఓటమితో ముగించిన టీమిండియా
దోహా: ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో భారత పురుషుల జట్టు లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్ ‘బి’లో భాగంగా సిరియాతో జరిగి న చివరిదైన మూడో లీగ్ మ్యాచ్లో సునీల్ ఛెత్రి నాయకత్వంలోని టీమిండియా 0–1 గోల్ తేడాతో ఓడిపోయింది. సిరియా తరఫున ఆట 76వ నిమిషంలో ఒమర్ ఖిరిబిన్ ఏకైక గోల్ చేసి తమ జట్టును గెలిపించాడు. ఈ టోర్నీలో భారత జట్టు ఒక్క గోల్ కూడా చేయకుండానే, ఒక్క విజయం కూడా లేకుండా ని్రష్కమించింది. తొలి మ్యాచ్లో భారత్ 0–2తో ఆస్ట్రేలియా చేతిలో, రెండో మ్యాచ్లో 0–3తో ఉజ్బెకిస్తాన్ చేతిలో పరాజయం పాలైంది. ఏడు పాయింట్లతో ఆస్ట్రేలియా, ఐదు పాయింట్లతో ఉజ్బెకిస్తాన్ ఈ గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచి నాకౌట్ దశకు అర్హత సాధించాయి. -
మళ్లీ ఓడిన భారత్.. వరుసగా రెండో పరాజయం
ఆసియా కప్ పురుషుల ఫుట్బాల్ టోర్నీలో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. గ్రూప్ ‘బి’లో భాగంగా దోహాలో గురువారం జరిగిన మ్యాచ్లో భారత్ 0–3 గోల్స్ తేడాతో ఉజ్బెకిస్తాన్ జట్టు చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమితో భారత జట్టుకు నాకౌట్ దశకు అర్హత సాధించే అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయి. ఈనెల 23న జరిగే చివరి లీగ్ మ్యాచ్లో సిరియాతో భారత్ ఆడుతుంది. -
‘ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్గా మెస్సీ.. రికార్డు స్థాయిలో మూడోసారి
అర్జెంటీనా సూపర్స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు. -
ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
దోహా (ఖతర్): ఆసియాన్ కప్ ఫుట్బాల్ టోర్నీని భారత జట్టు పరాజయంతో ప్రారంభించింది. శనివారం జరిగిన మ్యాచ్లో ఆ్రస్టేలియా 2–0 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. ఆసీస్ తరఫున 50వ నిమిషంలో జాక్సన్ ఇరి్వన్, 73వ నిమిషంలో జోర్డాన్ బాస్ గోల్స్ సాధించారు. ఆసీస్ ఆటను దూకుడుగా ప్రారంభించింది. ఆరంభంలోనే అజీజ్ బెహిచ్ కొట్టిన షాట్ గోల్ పోస్ట్కు దూరంగా వెళ్లిపోగా, గుడ్విన్ ఇచ్చిన ఫ్రీ కిక్ను హెడర్తో గోల్ చేయడంలో డ్యూక్ విఫలమయ్యాడు. 16వ నిమిషంలో భారత్కు గోల్ చేసేందుకు మంచి అవకాశం లభించింది. నిఖిల్ పుజారి క్రాసింగ్ పాస్ అందించగా, కెపె్టన్ సునీల్ ఛెత్రి దానిని గోల్గా మలచడంలో విఫలమయ్యాడు. తొలి అర్ధభాగంలో ఆసీస్ను నిలువరించడంలో భారత గోల్కీపర్ గుర్ప్రీత్ సింగ్ సఫలమయ్యాడు. తమకు లభించిన 11 కార్నర్ కిక్లలో ఆసీస్ సఫలం కాలేదు. అయితే రెండో అర్ధభాగం ప్రారంభమైన కొద్ది సేపటికే ఆ్రస్టేలియా పైచేయి సాధించింది. మార్టిన్ బాయెల్ కొట్టిన షాట్ను గుర్ప్రీత్ ఆపగలిగినా...అక్కడే ఉన్న ఇర్విన్ దానిని గోల్గా మలిచాడు. 69వ నిమిషంలో కూడా గోల్ చేసేందుకు చేరువైన భారత్ మళ్లీ విఫలమైంది. స్కోరు సమం చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికే సుభాషిష్ బోస్ను తప్పించి ర్యాన్ మెక్గ్రీ బంతితో దూసుకెళ్లగా...పోస్ట్కు దగ్గరలోనే ఉన్న బాస్ దానిని అందుకొని సునాయాసంగా గోల్ సాధించాడు. తమ తర్వాతి మ్యాచ్లో గురువారం ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. -
