Beauty
-
ఈ మేకప్ బాక్స్ ఉపయోగించడం చాలా ఈజీ..!
మేకప్ ఉత్పత్తులను దాచిపెట్టుకోవడం, అవసరానికి వాటిని వెతుక్కోవడం పెద్ద సమస్య. ఇక మేకప్ సామగ్రికి బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి చేరకుండా జాగ్రత్తపడటం మరో సమస్య. ఆ సమస్యను ఈ మేకప్ బాక్స్ ఇట్టే దూరం చేయగలదు. పైగా మిర్రర్, ఫ్యాన్, లైట్ వంటి వాటితో రూపొందిన ఈ మేకప్ బాక్స్ వాడుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది.క్రీమ్స్, సీరమ్స్, లోషన్స్, ఫౌండేషన్స లిప్స్టిక్స్, ఐ లైనర్స్, పౌడర్స్ ఇలా రోజువారీ వినియోగించే మేకప్ సామాన్లను ఈ బాక్స్లో చక్కగా సర్దిపెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్కి ఒకవైపు అద్దం ఉంటుంది. మరోవైపు స్టోరేజ్ కంటైనర్ ఉంటుంది. దీనికున్న అద్దాన్ని 360 డిగ్రీల్లో ఎలా అయినా తిప్పుకోవచ్చు. కూర్చునే కాదు, నిలబడి కూడా మేకప్ వేసుకోవచ్చు. వేసుకున్న మేకప్ త్వరగా ఆరడానికి దీనిలో ఫ్యాన్ కూడా ఉంటుంది. ఇక దీనిలో పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిష్లు, నెయిల్ రిమూవర్స్ వంటివన్నీ దాచుకోవచ్చు. అద్దం వెనుక భాగంలో కూడా కొన్ని మేకప్ వస్తువులను పెట్టుకోవచ్చు. ఈ కాస్మెటిక్ స్టోరేజ్ బాక్స్లో మరో నాలుగు చిన్నచిన్న సొరుగులు ఉంటాయి. దీనికి ఎల్ఈడీ లైట్ అమర్చి ఉండటంతో, కరెంట్ లేనప్పుడు కూడా మేకప్ వేసుకోవడానికి వీలవుతుంది. ఈ లైట్ మూడు వేర్వేరు కాంతుల్లో వెలిగేందుకు ఆప్షన్స్ ఉంటాయి. వాటిని మార్చుకుంటూ మేకప్ ముఖానికి సరైన విధంగా ఉందో లేదో చూసుకోవచ్చు. మనకు కావాల్సిన అన్ని రకాల మేకప్ ఉత్పత్తులను ఇందులో భద్రపరచుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని బాత్ రూమ్లో, బెడ్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇలాంటి మేకప్బాక్సులు చాలానే, రకరకాల మోడల్స్లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి రకరకాల రంగుల్లో లభిస్తున్నాయి. దీని ధర సుమారుగా మూడు లేదా నాలుగు వేలు ఉంటుంది. మోడల్ని బట్టి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. వీటిలో కొన్నింటిని ముందే చార్జింగ్ పెట్టుకుని వాడుకోవచ్చు. కొన్నింటిని బ్యాటరీలతో వినియోగించుకోవచ్చు.ముఖ కాంతికి చికిత్స..:ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడానికి రకరకాల చిట్కాలు ఉన్నాయి. రకరకాల సౌందర్య లేపనాలు, అధునాతన పరికరాలు ఉన్నాయి. ఇవేవీ ఫలించనప్పుడు నిపుణులు చేసే చికిత్స పద్ధతులు ఉన్నాయి. ముఖ సౌందర్యాన్ని త్వరగా మెరుగుపరచడానికి ఇటీవలి కాలంలో ‘లో లెవల్ లేజర్ లైట్ థెరపీ’ అందుబాటులోకి వచ్చింది. ఈ పద్ధతిలో తక్కువ స్థాయిలో లేజర్ లైట్ను వెదజల్లే పరికరాన్ని ఉపయోగిస్తారు. టార్చ్లైట్లా ఉండే ఈ పరికరం ద్వారా ముఖచర్మంపై లేజర్ కాంతిని ప్రసరింపజేస్తారు. దీనివల్ల ముఖ కండరాల్లో కొలాజెన్ ఉత్పత్తి పెరిగి, సడలిపోయిన ముఖం తిరిగి బిగుతుదేరుతుంది. ముఖంపై ఏర్పడిన ముడతలు, మచ్చలు, మొటిమలు కూడా క్రమంగా నయమవుతాయి. పలు దేశాల్లో చర్మవైద్య నిపుణులు ఈ పద్ధతిలో చికిత్సను అందిస్తున్నారు. (చదవండి: ఇంధన స్పృహ కలిగిన ఇల్లులా ఆరోగ్యకరంగా మార్చేద్దాం..!) -
డిజిటల్ యాడ్లో మెరిసిన సిద్ధార్థ్, అదితీ
ప్రపంచపు నంబర్ 1 బ్యూటీ బ్రాండ్ లోరియల్ ప్యారిస్ (L'Oréal Paris) తమ కొత్త డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. ఇందులో ప్రముఖ బాలీవుడ్ జంట అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించారు. తొలి క్యాంపెయిన్ విజయవంతమైన నేపథ్యంలో అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ నటించిన కొత్త డిజిటల్ క్యాంపెయిన్ లోరియల్ ప్యారిస్ ఆవిష్కరించింది.ఇందులో 2003 క్లాసిక్ సినిమా ‘బాయ్స్’ను గుర్తు చేసేలా ఫన్రీల్తో సిద్ధార్థ్ ఇన్స్టాగ్రాంలో కనిపిస్తారు. దుమ్మూ, చెమట లాంటి కారణంగా తలపై నూనె పేరుకుపోవడం, జిడ్డుగా మారడంలాంటి జుట్టు కష్టాల గురించి సిద్ధార్థ్ సరదాగా ముచ్చటిస్తారు. సరిగ్గా ఈ టైంలో సిద్ధార్థ్ స్వీట్హార్ట్ అదితి ఎంట్రీ ఇచ్చి లోరియల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూను అందించి, అందులోని కీలకాంశాలైన శాలిసిలిక్ యాసిడ్, హయాలురోనిక్ యాసిడ్ ప్రయోజనాల గురించి ముచ్చటిస్తుంది. సరదాగా సాగే మాటల మధ్యలో, తాను ఈ ప్రొడక్ట్కి ఫ్యాన్నే అయినప్పటికీ, అదితినే అధికారిక బ్రాండ్ అంబాసిడర్ అని సిద్ధార్థ్ గుర్తు చేస్తాడు ఈ డిజిటల్ ఫిలింకి భారీ స్పందన లభించడం విశేషం. విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వీక్షణలను సాధించింది. ఆన్-స్క్రీన్పై సిద్ధార్థ్, అదితి జంట కెమిస్ట్రీకి అభిమానుల ప్రశంసలు దక్కడంతో ఈ క్యాంపెయిన్, సోషల్ మీడియా సెన్సేషన్గా మారింది. View this post on Instagram A post shared by Siddharth (@worldofsiddharth)ఈ సందర్భంగా లోరియల్ ప్యారిస్ కుటుంబానికి తోడ్పాటు అందిస్తున్న, సిద్ధార్థ్ అదితి రావు హైదరీకి లోరియల్ ప్యారిస్ ఇండియా జనరల్ మేనేజర్ డేరియో జిజ్జీ (Dario Zizzi) కూడా ధన్యవాదాలు తెలిపారు. సౌందర్యాన్ని మెరుగుపర్చే వినూత్న ఉత్పత్తులను ఆవిష్క రించేందుకు లోరియల్ ప్యారిస్ కట్టుబడి ఉందన్నారు. లోరియాల్ ప్యారిస్ హయాలురోన్ ప్యూర్ షాంపూ తల మీద నూనె పేరుకుపోవడాన్ని నివారించి, జుట్టు తేలికగా, పరిశుభ్రంగా, తాజాగా ఉంచుతుందని వివరించారు. -
మిసెస్ ఇండియా పోటీలకు తెలుగు ఎన్ఆర్ఐ
సాక్షి, సిటీబ్యూరో: లండన్ వేదికగా ప్రముఖ బహుళ జాతి సంస్థలో కార్పొరేట్ లీడ్ రోల్ నిర్వహిస్తున్న తెలుగు వనిత బిందు ప్రియ.. త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా 2025 పోటీల్లో ఎన్ఆర్ఐ విభాగంలో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించనున్నారు. జాతీయ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించడం సంతోషంగా ఉందని నిజామాబాద్ జిల్లాకు చెందిన బిందు ప్రియ తెలిపారు. బిందు ప్రియా జైస్వాల్ మిసెస్ ఇండియా తెలంగాణా 2025 క్లాసిక్ NRI కేటగిరీలో విజేతగా నిలిచింది. 2025 ప్రారంభంలో ఎన్ఆర్ఐ విభాగంలో మిసెస్ ఇండియా తెలంగాణ–2025 కిరీటాన్ని గెలుచుకుని త్వరలో జరగనున్న మిసెస్ ఇండియా పోటీల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. బిందు బహుముఖ ప్రజ్ఞాశాలి. వర్క్లైఫ్, ఫ్యామిలీ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ ఐటీలో కార్పొరేట్ లీడర్ , గ్లోబల్ బ్యాంకింగ్ నిపుణురాలు. ఉన్నత విద్యావంతురాలు. ఆరోగ్యం & ఫిట్నెస్ ఔత్సాహికురాలు కూడా. తన తల్లి బోధించిన గీత పాఠాలే స్ఫూర్తి అని చెబతారు. కథక్, తెలుగు, హిందీ సంగీతం, గిటార్, పియానో వంటి సంగీత వాయిద్యాల్లో బిందుకు ప్రావీణ్యం ఉంది. అలాగే యూకేలోని ప్రసిద్ధ వేదికలపైన నృత్య ప్రదర్శనలివ్వడం విశేషం. సేవా (ఎస్ఈడబ్ల్యూఏ) సభ్యురాలిగా నిరుపేద విద్యార్థుల విద్య, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నారు. -
నటి భాగ్య శ్రీ హెల్త్ టిప్స్: కాంతులీనే చర్మం, ఆరోగ్యం కోసం..!
బాలీవుడ్ నటి భాగ్య శ్రీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఎప్పటికప్పుడు మంచి మంచి హెల్త్ టిప్స్ని షేర్ చేస్తూ ఆరోగ్య స్ప్రుహని కలగజేస్తుంటుంది. అలాసే ఈసారి సరికొత్త హెల్త్ చిట్కాని నెట్టింట షేర్ చేసింది. అదే తన ప్రతిరోజూ ఉదయం తీసుకునే సూపర్ఫుడ్ అని చెబుతోంది. దీనివల్ల చర్మ, జుట్లు, ఆరోగ్యం బాగుంటాయని నమ్మకంగా చెప్పింది. ఇంతకీ అదెంటంటే..మెంతి గింజల ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చింది ఇన్స్టాలో. నానబెట్టిన మెంతిగింజలు ఒక సూపర్ ఫుడ్ అని అది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుందని, రక్తాన్ని శుభ్రపరిచి..ప్రేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని అన్నారు. వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుందని, అద్భుతమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయని చెప్పుకొచ్చారు. వీటిని గనుక డైలీ లైఫ్లో భాగం చేసుకుంటే ఆరోగ్యంలో చక్కటి మార్పుని చూస్తారని అన్నారామె. ముఖ్యంగా కాంతులీనే చర్మాన్ని అందివ్వడంలోనూ, జుట్టు ఆరోగ్యంలోనూ కీలకంగా ఉంటుందని పేర్కొంది. నిపుణులు ఏం అంటున్నారంటే..మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వడంలో మెంతుకు సాటిలేదని చెబుతున్నారు. దీని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి సవివరంగా వెల్లడించారు. అవేంటంటే..దీనిలోని ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకాన్ని నివారిస్తుందిగ్యాస్ సమస్యలను తగ్గిస్తుందిబరువుని అదుపులో ఉంచుతుంది, ఆకలిని అరికట్టి జీవక్రియను మెరుగ్గా ఉంచుతుందికీళ్ల నొప్పులు, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గిస్తుందిమెరుగైన తల్లిపాల ఉత్పత్తిలో కీలకంగా ఉంటుంది. చక్కెర స్థాయిల నియంత్రిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుందిమొటిమలు, ముడతలను తగ్గిస్తుంది.జుట్టు రాలడం తగ్గుతుందిపీసీఓఎస్ సమస్యలు అదుపులో ఉంటాయి. శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి.కాగా, నటి భాగ్యశ్రీ గతంలో చర్మ సౌందర్యానికి ఉపయోగ పడే గ్రీన్జ్యూస్ ప్రయోజనాలను గురించి పంచుకున్నారు. తాజాగా మరో ఆరోగ్య చిట్కాతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలందించే మెంతులు గురించి నెటిజన్లతో షేర్ చేసుకున్నారు.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణలను సప్రదించడం మంచిది. (చదవండి: అమెరికా నుంచి భారత్కి అందుకే వచ్చేశా! సీఈవో హార్ట్ టచింగ్ రీజన్) -
కాళ్లు, చేతులు కోమలంగా ఉండాలంటే.. అద్భుతమైన చిట్కాలు
మనం అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే కేవలం ముఖం సౌందర్యం మాత్రమే కాదు. కాళ్లు చేతులు కోమలంగా ఉండేలా చూసుకోవాలి. సమతుల ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఒత్తిడి లేని జీవితాన్ని సాగించడం కూడా అంతే ముఖ్యం. అలాగే సరిపడా నిద్రా, రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం చాలా ముఖ్యం. దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అవేంటో చూద్దామా..! ముఖం చూస్తే ఎంత ముచ్చటగా ఉన్నా, కాళ్లూ చేతులను పట్టించుకోకపోతే ఆ అందానికి అర్థం ఉండదు. పాదాలూ, చేతులూ కూడా బాగుంటేనే అందానికి సార్థకత. కాళ్లు, చేతులపై మృతకణాలు పేరుకున్నప్పుడు చర్మం పొడిబారి నిర్జీవంగా కనిపిస్తుంది. మీ పరిస్థితి కూడా ఇదే అయితే.. ఎప్పటికప్పుడు ఈ మృతకణాలు తొలగించేందుకు ప్రయత్నించడం మంచిది. దానికి సంబంధించిన కొన్ని పూతలు తయారుచేసి ప్రయత్నిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది.రాత్రి పడుకునే ముందు కాస్తంత స్వచ్ఛమైన కొబ్బరినూనెను పాదాలకు రాసుకుని మర్దన చేయాలి. ఆ తర్వాత సాక్సులు వేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా రోజూ చేయడం వల్ల పొడిబారిన చర్మం కాస్తా చాలా తక్కువ వ్యవధిలోనే మృదువుగా మారుతుంది. చదవండి: ఒకే ఒక్క శ్వాసతో రికార్డ్: భారతీయ మత్స్య కన్య సక్సెస్ స్టోరీ!మంగళసూత్రం, మెట్టెలు అందుకే.... అమెరికన్ మహిళ వీడియో వైరల్గోరువెచ్చని నీటిలో కొద్దిగా వంటసోడా, ఏదైనా కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ను వేయాలి. లేదంటే ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ అయినా ఫరవాలేదు. కుదిరితే అందులో కొన్ని గులాబీ రేకలూ వేసుకోవచ్చు. ఇందులో చేతులు లేదా కాళ్లను ఓ పదినిమిషాలు ఉంచి తీసేయాలి. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల చర్మం మృదువుగా మారుతుంది.గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఎప్సమ్ సాల్ట్ వేసుకుని అందులో కాళ్లు లేదా చేతుల్ని ఉంచాలి. పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగేసుకుని పొడిబట్టతో మృదువుగా అద్దుతూ తుడిచేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ భాగాలకు రక్తప్రసరణ సజావుగా జరిగి, రఫ్నెస్ తగ్గి మృదువుగా మారతాయి. ఒక నిమ్మచెక్కకు పంచదార అద్దుకోవాలి. దీనితో కాళ్లు, చేతులకు మర్దన చేస్తున్నట్లు మృదువుగా రుద్దుకోవాలి. అలాగే రాత్రి నిద్రించే ముందు ఆలివ్ లేదా ఆల్మండ్ ఆయిల్తో మర్దన చేసుకున్నా సరి΄ోతుంది. ఇది చర్మాన్ని ఎంతో కోమలంగా ఉంచుతుంది.కోమలమైన కాళ్లూ చేతులకు.. -
ఆముదంతో చర్మం, జుట్టు సమస్యలకు చెక్ పెట్టొచ్చిలా!
బంకబంకగా జిగురుగా ఉండే ఆముదం చూడగానే ముట్టుకోవడానికి ఇష్టపడం.. కానీ ఇది అందానికి, కురుల సంరక్షణలో అద్భుత ప్రయోజనాలను అందిస్తుంది. ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు. దీన్ని సంప్రదాయ వైద్య విధానంలో కూడా ఉపయోగిస్తారు. అన్ని ప్రయోజనాలని అందించే ఈ ఆముదం నూనెని జుట్టు, చర్మం సంరక్షణ కోసం ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.టేబుల్ స్పూను ఆముదం, టేబుల్ స్పూను కొబ్బరి నూనెలను కలిపి వేడి చేసి గోరువెచ్చగా అయిన తరవాత మాడుకు పట్టించి పదినిమిషాల పాటు మర్దన చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. చుండ్రు తగ్గడంతోపాటు, జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.పొడిబారిన చర్మానికి సైతం ఆముదం మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. బాడీ లోషన్స్కు బదులు ఆముదాన్ని రాసుకుంటే మరింత మంచిది.గోరువెచ్చని ఆముదాన్ని పలుచగా ఉన్న కనుబొమ్మలకు రాసి రెండు నిమిషాలు మర్దన చేసి ఉదయం కడిగేయాలి. ఇలా కొన్నిరోజులపాటు క్రమం తప్పకుండా చేస్తే కనుబొమ్మలు ఒత్తుగా కనిపిస్తాయి.రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని పెదవులకు రాసి మూడు నిమిషాలపాటు మర్దన చేయాలి. చిన్న బాక్స్లో ఆముదాన్ని ΄ోసుకుని రోజులో అప్పుడప్పుడు లిప్బామ్లా రాసుకుంటూ ఉంటే పెదవులు మృదువుగా, పింక్ కలర్లోకి మారతాయి. క్లెన్సర్లు, లోషన్లు, సౌందర్య సాధనాలలో విస్తృతంగా ఈ ఆముదాన్ని ఉపయోగిస్తారు.దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలు కాలిన గాయాలు, ప్రెజర్ అల్సర్లు, డయాబెటిక్ అల్సర్లు, శస్త్రచికిత్సా గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టును లూబ్రికేట్ చేయడంలో సహాయపడుతుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని ఒలీక్, లినోలిక్ యాసిడ్ రక్త ప్రసరణను పెంచి మీ జుట్టును బలంగా, మృదువుగా మార్చుతాయి.(చదవండి: బీపీ-హైబీపీకి మధ్య తేడా ఏంటి..? వంశపారపర్యంగా వస్తుందా..?) -
నిత్య యవ్వనంగా కనిపించాలంటే.. సింపుల్ టిప్స్!
ఎవరికైనా సరే, అకాల వార్థక్యం వచ్చి మీదపడడానికి వారి అలవాట్లే కారణమంటున్నారు పరిశోధకులు. ఎప్పుడూ యంగ్గా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని టిప్స్ చెబుతున్నారు. అవి ఫాలో అయితే సరి!యాంటీ ఏజింగ్ టిప్స్లో ముందుగా చెప్పుకునేది మెడిటేషన్ గురించే... మెడిటేషనా... మాకేం సంబంధం అని అసలు అనుకోవద్దు... ఏదో ఒక దాని గురించి కాసేపు ధ్యానం చేసుకోవాలి. మెడిటేషన్ వల్ల మనసు తేలికవుతుంది. శరీరం కూడా రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి నివారణ: ఒత్తిడి లేని వాళ్లు మంచి ఆరోగ్యవంతులని చెక్ చెప్పవచ్చు. అందువల్ల ఒత్తిడి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నిపుణులనడిగి తెలుసుకుని వాటిని ఫాలో అయి పోవడమే ఉత్తమం!సానుకూల భావనలు: నకారాత్మకమైన మాటలు, భావాలు, ఆలోచనల స్థానంలో సకారాత్మకంగా ఉండే మాటలు అలవాటు చేసుకోవాలి. అలా సానుకూల భావనలతో మనసును నింపుకోవడం వల్ల వార్థక్య లక్షణాలు త్వరగా దరి చేరవు. ఆహారపు అలవాట్లు: ఆకుకూరలు, అల్లం, జీలకర్ర, ధనియాలు, పసుపు, మిరియాలు, తేనె వంటివి శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందించి యాంటీ ఏజింగ్ లక్షణాలను పెంపొందిస్తాయి. అందువల్ల నిత్యాహారంలో అవి ఉండేలా చూసుకోవడం అవసరం. జంక్ ఫుడ్కి దూరంగా: కొన్నిరకాల ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం ద్వారా వార్థక్య లక్షణాలను దూరం చేసుకోవచ్చు. అలాంటి వాటి కేటగిరీలో భారీ ఎత్తున మసాలాలు దట్టించి, డీప్ ఫ్రైస్, స్వీట్స్, ఊరబెట్టిన మాంసం, నిల్వపచ్చళ్లకు దూరంగా ఉండాలి. మసాజ్: శారీరక ఆరోగ్యానికి మసాజ్ లేదా మర్దనా చేయడం అనేది ఎప్పటినుంచో ఉన్నదే.క్రమపద్ధతిలో చేసే మర్ధన వల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోయి కొత్తకణాలు పుట్టుకొస్తుంటాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా మిసమిసలాడుతుంటుంది. ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు లేదా నిపుణుల ఆధ్వర్యంలో మసాజ్ థెరపీ తీసుకోవచ్చు. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది.ఇదీ చదవండి: ఒక్క సోలార్ బోట్ కోసం అధిక జీతమిచ్చే ఉద్యోగం, అన్నీ వదిలేశారు!ఉన్నత లక్ష్యాలు... ఉత్తమ అభిరుచులు..మడిసన్నవాడికి కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్టు ఎవరికైనా సరే, జీవితంలో కొన్ని ఉన్నత లక్ష్యాలు ఉండాలి. వాటిని చేరుకోవడానికి సోపానాలుగా కొన్ని ఉత్తమ అభిరుచులు ఉండాలి. అప్పుడే బుర్ర చురుగ్గా ఉంటుంది. శరీరమూ యాక్టివ్గా ఉంటుంది. దాంతో అకాల వార్థక్యం వచ్చి మీద పడదు. -
దక్కన్ వేదికగా ఫ్రెంచ్–ఇటాలియన్
విభిన్న సంస్కృతుల సమ్మేళనం హైదరాబాద్.. విభిన్న రుచుల భాండాగారం మన భాగ్యనగరం. స్థానిక వంటకాలు మొదలు ఖండాంతరాలు దాటిన కాంటినెంటల్ వంటకాలకు నెలవు ఈ భాగ్యనగరం. ఇందులో భాగంగా కొరియన్, మొరాకో వంటకాలు మొదలు ఇటాలియన్, స్పానిష్ వెరైటీల వరకూ నగరానికి క్యూ కడుతున్నాయి. విదేశీ పర్యాటకులు, బహుళ జాతి కంపెనీల ప్రతినిధులు, వ్యాపార వేత్తలు, సినిమా, క్రీడా రంగ ప్రముఖులు నగరానికి వస్తుండటంతో కాంటినెంటల్ వంటకాలకు ఆదరణ పెరిగింది. నగరవాసులు సైతం విభిన్న వంటకాలు, వినూత్న రుచులను ఆస్వాదించడంలో ముందుంటారు. ఈ నేపథ్యంలో నగరంలోని ది లీలా హైదరాబాద్ హోటల్ రీన్ చెఫ్ స్టూడియో వేదికగా ప్రసిద్ధ ఫ్రెంచ్–ఇటాలియన్ వంటకాలు సందడి చేస్తున్నాయి. మార్చి ప్రారంభం వరకూ అందుబాటులో ఉండే ఈ ఐకానిక్ రుచులు హైదరాబాద్ నగరానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి. విశ్వవ్యాప్తంగా అరుదైన ఫ్రెంచ్–ఇటాలియన్ రుచులను నగరానికి తీసుకొచ్చింది ‘లే సర్క్’. లీలా, రీన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న ‘లే సర్క్’ న్యూయార్క్ వేదికగా ప్రసిద్ధి చెందిన ఇటాలియన్ రుచులకు గమ్యస్థానం. నగరంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక పాప్–అప్ దశాబ్దాలుగా ప్రపంచ స్థాయి లగ్జరీ డైనింగ్ వేదిక. దక్కన్ వారసత్వం నుంచి ప్రేరణ పొందిన వేదికగా ఇటాలియన్ సంస్కృతిని ఆహ్వానించడంతో ఫుడ్ లవర్స్ వావ్ అంటున్నారు. హిమాలయాలు, దట్టమైన అడవుల్లో లభించే అరుదైన పుట్టగొడుగులుతో(లక్షల రూపాయలు ఖరీదు చేసే) సహా అరుదైన పదార్థాలు, పుష్పాలతో వడ్డించిన డిషెస్ ఇక్కడ సందడి చేస్తున్నాయి. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (మాంసాహారం) స్మోక్డ్ అవకాడో, ట్యూనా సాకు టార్పారే – ప్యాషన్ ఫ్రూట్ జెల్ పదార్థంతో కుంకుమపువ్వును ఆకర్షణీయంగా అలంకరించి తయారు చేసిన ఫుడ్ వెరైటీ. రావియోలీ స్టఫ్డ్ విత్ బరోలో బ్రైజ్డ్ డక్ – క్యారెట్ వెలౌట్, అరుదైన రోజ్మేరీ మోరెల్ మష్రూమ్తో తయారు చేసిన వంటకం. ఇందులో ‘స్పఘెట్టి, పారెల్స్ ఫోమ్ పొంగుతూ కొత్త రుచిని అందిస్తుంది. పాపియెట్ ఆఫ్ చిలీయన్ సీబాస్ – కరకరమనే బంగాళాదుంపలు, బరోలో సాస్తో నోరూరించే క్రీమ్తో తయార చేస్తారు. ‘లే సర్క్’ క్లాసిక్ టిరామిసు – కాఫీ జెల్లీ, మస్కార్పోన్ ఎస్పుమా, కాఫీ మెరింగ్యూ సమ్మేళనంతో తయారు చేసే వినూత్న వంటకం. చెఫ్స్ స్పెషల్ అమ్యూస్–బౌచే (శాకాహారం) డబుల్ కుక్డ్ మోజారెల్లా – బ్రెడ్ క్రిస్టల్, బాసిల్ స్ప్రింగ్, టొమాటో రిలిష్తో తయారు చేసిన శాకాహార వంటకం. హ్యాండ్–కట్ ఫ్రెష్ బ్లాక్ ట్రఫుల్ ఫెట్టూసిన్ – లక్ష రూపాయాలకు పైగా ఖరీదు చేసే అరుదుగా దొరికే మోరెల్ పుట్టగొడుగులను కలిపి పర్మేసన్ ఫండ్యు, బ్లాక్ ట్రఫుల్ షేవింగ్స్ వండుతారు. రోస్టెడ్ బీట్రూట్–బుర్రటా రిసోట్టో – 24కే గోల్డ్ డస్ట్గా పిలిచే ముడి పదార్థంతో తయారు చేసే చిరుతిండి. సింఫనీ ఆఫ్ చాక్లెట్ – డార్క్ చాక్లెట్ మౌస్తో ముంచి, మిల్క్ చాక్లెట్తో కలిపి, చాక్లెట్ సాయిల్, ఫ్రెష్ బెర్రీస్, చాక్లెట్ ఐస్ క్రీం సమ్మిళితంగా తయారు చేసే ‘లే సర్క్’ సిగ్నేచర్ వంటకం. విభిన్న రుచులు.. అరుదైన, వినూత్న రుచులను ఆస్వాదించడంలో హైదరాబాద్ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఇందులో భాగంగానే విదేశాలకు చెందిన వంటకాలకు ఇక్కడ అభిమానులుంటారు. ప్రస్తుతం రెన్ చెఫ్ స్టూడియోలో ఆతిథ్యమిస్తున్న వంటకాలు దేశంలో మరెక్కడా లభించవు. – ప్రముఖ చెఫ్ వశిష్ట, లీలా రీన్ చెఫ్ స్టూడియో -
అందాల ఆతిథ్యం..! విశ్వసుందరి జన్మించిన నగరంలో పోటీలు..
నగరంలో ఫ్యాషన్, గ్లామర్ ప్రపంచం సరికొత్త సందడి పులుముకుంది. ఈవెంట్స్ రంగం ఉత్సాహంతో ఉరకలేస్తోంది. తొలిసారిగా మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ రాష్ణంలోని హైదరాబాద్ నగరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించడమే ఈ సందడికి కారణం. ప్రపంచస్థాయి అందాల పోటీకి ఆతిథ్యం ఇచ్చే అవకాశం రావడం భాగ్యనగరంలోని ఫ్యాషన్ రంగానికి చెందిన ఔత్సాహికులకు కలర్ ఫుల్ కలలకు ఊతమిస్తోంది. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇవ్వడం నగరానికి మరింత గ్లోబల్ లుక్ తెచి్చపెడుతోంది. మొత్తం 120 దేశాలు పాల్గొనే ఈ అతిపెద్ద ఈవెంట్ దాదాపు నెల రోజుల పాటు నగర కేంద్రంగా జరగడం వల్ల అంతర్జాతీయంగా ఖ్యాతి పొందనుంది. ముఖ్యంగా ఇప్పటి వరకూ జరగని స్థాయిలో అంతర్జాతీయ ఫ్యాషన్, మోడలింగ్ రంగాలను నగరం ఆకర్షిస్తోంది. తద్వారా నగరంలో ఔత్సాహిక యువతకు అవకాశాలు విస్తరిస్తాయి. అదే విధంగా నగరం, చుట్టుపక్కల చారిత్రక ప్రదేశాలు, సంప్రదాయ హస్తకళలు ప్రపంచం దృష్టికి రానున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ద్వారా అంతర్జాతీయ ఖ్యాతిని అందుకున్న నగరం టాలీవుడ్ పరిశ్రమకు సైతం మరింత ఊపునివ్వనుంది. గొప్ప విశేషం.. ఎందరో యువత కల.. హైదరాబాద్ దేశంలోనే ఓ గొప్ప నగరంగా ఎదుగుతోంది. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇది ప్రారంభం మాత్రమే. ఇలాంటివెన్నో నిర్వహించగల సామర్థ్యం నగరానికి ఉంది. ఒకనాటి బ్యూటీ కాంటెస్ట్ విజేతగా.. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అందమైన యువతులకు మన నగరం వేదిక కావడాన్ని చూసే రోజు కోసం ఎంతో ఉది్వగ్నంగా ఎదురుచూస్తున్నాను. – శిల్పారెడ్డి, మాజీ మిసెస్ ఇండియా బ్యూటీ ఈవెంట్స్ కేంద్రంగా.. గత కొంత కాలంగా బ్యూటీ క్వీన్స్కు మాత్రమే కాదు బ్యూటీ ఈవెంట్స్కు సైతం చిరునామాగా మారుతోంది. నగరానికి చెందిన శిల్పారెడ్డి మొదలుకుని గత ఏడాది సుష్మ తొండేటి వరకూ మిసెస్ ఇండియా కిరీటాన్ని నగరవాసులు ఎందరో గెలుచుకున్నారు. ఇక మానసా వారణాసి వంటివారు మిస్ ఇండియా కిరీటాలను తీసుకొచ్చారు. పూనమ్ కౌర్, మధుశాలిని వంటి మిస్ హైదరాబాద్లు అనంతరం సినీతారలుగా రాణించారు. నగరంలోని కళాశాలల నుంచి క్లబ్స్ వరకూ బ్యూటీ కాంటెస్ట్లను నిర్వహిస్తున్నాయి.ఈ తరహా ఈవెంట్లకు మరింత ప్రొఫెషనలిజాన్ని మిస్ వరల్డ్ అందించడం తధ్యం. ఏదేమైనా విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్కు ప్రపంచ సుందరి పోటీలు రావడం సమయోచితం అని చెప్పాలి. (చదవండి: ఆరోగ్య ప్రయోజనాలందించే బెస్ట్ చట్నీలివే..!) -
వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్లు
వేసవి ఉష్ణోగ్రతలకు చర్మం పొడిబారిపోతుంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖం కూడా కళా విహీనంగా తయారవుతుంది. చర్మ, ముఖం సౌందర్య రక్షణలో శతాబ్దాల తరబడి కలబంద లేదా అలోవెరా విశిష్టంగా నిలుస్తోంది. వడదెబ్బ నుంచి ఉపశమనం మొదలు, మొటిమల నివారణలో బాగా పనిచేస్తుంది.అలోవెరాలో అనేక ఆరోగ్య లక్షణాలున్నాయి. విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి అద్భుతాలు చేసే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో నిండి ఉంది. మరి అలోవెరా, ఇతర మూలికలు, పదార్థాలతో కలిసి వేసుకునే మాస్క్ల గురించి తెలుసుకుందామా?జర్నల్ ఆఫ్ ట్రెడిషనల్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, కలబంద జెల్లో పాలీసాకరైడ్లు , గ్లైకోప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. గాయం మానడాన్ని వేగవంతం చేసేలా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి మంటను తగ్గించడానికి సాయ పడతాయి. ఇంకాకలబందలోని హైడ్రేటింగ్, యాంటీమైక్రోబయల్లక్షణాలు మొటిమలు, తామర లాంటి సమస్యల నివారణతోపాటు, చర్మం, పొడిబారడం, ఎర్రబారడం, పగుళ్లు, కాలిన గాయాలకు కూడా ప్రభావవంతంగా పనిస్తుందని అధ్యయనం పేర్కొంది.కలబంద ఫేస్ మాస్క్లుకలబంద - తేనె మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జులో 1 టీస్పూన్ తేనె కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసువాలి. ఇది చక్కటి హైడ్రేటింగ్ ఏజెంట్గా పనిచేసి పోషణనిస్తుంది. చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేస్తుంది.కలబంద - పసుపు మాస్క్: పసుపు, తేనె లేదా రోజ్ వాటర్ వంటి మూలికలు , సుగంధ ద్రవ్యాలతో కలిపినప్పుడు, కలబంద చర్మ సంరక్షణ శక్తి కేంద్రంగా మారుతుంది. ముఖ్యంగా సేంద్రీయ పసుపు , కలబంద మాస్క్, నిస్తేజమైన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమల మచ్చలను తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్ను చిటికెడు పసుపుతో కలపండి. 10 నిమిషాలు అలాగే ఉంచి సున్నితంగా కడగాలి. కలబంద -రోజ్ వాటర్ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్, టీస్పూన్ రోజ్ వాటర్ బాగా కలపాలి. దీన్ని ముఖంపై సమానంగా అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచాలి. ఎరుపును తగ్గించి, చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది.కలబంద - నిమ్మకాయ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో కొన్ని చుక్కల నిమ్మరసంతో కలపండి.దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాలు ఉంచి శుభ్రంగా కడిగేసుకోవాలి. (బాగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఇది వాడకూడదు). నిమ్మకాయ నల్ల మచ్చలను క్రమంగా తగ్గిస్తుంది.కలబంద-గ్రీన్ టీ మాస్క్: ఒక టేబుల్ స్పూన్ కలబంద జెల్లో, చల్లని గ్రీన్ టీ కలపండి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, క 15 నిమిషాలు అలాగే ఉంచి కడగాలి. యాంటీఆక్సిడెంట్లతో నిండిన ఈ మాస్క్ ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది. యవ్వనమైన, అందమైన చర్మాన్ని అందిస్తుంది.కలబంద-కీరా మాస్క్: కలబంద జెల్లో తురిమిన కీరా కలిపి దీన్ని సున్నితంగా ముఖానికి అప్లై చేయాలి. చల్లటి నీటితో శుభ్రం చేయడానికి ముందు 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఈ మాస్క్ చాలా రిఫ్రెష్గా ఉంటుంది, అలసిపోయిన చర్మాన్ని డీపఫ్ చేయడానికి , హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. -
చర్మం మృదువుగా కోమలంగా ఉండాలంటే..!
పొడి చర్మం గలవారు ఏ ఫేస్ ప్యాక్ పడితే అది వేసుకోవడం మంచిది కాదు. అందులోనూ వాళ్ల చర్మం డ్రైగా అయిపోయి, ర్యాషస్ ఈజీగా వచ్చేస్తాయి. అలాంటి వారు చర్మాన్ని తేమగా ఉంచి మృదువుగా చేసే ఫేస్ ప్యాక్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. వీళ్లు ఆయిల్తో కూడిన ప్యాక్లు ఉపయోగిస్తే చర్మం కోమలంగా మెరుస్తూ ఉంటుంది. అందుకోసం హెల్ప్ అయ్యే బెస్ట్ ఫేస్ ప్యాక్లు ఏంటో చూద్దామా..!.పూలలోని పుప్పొడి, నల్లనువ్వులు, బార్లీ గింజలు సమపాళ్లలో తీసుకొని, పొడి చేసి, ఒక డబ్బాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని కావల్సినంత తీసుకొని, తగినన్ని నీళ్లు కలిపి, ముఖానికి, శరీరానికి పట్టించాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల పొడిబారిన చర్మం మృదువుగా, కాంతిమంతంగా అవుతుంది. అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతిమంతమవుతుంది. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని పొడిబారే చర్మతత్త్వం గలవారు మాయిశ్చరైజర్ గా ఉపయోగించవచ్చు. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి మర్దన చేయాలి. ఫలితంగా మృతకణాలు తొలగి΄ోయి, చర్మం మృదువుగా మారుతుంది. మూడు టీ స్పూన్ల కొబ్బరి నూనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టీ స్పూన్ గ్లిజరిన్, రెండు టీ స్పూన్ల నీళ్లు కలిపి మరిగించాలి. ఈ మిశ్రమం చల్లారాక ముఖానికి రాసి, మసాజ్ చేయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ఆయిల్ ΄్యాక్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. (చదవండి: జుట్టు రాలిపోవడంతో 40 కిలోలు బరువు తగ్గింది..! 80/20 రూల్తో..) -
Valentine's Day : ప్రెటీ లుక్స్.. ఇవిగో టిప్స్!
అందంగా కనిపించాలని ఎవరు మాత్రం కోరుకోరు. అందులోనూ ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ప్రేమికుల రోజు మరికొన్ని గంటల దూరంలో ఉంది. తన పార్ట్నర్తో రొమాంటిక్గా గడిపే క్షణాల్లో అందంగా మెరిసి పోవాలని అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా ఉంటుంది. అమ్మాయిలైతే ముందు నుంచే అలర్ట్గా ఉంటారు. కానీ అబ్బాయిలు మాత్రం జిడ్డు ముఖంతో ఎలా రా బాబూ అని తెగ హైరానా పడిపోతుంటారు. అవునా..? అందుకే ఇంటి చిట్కాలతో ఇన్స్టంట్ గ్లో వచ్చేలా చేసుకోవచ్చు. లవ్బర్డ్స్కోసం ఉపయోగపడే అలాంటి బ్యూటీ టిప్స్ ఒకసారి చెక్ చేద్దాం.అందం అనే దానికి నిర్వచనాలు చాలా ఉన్నాయి. కానీ మనం ఇష్టపడే వ్యక్తికి ఆకర్షణీయంగా కనిపించాలి. అలా ఉండాలంటే, మానిసిక ఆరోగ్యంతోపాటు, శారీరంగా కూడా కావాలి. అలా అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నపుడు వచ్చే ఆత్మవిశ్వాసం, ఆత్మ స్థైర్యం వేరే లెవల్లో ఉంటుంది. దీనికి ప్రేయసి లేదా, ప్రియుడి చేయూత ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించే ధైర్యాన్నిస్తుంది. కొండంత బలాన్నిస్తుంది. దీనికి మించిన అందం ఏముంటుంది?అందకోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పనీలేదు. మన ఇంట్లో ఉండే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. మనం రోజూ ఉపయోగించే వాటితోనే అందాన్ని మెరుగు పరచుకోవచ్చు.ఇదీ చదవండి: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ, హీరో రాగ్ మయూర్తో వాలెంటైన్స్ డే స్పెషల్శనగ పిండిలో కాస్తంత పెరుగు, కొద్దిగా నిమ్మకాల కలిపి మంచి పేస్ట్లా తయారు చేసి ముఖానికి పట్టించి, బాగా ఆరిన తరువాత మృదువుగా మసాజ్ చేస్తూ కడిగేసుకోవాలి.నిమ్మరసం, తేనెతో కూడా ముఖంపై ఉండే మురికిని వదిలించుకోవచ్చు. ఫేస్ వాష్, సబ్బులకు బదులు నిమ్మరసం, తేనె కలిపి ఉపయోగించుకోవచ్చు. వీటిని ఉపయోగించడం వల్ల మృత కణాలు తొలిగిపోతాయి. ముఖం మెరిసిపోతుంది.బాదం, గంధం పొడి, వేపాకుల పేస్టు కలిపి రాస్తే.. ముఖంపై ఉండే మురికి పోయి స్కిన్ గ్లోయింగ్గా ఫ్రెష్గా కనిపిస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలుకు ఇది ఉపయోగపడుతుంది.ఆరెంజ్ జ్యూస్లో కొద్దిగా ఆర్గానిక్ పసుపు కలిపి ముఖానికి మెడకు,మోచేతులకు చక్కగా అప్లయ్ చేసి ఆరిన తరువాత కడిగేసుకుంటే మంచి గ్లో వస్తుంది.చర్మానికి బొప్పాయి పండు చాలా చక్కగా పని చేస్తుంది. బొప్పాయి పండు పేస్ట్ రాస్తే చర్మం.. ఎక్స్ఫోలియేట్ అవుతుంది. మృదువుగా మారి మంచి గ్లో వస్తుంది. అలాగే నచ్చినట్టుగా మీసాలు, గడ్డాన్ని చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. హెయిర్ స్టైల్ను మెయింటైన్ చేయాలి. దీంతోపాటు చక్కటి పెర్ఫ్యూమ్ వాడితే మరీ మంచిది. ఇక అమ్మాయిలైతే ఆలు గడ్డ రసంలో రెండు చుక్కల ఆల్మండ్ ఆయిల్, శనగపిండి కలిపి మాస్క్లాగా వేసుకోవాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. అలాగే కాఫీ ఫౌడర్లో కాస్తం టొమాటో రసం వేసి, ముఖానికి, మెడకు,మోచేతుల దాకా అప్లయ్ చేసి కాసేపు మసాజ్ చేసి శుభ్రంగా కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. టమాటా రసం, ఓట్స్ పొడి పాలు. ఈ స్క్రబ్లు ఉపయోగించినా చర్మం తాజాగా మెరుస్తుంది. ఇలా ప్యాక్ వేసుకున్నాక చేసిన రెండు ఐస్ముక్కలతో ముఖంపై మృదువగా మసాజ్ చేసుకోవాలి. ఆ తరువాత ముఖాన్ని శుభ్రంగా తుడిచేసుకుని రసాయను లేని మాయిశ్చరైజర్ అప్లయ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. మరిన్ని టిప్స్చర్మం ఆరోగ్యంగా . యవ్వనంగా కనిపించాలనుకుంటే ప్రతి రాత్రి 7-8 గంటలు నిద్రపోవాలి.తగినన్ని నీళ్లు తాగాలి. చర్మానికి విటమిన్లు, ఖనిజాలు ఎంత అవసరమో, నీళ్లు కూడా అంతే అవసరం. హైడ్రేటెడ్ గా ఉండటం వల్ల శరీరం నుండి అదనపు మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా ఉంటుంది. తాజాపండ్లు ఆకుకూరలు తీసుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ, క్రమంతప్పకుండా రోజుకు కనీసంఅరగంటసేపు ఏదో ఒక వ్యాయామం చేయాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు ఇద్దరికీ వర్తిస్తాయి. వీటన్నింటి కంటే ముందు మీ మనసులోని ఆనందం, మీ శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్లే మీ ముఖానికి మరింత అందాన్ని తీసుకొస్తాయి. కనుక అందం గురించి పట్టించుకోకుండా, ఆనందంగా గడపండి. మీ బంధాన్ని దృఢం చేసుకోండి. మర్చిపోలేని జ్ఞాపకాలను పోగు చేసుకోండి. హ్యాపీ వాలైంటైన్స్ డే! -
పిగ్మెంటేషన్ సమస్య తగ్గాలంటే..!
రకరకాల కారణాల వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ వస్తుంటుంది చాలామందికి. చూడటానికి అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికి క్రీములు, ఇతర మందులు వాడే బదులు ఒక బంగాళదుంపని తురిమి అందులో పావు కప్పు నిమ్మరసం కలపండి. పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉన్న చోట ఈ మాస్క్ని వేసుకుని అరగంట ఆగి చల్లని నీటితో కడిగేయాలి. ఇలా రోజుకి రెండుసార్లు చేయవచ్చు. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి అవసరమున్న చోట ఈ మిశ్రమాన్ని పూతలా వేసుకోవాలి. తర్వాత గోరు వెచ్చని నీటిలో మెత్తటి బట్ట ముంచి పిండేసి ఆ బట్టని ఈ మిశ్రమం అప్లై చేసిన చోట కవర్ చేసినట్లుగా వేయండి. ఇరవై నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా వారానికి ఒకసారి చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ సమస్య తగ్గి ముఖం మిలమిలలాడుతుంది. పిగ్మంటేషన్ని పోగొట్టే డ్రింక్లు ..కీర, దానిమ్మ, కరివేపాకు ఆకులు, నిమ్మరసంతో ఈ ఇంటి డ్రింకు ఎంతో సులువుగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింకు లాభాలు ఎన్నో. కీరకాయల్లో యాంటాక్సిడెంట్లు, సిలికా అత్యధికంగా ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్ ను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ డ్రింకులో ఉపయోగించే దానిమ్మ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే యాంటాక్సిడెంట్లతో పాటు చర్మాన్ని మెరిపించే సుగుణాలు ఎన్నో ఉన్నాయి. ఇవి పిగ్మెంటేషన్ మచ్చలను పోగొట్టడంలో బాగా పనిచేస్తాయి.ఈ డ్రింకులో వేసే కరివేపాకుల్లో కూడా యాంటాక్సిడెంట్లతో పాటు విటమిన్ సి బాగా ఉంది. అలా కరివేపాకులు కూడా పిగ్మెటేషన్ ను తగ్గించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక నిమ్మరసంలో విటమిన్ సి ఎంత ఎక్కువగా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. నిమ్మరసం చర్మంపై ఏర్పడ్డ నల్లమచ్చలను తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అంతేకాదు స్కిన్ టోన్ కూడా సమంగా ఉండేలా తోడ్పడుతుంది.తయారీ విధానం: చిన్న కీరకాయ ఒకటి, అరకప్పు దానిమ్మ గింజలు, పది పన్నెండు కరివేపాకులు, అరచెక్క నిమ్మరసం రెడీ పెట్టుకోవాలి. వీటన్నింటినీ బ్లెండర్ లో వేసి బాగా కొట్టాలి. ఆ డ్రింకును గ్లాసులో పోసుకుని తాగాలి అంతే. ఈ డ్రింకు వల్ల పిగ్మెంటేషన్ తగ్గడంతో పాటు ఇందులోని యాంటాక్సిడెంట్ల వల్ల శరీరంలోని ఫ్రీరాడికల్స్ న్యూట్రలైజ్ అవుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను ఈ డ్రింకు తగ్గిస్తుంది. అంతేకాదు సెల్యులార్ పునరుద్ధరణ కూడా చేస్తుంది. -
బట్టతల అందమే..! చూసే విధానంలోనే ఉందంతా..
కొందరూ బట్టతలను చాలా అవమానంగా చూస్తారు. అందులోనూ పెళ్లి అవ్వకమునుపే వస్తే ఆ బాధ మరీ వర్ణనాతీతం. కానీ కొందరూ బట్టతలే అందం అంటూ ఆత్మవిశ్వాసంగా ముందుకొచ్చి అందాలపోటీల్లో పాల్గొని స్ఫూర్తినిస్తున్నారు. కురులే సౌందర్య చిహ్నం అని చూసే రోజులు కాదివి అంటూ ధైర్యంగా ముందుకొస్తున్నారు. ఇక్కడ అలానే ఓ భారత సంతతి వధువు ఎలాంటి విగ్గులు ధరించకుండా పెళ్లి చేసుకుని నెటిజన్ల మనసులను దోచుకుంది.అమెరికాకు చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహార్ సచ్దేవా భారత మూలాలున్న అమ్మాయి. ఆమె అందానికి ఉండే ప్రమాణాలను సవాలు చేసేలా తన అసలైన రూపంతోనే పెళ్లి చేసుకుంది. ఆమెకు చిన్న వయసులోనే అలోపేసియా బారినపడింది. దీని కారణంగా బాధితులకు కురులు ఉండవు. ఎందుకంటే అలోపేసియా(alopecia) అనేది రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడిచేసే పరిస్థితి. దీని ఫలితంగా జుట్టు ఘోరంగా రాలిపోతుంది. అయితే వివాహం వంటి కార్యక్రమాల్లో జుట్టు లేని అమ్మాయి/అబ్బాయి ఇద్దరు కూడా ఆ వేడుకల సంప్రదాయం రీత్యా విగ్గులు(wigs) ధరించే పెళ్లిచేసుకుంటారు. గానీ ఈ అమ్మాయి ఆ నిబంధనలను సవాలు చేసేలా ఆత్మవిశ్వాసంగా తానెలా ఉన్నానో అలానే పెళ్లి చేసుకుంటానంటూ ముందుకు వచ్చింది. అలానే వివాహ దుస్తుల్లో బట్లతల(Bald)తోనే వివాహం(wedding) గ్రాండ్గా చేసుకుంది. తనను అలానే ఇష్టపడాలి అన్నట్లుగా పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. ఈ విషయం నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లంతా ఆ అమ్మాయిని ఔను..! "బట్టతల అందమే" అంటూ ప్రశంసిస్తూ ఆమెకు మద్దతు పలికారు. అంతేగాదు ఈ సమస్యను మనం ముందుగా మనస్పూర్తిగా అంగీకరిస్తే అవతివాళ్లు కూడా సహృద్భావంతో అంగీకరించగలుగుతారని అంటోంది కంటెంటట్ క్రియేటర్ నీహార్. ఆ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు నీహార్ నెట్టింట షేర్ చేయడంతో తెగ వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by Neehar Sachdeva (@neeharsachdeva) (చదవండి: కేన్సర్ని జయించి..ఇవాళ రూ. 39 లక్షల వ్యాపార సామ్రాజ్యం..!) -
బోసు బాల్తో నటి కొత్త కసరత్తులు వైరల్ : అసలేంటీ బోసు బాల్ ఎక్స్ర్సైజ్?
బరువు తగ్గడానికి శరీరాన్ని దృఢంగా ఆ మార్చుకోవడానికి వ్యాయామం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనేది వారి వారి వ్యక్తిగత అవసరాలు, ఇష్టా ఇష్టాలమీద ఆధారపడి ఉంటుంది. యోగా, వాకింగ్, జాకింగ్ లాంటి వాటితో ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది బోస్ బాల్ వ్యాయామం. బోసు బాల్ (BOSU Ball) వ్యాయామం మొత్తం శరీరాన్ని పటిష్టంగా మారుస్తుంది. శరీరంతోపాటు, జీవిత సమన్వయ సామర్థ్యాన్ని కూడా ఇస్తుంది. తాజాగా బోసు బాల్ వ్యాయామాన్ని అలవోకగా చేస్తోంది నటి శిల్పా శెట్టి (Shilpa Shetty Kundra).యోగాసనాలు, జిమ్లో కసరత్తులతో అభిమానుల ఆకట్టుకునే శిల్పా బోసు బాల్ మీద చాలా బ్యాలెన్సింగ్ వ్యాయామాలుచేస్తున్న వీడియోను మండేమోటివేషన్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేసింది.బోసు బాల్ వ్యాయామం శరీరంలోని అన్ని కండరాలను బలోపేతం చేస్తుందని శిల్పా చెప్పుకొచ్చింది. సమతుల్యతను, బ్యాలెన్సింగ్ మెరుగుపరుస్తుందని తెలిపింది. క్రియాత్మక ఫిట్నెస్ను పెంచుతుందని, అలాగే పట్టు తప్పి పడిపోవడం, గాయాల ప్రమాదాలను తగ్గిస్తుందని తెలిపింది.ఎలా చేస్తారు?ఒక ప్లాస్టిక్ బేస్మీద రబ్బరు బంతిని అమరుస్తారు. దీనిమీద స్క్వాట్స్, పుష్ అప్ప్, జంపింగ్, ప్లాంక్స్, హాప్స్, షోల్డర్ టాప్స్, మౌంటైన్ క్లైంబర్స్ఇలాచాలా రకాల వ్యాయామాలను చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా ఎక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి. బరువు కూడా తొందరగా తగ్గుతారు. View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) బౌన్స్ అవుతున్న బంతిమీద వ్యాయామం అంటే అన్ని కండరాలను యాక్టివేట్ చేస్తుంది. శరీరాన్ని ఎలా నియంత్రించుకోవాలో అలవడుతుంది. బోసు బాల్ వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి మంచిది. సమన్వయాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుష్-అప్స్, జంప్స్ చేయడంలో వల్ల టోన్ల్ బాడీ సొంతం చేసుకోవచ్చు. వివిధ రకాల కండరాల సమూహాలను లక్ష్యంగా 15 నిమిషాల పాటు చేస్తే చేయాలి.45-60 నిమిషాలు మంచి ఫలితం ఉంటుంది. మెదడికి, శరీరానికి మధ్య సమన్వయం మెరుగుపడుతుంది. మానసిక బలం చేకూరుతుంది. బోసు బాల్ వ్యాయామాలు, ప్రయోజనాలుబోసు బాల్ వ్యాయామంతో అనేక రకాల(health benefits) ప్రయోజనాలున్నాయి. నిజానికి ఈ వ్యాయామం శారీరక బలానికి ఒక పరీక్ష లాంటిది. ఇది ఒక్కసారి అలవాటైతే చక్కని శరీర సౌష్టవంతోపాటు దేహ దారుఢ్యంగా కూడా పెరుగుతుంది, బ్రహ్మాండమైన ఫిట్నెస్ మన సొంతమవుతుంది. గుర్తుంచుకోవాల్సిన అంశాలుఆరంభంలో సరియైన నిపుణుడు, లేదా శిక్షకుడి ఆధ్వర్యంలో వీటిని చేయాల్సి ఉంటుంది. బోసు బంతితో వ్యాయామం చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన ప్రధాన విషయం ఏమిటంటే ఈ బాల్పై ఎలాంటి ఎక్స్ర్సైజ్ చేసినా, తొందర పడకుండా, నిదానంగా బ్యాలెన్సింగ్ను అలవర్చుకోవాలి. భుజాలు వెనుకకు, తల తటస్థంగా ఉండేలా సరియైన భంగిమలో ఉండాలి. బంతిపై నిలబడి ఉన్నప్పుడు మోకాళ్లను వదులుగా ఉంచుకోవాలి. ఇది బాల్ పై కదలికల సమయంలో, లేదా కొంచెం వంగినపుడు పడిపోకుండా సహాయపడుతుంది ఇవీ చదవండి: 32 ఏళ్ల వయసులో సీఈవో కరిష్మా కీలక నిర్ణయంపెళ్లై పాతికేళ్లు : ఆంటీ కోసం అంకుల్ రొమాంటిక్ డ్యాన్స్! వైరల్వీడియో -
జుట్టు కుదుళ్లను బలోపేతం చేసే హెల్మెట్..!
కేశాలంకరణతోనే ముఖంలో ప్రత్యేక కళ వస్తుంది. తీసుకునే ఆహారంలో పోషక లోపాలు, ఒత్తిడి, జుట్టు విషయంలో సరైన శ్రద్ధ లేకపోవడం వంటి ఎన్నో కారణాలతో చిన్న వయసులోనే చాలామంది బట్టతల బారిన పడుతున్నారు. అలాంటి వారికి ఈ ‘హెయిర్ గ్రోత్ హెల్మెట్‘ చక్కగా ఉపయోగపడుతుంది.ఇది ఎల్ఈడీ రెడ్ లైట్ థెరపీని అందిస్తుంది. దీని నుంచి వచ్చే వైబ్రేషన్స్ తలమీద చర్మానికి, వెంట్రుకల కుదుళ్లకు చక్కటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. ఈ లైట్ థెరపీ జుట్టు కుదుళ్లలో శక్తిని పెంచుతుంది. దీనిని వాడటం వల్ల ఎలాంటి నొప్పి, మంట ఉండవు. ఇది డైహైడ్రోటెస్టోస్టిరాన్ స్థాయిని తగ్గించి, తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.ఈ పరికరం జుట్టు రాలడాన్ని నివారించడమే కాకుండా, ఉన్న జుట్టు మరింత ఏపుగా పెరిగేందుకు దోహదపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా వాడినట్లయితే, పన్నెండు వారాల్లోనే 128% జుట్టు పెరుగుతుందని ఈ హెల్మెట్ తయారీదారులు చెబుతున్నారు. దీన్ని ప్రతిరోజూ పది నిమిషాలు, తలకు పెట్టుకుని, స్విచాన్ చేసుకుంటే సరిపోతుంది. జుట్టు రాలిపోయిన ప్రదేశంలో తిరిగి వెంట్రుకలను మొలిపించడంలో ఈ హెల్మెట్ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్ పరీక్షల్లో తేలింది. -
'ఇది కాస్మెటిక్ సర్జరీనే కానీ కళ్లకు'..ఎంత ఛార్జ్ చేస్తారో తెలుసా..!
