
పదహారేళ్ల తర్వాత భాగ్యనగరం భారత సీనియర్ ఫుట్బాల్ జట్టు మ్యాచ్కు ఆతిథ్యమిచ్చింది. గచ్చిబౌలి స్టేడియంలో మూడు దేశాల మధ్య నిర్వహిస్తున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీని మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.

మున్ముందు మన రాష్ట్రంలో మరిన్ని పెద్ద టోర్నీలు నిర్వహిస్తామని, అందుకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కొత్త క్రీడా పాలసీని రూపొందించి దాని ప్రకారం అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు

మ్యాచ్ ఆరంభానికి ముందు భారత్, మారిషస్ జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. మ్యాచ్ ఆద్యంతం వీక్షించడం విశేషం

ఈ టోర్నీలో భాగంగా రెండో మ్యాచ్లో ఈ నెల 6న మారిషస్, సిరియా జట్లు తలపడతాయి. అనంతరం భారత్, సిరియా జట్ల మధ్య 9న చివరి మ్యాచ్ ఉంటుంది















