నేటి నుంచి ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ
దోహా: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ఫుట్బాల్ టోర్నీ శుక్రవారం ఖతర్ రాజధాని దోహాలో మొదలవుతుంది. 24 జట్లు పోటీపడుతున్న ఈ మెగా టోర్నీ ఫిబ్రవరి 10 వరకు జరుగుతుంది. మొత్తం 24 జట్లను ఆరు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో భారత్, సిరియా, ఉజ్బెకిస్తాన్, ఆస్ట్రేలియా జట్లున్నాయి. నేడు జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఖతర్తో లెబనాన్ తలపడుతుంది. వాస్తవానికి ఈ టోర్నీ గత ఏడాది చైనాలో జరగాల్సింది. అయితే కోవిడ్ కారణంగా చైనా ఆతిథ్యం నుంచి తప్పుకోగా ఖతర్కు ఈ టోర్నీని కేటాయించారు. -
రోజుల వ్యవధిలో ఇద్దరు ఫుట్బాల్ దిగ్గజాల కన్నుమూత
మ్యూనిక్: రోజుల వ్యవధిలో రెండు ఫుట్బాల్ దిగ్గజాలు నేలరాలాయి. శనివారం బ్రెజిల్ మాజీ ఆటగాడు, నాలుగు సార్లు వరల్డ్కప్ విన్నర్ మారియో జగల్లో (92) తుది శ్వాస విడువగా.. ఆదివారం జర్మనీ ఫుట్బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్బాయెర్ కన్నుమూశారు. 78 ఏళ్ల ఈ జర్మన్ మాజీ కెప్టెన్ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. జర్మనీ ఫుట్బాల్లో బెకెన్బాయెర్ శిఖరం. డిఫెండర్ పొజిషన్లో ఆడే ఆయన తొలుత కెప్టెన్గా తదనంతరం కోచ్గా విజయవంతమై జర్మనీకి రెండు ప్రపంచకప్ టైటిళ్లను అందించారు. పశ్చిమ జర్మనీ కెప్టెన్గా 1974లో ప్రపంచకప్ టైటిల్ను అందించిన ఆయన 1990 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన జర్మనీకి కోచ్గానూ వ్యవహరించారు. -
ఫుట్బాల్ దిగ్గజం కన్నుమూత
ఫుట్బాల్ దిగ్గజం, బ్రెజిల్ మాజీ ఆటగాడు మారియో జగల్లో (92) తుది శ్వాస్ విడిచారు. వయసు పైబడటంతో పాటు శరీరంలోని పలు అవయవాలు దెబ్బతినడంతో మారియో కన్నుమూశారు. నాలుగు సార్లు వరల్డ్కప్ విన్నర్ అయిన మారియో.. మునుపటి తరం మేటి ఆటగాళ్లలో చివరివాడు. మారియో మరణవార్త తెలిసి ఫుట్బాల్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. మారియో అంత్యక్రియలు ఆదివారం పూర్తయ్యాయి. మారియో బ్రెజిల్ ఫుట్బాలర్గానే కాకుండా ఆ జట్టుకు కోచ్గా కూడా సేవలందించాడు. మరో ఫుట్బాల్ దిగ్గజం పీలే సమకాలీకుడైన మారియో.. పీలేతో కలిసి 1958, 1962 ప్రపంచకప్లు గెలిచాడు. 1970లో వరల్డ్కప్ గెలిచిన బ్రెజిల్ జట్టుకు మారియో మేనేజర్గా పని చేశాడు. ఆ జట్టుకు పీలే కెప్టెన్గా వ్యవహరించాడు. అలాగే 1994 వరల్డ్కప్ విన్నింగ్ జట్టుకు మారియో కో ఆర్డినేటర్గా పని చేశాడు. 2002లో వరల్డ్కప్ విన్నింగ్ జట్టుకు మారియో అడ్వైజర్గా వ్యవహరించాడు. బ్రెజిల్ ప్రపంచకప్ గెలిచిన ప్రతి సందర్భంలో మారియో ఆ బృందంలో ఏదో ఒక రకంగా భాగమై ఉన్నాడు. -