మహిళలు కాస్మెటిక్ సర్జరీలతో అందాన్ని రెట్టింపు చేసుకుంటుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, ప్రముఖులే వీటిని చేయించుకుంటుంటారు. ఓ మోస్తారు స్థాయిలో డబ్బున్న వాళ్లు చేయించుకునే సర్జరీలివి. ఇంతవరకు బ్రెస్ట్, పెదాలు, ఫేస్లిఫ్ట్లు, బోటాక్స్ వంటి కాస్మెటిక్ సర్జరీల గురించి విన్నాం. కానీ కంటికి కాస్మెటిక్ సర్జరీలు చేయడం గురించి వినలేదు కదా..!. ఇదేంటి కంటికి ఏం చేస్తారు అనుకోకండి. ఎందుకంటే నీలిరంగు, తేనె కళ్లతో ఉండేవాళ్లని చూస్తుంటాం కదా..! అలా మన కళ్లను నచ్చిన రంగుతో అందంగా మార్చుకునే సర్జరీనే ఇది. అయితే దీనికి ఖర్చు ఎంతవుతుందో తెలుసా..!.యూఎస్కి చెందిన డాక్టర్(US Doctor) బ్రియాన్ బాక్సర్ వాచ్లర్(Dr Brian Boxer Wachler) ఈ వినూత్న కాస్మెటిక్ సర్జరీ(cosmetic surgery)నే చేస్తున్నారు. ఇలా కంటి రంగుని మార్చడాన్ని కెరాటోపిగ్మెంటేషన్ సర్జరీగా పిలుస్తారు. కార్నియాలోకి వర్ణద్రవ్యాన్ని ఇంజెక్ట్ చేసి కంటి రంగుని మార్చే ప్రక్రియ ఇది. దీనికి జస్ట్ 15 నుంచి 20 నిమిషాలుపడుతుంది అంతే..!. ఈ కార్నియాకి ఇచ్చే ఇంజెక్షన్లో ఈ ఐ డ్రాప్స్ తిమ్మిరిని కలుగజేస్తాయి. అందువల్ల నొప్పి కూడా అస్సలు తెలియదు. ఇంత తక్కువ వ్యవధిలో ఎలాంటి నొప్పి లేకుండా చేసే ఈ సర్జరీ ఖరీదు మాత్రం అత్యధికమే. ఒక కంటికి సుమారు రూ. 5 లక్షల దాక అవుతుంది. అంటే రెండు కళ్లకు దగ్గర దగ్గర రూ. 10 లక్షలు పైనే ఖర్చు అవుతుందన్న మాట. ఈ సర్జరీ రిజల్ట్ తక్షణమే కనిపిస్తుంది. చాలామంది ఔత్సాహికులు మాత్రం ఆకుపచ్చ, సతత హరిత, రివేరా నీలం, పారిస్ నీలం వంటి రంగులను ఎంచుకుంటారట. ఎక్కువమంది హనీ గోల్డ్, స్టీల్ గ్రే, ఆలివ్ ఆకుపచ్చలకే ప్రాధాన్యత ఇస్తారట. తన పేషంట్లలలో చాలామంది ఈ సర్జరీ చేయించుకున్న వెంటనే తన కళ్లలోని మార్పుని చూసి ఆశ్చర్యపోవడం, కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగంగా మాట్లాడటం వంటివి చేస్తారని డాక్టన్ బ్రయాన్ చెబుతున్నారు. అయితే తాను మాత్రం ఈ సర్జరీని ట్రై చేయాలని అనుకోవడం లేదని అన్నారు. కేవలం అందం కోసం ఆరాటపడే వాళ్ల కళ్లలో ఆనందం కోసం ఈ సరికొత్త కాస్మెటిక్ సర్జరీ ప్రక్రియని కనుగొన్నట్లు తెలిపారు. ఆధునాతన లేజర్ని ఉపయోగించి ఈ మొత్తం కాస్మెటిక్ సర్జరీని పూర్తి చేస్తానని అన్నారు. ఇది చాలా సురక్షితమైనదని పేర్కొన్నారు. అంతేగాదు తన పేషంట్ల అనుభవాలకు సంబంధించిన వీడియోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ ఈ సర్జరీ గురించి వివరించారు. అయితే నెటిజన్లు ఈ అందం పిచ్చి రాబోయే రోజుల్లో ఎలాంటి భయానక కాస్మెటిక్ సర్జరీలు చేయించుకునేందుకు దారితీస్తుందో అని ఆందోళన వ్యక్తం చేస్తూ.. చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Brian Boxer Wachler, MD (@drboxerwachler) (చదవండి: ఇద్దరు నారీమణుల సాహసం..భూగోళాన్ని చుట్టొచ్చారు..!) -
ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో..!
మామూలుగా చాలా నిరాడంబరంగా ఉండేవారు సైతం ఏదైనా పార్టీ అనగానే ఇన్స్టంట్ గ్లో రావాలంటే ఏం చేయాలో అప్పటికప్పడు ప్లాన్స్ చేసుకునేవారుంటారు. ఇలాంటప్పుడు కొన్ని సమస్యలూ తలెత్తవచ్చు. ముందుగా కొద్దిపాటి అవగాహనతో చర్మ సంరక్షణ పట్ల జాగ్రత్త తీసుకుంటే ఇంట్లోనే ఇన్స్టంట్ గ్లో పొందవచ్చు. ఐసింగ్ ... మేకప్కు ముందు చర్మం బిగుతుగా, తాజాగా కనిపించడానికి ఐస్క్యూబ్స్తో మసాజ్ చేసుకుంటారు. దీంతో పోర్స్ మూసుకుపోయి, మేకప్ తాజాగా కనిపిస్తుంది. అరగంట ముందు రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి ముఖానికి అప్లై చేస్తారు. పాలతో కూడా చర్మాన్ని మసాజ్ చేసుకోవచ్చు. పాలలో మైల్డ్ లాక్టిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి చర్మానికి హాని కలగదు.ప్రొడక్ట్స్తో జాగ్రత్త... ఇన్స్టంట్ గ్లో కోసం కొన్ని ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయితే, సున్నితమైన చర్మం గలవారు, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు ఆ ప్రొడక్ట్స్ గురించి తెలియక వాడితే మరిన్ని కొత్త సమస్యలు తలెత్తవచ్చు. ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ ఏవైనా నిపుణులు సూచనలతో వాడటం మేలు.ఫేసియల్స్... ఇన్స్టంట్ గ్లో కోసం కెమికల్ పీల్, పంప్కిన్ పీల్, హైడ్రా ఫేసియల్స్... వంటివి కొంత తాజాదనాన్ని ఇస్తాయి. అయితే, వీటిని వేడుక ఉన్న రోజే కాకుండా రెండు, మూడు రోజుల ముందు నిపుణుల ఆధ్వర్యంలో ప్రయత్నించాలి. ఫేసియల్స్కి వాడక్ట్స్ మీ చర్మతత్వానికి సరిపడతాయో లేదో ముందస్తుగా చెక్ చేసుకొని వాడటం మంచిది. లేజర్ వంటి ఇతర బ్యూటీ ట్రీట్మెంట్లు అయితే నిపుణుల ఆధ్వర్యంలో వేడుకకు కనీసం 10–15 రోజుల ముందు చేయించుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది. డాక్టర్ స్వప్నప్రియ, క్లినికల్ డెర్మటాలజిస్ట్ (చదవండి: సోనమ్ కపూర్ వాచ్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!) -
గ్లోబల్ పాప్ స్టార్ జెన్నీ స్కిన్ కేర్ సీక్రెట్ : రెండే రెండు ముక్కల్లో!
అందమైన, మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాదు. ఇది వారి వారి జీవన శైలి, జెనెటిక్ ప్రభావాలు, పని పరిస్థితులు, మానసిక, శారీరక ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే ఉన్న రంగు, ప్రకాశవంతమైన చర్మాన్ని కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి చాలా శ్రమ, ఓర్పు అవసరం అనడంలో ఆశ్చర్యం లేదు. దీని కోసం సెలబ్రిటీలు చాలా కేర్ తీసుకుంటారు. వారిలో గ్లోబల్ పాప్ స్టార్, జెన్నీ కిమ్ ఒకరు. కిమ్ లాంటి షైనింగ్ స్కిన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుందామా?గ్లోబల్ స్టార్, జెన్నీ కిమ్ ముఖం మచ్చలేని చంద్రబింబంలా మెరిసిపోతూ ఉంటుంది. బ్లాక్పింక్గా పేరొందిన జెన్సీ మచ్చలేని, మెరిసే చర్మానికి పాపులర్. అసలు ఆమె స్కిన్ టోన్ చూసిన సౌందర్య నిపుణులు, అభిమానులు ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన ముఖ సౌందర్యం ఆమె సొంతం.చర్మ సంరక్షణకోసం ఆమె ఏం చేస్తుంది?జెన్నీ సహజమైన మెరుపు కోసం, చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. స్కిన్కేర్కు ఆమె అనుసరించే పద్ధతులు చాలా సరళమైనవి, పైగా ప్రభావ వంతమైవి. ఏదైనా పెద్ద ఈవెంట్లకు ముందు ఆమె ముఖాన్ని ఐసింగ్ (ఐస్వాటర్లో ఫేస్ను ముంచడం) చేస్తుంది. డబుల్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ వంటి ముఖ్యమైన పద్ధతులను పాటిస్తుంది. ప్రీ-ఈవెంట్ బ్యూటీ హ్యాక్ సందర్భంగా తన బ్యూటీ సీక్రెట్స్ను పంచుకుంది. ఖరీదైన ఉత్పత్తులే అవసరం లేదు, కేవలం ఐస్-కోల్డ్ వాటర్ లాంటివి కూడా సరిపోతాయని తెలిపింది.ఐస్ వాటర్ ట్రిక్ఏదైనా ప్రధాన కార్యక్రమానికి ముందు తన ముఖాన్ని ఐస్ వాటర్ గిన్నెలో కాసేపు ఉంచుతుంది. ఈ చర్మ సంరక్షణలో పురాతన ట్రిక్ తనకు చాలా ఇష్టమైనదనీ, ఇది చర్మాన్ని బిగుతుగా చేయడంతోపాటు, ఉబ్బును తగ్గించి, మెరుపును పెంచుతుందని తెలిపింది.ఈ టెక్నిక్ను స్కిన్కేర్ ప్రిపరేషన్ స్టెప్గా ఉపయోగిస్తున్నప్పటికీ, ప్రయోజనాలు మేకప్కు మించి అందంగా చేస్తాయని పేర్కొంది. అలాగే చల్లని నీరు రక్త నాళాలను టైట్ చేస్తుందనీ, చర్మాన్ని తాజాగా కనిపించేలా చేస్తుందని చెప్పింది. తద్వారా ముఖంలోని చర్మానికి తక్షణ బూస్ట్ ఇస్తుందని వివరించింది.హైడ్రేషన్ కోసం ఫేస్ మాస్క్జెన్నీ ఫేస్ మాస్క్లకు పెద్ద అభిమాని, హైడ్రేషన్ , పోషణను నిర్వహించడానికి ఈమాస్క్ వేసుకోవడం దినచర్యలో ఒక భాగంగా చేసుకుంటుందట. ఫేస్ మాస్క్లు, ముఖ్యంగా షీట్ మాస్క్లు, కొరియన్ స్కిన్కేర్లో ప్రధానమైనవి. ఇవి చర్మం తాజాగా ఉండటానికి సహాయపడతాయి.డీప్ క్లీన్ స్కిన్ కోసం డబుల్ క్లెన్సింగ్జెన్నీ స్కిన్కేర్ రొటీన్లో మరో ముఖ్యమైన భాగం డబుల్ క్లెన్సింగ్. దీని కోసం ముందుగా మేకప్, సన్స్క్రీన్ అదనపు నూనెలను తొలగించడానికి ఆయిల్ ఆధారిత క్లెన్సర్ను ఉపయోగిస్తుందట. ఆ తరువాత మురికి మలినాలను తొలగించడానికి వాటర్ ఆధారిత క్లెన్సర్ను వాడుతుంది. డబుల్ క్లెన్సింగ్ చర్మం అవసరమైన తేమను తొలగించకుండా పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది.చదవండి: ఉద్యోగులకు బంపర్ ఆఫర్ : తీసుకున్నోడికి తీసుకున్నంత!స్మూత్ స్కిన్ కోసం రెగ్యులర్ ఎక్స్ఫోలియేషన్జెన్నీ తన చర్మాన్ని మృదువుగా , మృత చర్మ కణాలను తొలగించుకునేందుకు ఎక్స్ఫోలియేషన్ ( స్క్రబ్బింగ్) రొటీన్గా ఆచరిస్తుంది. ఎక్స్ఫోలియేటింగ్ పోర్స్ను ఓపెన్ చేసి, ఛాయను ప్రకాశవంతం చేస్తుంది. అలాగే మనం వాడే చర్మ సంరక్షణ ఉత్పత్తుల శోషణను మెరుగుపరుస్తుంది. అతిగా ఎక్స్ఫోలియేషన్ చేయడం వల్ల చర్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పరిమితంగా ఈ పద్థతిని పాటిస్తుంది. ఐ క్రీమ్లు , సీరమ్లుజెన్నీ స్కిన్కేర్ రొటీన్లో కీలకమైన భాగం ఐ క్రీమ్లు ,సీరమ్. ఐ క్రీమ్లు ద్వారా కంటికింద మచ్చలు, కళ్ల ఉబ్బులాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. మరోవైపు, సీరమ్స్ ద్వారా స్కిన్ డ్రై అయిపోకుండా ఉంటుందని, హెల్తీగా ఉంటుందని తెలిపింది. వీటిన్నితోపాటు, పుష్కలంగా నీరు తాగుతుంది. ఇక కొరియన్ చర్మ సంరక్షణలో ముఖ్య భాగమైన ప్రతీరోజూ సన్స్క్రీన్ను వాడుతుంది. దీని ద్వారా అకాల వృద్ధాప్యాన్ని కాకుండా ఉంటుందనీ, అలాగే హానికరమైన UV కిరణాల నుండి చర్మానికి రక్షణఉంటుందని వివరించింది.ఇదీ చదవండి: సినిమాను మించిన సింగర్ లవ్ స్టోరీ : అదిగో ఉడుత అంటూ ప్రపోజ్! -
అందం, ఆరోగ్యమే కాదు, బరువు తగ్గడంలో కూడా ‘గేమ్ ఛేంజర్’ ఇది!
చిన్నపుడు ఏ చిన్న దెబ్బ తగిలినా, ఏ చిన్న నొప్పి వచ్చినా మన అమ్మమ్మలు, నానమ్మలు ఉపయోగించే అద్భుతమై చిట్కా కొబ్బరి నూనె. పైపూతగా మాత్రమే కాదు కడుపులోకి తీసుకోవడం ద్వారా కొబ్బరి నూనె వల్ల కూడా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అందుకే ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. కొబ్బరి నూనెలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందా రండి.కొబ్బరి నూనె అనగానే కేవలం జుట్టు మాత్రమే పనికొచ్చేది కాదు. శరీర ఆరోగ్యానికి, చర్మ ఆరోగ్యానికి చాలామంచిది. కేరళ, థాయ్లాండ్ లాంటి అనేక ప్రదేశాల్లో కొబ్బరినూనెను వంటల్లో వాడతారు. అలాగే ఈ కొబ్బరి నూనెను ఉదయాన్నే పరగడుపున ఒక స్పూన్ తాగితే, శరీరంలో ఆరోగ్య సమస్యలన్నిటికీ దివ్య ఔషధం లాగా పని చేస్తుందని నమ్ముతారు.అధికబరువుతో బాధపడే వారు కొబ్బరి నూనెను గాలి కడుపుతో తీసుకుంటే బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో మంచి కొవ్వు శరీరంలో నెమ్మదిగా జీర్ణం అవుతుంది. కొబ్బరి నూనెతో ఉపయోగాలు :గుండె ఆరోగ్యానికి మంచిది. ఇది మంచి కొలెస్ట్రాల్ (HDL) ను పెంచడం ద్వారా, చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గిస్తుందిలారిక్ఆమ్లం పుష్కలంగా ఉండే బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.శరీరానికి హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు ,శిలీంధ్రాలతో ఫైట్ చేసి, రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. సాధారణ ఇన్ఫెక్షన్లను దూరంగా ఉంచడానికి సహాయపడతాయి.మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. కొబ్బరి నూనెలోని MCT లు కీటోన్లుగా మారి, మెదడుకు ప్రత్యామ్నాయ శక్తి వనరుగా పనిచేస్తాయి. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి ,మానసిక స్పష్టతతో సహా అభిజ్ఞా విధులను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక స్థితిలో హెచ్చుతగ్గులు తగ్గుతాయి .కొబ్బరి నూనె మరో ముఖ్యమైన లక్షణం బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. శరీర కొవ్వుగా నిల్వలు పెరగకుండాకా పాడి, బరువు నిర్వహణలో సహాయపడతాయి.కొబ్బరి నూనెలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలు హానికరమైన బ్యాక్టీరియాను తొలగించి,ఆరోగ్యకరమైన ప్రేగును ప్రోత్సహిస్తాయి. ఇది కొవ్వులో కరిగే విటమిన్లు, ఖనిజాలను గ్రహించడంలో సహాయపడుతుంది. మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.జుట్టు కండిషనింగ్కు కొబ్బరి నూనెకు మించింది లేదు. ఇది జుట్టు కుదుళ్లలోకి చొచ్చుకుపోతుంది, ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తుంది. జుట్టు తెగిపోకుండా నిరోధిస్తుంది. సహజమైన మెరుపు వస్తుంది. క్రమం తప్పకుండా వాడితే జుట్టు ఒత్తుగా ఆరోగ్యంగా, బలంగా పెరుగుతుంది.కొబ్బరి నూనెతో ఆయిల్ పుల్లింగ్ వల్ల ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో నోటి దుర్వాసన, చిగుళ్ల వ్యాధులను నివారించవచ్చు. వర్జిన్ కొబ్బరి నూనె తొందరగా శక్తినిస్తుంది. శక్తి బూస్టర్గా పనిచేస్తుంది.మంటను తగ్గించడంలో సహాయపడుతంది. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ వంటి లక్షణాలకు ఉపశమనం లభిస్తుంది.చర్మానికి కొబ్బరి నూనెకొబ్బరి నూనె ,చర్మ మెరుపునకు పెట్టింది పేరు. పొడిగా మారిపోయిన చర్మానికి కొబ్బరినూనె పూస్తే సహజ సౌందర్యం వస్తుంది. స్కిన్ బ్యూటీలో ఈ నూనె గేమ్-ఛేంజర్ అని చెప్పవచ్చు. మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. స్నానానికి ముందు, తర్వాత గానీ చర్మానికి కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే తేమను నిలుపుకుంటుంది, మీ చర్మాన్ని రోజంతా మృదువుగా , హైడ్రేటెడ్గా ఉంటుంది. సహజ సిద్ధమూన మేకప్ రిమూవర్గా పనిచేస్తుంది. వాటర్ ప్రూఫ్ మస్కారాతో సహా మేకప్ను కరిగించడానికి కొబ్బరి నూనెతో ముఖంపై సున్నితంగా మసాజ్ చేయాలి. ఆ తరువాత గోరువెచ్చని నీళ్లలో ముంచిన గుడ్డతో తుడిచేయాలి.పగిలిన పెదాలకు కొబ్బరి నూనె రాస్తే పెదాలు, తేమఉంటాయి. రసాయనాలు కలిపిన ప్రొడక్ట్స్తో పోలిస్తే ఇది చాలా ఉత్తమం. నెట్లోకి వెళ్లినా ఎలాంటి హాని ఉండదు. కొబ్బరి నూనె అద్భుతమైన మసాజ్ ఆయిల్. నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. ఈ లాభాలు, ప్రయోజనాలు అందరికీ ఒకేలా వర్తించవు. మెరుగైన ఫలితాలకోసం ఆరోగ్య నిపుణులును సంప్రదించడం ఉత్తమం.చదవండి: చాలా కాస్ట్లీ గురూ! ఉప్పు పేరు చెబితేనే గూబ గుయ్య్..!శానిటరీ ప్యాడ్ అడిగితే.. ఇంత దారుణమా! నెటిజన్ల ఆగ్రహం -
మీసాలు.. గడ్డాలకు భేషైన తైలాలు
మింగ మెతుకు లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అని మనకో సామెత ఉంది. స్తోమతకు మించి డాబులొలికే దిలాసారాయుళ్ల తీరును ఎద్దేవా చేయడానికి పుట్టిన సామెత అది. ఆనాటి సమాజంలో సంపన్నులైన పెద్దమనుషులు మీసాలకు సంపెంగ నూనెలు, ఇతరేతర సుగంధ తైలాలను పూసుకుంటూ, దర్జా ప్రదర్శించేవారు. ఇదివరకు కాస్త వయసు మళ్లినవాళ్లే ఏపుగా గడ్డాలు పెంచేవాళ్లు. ఇటీవలి కాలంలో కుర్రాళ్లు కూడా ఎడాపెడా గడ్డాలు పెంచేసుకుంటున్నారు. కొందరు అడ్డదిడ్డంగా గడ్డాలు పెంచుకుంటూ, చిరిగిన జీన్స్ తొడుక్కుని వీథుల్లో ఆవారాగా తిరుగుతుంటే, ఇంకొందరు సూటు బూట్లు ధరించి, పద్ధతిగా గడ్డాలను రకరకాల తీరుల్లో కత్తిరించుకుంటూ, గడ్డాలు దట్టంగా పెరగడానికి నానా రకాల పోషక తైలాలు వాడుతున్నారు. గడ్డాల మీద యువతరం మోజు గమనించిన మార్కెట్ శక్తులు ఊరుకుంటాయా? యువకుల మోజును సొమ్ము చేసుకోవడానికి గడ్డాల పోషణకు ప్రత్యేకంగా రూపొందించిన రకరకాల తైలాలను మార్కెట్లో ముంచెత్తుతున్నాయి. బియర్డ్ ఆయిల్స్, బియర్డ్ క్రీమ్స్ పురుషుల సౌందర్య ఉత్పత్తులలో కీలకంగా మారి΄ోయాయి. తలకు రాసుకునే హెయిరాయిల్స్, బ్రిలియంటైన్స్, జెల్స్తో పోల్చుకుంటే మీసాలు గడ్డాలకు పూసుకునే బీర్డ్ ఆయిల్స్, క్రీమ్స్ ధరలు నాలుగైదు రెట్లు ఎక్కువగా ఉంటున్నా, గడ్డాలరాయుళ్లు ఏమాత్రం వెనుకాడటం లేదు. గడ్డం సంరక్షణ, పద్ధతులుగడ్డం వేగంగా పెరగాలంటే ముఖాన్ని క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోండిమంచి చర్మ సంరక్షణ నియమాన్ని పాటించడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి, జుట్టు పెరుగుదలకు మెరుగైన వాతావరణం ఉంటుంది.టీనేజర్లు రోజుకు రెండుసార్లు తేలికపాటి క్లెన్సింగ్ జెల్ లేదా సబ్బు, గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. దీంతో రంధ్రాలు ఓపెన్ అవుతాయి.అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం, బోర్డు-సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ ప్రకారం గడ్డాన్ని మాయిశ్చరైజింగ్, బీర్డ్ ఆయిల్తో మసాజ్ చేయడం ఆరోగ్యంగా ఉంచడానికి కీలకం. ముఖం,గడ్డాన్ని సున్నితమైన క్లెన్సర్తో శుభ్రపరచడం, మాయిశ్చరైజర్ను ఉపయోగించడం ముఖ్యం.అలాగే గ్రూమింగ్ కోసం మంచి నూనె లేదా కండిషనర్ను పూయడం లాంటివి పాటించాలి.చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేయాలి.వారానికి కనీసం రెండుసార్లు మృతచర్మ కణాలను తొలగించడానికి ,చర్మాన్ని క్లియర్ చేయడానికి మంచి ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ను ఉపయోగించాలి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది చర్మాన్ని తేమగా , హైడ్రేట్ గా ఉండాలి. ఇందకు తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం.కీలక సూచనలుతాజాపండ్లు, కూరగాయలు , మాంసకృత్తులు, సమతులమైన ఆరోగ్యకరమైన తీసుకోవాలి. B1, B6 , B12 వంటి విటమిన్ లోపాలు టీనేజర్లలో మీసాలు, గడ్డాల పెరుగుదలను ఆలస్యం కావచ్చు. దీన్ని గమనించుకోవాలి.రోజువారీ వ్యాయామం చేయడం, ముఖం శుభ్రంగా ఎప్పటికపుడు కడుక్కోవడం, ఎక్స్ఫోలియేట్ చేయడం లాంటివి చేయాలి. యూకలిప్టస్ బేస్డ్ మాయిశ్చరైజరింగ్, కనీసం 8 గంటల నిద్ర కచ్చితంగా పాటించాలి.చదవండి : తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?గోవాబీచ్లో, సాయం సంధ్యలో.. మలైకా సన్బాత్ -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో బ్యూటీ సెన్సేషన్ ప్రొడక్ట్..!
సౌందర్య ప్రియులు, బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌండేషన్ ప్రొడక్ట్ షీగ్లామ్(SheGlam) ఇండియాలో లాంచ్ అయ్యింది. మేకప్ ప్రియులు ఇష్టపడే ఈ ప్రొడక్ట్ని రిలయన్స్ రిటైల్(Reliance Retail)కు చెందిన టిరా(Tira) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేకప్ ప్రోడక్ట్స్లో ది బెస్ట్ షీగ్లామ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ప్రియులు అత్యంత మెచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ షీగ్లామ్ ప్రొడక్ట్స్లో గ్లో బ్లూమ్ లిక్విడ్ హైలైటర్, డైనమాట్ బూమ్ లాస్టింగ్ లిప్స్టిక్లు, స్కిన్ఫైనెట్ హైడ్రేటింగ్ ఫౌండేషన్ వంటి ఇతర ఉత్పత్తలు అందుబాటలో ఉంటాయి. ఇవి ముఖానికి చక్కటి అందమైన మేకప్(Make Up)ని ఇస్తాయి. అంతేగాక సరసమైన ధరలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ల, మేకప్ ఆర్టిస్ట్లు తక్కవ ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తి లభిస్తుందని ప్రశంసించిన ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు టిరాలో షెగ్లామ్ అరంగేట్రంతో అందాల ఔత్సాహికులకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది. సమగ్ర సౌందర్యానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా చేసేలా టిరా ఈ ప్రొడక్ట్ లాంచ్తో బలపరుస్తోంది. యావత్తు ప్రపంచం మెచ్చిన ఈ బ్రాండ్ని టిరా వెబ్సైట్లో, యాప్లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ రిటైల్ టిరా ప్రకటించింది. ఇక త్వరలో టిరా స్టోర్లలో కూడా అందుబాటులో ఉండనుందని పేర్కొంది.చర్మ సంరక్షణ జాగ్రత్తలు..ఎంతటి బ్రాండెడ్ ఉత్పత్తులైనా.. చర్మానికి సరిపోతుందో లేదో పరీక్షించాలిఅవసరమైతే చర్మ నిపణలను సంప్రదించి వినియోగించడం మంచిదిఏ బ్యూటీ ప్రొడక్స్ట్ అయినా.. అతిగా వాడితే ప్రమాదమేనిద్రించే సమయంలో తప్పనిసరిగా మేకప్ని తొలగించుకోవాలి. (చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!) -
ముఖం చందమామలా మెరవాలంటే, ఇలాంటి తప్పులు చేయకండి!
మనసు ప్రశాంతంగా ఉంటే.. ముఖం కూడా అందంగా మరిసిపోతూ ఉంటుంది. కానీ పెరుగుతున్నకాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహారం తదితర కారణాలతో ముఖం వెలవెలబోతూ ఉంటుంది. అలాంటిపుడే కొన్ని జాగ్రత్తలు, చిట్కాలు పాటించాలి. ఇంట్లోనే, సహజసిద్ధంగా ఫేషియల్ గ్లో(Facial Glow) పొందవచ్చు. సింపుల్ అండ్ పవర్ ఫుల్ చిట్కాలు తెలుసుకుందాం పదండి. సమతుల ఆహారం, వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, రోజులో కనీసం 7 గంటల నిద్రతోపాటు ఒత్తిడికి దూరంగా ఉంటూ కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలతో ఆశ్చర్యపోయే బ్యూటీని సొంతం చేసుకోవచ్చు.స్ట్రాబెర్రీ , ఎగ్అరకప్పు స్ట్రాబెర్రీ గుజ్జులో కోడిగుడ్డు తెల్లసొన రెండు చెంచాలు, ఒక చెంచాడు నిమ్మరసం, వేసి ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తుంటే జిడ్డు తగ్గి, ముఖం మిలమిలలాడుతుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రంగా చేస్తుంది. చర్మం పై పేరుకుపోయిన మృత కణాలను తొలగిస్తుంది.పప్పాయి, కలబందబాగా పండిన తాజా బొప్పాయి ముక్కలు,( Papaya) తాజా కలబంద (Aloevera)లో కొద్ది నిమ్మరసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా బియ్యం పిండి, తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆపై తడి వేళ్ళతో చర్మాన్ని సున్నితంగా రబ్ చేసుకుంటూ చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.కీరా ఎగ్సగం కీరకాయ, ఒక కోడిగుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పాలమీగడ పావు కప్పు ఆయిల్ (వీట్జెర్మ్, ఆలివ్, అవొకాడోలలో ఏదో ఒకటి) తీసుకోవాలి. కీరకాయను శుభ్రంగా కడిగి చెక్కు తీయకుండా ముక్కలు చేయాలి. ఈ ముక్కలను, మిగిలిన అన్నింటితో కలిపి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లయ్ చేసి పది నిమిషాల తర్వాత తుడిచేయాలి. ఇలా ఉదయం, రాత్రి చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో పెట్టి మూడు రోజుల వరకు వాడుకోవచ్చు. (ఐఐఎం గ్రాడ్యుయేట్ : లైఫ్లో రిస్క్ తీసుకుంది, నెలకు రూ.4.5 కోట్లు)ముఖం మీద మురికి, ఆయిల్, మలినాలను తొలగించడానికి రోజుకు రెండుసార్లు (ఉదయం, రాత్రి) ముఖాన్ని కడగాలి.సహజ నూనెలను తొలగించకుండా ఉండటానికి మీ చర్మ రకానికి సరిపోయే తేలికపాటి క్లెన్సర్ను ఉపయోగించండి.విటమిన్ సీ లభించే పండ్లను బాగా తీసుకోవాలివిటమిన్ సి పిగ్మెంటేషన్, సన్ టాన్ మచ్చలు, వయసు మచ్చలను తగ్గిస్తుంది.కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈవెన్ టోన్డ్ ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలిచర్మ ఆరోగ్య రక్షణలో హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. మెరిసే చర్మానికి ఉత్తమమైన మాయిశ్చరైజర్ను ఎంచుకోవాలి.కెమికల్స్ లేని సన్ స్క్రీన్ వాడాలి. అవసరాన్ని బట్టి రోజులు మూడు, నాలుగు సార్లు దీన్ని అప్లయ్ చేయాలి.తాజా పళ్లు కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు, నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి. పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే, విటమిన్లు యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ప్రిజర్వేటివ్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.అలాగే ఫేస్ ప్యాక్ వేసుకున్నపుడు, లేదా ఎక్స్ఫోలియేట్ చేసేటపుడు చర్మాన్ని గట్టిగా రుద్దకూడదు. సున్నితంగా, మృదువుగా చేయాలి.ప్రోబయోటిక్స్ ఆరోగ్యకరమైన జుట్టుకు ,మెరిసే చర్మానికి కూడా దోహదం చేస్తాయి.ప్రోబయోటిక్ సప్లిమెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.యాంటీఆక్సిడెంట్లు (బెర్రీలు, ఆకుకూరలు ,గింజలు వంటివి),ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు (సాల్మన్ , అవకాడోలు వంటివి) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.వేడినీటితో ఈ ముప్పుఆవిరిస్నానం, ఎక్కువ వేడి నీటి స్నానానికి దూరంగా ఉండాలి. లేదా సమయాన్ని తగ్గించుకోవాలి. ఎక్కువసేపు వేడి నీటిని ప్రవహించడం వల్ల చర్మంలోని సహజనూనెలు దెబ్బతిని స్తేజంగా కనిపిస్తుంది. ఇదీ చదవండి: లడ్డూలిస్తా వదిలేయండి సార్.. చలాన్కు లడ్డూ లంచమా?! -
సోనాలి బింద్రే మెరిసే చర్మం రహస్యం ఇదే..!
ప్రముఖ మోడల్, నటి సోనాలి బింద్రే(Sonali Bendre) తెలుగు, తమిళం, కన్నడ సినిమాల్లో నటించి వేలాది అభిమానులను సొంతం చేసుకుంది. ఆమెకు బాలీవుడ్ నటిగానే ఎక్కువగా గుర్తింపు లభించింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు హిందీలోనే చేసింది. ఇక మన తెలుగులో అగ్ర హీరోల సరసన నటించి మంచి హిట్లతో ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. అంతేగాదు సోనాలి అత్యంత అందమైన నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అదీగాక చూడటానికి కుందనపు బొమ్మల ఆకర్షణీయంగా ఉంటుంది. ఓ ఇంటర్వ్వూలో ఆమె గ్లామర్ రహస్యం(beauty secret) గురించి షేర్ చేసుకంది. తన మెరిసే చర్మం రహస్యం ఆ మొక్కేనని అంటోంది.. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే ఈ మొక్క ఔషధ గుణాలను అందరూ ఉపయోగించుకోవాలని చెబుతోంది. అదేంటో చూద్దామా..!.ఐదు పదుల వయసులో అంతే గ్లామర్తో అభిమానులను ఫిదా చేస్తుంటారామె. ఆమె ముఖంలో ఉట్టిపడే కాంతి ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది. అంతలా చర్మం ప్రకాశవంతంగా కనిపించేందుకు స్కిన్ కేర్ తీసుకుంటానని అన్నారు. మన భారతీయ సంప్రదాయంలో పూజలందుకునే వేప మొక్క తన మెరిసే చర్మానికి కారణమంటుంది. తాను రోజకి రెండసార్లు వేప ఉత్పత్తుల(Neem products)తో చర్మాన్ని శుభ్రపరుస్తానని అంటున్నారు. దీంతోపాటు తాను చేసే వ్యాయమం కూడా చర్మాన్ని ప్రకాశవంతంగా కనిపించేలా చేయడంలో ఉపకరిస్తుందని చెబుతున్నారు. "మనం భారతీయులం కచ్చితంగా ఈ వేప మొక్క గుణాలను పిల్లలకు తెలియజేయాలి. ఈ మొక్కచేసే మాయాజాలం గురించి సవివరంగా చెప్పాలి. వేప చర్మానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిదే. తేమ వాతావరణంలో ఉండే వాళ్లకు వేప చాలా బాగా పనిచేస్తుంది. అయితే నేను బ్యూటీ ప్రొడక్ట్(Beauty Products)లను ఎక్కవగా ఉపయోగించను తరచుగా మాత్రం ముఖాన్ని శుభ్రపరుచుకోవడానికి బద్దకించను. అలాగే వీటి తోపాటు ఆర్యోగకరమైన ఆహారం తప్పనిసరిగా తీసుకుంటాను." అని చెబుతున్నారు సోనాలి. వేపతో కలిగే లాభాల..వేపని 'వండర్ హెర్బ్'గా చెబుతుంటారు. ఇది చర్మం, జుట్టు, రక్తం తదితర శరీర భాగాలన్నింటి శ్రేయస్సుకి సమర్థవంతమైనది. జీవశాస్త్రపరంగా దాదాపు 130 రకాలుగా ఉపయోగపడుతుందట. 2018లో ది హిమాలయ డ్రగ్ కంపెనీ వేప చర్మానికి ఒనగూర్చే ప్రయోజనాలు గురించి సవివరంగా వెల్లడించింది.ఆయుర్వేదంలో వేప చాలా ప్రభావవంతమైన మొటిమల నివారిణి.చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడంలో కీలకంగా ఉంటుందటఅలాగే బ్లాక్/వైట్ హెడ్స్ని నివారిస్తుంది.దీనిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా, హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుందట. దద్దుర్లు, కాలిన గాయాల తాలుకా ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ముఖ్యంగా తేలికపాటి చర్మ సమస్యలను సమూలంగా నివారిస్తుందని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. మరిన్ని వివారాలను వ్యక్తిగత వైద్య నిపుణలను సంప్రదించి అనుసరించడం ఉత్తమం. -
నాజూకు నడుము కోసం మరీ ఇలానా..!
వెర్రి వెయ్యి రకాలంటే ఇదేనేమో. ఇటీవల కాలంలో అందం పిచ్చి మాములుగా లేదు. అందుకోసం ప్రాణాలే సంకటంలో పడేసే పనులు చూస్తే ఏం మనుషుల్రా బాబు అనిపిస్తుంది. అచ్చం అలాంటి భయానకమైన పనే చేసేంది ఓ ట్రాన్స్ విమెన్. ఆమె చేసిన పని తెలిస్తే.. అందం కోసం మరీ ఇంతకు తెగించాలా అని చిరాకుపడుతున్నారు నెటిజన్లు. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..అమెరికాకు చెందిన 27 ఏళ్ల ట్రాన్స్ మహిళ(Trans Woman) ఎమిలీ జేమ్స్(Emily James) నడుము నాజూగ్గా ఉండాలని పక్కటెముకలు(Ribs) తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. అందుకోసం ఏకంగా రూ. 1 లక్షలు ఖర్చు పెట్టి మరీ సర్జరీ చేయించుకుంది. దీని కారణంగా వర్ణనాతీతమైన బాధను కూడా అనుభవించింది. ఇలా ఎముకలు తొలగించుకోవడం వల్ల విపరీతమైన వాపు వచ్చి కార్సెట్(బెల్ట్)ను ధరించాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటుంది. అంతేగాదు తనకు ఈ ఆపరేషన్ చేసిన వైద్యులు, నర్సుల బృందానికి ధన్యవాదాలు చెప్పినట్లు తెలిపింది. అలాగే తొలగించిన పక్కటెముకలను వైద్యులు తనకే ఇచ్చేసినట్లు పేర్కొంది. పైగా వాటిని కిరీటం(crown) కింద ఎవరైన తయారు చేస్తే బాగుండనని అంటోంది. అంతేగాదు దాన్ని తన ప్రాణ స్నేహితుడికి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నట్లు కూడా చెప్పింది. తాను బార్బెక్యూలా అందంగా కనిపించాలని గత మూడు రోజుల క్రితం రెండు వైపులా పక్కటెముకలు తొలగించుకున్నానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో నెటిజన్లు అందం కోసం మరి ఇలానా అంటూ తిట్టిపోయగా, మరికొందరూ ఆ ఎముకలను ఏం చేస్తావంటూ వెటకారంగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.గతంలో ఇలానే అందం కోసం చేయించుకున్న కాస్మెటిక్ సర్జరీల కారణంగా చాలామంది మోడల్స్, స్టార్లు అనారోగ్యం పాలవ్వడం లేదా వికటించి బాధలు పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. అయినా ఈ గ్లామర్ పిచ్చి జనాలకు తగ్గడం లేదు ఎందుకనో..?. నిజానికి ఆరోగ్యానికి మించిన అందం ఇంకేమైనా ఉందా..! అని ఆలోచించండి ప్లీజ్..!.(చదవండి: అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!) -
అలనాటి రాణుల బ్యూటీ సీక్రెట్ తెలిస్తే కంగుతింటారు..!
మెరిసే గ్లాస్స్కిన్ కోసం కే బ్యూటీ అంటూ రకరకలా బ్యూటీ ప్రొడక్ట్లు, సౌందర్య చిట్కాలు కోకొల్లలుగా వచ్చేస్తున్నాయి. అవన్నీ ఎలా ఉన్నా పూర్వకాలంలో కొందరు ప్రసిద్ధ రాణుల అందాల గరించి కవులు వర్ణించి చెప్పినట్లు కథకథలగా విన్నాం. అయితే ఆ రాణులు(Queens) ఆ కాలంలోనే తమ అందం కోసం ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవారో వింటే విస్తుపోతారు. అందుకోసం ఎలాంటి వాటిని సౌందర్య సాధనాలు(Beauty Secret)గా ఉపయోగించారో వింటో వామ్మో..! అని నోరెళ్లబెడతారు.క్లియోపాత్రా గాడిద పాలతో స్నానం..ఈజిప్ట్ టోలెమిక రాజ్యం రాణి క్లియోపాత్రా(Cleopatra) చర్మ సంరక్షణ కోసం గాడిద పాలతో స్నానం చేసేదట. అందుకోసం రోజు సేవకులు బిందెల కొద్ది గాడిద పాలను పితికి రెడి చేసేవారట. అవి విరిగిపోయాక వాటితో స్నానం చేసేదట. అందుకోసం దాదాపు 700 గాడిద పాలను వినియోగించేవారట. రోజంతో గాడిద పాల బాత్తో మునిగిపోయేదట. ఎలిసబెత్..దూడ మాంసం మాస్క్.. 'సిసి' అని పిలిచే ఆస్ట్రియా సామ్రాజ్ఞి ఎలిసబెత్(Elisabeth) 19 శతాబ్దంలో అందానికి ప్రసిద్ధి చెందిన రాణి. ఆమె మచ్చలేని తెల్లటి పింగాణీలా మెరిసే చర్మం కోసం స్ట్రాబెర్రీల ప్యాక్ ముఖానికి రాసేదట. అలాగే చర్మ ఆరోగ్యం కోసం ఆలివ్ నూనెతో స్నానాలు చేసేదట. ముఖ్యం కాంతిగా కనిపించాలని దూడ చర్మాన్ని మాస్క్గా వేసుకుని నిద్రించేదట. ఇక ఆమె వొత్తైన జుట్టు గురించి కథలుకథలుగా చెప్పుకునేవారట. ప్రతి మూడు వారాలకొకసారి పచ్చి గుడ్లు, బ్రాందీల మిశ్రమాన్ని అప్లై చేసుకునేదట. అది ఆరిపోయే వరకు మారథాన్లా వాక్ చేస్తూ ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. మేరీ ఆంటోయినెట్: పావురాలు ఉడికించిన నీళ్లు..ఫ్రాన్స్ రాణి మేరీ ఆంటోయినెట్(Marie Antoinette) అందం కోసం ఎన్నో విలక్షణమైన సౌందర్య సాధనాలను ఉపయోగించేది. ఆమె ముఖాన్ని యూ కాస్మెటిక్ డి పిజియన్తో కడుక్కునేదట. ఇది పండ్ల రసం, పూల సారం, మూడు ఫ్రెంచ్ రోల్స్, బోరాక్స్, 17 రోజల పాటు ఉడికించి పులియబెట్టిన ఎనిమిది పావురాల మిశ్రమం అట.ఎలిజబెత్ I: అత్యంత విషపూరితమైన సీసం..క్వీన్ ఎలిజబెత్ I(Elizabeth I) పాలనలో "వెనీషియన్ సెరూస్" అనే సీసాన్ని సౌందర్య సాధనంగా ఉపయోగించేవారట. ఈ సీసం(Lead), వెనిగర్ల మిశ్రమాన్ని తెల్లటి కాంతి వంతమైన రంగు కోసం చర్మానికి పూసేవారట. ఇవి చికెన్పాక్స్(తట్టు, అమ్మవారు) వంటి చర్మవ్యాధుల తాలుకా మచ్చలను నివారించి మచ్చలేని చర్మంలా ప్రకాశవంతంగా చేస్తుందట. అయితే ఈ రాణి చిన్నవయసులోనే అకాల మరణం చెందింది. అందుకు ఆమె ఉపయోగించిన ఈ సీసమే కారణమని అంటుంటారు. ఎందుకంటే లెడ్ సల్ఫైడ్(సీసం) ఖనిజ రూపమైన బ్లాక్ పౌడరే ఈ వెనీషియన్ సెరూస్. ఇది ముఖానికి పూస్తే లేత గులాబీ రంగు ఛాయతో మెరుస్తుంటుందట. అంతేగాదు కళ్లు చక్కగా కనిపించేలా ఐలైనర్లాగా కూడా వాడేవరట. అయితే ఇందులో ఉండే సీసం అత్యంత హానికరమైనది. ఇది అనారోగ్యం బారినపడేలా చేసి మరణానికి కారణమవుతుందంటూ ప్రస్తుతం బ్యాన్ చేశారు అధికారులు. (చదవండి: ఆ థెరపీ పేరెంట్స్ని అర్థం చేసుకోవడానికి సహాయపడింది..!: ఇరాఖాన్) -
అందానికి ఏఐ టచ్!
రమ్య తన పొడి చర్మానికి తగిన సౌందర్య ఉత్పత్తుల కోసం ఆన్లైన్లో వెతుకుతోంది. ఒక కంపెనీ వెబ్సైట్లోని టూల్ ఆకట్టుకుంది. రకరకాల యాంగిల్స్లో సెల్ఫిలను క్యాప్చర్ చేసి పంపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో ఆమె ముఖాన్ని విశ్లేషించి తగిన ప్రోడక్టులను సిఫార్సు చేయడం.. వాటిని కొనుగోలు చేయడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ కాస్మెటిక్స్ బాగా పనిచేయడంతో చాన్నాళ్లుగా వెంటాడుతున్న తన సమస్యకు పరిష్కారం లభించింది. సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ (బీపీసీ) రంగంలో టెక్నాలజీ కొత్త పుంతలకు ఇది ఓ మచ్చుతునక మాత్రమే!బ్యూటీ, పర్సనల్ కేర్ రంగంలో ఇప్పుడు హైపర్ పర్సనలైజేషన్ గేమ్ చేంజర్గా మారుతోంది. చర్మ స్వభావానికి అనుగుణంగా వ్యక్తిగత ప్రొడక్టుల వాడకానికి డిమాండ్ జోరందుకోవడంతో కంపెనీలు ఏఐ, మెషీన్ లెర్నింగ్ ఇతరత్రా అధునాతన టెక్నాలజీల బాట పడుతున్నాయి. ఏఐతో అందానికి వన్నెలద్దుతున్నాయి. వినియోగదారులకు కూడా ఈ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ తెగ నచ్చేస్తుండటంతో పాటు మంచి ఫలితాలు కూడా ఇస్తున్నాయి. దీంతో బ్యూటీ బ్రాండ్స్లో స్టార్టప్లు మొదలు.. ఇప్పటికే బాగా పాతుకుపోయిన పెద్ద కంపెనీలు సైతం ఏఐ మంత్రాన్ని జపిస్తున్నాయి. ఎవరైనా సరే తమ సెల్ఫిలను తీసి పంపితే చాలు.. ఏఐ మోడల్ వాటిని ప్రాసెస్ చేసి, అత్యంత నిశితమైన సమస్యలను సైతం గుర్తిస్తుంది. చర్మం రకం, మొటిమలు, నలుపు మచ్చలు, రంగు మారడం, పొడిబారడం, ఎగుడుదిగుడు చర్మం, ముడతలు, గుంతలను గుర్తించి, రియల్ టైమ్లో వ్యక్తిగతంగా సరైన సిఫార్సులు అందిస్తుంది.డేటా ఎనలిటిక్స్ దన్ను... బ్యూటీ స్టార్టప్లు గత రెండు మూడేళ్లుగా వినియోగదారుల నుంచి పెద్ద మొత్తంలో సేకరించిన డేటా ఆధారంగా ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోగలుగుతున్నాయి. వేలాది మంది వ్యక్తిగత డేటాలోని అంశాలను విశ్లేషించి యూజర్లను పొడి చర్మం, పిగ్మెంటెడ్ స్కిన్, మొటిమలు, జిడ్డు చర్మం వంటి వివిధ విభాగాలుగా విభజిస్తున్నాయి. ఆపై ఏఐ టెక్నాలజీ పని మొదలుపెడుతుంది. వినియోగదారులు పంపించే తాజా ఫేస్ ఇమేజ్లను ఇప్పటికే గుర్తించి, విభజించిన లక్షణాల ఆధారంగా సరిపోల్చడం ద్వారా వారి చర్మ స్వభావాన్ని అంచనా వేస్తుంది. ఈ ప్రక్రియతో బ్యూటీ కంపెనీలు ఒక్క చర్మాన్ని మాత్రమే కాకుండా పెదాలు, శిరోజాలను కూడా విశ్లేషించి, తదనుగుణంగా ఉత్పత్తులను సూచిస్తున్నాయి. ఉదాహరణకు, ట్రాయా, రావెల్ వంటి హెయిర్ కేర్ స్టార్టప్లు క్విక్ ఆన్లైన్ సర్వే నిర్వహించి, మెషీన్ లెరి్నంగ్ ద్వారా ఎవరికి ఎలాంటి పదార్థాలతో కూడిన ప్రొడక్టు అవసరమనేది కొద్ది నిమిషాల్లోనే సిఫార్పు చేస్తుండడం విశేషం!స్మార్ట్ టూల్స్..ఆన్లైన్ బ్యూటీ స్టోర్ పర్పుల్.. సొంతంగా పర్పుల్ స్కిన్ ఎనలైజర్ అనే ఏఐ ఇమేజ్ రికగి్నషన్ టూల్ను అభివృద్ధి చేసింది. ఇది యూజర్ల చర్మాన్ని రియల్ టైమ్లో విశ్లేషిస్తుంది. ఆపై దీని స్మార్ట్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) టూల్ మెషీన్ లెర్నింగ్ను ఉపయోగించి హైపర్ పర్సనలైజ్డ్ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుందని సంస్థ ఇంజినీరింగ్ హెడ్ వివేక్ పరిహార్ చెబుతున్నారు. ఇక లోరియల్ ప్రొడక్టులను విక్రయించే నైకా కూడా అధునాతన ఏఐ ఆధారిత వర్చువల్ టెక్నాలజీ ‘మోడిఫేస్’ను ఉపయోస్తోంది. వినియోగదారులు ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్) అనుభవం ద్వారా తమకు సరిపడే ప్రొడక్టులను ఎంచుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ దాదాపు 88 శాతం ఖచ్చితత్వంతో ఫేస్ ఆకారం, స్కిన్ టోన్, శిరోజాల రంగుతో సహా అనేక అంశాలను గుర్తించగలదు. అడ్వాన్స్డ్ డిజిటల్ ఫీచర్లు కస్టమర్లతో మరింతగా అనుసంధానమయ్యేందుకు, వారికి మరింత ప్రభావవంతమైన, ఆహ్లాదకరమైన షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు దోహదం చేస్తున్నాయని బ్యూటీ స్టార్టప్ షుగర్ కాస్మెటిక్స్ సీఈఓ వినీతా సింగ్ పేర్కొన్నారు. ‘యూజర్ల కొనుగోలు హిస్టరీ ఆధారంగా సిఫార్సులు చేసేందుకు మెషీన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ఉపయోగపడుతున్నాయి. ఫేస్ ఫౌండేషన్ కొన్న వారు మస్కారాను కూడా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది’ అని కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జాస్మిన్ గోహిల్ పేర్కొన్నారు.ఫీడ్ బ్యాక్, సందేహాలు, డెలివరీలోనూ...కస్టమర్ల ఫీడ్బ్యాక్, సందేహాలు, లాజిస్టిక్స్, వేర్హౌసింగ్ వంటి అన్ని దశల్లోనూ టెక్నాలజీ అక్కరకొస్తోంది. యూజర్ల సందేహాలను మరింత సమర్థవంతంగా విభజించి, విశ్లేషించేందుకు పెప్ బ్రాండ్స్ క్యాప్చర్ అనే ఏఐ ఆధారిత టూల్ను ఉపయోగిస్తోంది. అలాగే సెల్ఫ్ లెర్నింగ్ బ్యూటీ డిక్షనరీతో కూడిన సెర్చ్ ఇంజిన్ను పర్పుల్ అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని జీపీటీ ఆధారిత టూల్ వల్ల యూజర్లు సెర్చ్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా స్పెల్లింగ్ కరెక్ట్ చేయడం వంటివి చేస్తుంది. ఇక చాలా మందికి ఇంగ్లిష్లో తమ సందేహాలు చెప్పడం పెద్ద సమస్య. వారికోసం పర్పుల్ స్థానిక భాషలో సెర్చ్ను కూడా ప్రవేశపెట్టింది. యూజర్లకు వీలైనంత త్వరగా డెలివరీ చేసేందుకు సరైన వేర్హౌస్, రవాణా సంస్థలను ఎంచుకోవడంలోనూ స్టార్టప్లకు ఏఐ, ఎంఎల్ టూల్స్ తోడ్పడుతున్నాయి. 34 బిలియన్ డాలర్లు 2028 నాటికి భారత బ్యూటీ, పర్సనల్ కేర్ మార్కెట్ విలువ అంచనా. 25శాతంఆన్లైన్ ద్వారా సౌందర్య ఉత్పత్తుల అమ్మకాల వార్షిక వృద్ధి అంచనా (ఆఫ్లైన్ స్టోర్లలో 14 శాతమే).– సాక్షి, బిజినెస్డెస్క్ -
ఇలాంటి మేకప్ నైపుణ్యం ఉంటే ఏ వధువైనా అదుర్స్..!
మేకప్ అనగానే వేసుకున్నప్పుడూ అతిలోక సుందరిలా..తీసేశాక ఆమెనా అన్నంత సందేహం వస్తుంది. ముఖ్యంగా కలర్ తక్కువగా ఉండే వాళ్ల గురించి ఇక చెప్పాల్సిన పని లేదు. అందుకే చామనఛాయా ఉన్న చాలమంది వధువులు, కాస్త రంగు తక్కువగా ఉన్నవారు మేకప్ వేసుకునేందుకు సుముఖత చూపించరు. ఎందుకంటే మేకప్ తర్వాత వాళ్ల లుక్ మారిపోతుంది. దీంతో ఇబ్బందిగా ఫీలవుతుంటారు. అదే తమ రంగుకి అనుగుణమైన మేకప్తో అందంగా కనిపించేలా చేస్తే ఆత్మవిశ్వాసంగా, నిండుగా ఉంటుంది. అలాంటి మేకప్ నైపుణ్యంతో ఇక్కడొక కళాకారిణి అందరి హృదయాలను దోచుకుంటోంది. ఎవ్వరైనా ఆమె మేకప్ నైపుణ్యతకు ఫిదా అయిపోతారు. ఇంతకీ ఎవరంటే ఆమె..!చెన్నై(Chennai)కి చెందిన మేకప్ ఆర్టిస్ట్(makeup artist) నిర్మలా మోహన్ స్కిన్ టోన్కు సరిపోయే మేకప్లతో ఆకట్టుకుట్టోంది. రంగు తక్కువగా ఉన్నా కూడా ఇనుమడింప చేసే మేకప్తో అందంగా కనిపించేలా చేస్తోంది. అందానికి అసలైన నిర్వచనం చెప్పేలా మేకప్ నైపుణ్యంతో ఫిదా చేస్తోంది. చర్మం కలర్(skin colour) నలుపుగా ఉన్నవాళ్లని తెల్లగా కనిపించేలా మేకప్ వేస్తారు చాలామంది. ఆ తర్వాత అసలు రంగు ఇదా అని ముఖం మీదే అనడంతో కలర్ తక్కువగా ఉండే అమ్మాయిలు మేకప్ వేసుకునేందుకు భయపడుతున్నారు. అలా కాకుండా వారి రంగుకి సరిపోయే మేకప్తో వాళ్ల చర్మం రంగులోనే మరింత అందంగా కనిపించేలా తీర్చిదిద్దితుంది నిర్మల. ఇదే ఆమె బ్యూటీ ట్రిక్కు. అందుకు సంబంధించిన వీడియోలను ఇన్స్టాలో షేర్ చేయడంతో అందరూ ఆమె కళా నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) ఇలా రంగు తక్కువగా ముదురు గోధుమ రంగులో ఉండే వాళ్ల స్కిన్ టోన్కి అనుగుణమైన రంగులోనే కాంతిమంతంగా కనిపించేలా చేస్తే.. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపినవాళ్లం అవుతాం. వారి ముఖాలు కూడా కాంతిగా వెలుగుతాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి వాళ్లకు వైట్ వాష్ చేయకూడదు. మేకప్ వేస్తేనే అందం లేదంటే చూడలేం అన్నట్లు ఉండకూడదు. సహజ సౌందర్యం ఉట్టిపడేలా తీర్చిదిద్దే మేకపే అమ్మాయిలకు గౌరవంగా ఉంటుందని అంటోంది నిర్మల. దీంతో వాళ్లు మునుపటి రూపాన్ని చూపించేందుకు వెనడుగు వేయరని నమ్మకంగా చెబుతోంది. View this post on Instagram A post shared by Nirmala Mohan 💃🏻 (@nirmala_makeupartistry) (చదవండి: తల్లే కూతురు పెళ్లిని ఆపేసింది..! ట్విస్ట్ ఏంటంటే..) -
జుట్టు రాలిపోతోందా? డోంట్ వర్రీ..టీ వాటర్తో ఇలా చేస్తే..!