మెస్సీని ఓడించి ప్రతిష్టాత్మక అవార్డు గెలుచుకున్న కోహ్లి
క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లి ప్రతిష్టాత్మక ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కైవసం చేసుకున్నాడు. ప్యూబిటీ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ఇన్స్టాగ్రామ్ పేజీలలో (35 మిలియన్ల ఫాలోవర్స్) ఒకటి. ఈ అవార్డు కోసం హోరాహోరీగా సాగిన పోరులో కోహ్లి.. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీని 78-22 శాతం ఓట్లతో ఓడించాడు. మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నప్పటికీ కోహ్లి క్రేజ్ ముందు అతను నిలబడలేకపోయాడు. It's Kohli vs Messi in the final voting for the "Athlete of the year" award in one of the biggest sports pages on Instagram - Pubity Sport. pic.twitter.com/gcyLSPbywA — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ప్రపంచం మొత్తం మెస్సీ మేనియా నడుస్తున్నప్పటికీ క్రికెట్ అభిమానులు మాత్రం ఏకపక్షంగా కోహ్లికి ఓట్లు వేసి గెలిపించారు. ఈ అవార్డు కోసం కోహ్లి, మెస్సీతో పాటు నోవాక్ జకోవిచ్, పాట్ కమిన్స్, లెబ్రాన్ జేమ్స్, ఎర్లింగ్ హాలాండ్, క్రిస్టియానో రొనాల్డో, మాక్స్ వెర్స్టాపెన్, మైఖేల్ జోర్డాన్ తదితరులు పోటీపడ్డారు. కాగా, 2023లో వివిధ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్ల మధ్య ఈ పోటీని నిర్వహించగా.. ఫైనల్ రౌండ్ పోరు కోహ్లి, మెస్సీ మధ్య సాగింది. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించి పలు ప్రపంచ రికార్డులు కొల్లగొట్టగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించడంతో పాటు తన జట్టుకు పలు అపురూపమైన విజయాలు అందించాడు. -
ప్రతిష్టాత్మక అవార్డు రేసులో మెస్సీ, కోహ్లి
క్రీడారంగానికి సంబంధించిన ఓ ప్రతిష్టాత్మక అవార్డు కోసం ఇద్దరు దిగ్గజాలు పోటీపడుతున్నారు. ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం క్రికెట్ GOAT విరాట్ కోహ్లి.. ఫుట్బాల్ లెజెండ్ లియోనల్ మెస్సీతో అమీతుమీకి సిద్దమయ్యాడు. ఈ అవార్డు కోసం కోహ్లి-మెస్సీ మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. ఇద్దరూ ఈ ఏడాది తమతమ క్రీడా విభాగాల్లో అత్యుత్తమంగా రాణించి అవార్డు రేసులో నిలిచారు. కోహ్లి ఈ ఏడాది ఆధ్యాంతం పరుగుల వరద పారించగా.. మెస్సీ ఏడాది పొడువునా గోల్స్ వర్షం కురిపించాడు. Virat Kohli Vs Lionel Messi Final for 'Pubity Athlete of the Year' award. pic.twitter.com/w4zm4MJmt3— Mufaddal Vohra (@mufaddal_vohra) December 30, 2023 ప్యూబిటీ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డు కోసం కోహ్లీ, మెస్సీతో పాటు వివిధ క్రీడలకు చెందిన వందల మంది స్టార్ క్రీడాకారులు పోటీ పడగా.. చివరిగా రేసులో ఈ ఇద్దరే మిగిలారు. మెస్సీ, కోహ్లితో పాటు ఈ అవార్డు కోసం మరో దిగ్గజ ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో, బాక్సింగ్ దిగ్గజం మహమ్మద్ అలీ, బాస్కెట్బాల్ లెజెండ్ మైఖేల్ జోర్డాన్ పోటీపడ్డారు. త్వరలో మెస్సీ, కోహ్లిలలో ఒకరిని ఓటింగ్ ద్వారా విజేతగా ప్రకటిస్తారు. -
క్రికెట్కు విరామం.. ఫుట్బాల్ ఆడిన సంజూ శాంసన్
టీమిండియా వికెట్కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ క్రికెట్కు పాక్షికంగా విరామం పలికినట్లున్నాడు. నిత్యం ఏదో ఒక క్రికెట్ టోర్నీతో బిజీగా ఉండే సంజూ.. తాజాగా తన సొంత రాష్ట్రమైన కేరళలో ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతూ కనిపించాడు. సెవెన్స్ టోర్నీలో భాగంగా ఓ స్థానిక జట్టుకు సంజూ ప్రాతినిథ్యం వహించాడు. క్రికెట్తో పాటు ఫుట్బాల్లోనూ ప్రావీణ్యం కలిగిన ఈ డాషింగ్ క్రికెటర్.. ప్రొఫెషనల్ ఫుట్బాలర్లా గేమ్ ఆడుతూ ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. ఈ వీడియో పాతదని కొందరు.. ఇటీవలే ఆడినదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి సంజూ అభిమానులు అతని ఫుట్బాల్ టాలెంట్ను చూసి ముగ్దులవుతున్నారు. Sanju Samson playing football in a sevens tournament. pic.twitter.com/3c3X7zXMvS — Johns. (@CricCrazyJohns) December 30, 2023 ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం సంజూ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో ఓ సెంచరీ బాదాడు. పార్ల్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సంజూ 114 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 108 పరుగులు చేశాడు. సంజూకు ఏ ఫార్మాట్లో అయినా (అంతర్జాతీయ స్థాయి) ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఐపీఎల్లో సంజూ పేరిట మూడు శతకాలు ఉన్నాయి. మ్యాచ్ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో సంజూ సెంచరీతో కదంతొక్కడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన సౌతాఫ్రికా.. అర్ష్దీప్ సింగ్ (4/30) విజృంభించడంతో 45.5 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటై 78 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో తొలి మ్యాచ్లో భారత్, రెండో వన్డేలో సౌతాఫ్రికా గెలుపొందగా.. నిర్ణయాత్మకమైన మూడో వన్డే భారత్ గెలుపొంది 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంది. అంతకుముందు ఇదే పర్యటనలో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ 1-1తో డ్రా కాగా.. ప్రస్తుతం రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ నడుస్తుంది. ఇటీవల ముగిసిన తొలి టెస్ట్లో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించి, సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. వచ్చే ఏడాది జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదికగా రెండో టెస్ట్ జరుగనుంది. -
అది మెస్సీ క్రేజ్.. జెర్సీల విలువ 64 కోట్ల పై మాటే..!