Tea Water for Hair: జుట్టు రాలడం చాలా సహజమైనదే. అయితే ఎప్పడికప్పుడు కొత్త జుట్టు వస్తూ ఉంటుంది. జుట్టు రాలిన విషయంమనకు తెలియకుండానే ఈప్రక్రియ జరిగిపోతుంది.అయితే అకారణంగా, చాలా ఎక్కువగా జుట్టురాలిపోవడం ఆందోలన కలిగించే అంశం. ఇది అన్ని వయసుల వారిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. దీనిని ఎదుర్కోవడానికి లెక్కలేనన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన పద్ధతులను ఎంచుకోవడం మంచిది. అలాంటి వాటిట్లో ఒకటి టీ నీటితో జుట్టును కడగడం. యాంటీఆక్సిడెంట్లు , పోషకాలతో సమృద్ధిగా ఉన్న టీ, జుట్టును బలోపేతం చేస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మాడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరి దీని తయారీ, ఎలా ఉపయోగించాలో చూద్దాం.టీ వాటర్ ఎలా తయారు చేయాలిహెయిర్ వాష్ కోసం టీ వాటర్ ను తయారు చేయడం చాలా సులభంకావాల్సిన పదార్థాలు:2–3 టీ బ్యాగులు (బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ)2–3 కప్పుల నీరుకావాలంటే ఇందులో లావెండర్ లేదా రోజ్మేరీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు. ఎలా తయారు చేయాలి? ఎలావాడాలి?నీటిని మరిగించి, అందులో టీ బ్యాగులను 5–10 నిమిషాలు నానబెట్టాలి.ఇందులో కొద్దిగా లావెండర్, రోజ్మేరీ ఆయిల్ చుక్కలు కలపాలి.చల్లారిన తరువాత టీ నీటిని శుభ్రమైన స్ప్రే బాటిల్ లేదా కంటైనర్లో పోసుకోవాలి.ఇపుడు తేలికపాటి, సల్ఫేట్ లేని షాంపూతో జుట్టును శుభ్రంగా వాష్ చేయాలి.షాంపూ చేసిన తర్వాత జుట్టుంతా తడిచేలా స్ప్రే చేయాలి. తర్వాత 5–10 నిమిషాలు పాటు చేతులతో సున్నితంగా మసాజ్ చేయాలి.15-20 నిమిషాలు పాటు ఉంచుకుని సాధారణ నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి.ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోప్రయోజనాలు జుట్టు సిల్కీగాఅవుతుంది. కొత్త మెరుపువస్తుంది. జుట్టు రాలడం తగ్గుతుంది, యాంటీఆక్సిడెంట్లు ,కెఫిన్ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడం తగ్గుతుంది.మాడు ఆరోగ్యానికి కూడా మంచిది. చుండ్రు, దురద లాంటి సమస్యలు తగ్గుతాయి. టీ వాటర్ జుట్టు క్యూటికల్ను మూసివేస్తుంది.కెఫిన్ కారణంగా రక్త ప్రసరణ బాగా జరిగిన జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. హెయిర్ ఫోలికల్స్ ను ఉత్తేజపరిచి, జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.డైహైడ్రోటెస్టోస్టెరాన్ హార్మోన్ జుట్టు రాలడానికి కారణమవుతుంది. ఇది ఈ హార్మోన్ల ప్రభావాలను తగ్గించి జుట్టు రాలడాన్ని నిరోధించే సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. కనుక ఈ ప్రక్రియ చాలామంచిది. జుట్టు చిట్లడం అనే సమస్యను కూడా దూరం చేస్తాయి.ఇదీ చదవండి : Sankranti 2025: పండక కళ, పేస్ గ్లో కోసం ఇలా చేయండి! -
Sankranti 2025: పండక కళ, ఫేస్ గ్లో కోసం ఇలా చేయండి!
సంబరాల సంక్రాంతి సందడి సమీపిస్తోంది. ఏడాదిలో తొలి పండుగ సంక్రాంతి అంటే చాలా హడావిడి ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాలు ఘనంగా నిర్వహించుకుంటారు. ముఖ్యంగా తెలుగువారిలో మరింత సందడి ఉంటుంది. పిండివంటలు, షాపింగ్లు కాదు అందంగా కనిపించడం అమ్మాయిలకు అందరికీ ఇష్టం. కెమికల్స్తో నిండిన బ్యూటీ ఉత్పత్తులు కాకుండా, సహజంగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసి కాంతివంతంగా మార్చడంతో పాటు కొన్ని సంరక్షణా టిప్స్ తెలుసుకుందాం.పండగ సందర్బంగా ముఖంమెరిసిపోవాలంటే.. ఇంట్లోనే దొరికే కొన్ని రకాల పదార్థాలో బ్యూటీ ప్యాక్స్ను తయారు చేసుకోవచ్చు. అలాగే ప్యాక్కు ముందు ముఖారికి ఆవిరి పట్టడం వలన మృత కణాలు తొలిగి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి. దీంతో మనం వేసుకున్న ప్యాక్ పోషకాలు అంది ముఖం మరింత అందంగా, షైనీగా ఉంటుంది.పొటాటో ప్యాక్ఒక చిన్న బంగాళదుంప (Potato) తీసుకుని శుభ్రంగా కడిగి తొక్క తీసి, చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి ,పల్చటి క్లాత్తో వడకట్టి రసం తీసుకోవాలి. ఈ రసంలో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి(Rice Flour) కొద్ది పెరుగు,(Curd) కొద్దిగా బాదం ఆయిల్ వేసిన అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి కొంచెం మందంగా అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో నల్లమచ్చలు తొలిగి ఫేస్ అందంగా కనిపిస్తుంది.శనగ పిండి ప్యాక్రెండు స్పూన్ల శనగపిండి, కొద్దిగా పసుపు, రోజ్ వాటర్, పాల మీగడ, తేనె కలిపి మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని ఆవిరిపట్టి చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తర్వాత ఈ ప్యాక్ అప్లై చేయాలి. ఆరిన తరువాత మృదువుగా పిండిని తొలగిస్తూ, శుభ్రంగా కడుక్కోవాలి. ఇన్స్టంట్ గ్లో వస్తుంది. అలాగే వారానికి రెండు, మూడు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీన్ని తలస్నానం చేసేముందు నలుగు పెట్టుకుంటే ముఖంతో పాటు చర్మానికి కూడా రాస్తే చాలా మంచిది. (కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?)కాఫీ పౌడర్కాఫీ పౌడర్, కొద్దిగా చక్కెర, నిమ్మరసం వేసి ముఖానికి అప్లయ్ చేయాలి. ఆరిన తరువాత శుభ్రంగా కడిగేసుకోవాలి. దీన్ని చేతులు, ముంచేతులు, మెడమీద కూడా రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆవిరి పట్టడం: వేడినీళ్లలో కాసిన్ని పుదీనా ఆకులు, తులసి, వేపాకులు, పసుపు వేసి ముఖమంతా చెమటలు పట్టేదాకా ఆవిరి పడితే చర్మం బాగా శుభ్రపడుతుంది. చర్మం రంధ్రాలు ఓపెన్ అవుతాయి. ఇదీ చదవండి: మాయదారి గుండెపోటు : చిన్నారి ‘గుండెల్ని’ పిండేస్తున్న వీడియోదోసకాయ నీటితో ఆవిరిదోసకాయ ముక్కలను మరుగుతున్న నీటిలో వేయాలి. నీరు బాగా మరిగిన తరువాత ఈ నీటిలో కొన్ని చుక్కల లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఇందులో ఒక గ్రీన్ టీ బ్యాగ్ కూడా వేయచ్చు. దీని నుండి వచ్చే ఆవిరి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. నూనె, దుమ్ము, ధూళి కారణంగా మూసుకుపోయిన ముఖ చర్మ రంధ్రాలు క్లియర్ అవుతాయి.నిమ్మకాయమరుగుతున్న నీటిలో కొద్దిగా నిమ్మరసం, గ్రీన్ టీ బ్యాగ్ లేదా టీ ఆకులు వేయాలి. నీటిని దించాక దీంట్లో కొన్ని చుక్కల పిప్పరమెంట్ ఎసెన్షియల్ ఆయిల్ వేయాలి. ఈ ఆవిరిని ముఖానికి పట్టడం వల్ల ముఖ చర్మం మెరుస్తుంది. చర్మం మీద ఉన్న మృత కణాలు, మురికి క్లీన్ అవుతాయి.మాయిశ్చరైజర్గా బాదం నూనెచలికాలం చర్మం పొడిబారడం సహజంగా జరుగుతుంటుంది కాబట్టి నూనె శాతం ఎక్కువ ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి.∙బాదం నూనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. స్నానానికి ముందు టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసి, మసాజ్ చేయాలి. పొడిబారే చర్మం మృదువుగా తయారవుతుంది. టీ స్పూన్ బాదాం నూనెలో అర టీ స్పూన్ పంచదార కలిపి ముఖానికి రాసి మృదువుగా మర్దన చేయాలి. తర్వాత పెసరపిండిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారదు. -
వింటర్ కేర్ : పాదాల పగుళ్లకు స్ప్రే
చలికాలంలో చర్మ సమస్యలు సాధారణం. వీటిలో పాదాల పగుళ్లు, ట్యాన్, తిమ్మిర్లు,పాదాల నుంచి వేడి ఆవిర్లు కమ్మినట్లు అనిపించడం వంటివి ఎదుర్కొంటూ ఉంటాం. ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పాదాలచర్మాన్ని కాపాడుకోవచ్చు.మృదువుగానూ మార్చుకోవచ్చు.తిమ్మిర్లు తగ్గడానికి...∙ఈ కాలం ఎక్కువసేపు కుర్చీ, సోఫాలో కూర్చునే వారికి తిమ్మిర్ల సమస్య ఎక్కువ. అలాంటప్పుడు గ్లాసు వేడినీళ్లలో స్పూన్ వెనిగర్ కలిపి, దానిలో దూదిముంచి, దాంతో రెండు పాదాలు పూర్తిగా తుడవాలి. దీనివల్ల తిమ్మిర్లు,పాదాల చర్మం ΄÷డిబారడం వంటి సమస్యలు తగ్గుతాయి. కాటన్ సాక్సులు వేసుకుంటే కాళ్ల తిమ్మిర్లు తగ్గుతాయి.పగుళ్ల నివారణకు...పాదాల చర్మం భరించగలిగేంత వేడినీటిలో రాళ్ల ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉంచి తీయాలి. స్పూన్ అలోవెరా జెల్, స్పూన్ గ్లిజరిన్, విటమిన్ – ఇ క్యాప్సుల్, కొంచెం రాక్ సాల్ట్... ఇవన్నీ బాగా కలపాలి. పాదాల పగుళ్లుపైన ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. తర్వాత పాలిథిన్ కవర్తోపాదం మొత్తం మూసేయాలి. 10 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత కవర్ తీసేయాలి. దీనివల్ల పాదాల వేడి, నెమ్మదిగా పగుళ్లు తగ్గుతాయి.ట్యాన్ ఏర్పడితే...∙చలికాలం క్రీములు, లోషన్లు పాదాలకు ఎక్కువ రాస్తుంటాం. బయటకు వెళ్లినప్పుడు దుమ్ము, ఎండవల్ల ట్యాన్ ఏర్పడుతుంది. ఈ సమస్య నివారణకు.. స్పూన్ టమోటా రసంలో స్పూన్ బంగాళ దుంప రసం, స్పూన్ వెనిగర్, శనగపిండి లేదా కాఫీ పొడి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్నిపాదాలకు అప్లై చేసి, పదిహేను నిమిషాలు ఉంచి, వాటర్ స్ప్రే చేసి, కాటన్ క్లాత్తో తుడిచేయాలి. వారానికి 2–3 సార్లు చేసుకుంటే ట్యాన్ తగ్గిపోతుంది.శుభ్రమైన గోళ్లుపాదాల గోళ్లు శుభ్రంగా ఉండాలంటే పెట్రోలియం జెల్లీని కొద్దిగా కరిగించి, దాంట్లో విటమిన్– ఇ క్యాప్సుల్, గ్లిజరిన్, రోజ్వాటర్ కలిపి రాత్రి పడుకునే ముందు గోళ్లచుట్టూ అప్లై చేయాలి. రోజూ ఇలా చేస్తుంటే గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.మృదువైన చర్మానికి...రోజ్వాటర్, రోజ్మెరీ ఆయిల్, నీమ్ ఆయిల్, అలోవెరా ఆయిల్ అన్నీ సమపాళ్లలో కలిపి స్ప్రే బాటిల్లో పోయాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పడుకునే ముందు పాదాలకు స్ప్రే చేయాలి. ఇలా చేస్తే పాదాల చర్మం మృదువుగా అవుతుంది. – సంతోష్ కుమారి, బ్యూటీషియన్ -
రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో కొరియన్ స్కిన్కేర్ & మేకప్ బ్రాండ్ ఎంట్రీ
సౌందర్య ప్రియులు,బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రముఖ కొరియన్ చర్మ సంరక్షణ మేకప్ సంచలనం టిర్టిర్( TIRTIR) ఇండియాలో లాంచ్ అయింది. రిలయన్స్ రిటైల్కు చెందిన టిరాతో కలిసి ఇది ఆఫ్లైన్ రిటైల్ మార్కెట్లో అరంగేట్రం చేసింది. భారతీయ బ్యూటి ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని రిలయన్స్ ప్రకటించింది. Tira స్టోర్లు, Tira యాప్ ద్వారా ఇది అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ సందర్బంగా కొనుగోలుదారులకు ఆఫర్లను కూడా అందిస్తోంది.ముఖ్యంగా మాస్క్ ఫిట్ రెడ్ కుషన్ ఫౌండేషన్,ఆకట్టుకునే 30 షేడ్స్తో తీసుకొచ్చింది. మిల్క్ స్కిన్ టోనర్, సిరామిక్ మిల్క్ ఆంపౌల్, మాస్క్ ఫిట్ మేకప్ ఫిక్సర్ లాంటి అద్భుతమైన ఉత్పత్తులను లాంచ్ చేసినట్టు కంపెనీ తెలిపింది.చర్మ సంరక్షణ-జాగ్రత్తలుఏ సీజన్లో అయినా చర్మ ఆరోగ్య సంరక్షణ చాలా అవసరం. చర్మాన్ని తేమగా ఉంచుకునేందుకు జాగ్రత్తలు పాటించాలి. తాజా పండ్లు, కూరగాయలతోపాటు సరిపడా నీళ్లు తాగాలి. చర్మ సంరక్షణకు హైడ్రేటింగా ఉండటం, రిఫ్రెషింగ్ చాలా కీలకం. చర్మం కాంతివంతంగా ప్రకాశించేలా ఉండాలంటే ఎండలో ఉన్నా, నీడలో ఉన్నా సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.దుమ్ముధూళికి దూరంగా ఉండాలి. కెమికల్స్ వాడని సహజమైన సౌందర్య ఉత్పత్తులను వినియోగించాలి. నాణ్యమైన బ్రాండ్లను ఎంచుకోవాలి.ఒత్తిడికి, ఆందోళనకు దూరంగా ఉండాలి. మ్యాకప్ విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే మరిన్ని సమస్యలొచ్చే ప్రమాదం ఉంది. బ్యూటీ నిపుణులు, స్కిన కేర్ వైద్య నిపుణుల సలహాల మేరకు ఉత్పత్తులను వాడాలి.ఎప్పటికపుడు మేకప్ను రిమూవ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం -
కురుల చివరలు చిట్లుతుంటే...
చలికాలం చర్మ ఆరోగ్యాన్నే కాదు శిరోజాల సహజత్వాన్ని కాపాడుకోవాలి. లేదంటే వెంట్రుకలు పొడిబారడం, చిట్లడం, చుండ్రు సమస్య తలెత్తడం వంటివి చూస్తుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగా... అలెవెరాతో కండిషనింగ్షాంపులు, కాలుష్యం, గాలిలో తేమ తగ్గడం.. వంటి వాటి వల్ల ఈ కాలంలో వెంట్రుకలు త్వరగా పొడిబారడం, చిట్లడం వంటివి సహజంగా జరుగుతుంటాయి. వీటి వల్ల జుట్టు నిస్తేజంగా కనిపిస్తుంది. రసాయనాల గాఢత తక్కువగా ఉండే షాంపూ(Shampooing:)తో తలస్నానం చేసిన తర్వాత అలోవెరా జెల్ను జుట్టుకు పట్టించాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి. అలోవెరా రసం జుట్టుకు కావలసినంత కండిషన్(Conditioning) లభించేలా చేస్తుంది. ఉసిరితో మృదుత్వంఉసిరి, మందారపువ్వులు మరిగించిన కొబ్బరినూనెతో మాడుకు, వెంట్రుక లకు రాసి, మర్దనా చేయాలి. మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఈ విధంగా చేస్తే వెంట్రుకలు చిట్లడం(Hair Damage) సమస్య తగ్గుతుంది. కురుల మృదుత్వం పెరుగుతుంది. తప్పనిసరిగా చేయాల్సినవి..జుట్టు(Hair)ను వేడి చేసే పరికరాలను ఉపయోగించకపోవడమే శ్రేయస్కరం. ఒకవేళ హెయిర్ డ్రైయర్స్, స్ట్రెయిట్నర్స్ వంటి హీటింగ్ పరికరాలను ఉపయోగించినా.. చాలా తక్కువ హీట్ తో ఉపయోగించండి. ఒకవేళ కచ్చితంగా వినియోగించాల్సి వస్తే.. మీరు ముందుగా హీట్ ప్రొటెక్టెంట్ స్ప్రేని ఉపయోగించవచ్చుతలస్నానం(Head Bath) రోజూ చేసే అలవాటు కొందరిలో కనిపిస్తుంది. కానీ, కనీసం మూడు రోజులకోసారి చేయడం బెటర్. జుట్టును ఆరోగ్యంగా ఉంచేందుకు సహజ నూనెలు అనేవి విడుదల అవుతుంటాయి. అందుకే కనీసం మూడు రోజులు మధ్యలో విరామం ఇవ్వడం వల్ల ఆ నూనెలు శిరోజాల రక్షణకు ఉపయోపడతాయి.శిరోజాల్లో తగినంత తేమ ఎప్పుడూ ఉండడం వల్ల అవి ఆరోగ్యంగా ఉంటాయి. మంచి కండిషనర్ ను స్వయంగా మనమే చేసుకోవచ్చు. గుడ్డు సొన, పెరుగు కలిపి కురుల మొదళ్లలో పట్టించాలి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.పొడిబారిన జుట్టు, దెబ్బతిన్న శిరోజాలకు బాదం నూనె చక్కగా పనిచేస్తుంది. ఓ పాత్రలో కొంచెం బాదం నూనె వేసుకుని, దాన్ని 40 సెకండ్ల పాటు వేడి చేయాలి. ఆ తర్వాత తల వెంట్రుకలకు రాసుకోవాలి. 30 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. చల్లటి నీటితోనే చేయాలి. అలాగే కండిషనర్ కుడా అప్లయ్ చేయాలి.అర కప్పు తేనె, రెండు చెంచాల ఆలివ్ ఆయిల్, రెండు చెంచాల గుడ్డులోని పచ్చసొన మిశ్రమాన్ని తల వెంట్రుకలకు పట్టించి 20 నిమిషాల పాటు అలా ఉంచేయాలి. ఆ తర్వాత వేడి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే కెరాటిన్ ప్రొటీన్ బాండ్స్ తిరిగి భర్తీ అవుతాయి.మహిళలు జుట్టుని గట్టిగా చుట్టేసి పెట్టడం చేస్తుంటారు. పెళుసుబారిన జుట్టు చిట్లిపోకుండా నివారించేందుకు జుట్టుని గట్టిగా ముడేయకుండా, ఎటువంటి బ్యాండ్లను పెట్టకుండా ఉండడమే బెటర్.వెంట్రుకల చివర్లో చిట్లకుండా ఉండేందుకు వెడల్పాటి పళ్లున్న దువ్వెనలను వాడాలి. తరచూ హెయిర్ స్టయిల్ చేయించుకోవద్దు. నైలాన్ బ్రిస్టల్స్ ఉన్న దువ్వెనలను వాడాలి. తగినంత నీరు తాగాలి. ఉల్లిగడ్డ రసం జుట్టురాలిపోయే సమస్యను నివారించడంతోపాటు, హెయిర్ ఫాలికుల్స్ కు రక్త సరఫరా జరిగేలా చూస్తుంది.పోషకాహార లోపం కారణంగా జుట్టు రాలిపోతుంటే అందుకు బీట్ రూట్ రసం చక్కని పరిష్కారంశిరోజాలు తిరిగి జీవం పోసుకోవడానికి, జుట్టు పెరుగుదల మెరుగుపడడానికి గ్రీన్ టీ మంచిగా తోడ్పడుతుంది. శరీరంలో జీవ క్రియలను గ్రీన్ టీ మెరుగు పరుస్తుంది.అరటి పండు గుజ్జుకు, కొంత తేనె, పాలు కలిపి వెంట్రుకలకు మాస్క్ లా వేసుకోవాలి. గంట తర్వాత కడిగేసుకోవాలి. మెంతులను పేస్ట్ లా చేసుకుని దాన్ని ప్యాక్ లా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత కడిగేయడం వల్ల సిల్క్ గా జుట్టు కనిపిస్తుంది.చివరగా జుట్టు ఆరోగ్యం(Healthy Hair) కోసం తప్పనిసరిగా ఫోలిక్ యాసిడ్, బయోటిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.(చదవండి: ఏం పెట్టారబ్బా ముగ్గు..? చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..!) -
వింటర్ ది డ్రాగన్: చలిపులి.. చర్మం వలుస్తోందా?
కొత్త ఏడాది తర్వాత క్రమక్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయేమోగానీ... అందరూ బయటే ఎక్కువసేపు గడిపే సాయంత్రాలూ, పనులకు వెళ్లే ఉదయం వేళల్లో చలి కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ సీజన్లో వీచే కరకుగాలులు వాతావరణం నుంచి తేమను లాగేస్తాయి. అవి చర్మం నుంచి కూడా తేమను లాగేస్తుండం వల్ల మేను పొడిబారుతుంది. పొట్టుగా రాలుతుంది. ఇలాంటి సమస్యలన్నీ ఈ సీజన్లో అనివార్యంగా కనిపిస్తుంటాయి. ఒక్కొక్కరి చర్మ స్వభావం ఒక్కోలా ఉండటం వల్ల కొందరిలో చలికాలపు సమస్యలు ఎక్కువగానూ, మరికొందరిలో తక్కువగానూ కనిపిస్తుంటాయి. ఈ చలి సమస్యల తీవ్రత చర్మంపై చాలా ఎక్కువగా ఉన్నవారిలో... వారి మేనిపై పగుళ్లు, చర్మం పొట్టుగా రాలడం వంటి లక్షణాలతో ఎక్జిమా తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సీజన్లో కనిపించే సమస్యల నుంచి రక్షణ పొందడమెలాగో తెలుసుకుందాం.కేవలం కొన్ని చిన్న చిన్న మార్పులతో చలికాలపు తీవ్రత నుంచి మిమ్మల్ని కాపాడుకోవచ్చు. అవి తెలుసుకునే ముందర ఈ కాలంలో వచ్చే కొన్ని సాధారణ చర్మ సమస్యలేమిటో చూద్దాం...ఇవీ సాధారణంగా కనిపించే చర్మ సమస్యలు... ఎక్జిమా ఫ్లేర్స్ : తక్కువ ఉష్ణోగ్రతల వల్ల చర్మం ప్రభావితమై ఎగ్జిమాలాంటి పగుళ్లు. చర్మం పొడిబారడం, పొట్టుగా రాలడం : బయటి చల్లగాలి కారణంగా దేహంలోని వేడిమి చర్మం నుంచి బయటకు వెళ్లడంతో తేమ కూడా బయటకు వెళ్తుంది. దాంతో చర్మం బాగా పొడిబారిపోవడమే కాకుండా, పొట్టుగా రాలుతుంది. పగిలే పెదవులు : సున్నితమైన పెదవుల చర్మమూ పగుళ్లువారుతుంది. చిల్ బ్లెయిన్స్ : చేతులూ, పాదాల మీద చర్మం కొన్నిచోట్ల (పగుళ్లు రాబోయే చోట) ఉబ్బెత్తుగా మారుతుంది. ఇలాంటి ఉబ్బెత్తు ప్రదేశాల్లో నొప్పి ఉంటుంది. వీటిని చిల్ బ్లెయిన్స్ అంటారు. వింటర్ యాక్నె : జిడ్డు చర్మం వల్లనే మొటిమలు ఎక్కువగా వస్తాయన్న భావన చాలామందిలో ఉంటుంది. దీనికి భిన్నంగా వాతావరణంలో చలి ఎక్కువగా ఉన్నప్పుడూ మొటిమలు వస్తాయి. వీటిని ‘వింటర్ యాక్నే’గా చెప్పవచ్చు.చర్మం ప్రభావితమైందని తెలిపే సూచనలివి... చలికాలపు చల్లగాలులకు చర్మం ప్రభావితమైనదనీ, దానికి ఇప్పుడు మరింత రక్షణాత్మక చర్యలు అవసరమని తెలియజేసేలక్షణాలివి... చర్మం ఎర్రబారడం, ఇలా ఎర్రబారిన చోట దురద రావడం ఏవైనా ఉపశమన చర్యలకోసం లేపనాల వంటివి రాసినప్పుడు ప్రభావితమైన చర్మభాగాలు మంటగా అనిపించడం చర్మం తీవ్రంగా పొడిబారినప్పుడు అక్కడ పొట్టులా రాలడం చర్మం నుంచి తేమ తొలగి΄ోవడంతో చర్మం బాగా బిగుతుగా ఉన్న ఫీలింగ్ ఏవైనా చర్మ సంరక్షణ లేపనాలు రాసినప్పుడు చర్మం ముట్టుకోనివ్వకపోవడం. చర్మంపై చలికాలపు దుష్ప్రభావాల నివారణ, రక్షణ చర్యలివి... తేమ పెరిగేలా చూసుకోవడం: చర్మం ఎప్పుడూ తేమ కోల్పోకుండా చూసుకునేందుకు క్రమం తప్పకుండా... హైలూరానిక్ యాసిడ్, షియా బటర్ లేదా సెరమైడ్స్ ఉండే మంచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. మరవకూడని సన్ స్క్రీన్ : చలికాలపు ఎండవేడిమిలోనూ అల్ట్రా వయొలెట్ కిరణాలు చర్మంపై ప్రభావం చూపుతాయి. అందుకే ఎండలోకి వెళ్లేముందర 30 ప్లస్ ఎస్పీఎఫ్ ఉన్న సన్స్క్రీన్ను చర్మంపై రాసుకోవడం మంచిది. హ్యుమిడిఫైయర్ వాడటం : గదిలోపల ఉండే పొడిదనాన్ని ఎదుర్కోవడం కోసం (మరీ ముఖ్యంగా బెడ్రూమ్ వంటి చోట్ల) క్రమం తప్పకుండా హ్యుమిడిఫైయర్ వాడాలి. గోరువెచ్చటి నీటితో స్నానం : వెచ్చటి నీళ్లతో స్నానం చేయడమన్నది స్నానం వేళ బాగున్నప్పటికీ ఆ తర్వాత చర్మం తీవ్రంగా పొడిబారి పగుళ్లుబారినట్లుంటుంది. దీనికి బదులు గోరువెచ్చటి నీళ్లతో స్నానం చేస్తే... స్నానం తర్వాత చర్మం బాగుంటుంది. గాఢమైన సౌందర్యసాధనాలు వద్దు చర్మంపై రాసుకునే ఉత్పాదనల్లో ఆల్కహాల్, రెటినాల్, మెంథాల్ వంటివి ఎక్కువ మోతాదుల్లో ఉన్నవి గానీ లేదా ఇతరత్రా గాఢమైన వాసనలు వచ్చే సౌందర్యసాధనాలకు బదులు తేలికపాటి సువాసన వెదజల్లే మైల్డ్ సౌందర్యసాధనాలు వాడుకోవడమే మంచిది. నీళ్లు తాగుతుండటం: చర్మం కోల్పోయే నీటి మోతాదులను మళ్లీ మళ్లీ భర్తీ చేసుకునేందుకు వీలుగా ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉండటం మంచిది. మేని నిగారింపును పెంచే ఆహారాలు తీసుకోవడం: మేని నిగారింపును మరింతగా పెంచే తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలతో కూడిన... అన్ని రకాల ΄ోషకాలూ పుష్కలంగా ఉండే సమతులాహారం తీసుకోవడం మేలు. వైద్యనిపుణులను సంప్రదించడం: పైన పేర్కొన్న అన్ని రకాల జాగ్రత్తలను తీసుకున్న తర్వాత కూడా చర్మంపై చలికాలపు దుష్ప్రభావాలు కనిపిస్తుంటే... తక్షణం చర్మవ్యాధి నిపుణులను సంప్రదించడం మంచిది. డా. బాల నాగ సింధూర కంభంపాటి, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్ (చదవండి: టేస్టీ బర్గర్ వెనుకున్న సీక్రెట్ తెలిస్తే కంగుతినడం ఖాయం..! ) -
చర్మం పొడిబారుతోందా..?
చలికాలం చర్మం పొడిబారే సమస్య అధికంగా ఉంటుంది. పొడిచర్మం గలవారికి ఇది మరింత సమస్య. నూనె శాతం ఎక్కువ ఉండే క్రీములు, లోషన్లు ఉపయోగిస్తే చర్మం మృదువుగా ఉంటుంది. అందుకు... ఇంట్లో చేసుకోదగిన సౌందర్యసాధనాలు..ఆలివ్ ఆయిల్తో... కోకోబటర్లో చర్మాన్ని మృదువుగా మార్చే మాయిశ్చరైజర్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. టేబుల్ స్పూన్ కోకోబటర్– ఆలివ్ ఆయిల్ కలిపి మిశ్రమం తయారు చేసుకోవాలి. ఇది ముఖానికి, మెడకు రాసి 15–20 నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.పాల మీగడమీగడలో ఉండే నూనె చర్మాన్ని పొడిబారనీయదు. తేనెలో చర్మసంరక్షణకు సహాయపడే ఔషధాలు ఉన్నాయి. మీగడ–తేనె కలిపి ముఖానికి, చేతులకు రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. రోజూ పాల మీగడ–తేనె కలిపిన మిశ్రమాన్ని ఉపయోగిస్తే చర్మకాంతి పెరుగుతుంది.బొప్పాయివిటమిన్–ఇ అందితే చర్మం త్వరగా మృదుత్వాన్ని కోల్పోదు. బాగా పండిన బొప్పాయి ముక్కను గుజ్జు చేసి, దాంట్లో పచ్చిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు, చేతులకు రాసి ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి.బాదం నూనెకోకో బటర్, బాదం నరి సమపాళ్లలో తీసుకొని కలిపి, మిశ్రమం తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లై చేయాలి. చర్మం పొడిబారే సమస్య దరిచేరదు. (చదవండి: గర్ల్ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దాం అనుకుంటే ప్రాణమే పోయింది) -
ఎర్ర కలబందతో ఎన్నో ప్రయోజనాలు : తెలిస్తే, అస్సలు వదలరు!
కలబంద ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పటివరకూ చాలా విన్నాం. తరతరాలుగా సౌందర్య పోషణలో,చర్మ సంరక్షణలో కూడా ఇది ప్రసిద్ధి చెందింది. ఈ కోవలోకి ఇపుడు మరో కొత్త రకం కలబంద వచ్చి చేరింది. అదే రెడ్ కలబంద. ఈ రెడ్ కలబంద ఇప్పుడు చర్మ సంరక్షణ మార్కెట్లోకి వేగంగా దూసుకొస్తోంది. ముదురు ఎరుపు రంగుకు ప్రసిద్ధి చెందిన ఈ రకంలో చర్మ ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.రెడ్ కలబంద ప్రయోజనాలు:ఆకుపచ్చ కలబందతో పోలిస్తే ఎరుపు రంగు కలబంద ఎక్కువ ఔషధ గుణాలు, ప్రయోజనాలున్నాయి. అందుకే ‘కింగ్ ఆఫ్ అలోవెరా’గా పేరు తెచ్చుకుంది. రెడ్ కలబంద వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.పోషకాలు: రెడ్ కలబందలో విటమిన్ ఎ (బీటా కెరోటిన్), విటమిన్ సి, ఇ, బి12, ఫోలిక్ యాసిడ్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షిస్తాయి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇది పెద్ద మొత్తంలో అమైనో ఆమ్లాలు, పాలిసాకరైడ్లను కలిగి ఉంటుంది. ఇది జుట్టు, చర్మం, కళ్ళకు ఒక వరంలాంటిదట.యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం: ఎరుపు కలబంద ఆంథోసైనిన్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా దాని రంగు ఎర్రగా ఉంటుందని ర్మవ్యాధి నిపుణుడు డాక్టర్ జుష్యా భాటియా సారిన్ చెప్పారు. పర్యావరణ ఒత్తిడి ప్రభావాలను తగ్గించడానికి ఎరుపు కలబంద ఫేస్ సీరం ఉపయోగపడుతుంది. దీనిలో ఉండే కొల్లాజెన్ చర్మం యవ్వనాన్ని కాపాడుతుంది. ఈ సమ్మేళనాలు కాలుష్యం, ఒత్తిడి, వృద్ధాప్యం వల్ల కలిగే నష్టం నుండి చర్మాన్ని రక్షించడంలో సహాయపడతాయని. ఎర్ర కలబంద యాంటీఆక్సిడెంట్లు, హైడ్రేటింగ్ మూలకాల శక్తివంతమైన మిశ్రమమని ఆమె తెలిపారు.రోగనిరోధక శక్తికి: ఎర్ర కలబంద రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది బాక్టీరియా, ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. జలుబు, దగ్గు సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి కూడా చక్కటి పరిష్కారం లభిస్తుంది.మేనికి మెరుపు : విటమిన్లు A, C , E చర్మాన్ని ప్రకాశవంతంగా, దృఢంగా మారుస్తుంది. దీని ఆధారిత మాయిశ్చరైజర్ చర్మం యొక్క సహజ మెరుపును కాపాడుతుంది. చర్మానికి చల్లదనాన్నిస్తుంది. ముఖంపై మచ్చలు, ముడతలు తొలగిపోతాయి. రెడ్ కలడంద జ్యూస్తో శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాలిన గాయాలు, గాయాలు, సోరియాసిస్ నివారణలో మేలు చేస్తుంది.గుండెకు మేలు : ఎర్ర కలబంద జ్యూస్తో గుండె ఆరోగ్యం బలపడుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. డయాబెటిస్ : రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. టైప్ 2 డయాబెటిస్లో పరిమిత రూపంలో దీని వినియోగం ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.ఈ జ్యూస్ తాగడం వల్ల పీరియడ్స్ రెగ్యులర్గా మారడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది ఎర్ర కలబందను జుట్టు మీద అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. దీంతో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. -
పిగ్మెంటేషన్ సమస్యా?!
చర్మంపై బ్లాక్ స్పాట్స్, మచ్చలు కనిపించడం అన్ని వయసుల వారిలోనూ వచ్చే సమస్యే. కానీ, ఇటీవల యువతలో ఈ సమస్యను ఎక్కువ చూస్తున్నాం. ఎవరిలో అధికం అంటే...అధిక బరువు ఉన్నవారిలో మెడపైన, వీపు పైన మచ్చలు కనిపిస్తుంటాయి. నేరుగా ఎండ బారిన పడేవారికి చేతులు, ముఖం, పాదాలపై ట్యాన్ ఏర్పడుతుంది. కొంతమందిలో విటమిన్ల లోపం వల్ల మంగు మచ్చలు కూడా వస్తున్నాయి. సాధారణంగా యుక్తవయసులో మొటిమలు వస్తుంటాయి. మొటిమలను గిల్లడం, వాటిలో ఉండే పస్ తీయడం.. వంటి వాటి వల్ల మచ్చలు, ఇంకొందరిలో చర్మంపై గుంటలు ఏర్పడవచ్చు. కొందరికి సరైన అవగాహన లేక బ్యూటీ ప్రొడక్ట్స్ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించడం వల్ల చర్మం దెబ్బతిని మచ్చలు ఏర్పడతాయి. ఇంకొందరిలో చర్మం రకరకాల ఇన్ఫెక్షన్లకు లోనవుతుంటుంది. నిర్లక్ష్యం చేస్తే మచ్చలు ఏర్పడి, అది దీర్ఘకాలిక సమస్యగా మారుతుంది.త్వరగా గుర్తించి...ముందుగానే సమస్యను గుర్తించి చికిత్స తీసుకుంటే ఇబ్బంది ఉండదు. థైరాయిడ్, ఒబేసిటీ, పీసీఓడీ సమస్యలు ఉంటే వాటికి చికిత్స తీసుకోవాలి. ఎండ నేరుగా తాకకుండా సన్ స్క్రీన్ వాడటం ముఖ్యం. వీటిలో బ్లూ లైట్ కాంపొనెంట్ ఉండే సన్స్క్రీన్స్ బెటర్.మంగు మచ్చలు వస్తున్నాయనుకునేవారు వారి వంశంలో ఈ సమస్య ఉంటే, ముందే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మొటిమలు, యాక్నె వంటి సమస్యలు ఉన్నప్పుడు వాటిని గిల్లకూడదు. పింపుల్స్ తగ్గే ఆయిట్మెంట్స్ను నిపుణుల సూచనల మేరకు వాడాలి. పింపుల్స్ ఉండేవారు పింపుల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఏజ్తోపాటు వస్తాయి అవే పోతాయి అనుకోకూడదు. ఒకసారి చెక్ చేసుకొని, చికిత్స తీసుకోవాలి. విటమిన్ బి12 లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి. క్యారట్, టొమాటో, విటమిన్– సి ఉన్న పండ్లు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఆన్లైన్లో చూసి, ఇష్టం వచ్చిన ప్రోడక్ట్స్ వాడకూడదు. అవి మీ చర్మతత్త్వానికి సరిపడతాయా లేదా అని చూడాలి. ఇంట్లో సౌందర్య లేపనాలను ఉపయోగిస్తూ, పార్లర్ ఫేసియల్స్ చేయకూడదు. ఏదైనా ఒకదాని మీద మాత్రమే ఆధారపడాలి. (చదవండి: సక్సెస్ని ఒడిసిపట్టడం అంటే ఇదే..!) -
షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!
గతేడాది బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ , ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసింది షాలిని పాసి. అందులో ఆమె చెప్పే అందమైన డైలాగులతో జెన్ జెడ్కి చేరువైందని చెప్పొచ్చు. అలాగే ఫాష్యన్ పరంగానూ ఆమెకి సాటిలేరెవ్వరూ అనేలా స్టైలిష్గా ఉంటుంది. ముఖ్యంగా ఆమె కురులు కాటుక నలుపులా మెరుస్తుంటాయి. ఈ రోజుల్లో అందరికి జుట్టు నెరిసిపోతుంటుంది. అలాంటిది ఈమె కురులు మాత్రం దృఢంగా కుచ్చులా ఉంటాయి. దీని వెనుకున్న సీక్రెట్ గురించి ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఆ అందమైన కురుల రహస్యం ఏంటంటే..షాలిని పాసీ ఖరీదైన షాంపులేమి ఉపయోగించదట. తన కురుల సంరక్షణ కోసం ఇంట్లో తయారు చేసిన షాంపూనే ఉపయోగిస్తుందట. జర్నీల సమయంలోనే బ్రాండెండ్ షాంపులు ఉపయోగిస్తుందట. ఆమె ఇంట్లోనే ఉసిరికాయ, కుంకుడుకాయలతో చేసిన షాంపూని ఉపయోగిస్తుంట. ఈ రెండింటిని వేడినీటిలో నానబెట్టి మిక్స్ చేస్తే సహజమైన షాంపూలాగా పనిచేస్తుందట. ఇది జుట్టుని చక్కగా శ్రుభపరచడమే గాక, దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఫంగల్ లక్షణాలు మలినాలు లేకుండా చేస్తుది. ఇది జుట్టు పెరుగదలను ప్రోత్సహించడమే గాక కుర్రులు నల్లగా నిగనిగలాడుతుండేలా చేస్తాయట. అలాగే తాను తరుచుగా జుట్టుకి కొబ్బరినూనె తప్ప ఏ ఇతర హెయిర్ ఉత్పత్తులు ఉపయోగించనని చెప్పారు. ఇది జుట్టు రాలు సమస్యని అరికడుతుందని తెలిపింది షాలిని. ఇంకెందుకు ఆలస్యం ఆమె చెప్పిన ఈ అమూల్యమైన చిట్కాలను ట్రై చేయండి మరీ..!.(చదవండి: సొట్ట బుగ్గల సుందరి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
వేడి నీళ్లతో ఫేస్ వాష్ చేసుకుంటే.. ఏమవుతుందో తెలుసా?
వేడి నీళ్లతో స్నానం చేస్తే హాయిగా ఉంటుంది. అలసట తీరుతుంది. ముఖ్యంగా చలికాలంలో వేడి నీటి (Hot water) స్నానం ఇంకా ఆహ్లాదంగా ఉంటుంది. అలాగే దుమ్ము ధూళితో నిండిపోయిన ముఖాన్ని (Face) వేడినీళ్లతో కడుక్కుంటే ప్రశాంతంగా ఉంటుంది. అయితే వేడి వేడి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందట. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుందట. వేడి నీరు మీ చర్మాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఏం చేయాలి? ఈ కథనంలో తెలుసుకుందాం.వేడి-నీరు అకాల వృద్ధాప్యం వేడి నీరు ప్రశాంతంగా అనిపించినప్పటికీ, ముఖ చర్మంపై తీరని ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నారు చర్మ వ్యాధి నిపుణులు. ఎలా అంటే.. మన శరీరంలోని మిగిలిన భాగాలతో పోలిస్తే ముఖం చర్మం భిన్నంగా ఉంటుంది. చాలా సున్నితంగా, చిన్న కేశనాళికలతో నిండి ఉంటుంది. ఉష్ణోగ్రత వంటి బాహ్య కారకాలకు తొందరగా ప్రభావితయ్యే ఉండే రంధ్రాలతో నిండి ఉంటుంది. వేడి నీరు అప్పటికపుడు ఊరటనిచ్చినా ఆ తరువాత అనేక సమస్యలను కలిగిస్తుంది అంటున్నారు.వేడి నీళ్లు ముఖంపై ఉండే సూక్ష్మకేశనాళికలకు హాని కలిగిస్తుంది. ఇరిటేషన్, చర్మం ఎర్రబారడం లాంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన చర్మం లేదా రోసేసియా వంటి పరిస్థితులు ఉన్నట్లయితే ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది.నేచురల్ ఆయిల్స్కు నష్టంవేడి నీటి వలన ముఖంపై ఉండే సహజ నూనెలకు హాని కలుగుతుంది. ఇవి సెబమ్ను ఉత్పత్తి చేసి, తేమను కాపాడుతుంది. మృదువుగా ఉంచుతుంది. కానీ వేడి నీరు ఈ నూనెలకు నష్టం కలిగించి మృదుత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. ముఖం మీద చర్మం తొందరగా ముడతలు పడేలా చేస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తి మందగిస్తుంది. దీంతో చర్మం సహజత్వాన్ని కోల్పోయి, ముడతలు తొందరగా వస్తాయి. ఫలితంగా వయసుకుమించి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అయితే వృద్ధాప్యం అనేది సహజమైన ప్రక్రియ. వయసు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్,ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గుతుంది. అతినీలలోహిత (UV) కిరణాలు కొల్లాజెన్ ఎలాస్టిన్ను విచ్ఛిన్నం చేస్తాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులు వంటి సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాలలో, ఎండలేకపోయినా కూడా చర్మాన్ని రక్షించు కునేందుకు సన్ స్క్రీన్ వాడాలి. ముఖాన్ని ఎల్లప్పుడూ గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. అలాగే మొహాన్ని పదే పదే కడగడం వల్ల మెరుపు తగ్గిపోతుంది.కెమికల్స్తో కూడిన సబ్బులు, హానికరమైన రసాయన బ్యూటీ ప్రాడక్ట్స్ను అస్సలు వాడకూడదు.అలాగే అధిక కార్బోహైడ్రేట్లు, ముఖ్యంగా శుద్ధి చేసిన పిండి పదార్థాలు ,చక్కెరలు, గ్లైకేషన్ అనే ప్రక్రియకు దారితీయవచ్చు. కొల్లాజెన్ను దెబ్బతీసి, తొందరగా ముసలి తనం వచ్చేలా చేస్తుంది. అందుకే పిండి పదార్ధాలను తగ్గించి, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంపై దృష్టి పెట్టాలి.మెరిసే చర్మం కోసం హైడ్రేటెడ్గా ఉండటం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 2 లీటర్ల నీరు తాగాలి.ఎలాంటి మచ్చలు లేకుండా, మెరిసిపోతూ, ప్రకాశవంతమైన కాంప్లెక్షన్ రావాలంటే శుభ్రంగా తినాలి. విటమిన్లు అధికంగా ఉండే ఆహారం, ముఖ్యంగా విటమిన్ సి, ఆకుకూరలు, సోయా, చిక్కుళ్ళు, చేపలు, చికెన్ తాజా పండ్లు తీసుకోవాలి. అవసరమైతే చర్మ ఆరోగ్యానికి, ముఖ్యంగా బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉండే సప్లిమెంట్లను తీసుకోవాలి. -
ఎన్ని సౌందర్య సాధనాలు వచ్చినా ఇవే ఎవర్గ్రీన్..!
అందాన్ని పెంపొందించుకునేందుకు కొన్ని సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం. ఇప్పటికే ఎన్నో కొత్త కొత్త సౌందర్యసాధనాలు అందుబాటులోకి వచ్చాయి గానీ నేచురల్గా లభ్యమయ్యే ఈ మామూలు పదార్థాలతోనే మేనినీ, జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చని అనాది కాలం నుంచి నిరూపితమైంది. ఎన్ని రకాల సౌందర్య సాధనాలు వచ్చినా ఇవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా కాలపరీక్షను తట్టుకుని నిలబడ్డాయి. సౌందర్య సాధానాలుగా మనం ఉపయోగిస్తున్న కొన్ని ఇంటి, వంటింటి పదార్థాల గురించి తెలుసుకుందాం. శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డును తొలగించడానికి శనగపిండిని ప్యాక్లా వేసుకోవడమన్నది చాలామంది ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతే. దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా ముఖానికి రాసుకోవడం వల్ల మేని ఛాయ మెరుగవుతుందని చాలామంది నమ్మకం.పసుపు : పసుపును పసుపు మొక్క వేళ్ల నుంచి తయారుచేస్తారు. పసుపుకొమ్ములుగా పేర్కొనే ఆ మొక్కల వేళ్లను పొడిగా మార్చి పొడి చేసి, అలా వచ్చిన పౌడర్ను ఓ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. పసుపును వంటలో సైతం వాడతారు. ఇది క్రిమినాశినిగా పనిచేస్తుంది. తెలుగువారి ఎన్నో సాంస్కృతిక ఉత్సవాల్లో కాళ్లకు పసుపు రాసుకునే సంప్రదాయం ఉంది. దాంతోపాటు ముఖానికి కూడా సౌందర్యసాధనంగా పసుపు రాసుకుంటారు. దాంతో మెరుగైన చాయ వస్తుంది. అయితే దీర్ఘకాలం పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దాని వల్ల ముఖం తడి కోల్పోయి విపరీతంగా పొడిబారి ముఖంపై ముడుతలు వచ్చే అవకాశం ఉంది.చందనం : తెలుగు వారి సంస్కృతిలోని ఎన్నో ఉత్సవాల్లో కాళ్లకు పసుపుతోపాటు... మెడపై గంధం రాసుకునే సంప్రదాయం కూడా ఉంది. అందుకే చాలా సందర్భాల్లో పసుపూ–చందనం అంటూ ఈ రెండింటినీ కలిపి చెబుతుంటారు. దీన్నిబట్టి సౌందర్య సా«ధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఉన్నదే అన్న విషయాన్ని గట్టిగా చెప్పవచ్చు. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యంగా ఉపయోగించడంతో పాటు చలువ చేసేందుకు వాడే వస్తువుగా కూడా పరిగణిస్తారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గంధాన్ని తయారు చేసి వాడతారు. ఇటీవల ఈ చందనాన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో, పెర్ఫ్యూమ్స్లో, సబ్బుల్లో ఉపయోగిస్తున్నారు. చందంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే.గోరింటాకు : ఇటీవల మెహందీ పేరిట చెబుతున్న ఈ ఆకును నూరి తయారు చేసే ఈ ఉత్సాదనను మన సంస్కృతిలో ఎప్పటినుంచో ఓ సౌందర్య సాధనంగా ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్గా మాత్రమే కాకుండా... చల్లదనాన్ని ఇచ్చే సౌందర్య సాధనంగా పేరు పొందింది. ఇటీవల దీన్ని తలకు వేసే రంగుల కోసం ‘హెన్నా’ అని కూడా ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లి వేడుకల సందర్భంగా, అలాగే అనేక పర్వదినాల్లో... ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది అనాదిగా మన సంప్రదాయంలో ఒక సాంస్కృతిక వేడుక.సాంబ్రాణి : ఇది కొన్ని రసాయనాలతోపాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. ఇది సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఉపయోగిస్తారు. ప్రతిరోజూ చంటి పిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోంచి వచ్చే పొగ క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలు ఉన్న గదిలో వచ్చే దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకునే హానికారక బ్యాక్టీరియాను దూరం చేస్తుండటం వల్ల దుర్వాసన దూరమవుతుంది. కొబ్బరి నూనె : ఇది ముదురు కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంస్కృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే అది శ్రేష్ఠమైనదని నమ్మకం. దీనితోపాటు ఆరోగ్యకరమైన కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా సాధారణంగా జరుగుతుంటుంది. (చదవండి: దటీజ్ మధురిమ బైద్య..! మైండ్బ్లాక్ అయ్యే గెలుపు..) -
అనన్య పాండేలాంటి నాజూకు నడుము కావాలంటే...!
బాలీవుడ్ నటి అనన్య పాండే ఫిట్నెస్ ప్రియురాలు. యోగా నుండి పైలేట్స్ వరకు, వివిధ రకాల వ్యాయామాలతో చెక్కిన శిల్పంలా తన శరీరాన్ని మల్చుకుంటుంది. తన వర్కౌట్స్కు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ఇన్స్టాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇటీవల ఇటీవల ఆమె ఫిట్నెస్ శిక్షకురాలు , ప్రెండ్ అయిన నమ్రతా పురోహిత్ వర్కవుట్ ( పైలేట్స్) చేస్తున్న ఫోటోను షేర్ చేసి,ఆమెపై ప్రశంసలు కురిపించింది. క్రమం తప్పకుండా, నిబద్ధతతో పనిచేస్తే మంచి ఫలితం ఉంటుందని వ్యాఖ్యానించింది. అనన్య లాగా, నాజూకైన నడుము కావాలనుకుంటున్నారా? అయితే ఆమె చేసే పైలేట్ష్తోపాటు కొన్ని రకాల యోగాసనాలనూ ఇక్కడ చూద్దాం.సైడ్ ప్లాంక్ ట్విస్ట్: నడుముకు అత్యంత ప్రభావవంతమైన వ్యాయామం ఇది. పక్కకు పడుకుని, తలను ఒక చేతితో పట్టుకుని, ఆపై నడుము భాగం కదలకుండా, పాదాల మధ్య ఎడం ఉంచి, మరొక చేతిని నిలువుగా పైకి లేవాలి. కొద్ది సేపు ఈ స్థితిలో ఉండి, తరువాత యథాస్థితికి రావాలి. అలాగే బోర్లా పడుకుని, మోచేతులపై భారం వేసి, బొటన వేళ్లపై బాడీని కొద్దిగా పైకి లేపాలి. ఇదేస్థితిలో బాడీని రెండు వైపులా మెల్లిగా ట్విస్ట్ చేయాలి. ఇలాంటి రిక్లైనింగ్ మోకాలి ట్విస్ట్, సిజర్స్ క్రిస్ క్రాస్ లాంటి కొన్ని వ్యాయామాలతో మాత్రమే కాదు, కొన్ని రకాల యోగసనాల ద్వారాకూడా నడుము దగ్గర పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగి నాజూగ్గా తయారవుతారు.త్రికోణాసనం..త్రికోణాసనం నడుము దగ్గర కొవ్వు కరిగించడానికి, బరువును కంట్రోల్లో ఉంచడానికి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. త్రికోణాసనం వేయడానికి ముందుగా పాదాలను వీలైనంత ఎడంగా పెట్టి, నిటారుగా నిల్చోవాలి. చేతులను రెండు వైపులకు తిన్నగా చాచాలి. నడుమును పక్కకు వంచి, ఎడమ చేత్తో ఎడమ పాదాన్ని తాకాలి. కుడి చేతిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి కుడి చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. తర్వాత నడుమును పక్కకు వంచుతూ కుడి చేత్తో కుడి పాదాన్ని తాకాలి. ఎడమ చేయిని పైకి నిలువుగా చాచాలి. శ్వాస వదులుతూ తలను పైకెత్తి ఎడమ చేయిని చూడాలి. శ్వాస తీసుకుంటూ సాధారణ స్థితికి రావాలి.నౌకాసనంనౌక మాదిరిగా ఈ ఆసనం ఉంటుంది గనుక దీనికి ఆపేరు. ఈ ఆసనం వేయడానికి ముందుగా కాళ్లు ముందుకు చాపాలి. తొడల దగ్గర చేతులతో పట్టుకుని కాళ్లను పైకి లేపి పిరుదుల మీద బ్యాలెన్స్ చేస్తూ శరీరాన్ని కొంచెం వెనక్కి వంచాలి. మెల్లగా రెండు చేతులను మోకాళ్ల దగ్గర పట్టుకుని కాళ్లను ఇంకాస్త పైకి లేపి. తలకి సమాంతరంగా ఉండేలా చూడాలి. పాదాలు తల కంటే ఎత్తుకు వెళ్లకూడదు. మెల్లగా రెండు చేతులనూ తీసేసి కాళ్లను అలా గాల్లోకి ఉంచాలి. చేతులను ముందుకు చాచాలి. శరీర బరువంతా పిరుదుల మీద ఉంటుంది. ఇలా హిప్స్ మీద బరువు నిలుపుతూ ,నెమ్మదిగా కాళ్లను కిందికి దించాలి. సుమారుగా పది నుంచి ఇరవై క్షణాల పాటు ఆ భంగిమలో ఉంటే మంచిది. మధ్యలో స్వల్ప విరామం తీసుకుని మళ్లీ దీన్ని రిపీట్ చేయాలి.మత్స్యాసనంమత్స్యాసనం వేయండానికి ముందుగా ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత కాళ్లను తిన్నగా చాపాలి. ఎడమ కాలిని మడిచి, మడాన్ని కుడి పిరుదు వద్దకు తీసుకెళ్లాలి. ఎడమ మోకాలిని కుడి పాదానికి తాకించాలి. వెన్నెముక నిటారుగా బిగపట్టినట్టు కాకుండా రిలాక్స్డ్గా ఉండాలి. ఎడమ చేతిని కుడి మోకాలి పక్కనుంచి తీసుకెళ్లి కుడి పాదపు చీలమండను పట్టుకోవాలి. వీపు పై భాగాన్ని కుడివైపునకు తిప్పండి. మీకు వీలైనంత వరకూ మాత్రమే చేయండి. కుడిచేతిని వెనుకవైపు పెడుతున్నప్పుడు కుడి భుజం మీది నుంచి చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ శరీరమంతటినీ రిలాక్స్గా ఉంచుతూ ఈ పోజ్లో కొంతసేపు ఉండండి.ధనురాసనంయోగా మ్యాట్పైన బోర్లా పడుకొని, రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి. రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న పొత్తికడుపు, పొట్ట మీద ఒత్తిడి మనకు తెలుస్తుంది. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి. తొందరగా ఫలితం కనబడాలంటే.. రోజులో రెండు సార్లు ఒక గంట పాటు , ఆసనానికి మధ్య స్వల్ప విరామం తీసుకుంటూ నిదానంగా ఈ ఆసనాలను వేయాలి. నోట్ :యోగాసనాలు ఎపుడూ కూడా హడావిడిగా చేయకూడదు. శ్వాసనిశ్వాసలను నియంత్రణలో ఉంచుకుంటూ నిదానంగా చేయాలి. అలాగే యోగసనాలను ప్రారంభించే ముందు యోగా నిపుణుల సలహాలను తీసుకోవాలి. -
అందమైన శరీరాకృతికి బీబీఎల్ సర్జరీ: అంటే ఏంటి..?