ఫుట్బాల్ దిగ్గజం, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవ్యాప్తంగా ఈ స్టార్ ఫుట్బాలర్కు కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మెస్సీ ప్రపంచంలో ఏ మూలలో ఫుట్బాల్ ఆడినా ఇసకేస్తే రాలనంత మంది జనాలు స్టేడియాలకు తరలి వస్తారు. అతను ధరించే బ్రాండ్లు, అతని ఎండార్స్మెంట్ల రేంజ్ వేరే లెవెల్లో ఉంటుంది. తాజాగా మెస్సీ ధరించిన జెర్సీలను ఆన్లైన్లో వేలానికి పెట్టగా కళ్లు బైర్లు కమ్మే మొత్తానికి అవి అమ్ముడుపోయాయి. గతేడాది ఖతర్ వేదికగా జరిగిన ఫుట్ బాల్ ప్రపంచకప్లో మెస్సీ ధరించిన ఆరు జెర్సీలను న్యూయార్క్లో ఆన్లైన్ వేలానికి పెట్టగా.. ఓ అజ్ఞాత అభిమాని ఏకంగా 78 లక్షల డాలర్లకు (రూ. 64 కోట్ల 86 లక్షలు) ఆ ఆరు జెర్సీలను సొంతం చేసుకున్నాడు. ఇంత పెద్ద మొత్తంలో ఓ వ్యక్తి ధరించిన జెర్సీలు అమ్ముడుపోవడం క్రీడల చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుంటుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి, మూడోసారి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఫైనల్లో మెస్సీ రెండు గోల్స్ సాధించి అర్జెంటీనాను ఒంటిచేత్తో గెలిపించాడు. -
జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాల్ టీంలో కలకలం..183 కోట్లు కాజేసిన భారతీయుడు!
అమెరికాలో భారత సంతతికి చెందిన ఉద్యోగి చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విలాసాలకు అలవాటు పడిన ఎన్నారై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.183 కోట్లు కొల్లగొట్టాడు. అమెరికాలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన మాజీ ఫుట్బాల్ టీమ్ ఉద్యోగి అమిత్ పటేల్ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. తాను ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన యూఎస్ ఫుట్బాల్ టీమ్ జాక్సన్విల్లే జాగ్వార్స్కు 22 మిలియన్ డాలర్లు అంటే ఇండియా కర్సెనీలో రూ.183 కోట్లు టోకరా పెట్టాడు. ఈ డబ్బుతో జల్సా చేశాడు. జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాట్ టీంలో జాక్సన్విల్లే జాగ్వార్స్ ఫుట్బాల్ టీంలో అమిత్ పటేల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. జాగ్వార్స్ టీం యాజమాన్యం ఆటగాళ్లు వినియోగించుకునేందుకు వర్చువల్ క్రెడిట్కార్డ్ ప్రోగ్రామ్(వీసీసీ)ని అందుబాటులోకి తెచ్చింది. ఈప్రోగ్రాం ద్వారా ఫుట్బాల్ ఆటగాళ్లు వాళ్లకు కావాల్సిన ఫుడ్, ప్రయాణ ఖర్చులు ఇతర అవసరాల్ని తీర్చుకోవచ్చు. ఆ బాధ్యత అమిత్ పటేల్కి అప్పగించింది. అయితే, ఎంతో నమ్మకంతో ఉంటాడకున్న అమిత్ తన దుర్బుద్దిని చూపించుకున్నాడు. మోసం ఎలా చేసేవాడంటే వీసీసీలో ఆటగాళ్లకు ఖర్చు పెట్టే మొత్తంలో క్యాటరింగ్, ఫ్లైట్ ఛార్జీలు, హోటల్ ఛార్జీలు ఇలా అన్నీ ఫేక్ రిసిఫ్ట్లు క్రియేట్ చేశాడు. అకౌంట్స్ను మ్యాన్యువల్గా ఎంట్రీ చేసే ఫేక్ రిసిఫ్ట్లను సబ్మిట్ చేసేవాడు. అలా 2018 నుంచి 2023 అమిత్ చేసిన మోసాలకు అంతేలేకుండా పోయింది. చివరకు రూ.183 కోట్లను దుర్వినియోగం చేసినట్లు తేలడంతో ఉద్యోగం పోగొట్టుకోవడమే కాదు..ఫ్లోరిడాలోని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్లో విచారణ ఎదుర్కొంటున్నాడు. ఇక ఈ రూ.183 కోట్లను ఆన్లైన్ బెట్టింగ్, ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్లో భారీ విలాసవంతమైన అపార్ట్మెంట్ కొనుగోలు, టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ను కొనుగోలు చేసినట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. -
శ్రీనిధి డెక్కన్ ఎఫ్సీ మ్యాచ్ ‘డ్రా’
శ్రీనగర్: ఐ–లీగ్ జాతీయ ఫుట్బాల్ చాంపియన్షిప్లో హైదరాబాద్కు చెందిన శ్రీనిధి డెక్కన్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) జట్టు రెండో ‘డ్రా’ నమోదు చేసింది. రియల్ కశ్మీర్ ఎఫ్సీ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్ను శ్రీనిధి డెక్కన్ జట్టు 0–0తో ‘డ్రా’గా ముగించింది. రెండు జట్లకు గోల్ చేసే అవకాశాలు లభించినా ఫినిషింగ్ లోపంతో సాధ్యపడలేదు. 13 జట్ల మధ్య జరుగుతున్న ఐ–లీగ్లో ఇప్పటి వరకు శ్రీనిధి జట్టు తొమ్మిది మ్యాచ్లు ఆడింది. ఐదు మ్యాచ్ల్లో గెలిచింది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్లను ‘డ్రా’ చేసుకొని ఓవరాల్గా 17 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈనెల 11న జరిగే తదుపరి మ్యాచ్లో ఢిల్లీ ఎఫ్సీతో హైదరాబాద్లో శ్రీనిధి జట్టు తలపడుతుంది. -
FIFA World Cup 2026 Qualifiers: ఐదుసార్లు విశ్వవిజేతకు షాక్.. తొలిసారి..!
రియో డి జనీరో: ఫుట్బాల్ ప్రపంచకప్–2026 దక్షిణ అమెరికా జోన్ క్వాలిఫయింగ్ పోటీల్లో ఐదుసార్లు విశ్వవిజేత బ్రెజిల్ జట్టుకు పరాజయం ఎదురైంది. మెస్సీ సారథ్యంలోని ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా 1–0 గోల్ తేడాతో బ్రెజిల్ జట్టును ఓడించింది. ఆట 63వ నిమిషంలో నికోలస్ ఒటామెండి హెడర్ షాట్తో గోల్ సాధించి అర్జెంటీనా విజయంలో కీలకపాత్ర పోషించాడు. స్వదేశంలో ప్రపంచకప్ క్వాలిఫయింగ్ మ్యాచ్లో బ్రెజిల్ జట్టు ఓడిపోవడం ఇదే తొలిసారి. -
భారత్ సత్తాకు సవాల్
భువనేశ్వర్: సొంతగడ్డపై సమష్టి ఆటతీరుతో రాణించి ఆసియా చాంపియన్ ఖతర్ జట్టును నిలువరించాలని భారత పురుషుల ఫుట్బాల్ జట్టు పట్టుదలతో ఉంది. ఫుట్బాల్ ప్రపంచకప్–2026 ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీ రెండో రౌండ్లో భాగంగా నేడు కళింగ స్టేడియంలో ఖతర్ జట్టుతో భారత్ తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్లో ఖతర్ 61వ స్థానంలో, భారత్ 102వ స్థానంలో ఉన్నాయి. ర్యాంక్ పరంగానూ, ప్రావీణ్యం పరంగానూ తమకంటే మెరుగ్గా ఉన్న ఖతర్ జట్టును నిలువరించాలంటే భారత్ అత్యుత్తమ ప్రదర్శన కనబరచాలి. సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీని విజయంతో ప్రారంభించింది. కువైట్తో ఈనెల 16న జరిగిన తొలి లీగ్ మ్యాచ్లో భారత్ 1–0తో గెలిచింది. మరోవైపు ఖతర్ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో 8–1తో అఫ్గానిస్తాన్పై ఘనవిజయం సాధించింది. ఈ నేపథ్యంలో నేడు జరిగే మ్యాచ్ భారతజట్టు సత్తాకు సవాల్గా నిలువనుంది. ఇప్పటి వరకు భారత్, ఖతర్ జట్లు ముఖాముఖిగా మూడుసార్లు తలపడ్డాయి. 1996లో ఖతర్తో జరిగిన తొలి మ్యాచ్లో 0–6తో ఓడిన టీమిండియా, 2019లో రెండో మ్యాచ్ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. 2021లో జరిగిన మూడో మ్యాచ్లో భారత్ 0–1తో ఓటమి చవిచూసింది. ప్రపంచకప్ ఆసియా జోన్ క్వాలిఫయింగ్ గ్రూప్ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఇంటా బయటా పద్ధతిలో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మొత్తం ఆరు మ్యాచ్లు ఆడుతుంది. అనంతరం టాప్–2లో నిలిచిన రెండు జట్లు ప్రపంచకప్ మూడో రౌండ్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత సాధిస్తాయి. -
డేవిడ్ బెక్హాంకు అంబానీ అదిరిపోయే ట్రీట్..!