మోడల్స్, ప్రముఖులు, సెలబ్రిటీలు మంచి తీరైన శరీరాకృతి కోసం ఏవేవో సర్జరీలు చేయించుకుంటుంటారు. శరీర ఒంపు సొంపులు పొందికగా శిల్పాంలా కనిపించాలని ఆరాటపడుతుంటారు. అందుకోసం చేయించుకునే కాస్మెటిక్ సర్జరీలో అత్యంత ప్రసిద్ధిగాంచింది బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (బీబీఎల్). బొటాకస్, ఫిల్లర్, ఫేస్ లిఫ్ట్లు వంటి కాస్మెటిక్ విధానాలు గురించి విన్నాం. కానీ ఇలా తీరైన ఆకృతి కోసం చేసే ఈ బీబీఎల్ సర్జరీ అంటే ఏంటీ..?. నిజంగానే మంచి విల్లు లాంటి ఆకృతిని పొందగలమా అంటే..విదేశాల్లోని మోడల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు ఎక్కువుగా ఈ బీబీఎల్ కాస్మొటిక్ సర్జరీని చేయించుకుంటుంటారు. ఇది అక్కడ అత్యంత సర్వసాధారణం. అయితే దీనితో అందంగా కనిపించడం ఎలా ఉన్నా..వికటిస్తే మాత్రం ప్రాణాలే కోల్పోతాం. అలానే ఇటీవల 26 ఏళ్ల బ్రిటిష్ మహిళ ఈ ప్రక్రియతో ప్రాణాలు కోల్పోయింది. సోషల్ మీడియాలో ఈ బీబీఎల్ సౌందర్య ప్రక్రియ గురించి విని టర్కీకి వెళ్లి మరీ చేయించుకుంది. అయితే ఆపరేషన్ చేసిన మూడు రోజుల్లోనే మరణించింది. ఈ ప్రక్రియలో ఏం చేస్తారంటే..లైపోసెక్షన్ మాదిరిగానే ఉంటుంది. కాకపోతే ఇందులో కొవ్వుని అంటుకట్టుట చేస్తారు. ఇందేంటి అనుకోకండి. యవ్వనంగా, వంపుగా కనిపించేలా ఆయా ప్రాంతాల్లో కొవ్వుని ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. మొదటి దశలో శరీరంలోని తొడలు లేదా పార్శ్వాలు వంటి భాగాల్లో అదనపు కొవ్వును తొలగిస్తారు. ఆ తర్వాత లైపోసెక్షన్ టెక్నిక్ ఉపయోగించి శుద్ది చేయబడిన కొవ్వుని ఇంజెక్ట్ చేస్తారు. ఈ క్రమంలో కొన్ని దుష్పరిణామాలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే..ఈ ఇంజెక్ట్ చేసిన కొవ్వు రక్తప్రవాహంలోకి ప్రవేశించి రక్తనాళాలను అడ్డుకుంటే మాత్రం అప్పుడే పరిస్థితి ప్రాణాంతకంగా మారింది. అదీగాక ఈ సర్జరీకి అందరి శరీరాలు ఒకవిధంగా స్పందించవు. ఇక ఆ బ్రిటిష్ మహిళ సర్జరీ చేయించుకున్న తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంత మరణించిందన సమాచారం. నిజానికి ఇలాంటి.. సౌందర్యానికి సంబంధించిన కాస్మెటిక్ సర్జరీలు చేయిచుకునేటప్పుడు అనుభవజ్ఞుడైన వైద్యుడి పర్యవేక్షణలోనే చేయించుకోవడం అనేది ఎంద ముఖ్యమో, అలానే ఆ తదుపరి కూడా అంతే కేర్ఫుల్గా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాగా, ఈ బీబీఎల్ శస్త్ర చికిత్స 1960లలో బ్రెజిలియన్ సర్జన్ ఐవో పిటాంగి పరిచయం చేశారు. అయితే 2010 నుంచి ఈ శస్త్ర చికిత్స అత్యంత ప్రజాదరణ పొందింది.(చదవండి: హతవిధీ..! నిద్రలో పళ్ల సెట్ మింగేయడంతో..!) -
ముత్యమంత పసుపుతో బోలెడన్ని ప్రయోజనాలు
పసుపులో ఎన్నో పోషకాలు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మారిన పరిస్థితుల కారణంగా పసుపు వాడకం చాలా ఎక్కువ అయింది. ముఖ్యంగా పచ్చిపసుపును విరివిగా వాడుతున్నారు. అయితే ఎలా పడితే అలా కాకుండా పద్ధతి ప్రకారం పచ్చిపసుపును వాడటం వల్ల అధిక ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అవేమిటో చూద్దాం... పసుపును కొన్ని ఆయుర్వేద ఔషధాలలో చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. వంటలో కూడా ఉపయోగిస్తారు. గ్లాసుడు వేడి పాలలో చిటికడు పసుపు కలుపుకుని తాగడం వల్ల ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు, జలుబు, దగ్గు తగ్గుతాయి. శరీరంలో అధికంగా ఉన్న చెడు కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగని పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇలా వాడాలి!పచ్చి పసుపుతో ఆయుర్వేదిక్ టీలు, సూప్లు, స్మూతీస్ వంటివి తయారు చేసుకోవచ్చు. ఇది వంటకాలకు మంచి రంగు, రుచి, వాసనలను జత చేస్తుంది. అయితే పసుపు పొడిని మరిన్ని అవసరాలకు వాడొచ్చు. మారినేషన్, మసాలాలు, సాస్లు, డ్రింక్స్లో దీన్ని యాడ్ చేసుకోవచ్చు.పసుపు టీ: రెండంగుళాల ΄ పొడవున్న తాజా పచ్చిపసుపు కొమ్మును తీసుకుని దాని మీదుండే పొరను తీసేయాలి. దానిని సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి. స్టవ్ మీద మరుగుతున్న గ్లాసున్నర నీటిలో ఆ ముక్కలు వేయాలి. దానికి చిటికెడు మిరియాల పొడి, కాస్తంత బెల్లం తరుగు జతచేయాలి. కాగిన తర్వాత కొద్దిగా నెయ్యి లేదా వర్జిన్ కోకోనట్ ఆయిల్ కలిపి ఒక నిమిషం పాటు మరిగిన తర్వాత స్టవ్ మీది నుంచి దించి వడపోసి గ్లాసులో పోసుకుని టీలాగే సిప్ చేయాలి.స్మూతీస్లో కలపడం...పైనాపిల్, మ్యాంగో, ఇతర రకాల పండ్ల ముక్కలతో పాటు సన్నగా తురుమిన పచ్చి పసుపు కొమ్ము, కొబ్బరినీళ్లు, బాదం పాలు కలిపి చేసిన స్మూతీ తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగు తాయి. నిమ్మరసం, అల్లం రంసం, మిరియాల పొడి, కొబ్బరి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లలో చిటికడు పచ్చిపసుపు కలిపి వడకట్టి తాగితే జలుబు, దగ్గు, ఒంట్లో వాపులు తగ్గుతాయి. వెటిజబుల్ సలాడ్తో... టమోటా, దోస, బీర, బెండ, క్యారట్, బీట్రూట్, ముల్లంగి, స్ప్రింగ్ ఆనియన్స్ తదితర కూరగాయల ముక్కల మీద పసుపు, మిరియాలపొడి,చల్లుకుని తింటే మంచిది. పసుపు నీళ్లు... తేలికైన మార్గం ఏమిటంటే... తాజా పసుపు కొమ్మును పొట్టు తీసి ముక్కలుగా తరిగి వాటర్ బాటిల్లో వేయాలి. కొన్ని గంటల తర్వాత ఆ నీటిని తాగుతూ ఉంటే పసుపులో ఉన్న లక్షణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. -
శీతాకాలంలో చుండ్రు, జుట్టు సమస్యలు : నువ్వులతో చెక్
చర్మం లాగానే జుట్టు కూడా పొడిబారుతుంది. ముఖ్యంగా చల్లని శీతాకాలంలో ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. చుండ్రు సమస్యకూడా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి జుట్టును తేమగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయిల్తో మసాజ్ చేసుకోవడం, ఎక్కువ హైడ్రేటింగ్ షాంపూలను ఉపయోగించడం లాంటివి చెయ్యాలి. కండిషనింగ్ విషయంలో నువ్వుల నూనె బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మరి జుట్టు సంరక్షణలో ఎలా వాడవచ్చో తెలుసుకుందాం!జుట్టు సంరక్షణలో నువ్వులుకప్పు నల్లనువ్వులను తీసుకుని మెత్తగా పొడిచేసి పక్కన పెట్టుకోవాలి. అరలీటరు కొబ్బరి నూనెను మందపాటి పాత్రలో పోయాలి. దీనిలో నువ్వుల పొడి, నాలుగు మందార పువ్వులు, పది కరివేపాకులు వేసి సన్నని మంటమీద మరిగించాలి. మందారపువ్వులు, కరివేపాకు వేగాక నూనెను దించేసి చల్లారనిచ్చి, ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వ చేసుకోవాలి. రెండురోజుల కొకసారి ఈ ఆయిల్ను తలకు పట్టించి మర్దన చేసి నాలుగు గంటల తరువాత తలస్నానం చేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గడమేగాక, బాలనెరుపు నియంత్రణలో ఉంటుంది. జుట్టుకూడా ఒత్తుగా పెరుగుతుంది. తెల్లనువ్వుల్లో పోషకాలు ఉంటే నల్ల నువ్వుల్లో ఒమేగా 3, 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మాడుని తేమగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి మాడుని పొడిబారకుండా చేసి, చుండ్రుని తగ్గిస్తాయి. యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చుండ్రుని మరింత విస్తరించకుండా నియంత్రిస్తాయి. -
స్కిన్ గ్లో శాశ్వతంగా ఉండాలంటే..ఇలా చేయండి!
చర్మం నిగారింపును అందరూ కోరుకుంటారు. అందుకు సౌందర్య ఉత్పత్తుల వాడకం, ఫేషియల్స్, స్కిన్ ట్రీట్మెంట్లు చేయించుకుంటూ ఉంటారు. ఈ విషయాల్లో సరైన అవగాహన లేక ఉపయోగించే పద్ధతులు ఒక్కోసారి రివర్స్ అవుతుంటాయి. ముఖ్యంగా.. మొటిమలు/యాక్నే సమస్య ఉన్నవారు పార్లర్లో ఫేషియల్స్ చేయించుకుంటారు. మళ్లీ ఇంట్లో కొన్ని రకాల మసాజ్లు చేస్తుంటారు. వీటివల్ల సమస్య మరింత పెరుగుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో కెమికల్ పీల్ చేయించుకుంటారు. కానీ, ట్రీట్మెంట్కి ముందు–తర్వాత వాడే ప్రొడక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోరు. దీనివల్ల సాధారణంగా ఉండే సమస్య మరింత పెరిగి, చర్మం దెబ్బతింటుంది.మచ్చలు తగ్గాలంటే..నలుపు/తెలుపు మచ్చలు కనిపించినప్పుడు మొదట సొంతంగా హోమ్ రెమిడీస్ చేస్తుంటారు. వీటి వల్ల కొన్ని రివర్స్ అవుతుంటాయి. దీర్ఘకాలపు సమస్యగా కూడా మారుతుంటాయి. క్రీములు, మెడిసిన్స్.. సమస్య మొదట్లోనే గుర్తించి, వాడితే చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.లేజర్ చికిత్సమచ్చలకు, కొన్ని రకాల చర్మ సమస్యలకు లేజర్ చికిత్స అవసరం అవుతుంటుంది. చికిత్స తర్వాత సరైన క్రీములను ఉపయోగించకపోతే చర్మం పొడిబారుతుంది. కొత్త మచ్చలు కూడా పుట్టుకు వస్తుంటాయి. ఇదీ చదవండి: ఫోర్బ్స్'అత్యంత శక్తివంతమైన మహిళల' జాబితా : మరోసారి నిర్మలా సీతారామన్ ప్రొడక్ట్స్ .. అలెర్జీలు ఆహారం పడకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో సరైనది ప్రొడక్ట్ ఉపయోగించక పోతే చర్మానికి అలాంటి అలెర్జీలు ఉత్పన్నం అవుతుంటాయి. అందుకే, ఏదైనా కొత్త ప్రొడక్ట్ వాడాలనుకున్నప్పుడు ముందుగా చర్మంపై టెస్ట్ ప్యాచ్ చేసుకోవాలి. చలికాలం పొడి చర్మం గలవారికి స్కిన్ అలెర్జీ ఎక్కువ ఉంటుంది. క్రీములు, నూనెల వాడకంలో మరికొంత జాగ్రత్త తీసుకోవాలి. చర్మం నిగారింపు, హెయిర్ సాఫ్ట్నెస్ కోసం పర్మనెంట్ గ్లో వంటి చికిత్సల వైపు మొగ్గుచూపుతుంటారు. కానీ, శాశ్వత పరిష్కారం అంటూ ఉండదు. సమస్య ఉత్పన్నం కాకుండా తీసుకునే ఆహారం, పానీయాలు, తమ శరీర తత్త్వానికి ఉపయోగపడే క్రీములను వాడుతూ ఉండాలి. – డా.స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
మృదువైన చేతులు... ముచ్చటేసే ముఖం కోసం...!
చలికాలంలో సౌందర్య రక్షణ కోసం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శీతగాలుల వల్ల చర్మం పొడిబారినట్టు అవుతుంది. ముఖంలో కాంతి తగ్గిపోతుంది. అందుకే ఇంట్లో దొరికే వస్తువులతో కొన్ని టిప్స్ పాటిస్తే, మృదువైన చేతులు, చందమామ లాంటి మోము సొంతం అవుతుంది. వీటితో పాటు సమతుల ఆహారం, చక్కటి వ్యాయామం, తగినన్ని నీళ్లు తాగడం, మంచి నిద్ర వీటిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు! బ్యూటీ టిప్స్స్పూన్ గ్లిజరిన్, స్పూన్ ఆలివ్ ఆయిల్, స్పూన్ నిమ్మరసం తీసుకుని వాటిని బాగా కలిపి చేతులకి రాసుకుంటే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు పెట్రోలియమ్ జెల్లీలో కొద్దిగా కార్బాలిక్ యాసిడ్ కలిపి ఆ మిశ్రమాన్ని చేతులకి మర్దనా చేస్తూ ఉంటే క్రమేపీ చేతులు తెల్లగా... మృదువుగా మారతాయి.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత కడిగేసు కోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ ముఖం రుద్దుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే కొద్దిరోజుల్లోనే ముఖ చర్మం మృదువుగా అవుతుంది.కొత్తిమీర, పుదీనా మెత్తగా నూరి చర్మానికి రాస్తే నల్లమచ్చలు తొలగి పోతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు తేనె, నిమ్మరసం కలిపి రాస్తే చర్మంపై మచ్చలు తగ్గిపోతాయి.ఓట్మీల్ పౌడర్ టీ స్పూన్ తీసుకుని అందులో ఆరెంజ్ జ్యూస్ కలిపి ముఖం, చేతులు, మెడకు ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత కొద్దిగా నీళ్లు చల్లి వలయాకారంగా మర్దన చేసి ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది.బాగా పండిన అరటిపండు గుజ్జు టేబుల్ స్పూన్ తీసుకుని అందులో ఐదారు చుక్కల తేనె కల పాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులకు రాసి వలయాకారంగా మర్దన చేయాలి. మిశ్రమంలోని తేమ ఇంకే వరకు మర్దన చేసి, ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇది పొడి చర్మానికి ఈ కాలంలో మంచి ఫలితాన్నిస్తుంది. క్రమం తప్పకుండా కొన్ని రోజుల పాటు చిటికెడు పసుపు, మీగడ కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత స్నానం చేయాలి ఇలా చేస్తుంటే మచ్చలు, చారల్లాంటివి తొలగి ముఖం మృదువుగా నిగనిగలాడుతుంటుంది. -
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
పెదవులు బొద్దుగా కనిపించాలంటే..!
ఇంట్లో దొరికే వాటినే సౌందర్య సాధనాలుగా ఉపయోగించుకుని అందాన్ని సంరక్షించుకోవడం చూశాం. వాటిల్లో ఎక్కువగా సెనగపిండి, బియ్య పిండి, మొక్కల ఆధారితమైనవే. ఇక్కడొక ఇన్ఫ్లుయెన్సర్ ఏకంగా పచ్చిమిర్చి కూడా అందానికి ఉపయోగపడుతుందంటూ ఏం చేసిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఢిల్లీకి చెందిన శుభంగి ఆనంద్ అనే ఇన్ఫ్లుయెన్సర్ వివాదాస్పదమైన బ్యూటీ టిప్ని షేర్ చేసింది. అందులో పచ్చిమిరపకాయలతో లిప్స్టిక్ వేసుకున్నట్లు చూపించింది. సహజమైన బొద్దు పెదవుల కోసం ఇది ప్రయత్నించమంటూ తన అనుభవాన్ని షేర్ చేసుకుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__) View this post on Instagram A post shared by SHUBHANGI ANAND 🧿👑 (@shubhangi_anand__)strong> ఘాటుతో ఉండే పచ్చిమిర్చి వంటివి చర్మానికి హాని కలిగించేవని. ఇలాంటి పిచ్చిపిచ్చి టిప్స్ షేర్ చేయొద్దని తిట్టిపోశారు. పెద్దాలు బొద్దుగా ఉండటం అటుంచితే..అవి కాలిన గాయాల వలే వాచిపోయి అసహ్యంగా మారతాయని కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. అయినా అందానికి సంబంధించినవి సమంజసంగా హానికరం కానివి పెట్టాలి. ఏదో సోషల్ మీడియా క్రేజ్ కోసం ఇలా చేస్తే..వ్యూస్ రావడం మాట దేవుడెరగు అస్సలు ఆ అకౌంట్కి సంబంధించిన వీడియోలను అసహ్యించుకునే ప్రమాదం లేకపోలేదు.(చదవండి: నడవలేనంత అనారోగ్య సమస్యలతో వినోద్ కాంబ్లీ: ఆ వ్యాధే కారణమా..?) -
ఏఐ బ్యూటీషియన్ రంగాన్ని కూడా శాసించగలదా..?
ఏఐ సాంకేతికత ప్రపంచాన్నే మారుస్తోంది. ప్రస్తుతం ఏఐ విద్యా, వైద్య, మార్కెటింగ్,సేల్స్, ఫైనాన్స్ , కంటెంట్ క్రియేషన్ వంటి పలు రంగాలను ప్రభావితం చేసింది. దీంతో ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా? అనే భయాన్ని రేకెత్తించేలా శరవేగంగా దూసుకుపోతుంది. ఇక మిగిలింది సౌందర్యానికి సంబంధించిన బ్యూటిషయన్ రంగం ఒక్కటే మిగిలి ఉంది. ఇందులో కూడా ఆ సాంకేతికత హవా కొనసాగుతుందా అంటే..సందేహాస్పదంగా సమాధానాలు వస్తున్నాయి నిపుణుల నుంచి. ఎందుకంటే చాలా వరకు మానవ స్పర్శకు సంబంధించిన రంగం. ఇంతకీ ఈ సాంకేతికత ప్రభావితం చేయగలదా? అలాగే ఈ రంగంలో ఏఐ హవాను తట్టకునేలా ఏం చెయ్యొచ్చు.. బ్యూటీషియన్ రంగంలో ఐఏ సాంకేతిక వస్తే.. సరికొత్త ఇన్నోవేషన్తో.. వర్చువల్ టూల్స్ని మెరుగుపర్చగలదు. అంటే ఎలాంటి మేకప్లు సరిపడతాయి, చర్మ నాణ్యత తదితర విషయాల్లో సలహాలు, సూచనలు ఇవ్వగలదు. మానవునిలా ప్రభావవితం చేయలేదు. ఎందుకంటే ఇది సృజనాత్మకత, భావోద్వేగం, టచ్తో కూడిన కళ. 2020లో మహమ్మారి సమయంలో ఈసాంకేతికత ప్రభంజనంలా దూసుకుపోయిందే తప్ప మరేంకాదని కొట్టేపడేస్తున్నారు నిపుణులు. అయితే బ్యూటీషియన్ రంగంలోని మేకప్ పరిశ్రమను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఇక్కడ కస్టమర్ మనోగతం ఆధారంగా అందమైన రూపు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ నేపథ్యంలో ఏఐ సరైన మేకప్ని కస్టమర్లకు ఇవ్వడం అన్నది సాధ్యం కానీ విషయం. ఓ మోస్తారుగా ఇలాంటి మేకప్ ఇస్తే ఇలా ఉంటుందని వర్చువల్ ఐడియానే అందివ్వగలదే తప్ప కస్లమర్కి నచ్చినట్టుగా క్రియేటివిటీతో కూడిన మేకప్ ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. అలాగే క్లయింట్లకు ఎలాంటి బ్యూటీప్రొడక్ట్లు వాడితే బెటర్ అనేది, చర్శ తత్వం తదితరాలకు మాత్రమే ఐఏ ఉపయోగపడవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఐఏ అందానికి సంబంధివచి ప్రభావితం చేయాలేని కీలక అంశాలు గురించి కూడా చెప్పారు. అవేంటంటే..కళాత్మక క్రియేటివిటీ : బ్యూటీషియన్ నిపుణులే మూఖాకృతి తీరుకి సరైన మేకప్తో ఒక మంచి రూపాన్ని ఇవ్వగలరు. ఇది నిశితమైన అంతర్దృష్టికి సంబంధించిన క్రియేటివిటీ. ఎమోషనల్ కనెక్షన్: కస్టమర్ల సౌందర్య సంప్రదింపుల్లో ఇది అత్యంత కీలకమైంది. క్లయింట్ వ్యక్తిగతంగా ఏ విషయంలో ఇబ్బంది పడుతున్నారనేది అర్థం చేసుకుని సలహాలు, సూచనలివ్వాల్సి ఉంటుంది. స్పర్శ సేవ: షేషియల్, మసాజ్ వంటి సౌందర్య చికిత్సలలో టచ్ అనేది కీలకం. బ్యూటీషియన్ అనుభవం ఆధారంగా కస్టమర్లకు దొరికే మంచి అనుభూతిగా చెప్పొచ్చు. ఒక వేళ ఏఐ సౌందర్య రంగాన్ని ప్రభావితం చేసినా..బ్యూటీషియన్లు ఈ సవాలుని స్వీకరించేందుకు సిద్ధపడాలి. అలాగే కస్టమర్లకు మెరగైన సేవను అందించి సాంకేతికత కంటే..మనుషుల చేసేదే బెటర్ అనే నమ్మకాన్ని సంపాదించుకునే యత్నం చేయాలి. బ్యూటీషియన్లంతా ఈ రంగంలో అచంచలంగా దూసుకునిపోయేలా ఏఐని స్నేహితుడిగా మలుచుకుంటే మరిన్న ఫలితాలను సాధించే అవకాశం ఉంటుంది. అలాంటి వారే ఎలాంటి సాంకేతిక ఆటను ఈజీగా కట్టడి చేయగలరు అని నమ్మకంగా చెబుతున్నారు విశ్లేషకులు. (చదవండి: 40 ఏళ్ల నాటి గౌనులో యువరాణి అన్నే..!) -
చలికాలంలో మేకప్, ఈ జాగ్రత్తలు తప్పదు.. లేదంటే!
చలికాలం ఉక్కపోత ఉండదు, మేకప్ చెదిరిపోదు, బాగుంటుంది అనుకుంటారు. అయితే, ప్రతి సీజన్కి బ్యూటీ చాలెంజెస్ ఉంటాయి. చలికాలంలో చేయించుకోదగిన ఫేషియల్స్, మేకప్, ఫుడ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వివాహ వేడుకలకు మేకప్ చేయించుకునేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తే, సరైన ప్రయోజనాలను పొందుతారు. పొడిగా ఉన్నా, జిడ్డుగా ఉన్నా చలి కాలం మేకప్ చేసేముందు హైడ్రేటెడ్ మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. లేదంటే, మేకప్ కూడా డ్రైగా కనిపిస్తుంది. అవసరాన్ని బట్టి ప్రైమరీ లోషన్ వాడుకోవచ్చు.మెరిసే చర్మానికి..చర్మం మెరుస్తున్నట్టుగా ఆరోగ్యంగా కనిపించాలంటే నూనె శాతం ఎక్కువ ఉండే మాయిశ్చరైజర్ ఉపయోగించాలి. హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్ని ముందు ఉపయోగిస్తే మాయిశ్చరైజర్ని స్కిన్ మీద పట్టి ఉంచుతుంది. దీని వల్ల మేకప్ డ్రైగా కనిపించదు. బడ్జెట్ని బట్టి సీరమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి. వాటిలో చర్మానికి అవసరమయ్యే గుణాలు ఏవి ఉన్నాయో అవి చెక్ చేసుకోవాలి. సాధారణంగా చర్మం సహజ ఆయిల్స్ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, వయసు పెరుగుతున్నకొద్దీ సహజ నూనెల ఉత్పత్తి ఆగి΄ోతుంది. దాంతో చర్మం ΄÷డిబారుతుంది. చలికాలం పెళ్లిళ్లు ఉన్న బ్రైడల్స్ అయితే కనీసం నెల ముందు నుంచి స్కిన్ కేర్ తీసుకోవాలి.హెల్తీ స్కిన్కి పోషకాహారంస్కిన్ కేర్ తీసుకోకుండా పెళ్లిరోజు మేకప్ చేయించుకుంటే హెల్తీగా కనిపించదు. నెల రోజుల ముందు నుంచి హైలురానిక్ యాసిడ్స్ ఉన్న సీరమ్స్ ఉపయోగించాలి. ΄ోషకాహారం, ΄ానీయాల మీద దృష్టి పెట్టాలి. జంక్ ఫుడ్, మాంసాహారం కాకుండా పండ్లు, కూరగాయలు, జ్యూసులను ఆహారంలో ఎక్కువ చేర్చుకోవాలి. దీని వల్ల చర్మం ఆరోగ్యంగా కనిపిస్తుంది.మేకప్కి ముందుమేకప్కి ముందు ఎంజైమ్ స్క్రబ్ ఉపయోగిస్తారు. తర్వాత సీరమ్స్, అవసరమైతే షీట్ మాస్క్లు, అండర్ ఐ ప్యాచెస్ వాడుతారు. దీని వల్ల మేకప్ ప్యాచ్లుగా కనిపించదు.మేకప్ తీయడానికి తప్పనిసరిరిమూవర్స్ ఉపయోగించుకోవచ్చు. లేదంటే కొబ్బరినూనె, బాదం నూనె, బేబీ ఆయిల్ ను ఉపయోగించి మేకప్ను పూర్తిగా తీసేయాలి. తర్వాత ఫేస్వాష్తో శుభ్రపరుచుకొని, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. అలసి΄ోయామనో, మరుసటి రోజు చూడచ్చులే అనో మేకప్ తీసేయకుండా అలాగే పడుకుంటే స్కిన్ బాగా దెబ్బతింటుంది. చర్మం ఇంకా పొడిబారడం, యాక్నె వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. మేలైన ఫేషియల్స్చలికాలంలో రొటీన్ ఫేషియల్స్ కాకుండా హైడ్రా ఫేషియల్ చేయించుకోవడం మంచిది. దీని వల్ల చర్మం నిగారింపు కోల్పోదు. వీటితో పాటు కొన్ని కెమికల్ పీల్స్ ఉంటాయి. అయితే, వీటిని పెళ్లికి పది రోజుల ముందు చేయించుకోవాలి. కెమికల్ పీల్ని బ్యూటీపార్లర్లో కాకుండా చర్మనిపుణుల సమక్షంలో చేయించుకోవడం మంచిది. – విమలారెడ్డి పొన్నాల, సెలబ్రిటీ అండ్ బ్రైడల్ మేకప్ ఆర్టిస్ట్ -
చలికాలంలో మీ స్కిన్ మృదువుగా ఉండాలంటే.!
చలికాలం చర్మం పొడిబారి, జీవం కోల్పోయినట్టు కనపడుతుంది. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కలిగి ఉండాలి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అందుకు సంబంధించి కొన్ని టిప్స్ మీకోసం. టీ స్పూన్ బాదం నూనె, అర టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి, చేతులకు, పాదాలకు రాసి మసాజ్ చేయాలి. స్నానం చేసేముందు నాలుగు చుక్కల బాదం నూనె బకెట్ నీటిలో కలపాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. అరటిపండు గుజ్జు, కప్పు పెరుగు, టేబుల్ స్పూన్ తేనె, టేబుల్ స్పూన్ ఓట్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మేనికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మానికి జీవకళ వస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె మేనికి రాసుకోవాలి. మృదువుగా మర్దనా చేసి, గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి చలికాలం నూనె శాతం అధికంగా ఉన్న మాయిశ్చరైజర్లు వాడాలి. ఆలివ్ ఆయిల్, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని అందులో కొద్దిగా వెనిలా ఎసెన్స్ కలపాలి. ఈ మిశ్రమాన్ని చలికాలం మాయిశ్చరైజర్గా ఉపయోగించవచ్చు. టీ స్పూన్ శనగపిండిలో అర టీ స్పూన్ తేనె, పచ్చిపాలు కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే పొడిబారిన ముఖ చర్మం ముడతలు తగ్గుతాయి. చర్మం పొడిబారకుండా ఉండాలంటే మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. అలాగని చర్మాన్ని మరీ రబ్ చేయకూడదు. కార్న్ఫ్లేక్స్ని పొడి చేసి, అందులో తేనె, పాలు కలిపి చర్మానికి పట్టించి, మర్దనా చేయాలి. మృతకణాలు తొలగి పోయి చర్మం మృదువుగా మారుతుంది. -
నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక
హన్సిక నసనల్లి అచ్చమైన తెలుగమ్మాయి. తెలుగు జాతి కీర్తి పతాకాన్ని అమెరికాలో ఎగుర వేశారు. నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో విజేతగా నిలిచారు. జూనియర్ టీన్ కేటగిరీల్లో జరిగిన ఈ పోటీల్లో అమెరికాలోని 50 స్టేట్స్ నుంచి 118 మంది పోటీ పడ్డారు. ఈ పోటీల్లో ఆమె నేషనల్ అమెరికన్ మిస్ జూనియర్ టీన్ విజేతగా నిలిచారు.ఇవే కాకుండా హన్సిక గత రెండు సంవత్సరాలుగా యూఎస్ఏ నేషనల్ లెవెల్ యాక్ట్రెస్ పోటీల్లో గెలిచారు. అకడమిక్ అచీవ్మెంట్ విన్నర్ అవార్డుని కూడా కైవసం చేసుకున్నారు. క్యాజువల్ వేర్ మోడల్ విన్నర్ కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు. అతి చిన్న వయసులోనే భరతనాట్యాన్ని నేర్చుకుని అరంగేట్రం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.ఆరేళ్ల నుంచి ఈ పోటీల్లో పాల్గొంటూ గత నాలుగు సార్లు విజేతగా నిలిచారు. నేషనల్ అమెరికన్ మిస్, ఇంటర్నేషనల్ జూనియర్ మిస్, ఇంటర్నేషనల్ యూనైటెడ్ మిస్, యూఎస్ఏ ఇండియన్ మిస్ పెజంట్ పోటీల్లో గెలిచి సత్తా చాటారు. హన్సిక స్వస్థలం వనపర్తి. తండ్రి శేఖర్. తల్లి ప్రశాంతిని ప్రముఖ భరత నాట్య కళాకారిణి, నటి. కన్నడ, తెలుగులో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రమోదిని అక్క కూతురు హన్సిక.మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్ కిరీటాన్ని కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. చదువులో ఉన్నతస్థాయిలో రాణిస్తూ బ్రౌన్ యూనివర్సీటీ లేదా హార్వార్డ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. View this post on Instagram A post shared by Hansika Nasanally (@hansika_pageant) (చదవండి: 12th ఫెయిల్ హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం.. సరైనదే అంటున్న నిపుణులు!) -
వింటర్ వేర్ : గ్రాండ్ వెల్వెట్, ట్రెండీ వెల్వెట్
వింటర్ టైమ్ బ్రైట్గా వెలిగిపోవాలన్నాప్రిన్సెస్లా హుందాగా మెరిసిపోవాలన్నావణికించే చలి నుంచి నైస్గా తప్పించుకోవాలన్నాఈ సీజన్కి బెస్ట్ ఎంపికగా వెల్వెట్ డిజైనరీ డ్రెస్సులు గ్రాండ్గా మదిని దోచేస్తున్నాయి. వెల్వెట్నే మనం మఖ్మల్ క్లాత్ అని కూడా అంటాం. మందంగా, మృదువైన పట్టులా ఉండే ఈ క్లాత్ నేత పని, వాడే మిశ్రమాల వల్ల చాలా ఖరీదైనదిగా కూడా పేరుంది. సంపన్నులు ధరించే వస్త్రంగా పేరొందిన వెల్వెట్కు ఎంతో ప్రాచీన చరిత్ర ఉంది. ఇప్పుడు ఈ క్లాత్ తయారీలో ఎన్నో మార్పులు చోటు చేసుకొని, అందరికీ అందుబాటులోకి వచ్చింది. ధరలను బట్టి క్లాత్ నాణ్యతలో మార్పులు ఉంటున్నాయి. దాదాపు డిజైనర్లందరూ వెల్వెట్తో డ్రెస్ డిజైనింగ్లో ప్రయోగాలు చేస్తుంటారు. లాంగ్ అండ్ షార్ట్ గౌన్లు, కుర్తీలు, లాంగ్ ఓవర్కోట్స్, శారీస్, బ్లౌజ్లను డిజైన్ చేయించుకోవచ్చు. ప్లెయిన్ వెల్వెట్ డ్రెస్లో వెస్ట్రన్ ఔట్ఫిట్స్ను డిజైన్ చేస్తుంటారు. ఇవి, వింటర్ సీజన్లో ఈవెనింగ్ పార్టీలకు స్పెషల్గా రెడీ అవుతున్నాయి. వీటిలో షార్ట్ గౌన్స్, ఓవర్ కోట్స్ ఎక్కువ.ఎంబ్రాయిడరీ వెల్వెట్ క్లాత్పైన మరింత అందంగా కనిపిస్తుంది. దీనివల్ల డ్రెస్కి అదనపు ఆకర్షణ చేకూరుతుంది. సంప్రదాయ వేడుకల్లోనూ డిజైనర్ శారీతో హుందాగా ఆకట్టుకుంటుంది. లెహంగా, చోలీ డిజైన్లలో గ్రాండ్గా వెలిగిపోతుంది. వెల్వెట్ అనేది వంకాయ రంగులోనే కాదు పచ్చ, పసుపు, పింక్.. వివిధ రంగులలో షిమ్మర్తో మెరిసిపోయేవీ ఉన్నాయి. -
మాయిశ్చరైజర్లు వాడుతున్నారా..!
చలికాలంలో చర్మం పొడిబారే సమస్య దాదాపుగా అందరూ ఎదుర్కొనేదే. ఎన్ని క్రీములు రాసినా ఏమాత్రం ఉపయోగం లేదని చాలామంది వాపోతుంటారు. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే ముందు మన చర్మ తత్త్వాన్ని తెలుసుకోవాలి. కొందరికి ఆయిల్ స్కిన్ ఉంటుంది. వీరికి సమస్య పెద్దగా ఉండకపోవచ్చు. కానీ, ఈ కాలంలో పొడి చర్మం గల వారికి పెద్ద సమస్యగా ఉంటుంది. వారి చర్మతత్వాన్ని బట్టి మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. గోరువెచ్చని నీళ్లుఫుల్క్రీమ్ లేదా అయిల్ బేస్డ్ మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానం చేశాక కనీసం పది నిమిషాల్లోపు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. చలిని తట్టుకోవడానికి చాలామంది వేడినీళ్లతో స్నానం చేస్తుంటారు. దీనివల్ల చర్మంపై సహజ నూనెలను కోల్పోతాం. అందుకని, స్నానానికి గోరువెచ్చని నీళ్లు వాడాలి. నిమ్మ, చందనంతో తయారైనవి కాకుండా గ్లిజరిన్, అలోవెరా, ఓట్మిల్క్ బేస్డ్ సోప్స్ స్నానానికి ఎంచుకోవాలి. వింటర్లోనూ సన్స్క్రీన్ను ఉపయోగించాలి.రుద్దకూడదు..డ్రై స్కిన్ ఉన్నవాళ్లు క్లెన్సింగ్ మిల్క్ని రోజుకు ఒకసారైనా ఉపయోగించాలి. స్క్రబ్స్ వంటివి ఎక్కువ ఉపయోగించకూడదు. కొందరు స్నానానికి మైత్తటి కాయిర్ను వాడుతుంటారు. ఈ కాలం దానిని వాడక΄ోవడం ఉత్తమం. పాదాలను రాత్రివేళ శుభ్రపరుచుకొని, ఫుట్ క్రీమ్ లేదా పెట్రోలియమ్ జెల్లీ రాసుకోవాలి. కాలి పగుళ్ల సమస్య ఉన్నవారు సాక్సులు వేసుకోవాలి. కొందరు సీరమ్స్ వాడుతుంటారు. వీటిలో యాసిడ్ కంటెంట్ చాలా తక్కువగా ఉన్నవి ఎంచుకోవాలి.ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్లు జెల్ లేదా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్లు ఉపయోగించుకోవాలి. సోరియాసిస్, వంటి చర్మ సమస్యలు ఉన్నవారు ముందుగానే వైద్యులను సంప్రదించి మందులు తీసుకోవాలి.మేకప్కి ముందు మాయిశ్చరైజర్ మేకప్ చే సుకోవడానికి ముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, తర్వాత మాయిశ్చరైజర్ వాడాలి. మేకప్ తీసేసాక మళ్లీ క్లెన్సింగ్ మిల్క్ను ఉపయోగించాలి. డ్రైస్కిన్ వాళ్లు ఆయిల్ బేస్డ్ ఫౌండేషన్స్ వాడాలి. సూప్లు, జ్యూస్లు..ఆకుకూరలు, కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్, నువ్వులు వంటివి ఈ కాలంలో ఆహారంలో చేర్చుకోవడం, ఉపయోగించడం మంచిది. సాధారణంగా చలికాలంలో చాలామంది తక్కువ నీళ్లు తాగుతారు. కానీ, మన శరీరానికి 3–4 లీటర్ల నీళ్లు అవసరం. నీళ్లు తాగలేక΄ోయినా సూప్లు, జ్యూస్ల రూపంగా తీసుకోవచ్చు. – డా. స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ -
శిల్పంలాంటి ముఖాకృతి కోసం..!
సినీ తారలు, సెలబ్రిటీల ముఖాలు చాలా ప్రకాశవంతంగా రిఫ్రెష్గా కనిపిస్తాయి. వాళ్ల ముఖాల్లో ఇంత గ్లో ఎలా సాధ్యమవుతోంది?. అందరికి వ్యక్తిగతంగా ఏవేవో టెన్షన్లు, ఒత్తిడులు కామన్గానే ఉంటాయి. అయినా అవేమీ వాళ్ల ముఖాల్లో కనిపించకుండా భలే ప్రశాంతంగా నిర్మలంగా కనిపిస్తాయి. అందుకు బ్యూటీ పార్లర్లు, ఫేస్ క్రీంలు మాత్రం కాదని అంటున్నారు నిపుణులు. సినీస్టార్లు ప్రముఖులు, వర్కౌట్లు, వ్యాయామాల తోపాటు ఫేస్ యోగా కూడా చేస్తారని, అది వారి దైనందిన జీవితంలో భాగమమని చెబుతున్నారు. అదే వారి అందమైన ముఖాకృతి రహస్యం అని చెబుతున్నారు. అసలేంటి ఫేస్ యోగా?. ఎలా చేస్తారంటే..?ప్రస్తుత రోజుల్లో ఫేస్ యోగా చాలామంది సెలబ్రిటీలకు ఇష్టమైన వర్కౌట్గా మారింది. ఇది ప్రకాశవంతంగా కనిపించేలా చేయడమే గాక చెక్కిన శిల్పంలా ముఖాకృతి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధాప్య లక్షణాలను కనిపించనివ్వదు, అలాగే ముడతలను నివారిస్తుంది. ఈ ఫేస్ యోగా ముఖం, మెడలోని మొత్తం 57 కండరాలను బలోపేతం చేస్తుంది. అంతేగాదు రక్తప్రసరణ మెరుగ్గా ఉంచి చర్మ ఆరోగ్యాన్ని పెంపొదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖానికి మంచి మసాజ్లా ఉండి సెలబ్రిటీల మాదిరి ముఖాకృతిని పొందేలా చేస్తుందన్నారు. ఎలా చేయాలంటే.. ఫిష్ ఫేస్:ముఖాన్ని చేప మాదిరిగా.. రెండు బుగ్గలను లోపలకు గట్టిగా లాగాలి. ఇది బుగ్గలు, దవడలలోని కండరాలను బలోపేతం చేస్తుంది. ముఖం ఉబ్బడాన్ని తగ్గిస్తుంది. ఈ భంగిమలో ఐదు నుంచి పది సెకన్లు ఉంటే చాలు.'O' మాదిరిగా నోరు తెరవడం..మధ్య ముఖ ప్రాంతాన్ని ఎత్తి చేస్తాం. అంటే ఆంగ్ల అక్షరం 'o' అని పెద్దగా నోరు తెరిచి ఉంచాలి. ఇలా పది నుంచి 15 నిమిషాలు చేయాలి. ఇది ముఖం కుంగిపోకుండా నివారిస్తుంది.ముఖంపై సున్నితంగా టచ్ చేయడం..నుదిటి కండరాల నుంచి ఒత్తిడిని విడుదల చేయడానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి తోడ్పడుతుంది. అలాగే కోపాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రెండు చేతులను నుదిటిపై నుంచి మెడ వరకు సుతి మెత్తంగా టచ్ చేస్తూ పోవాలి.ది ఐ ఓపెనర్కళ్లకు సంబంధించిన వ్యాయామం. కళ్లను పెద్దవిగా చేసి అటు ఇటూ తిప్పడం. అలాగే కొద్దిసేపు గుండ్రంగా తిప్పడం వంటివి చేయాలి. కళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలపరుస్తుంది. కనురెప్పలు కుంగిపోకుండా చేస్తుంది. కిస్సింగ్ అండ్ స్మైలింగ్ పోస్ముఖాన్ని ఇంటి పైకపు చూస్తున్నట్లుగా పైకెత్తాలి. ఈ భంగిమలో పైకి చూస్తూ..కాసేపు నవ్వడం, కిస్ చేస్తున్నట్లుగా గడ్డం పైకెత్తడం వంటివి చేయాలి.ప్రయోజనాలు..వృద్ధాప్య సమస్యలకు చక్కటి సహజసిద్ధమైన పరిష్కారంచర్మపు స్థితిస్థాపకతను పెంచుతుందిముడతలను తగ్గిస్తుందిధృడమైన యవ్వన రూపాన్ని అందిస్తుంది. ముఖ ఉద్రిక్తతను తగ్గించి, ఉబ్బడాన్ని నివారిస్తుంది.చెంప ఎముకలను చక్కటి ఆకృతిలో ఉండేలా చేస్తుందికను రెప్పలు వంగిపోకుండా నివారిస్తుందిఅలాగే ముఖాకృతిని మెరుగుపరుస్తుంది -
ఇదేం మేకప్ సామీ..కన్నీళ్లు పెట్టించేస్తున్నారుగా!
అందానికి సంబంధించి.. సోషల్ మీడియాలో లెక్కలేనన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాదాల దగ్గర నుంచి హెయిర్ వరకు ప్రతిదాని సంరక్షణ కోసం విచిత్రమైన చిట్కాలతో వీడియోలు పోస్ట్ చేసేస్తున్నారు. ఇక మేకప్ విషయానికి వస్తే వామ్మో..! ఆ పదం ఎత్తాలంటేనే భయంగొలిపేలా పిచ్చి పిచ్చి మేకప్లతో జనాలను చంపేస్తున్నారనే చెప్పొచ్చు. ఏవేవో వింత వింత మేకప్ల వీడియోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. వాటిని చూసి జనాలు ఇవేం అందం పోకడలు అని నోరెళ్లబెడుతున్నారు. ఇప్పుడు తాజగా అదే మాదిరిగా ఓ మేకప్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అది చూస్తే.. ఇందుకోసం కూడా మేకప్ అవసరమా అని తలపట్టుకుంటారు. ఇంతకీ ఏంటా మేకప్ అంటే..జపాన్ టిక్టాక్ బ్యూటీ క్రియేటర్ వెనెస్సా ఫ్యూన్స్ ఈ వీడియోని పోస్ట్ చేసింది. అందులో ఆమె హాట్ గ్లూగన్ అనే సరికొత్త మేకప్ గురించి వివరించింది. వేడివేడి జిగురుని ఉపయోగించి "3D టియర్డ్రాప్ మేకప్" వేస్తారు. ఇందులో ఏంటి స్పెషాల్టీ అంటే..మేకప్ ప్రక్రియలో భాగంగా ముఖంపై ప్లాస్టిక్ షీట్ వంటిదాన్ని పరిచి దాని మీద వేడి వేడి వెంట్రుకుల జిగురుని వేయడం జరుగుతుంది. అతి ముఖానికి అతుక్కుపోయిన వెంటనే..ఒలిస్తే కన్నీటి బిందువు ఆకారంలా ముఖంపై రావడం జరుగుతుంది. దీన్ని భావోద్వేగ భరితం లేదా దుఃఖ పూరితంగా కననిపించేలా చేసేందుకు ఈ మేకప్ని ఉపయోగిస్తారట. అంతేగాదు అనుకోని పరిస్థితుల్లో సానుభూతిని సంపాదించుకునేందుకు కూడా ఈ మేకప్ ఉపయోగపడుతుందట. ఆఖరికి ఏడుపుని కూడా మేకప్తో మాయ చేస్తారా అంటూ నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఈ బ్యూటీ ట్రెండ్ చూస్తే.. ఇక రాను రాను కన్నీళ్లకు కూడా విలువ ఉండదేమోకదూ. అయితే నిపుణులు మాత్రం ఇలా చర్మంపై వేడి వేడి జిగురుని వేయడం అనేది మంచిది కాదని, ఇది చర్మ ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. (చదవండి: శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?) -
కనురెప్పలకూ చుండ్రు, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే!
చుండ్రు ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రత్యేకించి శీతాకాలంలో. చుండ్రు అనగానే తలలో మాత్రమే వస్తుందని అనుకుంటాం. కానీ కనురెప్పలు, కనుబొమ్మలపై సైతం చుండ్రు ఏర్పడుతుంది ఇది సాధారణంగా శీతాకాలం లేదా సీజన్ మార్పుల సమయంలో కనిపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణమే అయినా..చికిత్స చేయకుండా వదిలివేస్తే ప్రమాదకరం అని కూడా సూచిస్తున్నారు. ఇది ఎందుకు వస్తుంది, లక్షణాలు, నివారణ మార్గాలు చూద్దాం రండి!కనురెప్పలతోపాటు మీసాలు , ముక్కు మీద కూడా చుండ్రు కనిపిస్తుంది! ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా, కనురెప్పల చుండ్రును చికిత్స చేయకుండా వదిలేస్తే కొన్ని తీవ్రమైన ప్రమాదాలొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా లెన్స్ ధరించేవారు, ఇన్ఫెక్షన్లను నివారించడానికి కనురెప్పల చుండ్రు పట్ల జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఐలైనర్, మస్కరాతో నిద్రించే అలవాటు ఉండే వారు కూడా అప్రమత్తంగా ఉండాలి. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (స్టెఫిలోకాకస్) కనురెప్పల ద్వారా ఉత్పత్తి అయ్యే నూనెలలో తగ్గుదల, డెర్మటైటిస్,సెబోరిహెక్ డెర్మటైటిస్ మూలంగా కనుబొమ్మలు, కనురెప్పలపై చుండ్రు సమస్య తలెత్తుతుంటుంది. బ్లెఫారిటస్ డెర్మటైటిస్ వల్ల కనురెప్పల అంచుల్లోవాపు, మంట, ఇరిటేషన్ లాంటివి వస్తాయి. సెబోరిహెక్ డెర్మటైటిస్ లో క్రానిక్ ఇన్ఫ్లమేటరీ స్కిన్ కండిషన్ ఎదుర్కొంటాం. లక్షణాలుకనురెప్పల చుండ్రు బైటికి పెద్దగా కనిపించకపోయినప్పటికీ, కనురెప్పల దురద, కనురెప్పలు ఎర్రగా మారడం, కళ్లలో మంట లేదా కనురెప్పల అడుగుభాగంలో పొలుసుల చుండ్రు , కళ్ల వెంబడి నీళ్లు, వెలుగు చూడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వెంట్రుకలపై చుండ్రు ఉండటం కేవలం సౌందర్య సమస్య కాదు, కంటి ఆరోగ్యానికి తీవ్రమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది.కళ్లు ఎప్పుడూ చికాకు పెట్టడం, ఎర్రబడటం, కను బొమ్మలు ఊడిపోవడం పొడిబారడం, కార్నియల్ దెబ్బతినడం స్టైస్ లాంటి సమస్యలొస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే, కండ్లకలక లేదా కెరాటిటిస్ (కార్నియా వాపు) వంటి దీర్ఘకాలిక కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇరిటేషన్ వల్ల కళ్లను ఎక్కువగా రుద్దడం వల్ల కార్నియాలు బలహీనపడతాయి, ఇది కెరాటోకోనస్ (కార్నియా సన్నబడటానికి, కోన్ ఆకారంలోకి ఉబ్బడానికి కారణమయ్యే కంటి వ్యాధి) వంటి పరిస్థితులకు దారితీయవచ్చు.చిట్కాలు: రాత్రి పడుకోబోయే ముందు టేబుల్ స్పూను బాదం ఆయిల్ తీసుకుని దాన్ని వేడి చేసి, గోరువెచ్చగా ఉన్నపుడు కనుబొమ్మలు, కనురెప్పల మీద సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయం లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కనురెప్పలు, కనుబొమ్మలు శుభ్రంగా కడుక్కోవాలి.కల్లీలేని కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలిపి, దురదగా ఉన్న చోట్ల మృదువుగా అప్లయ్ చేయాలి .ఫంగస్ కారణంగా కనుబొమ్మలు, కనురెప్పలపై ఏర్పడే చుండ్రు పోగొట్టడానికి టీ ట్రీ ఆయిల్ ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీఫంగల్ సుగుణాలు చాలా ఉన్నాయి. టేబల్ స్పూను టీట్రీ ఆయిల్ తీసుకుని దాన్ని మైక్రోవేవ్ లో కొన్ని సెకన్ల పాటు వేడిచేయాలి. ఈ నూనెను కాటన్ బాల్ సాయంతో కనుబొమ్మలపై, కనురెప్పలపై సున్నితంగా రాసి పది నిమిషాలు అలాగే ఉంచి, తరువాత శుభ్రంగా కడగాలి. నోట్ : ఇది అవగాహనకోసం అందించిన సమాచారం మాత్రమే. సమస్య తీవ్రతను గుర్తించి సమస్య మరీ ముదరకుండా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. -
పెసర పిండితో బ్యూటీ ప్యాక్స్ : మెరిసే మోము
శీతాకాలంలో చర్మం, ముఖం సౌందర్య పట్ల మరింత జాగ్రత్త తీసుకోవాలి. రసాయనాలులేని సహజ పదార్థాలతోనే చర్మ సౌందర్యాన్నిమెరుగు పర్చు కోవడానికి ప్రయత్నించాలి. చర్మాన్ని మృదువుగా చేయడంలోనూ, చర్మానికి మెరుపును ఇవ్వడంలోనూ, చక్కటి రంగు తేలేలా చేయడంలోనూ పెసలు చక్కగా పని చేస్తాయి. ఈ నేపథ్యంలో పెసర పిండితో కొన్ని చిట్కాలను ఇపుడు చూద్దాం! టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. -
శీతాకాలం చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?
శీతాకాలం అనంగానే అందరికి ఎందురయ్యే ప్రధాన సమస్య చర్య పొడిబారడం. దీని వల్ల దద్దుర్లు, ఒక విధమైన దురద మంట వస్తాయి. అలాగే చర్మం కూడా అసహ్యంగా మారిపోతుంది. తాకినప్పుడుల్లా గరుకుదనంతో మంటగా ఉంటుంది. అలాంటి సమస్యకు ఇంట్లో దొరికే వాటితో ఈజీగా చెక్ పెట్టొచ్చు . అదెలాగో చూద్దామా..!.టీ స్పూన్ పెసరపిండిలో పచ్చిపాలు కలిపి మిశ్రమం తయారుచేసుకోవాలి. దీనిని ముఖానికి మాస్క్లా వేయాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పొడిచర్మాన్ని ఈ మాస్క్ మృదువుగా మారుస్తుంది.పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగు, కొబ్బరి నూనె చర్మాన్ని మరింత మృదువుగా మారుస్తాయి.టేబుల్ స్పూన్ పెసర్లు, ఐదు బాదంపప్పులు రాత్రి నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే వీటిని పేస్ట్ చేసి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేస్తే చర్మం పొడిబారడం సమస్యే దరిచేరదు. (చదవండి: పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ఆపిల్, అరటిపండ్లతో ఇలా చేయండి..!) -
పెదవులు గులాబీ రంగులో మెరవాలంటే ..!
చలికాలంలో పెదాలు పొడిబారినట్లుగా అయిపోయవడమే గాక ముఖం, చర్మం కాంతి విహీనంగా మారుతుంది. ఓపక్క పని ఒత్తిడి వల్ల కళ్లకింద నలుపు, ముఖంంపై ముడతలతో అందవిహీనంగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని ఆరోగ్యం కోసం తినే ఫ్రూట్స్తో చెక్పెడదాం. అదెలాగో చూద్దామా..కీరదోసకాయని చక్రాల్లా కోసుకుని కళ్ళమీద పెట్టుకుంటే కంటి అలసట తగ్గుతుంది. రెండు స్పూన్ల చల్లని పాలలో కాటన్ బాల్స్ని ముంచి కళ్ళ చుట్టూ వలయాకారంగా మర్ధించి 20 నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే కంటి కింద నలుపు తగ్గి అందంగా ఉంటాయి. మెడ మురికి పట్టేసినట్లు నల్లగా ఉంటే... నాలుగు టీ స్పూన్ల పుల్లటి పెరుగులో రెండు స్పూన్ల బియ్యప్పిండి కలిపి మెడకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మానికి పట్టిన నలుపుతోనాటు ముడతలుపోతాయి.టీ స్పూన్ అరటిపండు గుజ్జులో టీస్పూన్ తేనె కలిపిన మిశ్రమాన్ని పెదవులకు రాసి మసాజ్ చేసి గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే నల్లని పెదవులు గులాబీ రంగులోకి మారతాయి.టీస్పూన్ పాల మీగడ, అయిదారు గులాబి రేకులు తీసుకుని పేస్ట్ చేసిన మిశ్రమాన్ని పెదవులకు రాసుకుంటే పెదవులు పొడిబారకుండా మృదువుగా ఉంటాయి. చలికాలంలో లిప్స్టిక్ ఎంత తక్కువ వాడితే అంత మంచిది. లిప్ గార్డ్, మీగడ, వెన్న, నెయ్యి వంటివి రాసుకుంటూ ఉంటే పెదవులు పొడిబారకుండా అందంగా ఉంటాయి. టీ స్పూన్ ఆపిల్ గుజ్జులో టీ స్పూన్ అరటిపండు గుజ్జు, అయిదారు చుక్కల తేనె వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్లా వేసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై ఏర్పడ్డ ముడతలు, జిడ్డు తగ్గి ముఖం మెరుస్తూ కాంతివంతంగా ఉంటుంది. (చదవండి: ఐపీఎల్ ఆటగాళ్ల ‘వేలం'లో మెరిసిన ఆ చిన్నది ఎవరు?) -
ఇంట్లోనే ఈజీగా కర్లీ హెయిర్..!
కొందరికి గిరజాల జుట్టు అంటే ఇష్టంగా ఉంటుంది. నిజానికి వేసుకున్న డ్రెస్కు తగినట్లుగా హెయిర్ స్టైల్ని మార్చేవాళ్లకు చిత్రంలోని ఈ హెడ్ బ్యాండ్ భలే చక్కగా పని చేస్తుంది. అందుకే చాలామంది కేశాలంకరణ ప్రియులు, హెయిర్ స్ట్రెయిటనర్తో పాటు హెయిర్ కర్లర్ వాడుతూ ఉంటారు. ఈ కర్లర్ హీట్లెస్ బ్యాండ్ను వెంట ఉంచుకుంటే, ఎలక్ట్రిక్ కర్లర్తో పని ఉండదు. దాంతో జుట్టు పాడవదు. పైగా ఈ రోలర్ టూల్ను ఉపయోగిస్తే చక్కటి హెయిర్ స్టైల్తో అందంగా మెరిసిపోవచ్చు.ఈ బ్యాండ్స్ చాలా రకాలు, చాలా రంగుల్లో లభిస్తున్నాయి. ఆయా బ్యాండ్స్ని ఆయా పద్ధతుల్లోనే తలకు అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం జుట్టును కొన్ని చిన్నచిన్న పాయలుగా విడదీసుకుని, బ్యాండ్ కిందకు వేలాడుతున్న లేసులకు ఆ పాయలను బిగించి చుట్టి, 2 లేదా 3 గంటల పాటు అలా ఉంచుకోవాలి. అనంతరం లేసుల నుంచి జుట్టును పాయలు పాయలుగా విడదీసేస్తే, జుట్టు మొత్తం కర్లీగా మారిపోతుంది. ఈ టూల్ని చిత్రంలో చూపిన విధంగా తల వెంట్రుకలకు బిగించుకుని ఇంటిపనులు, వంటపనులు చేసుకోవచ్చు, లేదా చక్కగా నిద్రపోవచ్చు. ఈ ఉంగరాలు తిరిగిన జుట్టు ఎక్కువ సమయం ఉండాలన్నా, ఎక్కువ రింగులు తిరగాలన్నా రాత్రి పూట తలకు ఈ బ్యాండ్ పెట్టుకుని పడుకుంటే, ఉదయం లేచేసరికి అందమైన హెయిర్ స్టైల్ మీ సొంతమవుతుంది. ఈ ప్రీమియం కర్లింగ్ మెటీరియల్ 100% సహజమైన, నాణ్యత కలిగిన స్పాంజ్తో రూపొందింది. ఇది ఎలాంటి ప్లాస్టిక్ వాసన రాదు. హానికరం కాదు. పైగా ఇది వాడుకోడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బ్యాండ్ కేవలం రూ.500 కంటే తక్కువ ధరలోనే ఆన్లైన్లో అందుబాటులో ఉంది. నచ్చినవాళ్లకు ఈ టూల్ని బహుమతిగా కూడా ఇవ్వవచ్చు. (చదవండి: నోటిలో నాటే ఇంప్లాంట్స్...) -
అందం అర్థం మారుతోంది..!
‘మిస్ యూనివర్స్’ పోటీలు ఎప్పుడూ ఆసక్తికరమే. అయితే తాజాగా మెక్సికోలో జరిగిన ‘మిస్ యూనివర్స్–2024’కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ పోటీ నేపథ్యంలో కేవలం విజేత గురించి మాత్రమే కాదు ఈ పోటీలోపాల్గొన్న ఎంతోమంది గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. అందానికి సంబం«ధించిన సంప్రదాయ కొలమానాలను సవాలు చేసి వేదిక మీద నిలిచిన వారి మొదలు గృహహింస, లైంగిక హింస బాధితులుగా చీకట్లో మగ్గి ఆ చీకటి నుంచి బయటికి వచ్చి ప్రపంచ వేదికపై వెలిగిపోయిన వారు ఉన్నారు.నలభైలలో...40 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలోపాల్గొన్న మహిళగా బియాట్రిస్ నజోయా తన ప్రత్యేకతను చాటుకుంది. ఎన్నో అడ్డంకులను అధిగమించిన ‘మిస్ యూనివర్స్ మాల్టా’ నజోయా ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది. నజోయా ముగ్గురు పిల్లలకు తల్లి. సింగిల్ మదర్.‘శారీరకంగా, మానసికంగా ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నాను. హీనమైన పరిస్థితులను చూశాను. మనకు తప్ప మన సంతోషానికి తెర వేసే శక్తి ఎవరికీ లేదని నిరూపించాలనుకున్నాను. ఆత్మగౌరవంతో ముందుకు వెళ్లాను. మనం బయటికి ఎలా కనిపించినా లోపల అందంగా ఉంటాం. ఆ అందాన్ని చూడగలగాలి’ అంటుంది నజోయా. ‘నిజానికి ఆమె ఎప్పటికీ విజేత. కంటికి కనిపించని కిరీటం ఆమె తలపై కనిపిస్తుంది’ అంటారు నజోయా అభిమానులు. ఎత్తు ఎంతైనా... అంతెత్తున!ష్యానే మెకింతోష్ అందాల పోటీలో పోటీపడిన వారిలో ఎత్తు తక్కువగా ఉన్న కంటెస్టెంట్గా చరిత్ర సృష్టించింది. ఆమె ఎత్తు 5 అడుగుల 1 అంగుళం. ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్’ ఫైనల్లో మెకింతోష్ ఇచ్చిన సమాధానం న్యాయ నిర్ణేతల హృదయాలను గెలుచుకుంది. ‘నేను చిన్నగా కనిపించవచ్చు... కానీ ఆత్మవిశ్వాసంతో అంతెత్తున కనిపిస్తాను’ ‘మిస్ యూనివర్స్ జిబ్రాల్టర్ 2024’ అందాల కిరీటాన్ని గెల్చుకున్న విజేతగా అందరి దృష్టిని ఆకర్షించింది ష్యానే మెకింతోష్. 34 ఏళ్ల తరువాత ‘మిస్ యూనివర్స్’ పోటీలో జిబ్రాల్టర్కుప్రాతినిధ్యం వహించిన తొలి మహిళగా రికార్డ్ సృష్టించింది. హిజాబ్తో...‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి హిజాబీ (ముస్లిం సంప్రదాయ వస్త్రం హిజాబ్తో) మహిళగా ఖదీజా ఒమర్ చరిత్ర సృష్టించింది. 23 సంవత్సరాల ఖదీజా సోమాలియ నుంచి ‘మిస్ యూనివర్స్’ పోటీలోపాల్గొన్న తొలి మహిళ.కెన్యాలోని శరణార్థి శిబిరంలో జన్మించింది. యార్క్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేట్ అయిన ఖదీజా కమ్యూనిటీ బిల్డింగ్, బ్రాండ్ డెవలప్మెంట్లోప్రావీణ్యం సాధించింది. బ్యూటీ ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, ఫొటోగ్రాఫర్గా రాణిస్తోంది. స్ఫూర్తిదాయకమైన కథలను చెప్పడంలో నేర్పరి. ‘మిస్ వరల్డ్ 2021’ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి హిజాబీగా చరిత్ర సృష్టించింది. బార్బీ బొమ్మకు అందాల కిరీటం!‘ఈసారి విశ్వసుందరి కిరీటాన్ని బార్బీ బొమ్మ గెలుచుకుంది’ అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ‘బార్బీ బొమ్మకు అందాల కిరీటం ఏమిటీ?!’ అనే ఆశ్చర్యంలో ఉండగానే అసలు విషయం తెలిసిపోయింది. ‘మిస్ యూనివర్స్–2024’ అందాల కిరీటాన్ని గెలుచుకున్న 21 సంవత్సరాల విక్టోరియా కెజార్ ముద్దు పేరు... బార్బీ డాల్. కెజార్ అచ్చం ‘బార్బీ’లా ఉంటుందని ఆలా పిలుస్తారు. బ్యూటీ స్పాట్...ఈసారి విశ్వసుందరి పోటీ విజేత కంటే ఎక్కువమంది దృష్టిని ఆకర్షించింది ఈజిప్ట్కు చెందిన లోగినా సలాహ్. చర్మంపై తెల్లటి మచ్చలు (బొల్లి) వల్ల ఎనిమిది సంవత్సరాల వయసు నుంచే ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొంది. సలాహ్ మిస్ యూనివర్స్ పోటీలోకి అడుగుపెట్టడం అనేది ఊహకు కూడా అందని విషయం. సంప్రదాయ సౌందర్య ప్రమాణాలను బ్రేక్ చేసిన వ్యక్తిగా ఎందరికో స్ఫూర్తినిచ్చే చారిత్రక సందర్భం కూడా. బ్లాగర్, ఇన్ఫ్లూయెన్సర్, మోడల్, మేకప్–ఆర్టిస్ట్గా రాణిస్తున్న సలాహ్కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు.‘స్కిన్పాజిటివిటీ’ని ప్రచార అంశంగా తన ప్రయాణాన్నిప్రారంభించి ఎంతోమంది యువతుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపింది సలాహ్. సలాహ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమన్ మాత్రమే కాదు సానుకూల మార్పు, ఆత్మవిశ్వాసం... మొదలైన అంశాలలో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి గొప్ప వక్తగా పేరు తెచ్చుకుంది. న్యూయార్క్లోని బెవర్లీ హిల్స్ ఇంటర్నేషనల్ బ్యూటీ స్కూల్ నుంచి లైసెన్స్ పొందిన సలాహ్ తన సోషల్ మీడియా ΄్లాట్ఫామ్లలో క్రియేటివ్ లుక్స్పై ట్యుటోరియల్స్ను నిర్వహించేది. 2023లో దుబాయ్ ఫ్యాషన్ వీక్లోపాల్గొనడం ద్వారా గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.‘బియాండ్ ది సర్ఫేస్ మూమెంట్’ వేదిక ద్వారా బాలికలు, యువతులలో సామాజిక స్పృహ కలిగిస్తోంది. దుబాయ్లో నివసిస్తున్న 34 సంవత్సరాల సలాహ్ ఒక బిడ్డకు తల్లి. సింగిల్ మదర్.‘మిస్ యూనివర్స్ 2024’లో లోగినా సలాహ్ టాప్ 30లో చోటు సాధించింది. బంగారు పక్షి‘మిస్ యూనివర్స్’ కిరీటం మిస్ అయిపోయినా ‘గోల్డెన్ బర్డ్’ కాస్ట్యూమ్తో ఎంతోమంది హృదయాలను గెల్చుకుంది రియా సింఘా. ‘మిస్ యూనివర్స్’కు మన దేశం నుంచిప్రాతినిధ్యం వహించిన రియా సింఘా ధరించిన ‘ది గోల్టెన్ బర్డ్’ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ ఏడాదిప్రారంభంలో ‘మిస్ యూనివర్స్ ఇండియా’ కిరీటాన్ని గెల్చుకున్న సింఘా సింబాలిక్ దుస్తుల్లో రన్వేపై నడుస్తూ ప్రేక్షకులను మంత్రముగ్థుల్ని చేసింది. శ్రేయస్సు, సంపదకు బంగారు పక్షి చిహ్నం. ఈ డ్రెస్ను వియత్నాం డిజైనర్ గుయెన్ ఎన్లోక్ డిజైన్ చేశారు. -
ఈ యూజర్ ఫ్రెండ్లీ మిషన్తో అవాంఛిత రోమాలకు చెక్..!
చాలామంది తమ అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఎక్కువగా రేజర్ను వాడుతుంటారు. దాని వల్ల చర్మం మొద్దుబారడం, వెంట్రుకలు బిరుసెక్కడం, మరింత దట్టంగా పెరగడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే చిత్రంలోని మెషిన్ ఇలాంటి సమస్యలకు ఇట్టే చెక్ పెడుతుంది.ఈ హైపవర్ హెయిర్ రిమూవల్ డివైస్ ఎల్ఈడీ లైట్ థెరపీని కూడా అందిస్తుంది. ఈ ఎపిలేటర్ మెషిన్ మృదువుగా, నొప్పి తెలియకుండా ట్రీట్మెంట్ అందిస్తుంది. వెంట్రుకలను తొలగించే సమయంలో చల్లదనాన్ని అందిస్తుంది. వెంట్రుకలు తొలగిన తర్వాత దురద పుట్టడం, మంట కలగడం వంటి ఇబ్బందులను రానివ్వదు. ఫ్లాష్, మోడ్, లెవల్స్ వంటి ఆప్షన్స్ అన్నీ డివైస్కి ముందువైపు ఉంటాయి. చిత్రంలో చూపిన విధంగా చర్మానికి ఆనించి, వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మెషిన్ సాయంతో వెంట్రుకలు తొలగించుకుంటే గీతలు, మచ్చలు, ముడతలు తగ్గుతాయి. కాళ్లు, చేతులు, నడుము, పొట్ట, అండర్ ఆర్మ్స్, బికినీలైన్ ఇలా చర్మంపై పలుభాగాల్లో వెంట్రుకలను సులభంగా తొలగించుకోవచ్చు. దీని వాడకంతో అవాంఛిత రోమాలున్న చర్మం కాలక్రమేణా మృదువుగా మారుతుంది. రోలర్ అటాచ్మెంట్, ఎల్ఈడీ అటాచ్మెంట్, స్పాట్ అటాచ్మెంట్, ఏసీ అడాప్టర్తో ఈ మెషిన్ లభిస్తుంది. దాంతో ఇది యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది. దీన్ని సులభంగా వెంట తీసుకుని వెళ్లొచ్చు. (చదవండి: ప్రపంచంలోనే అతి పెద్ద ఆటబొమ్మల దుకాణం..!) -
అందాల రాణి ఐశ్వర్య రాయ్ బ్యూటీ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికే ఐకానిక్గా ఉండే సౌందర్యం ఆమె సొంతం. ఎంతమంది అందగత్తలైన ఆమెకు సాటి రారు. అలాంటి అద్భుతమైన అందం ఆమెది. ఐదుపదుల వయసులో కూడా అంతే గ్లామర్గా ఉండటం విశేషం. ఎక్కడ ఐశ్వర్యరాయ కనిపించినా..అందాల రాణి వస్తుందని ఆత్రంగా చూస్తారు. అంతటి ఆకర్షణీయమైన అందాన్ని మెయింటైన్ చేసేందుకు ఐశ్వర్య ఏంచేస్తుందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. అంతేగాదు ప్రతి మహిళ చర్మ సంరక్షణ కోసం ఏం చేయాలో కూడా చెప్పారామె. ఇంతకీ అవేంటో చూద్దామా..!.మాజీ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ఇప్పటికి అంతే ఫిట్గా అందంగా కనిపిస్తారు. ఎక్కడ మచ్చ్చుకైనా..వృద్ధాప్య ఛాయలు కానరావు. అంతలా మేని ఛాయ మెరుస్తూ ఉండేందుకు ఐశ్వర్య ఎంతో కేర్ తీసుకుంటానని చెప్పారు. ఆరోగ్యం కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో అలాగే చర్మ సంరక్షణ కూడా అంతే ముఖ్యమని అంటోంది ఐశ్వర్య రాయ్. తాను కూడా ప్రతి భారతీయ మహిళ ఎలా ఉంటుందో తాను అలానే ఉంటానన్నారు. "అయితే ఆత్మగౌరవంతో, సరైన వ్యక్తిత్వంతో బతకాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రతి స్త్రీ తన ఆత్మగౌరవాన్ని చంపుకుని జీవించాల్సిన పనిలేదు. అదీగాక మహిళలు నిద్ర లేచిన దగ్గర నుంచి గడియారంలోని ముల్లుకంటే వేగంగా ఆగకుండా పనిచేస్తూనే ఉంటారని అన్నారు. అందువల్ల కనీసం కొద్దిసేపైనా మీ కోసం సమయం కేటాయించడం అత్యంత ముఖ్యం. హైడ్రేటెడ్గా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ గౌరవాన్ని ఇనుమడింప చేసే అందంపై దృష్టి పెట్టండి. అందులో ఎలాంటి తప్పు లేదు. తప్పసరిగా మొటిమలు, అలెర్జీలు వంటి బారిన పడకుండా స్కిన్కేర్లు వాడలన్నారు. తప్పనసరిగా మాయిశ్చరైజర్లను వాడమని సూచించింది. వంటపనులతో సతమతమయ్యే మహిళలు తమ చర్మ ఆరోగ్యం కోసం మాయిశ్చరైజర్లు వాడాలని అన్నారు." ఐశ్వర్యరాయ్.(చదవండి: 'తుప్పా దోస విత్ చమ్మంతి పొడి' గురించి విన్నారా?) -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
దీపికా పదుకొణె బ్యూటీ రహస్యం..! ఇలా చేస్తే జస్ట్ మూడు నెలల్లో..
బాలీవుడ్ ప్రసిద్ధ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం, అభినయంతో వేలాది అభిమానులను సంపాదించుకుంది. ఆమె ఇటీవలే పండటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక గ్లామర్ పరంగా దీపికాకి సాటిలేరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆమె మేని ఛాయ, కురులు కాంతిలీనుతూ ఉంటాయి. చూడగానే ముచ్చటగొలిపే తీరైన శరీరాకృతి చూస్తే..ఇంతలా ఎలా మెయింటెయిన్ చేస్తుందా? అనిపిస్తుంది కదూ. ఇంతకీ ఆమె బ్యూటీ రహస్యం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అంతేగాదు దీన్ని రెగ్యులర్గా పాటిస్తే జస్ట్ మూడునెలల్లో దీపికాలాంటి మెరిసే చర్మం, జుట్టుని సొంతం చేసుకోవచ్చట. అదేంటో చూద్దామా..!.మనం తీసుకునే ఆహరమే చర్మం, జుట్టు ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతుంటారు. అందుకే తాజా పండ్లు, కూరగాయాలకు ప్రాధాన్యత ఇవ్వండని పదేపదే సూచిస్తుంటారు. అయితే ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ పూజ అనే మహిళ జ్యూస్ రెసిపీతో కూడిన వీడియో పోస్ట్ చేసింది. అందులో ఇది బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు మూడు నెలల్లో మెరిసే చర్మం, మెరిసే జుట్టుని పొందడంలో సహయపడిందని పేర్కొనడంతో ఈ విషయం నెట్టింట తెగ వైరల్గా మారింది. నిజానికి ఆ జ్యూస్ రెసిపీలో ఉపయోగించిన పదార్థాలన్నీ ఆరోగ్యకరమైనవే. పైగా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉన్నాయి. ఆ జ్యూస్ ఏంటంటే..వేప, కరివేపాకు, బీట్రూట్, పుదీనాలతో చేసిన జ్యూస్. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, బయోస్కావెంజర్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉపయోగించినవన్నీ మంచి చర్మాన్ని, బలమైన జుట్టుని పొందడంలో ఉపయోగపడేవే. ప్రయోజనాలు..వేప ఆకులు: ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. కాబట్టి వేప ఆకులు శరీర నిర్విషీకరణకు దోహదం చేస్తాయి. ఇది మొటిమలను నియంత్రించి చర్మ కాంతివంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. బీట్రూట్: ఇందులో ఐరన్, ఫోలేట్, విటమిన్ సీలు ఉన్నాయి. ఇవి రక్త ప్రసరణకు, శరీరంలో కొత్త కణాలు ఏర్పడటానికి ముఖ్యమైనవి. ఇది చర్మాన్ని మృదువుగానూ, ఆర్యోకరమైన రంగుని అందిస్తుంది. అలాగే జుట్టు స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర ఆకులు: దీనిలో విటమిన్ ఏ, సీ కేలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుద్దీ చేసి మేని ఛాయను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఇది జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచడమే గాక హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తుంది.పుదీనా ఆకులు: పుదీనా యాంటీఆక్సిడెంట్ లక్షణాల తోపాటు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది వేడిని తగ్గించి శరీరాన్ని లోపలి నుంచి పునరుజ్జీవింపజేపసి మొటిమలను నివారిస్తుంది. తయారీ విధానం..కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు, కరివేపాకు, వేపాకులు, కొత్తిమీర, పుదీనా వంటి పదార్థాలన్ని మిక్కీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పిప్పితో సహా తాగడం కష్టంగా ఉంటే..వడకట్టుకుని తాగినా మంచి ఫలితం ఉంటుంది. దీన్ని ఉదయాన్నే తాజాగా తీసుకోవాలి. ఇలా క్రమంతప్పకుండా కనీసం మూడు నెలలు ఈ జ్యూస్ని తీసుకుంటే కాంతివంతమైన మేని ఛాయ, ఒత్తైన జుట్టు మీ సొంతం.(చదవండి: అమెరికాలో ... శాస్త్రీయ నృత్య రూపకంగా దుర్యోధనుడు) -
ఏళ్లు గడుస్తున్నా యంగ్గానే..!
వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి. అది యవ్వనంలో ఉండే మెరుపును, బిగుతును కోల్పోతుంది. చర్మంలోని బిగుతూ, మిసమిస పది కాలాల పాటు ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం...చర్మంపై వయసు ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి అన్నిరకాల పోషకాలు ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్లో ఈ పోషకాలు ఎక్కువ. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండటంతో పాటు శరీరంలోని లవణాలను కోల్పోకుండా చూసుకోండి. దీనివల్ల హైడ్రేటెడ్గా ఉంటారు. ఫలితంగా చర్మం ఆరోగ్యకరమైన మేని మెరుపు తో నిగారిస్తూ ఉంటుంది. గోరువెచ్చని నీళ్లతో... తక్కువ గాఢత ఉన్న మైల్డ్ సోప్లు వాడటమే మంచిది. మంచి మాయిశ్చరైజేషన్ లోషన్స్తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవాలి. రోజూ ఎండకు వెళ్లే వారు మంచి సస్స్క్రీన్ లోషన్స్ ఉపయోగించాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా సౌకర్యవంతమైన దుస్తులు ధరించాలి. చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్ను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకోవాలి. ఈ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వయసు పెరుగుతున్నప్పటికీ చర్మం ఏజింగ్ ప్రభావానికి గురికాకుండా ఉంటుంది. (చదవండి: గంటలకొద్ది కూర్చొని పనిచేసే వాళ్లకు ది బెస్ట్ వర్కట్లివే..!) -
వజ్రాభరణాలు : షైనింగ్ పోకుండా ఉండాలంటే ఎలా? పాలిష్ చేయించొచ్చా?!
పండుగలు పెళ్లిళ్లలో అందమైన పట్టుచీరకు, డైమండ్ నగలు మరింత అందాన్ని తెస్తాయి. ఒకసారి వేసుకొని మర్చిపోయేవుకాదు డైమండ్ ఆభరణాలు అంటే. చాలా ఖరీదైనవి కూడా. ఎప్పటికి మన అందాన్నీ ఇనుమడింప చేసే డైమండ్ నగలు మెరుపు పోకుండా షైనింగ్ ఉండాలంటే ఏం చేయాలి? ఇవిగో టిప్స్ మీకోసం!స్నానం చేసేటప్పుడు డైమండ్ ఆర్నమెంట్స్ను తీయాలి. మైల్డ్ సోప్, మైల్డ్ షాంపూ అయితే ఫరవాలేదు. కానీ గాఢత ఉన్న సబ్బులు, షాంపూలతో స్నానం చేస్తే వాటిలోని రసాయనాల దుష్ప్రభావం ఆభరణాల మీద పడుతుంది.రోజువారీ ధరించే చెవి దిద్దులు, ఉంగరాలు, లాకెట్, బ్రేస్లెట్లు ఎక్కువగా సొల్యూషన్ బారిన పడుతుంటాయి. వాతావరణంలో సొల్యూషన్ కారణంగా ఆభరణాల్లో అమర్చిన డైమండ్ మీద మురికి పేరుకుంటుంది. జిడ్డుగా కూడా మారుతుంది. దాంతో డైమండ్ మెరుపు తగ్గుతుంది. వేడి నీటిలో లిక్విడ్ సోప్ నాలుగు చుక్కలు కలిపి అందులో ఆభరణాన్ని పది నిమిషాల సేపు నానపెట్టి ఆ తర్వాత మెత్తటి బ్రష్తో సున్నితంగా రుద్దాలి. సబ్బు అవశేషాలు ఆభరణం మీద మిగలకుండా శుభ్రమైన నీటిలో ముంచి కడగాలి. నీటిలో నుంచి తీసి మెత్తని నూలు వస్త్రం మీద పెట్టి మెల్లగా అద్దినట్లు తుడవాలి. బేకింగ్ సోడా మంచి క్లీనింగ్ ఎలిమెంట్. కానీ తక్కువ క్వాలిటీ డైమండ్ ఆభరణాలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా వాడకూడదు. పైన చెప్పుకున్నవి కట్ డైమండ్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అన్కట్ డైమండ్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆభరణం తయారీలో అన్కట్ డైమండ్ వెనుక సిల్వర్ ఫాయిల్ అమరుస్తారు. వెండి వస్తువులు గాలి తగిలితే నల్లబడినట్లే అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ కూడా అంచులు నల్లబడతాయి. వాటిని గాలి దూరని బాక్సులో భద్రపరచాలి.ఇటీవల వేడుకల్లో ఎయిర్కూలర్లో పెర్ఫ్యూమ్ కలుపుతున్నారు. వాటి ప్రభావంతో కూడా అన్కట్ డైమండ్ ఆర్నమెంట్స్ నల్లబడే ప్రమాదముంది. అన్కట్ డైమండ్ ఆర్నమెంట్ మెరుపు విషయంలో ఇంట్లో ఏ ప్రయత్నమూ చేయకూడదు. అవి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి ఆభరణాల తయారీ దారులతో పాలిష్ చేయించుకోవాలి.ఆభరణాలు పెట్టే ప్లాస్టిక్ బాక్సులకు ముఖమల్ క్లాత్ని గమ్తో అతికిస్తారు. డైమండ్ ఆర్నమెంట్స్ను బీరువాలో భద్రపరిచేటప్పుడు ఈ గమ్ బాక్సుల్లో పెట్టకూడదు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బాక్సు నుంచి తీసి మెత్తని తెల్లని క్లాత్ మీద అమర్చి భద్రపరుచుకోవాలి. -
చెవులు, ముక్కు కుట్టించుకుంటున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!
ఇటీవల కొందరు కనుబొమల దగ్గర, పెదవుల దగ్గర, మరికొందరైతే నాభి దగ్గర కూడా బాడీ పియర్సింగ్ చేయించుకుంటున్నారు. గతంలో సాంప్రదాయికంగా బంగారపు ఆభరణాల తయారీ కళాకారులే ఈ చెవులు కుట్టడాన్ని చేసేవారు. ఇప్పుడైతే చాలాచోట్ల బ్యూటీ సెలూన్లలోనూ పియర్సింగ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడూ చాలామంది నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ చేయిస్తున్నారు.డాక్టర్ల దగ్గరే మేలు... ఇప్పుడు అధునాతన పియర్సింగ్ పరికరాలతో చెవులు, ముక్కు లేదా దేహంలో అవసరమైన చోట్ల పియర్సింగ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియలో రింగులుగా వేయదలచిన లేదా స్టడ్స్గా ఉంచదలచిన బంగారు, వెండి తీగలను ముందుగానే డాక్టర్లు స్టెరిలైజ్ చేశాకే ముక్కుచెవులు కుట్టడం చేస్తున్నారు. ఈ కోణంలో చూసినప్పుడు ఆరోగ్యపరంగా డాక్టర్ల ఆధ్వర్యంలోనే పియర్సింగ్ ప్రక్రియ జరగడం ఎంతో మంచిది. డాక్టర్ల ఆధ్వర్యంలో ఇలా స్టెరిలైజ్ చేశాకే బంగారు రింగు తొడగడం లేదా స్టడ్స్ తొడగడం వల్ల ఇన్ఫెక్షన్ల వంటి ప్రమాదాలు తగ్గుతాయి. ఇలా చెవి, ముక్కు కుట్టడం లేదా అలా కుట్టిన చోట తీగ / స్టడ్ వేయాల్సిన ప్రదేశాల్లో చిన్న రంధ్రం వేసే సమయంలో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు. పియర్సింగ్లో కలిగే అనర్థాలు... ఇన్ఫెక్షన్స్ : కుట్టాల్సిన చోట సెప్టిక్ కాకుండా ఉండేందుకు ప్రక్రియకు ముందూ, ఆ తర్వాతా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఒక్కోసారి ముక్కుకు లేదా చెవికి రంధ్రం వేసిన చోట ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ తర్వాత ఇది మరిన్ని కాంప్లికేషన్లకు దారితీయవచ్చు. సిస్ట్ / గ్రాన్యులోమా ఏర్పడటం : ముక్కు లేదా చర్మంపైన ఇతర ప్రాంతాల్లో కుట్టిన చోట చిన్న బుడిపె వంటి కాయ రావచ్చు. దీన్ని సిస్ట్ లేదా గ్రాన్యులోమా అంటారు. కుట్టగానే చర్మంలో జరిగే ప్రతిస్పందన వల్ల ఈ సిస్ట్ / గ్రాన్యులోమా వస్తుంది. ఇది సాధారణంగా హానికరం కాదు. చాలావరకు దానంతట అదే తగ్గిపోతుంది. ఏదైనా సమస్య వస్తే డాక్టర్కు చూపించి తప్పక చికిత్స తీసుకోవాలి. ఇలా సిస్ట్ / గ్రాన్యులోమా / కీలాయిడ్ వచ్చే అవకాశం ఉన్నవారు చిన్నప్పుడే వేసిన రంధ్రం తప్ప మళ్లీ పియర్సింగ్ చేయించు కోపోవడమే మంచిది. మచ్చ ఏర్పడటం : కొన్ని సార్లు కుట్టే ప్రక్రియలో వేసే రంధ్రం వద్ద మచ్చలా రావచ్చు. ఇలా వచ్చినప్పుడు తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ను సంప్రదించాలి.అలర్జీలు : కొన్ని సందర్భాల్లో కొందరికి కుట్టడానికి ఉపయోగించే బంగారం లేదా వెండి వల్ల అలర్జీ కలగవచ్చు. దీన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ అంటారు. కొందరిలో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వల్ల కూడా ఇలాంటి అనర్థం రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుట్టిన చోట్ల ఇన్ఫెక్షన్ రావడం, దురద, స్రావాలు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా డర్మటాలజిస్ట్ సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి గుర్తుంచుకోండి... శరీర భాగాలకు కుట్టే సమయంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్త పడండి. అంతకు ముందు వైరల్, బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏవీ లేనప్పుడే ముక్కు, చెవులు కుట్టించే ప్రక్రియకు వెళ్లాలి.చెవులు, ముక్కు కుట్టే సమయంలో రంధ్రం పెట్టాల్సిన చోటిని ముందే నిర్ణయించుకోవాలి. తీరా కుట్టే ప్రక్రియ పూర్తయ్యాక రంధ్రం సరైన స్థానంలో లేదని బాధపడటం కంటే ముందే తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఒకటికి రెండు సార్లు చూసుకోవాలి. చెవులు లేదా ముక్కు కుట్టేవారికి ఉన్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అంటే అనుభవజ్ఞుల దగ్గరే ఈ ప్రక్రియ జరిగేలా చూసుకోవడం మంచిది. చెవులు లేదా ముక్కు కుట్టించే ముందుగా ప్రీ–స్టెరిలైజ్డ్ స్టడ్స్ ఉపయోగించి చెవులు, ముక్కు కుడతారు. కాబట్టి అందరిలో అంతగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. చెవులు లేదా ముక్కు కుట్టడానికి 45 నిమిషాల ముందుగా లోకల్ అనస్థీషియా ఇస్తారు కాబట్టి పెద్దగా నొప్పి అనిపించకపోవచ్చు. తేలిగ్గా మచ్చ పడే చర్మతత్వం ఉన్నవారు ముక్కు కుట్టించుకోకపోవడమే మంచిది. ఇలాంటి వారు చెవులు, ముక్కు కుట్టించుకోడానికి ముందే డర్మటాలజిస్ట్ / డాక్టర్ సలహా తీసుకోవడం మేలు. కీలాయిడ్స్ వచ్చే శరీర స్వభావం (శరీరంపై ఏదైనా గాయం అయినప్పుడు ఆ ప్రదేశంలో ఉబ్బినట్లు గా మచ్చ వచ్చే శరీర తత్వం) ఉన్నవారు బాడీ పియర్సింగ్కు వెళ్లకపోవడమే మంచిది. -
చరిత్ర సృష్టించిన అందాల రాణి
మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ (MGI) 2024 టైటిల్ను సాధించి రాచెల్ గుప్తా (20) చరిత్ర సృష్టించింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్లో జరిగిన పోటీలో ఈ కిరీటాన్నిదక్కించుకున్న తొలి భారతీయురాలిగా నిలిచింది. సుమారు 70కిపైగా దేశాలకు చెందిన అందాల రాణులను వెనక్కి నెట్టి భారతదేశానికి టైటిల్ను అందించింది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పంజాబ్లోని జలంధర్లో ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు సంబరాల్లో మునిగిపోయారు. రేచల్ విజయం యవద్దేశం గర్వించేలా చేసిందని కుటుంబ సభ్యుడు తేజస్వి మిన్హాస్ హర్షం వ్యక్తం చేశారు.బ్యాంకాక్ MGI హాల్లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలో రాచెల్ గ్ర్యాండ్ ఫినాలెలో ఫిలిప్పీన్స్కి చెందిన సిజె ఓపియాజాను ఓడించి బంగారు కిరీటాన్ని గెలుచుకున్నారు. ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న తర్వాత అంతర్జాతీయ పోటీలో చోటు దక్కించుకుంది. అలాగే 2022లో 'మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ది వరల్డ్' కిరీటాన్ని కూడా గెలుచుకుంది. ఇకపై రాచెల్ ప్రపంచవ్యాప్తంగా శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించే ప్రపంచ రాయబారిగా ఉండనుంది. ఈ టైటిల్ దక్కించుకున్న తొలి భారతీయురాలిగా రికార్డ్ సృష్టించడమే కాదు, 'అత్యధిక ప్రపంచ అందాల పోటీల కిరీటాలు గెల్చుకున్న తొలి ఇండియన్ లారాదత్తా సరసన చేరింది. కాగా రాచెల్ ఆమె మాడెల్, నటి వ్యాపారి. ఇన్స్టాగ్రామ్లో 10లక్షలకు పైగా ఫాలోవర్లు ఆమె సొంతం. -
ఔషధాల సిరి ఉసిరి : జుట్టు, చర్మ సంరక్షణలో భళా!
ఔషధాల సిరి ఉసిరి. దీని ద్వారా లభించేఆరోగ్య ప్రయోజనాల ఉగరించి ఎంత చెప్పుకునే తక్కువే.చర్మం, జుట్టు ఇలా శరీరంలోని ప్రతి అవయవానికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. విటమిన్ సీ పుష్కలంగా లభించే ఉసిరిలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్, కెరోటిన్, ఐరన్, ఫైబర్ వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇది ఆరోగ్యానికి అనేక అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఉసిరికాయలో యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, జీవక్రియను, దీర్ఘాయువును పెంచడానికి ప్రతిరోజూ ఉసిరి తినాలని చెబుతారు. మనస్సు , శరీరం రెండింటి పనితీరుకు సహాయపడే తీపి, పులుపు, చేదు, ఘాటైన ఐదు రుచులతో నిండిన 'దివ్యౌషధం ఇది. వసాధారణంగా అక్టోబర్ ,నవంబర్ మధ్య వచ్చే కార్తీక మాసంలోదీనికి ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యతుంది. శివుడికి ప్రీతిపాత్రమైందిగా భావిస్తారు.ఉసిరితో వాత, కఫ , అసమతుల్యత కారణంగా సంభవించే వివిధ శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సాధారణ జలుబు, ఫ్లూ, ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్ కేన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఉసిరికాయతో పచ్చళ్లు, స్వీట్ తయారు చేస్తారు. ఉసిరికాయ గింజలు కూడా మనకు ఎంతో మేలుస్తాయి. అయితే దీనిని పచ్చిగా, రసం, చూర్ణం, మిఠాయి, సప్లిమెంట్ల రూపంలో తీసుకోవచ్చు. జుట్టుకుఆమ్లా ఆయిల్తో తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగా ఫోలికల్స్ బలపడతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. నల్లగా నిగనిగ లాడే మెరుపు వస్తుంది. జుట్టును బలోపేతం చేయడమే కాదు తొందరగా తెల్లబడకుండా కూడా చేస్తుంది. స్కాల్ప్ను కూడా బలపరుస్తుంది. చుండ్రు రాకుండా కాపాడుతుంది. చర్మం కోసంసహజ రక్త శుద్ధిలా పనిచేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా, యవ్వనంగా చేస్తుంది. మొటిమలు, మచ్చలు, ముడతలను నివారణలో సహాయపడుతుంది. జీవనశైలి,కాలుష్యం, సూర్యరశ్మితో వచ్చే స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. అంతేకాదు ఉసిరి కుష్టు వ్యాధి, సోరియాసిస్, చర్మ అలెర్జీలు , తామర వంటి వివిధ చర్మ పరిస్థితుల చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు.యాంటీ ఏజింగ్ పవర్హౌస్లా పనిచేస్తుంది. ఆమ్లా పేస్ట్ లేదా పౌడర్తో ఫేస్ మాస్క్ను అప్లై చేయడం వల్ల చర్మానికి తేలికపాటి ఎక్స్ఫోలియేషన్ను అందిస్తుంది, మృత చర్మ కణాలను,మలినాలను సమర్థవంతంగా తొలగిస్తుంది.మచ్చలపై ఉసిరి పేస్ట్ను అప్లయ్ చేయవచ్చు. ఉసిరి రసాన్ని వాడవచ్చు. లేదా ఫేస్ ప్యాక్గా కూడా అప్లై చేయవచ్చు. -
మెరిసే మేని చాయను కాపాడుకోడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
మారుతున్న వాతావరణ పరిస్థితుల మధ్య మేని ఛాయను కాపాడుకోవడం చాలాకష్టం. కాలుష్యం, సూర్యకిరణాల ప్రభావం నుంచి రక్షణ పొందాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవేంటో చూద్దామా! తక్షణ తాజాదనం కోసం రోజ్ వాటర్ లేదా దోసకాయ రసంతో మేనికి మర్దనా చేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. పచ్చి పాలను కాటన్ బాల్తో అద్దుకొని, ముఖానికి రాయాలి. 10 నిమిషాలపాటు అలాగే ఉంచి కడిగేయాలి. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది, ఇది చర్మాన్ని సున్నితంగా ఉంచడంతోపాటు శుభ్రపరుస్తుంది.చర్మంపై నుంచి సహజ నూనెలను ΄ోకుండా ఉండటానికి చర్మతత్వానికి సరి΄ోయే తేలిక΄ాటి, క్లెన్సర్ని ఉపయోగించాలి. ఓట్మీల్లో తేనె, కొద్దిగా నీళ్లతో కలిపి పేస్ట్ చేయాలి. మృత చర్మ కణాలను తొలగించడానికి, పోర్స్ను శుభ్రం చేయడానికి సున్నితంగా స్క్రబ్ చేయాలి.ప్రతిరోజూ కలబంద జెల్ను రాసి, మృదువుగా మర్దనా చేయాలి. దీని వల్ల చర్మం నునుపుగా, తేమగా ఉంటుంది. టేబుల్ స్పూన్ తేనెను, టేబుల్ స్పూన్ పెరుగుతో కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ చర్మాన్ని కాంతిమంతం చేస్తుంది.సగం అరటిపండును మెత్తగా చేసి, టీస్పూన్ తేనెతో కలపాలి. చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుంది.కొద్దిగా గ్రీన్ టీని కాచి, చల్లబరచాలి. ఈ నీటిని దూదితో అద్దుకుంటూ, మేనికి పట్టించాలి. ఎండకు కమిలిన చర్మం తాజాగా మారుతుంది. -
టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!
ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను నెటిజన్లతో ఎప్పటికప్పుడూ షేర్ చేసుకుంటుంటారు. ఆ ప్రక్రియలకు సంబంధించి..కాంతివంతమైన చర్మం కోసం ఏం చేయాలో ఇంతకమునుపు పంచుకున్నారు. తాజాగా జుట్టు రాలు సమస్యను అరికట్టడం, సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలను షేర్ చేశారు. జన్యుపరంగా బ్రయాన్కి బట్టతల రావాల్సి ఉంది. అయితే ఆయన వృద్ధాప్యాన్ని నెమ్మదించే ప్రక్రియల్లో భాగంగా తీసుకుంటున్న చికిత్సలు కారణంగా ఆ సమస్య బ్రయాన్ దరిచేరలేదు. ఆ క్రమంలోనే బ్రయాన్ తాను జుట్టు రాలు సమస్యకు ఎలా చెక్పెట్టి కురులను సంరక్షించుకునే యత్నం చేశారో వెల్లడించారు. తనకు 20 ఏళ్ల వయసు నుంచి జుట్టు రాలడం ప్రారంభించి బూడిద రంగులో మారిపోయిందట. అలాంటి తనకు మళ్లీ ఇప్పుడూ 47 ఏళ్ల వయసులో జుట్టు మంచిగా పెరగడం ప్రారంభించింది. అలాగే జుట్టు రంగు కూడా మంచిగా మారిందని చెప్పుకొచ్చారు. జుట్టు పునరుత్పత్తికి తాను ఏం చేశానో కూడా తెలిపారు బ్రయాన్. ముఖ్యంగా ప్రోటీన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, జుట్టుని పునరుద్ధరించడంలో కీలకపాత్ర పోషించాయని అన్నారు. మెలటోనిన్, కెఫిన్, విటమిన్ డీ-3 వంటి పోషకాహారం తోపాటు రెడ్ లైట్ థెరపీని కూడా తీసుకున్నానని అన్నారు. అంతేగాదు ఈ రెడ్లైట్ థెరపీని రోజంతా తీసుకునేలా ప్రత్యేకమైన టోపీని కూడా ధరించినట్లు వివరించారు. ముఖ్యంగా తలనొప్పి వంటి రుగ్మతలు దరిచేరకుండా జాగ్రత్త పడాలి. దీంతోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం వంటివి చేస్తే కచ్చితంగా జుట్టు రాలు సమస్యను నివారించగలమని అన్నారు. అలాగే తాను జుట్టు సంరక్షణ కోసం ఎప్పటికప్పుడూ హెయిర్ గ్రోత్ థెరపీలను అందిస్తున్న కంపెనీలతో టచ్లో ఉండేవాడినని చెప్పారు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడం గురించి ఆలోచించాల్సిన పని ఉండదని, భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కాగా, బ్రయాన్ వృద్ధాప్యాన్ని తిప్పి కొట్టేలా యవ్వనంగా ఉండేందుకు ఇప్పటి వరకు అత్యాధునికి వైద్య చికిత్సల నిమిత్తం సుమారు రూ. 16 కోట్లు దాక ఖర్చు పెట్టిన వ్యక్తిగా వార్తల్లో నిలిచాడు. ఆ ప్రక్రియలో భాగంగా శరీరంలోని మొత్తం ప్లాస్మాని కూడా మార్పిడి చేయించుకున్నారు బ్రయాన్ . (చదవండి: 'స్వీట్ స్టార్టప్': జస్ట్ కప్ కేక్స్తో ఏడాదికి ఏకంగా..!) -
అలియా లాంటి మెరిసే చర్మం కోసం..!
బాలీవుడ్ నటి అలియా భట్ ఎంత గ్లామరస్గా కనిపిస్తుందో చెప్పాల్సిన పనిలేదు. మచ్చలేని చందమామలా ఉండే అలియా సౌందర్యాన్ని ఇష్టపడని వారుండదరు. అలాంటి మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అయితే చాలంటున్నారు నిపుణులు. ప్రస్తుతం అలియా కాశ్మీర్లో ఉంది. త్వరలో ప్రేక్షకుల మందుకు రానున్న అల్ఫా మూవీ చిత్రీకరణలతో బిజీగా ఉంది. అక్కడ నో మేకప్ లుక్లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. సూర్యుడే దిగి వచ్చి ముద్దాడేలా క్యూట్గా ఉన్న ఆమె ముఖ కాంతికి ఫిదా కాకుండా ఉండలేం. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) అంతటి చలిలో కూడా చక్కగా గ్లామర్ మెయింటైన్ చేస్తూ..అలియాలా అందంగా కనిపించాలంటే నిపుణులు ఈ చిన్నపాటి చిట్కాలను ఫాలోకండి అని చెబతున్నారు. శీతాకాలంలో సైతం చర్మం పాడవ్వకుండా అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు బ్యూటీ టెక్నిక్స్ ఫాలో అవ్వాలని తెలిపారు బ్రైన్ మావర్ డెర్మటాలజిస్ట్, డాక్టర్ హుసింజాద్తరుచుగా మాయిశ్చరైజర్ చేయడం..సెరామైడ్లు, హైలురోనిక్ యాసిడ్, పెట్రోలియం జెల్లీ కలిగిన మాయిశ్చరైజర్లు చర్మంలోని తేమని నిలుపుకోవడంలో సహాయపడతాయి. తేలికపాటి లోషన్ల కంటే చిక్కటి క్రీములు ఎంచుకోండి. శీతాకాలంలో ఇలాంటి మాయిశ్చరైజర్లు అత్యంత ప్రభావవంతంగా ఉంటాయి.హైడ్రేటింగ్ క్లెన్సర్లకు మారండిచలికాలంలో, ముఖంపై కఠినమైన క్లెన్సర్లను నివారించండి. అంటే బాగా గాఢత గల ఫేస్వాష్లను నివారించండి. ముఖం తేమతో ఉండేలా చేసి, శుభ్రపరిచే మంచి ఫేస్వాష్ని ఉపయోగించండి.వేడి నీళ్లు ఎక్కువగా ఉపయోగించొద్దు..శీతాకాలం సాధారణంగా వేడినీళ్లు ముఖంపై జల్లుకునేందుకు ఇష్టపడతాం. కానీ నిపుణులు అభిప్రాయం ప్రకారం..ఇలా అస్సలు వద్దని చెబుతున్నారు. గోరువెచ్చని నీటిని ఉపయోగించమని సూచిస్తున్నారు. బాగా వేడి నీళ్లు ఉపయోగిస్తే చర్మం పొడిగా మారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులుకఠినమైన స్క్రబ్లు,సువాసనగల ఉత్పత్తులను నివారించండికఠినమైన స్క్రబ్లు,సువాసనగల ఉత్పత్తులు పొడి చర్మంపై చికాకుని తెప్పిస్తాయి. మంటకు దారితీసే ప్రమాదం లేకపోలేదు. ఆరోగ్యకరమైన చర్మం కోసం శీతాకాలంలో వీటిని నివారించండి. పొడిచర్మం కలవాళ్లు గాఢమైన సువాసనలేని సబ్బులు, బాడీ వాష్లు ఉపయోగించండి.హైడ్రేట్గా ఉండేలా చూసుకోవాలి..శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి శీతాకాలంలో హైడ్రేషన్ అవసరం. చలికాలంలో పానీయాలు , ఆల్కహాల్ వినియోగం శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే శీతాకాలంలో సైతం ఆరోగ్యకరమైన మెరిసే చర్మం మన సొంతం అని చెబుతున్నారు నిపుణులు. (చదవండి: మానసిక ఆరోగ్యం కోసం 'టిబెటన్ సింగింగ్ బౌల్స్'! ఎలా ఉపయోగపడతాయంటే..) -
ఎల్ఈడీ లిప్ మెషిన్
ఏ ఛాయలో ఉన్నా, ఏ వయసు వారైనా తమ పెదవులు మృదువుగా, చూడచక్కగా ఉండాలనే కోరుకుంటారు. అలాంటి వారికి చిత్రంలోని ఈ డివైస్ చాలా చక్కగా పని చేస్తుంది. ఈ ఎల్ఈడీ లిప్ మెషిన్ అధరాలను అందంగా మార్చేస్తుంది.పదవులపై ముడతలు, పగుళ్లు, గీతలు ఇలా అన్నింటినీ పోగొట్టి, ‘అధర’హో అన్నట్లుగా మెరిపిస్తుంది. ఈ మెషిన్ నాలుగు వేరువేరు మోడ్స్తో, 56 డీప్ పెనిట్రేటింగ్ ఎల్ఈడీ టెక్నాలజీతో యూజర్ ఫ్రెండ్లీగా ఉపయోగపడుతుంది. దీన్ని పెదవులకు ఆనించి, బటన్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. సుమారు 8 వారాల పాటు రోజుకు 3 నిమిషాలు ఈ లిప్ డివైస్తో ట్రీట్మెంట్ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.ఈ మెషిన్ని మీ మేకప్ కిట్లో భాగం చేసుకుంటే పెదవులను అందంగా, సహజంగా దొండపండులా మలచుకోవచ్చు. సురక్షితమైన సిలికాన్ తో రూపొందిన ఈ డివైస్తో ఎలాంటి నొప్పి కలుగదు. వేడి తీవ్రత ఇబ్బందికరంగా ఉండదు. ఈ పరికరం కొలాజన్ ఉత్పత్తిని ప్రేరేపించడంతో పాటు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనితో ట్రీట్మెంట్ ఎవరికి వారు స్వయంగా చేసుకోవచ్చు. అయితే దీన్ని వినియోగించిన ప్రతిసారి పెదవులకు ఆనించే సిలికాన్ భాగాన్ని టిష్యూతో లేదా క్లాత్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. డివైస్కి ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్లెస్గా వాడుకోవచ్చు. చార్జింగ్ బేస్ వేరుగా, ట్రీట్మెంట్ వైబ్రేషన్ మసాజర్ వేరుగా ఉండటంతో వాడకం సులభంగా ఉంటుంది. -
బ్యూటీ విత్ నేచర్!
అందం అంటే.. ఒకప్పుడు ఆడవారి సొంతం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు పురుషులు, స్త్రీలు అనే తేడా లేకుండా అందరూ అందంగా ఉండేందుకు తాపత్రయపడుతున్నారు. నగరంలో సౌందర్య సాధనాల మార్కెట్ భారీగా నడుస్తోంది. అయితే ఇప్పుడున్న యువత తాము వాడుతున్న బ్యూటీ ప్రొడక్ట్స్పై చాలా కచి్చతత్వంగా ఉంటున్నారు. ఎంతలా అంటే ప్రతి ఉత్పత్తిలో ఉన్న పదార్థాలను తరచి తరచి చూస్తున్నారు. వాటి గురించి గూగుల్లో వెతికి అవి తమపై ఎలా ప్రభావితం చేస్తాయి.. తమ శరీర తత్వానికి ఎలా సరిపోతాయి.. వాటిని వాడితే ఎంత ప్రమాదకరం వంటి అంశాలను తెలుసుకుంటున్నారు. మరికొందరు కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ ఉత్పత్తులను మాత్రమే వాడేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంకొందరైతే ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. యువతలో పెరుగుతున్న అవగాహన చర్మ సౌందర్యంతో పాటు, కేశ సంరక్షణ విషయంలో చాలా ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇక చర్మం కూడా నిగనిగలాడాలని, తెల్లగా ఉండాలని అనేక సౌందర్య సాధనాలను వాడుతున్నారు. అయితే వాటిలో కూడా కెమికల్స్ లేని నేచురల్ ప్రొడక్ట్స్ వాడితే భవిష్యత్తులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండబోవని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటి జోలికి వెళ్తున్నారు. ముఖానికి వాడే ఉత్పత్తుల దగ్గరి నుంచి జుట్టుకు వాడే నూనెల వరకూ దాదాపు సహజసిద్ధంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఉదాహరణకు కొబ్బరినూనె దుకాణాల్లో కొనడం కన్నా ఎక్కడైనా నేచురల్గా దొరుకుతుందేమోనని ఆన్లైన్లో వెతుకుతున్నారు. కోల్డ్ ప్రెస్స్డ్ కొబ్బరినూనె, ఆముదం నూనె కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇలా ప్రతి సౌందర్యసాధనం సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.కాస్త జాగ్రత్త మరి.. సహజసిద్ధంగా తయారు చేసిన ఉత్పత్తులు బాగానే పనిచేసినా.. గుడ్డిగా ఏదీ నమ్మకూడదని డెర్మటాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎవరికి ఎలాంటివి పనిచేస్తాయో.. ఎవరి శరీర తత్వానికి ఎలాంటి రెమెడీలు వాడితే బాగుంటుందో తెలుసుకున్న తర్వాతే వాడటం మంచిదని చెబుతున్నారు. ముందు మన చర్మ తత్వం, జుట్టు సాంద్రత తెలుసుకోవాలని పేర్కొంటున్నారు. కాగా, అన్ని వస్తువులు, అన్ని ఔషధాలూ అందరికీ సరిపోవని, ఎవరికి ఎలాంటివి వాడితే మంచిదో ఓ అవగాహనకు రావాలంటున్నారు. ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు ఒకసారి డెర్మటాలజిస్టును సంప్రదించి, దాని గురించి వారితో చర్చిస్తే మంచిదని సూచిస్తున్నారు. నిర్మొహమా టంగా వాడాలనుకుంటున్న ఉత్పత్తుల గురించి చెప్పి.. వారి సలహా మేరకు వాడాలని పేర్కొంటున్నారు. లేదంటే ఎంతకాలం ఎలాంటి ప్రొడక్ట్స్ వాడినా ప్రయోజనం ఉండకపోవచ్చని, అనవసరంగా సమయంతో పాటు డబ్బులు వృథా చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కొన్ని సార్లు చెట్టు నుంచి తీసిన పసరు వంటివి కూడా ఎంత మోతాదులో వాడుతున్నామో తెలియకుండా వాడితే దుష్పరిణామాలు ఉంటాయని, ఏదీ మోతాదుకు మించి వాడటం సరికాదని చెబుతున్నారు.అందరికీ అన్నీ సెట్ కావు.. ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పిన రెమెడీలు అందరి చర్మతత్వం, కేశాలకు సరిపడకపోచ్చు. అందుకే ఏదీ గుడ్డిగా నమ్మడం సరికాదు. మనకు ఎలాంటి రెమెడీలు సరిపోతాయో చూసుకున్న తర్వాతే వాడటం మంచిది. ఏదైనా దీర్ఘకాలిక సమస్య ఉన్పప్పుడు హోం రెమెడీలు వాడటం అస్సలు మంచిది కాదు. సమస్య మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఏ సమస్యకైనా 60 శాతం మేర చికిత్స అవసరం పడుతుంది. 20 శాతం నేచురల్ ఉత్పత్తులు వాడటం వల్ల మెరుగవుతుంది. మరో 20 శాతం మేర రోజువారీ ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. హోం రెమెడీలతో సమస్యలను తీవ్రతరం చేసుకుని మా వద్దకు చాలామంది వస్తుంటారు. అందుకే నిపుణులను సంప్రదించాకే ఏది వాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాలి. – డాక్టర్ లాక్షనాయుడు, కాస్మెటిక్ డెర్మటాలజీ, ఏస్తటిక్ మెడిసిన్ఇన్స్టాలో వీడియోలు చూసి..సమాజంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతగా ఉందో మనకు తెలిసిందే. ఇటీవల సౌందర్యాన్ని పెంపొందించేవంటూ.. పూర్వ కాలంలో పెద్దవాళ్లు వాడే వారంటూ పలు రకాల మొక్కల గురించి సామాజిక మాధ్యమాల్లో తెగ వీడియోలు చేస్తున్నారు. కొందరేమో వంటింట్లో సౌందర్యసాధనాలు అంటూ వీడియోలు పెడుతున్నారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నేచురల్గా అందంగా కనిపిస్తారని, చర్మ సమస్యలు తగ్గుతాయని, జుట్టు రాలిపోకుండా.. ఒత్తుగా పెరుగుతుందని సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వీడియోలను చూసుకుంటూ ఇంట్లోనే సహజసిద్ధంగా ఉత్పత్తులను తయారుచేసుకుంటున్నారు. మళ్లీ పూర్వకాలంలోకి వెళ్తున్నారని చెప్పొచ్చు. -
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
పండుగ వేళ ముఖం కాంతిగా, గ్లోగా కనిపించాలంటే..!
నవరాత్రులు, బతుకమ్మ సంబరాలతో కోలాహలంగా ఈ ఉండే ఈ సమయాన ముఖం డల్గా కాంతి విహీనంగా ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. మన ముఖంలో పండుగ కళ కనిపించేట్టుగా కాంతిగా కనిపించాలంటే ఈ చిన్ని టిప్స్ ఫాలో అయిపోండి. అందుకు పార్లర్ వెంట పరుగులు తీయాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే వాటితోనే ముఖం కాంతిమంతగా, గ్లోగా కనిపించేలా చెయ్యొచ్చు. అదె ఎలాగో సవిరంగా చూద్దాం..!పెరుగు మంచి ఎక్స్ఫోలియేటర్. ఇందులోని లాక్టిక్ యాసిడ్ మృతకణాలను తొలగిస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు టీ స్పూన్ పెరుగు తీసుకుని చర్మానికి పట్టించి వలయాకారంగా వేళ్లతో మర్దనా చేసి వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే ముఖం మీద చారలా పట్టిన మురికి వదులుతుంది. దుమ్ముతో మూసుకు΄ోయిన చర్మరంధ్రాలు శుభ్రపడతాయి. చర్మం పొడిబారినట్లనిపిస్తే టీ స్పూన్ పెరుగు రాసి మర్దన చేసి గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. వార్ధక్యం దగ్గరయ్యే కొద్దీ చర్మం సాగేగుణాన్ని కోల్పోవడంతో చర్మం జారి΄ోతుంటుంది. పెరుగు రాయడం వల్ల చర్మంలో సాగేగుణం బాగుటుంది. చర్మం బిగుతుగా, కాంతివంతంగా యవ్వనంగా ఉంటుంది. పెరుగులోని యాంటీబయాటిక్ సుగుణాలు యాక్నేను తగ్గిస్తాయి. డీ విటమిన్, ప్రోటీన్, ప్రో బయాటిక్లు చర్మానికి పోణనిస్తాయి. పెరుగులో ఇవి కూడా ఉండడం వల్ల పెరుగు మంచి బ్యూటీ ప్రొడక్ట్. మార్కెట్లో దొరికే అనేకరకాల సాధనాలకు బదులు పెరుగును వాడడం మంచిది. శనగపిండి, తేనె వంటి పదార్థాలతో వేసుకునే ఫేస్ ఫ్యాక్లలో కూడా పెరుగును చేర్చుకోవచ్చు. చర్మం పొడిబారి మంటగా అనిపిస్తే ఓ కప్పు పెరుగు తీసుకుని చర్మమంతటికీ పట్టించి ఐదు నిమిషాల తర్వాత స్నానం చేయాలి. పిల్లలకు చర్మం మీద దద్దుర్లు వచ్చినప్పుడు క్రీమ్లు రాయడానికి ముందు ఒకసారి పెరుగు రాసి చూడండి. పెరుగు దేహ ఆరోగ్యానికి మంచి ఔషధం మాత్రమే కాదు, చర్మానికి మంచి పోషకం కూడా. రోజూ పెరుగుతో మర్దన చేస్తుంటే చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు అందంగా మెరుస్తుంది. క్రమంగా తెల్లదనం సంతరించుకుంటుంది.చర్మం చాలాకాలం యౌవనంగా ఉండాటంటే... చక్కెర తక్కువగా తీసుకోవాలి. మిసమిసలాడే మేనికీ, చర్మానికీ సంబంధం ఏమిటో తెలుసుకోవాలంటే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొలాజెన్ను చక్కెర ఏం చేస్తుందో తెలియాలి. చక్కెరతో చేసిన తీపి పదార్థాలు ఎక్కువగా తినేవాళ్లలో అది చర్మాన్ని బిగుతుగా ఉంచేందుకు సహాయపడే కొలాజెన్ను దెబ్బతీస్తుందనీ, దాంతో మితిమీరి తీపి తినేవాళ్ల చర్మం తన బిగువును కోల్పోవడం, దాంతో వయసుకంటే ముందరే సాగినట్లుగా అయిపోవడం జరుగుతుందని అమెరికాకు చెందిన డార్ట్మౌత్ మెడికల్ స్కూల్ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. అందుకే చాలాకాలం పాటు బిగువైన చర్మంతో యౌవనంగా కనిపించాలనుకునేవాళ్లు తీపి పదార్థాలు కాస్త తక్కువగా తీసుకోవడమే మేలు. (చదవండి: భరించలేని తలనొప్పా..నివారించండి ఇలా..!) -
మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం!