-
ఫుట్బాల్ను తాకిన క్రికెట్ ఫీవర్.. భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్కు విశిష్ట అతిథులు
క్రికెట్ ఫీవర్ యూనివర్సల్ గేమ్ ఫుట్బాల్ను కూడా తాకింది. ఇవాళ జరుగనున్న భారత్,న్యూజిలాండ్ వరల్డ్కప్ సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ హాజరుకానున్నాడని తెలుస్తుంది. బెక్హమ్తో పాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు క్యూ కట్టనున్నారని సమాచారం. బాలీవుడ్ స్టార్, చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్, తలైవా రజినీకాంత్, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కండల వీరుడు సల్మాన్ ఖాన్, ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ భారత్-కివీస్ సెమీస్ మ్యాచ్ చూసేందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంకు తరలిరానున్నారని ప్రచారం జరుగుతుంది. బెక్హమ్ విషయానికొస్తే.. ఈ ఇంగ్లండ్ స్టైలిష్ ఫుట్బాలర్, క్రికెట్ పట్ల తనకున్న మక్కువను గతంలో చాలా సందర్భాల్లో చాటుకున్నాడు. అలాగే బెక్హమ్కు ఇండియా అన్న ఈ దేశ క్రికెటర్లన్నా ప్రత్యేకమైన అభిమానం. ఓ సందర్భంలో అతను విరాట్ కోహ్లి పేరు ప్రస్తావించి పొగడ్తలతో ముంచెత్తాడు. ఆటగాడిగా ఫుట్బాల్కు వీడ్కోలు పలికాక పలు క్లబ్లకు కోచ్గా సేవలందించిన బెక్హమ్.. ప్రస్తుతం ఇంటర్ మయామీ ఫుట్బాల్ క్లబ్ కో ఓనర్గా ఉన్నాడు. ఆల్టైమ్ గ్రేట్, అర్జెంటీనా స్టార్ ఫుట్బాలర్ లియోనల్ మెస్సీ ప్రస్తుతం ఈ క్లబ్కే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. #WATCH | Tamil Nadu: Actor Rajinikanth leaves from Chennai airport to witness the World Cup semi-finals scheduled to be played at Wankhede Stadium in Mumbai. "I am going to see the match..," says Actor Rajinikanth pic.twitter.com/yWg1WpRHXX— ANI (@ANI) November 14, 2023 -
ఫుట్బాల్ ఇలా కూడా ఆడొచ్చా? ఎప్పుడూ చూడలేదే!