ముఖ వర్చస్సును మెరుగుపరచే ఈ పరికరం అందానికి అసలైన సాధనం అంటున్నారు వినియోగదారులు. ఇది కళ్లచుట్టూ ఉండే వాపును, నల్లటి వలయాలను ఇట్టే తగ్గిస్తుంది. వయసుతో వచ్చే చర్మసమస్యలను వేగంగా రూపుమాపుతుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. సౌందర్యాన్ని కోరుకునే మహిళలకు ఇది మంత్రదండం లాంటిది.అర్గనామిక్ డిజైన్ ను కలిగి ఉన్న ఈ మెషిన్ చేతిలో చక్కగా ఇమిడిపోతుంది. ట్రీట్మెంట్కి అనువుగా ఉంటుంది. సుతిమెత్తని శరీరభాగాల్లో సులభంగా మూవ్ అవుతుంది. కళ్ల పక్కన ఇరుకైన ప్రదేశాల్లో అటు ఇటు కదిలించి మసాజ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇందులోని క్రియోథర్మల్ టెక్నాలజీ వల్ల దీనిలో కూలింగ్తో పాటు హీటింగ్ మోడ్ కూడా ఉంటుంది. కోల్డ్ ట్రీట్మెంట్ మోడ్ చర్మాన్ని 50నిఊ వరకు చల్లబరుస్తుంది, ఇది రంధ్రాలను బిగించి, ముఖాన్ని కాంతిమంతం చేస్తుందిఇక హీట్ మోడ్ 108నిఊ వరకు చేరి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనికి ఉన్న క్యాప్ను తొలగించి, దీని హెడ్ను చర్మానికి ఆనించి, మెషిన్ ఆన్ చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెడ్ కలర్ హీట్ మోడ్ను, బ్లూ కలర్ కూల్ మోడ్ను సూచిస్తుంది. ముందే చార్జింగ్ పెట్టుకుని వైర్లెస్గా కూడా వినియోగించుకోవచ్చు. ఇలాంటి పరికరాలను కొనుగోలు చేసేటప్పుడు ఆన్లైన్లో పలు రివ్యూస్ చూసి తీసుకోవడం మంచిది.ఇవి చదవండి: పళ్ల చిగుళ్ల.. సమస్య! ఏ ట్రీట్మెంట్ వాడాలి? -
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్ఆర్ఆర్వై, హెచ్వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
పండగ వేళ: ఫ్యాషన్ అండ్ బ్యూటీ క్వీన్లా మెరవాలంటే..!
పండుగ సీజన్ ఫుల్ స్వింగ్లోకి వచ్చేసింది. వినాయక చవితి తరువాత వరుసగా వచ్చే పండుగల సందడి మామూలుగా ఉండదు. ఇంటిని అందంగా అలంకరించుకోవడం, పిండి వంటలు మాత్రమే కాదు, పండుగకు అందంగా తయారు కావడం, స్పెషల్ ముస్తాబుతో మురిసిపోవడం చాలా సాధారణం. అందుకే ఫెస్టివల్ లుక్లో ఎలా మెరిసి పోవాలో చూద్దాం.శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మం హైడ్రేటెడ్గా ఉంటేనే మెరుస్తూ ఉంటుంది. ఇందుకోసం తగినన్ని నీళ్లు తాగాలి. అలాగే ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం, ఆకుకూరలు, పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపవాసాల సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పల్చటి మజ్జిగ, పండ్ల రసాలు మెనూలో చేర్చుకోవాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే ఫేస్లో చక్కటి గ్లో వస్తుంది. అలాగే ముఖానికి ఇంట్లోనే తయారు చేసుకునేలా ఫేస్ ప్యాక్, జుట్టు అందం కోసం ప్యాక్లు వేసుకోవడం మర్చిపోవద్దు. ఫేస్ ప్యాక్బంగాళాదుంపను మిక్సిలో వేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. ఇందులో కొద్దిగా శనగపిండి, నాలుగు చుక్కల బాదం నూనె, కొద్దిగా తేనె వేసి బాగా కలపండి. ముఖాన్ని ముందుగా శుభ్రం చేసుకున్న తరువాత దీన్ని అప్లయ్ చేసి, పూర్తిగా ఆరడానికి 10-15 నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. ఆ తరువాత సబ్బు, ఫేస్ వాష్ లాంటివి వాడకండి. మీ ఫేస్లోని మెరుపు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ మిశ్రమాన్ని శుభ్రపర్చిన గాజు సీసాలో దాచుకోవచ్చు. చర్మం ముడతలు లేకుండా,కాంతిమంతంగా ఉండాలంటే..: టేబుల్ స్పూన్ మినప్పప్పు, 6 బాదాంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటినీ మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది.∙టేబుల్ స్పూన్ చొప్పున ఆరెంజ్ జ్యూస్, నిమ్మరసం తీసుకొని కప్పు పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని శరీరానికి పట్టించి, ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో స్నానం చేయాలి.జుట్టుకు బలమైన చూర్ణంఅరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.ఫ్యాషన్ అండ్ మ్యాజిక్మంచి కలర్ఫుల్ డ్రెస్లను ఎంచుకోండి. పండుగ సీజన్లో ప్యాషన్ ,లేదా సంప్రదాయ దుస్తులు ఏదైనా సరే మన శరీరానికి నప్పేలా ఉండాలి. డ్రెస్కు సరిపడా సింపుల్, లేదా హెవీ జ్యుయలరీ ఉంటే అద్భుతమైన ఫెస్టివ్ లుక్ మీసొంతం అవుతుంది. -
సాల్మన్ చేపలతో సౌందర్యం..!
మాంసాహారులు ఇష్టంగా తినే సాల్మన్ చేపలు సౌందర్య సంరక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా చర్మ సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మొటిమలు సమస్య నుంచి ముడతల వరకు ప్రతి చర్మ సమస్యలో సమర్థవంతంగా పోరాడటంలో తోడ్పడుతుందని తెలిపారు నిపుణులు. అదెలాగో సవివరంగా చూద్దాం..!.ఆరోగ్యకరమైన మెరిసే చర్మం కోసం తప్పనిసరిగా సాల్మన్ చేపలను ఆహారంలో భాగం చేసుకోవాలని చెబతున్నారు నిపుణులు. ఇది చర్మానికి కావాల్సిన ఆర్థ్రీకరణ పెంచడంలోనూ, ముడతలతో పోరాడటంలోనూ సహాయపడుతుందట. ఈ సాల్మన్ చేప ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటుంది. అందువల్ల ఇవి చర్మం తోపాటు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైనవి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు తేమ అవరోధాన్ని నిర్వహించడమేగాక చర్మం బొద్దుగా, మృదువుగా ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు కాలుష్యం, యూవీ కిరణాల వల్ల వాటిల్లే నష్టం నుంచి రక్షిస్తాయి. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు చర్మాన్ని డ్రై కానివ్వవు. తేమను లాక్ చేసి రోజంతా తాజాగా హైడ్రేటెడ్గా ఉండేలా చేస్తాయి. మొటిమలను నియంత్రిస్తాయి. అలాగే మొటిమలు వల్ల ఎదురయ్యే మంటను కూడా నివారిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది.చర్మాన్ని యవ్వనంగా, దృఢంగా ఉండేలా చేయడంలో కొల్లాజెన్ కీలకం. సాల్మన్లోని అధిక స్థాయి ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను తగ్గిస్తాయి. చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. ఇందులోని విటమిన్ డీ చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడుతుంది. పైగా ముఖ వర్చస్సు పెరుగుతుంది కూడా. అంతేగాదు స్కిన్ ఎలాస్టిసిటీని మెరుగుపరుస్తుంది. మచ్చలు వంటి వాటిని నివారించి స్కిన్ హీలింగ్కు మద్దుతిస్తుంది.(చదవండి: చట్నీ డే: చట్నీ, పచ్చళ్లు, పొడుల మధ్య వ్యత్యాసం..?) -
ఇది.. మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ డివైస్!
ఈరోజుల్లో సౌందర్యాభిలాషులకు తమ వయసును దాచే అద్భుతమైన పరికరాలు మార్కెట్లోకి చాలానే వస్తున్నాయి. ముడతలు, మచ్చలు, గీతలు లేకుండా చర్మానికి నిగారింపునిచ్చి, యవ్వనంతో కళకళలాడేలా మార్చే ఇలాంటి డివైస్లు వెంట ఉంటే, అందాన్ని కాపాడుకోవడం చాలా తేలిక. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ ఫేస్ లిఫ్ట్ మెషిన్ అధునాతన రేడియో ఫ్రీక్వెన్సీ, ఎలక్ట్రికల్ మజిల్ స్టిములేషన్ టెక్నాలజీతో పనిచేస్తుంది.ఈ ప్రొఫెషనల్ ఫేషియల్ మసాజర్ వడలిపోయిన చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, చర్మానికి ఉండే సహజ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి, చర్మాన్ని ప్రకాశవంతంగా మార్చడానికి, చర్మం నిగారింపును పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఈ పోర్టబుల్ మెషిన్ చూడటానికి టార్చ్లైట్లా కనిపిస్తుంది. రీచార్జ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది.ఇది రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీనిలోని రెడ్ లైట్ థెరపీ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు దెబ్బతిన్న కొలాజెన్ పొరను సరిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని బ్లూ కలర్ లైట్ థెరపీ మొటిమలను, మొటిమల వల్ల ఏర్పడే మచ్చలను తొలగిస్తుంది. దీనిలోని రెండు రకాల లైట్ థెరపీలకు మూడు స్థాయిల్లో వైబ్రేషన్ స్పీడ్ను కోరుకున్న విధంగా మార్చుకోవచ్చు. ఈ మెషిన్ ఆన్ అయిన ఆరు నిమిషాల్లో ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. దీని ధర 84 డాలర్లు (రూ.7,044) మాత్రమే!ఇవి చదవండి: అందాలొలికే ఈ బొమ్మలు.. సుమనోహరం! -
చర్మ సంరక్షణకు డార్క్ చాక్లెట్..!
చాక్లెట్ అంటే చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా ఆస్వాదిస్తారు. ఓ చిన్న ముక్క నోట్లో వేసుకుని చప్పరిస్తే ఉండే ఆనందమే వేరబ్బా..!. అలాంటి చాక్లెట్ మీ ముఖ సౌందర్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలను ఇవ్వగలదని చెబుతున్నారు చర్మ సంరక్షణ నిపుణులు. ఈ రోజు అంతర్జాతీయ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా డార్క్ చాక్లెట్ మీ చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుంది? దీని వల్ల కలిగే ప్రయోజనాలు గురించి నిపుణుల మాటల్లో సవివరంగా చూద్దాం. ఇది చర్మానికి మంచి సూపర్ పుడ్. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మానికి మెరుపుని అందించడంలో సహాయపడతాయని చెబుతున్నారు నిపుణులు. చర్మ సంరక్షణకు ఎలా ఉపయోగపడుతుందంటే..డార్క్ చాక్లెట్లో ఫ్లేవనాయిడ్స్ అనే శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తాయి. ముఖంపై ఏర్పడే గీతలు, ముడతలను దూరం చేస్తుంది. హైడ్రేషన్ బూస్ట్: డార్క్ చాక్లెట్ తినడం వల్ల పోషకాలు చర్మ కణాలకు వేగంగా చేరుకుంటాయి. ఫలితంగా చర్మ హైడ్రేషన్ని పెంచి ముఖం మృదువుగా ఉండేలా చేస్తుంది. సన్ ప్రొటెక్షన్: ఇది సన్స్క్రీన్కు ప్రత్యామ్నాయం కానప్పటికీ డార్క్ చాక్లెట్ కొంత యూవీ సంరక్షణను అందిస్తుంది. చాక్లెట్లోని ఫ్లేవనాయిడ్లు సూర్యరశ్మికి చర్మం ప్రతిఘటనను బలపరుస్తుంది. అలాగే కమిలిపోకుండా చేస్తుందిస్ట్రెస్ బూస్టర్: ఒత్తిడి చర్మాన్ని యవ్వన హీనంగా చేస్తుంది. దీనివల్ల పగుళ్లు ఏర్పడి నిస్తేజంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే ఒత్తిడిని తగ్గించి, తాజా యవ్వన మెరుపును మరింత పెంచుతుంది.డిటాక్స్ డిలైట్: డార్క్ చాక్లెట్లో ఉండే మినరల్స్-జింక్, మెగ్నీషియం-కణ పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చర్మాన్ని త్వరగా రిపేర్ చేయడంలో సహాయపడుతుంది.చాక్లెట్ స్మూతీ గ్లో: బచ్చలికూర, బాదం పాలు, అరటిపండుతో పాటు డార్క్ చాక్లెట్ చిన్న ముక్కను స్మూతీలో జోడించండి. ఈ రుచికరమైన మిశ్రమం అద్భుతమైన రుచిని మాత్రమే కాకుండా చర్మానికి లోపలి నుంచి అదనపు మెరుపును కూడా ఇస్తుంది.స్నాక్ స్మార్ట్: రోజువారీ చిరుతిండిలో భాగంగా 70% లేదా అంతకంటే ఎక్కువ డార్క్ చాక్లెట్ని చిన్న ముక్కగా తింటే అద్భుతమైన ఫలితాలు పొందుతారు. చాక్లెట్ బాడీ స్క్రబ్: కరిగించిన డార్క్ చాక్లెట్, పంచదార, కొబ్బరి నూనెతో ఉల్లాసంగా ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్ను తయారు చేయండి. ఈ తీపి స్క్రబ్ శరీరాన్ని మృదువుగా చేయడమే గాక మృత కణాలను తొలగిస్తుంది. (చదవండి: స్ట్రిక్ట్ మామ్ కాజోల్: సరిగా చేస్తే హెలికాప్టర్ పేరెంటింగ్ విధానం బెస్ట్!) -
మల్టీ కలర్ చీరలో నీతా అంబానీ స్పెషల్ అండ్ సింపుల్ లుక్
రిలయన్స్ పౌండేషన్ అధ్యక్షురాలు నీతా అంబానీ ఏ చీర కట్టినా, ఏనగ పెట్టినా అద్భుతమే. ట్రెండ్కు తగ్గట్టుగా ఫ్యాషన్, డిజైనర్ దుస్తులు అందర్నీ ఆకర్షిస్తుంటాయి. చేనేత, ,పట్టుచీరలు, డైమండ్ నగలు, ముత్యాల హారాలతో తనదైన ఫ్యాషన్ సెన్స్తో ఫ్యాషన్ ఐకాన్లా నిలుస్తుంటారామె. ఇటీవల అంబానీ కుటుంబం గణేష్ చతుర్థిని ఉత్సాహంగా నిర్వహించింది. ఈ సందర్బంగా నీతా అంబానీ 'బంధేజ్' చీరలో ప్రత్యేకంగా కనిపించారు.డిజైనర్ జిగ్యా పటేల్ డిజైన్ చేసిన వంకాయ రంగు, గులాబీ రంగుల మల్టీకలర్ బంధేజ్ చీరలో నీతా అంబానీ అందంగా కనిపించారు. ఇక ఆమె వేసుకున్న గుజరాతీ ఎంబ్రాయిడరీతో ఎరుపు రంగు బ్లౌజ్ ప్రత్యేకత ఏంటంటే స్లీవ్లపై గణపతి బప్పా డిజైన్ ఉండటం. ఇంకా ఎనిమిది వరుసల ముత్యాల హారం, డైమండ్ చెవిపోగులు, ముత్యాలు పొదిగిన గాజులు, చేతి రింగ్, ఇంకా సింపుల్గా పువ్వులతో ముడితో ఎత్నిక్ లుక్తో అందర్నీ మంత్రముగ్ధుల్ని చేశారు. ఇటీవల ఎన్ఎంఈసీసీలో జరిగిన ఈవెంట్లో నీతా అంబానీ పట్టు 'పటోలా' చీరలో మెరిసారు. స్టైలిష్ రెడ్-హ్యూడ్ సిల్క్ పటోలాకు మ్యాచింగ్గా రాధా-కృష్ణ-ప్రేరేపిత గ్రాఫిక్ డిజైన్ వర్క్ బ్లౌజ్ ధరించిన సంగతి తెలిసిందే.కాగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, నీతా అంబానీ చిన్న కుమారుడు అనంత్ , రాధిక పెళ్లి తరువాత వచ్చిన తొలి వినాయక చవితి కావడంతో అంబానీ కుటుంబం ఈ గణేష్ చతుర్థి వేడుకలనుఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ తారలు, క్రీడా, వ్యాపార రంగ ప్రముఖులు హాజరై గణపతి బప్పా ఆశీస్సులు తీసుకున్నారు. -
కాకరకాయ ఆయిల్తో ఎన్ని లాభాలో : చుండ్రుకు చెక్, జుట్టు పట్టుకుచ్చే!
కరేలా ఆయిల్ లేదా కాకరకాయ నూనె గురించి ఎపుడైనా విన్నారా? కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, రోజ్ మేరీ గురించి విన్నాం గానీ, ఈ కరేలా హెయిర్ ఆయిల్ ఏంటి అనుకుంటున్నారా? కాకర తినడమే కష్టం.. కాకరకాయ హెయిర్ ఆయిలా? అని తేలిగ్గా తీసి పారేయకండి. కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేదంలో దీన్ని ఔషధంగా వినియోగిస్తున్నారు. జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోపగడే కరేలా ఆయిల్ గురించి తెలుసుకుందాం.కాకరకాయ ఎన్నో ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందింది. దీని నుంచి ఆయిల్ను బిట్టర్ గార్డ్ ఆయిల్, కరేలా ఆయిల్ అని కూడా పిలుస్తారు. ఈ నూనెలో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు , కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మం జుట్టు ,మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జుట్టుకు అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాదు చుండ్రును తగ్గించి, జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి తోడ్పడుతుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలున్న కాకరకాయ నూనె చర్మానికి రాస్తే మృతకణాలు నశించి యవ్వనంగా, కాంతి వంతంగా తయారవుతుంది. ఈ నూనెలో విటమిన్లు ఎ , సి వంటి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, జుట్టు కుదుళ్లకు పోషణనిచ్చి, జుట్టును బలంగా చేస్తాయి. కరేలా నూనెలో సహజ యాంటీ ఫంగల్ , యాంటీమైక్రోబయల్ చుండ్రు , స్కాల్ప్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేస్తుంది, దురద, ఇతర చికాకులనుకూడా ఇది చక్కటి పరిష్కారం.జుట్టు తెల్లబడకుండాకరేలా నూనెను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు తొందరగా నెరసిపోకుండా ఉంటుంది. తల చర్మం, జుట్టు తంతువులు రెండింటినీ హైడ్రేట్ చేస్తుంది. జుట్టును తేమగా ఉంచుతుంది. సహజమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. స్కాల్ప్ లోని సహజ నూనె (సెబమ్) ఉత్పత్తిని నియంత్రిస్తుంది ఇది జుట్టు పెళుసుదనాన్ని తగ్గిస్తుంది. కరేలా నూనెను క్రమం తప్పకుండా మృదువుగా, సున్నితంగా , మెరుస్తూ ఉంటుంది. యాంటీమైక్రోబయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, చిన్న గాయాలు, కాలిన గాయాలకు తొందరగా నయమవుతాయి. -
తెల్లదనం సాధ్యమే..! ఎండకు వాడిన చర్మం..!
టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి వర్కింగ్ విమెన్స్ వరకు అందరూ ఎదుర్కొన్నే సమస్య ముఖం నల్లగా మారి, వాడిపోవడం. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో బయటకు అడుగు పెట్టనదే పని కాదు. అలాంటప్పడు ఎండకు, కాలుష్యానికి గురై చర్మం నల్లగా మారి కమిలిపోవడం జరుతుంది. ఒక విధమైన డల్నెస్తో వాడిపోయినట్లు ఉంటుంది. అందుకోసం పార్లర్లకు పరుగులు తీయాల్సిన పనిలేదు. మనకు దొరికిన టైంలోనే ఇంట్లో మనం అను నిత్యం వాడే వాటితోనే ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. నలుపు దనానికి చెక్పెట్టొచ్చు. ఎలాగో చూద్దామా..!బంగాళదుంప నాచురల్ బ్లీచ్. బంగాళదుంప రసాన్ని ముఖానికి రాసి ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. రసం తీయడం కుదరకపోతే బంగాళదుంపను పలుచగా తరిగి ముఖం మీద పరిచినట్లు అమర్చాలి. అందులోని రసాన్ని చర్మం పీల్చుకున్న తర్వాత ఆ ముక్కలతోనే ముఖమంతటినీ వలయాకారంగా రుద్ది ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే ఎండ తీవ్రత వల్ల, వాతావరణ కాలుష్యం వల్ల నల్లబడిన చర్మం తెల్లబడుతుంది.మెడ దగ్గర నలుపు తగ్గాలంటే... మెడ భాగం జిడ్డుగా, నలుపుగా మారితే బొ΄్పాయిపండు గుజ్జును పట్టించి, పది నిమిషాల మృదువుగా మసాజ్ చేయాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారంలో రెండుసార్లైనా ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది.మోచేతుల నలుపు తగ్గాలంటే నిమ్మ ఉప్పును రాసి, అరగంట ఉంచి, శుభ్రపరుచుకోవాలి.ఆలివ్ ఆయిల్తో మోచేతుల భాగాన్ని మసాజ్ చేసి, ఆ తర్వాత నిమ్మకాయ రసంతో రుద్దితే నలుపుదనం తగ్గుతుంది.పెదాలు నలుపు తగ్గాలంటే బీట్రూట్ ముక్కతో పెదాలను కొద్దిపాటి ఒత్తిడితో మర్దనా చేయాలి.శిరోజాల కోసం చూర్ణం..అరకప్పు డ్రైఫ్రూట్స్... బాదం, పల్లీలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్; అరకప్పు ఓట్స్, పచ్చి శనగపప్పు, పెసరపప్పు కలిపి అరకప్పు, సబ్జా గింజలు అరకప్పు, అవిసె గింజలు అరకప్పు చొప్పున తీసుకుని దోరగా వేయించి చూర్ణం చేసుకుని డబ్బాలో నిల్వ చేయాలి. ఈ పొడిని టేబుల్ స్పూన్ తీసుకుని టీ లేదా స్మూతీలో వేసుకుని తాగాలి. టీ అలవాటు లేని వాళ్లు వేడినీళ్లలో కలుపుకొని రోజూ ఉదయాన్నే తాగితే రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ పొడి జుట్టు సంరక్షణకే గాక ఆరోగ్యాన్నీ మెరుగు పరుస్తుంది.(చదవండి: యూట్యూబర్ వెయిట్ లాస్ జర్నీ: జస్ట్ రెండేళ్లలో ఏకంగా వంద కిలోలు..!) -
వినాయక పందిళ్లలో సందడి చేసే మగువలూ.. మీకోసమే ఈ చిట్కాలు
వినాయక చవితి పండగ వచ్చేసింది. ఈ నవరాత్రులు గణనాథుని సేవలో మునిగిపోతారు..భక్తులు. గణేష్ మంటపాలలో మహిళల సందడి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా చాలా హౌసింగ్ సొసైటీలు, అసోసియేషన్ల ఆధ్వర్యంలో కొలువుదీరే విఘ్ననాయకుడికి రకరకాల నైవేద్యాలు సమర్పిస్తారు. భక్తి గీతాలు, శాస్త్రీయ నృత్యాలతోపాటు అనేక రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. మగువలంతా శుభప్రదమైన ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు రంగు దుస్తుల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. మరీసందర్భంలో ముఖంతోపాటు కాళ్లూ, చేతులపై కూడా శ్రద్ధ పెట్టాలి. మరి అదెలాగో చూసేద్దాం.ఇంట్లో దొరికే వస్తువులతో మాస్క్, స్క్రబ్లను ప్రయత్నించాలి.ఓట్స్- పెరుగుటీ స్పూన్ ఓట్స్ను మెత్తగా పొడిగా చేసుకోవాలి. ఇందులో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లూ చేతులకు బాగా పట్టించాలి. ఆ తరువాత బాగా రుద్దుకని చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేయాలి. టొమాటో స్క్రబ్బాగా పండిన టొమాటో చక్కెర చల్లి, ముఖం, కాళ్లు, చేతులపై బాగా స్క్రబ్ చేసుకోవాలి. కొద్దిసేపు ఆర నిచ్చి చల్లని నీటితో కడిగేసుకోవాలి. అలాగే చల్లని ఐస్ క్యూబ్తో మృదువుగా మసాజ్ చేసి, మాయిశ్చరైజర్ పూసుకోవాలి. టమాటో గుజ్జుని కాళ్ళకి, చేతులకి రాసి మసాజ్ చేయడం వలన కాళ్లు చేతుల మీద ఉండే నలుపు తగ్గుతుంది. టొమాట విటమిన్ సి చర్మాన్ని మెరిసేలా చేయడమే కాకుండా సూర్యకిరణాల నుంచి రక్షిస్తుంది.శనగపిండి, పెరుగు,పసుపు శనగపిండిలో కొద్దిగా పెరుగు, పసుపు కలిపి పేస్టులా చేయాలి. ఈ పిండిని కాళ్లు, చేతులకు రాసి కాసేపు వదిలేయాలి. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ సహజ బ్లీచింగ్ లాగా పని చేస్తుంది.కీరదోసకాయ కీరదోసకాయ గుజ్జుని కాళ్ళకి చేతులకి అప్లై చేసి ఒక 15 నిమిషాల తరువాత వాష్ చేసుకోవాలి. కీర దోసకాయలలో ఉండే విటమిన్ ఏ చర్మం ముదురు రంగులోకి మార్చే మెననిన్ ని కంట్రోల్ చేస్తుంది. నిమ్మరసంలో కూడా సహజ బ్లీచింగ్ లక్షణాలు చర్మం మెరిసే లాగా చేస్తాయి. ఇందులోని విటమిన్ సి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాఫీ పౌడర్ఫిల్టర్ కాఫీ పౌడర్లో చక్కెర కలిపి మసాజ్ చేసుకొని పదినిమిషాల తరువాత కడిగేసుకుంటే, ముఖానికి చేతులకు ఇన్స్టెంట్ గ్లో వస్తుంది. చందమామలా మెరిసిపోతారు. -
పండగల వేళ : చందమామలా మెరిసిపోవాలంటే!
వరుస పండుగల సీజన్ వచ్చేస్తోంది. వినాయక చవితి మొదలు తెలుగుముంగిళ్లు దసరా, దీపావళి,సంక్రాంతి సంబరాలతో కళకళలాడతాయి. అంతేనా ఆడబిడ్డలు పట్టుచీరలు, కొత్త నగలు అంటూ షాపింగ్తో సందడిగా ఉంటారు. దీనికి తోడు గృహిణులు, కొత్తకోడళ్లు, కొత్త పెళ్లి కూతుళ్లు తమ అందానికి మెరుగులు దిద్దుకునే పనిలో బిజీబిజీగా ఉంటారు. మరి ముఖం, చర్మం, మెరుస్తూ చందమామలా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. అవేంటో ఒకసారి చూద్దాం.చర్మం నిగనిగలాడుతూ ఉండాలంటే, చక్కటి ఆహారం తీసుకోవాలి. పండగల సందడిలో స్వీట్లు వగైనా ఎక్కువగా తినేస్తాం కాబట్టి ఒంటికి కాస్తంత పని చెప్పాలి. కనీసం ఓ అరగంట పాటైనా వాకింగ్, యోగా లాంటి వ్యాయామం తప్పని సరి. అలాగే రోజుకు సరిపినన్ని నీళ్లు తాగేలా జాగ్రత్త పడాలి. ఒక ఆరోగ్య సంరక్షణ, ముఖ సౌందర్య విషయానికి వస్తే... కొవ్వు పదార్థాలకు దూరంగా, అప్పుడప్పడు కొన్ని ఆరోగ్యమైన ద్రవాలను తాగుతూఉండాలి. అందమైన చందమామ లాంటి ముఖం కోసం సహజంగా దొరికే వస్తువులో ప్యాక్ వేసుకుంటూ ఉండాలి. ఫేస్ మాస్క్రోజ్ వాటర్తో ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. రోజ్ వాటర్, కలబంద, తేనె సహాయంతో మంచి మాస్క్ వేసుకుంటే ముఖం కొత్త కళతో మెరిసిపోతుంది. రోజ్ వాటర్లో మరికొన్ని సహజసిద్ధమైన ఉత్పత్తులను ఉపయోగించి ఆరోగ్యకరమై ఫేస్ మాస్క్లను తయారు చేసుకోవచ్చు. ఇంకా చర్మాన్ని బట్టి పసుపు, శెనగపిండి, పెరుగు, అలోవెరా మిశ్రమాలతో ప్యాక్ వేసుకొని, ఆ తరువాత ఐస్ ముక్కలతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి.కీరా, పైనాపిల్ జ్యూస్కీరదోసలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉన్నందు వల్ల చర్మాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సహజత్వాన్ని కాపాడతాయి ఇక పైనాపిల్లో ఉండే బ్రొమెలిన్ అనే ఎంజైమ్ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. వాపులను తగ్గిస్తుంది.కీర, పైనాపిల్ ముక్కలు, తాజా పుదీనా ఆకులు వేసి జ్యూస్ చేసుకొని, దీనికి రుచుకోసం నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకొని తాగితే చర్మం యవ్వనంగా, కాంతిమంతంగా మారుతుంది.ముఖంపై మంగు మచ్చులాంటివి కూడా తగ్గుతాయి. క్యారెట్, బీట్రూట్ యాపిల్ జ్యూస్ (ఏబీసీ)ఆపిల్, బీట్రూట్ క్యారెట్ కాంబినేషన్లో జ్యూస్ తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి. యాపిల్, క్యారెట్లో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటే బీట్ రూట్ పోషకాలు మయం.శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. కంటి , చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకాజంక్ ఫుడ్కు దూరంగా ఉండాలి. పచ్చని ప్రకృతిలోగడిపితే ఆరోగ్యానికి ఆరోగ్యం మానసిక వికాసం కూడా. అంతేకాదు స్వచ్ఛమైన గాలి, సూర్యకాంతితో డీ విటమిన్ అందుతుంది. అందమైన చర్మం కోసం ఇది చాలా అవసరం. -
ఎంగేజ్మెంట్ రింగ్, స్టైలిష్ చీరలో శోభితా స్టన్నింగ్ లుక్ : ‘చే’ రియాక్షన్
ప్రముఖ నటి, మోడల్ శోభిత దూళిపాళ్ల అందం, స్టయిలిష్ మరోసారి తన ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసింది. త్వరలో తన డ్రీమ్ బోయ్ నాగ చైతన్యను పెళ్లాడబోతున్న శోభిత తన తాజా ఫోటోషూట్కు సంబంధించిన అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. నారింజ, నలుపు రంగుల మిశ్రమంల ఉన్న ప్రింటెడ్ చీరను ధరించింది. హెయిర్ స్టయిల్ కూడా స్పెషల్గా నిలిచింది. ముఖ్యంగా ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తోంది.ఈ ఫోటోలను చూసిన ప్రముఖ సెలబ్రిటీలు కూడా విస్మయం చెందడం విశేషం. ఇక అక్కినేని ఫ్యాన్స్ అయితే సానుకూల మెసేజ్లతో తమ ప్రేమను వ్యక్తం చేశారు. చీరలో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసించారు. తమ అభిమాన హీరో నాగ చైతన్యకి పర్ఫెక్ట్ సెట్ అవుతారంటూ మరికొందరు కామెంట్స్ చేశారు. ఈ పోస్ట్కు శోభిత కాబోయే భర్త నాగ చైతన్య లైక్ కొట్టాడు.ఇన్ స్టాలో గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ శోభిత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటుంది. ఆగస్ట్ 27న నిశ్చితార్థం పూర్తి చేసుకున్న శోభిత, చైతన్య జంట వచ్చే ఏడాది మార్చిలో మూడు ముళ్ల బంధంతో ఒకటి కానున్నారని తెలుస్తోంది. కాగా పెళ్లి గ్రాండ్గా చేసుకుంటారా, లేక సింపుల్ గానా? అని ఇటీవల ప్రశ్నించినపుడు, మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం, సింపుల్గా పెళ్లి చేసుకోవడమే తనకిష్టమని చైతూ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) -
డార్క్ సర్కిల్స్ భయమే వద్దు, ఈ చిట్కాలు పాటించండి!
కళ్ల చుట్టూ నల్లటి వలయాలు అలసటకు, ఒత్తిడికి అద్దం పడుతూంటాయి. చంద్రబింబం లాంటి ముఖమున్నా, డార్క్ సర్కిల్స్ వేధిస్తూ ఉంటాయి. అందంగా లేమా? అనే అత్మన్యూనత వారిని వెంటాడుతుంది. నిజానికి నల్లటి వలయాలకు కారణాలు అనేకం. జీవనశైలి మార్పులు, వాతావరణ పరిస్థితులు, ఒత్తిడి, నిద్రలేమి , మరికొన్ని ఇతర సమస్యల మూలంగా చాలామందికి కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడతాయి. వీటికి కారణాలు ఏంటి? తగ్గేందుకు ఏం చేయాలో తెలుసుకోండి. చాలా మంది డార్క్ సర్కిల్స్తో బాధపడతారు. తొందరగా వృద్ధాప్య రూపం వచ్చేసిందని ఆందోళనపడతారు. అయితే కొన్ని జాగ్రత్తలు, ఇంట్లోనే లభించే వస్తువులతో తయారు చేసిన చిట్కాలతో డార్క్ సర్కిల్స్నుంచి విముక్తి పొందవచ్చు.డార్క్ సర్కిల్స్ కారణాలుఆందోళన , అలసటరక్త ప్రసరణ సరిగా జరగకపోవడం ఎక్కువ సేపు స్క్రీన్కు ఎక్స్పోజ్ కావడం, కంటి ఒత్తిడిఅలర్జీలు, డీహైడ్రేషన్, థైరాయిడ్ వయసు మీద పడటం అనేది ప్రధాన సమస్య. ఇంటి చిట్కాలుదోసకాయ: దోసకాయ ముక్కలను చక్రాల్లా తరిగి రిఫ్రిజిరేటర్లో చల్లబరచండి. వాటిని మూసిన కనురెప్పలపై సుమారు 10-15 నిమిషాల పాటు ఉంచండి. దోసకాయలు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే కళ్ల వాపు తగ్గి, ,నల్లటి వలయాలు మాయమవుతాయి.టీ బ్యాగ్లు: రెండు టీ బ్యాగ్లను (నలుపు లేదా ఆకుపచ్చ) వేడి నీటిలో నానబెట్టి, ఆపై వాటిని రిఫ్రిజిరేటర్లో చల్లబరచాలి. వాటిని కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. టీలోని కెఫిన్ , యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శాంతపరుస్తాయి.బాదం నూనె: పడుకునే ముందు మీ కళ్ల కింద కొన్ని చుక్కల బాదం నూనెను సున్నితంగా మసాజ్ చేయండి. బాదం నూనెలో విటమిన్లు ఇ , కె పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మపు రంగును మెరుగుపర్చి, కాలక్రమేణా పిగ్మెంటేషన్ను తగ్గిస్తాయి.బంగాళాదుంప రసం: పచ్చి బంగాళాదుంపను తురిమి రసాన్ని తీసుకోవాలి. ఈజ్యూస్లో కాటన్ ప్యాడ్ను నానబెట్టి, కంటి కింద భాగంలో 10-15 నిమిషాల పాటు అప్లై చేయండి. బంగాళాదుంపలలో ఎంజైమ్లు , యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి నల్లటి వలయాలను తగ్గించి, కళ్ల ఉబ్బును తగ్గిస్తాయి.రోజ్ వాటర్: కాటన్ ప్యాడ్లను రోజ్ వాటర్లో నానబెట్టి, మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. రోజ్ వాటర్లోయాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నల్లటి వలయాలను తగ్గించి, కంటి ప్రాంతాన్ని రిఫ్రెష్ చేస్తాయి.వటొమాటో గుజ్జు: తాజా టొమాటో గుజ్జును కళ్ల కింద అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. టొమాటోల్లోలైకోపీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగాఉంటాయి. నల్లటి వలయాలను పిగ్మెంటేషన్ను తొలగిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.పచ్చి పాలు: చల్లని (ముడి) పాలలో కాటన్ ప్యాడ్లను నానబెట్టి, వాటిని మూసిన కళ్లపై 10-15 నిమిషాలు ఉంచండి. పాలలో లాక్టిక్ యాసిడ్ ,విటమిన్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని శాంతపరచడానికి, పిగ్మెంటేషన్ను కాంతివంతం చేయడానికి కళ్ల చుట్టూ ఉబ్బినట్లు తగ్గడానికి సహాయపడతాయి.వీటితోపాటు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ రాయడం మర్చిపోకూడదు. చక్కటి నిద్ర, తగినన్ని నీళ్లు అవసరం. కెఫిన్, ఆల్కహాల్ వినియోగం, స్క్రీన్స్ వాడకాన్ని బాగా తగ్గించాలి. అలాగే ఇంటి చిట్కాలతో నయం కాక పోవచ్చు. అంతమాత్రాన బెంగపడాలసిన అవసరం లేదు. నిపుణైలైన వైద్యుల సమక్షంలో లేజర్ థెరపీ, ఫిల్లర్స్, హైలురోనిక్ యాసిడ్, ఇంజెక్షన్స్లాంటివా వాడవచ్చు. -
మిస్ యూనివర్స్ నైజీరియాగా దక్షిణాఫ్రికా బ్యూటీ!
దక్షిణాఫ్రికాలో నైజీరియన్ తండ్రికి జన్మించిన చిదిమ్మా అడెత్షినా అందాల కిరిటాన్ని కైవసం చేసుకునేందుకు ఎదుర్కొన్న అడ్డంకులు అవమానాలు అన్నీ ఇన్నీ కావు. కేవలం ఆమె గుర్తింపు కారణంగా అందాల పోటీ నుంచి చివరి నిమిషంలో వైదొలగాల్సి వచ్చింది. ఎంతో మందిని దాటుకుంటూ దక్షిణాఫ్రికా అందాల పోటీల ఫైనల్కి చేరుకుంటే. జస్ట్ ఆమె గుర్తింపే జాతీయ వివాదానికి దారితీసి అనర్హురాలిగా చేసింది. ఐతేనేం చివరికి అనుకున్నది సాధించి అందరినోళ్లు మూయించింది. ఐడెంటిటీతో ఏ మనిషి టాలెంట్ని తొక్కేయలేమని చాటిచెప్పింది. వివరాల్లోకెళ్తే..దక్షిణాప్రికాకు చెందిన చిదిమ్మా అడెత్షినా ఈ నెల ప్రారంభంలో దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో ఫైనలిస్ట్గా ఎంపిక కావడం పట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆమె నైజీరియన్ వారసత్వం పోటీకి అనర్హురాలిగా చేసింది. ఆమె తన తల్లి ఐడెంటిటీతో దక్షిణాప్రికన్గా గుర్తింపును తెచ్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. అంతేగాదు ఈ అందాల పోటీల్లో అడెత్షినా దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించకూడదని పలు వాదనలు వినిపించాయి. దీంతో ఆమె వెంటనే ఆ పోటీ నుంచి నిష్క్రమించాలని నిర్ణయించుకున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా పేర్కొంది. తన కుటుంబ శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఈ పోస్ట్ పెట్టిన మరుసటి రోజే అందాల పోటీల నిర్వాహకుల నుంచి అడెత్షినాకు ఆహ్వానం అందింది. అంతర్జాతీయ వేదికపై ఆమె తన తండ్రి మాతృభూమికి ప్రాతినిధ్యం వహించగలదని పేర్కొన్నారు నిర్వాహకులు. ఆ తర్వాత ఆమె శనివారం (ఆగస్టు 31)న మిస్ యూనివర్స్ నైజీరియాగా అందాల కిరీటాన్ని గెలుచుకుంది. ఎట్టకేలకు తన కలను నెరవేర్చుకున్నా అన్న భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కిరీటం అందానికి మాత్రం కాదు 'ఐక్యతకు పిలుపు' అని న్యాయ విద్యార్థి అయిన అడెత్షినా గద్గద స్వరంతో చెప్పింది. "ఈ అందమైన కల చివరికి నిజమయ్యింది. ఈ కిరీటాన్ని ధరించడం ఎంతో గర్వంగానూ, గౌరంవంగానూ ఉంది. ఈ అత్యున్నత గౌరవాన్ని స్వీకరిస్తున్న సందర్భంగా ఎన్నేళ్లుగానో బాధను రగిలిస్తున్న ఆవేదనను పంచుకోవాలనుకుంటున్నా అన్నారు. ఆఫ్రికన్ ఐక్యత గురించి మాట్లాడాలనుకుంటున్నా. మనమంతా శాంతియుత సహజీనంతో మెలుగుతూ మనల్ని వేరుచేసే అడ్డంకులను చేధించుకుందాం. ప్రతి ఆఫ్రికన్ పక్షపాతం లేకుండా స్వేచ్ఛగా బతికేలా ఆ గొప్ప ఖండం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నా". అని ఇన్స్టాగ్రాంలో రాసుకొచ్చింది అడెత్షినా. కాగా, అడెత్షినా నైజీరియన్ తండ్రి, దక్షిణాఫ్రికా తల్లి జన్మించిన మహిళ. మొజాంబికన్ సంతతికి చెందింది. సోవెటోలో జన్మించింది. ఐతే 1995 తర్వాత నుంచిఆ దేశ ప్రభుత్వం దక్షిణాప్రికాలోనే జన్మించిన వారికి లేదా శాశ్వత నివాసికి దక్షిణాఫ్రికా పౌరసత్వాన్ని మంజూరు చేసింది. ఆ నేపథ్యమే అడెత్షినాకి దక్షిణాఫ్రికా అందాల పోటీల్లో అడ్డంకి మారి తీవ్ర అవమానాల పాలయ్యేలా చేసింది. ఏదైతేనేం చివరికి ఆమె తన కలను సాధించడమే గాక గెలుపుతో విమర్శకుల నోళ్లు మూయించింది.(చదవండి: ఈ తెలంగాణ మిస్ డ్రీమ్.. 'మిస్ ఇండియా'!) -
జుట్టు వేగంగా పెరగాలంటే చివర్లు కట్ చేస్తే సరిపోతుందా?
జుట్టును సంరక్షించుకోవడం ఒక సమస్య. ఉన్న జుట్టును మరింత ఆరోగ్యంగా, వేగంగా పెంచుకోవడం మరో సమస్య. ఇందుకు హెయిర్ ప్యాక్ వేసుకోవడం, చుండ్రులేకుండా జాగ్రత్త పడటంతోపాటు, జుట్టు చివర్ల (స్ప్లిట్ ఎండ్స్)ను కట్ చేయడం లాంటివి చేయడం చాలా మంది పాటించే పద్ధతి. అయితే ఇలా చేయడం వల్ల నిజంగా జుట్టు పెరుగుతుందా? అసలు దీని వలన ఎలాంటి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాం.నిజానికి జుట్టు చివర్లు కత్తిరించడం వల్ల అది వేగంగా పెరుగుతుందనే వాదనకు ఎలాంటి ఆధారం లేదు. ఎందుకంటు జుట్టు పెరుగుదల స్కాల్ప్ నుంచి మొదలవుతుంది. కుదుళ్లు బలంగా ఉంటే జుట్టు బలంగా ఉంటుంది. కాబట్టి చనిపోయిన చివర్లను కత్తిరించడం వల్ల అది వేగంగా పెరగదు. కానీ జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది. స్ప్లిట్ చివర్లు , డ్యామేజ్ అయిన జుట్టును కత్తిరించడం వల్ల, క్రమం తప్పకుండా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు, ఆరోగ్యంగా, ఒత్తుగా కనిపిస్తుంది.ఎన్ని రోజులకోసారి కట్ చేయాలి?సాధారణంగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి అంగుళం మేర కత్తిరించుకోవాలి. ఎంత మేర ట్రిమ్ చేయాలి. ఎన్నిరోజులకు ఒకసారి చేయాలి అనేది ఇది జుట్టు పొడవు, చుండ్రు, జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్య బట్టి ఉంటుంది. చాలా మందికి రోజుకు 50-100 వెంట్రుకలు రాలిపోతాయి. అయితే ఈ వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వస్తాయి కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఊడిపోయిన వాటి స్థానంలో కొత్త జుట్టు రావాలంటే సరైన పోషణ అవసరం.జుట్టుకూ ఉండాలి పోషణఅందమైన మెరిసే జుట్టు కావాలంటే పోషణ అవసరం. వారానికి ఒకసారి అయినా కుదుళ్లకు తాకేలా నూనెతో మర్దనా ఉండాలి. తద్వారా హెయిర్ ఫోలికల్స్కి రక్త ప్రవాహం సక్రమంగా జరుగుతుంది. జుట్టు వేగంగా పెరుగుతుంది. రసాయన రహిత షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉండాలి. బ్లో డ్రైయింగ్ చేయడం, స్ట్రెటియినింగ్ చేయడం, కర్లింగ్ చేయడం లాంటివి తరచుగా చేయకుండా ఉండాలి. ఇవి జుట్టు సహజ మెరుపును, అందాన్ని పాడుచేస్తాయి. నాణ్యమైన హెయిర్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలి. జుట్టు ఆరోగ్యం కోసం ఆహారం ఆరోగ్యకరమైన జుట్టు కోసం విటమిన్ ఈ చాలా కీలకం. ఇది బొప్పాయి, బాదం, హాజెల్ నట్స్, అవకాడోస్, దోసకాయ బచ్చలికూర వంటి అనేక పండ్లు , కూరగాయలలో సహజంగా లభిస్తుంది. సన్ఫ్లవర్ ఆయిల్ వంటి నూనెలు, సాల్మన్ ట్యూనాతో సహా అనేక రకాల చేపలు విటమిన్ ఇ-రిచ్ ఫుడ్స్. ప్రొటీన్ తగ్గడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య వస్తుంది. జింక్, సెలేనియం, బయోటిన్ లభించే గుడ్లు తీసుకోవాలి. విటమిన్ ఏ, విటమిన్ సీ, ఐరన్ ,ఫోలేట్లు పుష్కలంగా ఉండే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే ఐరన్ లోపం లేకుండా చేసుకోవాలి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం జిడ్డుగా ఉంటే జుట్టును తరచుగా శుభ్రం చేసుకోవాలి. క్లోరిన్ హానికరమైన ప్రభావాలకు దూరంగా ఉండాలి. ఈత కొట్టే స్యంలో జుట్టును కప్పుకోవాలి. ఇంటినుంచి బయటికి వెళ్లినపుడు కాలుష్యం యూవీ కిరణాలనుంచి కాపాడుకునేందుకు స్కార్ఫ్ కట్టుకోవడం, గొడుగు వాడటం ఉత్తమం. -
తెల్లజుట్టు నల్లగా, స్మూత్ అండ్ షైనీగా : సహజమైన బీట్రూట్ మాస్క్
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బీట్ రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె బీట్రూట్ రసం హెయిర్ మాస్క్కొబ్బరి నూనెను బీట్రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.క్యారెట్, బీట్రూట్ మాస్క్: ఈ మిక్స్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.బీట్రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు రంగును మార్చడంలో బ్లాక్టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.బీట్రూట్, హెన్నాజుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు. -
నేచురల్గా ఇంట్లోనే లిప్ బామ్ తయారు చేసుకోండిలా!
సీజన్ ఏదైనా పెదవుల రక్షణకు లిప్ బామ్ వాడటం తప్పనిసరి. పెదవులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పొడిబారిపోకుండా ఉండాలన్నా అంతా వాటి సంరక్షణ అవసరం. పెదవుల్ని హైడ్రేటెడ్గా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణ కల్పించేందుకు లిప్ బామ్ తోడ్పడుతుంది. పెదాలు పగిలిపోవడం లాంటి సమస్యల నివారణతోపాటు, యూవీ కిరణాల నుంచిరక్షణ కల్పిస్తాయి. కానీ మార్కెట్లో దొరికే ఖరీదైన, రసాయన బామ్లకు బదులుగా ఇంట్లోనే సహజంగా తయారు చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వస్తువులను ఎంపిక చేసుకొని, ఇంట్లోనే వాటిని తయారు చేసుకొని సరైన పోషణ లభించేలా చేయవచ్చు.లిప్ బామ్ తయారీరెండు టీ స్పూన్ల మైనం, టీ స్పూన్ కోక్ పౌడర్, రెండు టీ స్పూన్లు బాదం నూనె, 5–6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ముందుగా మైనాన్ని కరిగించాలి. దీంట్లో కోక్ పౌడర్ వేసి బాగా కలపాలి. కోక్ పౌడర్ బాగా కలిసిపోయాక బాదం నూనె, ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. దీన్ని ఒక చిన్న బాటిల్లో భద్రపరుచుకొని రోజుకు రెండు మూడుసార్లు పెదవులకు రాసుకోవాలి. ఈ బామ్ పెదవుల పగుళ్ల సమస్యను నివారిస్తుంది. ఇంట్లో లిప్ బామ్ను తయారు చేసుకోవడం వల్ల హానికరమైన రసాయన పదార్థాలను నియంత్రించవచ్చు. అలాగే కృత్రిమ సువాసనలను లేదా ఇతర హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండవచ్చు. -
ఇది ఫేస్ డీప్ క్లీనింగ్ డివైస్..! ప్రయాణాల్లో..
స్కిన్ కేర్లో డీప్ క్లీనింగ్ అనేది బెస్ట్ ప్రాసెస్ అంటారు నిపుణులు. వేసుకున్న మేకప్ పూర్తిగా చర్మాన్ని వదలకపోయినా, ప్రయాణాల్లో దుమ్మూధూళి నుంచి ముఖాన్ని సంరక్షించుకోవాలన్నా డీప్ క్లీనింగ్ అవసరం. అందుకు ఈ ఫేషియల్ స్టీమర్ సహకరిస్తుంది. 360 డిగ్రీలలో తిరిగే రొటేటబుల్ స్ప్రేయర్ నాజిల్తో కూడిన వార్మ్ మిస్ట్ ఫేస్ స్టీమర్ ముఖానికి పట్టిన మురికిని, జిడ్డును ఇట్టే పోగొడుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ స్టీమర్ నుంచి విడుదలయ్యే ఆవిరి చర్మపు లోలోపలి పొరల్లోకి చొచ్చుకుపోయి, క్లీన్ చేస్తుంది.ముందుగా ముఖాన్ని చల్లటి నీళ్లతో కడిగి, మెత్తటి క్లాత్తో తుడిచి, ఆపైన అరోమాథెరపీ కాటన్ ప్యాడ్పైన ఆయిల్ చుక్కలు వేసుకుని, ముఖానికి అప్లై చేసుకోవాలి. అనంతరం ఈ స్టీమర్తో ఆవిరి పట్టుకుంటే, ఇంట్లోనే స్పా చేయించుకున్న ఫీలింగ్ కలుగుతుంది. దీని వల్ల మృతకణాలు తొలగిపోతాయి. ముడతలు, మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు నెమ్మదిగా ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. ఈ స్టీమర్ని క్రమం తప్పకుండా వినియోగిస్తే, యవ్వనకాంతితో కళకళలాడవచ్చు. వారానికి 2–3 సార్లు, ఒక సెషన్కు 10 నిమిషాల చొప్పున ఫేషియల్ స్టీమర్ని ఉపయోగించడం మంచిది. కాలిన గాయాలను నివారించడానికి కూడా ఫేస్ స్టీమర్ని వాడుకోవచ్చు.ఇందులో నీళ్లు నింపుకుని, బటన్ ఆన్ చేసుకుని ఆవిరి విడుదల అయ్యే రాడ్ని మనకు అనుకూలంగా అమర్చుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి దాని పొడవు పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. అనువైన విధంగా సెట్ చేసుకోవచ్చు. దాంతో ఆవిరి పట్టుకునేటప్పుడు, మన వీలుని బట్టి కూర్చుని లేదా పడుకుని కూడా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చు. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. దీని ధర 27 డాలర్లు. అంటే 2,266 రూపాయలు. ఈ స్టీమర్స్ చాలా కలర్స్లో అందుబాటులో ఉన్నాయి. -
సెలబ్రిటీలు ఇష్టపడే ఫేషియల్ మాస్క్...ఎన్ని ప్రయోజాలో తెలుసా..!
బాలీవుడ్ నటి ప్రయాంక చోప్రా దగ్గర నుంచి పలువురు ప్రముఖ సెలబ్రిటీలంతా ఇష్టపడే షేషియల్ రోజ్ గోల్డ్ ఫేషియల్. మూడు పదులు వయసు దాటిని యవ్వనపు కాంతితో మేను ప్రకాశవంతంగా ఉంటుంది. ముడతలు లేని చక్కటి చర్మం, వృద్ధాప్య లక్షణాలు దాచేసి గ్లామరస్ కనిపించేలా చేస్తుంది. బహుశా అందువల్లే ఇంతలా సెలబ్రిటీలు ఈ ఫేషియల్ని లైక్ చేస్తున్నారు. ఈ ఫేషియల్తో ఎన్ని లాభాలో చూద్దామా..!చాలామంది సెలబ్రిటీలు గ్లామరస్ ఇచ్చే ప్రాముఖ్యత అంత ఇంత కాదు. అందుకోసం ఎంత డభైనా ఖర్చు చేసేందుకు వెనకాడరు కూడా. వాళ్లంతా రోజ్ గోల్డ్ ఫేస్ మాస్క్కి ప్రాధాన్యత ఇస్తారు. రోజ్ గోల్డ్ ఆయిల్తో చేసిన రోజ్ గోల్డ్ ఆయిల్ ఫేషియల్ మాస్క్ వారి చర్మ సంరక్షణకు ఎంతలా ఉపయోగపడుతుందో వింటే ఆశ్చర్యపోతారు. కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. అలాగే పర్యవారణానికి ప్రభావితం కాకుండా ఉండేలా యాంటీ-ఆక్సిడెంట్ ప్రయోజనాలను కూడా అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉపయోగించే బంగారు పదార్దాలు లేదా అందులో ఉండే బంగారు రేణువులు చర్మంపై వచ్చే గీతలు, ముడతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో హైలురోనిక్ యాసిడ్, విటమిన్ సీ, బొటానికల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ప్రకాశవంతంగా, పునరుజ్జీవింపజేయడంలో సహాయపడతాయి.ఇక రోజ్ గోల్డ్ ఆయిల్.. చర్మాన్ని ఆరోగ్యంగా, హైడ్రేటెడ్గా ఉంచడానికి మాయిశ్చరైజర్గా పనిచేయడం నుంచి మేకప్కి సిద్దమయ్యేలా అందంగా మారుస్తుంది. ముఖ్యంగా పెదాలను హైడ్రేట్ చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది. కంటి కింద పొడి ప్రాంతాల్లో అప్లై చేస్తే మృదువుగా కనిపిస్తాయి. దేనితో తయారు చేస్తారంటే..గుమ్మడికాయ గింజల నూన, ఇతర నూనెలతో కలిసి ఉంటుంది. గుమ్మడికాయ గింజల నూనె కణజాలాన్ని పునరుత్పత్తి చేస్తుంది. హైపర్పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తుంది. తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రీ రాడికల్స్తో పోరాడుతుంది, యవ్వన రూపాన్ని ప్రోత్సహిస్తుంది.ఇందులో జింక్, విటమిన్ సీ ఉంటాయి. ఇవి చర్మాన్ని దృఢంగా, బిగుతుగా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నప్పటికీ, ఈ నూనె దాని ప్రత్యేకమైన ఫార్ములా కారణంగా జిడ్డుగల చర్మానికి అనుకూలంగా ఉంటుంది.ప్రధాన పదార్థాలు బంగారు రేకులు, రోజ్షిప్ సీడ్ ఆయిల్..బంగారు రేకులు కొల్లాజెన్ క్షీణతను నెమ్మదిస్తాయి. చర్మ స్థితిస్థాపకతను పెంచుతాయి. మేని ఛాయను కాంతివంతం చేయడమే గాక దృఢంగా ఉంచేలా కణాలను ప్రేరేపిస్తాయి. రోజ్షిప్ సీడ్ ఆయిల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గానూ, టిష్యూ రీజెనరేటర్గా పనిచేస్తుంది. వాపును తగ్గించడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. రక్తప్రసరణలో మంచిగా ఉంటుంది. అలాగే రోజ్గోల్డ్ ఆయిల్ మాస్క్లోనారింజ తొక్కలు ఉంటాయి.ఇవి చనిపోయిన చర్మ కణాలను ఎక్స్ఫోలియేట్ చేస్తాయి. ఇందులో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. పైగా చర్మాన్ని బిగుతుగా చేసి మెరిసేలా చేస్తుంది. ప్రయోజనాలుఇది యాంటీ ఏజింగ్ ప్రయోజనాలను, తేమను అందిస్తుంది.అన్ని రకాల చర్మాలకు తగినదిఇది కణజాలాన్ని పునరుత్పత్తి చేయడం, ఫైన్ లైన్లు, హైపర్పిగ్మెంటేషన్ను తగ్గించడం వంటివి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్తో పోరాడటమే గాక యవ్వన రూపాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.రోజ్ ఆయిల్ ఫేషియల్, షీట్ మాస్క్ లేదా మరేదైనా వారికి చర్మ అలెర్జీలు లేదా ఇతర చర్మ సమస్యలు ఉన్నట్లయితే వాటిని ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తి గత చర్మ నిపుణుడి సలహాలు సూచనలు మేరకు ఉపయోగించటం మంచిది.(చదవండి: ఒక హంతకుడి బాధితులు!) -
Beauty Tips: ముఖానికి మెరుపు.. చర్మానికి నునుపు!
ఇది చర్మానికి పునరుత్తేజం కలిగించే అధునాతన సౌందర్య పరికరం. ఇది ముఖాన్ని అందంగా మెరిపిస్తుంది. చక్కటి ఆక్సిజన్ ఫేషియల్ను అందజేస్తుంది. ఈ సొగసైన పరికరం చర్మం పైపొరపై పేరుకున్న మృతకణాలను తొలగించడంతో పాటు చర్మం లోలోతుల వరకు ఆక్సిజన్ ను అందిస్తుంది. ఈ పరికరం రక్తప్రసరణను మెరుగుపరచి, చర్మకణాలకు ఉత్తేజం కలిగిస్తుంది. వాడిపోయినట్లున్న చర్మానికి నునుపుదనం కలిగించి, కొత్త మెరుపునిస్తుంది.ఇది ముఖంతో పాటు శరీరంపై చర్మమంతటికీ ఆక్సిజన్ ను అందిస్తూ, చర్మానికి పునరుజ్జీవం కలిగించి, ప్రకాశవంతంగా మారుస్తుంది. క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేటింగ్, స్కిన్ కేర్ అప్లికేషన్ ఇలా ఎన్నో ప్రయోజనాలతో ఇది ఏమాత్రం నొప్పి లేకుండా చికిత్స చేస్తుంది. దీనిని ఉపయోగించుకోవడం చాలా సులభం. తక్కువ సమయంలోనే మన్నికైన ఫలితాలనిస్తుంది. ఈ పరికరాన్ని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. దీనికి చార్జింగ్ కోసం ప్రత్యేకమైన ట్రే విడిగా లభిస్తుంది. దానిలోనే ఈ పరికరానికి చార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు బ్యూటీ క్యాప్సూల్స్, జెల్, క్రీమ్ వంటివి కూడా లభిస్తాయి. అవి అయిపోయినప్పుడు. వాటిని విడిగా కూడా ఆన్లైన్ లో కొనుగోలు చేసుకోవచ్చు.ముందుగా ముఖాన్ని శుభ్రపరచుకుని, అనంతరం ఈ పరికరానికి ముందున్న చిన్న వలయాల్లో క్యాప్సూల్ అమర్చుకోవాలి. తర్వాత ముఖానికి జెల్ పట్టించి, ఈ పరికరాన్ని చర్మానికి ఆనించి 3 నిమిషాల పాటు గుండ్రంగా తిప్పుతూ చికిత్స తీసుకోవాలి. అనంతరం నీళ్లతో ముఖాన్ని కడిగి, క్రీమ్ రాసుకోవాలి. ఈ పరికరాన్ని ఎవరికి వారే వాడుకోవచ్చు. ఈ పరికరానికి ఒకవైపు క్లీనింగ్ బ్రష్ కూడా ఉంటుంది. దాన్ని విడిగా తీసి, శుభ్రం చేసుకోవచ్చు.ఇవి చదవండి: పీసీఓఎస్ కట్టడికి మలేరియా మందు -
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలా! అయితే ఇలా చేయండి...
కొందరు ఏ వయసులోనైనా సహజత్వాన్నే కోరుకుంటారు. ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని తహతహలాడతారు. అలాంటి వారికి ఈ ఫేషియల్ టోనర్ చక్కగా పని చేస్తుంది. దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.చీక్ బోన్స్స కోసం ప్రత్యేకంగా రూపొందిన ఈ ఫేషియల్ టోనర్.. ముఖంలో సహజ సౌందర్యాన్ని, యవ్వన రూపాన్ని మెరుగుపరచడానికి.. ఎంతగానో సహకరిస్తుంది. ఇది.. సహజమైన, సౌకర్యవంతమైన గాడ్జెట్గా.. మార్కెట్లో మాంచి డిమాండ్ను అందుకుంటోంది. ఇందులో 3 ప్రోగ్రామ్స్ను మార్చిమార్చి సెట్ చేసుకోవచ్చు. పది నిమిషాలు, పదిహేను నిమిషాలు, ఇరవై నిమిషాల టైమింగ్తో.. వేరియబుల్ ట్రీట్మెంట్ లెవెల్స్తో ఉన్న ఈ డివైస్.. హ్యాండ్ హోల్డ్ కంట్రోలర్గా పని చేస్తుంది.హెడ్సెట్ బేస్డ్ డెలివరీ సిస్టమ్తో తయారైన ఈ డివైస్ని.. తల వెనుక నుంచి ముఖానికి అటాచ్ చేసుకోవచ్చు. చార్జ్ చేసుకుని వాడుకునే వీలు ఉండటంతో.. దీన్ని ఎక్కడైనా సులభంగా వినియోగించుకోవచ్చు. ఈ టోనర్ ముఖ కండరాలను దృఢంగా మార్చేస్తుంది. ముఖాన్ని నాజూగ్గా చేసేస్తుంది. వారానికి ఐదుసార్లు దీనితో ట్రీట్మెంట్ తీసుకుంటే.. ఫలితం ఉంటుంది. అయితే ప్రతి ట్రీట్మెంట్ 20 నిమిషాల వరకు ఉండేలా చూసుకోవాలి. సుమారు 12 వారాలు ఈ టోనర్ ట్రీట్మెంట్ తీసుకుంటే.. 40 దాటినవారు కూడా 20లా కనిపిస్తారట.డివైస్కి ఉండే రెండు జెల్ ప్యాడ్స్ని ముఖ చర్మానికి ఆనించి.. చిత్రంలో ఉన్న విధంగా పెట్టాలి. ప్యాడ్స్ పెట్టుకునే ముందు.. ఆ భాగంలో లోషన్ లేదా క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇక ఈ మెషిన్ ని ముఖానికి పెట్టుకునేప్పుడు ఖాళీగా ఉండాల్సిన పనిలేదు. ల్యాప్ టాప్ వర్క్ కానీ.. వ్యాయామాలు కానీ.. ఇంటి పని కానీ ఏదో ఒకటి చేసుకోవచ్చు. ఈ మోడల్స్లో బ్లాక్, వైట్ కలర్స్ అందుబాటులో ఉన్నాయి. దీన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. -
వాడేసిన టీ పొడితో అందాన్ని పెంచుకోవచ్చు! ఎలాగో తెలుసా..!
టీ తయారు చేశాక సాధారణంగా టీ పొడిని వడకట్టి బయటపడేస్తారు. అలాగే టీ బ్యాగులను కూడా పడేస్తారు. అందులో మిగిలిన టీ పొడితో అందాన్ని పెంచుకోవడమే కాదు, ఇంటిని మెరిపించుకోవచ్చు. చాలామందికి టీతోనే రోజు ప్రారంభమవుతుంది. చెప్పాలంటే.. దాదాపు ప్రతి ఇంట్లో ఉదయం, సాయంత్రం టీ తాగాల్సిందే. టీ తయారు చేసిన తర్వాత, టీ పొడి మిగిలిపోతుంది. దీనిని తరచూ చెత్తగా భావించి చెత్తబుట్టలో వేస్తాం. ఈ పనికిరాని టీ పొడితో ఇంటి శుభ్రతను నుంచి అందం వరకు పలు రకాలుగా ఉపయోగించొచ్చు. అదెలాగో సవివరంగా చూద్దాం. !అద్దాలు శుభ్రం చేసేందుకు..టీ పొడితో ఇంటి అద్దాలను పాలిష్ చేయవచ్చు. దీని కోసం, మిగిలిన టీ ఆకులను నీటిలో మరిగించండి. ఈ నీటిని స్ప్రే బాటిల్ లో నింపి దాని సహాయంతో అద్దాలను శుభ్రం చేస్తే అద్దాలు తళతళ ప్రకాశిస్తాయి. దీనితో పాటు, గ్యాస్ బర్నర్లు ఎంత నల్లగా మారినా, మీరు వాటిని నిమిషాల్లో శుభ్రం చేయవచ్చు. టీ నీటిలో కొద్దిగా డిష్ వాష్ మిక్స్ చేసి బ్రష్ సహాయంతో క్లిన్ చేస్తే గ్యాస్ బర్నర్లను తళతళ మెరిసిపోతాయి..పాదాల దుర్వాసనరోజంతా బూట్లు ధరించడం వల్ల పాదాల్లో తరచూ దుర్వాసన వస్తుంటుంది. అలాంటప్పుడు మిగిలిపోయిన టీ పొడిని నీటిలో బాగా మరిగించి చల్లారాక ఆ నీటిలో మీ పాదాలను 10 నుండి 15 నిమిషాలు ఉంచండి. ఇలా రోజూ చేస్తే పాదాల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది.నేచురల్ షైనింగ్..మిగిలిపోయిన టీ పొడి జుట్టుకు ఒక వరం. ఇది శిరోజాలకు నేచురల్ షైన్ జోడించడానికి పనిచేస్తుంది. అలాగే జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. దీని కోసం, టీ పొడిని శుభ్రమైన నీటిలో మరిగించాలి. మరిగిన తర్వాత నీళ్లు చల్లారనివ్వాలి. షాంపూతో తలస్నానం చేసిన తర్వాత చివరగా ఈ నీటితో తలస్నానం చేయాలి. కొద్ది రోజుల్లోనే జుట్టు సిల్కీగా మెరుస్తూ ఉంటుంది. మొక్కలకు ఎరువుగా..ఇంట్లో పెంచుకునే మొక్కలకు సహజ ఎరువుగా టీ పొడి ఉపయోగపడుతుంది. ఇంట్లో చెట్లు, మొక్కలు ఉంటే ఈ టీ పొడివాటి ఎదుగుదల రెట్టింపు అయ్యేలా చూసుకోవచ్చు. మిగిలిపోయిన టీ పొడిని కంపోస్టులా మొక్కల కుండీల్లో వేసేయండి. ఇది మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అయితే పంచదార కలిపిన టీ పొడిని మాత్రం బాగా కడిగి అప్పుడు వినియోగించండి.(చదవండి: క్రీడా నైపుణ్యం, మాతృత్వం రెండింటిని ప్రదర్శించిన ఆర్చర్ !) -
బిడ్డకు తల్లయినా అంతే గ్లామర్గా ఆలియా! ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి ఆలియా భట్ ఎంత గ్లామరస్గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చాక కూడా అంతే అందం, పిట్నెస్తో తీగలా ఉంది. ఆమె తన అందం, నటనతో వేలాదిమంది అభిమానులను సంపాదించుకుంది. నిజానికి అమ్మగా మారే తరుణంలో స్త్రీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో అందరికీ తెలిసిందే. అంత ఈజీగా సాధారణ స్థితికి రావడం కుదరదు. అలాంటిది ఆలియా మాత్రం అంతకుముందు ఎలా ఉందో అలానే ఉండటమే గాక మరింత అందంగా కనిపించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ ఆమె అంతలా బాడీ ఫిట్గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..ఆలియా శరీరం ఆకట్టుకునేలా ఉండేందుకు ర్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, యోగా, పైలేట్స్ వంటి వర్కౌట్స్ చేస్తుంది. అలియా తన ఫిట్నెస్ రొటీన్లో కార్డియో కచ్చితంగా ఉంటుంది. ఈ వర్కౌట్తోనే ఆరునెల్లలోనే తన తొలి చిత్రం "స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్" కోసం ఏకంగా 20 కిలోలు తగ్గింది. అప్పటి నుంచే హృదయ ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిచ్చేలా బరువు తగ్గించే ఈ కార్డియో వ్యాయామానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం 30 నిమిషాలు చేయగలిగితే ఫిట్గానే గాక ఆరోగ్యంగా ఉండగలుగుతారు. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది ఆలియా వర్కౌట్ రొటీన్లో మరొక అంశం. ఇటీవల, ఆమె ఒక బార్బెల్తో బరువున్న హిప్ థ్రస్ట్లను ప్రదర్శించే వీడియోను షేర్ చేసింది. ఇది మన శరీరాకృతిని అందంగా కనిపించేలా చేసే మంచి వ్యాయామం. పైగా ఇది కండరాలు, వీపుకి సంబంధించిన సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.అలాగే ఆలియా ఫిట్నెస్లో పైలేట్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది మొత్తం శరీర అమరిక, కండరాల స్థాయిని మెరుగుపరచడానికి పైలేట్స్ ఒక అద్భుతమైన మార్గం.మన మనస్సు, శరీరాన్ని అనుసంధానించడానికి యోగా చక్కగా పనిచేస్తుంది. ఇది శారీరక ఆరోగ్యం తోపాటు మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇది విశ్రాంతిని, ఒత్తిడిని అందించి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది. ఇక్కడ ఆలియా చేసే వ్యాయామాలన్ని దైనందిన జీవితానికి అవసరమయ్యే రిలాక్సేషన్ టెక్నీక్లను ఏకీకృతం చేసేవే గాక, మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడతాయి.ఇవన్నీ పాటించాలంటే..ఆలియా భట్ మాదిరిగానే ఫిట్నెస్ స్థాయిని సాధించడానికి, స్థిరత్వం, వైవిధ్యం కీలకం. మన దినచర్యను సమతుల్యంగా, ఆసక్తికరంగా ఉంచడానికి కార్డియో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్, ఫ్లెక్సిబిలిటీ వంటి వ్యాయామాలు చేయాలి. అనింటి కంటే ముఖ్యం క్రమం తప్పకుండా చేయడం. అలాగే వారానికి కనీసం 150 నిమిషాల ఏరోబిక్ యాక్టివిటీ లేదా 75 నిమిషాల తీవ్రమైన యాక్టివిటీని లక్ష్యంగా పెట్టుకోవాలి.శరీరం సంకేతాలపై శ్రద్ధ వహించి, అధిక శ్రమను నివారించండి. View this post on Instagram A post shared by alia💓shukria (@aliabhatt_love28) (చదవండి: అమెరికన్ గాయకుడికి టైప్ 1.5 డయాబెటీస్: ఎలా గుర్తిస్తారంటే..?) -
ఈ ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో.. చాలా ప్రయోజనాలు పొందవచ్చు!
అందాలను అందించే గాడ్జెట్స్ కోసం సౌందర్యాభిలాషులు నిరంతరం అన్వేషిస్తుంటారు. అలాంటి వారికి ఈ మసాజర్ ఒక మంత్రదండం లాంటిది. ఇది అందించే ఎలక్ట్రిక్ రెడ్ లైట్ థెరపీతో చాలా ప్రయోజనాలు పొందవచ్చు. ఈ హీటెడ్ అండ్ వైబ్రేషన్ ఫేస్ మసాజర్ వయసుని ఇట్టే తగ్గించేసి, ముఖానికి నవయవ్వన కాంతినిస్తుంది. చేతిలో ఇట్టే ఇమిడిపోయే ఈ పరికరం చర్మం మీదనున్న ముడతలు, గీతలను పోగొట్టి, మృదువుగా మారుస్తుంది.ఈ ఫేషియల్ మసాజర్ 3 లెవెల్ హీటింగ్ మోడ్తో, వైబ్రేషన్ మోడ్తో ప్రత్యేకంగా రూపొందింది. చర్మానికి పైపైనే కాకుండా లోతుగా ట్రీట్మెంట్ అందించి, చర్మాన్ని బిగుతుగా మారుస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా ముఖం, మెడ, వీపు, పొట్ట, నడుము, కాళ్లు, చేతులు ఇలా ప్రతిభాగాన్నీ అందంగా మలచుకోవచ్చు.ఈ పరికరం శరీరంలోని ఆక్యుపాయింట్లను ఉత్తేజపరుస్తుంది. దీన్ని ఎవరికి వారు స్వయంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది ఎల్ఈడీ డిస్ప్లే స్క్రీ¯Œ తో ఉంటుంది. ఎవరికైనా బహుమతిగా ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది.ఈ ఫేస్ లిఫ్టర్ మసాజర్ చూడటానికి చిన్నగా, క్యూట్గా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా సులభంగా తీసుకుని వెళ్లొచ్చు. ఏ సమయంలోనైనా దీనితో సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే చర్మానికి ఆయిల్ లేదా నచ్చిన లోష¯Œ అప్లై చేసుకుని, అనంతరం దీనితో మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీని ధర 37 డాలర్లు. అంటే 3,097 రూపాయలు. ఇలాంటి మోడల్స్లో ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ అందుబాటులోకి రావడంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతోంది. -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నికెల్తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్ను సంప్రదించాలి. -
చర్మంపై మృత కణాలు పోవాలంటే.. ఇలా చేయండి!
టొమాటో రసం పావు కప్పు తీసుకుని అందులో దూది ముంచి ముఖానికి అద్దాలి. ఆరిన తర్వాత వలయాకారంగా మర్దన చేస్తూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేమగా కాంతివంతంగా మారుతుంది. వార్ధక్య లక్షణాలుగా కనిపించే ముడతలు కూడా తొలగిపోతాయి.మృత కణాలు పోవాలంటే...బొప్పాయి గుజ్జు పావు కప్పు తీసుకుని అందులో టీ స్పూన్ పన్నీరు (రోజ్వాటర్) కలిపి ముఖానికి రాయాలి. పది లేదా పదిహేను నిమిషాలకు తేమను చర్మం పీల్చుకుంటుంది. అప్పుడు వేళ్లతో వలయాకారంగా ముఖమంతా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. బొప్పాయిలోని ఎంజైమ్లు చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతాయి.ఇవి చదవండి: హెల్త్ ఫ్యాక్ట్: నాన్వెజ్ తిన్నాక బాదం తినండి... ఎందుకంటే..? -
రాత్రిపూట తలకు నూనె రాస్తున్నారా..?
జీవితంలో పెరుగుతున్న ఒత్తిడి, పోషకాహార లోపం జుట్టు రాలిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో, జుట్టును సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం రెగ్యులర్గా తలకు నూనె రాస్తుంటారు చాలామంది. అయితే ఇలా జుట్టుకు నూనె రాసుకోవడం మంచిదే కానీ దానికి సరైన సమయం ఉంది. కానీ జుట్టుకు నూనె రాసుకునే విధానం సరిగా లేకపోతే అది జుట్టుకు ప్రయోజనం చేకూర్చడానికి బదులు సమస్యలు ఎదురయ్యేలా చేస్తుంది. జుట్టుకు నూనె రాసుకోవడం వల్ల జరిగే మేలు ఎక్కువే అయినా రాసే సమయం అత్యంత ముఖ్యం అంటున్నారు నిపుణులు. అంతే కాదు హెయిర్ ఆయిల్ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఆయిల్ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ రాత్రిపూట జుట్టుకు నూనెను రాయడం మాత్రం మంచిది కాదనే అంటున్నారు నిపుణులు. ఇలా రాయడం వల్ల జుట్టుతో పాటూ చర్మం కూడా డ్యామేజ్ అవుతుందని హెచ్చరిస్తున్నారు.ఎందుకంటే..?రాత్రంతా జుట్టుకు నూనెతో పడుకోవడం వల్ల తల ఉపరితల రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగా వ్యక్తికి సమస్యలు ప్రారంభమవుతాయి. ఒక విధమైన ఇరిటేషన్ వచ్చి గోకడం జరుగుతుంది. దీంతో గోళ్లలోకి మురికి చేరుతుంది. ఈ సమస్యను నివారించడానికి రాత్రిపూట జుట్టుకు నూనెను రాయకూడదు.చుండ్రు సమస్య ఎక్కువవుతుంది..చుండ్రు సమస్యలు ఉంటే, రాత్రిపూట హెయిర్ ఆయిల్ ఎట్టిపరిస్థితుల్లోనూ అప్లై చేయకూడదు. ఇలా చేస్తే ఆయిల్ వల్ల చుండ్రు తోపాటు నెత్తిమీద ఎక్కువ మురికి పేరుకుపోయి చుండ్రు సమస్యను పెంచుతుంది. ఈ సమస్య రాకుండా ఉండాలంటే జుట్టుకు హైడ్రేటింగ్ హెయిర్ మాస్క్ అప్లై చేయాలి.జుట్టు రాలడంజుట్టు ఇప్పటికే రాలిపోతుంటే, రాత్రిపూట నూనె రాసుకోవడం వంటివి చేయవద్దు. వాస్తవానికి, జుట్టుకు నూనెను 12 గంటలకు మించి ఉంచడం వల్ల నెత్తిమీద మురికి పేరుకుపోతుంది. అందువల్ల హెయిర్ వాష్కు అరగంట ముందు నూనె రాసుకుంటే జుట్టు రాలే సమస్య రాకుండా ఉంటుంది.మొటిమలురాత్రిపూట జుట్టుకు నూనె రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇలా మూసుకుపోవడం వల్ల మొటిమలు వచ్చే అవకావం ఉంది. ఇలాంటి మొటిమలను పోమేడ్ పింపుల్స్ అంటారు. కాబట్టి జుట్టుకు రాత్రిపూట నూనె పెట్టడం వల్ల చర్మంపై మొటిమలు వచ్చే అవకాశం పెరుగుతుంది. ఆ జిడ్డు ముఖానికి కూడా అంటుకుని చర్మ రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు ఎక్కువ అయిపోతాయి.నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట జుట్టుకు నూనె అప్లై చేయడానికి బదులుగా స్నానానికి అరగంట ముందు హెయిర్ ఆయిల్ రాసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల జుట్టుకు పోషణ అందడంతో పాటు వెంట్రుకలు బాగా శుభ్రం అవుతాయి.(చదవండి: మంకీ స్పిట్ కాఫీ: ఛీ..యాక్ అలానా తయారీ..!) -
Beauty Tips: ముఖం మొటిమలతో నల్లబారుతుందా? అయితే ఇలా చేయండి..
కాలుష్యంతో మీ ముఖం నల్లబడటంగానీ, మొటిమలతోగానీ ఇబ్బందికి గురవుతుందా..? అయితే ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే..! అవేంటో చూద్దాం.ఇలా చేయండి..ఆపిల్ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.కీరా రసంలో రోజ్వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.ఇవి చదవండి: నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!! -
ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి.. ఎవరైనా షాక్ అవాల్సిందే..!
ఐస్ కూలింగ్ టచ్తో.. లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్తో ఆకట్టుకుంటున్న ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ పనితీరుకి సౌందర్య ప్రియులంతా ముగ్ధులు అవాల్సిందే. ఈ మెషిన్తో అవాంఛిత రోమాలను నొప్పి లేకుండా తొలగించుకోవచ్చు. దీనితో క్రమం తప్పకుండా ట్రీట్మెంట్ కొనసాగిస్తే.. చర్మం మీది వెంట్రుకలు పలుచపడి.. కొంత కాలానికి మొదలుకంటా తొలగిపోతాయి.3 వారాల నుంచి ఫలితం కనిపిస్తుంటుంది. 5 వారాలకు స్పష్టమైన రిజల్ట్ని చూడొచ్చు. అయితే దీని లేజర్ ట్రీట్మెంట్ అందుకునే ముందు.. అవాంఛిత రోమాలున్న చోట షేవ్ చేసుకుని.. క్లాత్తో క్లీన్ చేసుకుని.. ఆ తర్వాతే ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్ సమయంలో ఈ డివైస్.. చల్లదనాన్నిస్తుంది.చేతులు, కాళ్లు, ముఖం, నడుము, పొట్టభాగం, అండర్ ఆర్మ్స్, బికినీ లైన్ ఇలా ప్రతిచోట దీనితో ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇన్ టెన్ ్స పల్స్డ్ లైట్ టెక్నాలజీ .. ఆటో ఫ్లాషింగ్ .. 3 మోడ్స్ ఆప్షన్ ్సతో ఈ మెషిన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ హెయిర్ రిమూవల్ మెషిన్ ని.. మహిళలతో పాటు పురుషులూ వినియోగించుకోవచ్చు. అయితే పచ్చబొట్టు ఉన్న ప్రదేశాల్లో, ట్యాన్ ఎక్కువగా ఉన్న చోట, గాయలున్న భాగాల్లో దీన్ని యూజ్ చేయకపోవడమే మంచిది. అలాగే గర్భిణీలు ఈ ట్రీట్మెంట్కి దూరంగా ఉండాలి.ఇక ఈ పరికరాన్ని ఉపయోగించే సమయంలో.. పవర్ కనెక్షన్ తప్పనిసరిగా ఉండాలి. ముందే చార్జింగ్ పెట్టుకుని వినియోగించుకునే వీలు ఉండదు. తెల్లగా .. కాస్త చామన ఛాయలో ఉన్నవారికి మాత్రమే ఈ మెషిన్ ఉపయోగపడుతుంది. బ్లాక్, బ్రౌన్ , డార్క్ బ్రౌన్ , లైట్ బ్రౌన్ కలర్స్లో ఉన్న వెంట్రుకలను మాత్రమే ఈ మెషిన్ గుర్తించగలదు. వైట్ కలర్, రెడ్ కలర్ వెంట్రుకలను తొలగించలేదు. దీని ధర 239 డాలర్లు. అంటే 19,951 రూపాయలు. -
వామ్మో ఎంత పొడుగు జుట్టు!..గిన్నిస్ రికార్డులకెక్కింది!
టీవీల్లోనూ, అడ్వర్టైస్మెంట్ల్లోనూ భారీ కురులను చూసుంటాం. రియల్ లైఫ్లోఎక్కువగా సన్యాసుల్లో చూస్తుంటాం. ఒక వేళ ఉన్నా ఇక్కడున్న మహిళకు ఉన్నంత భారీ కురులను చూసి ఉండే అవకాశమే లేదు. ఎవరామె? ఆమె చుట్టు సంరక్షణ రహస్యం ఏంటీ వంటి వాటి గురించి తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్కు చెందిన 46 ఏళ్ల స్మితా శ్రీ వాస్తవ అత్యంత పొడవాటి జుట్టుని కలిగి ఉన్న మహిళగా గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకుంది. ఆమె జుట్టు ఏకంగా తొమ్మిది అంగుళాల పొడవుతో ఉంది. ఆమె 14 ఏళ్ల ప్రాయం నుంచి కత్తిరించడం మానేసింది. అంతేగాదు చుట్టును కడగడానికే దాదాపు 45 నిమిషాలు పడుతుందట. తనకు తన జుట్టు అంటే మహా ఇష్టమని, దీనికి గుర్తిపు రావాలని ఎంతగానో కోరుకున్నాని చెప్పుకొచ్చింది. చివరికి దేవుడు తన ప్రార్థనలు ఆలకించి ప్రపంచ రికార్డులో చోటు దక్కేలా చేశాడని అంటోంది శ్రీ వాస్తవ. ప్రస్తుతం ఆమెకు 46 ఏళ్లు వారానికి రెండు సార్లు జుట్టును కడుగుతుందట. అయితే వాషింగ్, డ్రైయింగ్, డిటాంగ్లింగ్, స్టైలింగ్తో సహా మొత్తం ప్రక్రియకు ప్రతిసారీ మూడు గంటల వరకు పడుతుందట. తనకు జుట్టుని సంరక్షించుకోవాలనే విషయంలో ప్రేరణ తన అమ్మేనని చెబుతోంది. తన కుటుంబంలోని ప్రతిఒక్కరికి అందమైన జుట్టు ఉంది. అదీగాక 80ల టైంలోని హిందీ సినిమాల్లో నటీమణులు చాలా అందంగా ఉండేవారు. ఆ కాలల్లోని వాళ్లందరికీ జుట్టు చాలా పొడవుగా ఉండేది. అదే తనను బగా ప్రేరేపించిందని చెబుతోంది శ్రీ వాస్తవ. మన సమాజంలో పొడవాటి జుట్టు మహిళల అందాన్ని తెలియజేస్తుంది. ఇక శ్రీ వాస్తవ గత 20 ఏళ్లలో వెంట్రుకలను కత్తిరించలేదు. అయితే ఒకనొక సమయంలో కాస్త ఎక్కువగా జుట్టురాలిందని, అందుకోసం శ్రద్ధ తీసుకోవడంతో ఆ సమస్యను నివారించగలిగానని చెప్పింది శ్రీ వాస్తవ. అలాగే ఆమె తన జుట్టు సంరక్షణ కోసం కృత్రిమ షాంపూలు, కండీషనర్లకు దూరంగా ఉంటానని అంటోంది. ఎక్కువగా గుడ్డు, ఉల్లిపాయ రసం, అలోవెరా వంటి సహజమైన పదార్థాలతో జుట్టును సంరక్షించుకుంటానని అదే తన కేశసంపద రహస్యమని చెబుతోంది శ్రీ వాస్తవ. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెమిడీలను తప్పకు ప్రయత్నించండి.(చదవండి: స్లిమ్గా మారిన భూమి పడ్నేకర్!.. జస్ట్ నాలుగు నెలల్లో ఏకంగా..!) -
దేవుడా..!ఇదేం పిచ్చి..చర్మ సంరక్షణ కోసం..ఏకంగా పక్షి లాలాజలంతో..!
ఇటీవల గ్లామరస్గా ఉండటంపై వ్యామోహం మాములుగా లేదు. ఇదివరకు ఎవరో అక్కడక్కడ అందంపై శ్రద్ధ పెట్టేవారు. అందుకోసమని మరి ఇంతలా ప్రయాస పడేవారు కాదు. కానీ ఇప్పుడూ అందం అనేది అతిపెద్ద స్టేటస్. అందుకోసం ఎంత డబ్బులైనా వెచ్చిచ్చేందుకు వెనకాడటం లేదు. ముఖ్యంగా ఎలాంటి వెర్రిపనులు చేసేందుకైనా సై అంటున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా విచిత్రమైన సౌందర్య సాధానాలు వస్తున్నాయి. అలాంటి బ్యూటీ ప్రొడక్టే ఈ ఆసియా పక్షి లాలాజల సూప్. అసలు ఏంటిది? పక్షి లాలాజలంతో సూప్ ఎలా చేస్తారు? మంచిదేనా..?దీన్ని "బర్డ్స్ నెస్ట్ సూప్" అని కూడా అంటారు. చైనా, తైవాన్, హాంకాంగ్, సింగపూర్ వంటి ప్రాంతాల్లో చేస్తారు. గట్టిపడిన పక్షి ఉమ్మి గూళ్లతో తయారు చేస్తారు. ఇది వృద్ధాప్య లక్షణాలను దరిచేరనివ్వదు. పైగా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీన్ని ఈస్ట్ కేవియర్ అని కూడా పిలుస్తారు. ఎలా తయారు చేస్తారంటే..ఇది స్విఫ్ట్లెట్స్ అనే పక్షి జాతికి చెందిన తినదగిన గూడు. ఈ పక్షి ఎక్కువగా ఆగ్నేయా తూర్పు ఆసియాలోనే కనిపిస్తుంది. ఈ స్విఫ్ట్లెట్స్ పక్షులు తమ లాలాజలంతో గూళ్లను తయారు చేస్తాయి. ఇవి గూళ్లను తయారు చేసేందుకు కొమ్మలు, ఈకలను వినియోగించదు. వీటిని మార్కెట్లో విక్రయిస్తారు. ఆ గూళ్లు ఎరుపు, తెలుపు, బంగారు వర్ణంలో ఉంటాయి. ప్రతిఒక్క గూడుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలుగా బాగా విశ్వస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా..! అని చర్మ సంరక్షణకు సంబంధించిన పక్షి ఉమ్మి గూడు సూప్ గురించి అందరికీ తెలిసింది. అయితే దీన్ని కొనుగోలు చేయడం అందరివల్ల కాదు. ఎందుకంటే..? 500 గ్రాములే ఏకంగా రూ. 1,60,000/- పలుకుతుంది. ఈ లాలాజల పక్షి గూళ్లతో తయారు చేసిన కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. యూఎస్లో దీనికి సంబంధించిన గోల్లెన్ నెస్ట్ అనే షాపును 1996లో ఏర్పాటయ్యింది కూడా. ఇక్కడ ఈ పక్షి గూడును ప్రధాన పదార్ధంగా చేసే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.ప్రయోజనాలు..పోషకాలు సమృద్ధిగా ఉంటాయిఅమైనో ఆమ్లాలు, ప్రోటీన్లు, కాల్షియం, ఇనుము, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉంటాయికణాల పునరుత్పత్తికి, మరమత్తుకు మంచిదిరోగనిరోదక వ్యవస్థను పెంచుతుంది. అంటువ్యాధులను నిరోధించడంలో సహాయపడుతుందికొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని చైనా ప్రజల నమ్మకం. నిజానికి ఇది నిజమని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రియ ఆధారాలు లేవని నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ చైనీస్ ఔషధం ప్రకారం ఈ పక్షి గూడు యవ్వన రూపాన్ని ఇస్తుందనేది ప్రజల నమ్మకం మాత్రమేనని తేల్చి చెబుతున్నారు నిపుణులు. అంతేగాదు దీనివల్ల కొన్ని రకాల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అవేంటంటే..పక్షి లాలాజల ప్రోటీన్లు లేదా గూడు కలుషితమైతే అలెర్జీ ప్రతిచర్యలను కలిగి ఉండవచ్చు.హార్వెస్టింగ్ మరియు ప్రాసెసింగ్ పద్ధతుల రీత్యా పక్షి గూడుని పరిశుభ్రంగా నిర్వహించకపోతే బ్యాక్టీరియా లేదా శిలీంధ్రాల వంటి కలుషితాలను కలిగి ఉండవచ్చు.ఆ గూళ్లను నిర్మించుకునే వాతావరణాన్ని బట్టి భారీ లోహాలతో కలుషితం అయ్యే ప్రమాదం కూడా ఉంది. View this post on Instagram A post shared by Golden Nest Inc (@goldennestusa) (చదవండి: ప్రపంచంలోనే తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!) -
తొలి మిస్ ఏఐ కిరీటాన్ని దక్కించుకున్న మొరాకో ఇన్ఫ్లుయెన్సర్..!
ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న మిస్ ఏఐ అందాల పోటీలో తొలి కిరీటాన్ని మొరాకోకు చెందిన కెంజా లైలీ అనే ఇన్ఫ్లుయెన్సర్ గెలుచుకుంది. ఆమె కృత్రిమ మేథస్సు పరంగా అగ్ర స్థానంలో నిలిచింది. ఆమె ఈ ఏఐ అందాల పోటీల్లో సుమారు 1500 ఏఐ మోడళ్లను వెనక్కినెట్టి మరీ ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది. అందుకుగానూ ఆమెను సృష్టించిన మెరియం బెస్సా రూ. 16 లక్షల ప్రైజ్మనీ గెలుపొందింది. లైలీకి ఇన్స్టాగ్రాంలో లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఆహరం, సంస్కృతి, ఫ్యాషన్, అందరం, ట్రావెల్స్ వంటి వాటి గురించి కంటెట్ ఇస్తుంది. ఈ వర్చువల్ పాత్రలో కెంజా లేలీ మొరాకో గొప్ప వారసత్వాన్ని చాటుకుంది. ఆమె సంస్కృతి, సాంకేతికల ప్రత్యేక కలియికను కలిగి ఉంది. ఏడు వేర్వేరు భాషల్లో ఫాలోవలర్లతో 24/7 టచ్లో ఉంటంది. ఈ మేరకు వర్చవల్ ఏఐ మోడల్ మాట్లాడతూ..తన ఆశయం మొరాకో సంస్కృతిని గర్వంగా ప్రదర్శంచడమేనని అంటోంది. అలాగే తన ఫాలోవర్లకు బహుళ రంగాల్లో అదనపు సమాచారం అందించడం అని చెప్పింది. అంతేగాదు పర్యావరణాన్ని రక్షించడానికి సానుకూలమైన రోబోట్ సంస్కృతి గురించి అవగాహన పెంచుకుంటానని అన్నారు. ఏఐ అనేది మానవ సామర్థ్యాలను భర్తీ చేసేందుకు రూపొందించిన సాధనమే గానీ అన్నింటిని ఇది భర్తీ చేయలేదు. మానవులు, ఏఐ సాంకేతకత మధ్య అంగీకారం, సహకారాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపింది. మన సమాజంలో ఏఐ సంబంధించిన మరింత సమాచారం పొందగలమనే ఆశావాహ దృక్పథాన్ని పెంపొందించుకోవచ్చు అని చెప్పడమేనని అంటోంది. తాను మొరాకో కోసం ఈ అవార్డును గెలుచుకున్నందుకు ఎంతగానో గర్వపడుతున్నాను అని లైలీ చెప్పుకొచ్చింది. అలాగే సదరు ఏఐ మోడల్ లైలీని సృష్టించిన బెస్సా మాట్లాడుతూ..మొరాకోకు ప్రాతినిధ్యం వహించడం అనేది గొప్ప అవకాశం. సాంకేతిక రంగంలో మొరాకో, అరబ్, ఆఫ్రికన్ ముస్లిం మహిళలను హైలైట్ చేయడంలో తాను కూడా భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొంది. ఈ కెంజా లైలీ మహిళా సాధికారత , సోదరిత్వం తదితరాలు తనకు నచ్చిన విషయాలని చెప్పారు. ఈ పోటీల్లో ఫ్రాన్స్కు చెందిన లాలినా వాలినా రెండోస్థానంలో నిలవగా, రోబోటిక్ ప్రపంచాలను సామరస్యంగా తీసుకురావాలనుకునే పోర్చుగీస్ ట్రావెలర్ ఒలివియా సీ మూడో స్థానంలో నిలిచింది. ఇది ఏఐ క్రియేటర్ల విజయాలను జరుపుకోవడానికి భవిష్యత్తులో ఏఐ క్రియేటర్ల స్టార్డ్స్ పెరిగేలా చేసే ఒక అద్భుతమైన వేదిక. View this post on Instagram A post shared by Kenza Layli • كنزة ليلي (@kenza.layli) (చదవండి: Anant Ambani Haldi Ceremony: 150 ఏళ్ల నాటి హైదరాబాదీ వస్రధారణలో నీతా..!) -
పెడిక్యూర్ స్క్రబ్బర్ను ఎప్పుడైనా వాడి చూశారా!?
సౌందర్య పోషణలో ‘పాదాల సంరక్షణ’ కూడా ముఖ్యమైనదే! అందుకే చాలామంది ఫేషియల్, వాక్సింగ్ కోసమే కాదు.. పెడిక్యూర్ కోసం కూడా పార్లర్ల చుట్టూ తిరుగుతుంటారు. చిత్రంలోని ఎలక్ట్రిక్ కాలస్ రిమూవర్ ఇంట్లో ఉంటే పార్లర్కి బై చెప్పొచ్చు. నిమిషాల్లో పాదాలను మెరిపించుకోవచ్చు.ఈ మల్టీఫంక్షనల్ పెడిక్యూర్ కిట్ను వినియోగించడం చాలా తేలిక. ఇది డెడ్ స్కిన్ రిమూవల్ హెడ్తో పాటు, నెయిల్ బఫర్ హెడ్, పాలిషింగ్ హెడ్.. ఇలా 3 రోలర్ హెడ్స్తో రూపొందింది. వాటర్ప్రూఫ్ కూడా అయిన ఈ డివైస్కి ముందువైపు సేఫ్ స్టార్ట్ పవర్ బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే పైన అమర్చిన హెడ్ గుండ్రంగా తిరుగుతూ పని చేస్తుంది. ఇందులో లో స్పీడ్, హై స్పీడ్ అనే రెండు ఆప్షన్ ్స ఉంటాయి. అవసరాన్ని బట్టి మార్చుకోవచ్చు.త్రీడీ డిజైన్ తో తయారైన ఈ ఫుట్ స్క్రబ్బర్ మెషిన్కి గంటన్నర పాటు ఫుల్ చార్జింగ్ పెడితే.. సుమారు 150 నిమిషాల వరకు ఆగకుండా పని చేస్తుంది. ఈ డివైస్తో పెడిక్యూర్ చేసుకోవడం చాలా సులభం. ఇది పాదాల కింది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది. దీన్ని చేతి గోళ్లను శుభ్రం చేసుకోవడానికీ వినియోగించుకోవచ్చు. ధర సుమారు 800 రూపాయలు మాత్రమే.ఇవి చదవండి: మనల్ని నాశనం చేయడానికి ప్రతి ఇంట్లో బోన్లు పెట్టి.. -
గ్లోయింగ్ స్కిన్ కోసం..నటి భాగ్యశ్రీ గ్రీన్ జ్యూస్ ట్రై చేయండి!
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మైనే ప్యార్ కియా వంటి మూవీలో మంచి హిట్లను అందుకుని తన నటనతో వేలకొద్ది అభిమానులకు చేరువయ్యింది. వివాహ బంధంతో సినిమాలకు దూరంగా ఉన్నా..అంతే గ్లామర్ మెయింటైన్ చేస్తున్న నటి భాగ్యశ్రీ. ఎప్పుడూ సోషల్మీడియాలో యాక్టివ్గా ఉంటూ నెటిజన్లతో సరికొత్త వంటకాలను షేర్ చేసుకుంటుంటారు. ప్రస్తుతం తాజగా కాంతి వంతమైన చర్మం కోసం సరికొత్త హెల్తీ జ్యూస్తో మన ముందుకు వచ్చింది భాగ్యశ్రీ. బచ్చలి, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయలతో చేసిన గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చారు. ఇది చర్మం ఆరోగ్యంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా కాంతివంతంగా ఉంచుతుందని చెప్పారు. గ్రీన్ జ్యూస్తో కలిగే లాభాలు..ఉదయమే ఒక గ్లాస్లు ఈ గ్రీన్ జ్యూస్ చర్మాన్ని మెరుస్తూ ఉంచుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన గట్ బ్యాక్టీరియాని ప్రోత్సహించి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. బచ్చలికూరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. పైగా చర్మాన్ని హైడ్రేట్గా ఉంచుతాయి. దీనిలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇక కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట గుణాలు ఉంటాయి. ఇవి గట్ ఆరోగ్యాన్ని, జీవక్రియను ప్రోత్సహిస్తాయి. ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, సెలీనియం వంటి ఖనిజాలు ఉంటాయి. అవి చర్మాన్ని ప్రకాశవంతంగా ఉండేలా చేస్తాయి. అలాగే రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కూడా కలిగి ఉంది. తయారీ..నటి భాగ్యశ్రీ బచ్చలికూర, కొత్తిమీర, సెలెరీ, ఉసిరికాయ తదితరాలను మిక్క్లో వేసి మెత్తగా జ్యూస్ అయ్యేలా చేయాలి. ఆ తర్వాత చక్కగా వడకట్టుకుంటే చాలు గ్రీన్ జ్యూస్ రెడీ. దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే మంచి పోషకాలు అందడమేగాక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Bhagyashree (@bhagyashree.online) (చదవండి: 'ప్రపంచంలోనే తొలి ఏఐ డ్రెస్'!..ఏకంగా రోబోటిక్ పాములతో..) -
వర్షాకాలంలో చర్మ, ముఖ సౌందర్యం: ఈ పనులు అస్సలు చేయకండి!
మారుతున్న వాతావరణానికి అనుగుణంగా చర్మ ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మాన్సూన్ తేమ, ఊహించని వర్షపు జల్లుల నుంచి మనల్ని మనం రక్షించు కోవాలి. ఆఫీసులకు, బయటికి వెళ్లేవాళ్లు, గొడుగు, రెయిన్కోట్ లాంటివి కచ్చితంగా తీసుకెళ్లాలి. ఈ సీజన్లో కూడా మాయిశ్చరైజర్ వాడాలా? నీళ్లు ఎక్కువ తాగాలా? తక్కువ తాగాలా? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. వర్షాకాలం పాటించాల్సిన సౌందర్య చిట్కాలు వర్షాకాలంలో హెవీ మేకప్ కాకుండా, తేలికపాటి, వాటర్ ప్రూఫ్ లైట్ మేకప్ ఎంచుకోవాలి. ఫౌండేషన్ , కన్సీలర్ను సెట్ చేయడానికి సెట్టింగ్ స్ప్రే వాడితే బెటర్. టాక్సిన్స్ను బయటకు పంపడానికి, చర్మాన్ని లోపలినుంచి ఆరోగ్యంగా ఉంచడానికి పుష్కలంగా నీరు త్రాగాలి.మాయిశ్చరైజర్: వాతావరణం తేమగా ఉంటుంది కనుక చర్మరంధ్రాలు మూసుకోకుండా, హైడ్రేటెడ్గా ఉంచడానికి తేలికపాటి మాయిశ్చరైజర్ని వాడాలి.మేఘావృతమైన రోజులలో కూడా, సూర్యుని యూవీ కిరణాల ప్రభావం ఉంటుంది. అందుకే కనీస SPF 30 ఉన్న సన్స్క్రీన్ని ఉపయోగించాలి.చర్మంలోని సహజ నూనెలను తొలగించే కఠినమైన ఉత్పత్తులకు బదులుగా మీ చర్మానికి తగినట్టుగా, సున్నితమైన, నూనె లేని సువాసన లేని క్లెన్సర్ను ఎంచుకోండి.తడి జుట్టును అలాగే వదిలేయకుండా సహజంగా ఆరేలా చూసుకోవడం. తప్పదు అనుకుంటే డ్రైయ్యర్ వాడాలి. జుట్టు చిట్లిపోకుండా ఉండటానికి కండీషనర్ లేదా హెయిర్ సీరమ్ని ఉపయోగించండి.అలాగే సున్నితమైన క్లెన్సర్ లేదా మేకప్ రిమూవర్ సాయంతో రాత్రి పడుకునేందుకు మేకప్ను పూర్తిగా తొలగించండి. లేదంటే ముఖంపై ఉన్న మేకప్ చర్మానికి హాని చేస్తుంది. మొటిమలు రావచ్చు. అందుకే తేనె వంటి ఇతర సహజ మాయిశ్చరైజర్ పదార్ధాలు ఉన్న సీరమ్ను ఎంచుకుంటే మంచిది. -
Beauty Tips: అందానికి 'ఓట్లు'..
ఓట్స్ ఆరోగ్యపోషణతోపాటు సౌందర్యపోషణకూ దోహదం చేస్తాయి. ఓట్స్తో చర్మసౌందర్యాన్ని సంరక్షించుకోవడం ఎలాగో చూద్దాం.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్పౌడర్లో మూడు టేబుల్ స్పూన్ల పెరుగు, టీ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిక్స్ను ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి పదిహేను నిమిషాల తర్వాత వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తగిన పోషణ లభించడంతోపాటు మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతిమంతమవుతుంది.మొటిమలు తగ్గాలంటే టేబుల్ ఓట్స్ పౌడర్లో టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పూర్తిగా ఆరిన తర్వాత మెల్లగా రుద్దుతూ చన్నీటితో శుభ్రం చేయాలి. చర్మంలో అధికంగా ఉన్న జిడ్డును ఓట్స్ పీల్చుకోవడం వల్ల మొటిమలు వాడిపోతాయి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే నాలుగు వారాల్లోనే మొటిమలు పూర్తిగా తగ్గిపోతాయి.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్లో టేబుల్ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ సహజమైన బ్లీచ్. చర్మాన్ని తెల్లబరుస్తుంది. మృదువుగా మారుతుంది కూడా.ఓట్స్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు, బాదం ΄÷డి టేబుల్ స్పూన్, తేనె టేబుల్ స్పూన్, పాలు లేదా పెరుగు రెండు టేబుల్ స్పూన్లు కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి, మెడకు పట్టించి వలయాకారంలో పది నిమిషాల పాటు మృదువుగా మర్దన చేయాలి. ఈ ప్యాక్ వల్ల మృతకణాలు తొలగిపోవడంతోపాటు చర్మకణాల్లో పట్టేసిన మురికి వదులుతుంది. ఈ ప్యాక్ నెలకు రెండుసార్లు వేస్తుంటే ప్రత్యేకంగా స్క్రబ్ క్రీమ్లు, బ్లీచ్లు వాడాల్సిన అవసరం ఉండదు.రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్ పౌడర్లో రెండు టేబుల్ స్పూన్ల బొప్పాయి గుజ్జు, టీ స్పూన్ బాదం ఆయిల్ కలపాలి. ఈ ప్యాక్ను ముఖానికి, మెడకు పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ΄÷డి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది. చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. మొటిమలు ఉన్నవాళ్లు బాదం ఆయిల్ లేకుండా ప్యాక్ వేసుకోవచ్చు.ఇవి చదవండి: Pet Last Set: డయల్ చేస్తే.. ఇంటికే అంతిమయాత్ర వాహనం! -
60లలో యవ్వనంగా కనిపించేలా చేసే యాంటీ ఏజింగ్ ఫుడ్స్ ఇవే..!
వృధాప్యం అనేది సర్వసాధారణం. వయసు గడిచేకొద్ది ఎవ్వరైనా ఈ స్టేజ్కి రావాల్సిందే. అందుకోసం మార్కెట్లో లభించే వేల ఖరీదు చేసే కాస్మెటిక్స్కి డబ్బులు తగలేస్తుంటారు. పలు వర్కౌట్లని, డైట్లని నానాతంటాలు పడుతుంటారు. అయితే అవేమీ లేకుండానే, ఎలాంటి కష్టం లేకుండా తన తల్లి 60లలో కూడా యంగ్గా కనిపిస్తోందని చెబుతున్నాడు డిజిటల్ క్రియేటర్. ఆమె బ్యూటీ సీక్రెట్ ఏంటో కూడా షేర్ చేసుకున్నాడు. అదెంటో చూద్దామా..వృద్ధాప్యాన్ని ఆపడం అంత ఈజీకాదు కానీ నియంత్రించొచ్చు. అది కూడా సహజమైన వాటితోనే చెయ్యొచ్చట. వయసు రీత్యా చర్మం పలు మార్పులకు లోనవ్వుతుంది. ఆ మార్పులను నియంత్రించగలిగితే నిగనిగలాడే కాంతివంతమైన చర్మం మన సొంతం అవుతుందట. అందుకు నిద ర్శనం తన తల్లేనని డిజి టల్ క్రియేటర్ రోహిత్ బోస్ చెబుతున్నాడు. ఆమె 64 ఏళ్ల వయసులో కూడా యంగ్గా ఉంటుందని, అలా అని బోటాక్స్ ట్రీట్మెంట్, జిమ్ వంటి వర్కౌట్లు ఏమి చెయ్యదని చెబుతున్నాడు. అందుకోసం ఆరోగ్యకరమైన ఫుడ్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి తీసుకోదని కూడా తెలిపారు. అయినా ఇంతలా ఆమె అందంగా కనిపించడానికి ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్సేనని చెప్పుకొచ్చారు. అవేంటంటే..బొప్పాయి: విటమిన్లు ఏ, సీ, ఈ, కే పుష్కలంగా ఉంటాయి. ముఖంపై గీతలు తగ్గించడంలో సహాయపడుతుంది. అవిసె గింజలు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్తో నిండిన అవిసె గింజలు చర్మాన్ని ఆర్ద్రీకరణ, స్థితిస్థాపకతకు మద్దతునిస్తాయి. దీంతో చర్మం బొద్దుగా, మృదువుగా ఉంచుతాయి.గుమ్మడి గింజలు: జింక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్న గుమ్మడికాయ గింజలు కణాల పునరుద్ధరణను ప్రోత్సహిస్తాయి, పైగా వృద్ధాప్యంతో పోరాడుతాయి.కొబ్బరి నీరు: ఈ సహజ హైడ్రేటర్ సైటోకినిన్లతో నిండి ఉంటుంది. ఇది కణాల పెరుగుదల, వృద్ధాప్యాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే చర్మాన్ని తాజాగా హైడ్రేట్గా ఉంచుతుంది.అల్లం: యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన అల్లం చర్మపు రంగును సమంగా ఉంచడంలో సహాయపడటమే గాక వృద్ధాప్య సంకేతాలతో పోరాడుతుంది.పసుపు: పసుపులోని కర్కుమిన్ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యగా ముడతలు తగ్గించి,యవ్వనపు ఛాయను ప్రోత్సహిస్తుంది.వైద్యులు సైతం ఇలాంటి ఆహారాలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని అంటున్నారు. బొప్పాయి చర్మానికి, ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఇక అవిసెగింజలు చర్మాన్ని కోమలంగా ఉంచడంలోనూ, జీర్ణక్రియకు మంచిదని చెబుతున్నారు. ఈ ఆహారాలు స్కిన్ టోన్ని మంచిగా ఉంచినప్పటికీ వ్యాయామాలు కూడా చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెబుతున్నారు. (చదవండి: పాత జీన్స్ ప్యాంటులతో స్లీపింగ్ బ్యాగ్లు..ఒక్కో జీన్స్కి ఏకంగా..!) -
Beauty Tips: ముఖం మీద.. పేరుకుపోయే మురికిని.. తొలగించడిలా..!
ముఖం మీది మేకప్ను అయినా.. పొల్యుషన్తో పేరుకుపోయే మురికినైనా తొలగించడం కాస్త కష్టమే! అందుకే ఈ మసాజర్ అండ్ క్లీనర్ వచ్చింది మార్కెట్లోకి. మేకప్తో పాటు కాలుష్యపు జిడ్డునూ డీప్గా క్లీన్ చేసి.. మృతకణాలనూ తొలగించి చర్మాన్ని మృదువుగా మారుస్తుందీ డివైస్.దీని సిలికాన్ బ్రష్ హెడ్.. సాధారణ బ్రష్ కంటే 35 రెట్లు అధికంగా చర్మాన్ని శుభ్రపరస్తూ స్కిన్ ఫ్రెండ్లీగానూ ఉంటోంది. క్లీనింగ్ అండ్ మసాజింగ్ ఆప్షన్స్తో పని చేసే ఈ 2 ఇ¯Œ 1 గాడ్జెట్.. సోనిక్ వైబ్రేషన్స్తో, 6ఎక్స్ డీపర్ క్లీన్ అనే హై టెక్నాలజీ హీటెడ్ హెడ్తో వేగంగా పనిచేస్తుంది.ఒక్కసారి చార్జింగ్ పెట్టుకుంటే.. దీన్ని 20 నుంచి 30 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇందులో 5 స్కి¯Œ కేర్ మోడ్స్ ఉంటాయి. వాటిలో మూడు వైబ్రేష¯Œ స్పీడ్ మోడ్స్ కాగా.. రెండు హీటెడ్ మసాజ్ మోడ్స్లో పనిచేస్తాయి. అవసరాన్ని బట్టి హెడ్స్ మార్చుకుంటే సరిపోతుంది. ఈ డివైస్ని స్త్రీ, పురుషులు ఇరువురూ వినియోగించుకోవచ్చు. ఈ పరికరాన్ని నీటితో క్లీ¯Œ చెయ్యకూడదు. చార్జింగ్ పెట్టేప్పుడు కూడా తడి తగలకుండా చూసుకోవాలి. దీని ధర సుమారు 65 డాలర్లు. అంటే 5,446 రూపాయలు.ఇవి చదవండి: నిజమే..! ఇది మంత్రదండంలాంటి 'ఏఐ' ఉంగరమే..!! -
Beauty Tips: పండులాంటి ప్యాక్..!
ముఖంలో నిగారింపు, చర్మంలో కోమలత్వం తగ్గుతుందని దిగులు చెందుతున్నారా..! అయితే ఈ సింపుల్, బెస్ట్ బ్యూటీ చిట్కాలు మీకోసమే..ఇలా చేయండి..– అరటితొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి.– ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి.– తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి.– అరటి పండులో ఉన్న విటమిన్ బి6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియంలు చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి.– ఈ ప్యాక్ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది.– క్రమం తప్పకుండా వాడితే ఫలితం త్వరగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఇంకు, తుప్పు వంటి మొండి మరకలు సైతం తొలగించాలంటే..? ఇలా చేయండి.. -
మిస్ ఏఐ అందాల పోటీలో టాప్ 10 ఫైనలిస్ట్గా జరా శతావరి!
ప్రపంచంలోనే తొలిసారి ఏఐతో రూపొందించిన మోడల్ల కోసం అందాల పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ అందాల పోటీల్లో టాప్ టెన్ ఫైనలిస్ట్గా భారతదేశానికి చెందిన జరా శతావరి నిలిచారు. ఆమె పీసీఓఎస్ , డిప్రెషణ యోధురాలు. ప్రపంచంలోనే తొలిసారిగా జరుగుతున్న వర్చ్యువల్ హ్యుమన్ అందాల పోటీల్లో పాల్గొన్న దాదాపు 1500 మంది అభ్యర్థులో భారతకి ప్రాతినిధ్యం వహిస్తున్న శతావరి ఎంపక కావడం విశేషం. అయితే ఈ పోటీల్లో అందం, సాంకేతికత, సోషల్ మీడియా ప్రభావం ఆధారంగా ఈ నెలాఖరులోగా విజేతలను నిర్ణయించడం జరుగుతుంది. ఇంతకీ ఎవరీమె అంటే..ఎవరీ జరా శతావరి.?ఉత్తరప్రదేశ్లోని నోయిడాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో దాదాపు ఏడువేల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. జరాకి భోజనం, ట్రావెలింగ్ అంటే మహా ఇష్టం. ప్రజలను ఆరోగ్యం, వృత్తి, అభివృద్ధి, ఫ్యాషన్ పరంగా మంచి జీవితాన్ని గడిపేలా శక్తిమంతం చేయడం ఆమె లక్ష్యం. ఇక ఆమె వర్చువల్ ప్రయాణంలో జూన్ 2023 నుంచి పీఎంహెచ్ బయోకేర్కి బ్రాండ్ అంబాసిడర్" ఉంది. అలాగే ఆగస్టు 2024లో డిజిమోజో ఈ సర్వీస్ ఎల్ఎల్పీలో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ టాలెంట్ మేనేజర్గా చేరింది.అంతేగాదు ఆమె 13 రంగాల్లో నైపుణ్యం కలిగి ఉంది. వ్యూహాత్మక ప్లానింగ్లో, కంటెంట్ అభివృద్ధి, డేటా విశ్లేషణ, బ్రాండ్ అవగాహన, బ్రాండ్ అడ్వకేసీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, సృజనాత్మక ఆలోచన, ఆరోగ్యం అండ్ సంరక్షణ కౌన్సిలింగ్, ఫ్యాషన్ స్టైలింగ్ అండ్ కెరీర్ డెవలప్మెంట్ గైడెన్స్లలో మంచి నైపుణ్యం ఉంది ఆమెకు. తనని తాను డిజిటల్ మీడియా మావెన్గా అభివర్ణించే రాహుల్ చౌదరి మిస్ ఏఐ అందాల పోటీల్లో శతావరి టాప్ 10లో ఉందని ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. దాదాపు 1500 మంది పాల్గొనే ఈ పోటీల్లో ఆమెకు టాప్ 10లో చోటు దక్కడం విశేషం అని చెప్పారు. అంతేగాదు ఇన్ఫ్లుయెన్సర్ కమ్యూనిటీకి ఆమె చేసిన అత్యుత్తమ సహకారానికి నిదర్శనమే ఫ్యాన్వ్యూ వరల్డ్ ఏఐ క్రియేటర్స్ అవార్డ్స్ ద్వారా వచ్చే ఈ గుర్తింపు అని రాహుల్ ప్రశంసించారు కూడా. ఈ ప్రపంచ వేదికపై ఆమె భారతదేశానికి, ఆసియాకి ప్రాతినిధ్యం వహించడం నిజంగా చాలా గొప్ప గౌరవం అని అన్నారు. అలాగే ఆసియా నుంచి పాల్గొన్ని ఇద్దరిలో శతావరి భారత నుంచి ఎంపికైన ఏకైక ఫైనలిస్ట్ కావడం విశేషం అన్నారు బ . కాగా, ఈ మిస్ ఏఐ తొలి మూడు విజేతల నగదు మొత్తం రూ. 16 లక్షలకు పైనే ఉంటుందట. అలాగే మిస్ ఏఐ క్రియేటర్ రూ. 4 లక్షల నగుదు బహుమితి అందుకోగా, ఏఐ మెంటర్ షిప్ ప్రోగ్రామ్లు, పీఆర్ సేవలకు మరిన్ని నగదు బహుమతులు పొందే అవకాశం ఉందని సమాచారం. (చదవండి: -
స్లిమ్గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. కొన్నాళ్లు కాస్తా బొద్దుగా తయారయ్యి..సినిమాలకు దూరంగా ఉన్నారు. చాలారోజుల తర్వాత బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ మూవీ ప్రదర్శనకు హాజరైన విద్యాబాలన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె లుక్ అంతా మారిపోవడంతో..ఇంతలా స్లిమ్గానా అంటూ.. అందరి చూపులు ఆమెపైనే. చెప్పాలంటే ఈ కార్యక్రమంలో విద్యాబాలన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అక్కడంతా విద్య నాజుగ్గా మారడమే హాట్టాపిక్గా మారింది. ఈ కార్యక్రమంలో విద్య సోదరి కుమారుడు కూడా వచ్చాడు. ఆమె బ్లాక్ డ్రస్లో ఓ రేంజ్ స్టన్నింగ్ లుక్తో కనిపించింది. గోల్డెన్ కలర్ చెవుపోగులు, లైట్ మేకప్తో గ్లామరస్గా ఉంది. అంతేగాదు ఫిట్గా ఉండాలని కోరుకునేవారికి స్ఫూర్తిగా ఉంది విద్య. మల్లెతీగలా కనిసిప్తున్న ఈ బ్యూటీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటని ఆరాతీస్తున్నారు. అయితే విద్య అంతలా స్లిమ్ అవ్వడానికి ఎలాంటి వర్కౌట్లు చేసిందంటే..ప్రతి రోజు వ్యాయమం చేసే అవకాశం లేకపోయిన కనీసం రన్నింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటివి చేయడంకూల్డ్రింగ్స్, అధిక చక్కెర గల పళ్ల రసాలతో సహా టీ, కాఫీలకు దూరంగా ఉండటంరోజంతా హైడ్రేషన్గా ఉండేలా నీళ్లు బాగా తాగేదని, ఇది ఆకలిని కంట్రోల్ చేసేందుకు ఉపకరించిందని వ్యక్తిగత ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. అలాగే రోజుకి ఏడు నుంచి తొమ్మిది గంటలు మంచిగా నిద్రపోవడం. నాణ్యమైన నిద్ర ఉంటే ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది.ప్రతి ముద్ద ఆస్వాదిస్తూ తినడం వంటివి చేయాలి. దీనివల్ల ఆకలి అదుపులో ఉంటుంది. టీవీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లుకు దూరంగా ఉండటం వంటివి చేస్తే..ఎవ్వరైనా..ఇట్టే బరువు తగ్గిపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ట్రై చెయ్యండి.(చదవండి: చేపను పోలిన భవనం..ఎక్కడుందంటే..?) -
అందానికి హై ఫ్రీక్వెన్సీ మెషిన్! ఇదొక మంత్రదండంలా..