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్బాల్. ఈ ఆటలో క్రీడాకారులు మైదానంలో చిరుతల్లా పరిగెత్తుతూఅద్భుతమైన గోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. నియమిత సమయంలో ఏ జట్టు అయితే ఎక్కువ గోల్స్ చేస్తారో వాళ్లను విజేతలుగా నిర్ణయిస్తారు. ఇదంతా.. ఇప్పటివరకు మనకు తెలిసిన ఫుట్బాల్ గేమ్. కానీ ఇప్పుడు ఓ వెరైటీ ఫుట్బాల్ గేమ్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో అంత స్పెషల్ ఏంటో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.. సాధారణంగా ఫుట్బాల్ ఆడాలంటే జట్టుకు 11మంది సభ్యులు ఉంటారు. కానీ ఈ వెరైటీ ఫుట్బాల్లో మాత్రం కేవలం ఇద్దరి మధ్యే పోటీ ఉంటుంది. ఇక వీళ్లకు వందల అడుగుల విస్తీర్ణం ఉన్న మైదానం కూడా అవసరం లేదు. కేవలం రెండు టేబుల్స్ పట్టేంత స్థలం ఉంటే చాలు. అయితే ఫుట్బాల్ గేమ్ మాదిరిగా వీళ్లు కూడా బంతిని చేతితో తాకకుండా కాలితో తమ ప్రత్యర్థి సెట్లోకి ఎవరైతే ఎక్కువ సార్లు బంతిని వేస్తారో వాళ్లే విజేతలుగా పరిగణించారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది.దీంతో.. ఫుట్బాల్ను ఇలా కూడా ఆడతారా అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. గ్లాస్ ఫుట్బాల్ని ఎప్పుడూ చూడలేదు. భలే వెరైటీగా ఉందంటూ అభిప్రాయపడుతున్నారు. Legend game pic.twitter.com/gLC6jzFJ3R — Enezator (@Enezator) November 3, 2023 -
Lionel Mess: ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ నెగ్గిన మెస్సీ.. (ఫొటోలు)
-
రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ
దిగ్గజ ఫుట్బాలర్, ఇంటర్ మయామీ స్టార్, అర్జెంటీనా కెప్టెన్ లియోనల్ మెస్సీ (36) మరోసారి ప్రతిష్టాత్మక బాలన్ డి'ఓర్ అవార్డు గెలుచుకున్నాడు. 2023 సంవత్సరానికి గాను మెస్సీని ఈ అవార్డు వరించింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయి ఎనిమిదోసారి కైవసం చేసుకోవడం విశేషం. మెస్సీ తర్వాత ఈ అవార్డును అత్యధికంగా క్రిస్టియానో రొనాల్డో (5) దక్కించుకున్నాడు. The moment when 🐐 was announced as the #BallonDor winner. - Lionel Messi, the icon!pic.twitter.com/QNZOmBgeMe — Mufaddal Vohra (@mufaddal_vohra) October 30, 2023 2009లో తొలిసారి బాలన్ డి'ఓర్ సొంతం చేసుకున్న లియో.. 2010, 2011, 2012, 2015, 2019, 2021, 2023 సంవత్సరాల్లో ఈ అవార్డును చేజిక్కించుకున్నాడు. ఈ ఏడాది బాలన్ డి'ఓర్ కోసం నార్వే ఆటగాడు, మాంచెస్టర్ సిటీ స్ట్రయికర్ ఎర్లింగ్ హాలాండ్ మెస్సీతో పోటీపడ్డాడు. అయినా అవార్డు దిగ్గజ ఫుట్బాలర్నే వరించింది. పారిస్ వేదికగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో మరో దిగ్గజ ఫుట్బాలర్ డేవిడ్ బెక్హమ్ మెస్సీకి అవార్డు అందించాడు. కాగా, లియో గతేడాది అర్జెంటీనాకు వరల్డ్కప్ అందించిన విషయం తెలిసిందే. మహిళల విభాగంలో ఎయిటనా బొన్మాటి.. మహిళల విభాగంలో బాలన్ డి'ఓర్ అవార్డును స్పెయిన్ ఫుట్బాలర్, బార్సిలోనా సెంట్రల్ మిడ్ ఫీల్డర్ ఎయిటనా బొన్మాటి దక్కించుకుంది. ఎయిటనా ఈ అవార్డుకు తొలిసారి ఎంపికైంది. ఎయిటనా 2023 మహిళల ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచిన స్పెయిన్ జట్టులో సభ్యురాలు.