అందాన్ని అరచేతుల్లో కోరుకునే ఆడవారికి ఈ హై ఫ్రీక్వెన్సీ మెషిన్ ఓ మంత్రదండంలా పని చేస్తుంది. ఇది మచ్చలు, ముడతలు, మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు వంటి లోపాలను మాయం చేసేస్తుంది. చర్మాన్ని బిగుతుగా, నవయవ్వనంగా మారుస్తుంది. దీనిలో మూడు ట్యూబ్స్ లభిస్తాయి.వాటిలో రెండు స్కిన్ ట్యూబ్స్ చర్మానికి, ఒక స్కాల్ప్ ట్యూబ్ తలకు అనువుగా ఉంటాయి. ఒక స్కిన్ ట్యూబ్ మృతకణాలను తొలగించి, ముడతలను దూరం చేస్తుంది. మరో స్కిన్ ట్యూబ్ మొటిమలను, వాటి వల్ల ఏర్పడే మచ్చలను మాయం చేస్తుంది. ఇక స్కాల్ప్ ట్యూబ్ హెయిర్ గ్రోత్ను పెంచుతుంది. దీని వల్ల తలలో రక్తప్రసరణ బాగా జరిగి, జుట్టు ఊడటం తగ్గుతుంది.ఈ డివైస్ 90% నియాన్, 10% ఆర్గాన్ తో కూడిన హై ఫ్రీక్వెన్సీ ఫేషియల్ మెషిన్. ఇది అన్ని రకాల చర్మాలకు అనువుగా ఉంటుంది. స్కిన్ కేర్, హెయిర్ కేర్లను కోరుకునే స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు ఇది చక్కటి బహుమతి అవుతుంది. పైగా దీన్ని వినియోగించడం చాలా తేలిక. దీని ధర 60 డాలర్లు. అంటే నాలుగువేల తొమ్మిది వందల ఎనభై మూడు రూపాయలు.ఇవి చదవండి: ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్గా మారిన వాల్పేపర్ డిజైన్స్..! -
పసుపుతో అందం, ఆరోగ్యం, ఈ టిప్స్ ఎపుడైనా ట్రై చేశారా?
పసుపు శుభ్రపదమైందే కాదు ఆరోగ్యంకరమైంది. కూడా. అందుకే భారతీయ వంటకాల్లో, ఇతర ఆహార పదార్థాల తయారీలో విరివిగా వినియోగిస్తారు. వంటింట్లో దివ్యౌషధం పసుపు. యాంటీ బయాటిక్, యాంటీ సెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్న పసుపు కేవలం ఆహార పదార్థాల్లోనే కాదు, సౌందర్య పోషణలోనూ చాలా ఉపయోగపడుతుంది.ఆరోగ్య ప్రయోజనాలు ⇒ పసుపును ఆహారంలో రెగ్యులర్ చేసుకోవడం వల్ల డయాబెటిస్ ముప్పు నుండి దూరంగా ఉండొచ్చట. ⇒ సేంద్రీయ పసుపు వాడటం వల్ల కొన్ని రకాల కేన్సర్లనుంచి కూడా దూరంగా ఉండవచ్చని నిపుణులు చెబుతారు.⇒ చలికాలంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకు పసుపు, తులసి, మిరియాల కషాయం బాగా పనిచేస్తుంది. ⇒ జలుబు చేసినపుడు వేడినీటిలో చిటికెడంత పసుపు వేసుకొని ఆవిరి పడితే ఉపశమనం లభిస్తుంది. ⇒ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. చర్మ సమస్యలను తగ్గించడానికి పసుపు చక్కని పరిష్కారం.⇒ పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియ సవ్యంగా సాగేందుకు పసుపు తోడ్పడుతుంది.పసుపుతో అందంపసుపు, పెరుగు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని, బాగా ఎండిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ముఖంమృదువుగా కాంతివంతంగా మారి మెరుస్తుంది. ఇదే మిశ్రమాన్న ఒంటికి నలుగులాగా కూడా వాడుకోవచ్చు. ముఖం మీది మచ్చలు తొలగి పోవాలంటే.. పసుపు, టమాటా గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పసుపు, కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే ముడతలు పోయి యవ్వనంగా కనిపిస్తారు.పసుపు, నిమ్మరసం, తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్ ,మొటిమలు పోతాయి.పసుపు, తాజా కలబంద గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ వేస్తుంటే జిడ్డు చర్మం తొలగి ఫ్రెష్గా మారుతుంది. -
Lavender : అద్భుతమైన ప్రయోజనాలు
వర్షాలు మొదలయ్యాయంటే చాలు దోమలు, కీటకాల బెడద ఎక్కువ అవుతుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం, చుట్టు పక్కల మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం, దోమ తెరలు వాడటంతో పాటు, ఇంట్లో కొన్ని రకాలు మొక్కల్ని పెంచుకోవడం ద్వారా దోమలు, పురుగుల బాధనుంచి తప్పించు కోవచ్చు. తులసి, పుదీనా, గోధుమ గడ్డి, లావెండర్ను ప్రధానంగా చెప్పుకోవచ్చు. లావెండర్ మొక్కను ఇంట్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంతేకాదు లావెండర్ ఆయిల్, పువ్వుల వలన ఆరోగ్యప్రయోజనాలు లాభాలున్నాయి. అవేంటో చూద్దాం.లామియాసి లేదా పుదీనా కుటుంబానికి చెందిన పుష్పించే మొక్కను లావెండర్ అని పేరు. దీని బొటానికల్ పేరు లావెండర్ అఫిసినాలిస్. లావెండర్ అందమైన పుష్పాలనిస్తుంది. లావెండర్ ప్లాంట్ను ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి పురుగుల, కీటకాలు రావు. ఈగలు, దోమల నుంచి కూడా రక్షణ లభిస్తుంది. చీమలు, సాలె పురుగులు కూడా కనిపించవు. ఎందుకంటే ఈ మొక్క నుంచి వచ్చే వాసన వాటికి పడదట. లావెండర్ మొక్క, దాని వాసన మనకు మాత్రం ఆరోగ్యాన్ని అందిస్తుంది. ప్రత్యేకమైన రుచి కోసం కుకీలు, కేకుల్లో వీటిని వాడతారు. టీ, సిరప్ లలో ఈ లావెండర్ పువ్వులను వినియోగిస్తారు. అలాగే తీపి కాస్త పులుపు రుచితో ఉండే పువ్వులను చక్కగా తీసుకొని తినవచ్చు. పచ్చిగా తినలేనివారు టీ రూపంలో లావెండర్ పువ్వులను తింటారు కూడా. లావెండర్ మొక్కలతో మైండ్ రిలాక్స్ అవుతుంది. ఆందోళన తగ్గుతుంది. నిద్ర చక్కగా పడుతుంది. అంతేకాదు ఈ మొక్కనుంచి తీసిన ఆయిల్ అత్యంత ప్రజాదరణ పొందిన ఆయిల్ ఒకటి. ఈ నూనెను సౌందర్య ఉత్పత్తుల్లోనూ, అరోమాథెరపీలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ జీర్ణక్రియను మెరుగు పరచడానికి ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని కాంతివంతం చేయడంలో మొటిమలను తగ్గించడంలో సహాయ పడుతుంది. ముడతలను తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన నూనె బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తుంది. లావెండర్ ఆయిల్లోని యాంటీ ఫంగల్ లక్షణం మంటను, వాపును తగ్గిస్తుంది. ఇది ఎగ్జిమాను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టు సంరక్షణలో కూడా పనిచేస్తుంది. -
వెదురు సారంతో కొరియన్ గ్లాస్ చర్మం..!
కొరియన్ చర్మానికి ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు. పైగా అందుకు సంబంధించిన బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్లోకి ఇబ్బడి ముబ్బడిగా వచ్చేస్తున్నాయి కూడా. అయితే అవన్నీ ఆ బ్రాండ్లకు తగ్గ రేంజ్ ధరల్లోనే ఉంటాయనేది తెలిసిందే. అలా కాకుండా మనకున్న అందుబాటులోని వనరులతో కూడా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!వెదుర రసంతో కొరియన్ల లాంటి గ్లాస్ సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చక్కగా వారిలా ప్రకాశవంతమైన మచ్చలేని చర్మాన్ని సొంతం చేసుకోవచ్చట. వెదురు సారం ముఖాన్ని కాంతివంతంగా ఉండేలా చేస్తుందట. ఇందులో ఉండే సిలికాన్ కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించే ఖనిజంలా పనిచేస్తుంది. చర్మాన్ని దృఢంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. వయసు పెరిగే కొద్ది వచ్చే సిలికా స్థాయిలు తగ్గుతాయి.ముడతలు వచ్చి చర్మం ఆకృతి మారిపోయి, వృధాప్య సంకేచ్చేవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాంటివి రాకూడదంటే చర్మ సంరక్షణలో భాగంగా వెదురు సారాన్ని ముఖానికి అప్లై చేస్తే సిలికా స్థాయిలు పెరగడమే గాక యవ్వనవంతమైన మెరిసే చర్మ మీ సొంతం అవుతుంది. దీనిలో ఉండే హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ కారకాలు చర్మాన్ని బొద్దుగా , మృదువుగా చేస్తాయి. ఇందులో అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మంలోని తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. చర్మాన్ని ముడతలు, గీతలు వంటివి పడకుండా ఉండేలా రిపేర్ చేస్తుంది. పొడి చర్మం వారికి ఈ వెదురుసారం అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే చర్మంపై ఉండే మంట, చికాకులను దూరం చేస్తుంది. వెదురుసారం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్ ప్రయోజనాలను కలిగి ఉంది. అకాల వృద్ధాప్యం, నీరసానికి దారితీసే కాలుష్యం, యూవీ కిరణాలు వంటి పర్యావరణ నష్టం నుంచి చర్మాన్ని రక్షించే యాంటీఆక్సిడిడెంట్లు దీనిలో పుష్కలంగా ఉన్నాయి. ఇది సహజ నిరోధక లక్షణాలను కలిగి ఉంది. ఎర్రటి మెటిమలు, చికాకు వంటి సమస్యలను దూరం చేస్తుంది. అంతేగాదు వెదురుసారంలో ఎక్స్ఫోలియేటింగ్ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి నిస్తేజంగా అయిపోయిన చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి, కోమలంగా మారుస్తుంది. ఈ వెదురుసారానికి హైలురోనిక్ యాసిడ్, గ్లిజరిన్, కలబంద వంటి ఇతర హైడ్రేటింగ్ పదార్థాలను జోడిస్తే మరింత తొందరగా కొరియన్ గ్లాస్ చర్మాన్ని పొందగలరని చర్మ నిపుణులు చెబుతున్నారు. ఈ వెదురు సారం పొడిగా లేదా ద్రవ రూపంలో వినియోగించవచ్చు. దీన్ని మీకు ఇష్టమైన చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జోడించడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: అంతుపట్టని ఆ వ్యాధిని పది సెకన్లలో నిర్థారించిన పనిమనిషి..! షాక్లో వైద్యుడు) -
గ్లామ్ అప్ ఫెస్ట్ 2024 సెకండ్ ఎడిషన్ లాంచ్, మూడు రోజులపాటు
భారతదేశంలోని అతిపెద్ద బ్యూటీ ఈవెంట్ ‘గ్లామ్ అప్ ఫెస్ట్ 2024’ రెండో ఎడిషన్ షురూ అయింది. స్వదేశీ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ ద్వారా జూన్ 14 నుండి జూన్ 17 వరకు జరిగే ఈ ఈవెంట్లో గ్లామ్ అప్ సేల్తో పాటు ప్రీమియం, స్వదేశీ D2C బ్రాండ్లు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. అందం, సౌందర్య సాధనాలు, చర్మ సంరక్షణ, సువాసన ఉత్పత్తుల అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. ఇంకా సరికొత్త లాంచ్లు, డీల్స్ , సిగ్నేచర్ కలెక్షన్స్, బ్రాండ్ లాంచింగ్స్, ఇంటరాక్టివ్ యాక్టివిటీలు, ఫ్యాషన్ షో, ప్రోడక్ట్ ట్రయల్స్ డెడికేటెడ్ ఫోటో అండ్ వీడియో స్టేషన్లు ఉంటాయి.ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో ప్రకటించిన ఈ గ్లామ్ అప్ ఫెస్ట్ సెకండ్ ఎడిషన్లో 3,500+ బ్యూటీ అండ్ లైఫ్స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ఏకం చేసే ఈ గ్రాండ్ ఈవెంట్లో 70కిపైగా టాప్ బ్రాండ్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. గ్లామ్ అప్ ఫెస్ట్ లైఫ్ స్టైల్ ఇన్ఫ్లుయెన్సర్ల కోసం అద్భుతమై ప్లాట్ఫారమ్ను అందిస్తోందని ఫ్లిప్కార్ట్ FMCG అండ్ జనరల్ మర్చండైజ్ బిజినెస్ హెడ్ మంజరీ సింఘాల్ తెలిపారు. తమ కస్టమర్లకు ఈ ఈవెంట్ చక్కటి బ్యూటీ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందన్నారు.స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లను ఒకే తాటిపైకి తీసుకువస్తూ, ఈ ఏడాది ఫ్లిప్కార్ట్ గ్లామ్ అప్ ఫెస్ట్ను తాప్సీ పన్ను, సిద్ధాంత్ చతుర్వేది, రోహిత్ సరాఫ్, అదా శర్మ , పష్మీనా రోషన్లతో సహా పలువురు ఈ ఫెస్ట్ను సెలబ్రేట్ చేసుకుంటారు. వర్చువల్ ట్రై-ఆన్, వీడియో కామర్స్, స్కిన్ ఎనలైజర్లు లాంటి వినూత్న సాధనాలతో ఫ్లిప్కార్ట్ , AR , VR సామర్థ్యాలను కూడా ఉపయోగించుకోవచ్చు. -
Beauty Tips: మీ ముఖంపై బ్లాక్హెడ్స్ తొలగించాలంటే..??
ముఖాన్ని కళావిహీనం చేసే సమస్యల్లో బ్లాక్హెడ్స్ మహా మొండివి. గడ్డం, ముక్కు, నుదురు సహా ముఖం మీద పలు భాగాల్లో కనిపించే ఈ బ్లాక్హెడ్స్ తొలగించడమంటే .. కాస్త నొప్పితో కూడిన పనే. అయితే చిత్రంలోని ఈ మెషిన్.. హై–డెఫినిషన్ పిక్సెల్ 20గీ మాగ్నిఫికేషన్ టెక్నాలజీతో ఎలాంటి నొప్పి లేకుండా బ్లాక్హెడ్స్ను తొలగించి ముఖాన్ని నీట్గా మారుస్తుంది.ఈ డివైస్లో మొత్తం ఐదు లెవెల్స్ ఉంటాయి. దీని పైన.. వాక్యూమ్ హెడ్స్ని బిగించే భాగంలో చిన్న కెమెరా ఉంటుంది. ఈ డివైస్ని స్మార్ట్ఫోన్కి కనెక్ట్ చేసుకుంటే, చర్మాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ డ్యామేజ్ అయ్యిందో, ఎక్కడెక్కడ బ్లాక్హెడ్స్ ఉన్నాయో చూపెడుతుంది. కింది భాగంలో హీటింగ్ మసాజర్ హెడ్ ఉంటుంది. దీన్ని వినియోగించడం చాలా తేలిక. మొదటి లెవెల్ ఆప్షన్తో.. చర్మపు తీరుతెన్నులను పరిశీలించుకోవచ్చు.రెండో లెవల్ ఆప్షన్తో సెన్సిటివ్ స్కిన్కి, మూడో లెవెల్ ఆప్షన్తో జిడ్డు చర్మానికి, నాల్గవ లెవెల్ ఆప్షన్తో మరింత జిడ్డు చర్మానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఐదవ లెవెల్ ఆప్షన్తో మొండి రంధ్రాలకు సైతం చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో 3 సెకన్ల కంటే ఎక్కువసేపు ఒకే స్థలంలో క్లీన్ చేయకూడదు. దీని ధర 169 డాలర్లు. అంటే 14,036 రూపాయలు.ఇవి చదవండి: ఈ 'బంగారు తేనీరు'.. ధర ఎంతంటే? అక్షరాలా.. -
Beauty Tips: చర్మ సౌందర్యానికై ఇలా చేస్తే చాలు..
పాలలో బ్రెడ్ ముక్కలు నానవేసి వాటిని మెత్తగా మెదిపి ముఖానికి రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మృదువుగా మిలమిలలాడుతుంది.కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని పావు గంట తర్వాత కడిగేసుకోవాలి. తర్వాత శెనగపిండితో గానీ, నలుగుపిండితో గానీ రుద్ది ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు లేకుండా తాజాగా కనిపిస్తుంది.పులిపిర్లు రాలిపోయిన తర్వాత ఆ మచ్చలు పోవటానికి తేనె, నిమ్మరసం కలిపి ఆ మచ్చల మీద రాస్తూ ఉండాలి.తులసి ఆకులను మెత్తగా గ్రైండ్ చేసి ఆపేస్టును కాని రసాన్ని కాని ముఖానికి రాసి ఆరిన తర్వాత చన్నీటితో కడగాలి. క్రమంతప్పకుండా రోజూ చేస్తుంటే మొటిమలు, వాటి మచ్చలు పూర్తిగా పోవడంతో పాటుచర్మం నునుపుదేలుతుంది.తేనెను గోరువెచ్చగా చేసి అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించి ఆరినతర్వాత కడగాలి. తేనెను ఎప్పుడూ నేరుగామంట మీద వేడి చేయకూడదు. తేనె ఉన్నపాత్రను ఎండలో కాని, వేడి నీటి గిన్నెలోకాని పెట్టి వేడి చేయాలి.ఇవి చదవండి: ఆమె మాట, పాట, నటన, నృత్యంలో.. ‘వాహ్వా’! -
Beauty Tips: పాదాల రక్షణకై.. సింపుల్గా ఇలా చేస్తే చాలు..
మారుతున్న సీజన్ కారణంగా మన చర్మం పొడిబారటం, చీలికలు ఏర్పడటం జరుగుతంది. ముఖ్యంగా పాదాల విషయంలో ఈ సమస్య తరుచుగా కనిపిస్తుంది. పాదాల రక్షణకై వంటింట్లోనే ఉండే పదార్థాలతో వాటిని అందంగా మార్చాలంటే ఇలా చేయండి..!మూడు నిమ్మకాయలు, టేబుల్ స్పూన్ చక్కెర, టీ స్పూన్ బాదం నూనె, పది నుంచి పదిహేను పుదీన ఆకులు తీసుకోవాలి.నిమ్మకాయలను ముక్కలు చేయాలి.పుదీన ఆకులు, నిమ్మకాయ ముక్కలను (తొక్కతో సహా) మిక్సీలో గ్రైండ్ చేయాలి.అందులో చక్కెర, బాదం నూనె కలిపితే పాదాలకు స్క్రబ్ రెడీ.దీనిని పాదాలు, మడమలు, వేళ్ల మధ్య పట్టించి ఆరిన తర్వాత చేత్తో ఐదు నుంచి పది నిమషాల సేపు వలయాకారంగా మర్దన చేసి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.ఇది అన్ని కాలాల్లోనూ అవసరమే.వర్షాకాలంలో పాదాలు నాని ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడానికి ఈ స్క్రబ్లో చిటికెడు పసుపు కలుపుకోవాలి.ఇవి చదవండి: సాగుకు భరోసా..! -
Beauty Tips: పాదాలు అందంగా కనిపించాలా? అయితే ఈ టూల్ని..
తల వెంట్రుక నుంచి కాలి గోరు వరకు ఆరోగ్యంగా ఉంటేనే అందం సొంతమవుతుంది. కేశ సౌందర్యం ముఖానికి ఆకర్షణ కాబట్టి.. దానిపట్ల ఎలాగూ శ్రద్ధ పెడతాం! పాదాలనే పెద్దగా పట్టించుకోం! పాదాలే కదా అని పెదవి విరవకుండా.. ఇదిగో ఈ టూల్ని తెచ్చుకోండి.. వాటిని చక్కగా సంరక్షించి.. ఆరోగ్యం, అందం రెంటినీ చేకూరుస్తుంది.చిత్రంలోని ఈ డెడ్ స్కిన్ రిమూవర్లో.. 2 లెవెల్స్లో స్పీడ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. డివైస్తో పాటుగా రీప్లేసబుల్ గ్రైండింగ్ హెడ్స్ లభిస్తాయి. వాటిలో 2 స్క్రబ్ హెడ్స్తో పాటు.. ఒక రోలర్ ఉంటుంది. ఫాస్ట్ చార్జింగ్తో పోర్టబుల్ డివైస్గా ఉన్న ఈ రోలర్.. యూజర్ ఫ్రెండ్లీగా పని చేస్తుంది.హ్యాండిల్తో.. తేలికగా, ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుందీ డివైస్. తడి లేదా పొడి చర్మాలకు అనువైనది. అలాగే స్త్రీ, పురుషులు ఎవరైనా వాడొచ్చు. దీన్ని శుభ్రపరచడం తేలిక. కాళ్లు, గోళ్లు, గోళ్ల చుట్టూ ఉండే చర్మం.. ప్రతి భాగాన్ని శుభ్రపరచి మృదువుగా మారుస్తుంది.ఈ ఎలక్ట్రిక్ మేకప్ రిమూవర్ ఫుట్ స్క్రబ్ డెడ్ స్కిన్ ఎక్స్ఫోలియేషన్.. హై హీల్స్ వాడేవారికి.. పాదాలు కనిపించేలా డ్రెస్సులు వేసుకునేవారికి చక్కగా ఉపయోగపడుతుంది. అందమైన పాదాలను కోరుకునేవారికి.. ఇది చక్కటి బహుమతి అవుతుంది. ఈ ఫుట్ స్పా బ్యూటీ రోలర్ ఇంట్లో ఉంటే.. పెడిక్యూర్ కోసం పార్లర్ల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ధర కేవలం 449 రూపాయలు. దీన్ని స్నేహితులకు, శ్రేయోభిలాషులకు గిఫ్ట్గానూ ఇవ్వచ్చు.ఇవి చదవండి: ఏకంగా శునకాలకై.. అమెరికన్ కంపెనీ 'కడీ' పేరుతో.. -
అందం ఆరోగ్యం కలగలిపిన సిరి : కలబంద
Aloe Vera Juice: కలబంద రసం ప్రతిరోజు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే?ప్రస్తుత కాలంలో కలబంద పేరువినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అలోయి జాతికి చెందిన ఇది ఉష్ణమండలంలో విస్తారంగా పెరుగుతుంది. అలోవెరా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా చాలామందికి తెలుసు. అందంనుంచి ఆరోగ్యం దాకా కలబందతోలాభాల గురించి తెలుసుకుందాం.చర్మం, దంత, నోటి , జీర్ణ ఆరోగ్యానికి అలాగే బ్లడ్ షుగర్ లాంటి ఎన్నో సమస్యలకు చెక్ పెట్టడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సన్బర్న్ చికిత్సకు ఉపయోగడతాయి. చర్మం, జుట్టు అందాన్ని కాపాడుతుంది. అందుకే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్లో దీన్ని విరివిగా వాడతారు. దీంట్లో ఇంట్లోనే పెంచుకోవడం కూడా చాలా సులువు.కలబందలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి. కలబందలో విటమిన్ ఏ, సీ, ఇ , బి-కాంప్లెక్స్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, అమైనో ఆమ్లాలు వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంజైమ్లు, ఫైబర్లు జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కాలిన గాయాలు , అటోపిక్ డెర్మటైటిస్ (1 ట్రస్టెడ్ సోర్స్, 2 ట్రస్టెడ్ సోర్స్) వంటి ఇతర చర్మ రుగ్మతలకు చికిత్సగా పని చేస్తుంది.కలబంద రసం ఆరోగ్య ప్రయోజనాలుఆహారాన్ని జీర్ణం చేస్తుంది. కొవ్వు నిల్వను నిరోధిస్తుంది. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. షుగర్ బోర్డర్లో ఉన్నవారు, ప్రీ డయాబెటిక్ రోగులకు కూడా ఈ కలబంద రసం బాగా పని చేస్తుంది.కలబంద పొట్టను శుభ్రపరుస్తుంది. జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. కలబంద రసం తీసుకోవడం వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కలబంద రసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం గ్లో పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య కూడా దూరమవుతుంది. నోటి దుర్వాసనను తగ్గించడంలో పాటు చిగుళ్ళు, దంతాలను శుభ్రంగా ఉంచడంలో అలోవెరా రసం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
Beauty Tips: ఇలా చేశారో.. మీ చర్మం కాంతివంతమే!
టీ డికాషన్ని ఉపయోగించడం వల్ల వేసవి తాపం నుంచి చర్మాన్ని, శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే, ఇందుకు తేయాకులను మాత్రమే ఉపయోగిస్తే సరైన ఫలితం లభిస్తుంది.చల్లారిన అరకప్పు టీ డికాషన్లో రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి, అర టీ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 20 నిమిషాలు ఆరనివ్వాలి. శుభ్రపరుచుకోవడానికి ముందు కొన్ని నీళ్లు ముఖం మీద చల్లి, వేళ్లతో వలయాకారంగా రుద్దాలి.టీ డికాషన్లో ఐస్ క్యూబ్ వేసి, ఆ నీటిని ముఖానికి స్ప్రే చేసుకొని, కాసేపు సేదతీరాలి.ఎండ బారిన పడి ఇంటికి వచ్చినప్పుడు ఇలా చేయడం వల్ల కమిలిన చర్మం తిరిగి పూర్వపు స్థితికి చేరుకుంటుంది.టబ్ బాత్ చేసేటప్పుడు కొన్ని తేయాకులు నీటిలో వేసి, అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండవల్ల కలిగిన అలసట నుంచి చర్మం విశ్రాంతి పొందుతుంది.జుట్టు పొడిబారి నిర్జీవంగా మారితే తలస్నానం చేసిన తర్వాత టీ డికాషన్తో కడగాలి. కండిషనర్లా ఉపయోగపడుతుంది.ఇవి చదవండి: మిస్ కేరళ ఫిజిక్గా టైటిల్ తనకు సొంతం! -
Beauty Tips: కాలానుగుణంగా.. చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే..?
ప్రతిరోజూ ఎండతోపాటుగా.. వర్షాలు, చల్లదనం, వాతవరణంలో ఓకేసారి మార్పుల కారణంగా ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. అందులో చర్మం విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవచ్చు. ఇలాంటి సమస్యలను అధిగమిస్తూ అందంగా కనిపంచాలంటే ఈ బ్యూటీ టిప్స్ ట్రై చేయండి..పుచ్చకాయ.. ద్రాక్ష!పుచ్చకాయ, ద్రాక్ష కలిపి మెత్తగా గ్రైండ్ చేయాలి. దీంట్లో నిమ్మరసం, కోడిగుడ్డు లోని తెల్లసొన కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. వేసవిలో ఈ ఫ్రూట్ ప్యాక్ని తరచూ వేసుకోవడం వల్ల చర్మంలో జిడ్డు తగ్గి, కాంతిమంతం అవుతుంది.ఆరెంజ్ జ్యూస్..టీ స్పూన్ తేనె, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్, టేబుల్ స్పూన్ ఓట్స్, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్లో ఉంచి, చల్లబడ్డాక ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకుంటే ముఖచర్మం సేదదీరుతుంది.కొబ్బరిపాలతో..ఎండలో నుంచి ఇంటికి వెళ్లినప్పుడు ఫ్రిజ్లో ఉంచిన కొబ్బరిపాలలో దూది ఉండను ముంచి, దాంతో ముఖం, చేతులపై అద్ది, పది నిమిషాలు సేదదీరాలి. తర్వాత స్నానం చేస్తే ఎండవల్ల కమిలిన చర్మానికి ఉపశమనం లభిస్తుంది. మృదువుగా, కాంతిమంతంగా తయారవుతుంది.సోంపుతో..రెండు టీ స్పూన్ల సోంపు గింజలను దంచి, అరకప్పు నీటిలో వేసి, మరిగించాలి. చల్లారాక ఈ నీటిని వడకట్టి, టీ స్పూన్ నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమం ఫ్రిజ్లో ఉంచాలి.ఎండ నుంచి ఇంటికి వచ్చినప్పుడు దూది ఉండను సోంపు నీటిలో ముంచి ముఖం, మెడ, చేతులు తుడుచుకోవాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ నీళ్లు స్వేదరంధ్రాలలోని మలినాలను తొలగిస్తాయి. దురద, దద్దుర్లు, ట్యాన్ వంటి సమస్యలనూ తగ్గిస్తాయి. చర్మం కాంతిమంతంగా కనిపిస్తుంది.ఇవి చదవండి: ఖర్జూరతో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా! -
బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ వెండింగ్ మెషీన్స్.. ఎక్కడో తెలుసా?
సన్స్క్రీన్ లేకుండా ఎండలోకి వెళ్లడమా..! నో వే..అంటారు అమ్మాయిలు కదా. చర్మ కేన్సర్ బారిన పడకుండా రక్షించుకునేందుకు ఇది మేలైన మార్గం కూడా. అయితే హడావుడిలోనో.. లేదా ఖర్చు అవుతుందనో కొంతమంది సన్ స్క్రీన్ను పెద్దగా వాడరు. బహుశా అలాంటి వారి కోసమేనేమో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక కొత్త సర్వీసును అందుబాటులోకి తెచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ ను అందించే ఏర్పాట్లు చేసింది. తద్వారా ప్రజలను కేన్సర్ బారి నుంచి రక్షించుకోవచ్చు అన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిస్తోంది. భూ ఉత్తరార్ధగోళంలో న్ని చోట్ల సూర్యకిరణాల్లో హానికారక అతినీల లోహిత కిరణాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో చర్మ కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే నెదర్లాండ్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో సన్స్క్రీన్ డిస్పెన్సర్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తోంది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, క్రీడా వేదికలు, ఉద్యానవనాలతోపాటు బహిరంగ ప్రదేశాల్లో సన్ క్రీమ్ డిస్పెన్సర్లను అందుబాటులో ఉంచుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఇప్పటికే 80 లక్షల మంది చూసేశారు. చర్మ క్యాన్సర్ను ఎదుర్కోవడానికి ప్రతి ఒక్కరికీ సూర్యరశ్మి నుంచి రక్షణ కల్పించేలా చూడాలని నెదర్లాండ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. దేశంలో ఇటీవలి సంవత్సరాలలో చర్మ కేన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే, పళ్లు తోముకున్నట్లే చిన్నప్పటి నుండే సన్స్క్రీన్ను అప్లై చేయడం అలవాటు చేసుకోవాలనేది నిపుణుల మాట.Free sunscreen vending machines have begun to be placed in public areas in the Netherlands.pic.twitter.com/XVXjcI2Pwa— The Best (@ThebestFigen) May 16, 2024> అయితే ట్వీపుల్ మాత్రం భిన్నంగా స్పందించారు. అద్భుతం.. ఉచితంగా ఇస్తే ఇంకా మంచిదని కొందరనగా, ఇవి ఫ్రీ కేన్స్ర్ మెషీన్స్ అంటూ వ్యంగ్యంగా మరికొందరు కమెంట్ చేశారు. సూర్యరశ్మి తగిలేలా చూసుకోవాలని, సూర్యుడు మన శరీరంలోని చొచ్చుకెళ్లే రసాయనాలను నాశనం చేసేలా చేద్దాం అంటూ మరికొరు సమాధానమిచ్చారు. -
Beauty Tips: చర్మం కాంతివంతంగా మెరిసేలా.. ఈ బ్యూటీ టిప్స్!
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్వాటర్తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..ఇలా చేయండి..టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్క్యూబ్స్తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ను రాసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. -
చుండ్రు సమస్య వేధిస్తోందా? ఇలా ట్రై చేయండి!
వేసవిలో చెమట ఎక్కువగా ఉండటం, వాతావరణ కాలుష్యం కారణంగా జుట్టు సమస్యలు వేధిస్తాయి. చెమట, ధూళికారణంగా జుట్టుకి తొందరగా మురికిపడుతుంది. అందువల్ల తరచు తలస్నానం చేయాలి. అలా తలస్నానం చేయకపోవడం వల్ల అంతకుముందు చుండ్రు లేనివారికి చుండ్రు వచ్చే అవకాశం ఉంది. ముందే చుండ్రు ఉన్నవారిని ఆ సమస్య మరింతగా వేధిస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలున్నాయి. ∗ రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకుని ఒక టీస్పూన్ రసాన్ని తలకు (జుట్టు కుదుళ్లకు) పట్టించి పది నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. మరొక టీ స్పూన్ల రసంలో కప్పు నీటిని కలిపి తలస్నానం పూర్తయిన తర్వాత తల మీద (స్కాల్ప్కు పట్టేలా) పోసుకోవాలి.∗ వారం పాటు తలకు ఆలివ్ ఆయిల్ రాస్తే చుండ్రు వదులుతుంది. రోజూ తలస్నానం చేసే వాళ్లు రాత్రి పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ పెట్టి ఉదయం తలస్నానం చేయవచ్చు.∗ రెండు టేబుల్ స్పూన్ల ల కొబ్బరి నూనెలో అంతే మోతాదు నిమ్మరసం కలిపి తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. మర్దన చేసిన తర్వాత ఇరవై నిమిషాలకు మామూలు షాంపూ లేదా కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి.∗ టేబుల్ స్పూన్ల మెంతులను రాత్రి నానబెట్టి ఉదయం మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి అందులో నిమ్మరసం (ఒక కాయ) కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తలకు మెంతుల పేస్ట్ పెట్టినప్పుడు కొద్దిగా తేమగా ఉండగానే తలస్నానం చేయాలి. పూర్తిగా ఎండి΄ోయే వరకు ఉంచితే జుట్టుకు పట్టేసిన మెంతుల పేస్టును వదిలించడం కష్టం.∗ కప్పు పుల్లటి పెరుగులో టీ స్పూన్ల నిమ్మరసం కలిపి తలకు పట్టించాలి. ఆరిన తర్వాత తలస్నానం చేయాలి.∗చుండ్రును వదిలించడంలో వేపాకు కూడా బాగా పని చేస్తుంది. వేపనూనె తలకు పట్టించి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. వేప నూనె లేక΄ోతే వేపాకు రసం పట్టించి మర్దన చేయవచ్చు. -
చేతులు రఫ్గా ఉన్నాయా? ఇదిగో అద్భుతమైన చిట్కా
కొంతమందికి చేతులు, మోచేతులు నల్లగా అందవిహీనంగా కనిపిస్తూ ఉంటాయి. దీంతో కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది. ఈ నేపథ్యంలో మీచేతులు అందంగా, మృదువుగా, మెరిసిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి.పులిసిన పెరుగుపైన ఉండే మీగడ తీసుకుని చేతులకి మసాజ్ చే స్తూ ఉంటే చేతులు మృదువుగా ఉంటాయి. పెట్రోలియమ్ జెల్లీతో కూడా మసాజ్ చేసుకోవచ్చు.ఆలివ్ ఆయిల్ ఒక చెంచా, నిమ్మరసం ఒక చెంచా, గ్లిజరిన్ ఒక చెంచా, గోధుమరవ్వ రెండు చెంచాలు, ΄ాలు ఒక చెంచా కలిపి చేతులకి రాసుకుని గంట తర్వాత వేడి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి.స్పూను దానిమ్మరసం, స్పూను టొమోటో గుజ్జు కలిపి దానిలో కొన్ని గ్లిజరిన్ చుక్కలు కలిపి చేతులకి పట్టించి ఒక గంట అయిన తర్వాత కడుక్కుంటే చేతులు చక్కగా మెరుస్తాయి. రెండు స్పూన్ల దానిమ్మరసంలో స్పూను పంచదార కలిపి చక్కెర కరిగిన తర్వాత చేతులకి పట్టించి నెమ్మదిగా మసాజ్ చేస్తే చేతులు నున్నగా ఉంటాయి.చెంచా బాదం పొడిలో తగినన్ని పాలు కలిపి పేస్ట్ చేసుకొని చేతులకి రాసుకొని ΄ావుగంట తర్వాత కడుక్కోవాలి.నారింజ రసం రెండు చెంచాలు, తేనె రెండు చెంచాలు కలిపి చేతులకి రాసుకొని ఇరవై నిమిషాల తర్వాత వేడి నీటితో కడుక్కోవాలి.రెండు చెంచాలు గ్లిజరిన్, రెండున్నర చెంచాలు రోజ్ వాటర్ కలిపి చేతులకి మసాజ్ చేస్తే చేతులు మృదువుగా ఉంటాయి.రాత్రి పడుకోబోయే ముందు చేతులకి బేబీ ఆయిల్ పూసి మృదువుగా మసాజ్ చేస్తే చేతులు కోమలంగా ఉంటాయి. -
పెదవుల నిగారింపుకై.. ఇలా చేస్తే చాలు..!
పెరుగుతున్న ఎండవేడికి చర్మంతోపాటు, పెదవులపై నలుపు రంగు పేరుకుపోతూంటుంది. పెదవులపై చీలికలతో పాటు మెరిసేతత్వం కూడా తగ్గుతుంది. మరి పెదవులు సహజంగా, కోమలంగా ఉండాలంటే ఈ ట్రిక్స్ ట్రై చేయండి..!ఇలా చేయండి..రోజూ ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత.. బ్రష్ మీద కొద్దిగా తేనె వేసి రెండు పెదవులపైన గుండ్రంగా ఐదు నిమిషాలపాటు రుద్దాలి. ఇలా రోజూ చేయడం వల్ల పెదవులపై పేరుకుపోయిన మృతకణాలు తొలగిపోతాయి. మర్ధన వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదవులు మృదువుగా మారతాయి.ఉదయం బ్రష్తో మర్దన చేసాక, రాత్రి పడుకునేముందు మాయిశ్చరైజర్ తప్పనిసరిగా రాయాలి. ఇందుకోసం.. కొద్దిగా బీట్రూట్ రసాన్ని వేడి చేయాలి. వేడిచేసిన రసంలో అర టీస్పూను కార్న్ఫ్లోర్ వేసి ఐదు నిమిషాలపాటు బాగా కలిపి దించేయాలి. తరువాత ఈ మిశ్రమంలో అర టీస్పూను గ్లిజరిన్, పావు టీస్పూను కొబ్బరి నూనె కలిపి ఎయిర్టైట్ కంటైనర్లో నిల్వచేయాలి. ఈ మిశ్రమం గట్టిపడిన తరువాత పెదవులకు రాసి మర్ధన చేసి పడుకోవాలి. ఉదయం నీటితో కడిగేయాలిఈ రెండింటిని ఒకదాని తరువాత ఒకటి క్రమం తప్పకుండా పాటిస్తే పెదవులు గులాబి రేకుల్లా కోమలంగా పింక్ కలర్లో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.ఇవి చదవండి: Beauty Tips: కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి! -
కనురెప్పల సోయగానికై.. ఇలా చేయండి!
ఆర్టిఫీషియల్ ఐ లాషెస్తో కళ్లను మీనాల్లా మెరిపించవచ్చని తెలిసినాకూడా వాటిని ఎలా అమర్చుకోవాలో అర్థం కాక ఇబ్బంది పడుతుంటే... ఒకసారి ఇలా ట్రై చేయండి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ (సౌందర్య సాధనాల మార్కెట్లో దొరుకుతాయి) ఒక సెట్, వాటిని అమర్చడానికి ఐలాష్ గ్లూ తీసుకోవాలి.వీటితోపాటు కత్తెర, ట్వీజర్, ఐ లాష్ కర్లర్, ఐ లైనర్, మస్కారా తీసుకోవాలి.ఆర్టిఫీషియల్ ఐ లాషెస్ మరీ పొడవుగా ఉన్నట్లనిపిస్తే తగినంత మేరట్రిమ్ చేయాలి.ట్వీజర్ సహాయంతో లాషెస్కు గ్లూ పట్టించాలి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా కనురెప్ప మీద అమర్చాలి. గ్లూ ఆరి లాషెస్ సెట్ అయ్యే వరకు ఆగాలి. స్కిన్కు అంటుకోకుండా గ్లూవిడిగా ఆరిపోతున్నట్లు అనిపించినా, ఆరాక ఊడి వచ్చేటట్లు అనిపించినా కనురెప్పల మీద ఆర్టిఫీషియల్ లాషెస్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్లు మెల్లగా నొక్కాలి.గ్లూ ఆరిన తర్వాత లాషెస్కు డార్క్షేడ్ ఐ లైనర్ అప్లయ్ చేయాలి. ఇలా చేయడం వల్ల అసలు కనురెప్పలకు, ఆర్టిఫీషియల్ లాషెస్కు మధ్య తేడా కనిపించకుండా అంతా ఒకేలా ఉంటాయి.చివరగా ఐలాష్ కర్లర్తో వంపు తిప్పాలి. అవసరమనిపిస్తే (మరింతడార్క్గా కనిపించాలనుకుంటే) మస్కారా అప్లయ్ చేయాలి.ఇవి చదవండి: మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకోండి! -
Beauty Tips: ఈ డివైస్ని వాడారో.. మీ ముఖం చక్కటి ఆకృతిలోకి..
కాసింత ఒళ్లు చేస్తే చాలు.. చాలామందికి డబుల్ చిన్ వచ్చేస్తుంది. దాంతో ముఖంలోని కళే పోతుంది. ఇది వి షేప్ ఫేస్ కోరుకునేవాళ్ల ఆత్మస్థైర్యంతో భలే ఆడుకుంటుంది. మెడ, తలను అటూ ఇటూ తిప్పుతూ.. ఎన్ని ఎక్స్సైజులు చేసినా.. ముఖాన్ని V షేప్లోకి తెచ్చుకోవడం కష్టమే అవుతుంది. అందుకోసమే చిత్రంలోని ఈ డివైస్.ఈ ఎర్గోనామిక్ ఫేస్ లిఫ్టింగ్ మసాజర్.. ముఖాన్ని చక్కటి ఆకృతిలోకి తెస్తుంది. ఈ ఫోల్డబుల్ చిన్ రెడ్యూసర్ను అన్ని వేళలా సులభంగా వాడుకోవచ్చు. చదివేటప్పుడు, నిద్రపోతున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ఇంటి పని చేస్తున్నప్పుడు దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఈ డివైస్తో పాటు సాఫ్ట్ అండ్ స్కిన్ ఫ్రెండ్లీ కంఫర్టబుల్ కోర్డ్ (ఛిౌటఛీ.. చెవి పట్టీ) లభిస్తుంది. అవసరాన్ని బట్టి ఈ మెషిన్ ని చేత్తో పట్టుకుని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మాత్రం ఆ చెవి పట్టీ సాయంతో డివైస్ను చెవులకు బిగించుకుంటే చాలు.. గడ్డం కింద మెషిన్ దాని పని అది చేసుకుంటుంది. దీన్ని చార్జింగ్ పెట్టుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనితో ప్రయాణాల్లోనూ ట్రీట్మెంట్ పొందొచ్చు. ధర 28 డాలర్లు. అంటే 2,341 రూపాయలు అన్నమాట!ఇవి చదవండి: Health: లోయర్ బ్యాక్ పెయిన్తో ఇబ్బందా! ఆలస్యం చేశారో?? -
Betel Leaf: తమల పాకులతో హెయిర్ ఫాల్ సమస్యకు చెక్!
తమలపాకు లేకుండా శుభాకార్యాలను అసలు ఊహించలేం కదా. అలాగే విందుభోజనం తరువాత తాంబూలం సేవించడం కూడా చాలామందికి అలవాటు. విటమిన్ ఎ, సి, బి1, బి2, పొటాషియం, థయామిన్, నియాసిన్ , రైబోఫ్లావిన్ వంటి పోషకాలు తమలపాకులలో లభిస్తాయి. అలాగే జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది. కానీ తమలపాకుతో జుట్టు సమస్యలకు చెక్ చెప్పవచ్చని మీకు తెలుసా? సహజంగా దొరికే తమలపాకుద్వారా జుట్టు రాలడాన్ని నివారించుకోవచ్చు. తలలో దురద, తెల్లజుట్టు సమస్య కూడా నయమ వుతుంది. తమలపాకుల్లో ఉండే విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు జుట్టు చిట్లడం మరియు రాలడాన్ని నివారిస్తాయి. కాబట్టి జుట్టు రాలకుండా ఉండేందుకు తమలపాకులను ఉపయోగించే మార్గాన్ని తెలుసుకుందాం.తమలపాకు నీటితో జుట్టును కడగాలితల కడుక్కోవడానికి 15-20 తమలపాకులను ఒక పాత్రలో వేసి మరిగించాలి. చల్లారిన తరువాత దీంతో జుట్టులో వాచ్ చేయాలి. తమలపాకులో యాంటీమైక్రోబయల్ , యాంటీ బాక్టీరియల్ లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ సమస్యను దూరం చేస్తుంది. తమలపాకు,నెయ్యి హెయిర్ మాస్క్తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టు చేయాలి. ఇందులో టీస్పూను నెయ్యి వేసి కలిపి, మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. మసాజ్తమలపాకు పేస్ట్లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారంలో ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.తమలపాకులతో చేసిన నూనెజుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే తమలపాకుతో చేసిన నూనె కంటే గొప్పది ఏదీ ఉండదు. కొబ్బరి లేదా ఆవనూనెలో 10 నుండి 15 తమలపాకులను వేసి సన్నని మంటపై మరిగించాలి. తమలపాకులు నల్లగా మారాగా, ఈ నూనెను వడపోసి, స్కాల్ప్ నుంచి జుట్టంతా బాగా పట్టించాలి. ఇది రాత్రంతా ఉంచుకోవచ్చు. తలస్నానానికి ఒక గంట ముందు రాసు కోవచ్చు. తమలపాకులను తినండిఉదయం ఖాళీ కడుపుతో 5-6 తమలపాకులను నమలవచ్చు లేదా 10-5 తమలపాకులను నీటిలో ఉడకబెట్టి ఆ నీటిని తీసుకోవచ్చు. ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడమే కాకుండా, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
Beauty Tips: చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్లాగా.. కానీ ఇదొక బ్యూటీ మసాజర్..!
యవ్వనాన్ని కోరుకోంది ఎవరు! దాన్ని శాశ్వతం చేసుకోవడానికి ఇంటి చిట్కాల నుంచి శస్త్రచికిత్సల దాకా అన్నిటినీ ప్రయత్నిస్తారు. అయినా పరిష్కారాన్ని అందనివ్వదు పెరిగే వయసు. ఆ వరుసలో ఇంకో ప్రయత్నంగా వచ్చింది ఇదిగో ఈ ‘కిస్కీస్ స్కిన్ రెజూవనేషన్ ఐ రికిల్ రిమూవర్ మెషిన్.’ నిత్య యవ్వనాన్ని ఇవ్వకపోయినా వృద్ధాప్యాన్నయితే వాయిదా వేస్తుంది.. కళ్ల దగ్గర ఏర్పడే మచ్చలు, ముడతలను పోగొట్టి!చూడటానికి ఇది ల్యాండ్ ఫోన్ మాదిరిగా ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసినట్లుగా.. దీని మసాజ్ హెడ్ని చేత్తో పట్టుకుని.. కళ్ల చుట్టూ ఉన్న ముడతలు, మచ్చల మీద మసాజ్ చేసుకోవాలి. ఈ మెషిన్ తోపాటు కాథోడ్ క్లిప్ ఒకటి లభిస్తుంది. ట్రీట్మెంట్ తీసుకునేవారు ఈ క్లిప్ని చేతికి అటాచ్ చేసుకుని మసాజ్ స్టార్ట్ చేసుకోవాలి.ఈ టూల్ సాయంతో ఐ బ్యాగ్స్, డార్క్ సర్కిల్స్ అన్నీ తొలగిపోతాయి. మొదట్లో పది రోజులకు ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆరు లేదా ఎనిమిదిసార్లు ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్ స్పష్టంగా కనిపిస్తుంది. ధర 876 డాలర్లు. అంటే 73,265 రూపాయలు అన్నమాట. ఇలాంటి మోడల్స్ మార్కెట్లో చాలానే ఉన్నాయి. క్వాలిటీ, ఆన్లైన్ రివ్యూస్ని బట్టి కొనుగోలు చేయడం ఉత్తమం. మోడల్ని బట్టి.. ఒక్కో గాడ్జెట్.. ఒక్కో ధర ఉండొచ్చు.ఇవి చదవండి: గృహస్థాశ్రమ వైశిష్ట్యం : ఇష్టాయిష్టాలు కలిసాయా!? -
వేసవి కాలంలో.. కళ్ల మంటలా? అయితే ఇలా చేయండి!
ఎండలు మండుతున్నాయి. ఈ సమయంలో చాలామందికి కళ్లు పొడిబారిపోవడం, కళ్లు ఎర్రబడి మంటలు రావడం సర్వ సాధారణం. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటిస్తే ఉపశమనం కలుగుతుంది. ఆ చిట్కాలేమిటో చూద్దాం.ఇలా చేయండి..పాలలో కాని కలబంద రసంలో కానీ దూదిని ముంచి పదిహేను నిమిషాల పాటు కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ అలసట తగ్గుతుందిగంధం చెక్కని అరగదీసి కళ్ళ మీద రాసుకుంటే కళ్ళలోని ఎరుపు తగ్గుతుందినిద్ర పోయే ముందు నాలుగైదు తేనె చుక్కలు, నువ్వుల నూనె నాలుగైదు చుక్కలు కలిపి కళ్ళలో వేసుకుంటే ఉదయానికి కళ్ళు నిర్మలంగా,స్వచ్ఛంగా ఉంటాయికళ్ళు మంటగా వుంటే చల్లటి నీటితో కళ్ళు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ నీరు కళ్ళ లోని దుమ్ముకణాలు, మలినాలను తీసివేయడంలో సహాయపడుతుందిదూదిని రోజ్ వాటర్లో ముంచి కనురెప్పులపై 10–15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేస్తే కంటిగాయాలకి, కళ్ళ మంటలకి ఉపశమనం లభిస్తుందిదూదిని పాలలో ముంచి కంటిచుట్టు తుడవాలి. తర్వాత చల్లనినీటితో శుభ్రంగా కడుక్కోవాలిదోసకాయ ముక్కల్ని కట్ చేసి కను రెప్పుల పై 15 నిమిషాల పాటు ఉంచినట్లయితే కళ్ళ మంట నుంచి ఉపశమనం పొందవచ్చుశుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని చల్లటి నీటితో తడిపి నీరంతా పిండేయాలి. ఆ వస్త్రంలో కొన్ని మల్లెపూలు లేదా నంది వర్ధనం పూలు ఉంచి కళ్లమీద ఆ వస్త్రాన్ని ఉంచుకుంటే చల్లగా ఉండడంతోపాటు తలనొప్పి తగ్గుతుందిపచ్చి బంగాళదుంపను చక్రాల్లా తరిగి ఆ ముక్కలను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళమంటల నుంచి ఉపశమనం లభిస్తుంది.ఇవి చదవండి: 'పుదీనా'తో.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో? మీకు తెలుసా! -
Beauty Tips: పాదాలలో.. ఇలాంటి సమస్యలున్నాయా? అయితే ఇలా చేయండి!
మారుతున్న వేడి వాతావరణం కారణంగా చర్మ సమస్యలు రావచ్చు. పాదాల విషయానికొస్తే.. దుమ్ము, దూళితో పాదాలు నలుపెక్కే అవకాశం ఉంది. చెమటతో మరింత మందంగా చీలికలేర్పడవచ్చు. కనుక మృదువైన పాదాల సంరక్షణకై ఈ చిన్న చిట్కాలు ఏంటో చూద్దాం.ఇలా చేయండి..చేతులు, పాదాలపై నల్లటి మచ్చలుంటే వాడేసిన నిమ్మతొక్కతో రుద్దితే పోతాయి.సమ్మర్లో బయటకు వెళ్ళేటప్పుడు పాదాలకు సాక్స్ వేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి.రాత్రి పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడిగి ఆరిన తర్వాత మసాజ్ క్రీమ్ లేదా ఆయిల్తో ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి.పదిహేను రోజులకు ఒకసారి పెడిక్యూర్ చేసుకోవాలి.స్నానం పూర్తయిన తర్వాత పమిస్ స్టోన్తో పాదాలను మెల్లగా రుద్దాలి. ఇలా చేస్తే మృతకణాలు తొలగిపోయి పాదాలు నునుపుగా ఉంటాయి.ఇవి చదవండి: ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్ -
Hot Summer చర్మానికి కావాలి చల్లదనం, ఈ మాస్క్లు ట్రై చేయండి!
వేసవి ఎండలు మండిస్తున్నాయి. ఉదయం 9 గంటలకే ఉష్ణోగ్రతలు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో తగినన్ని నీళ్లు తాగుతూ బాడీకి చల్లదనాన్ని ఇచ్చే ఆహారానికి ప్రాధాన్యత ఇస్తూ ఆరోగ్యాన్ని కాపాడు కోవడం ముఖ్యం. అలాగే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువ వస్తాయి. చెమట పొక్కులు, దురదలు లాంటి రాకుండా ఉండాలంటే చర్మానికి సాంత్వన కలిగేలాకొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటి కొన్ని జాగ్రత్తలు మీకోసం ముఖ్యంగా ఎండ వేడినుంచి ఉపశమనం కలిగేలా అందుబాటులో ఉన్న సహజమైన పదార్థాల ద్వారా కొన్ని ఫేస్ మాస్క్లను చూద్దాం. హనీ-యోగర్ట్ మాస్క్ : ఒక టేబుల్ స్పూన్ తేనెలో ఒక టేబుల్ స్పూన్ తాజా పెరుగు కలిపి ముఖం, మెడ, చేతులకు రాసి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో ముఖం కడగాలి. వాటర్ మెలన్ మాస్క్: పుచ్చకాయ ముక్కలు అర కప్పు తీసుకుని చిదిమి గుజ్జు చేయాలి. ఆ గుజ్జును, నీటిని ముఖానికి, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. కోకోనట్ ఆయిల్-టర్మరిక్ మాస్క్: టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో అర టీ స్పూన్ స్వచ్ఛమైన పసుపు కలిపి ముఖం, మెడ, చేతులు, ΄ాదాలకు పట్టించాలి. కొంత ఆరిన తర్వాత (పూర్తిగా ఎండిపోకముందు) వేళ్లతో వలయా కారంగా మర్దన చేసి చన్నీటితో శుభ్రం చేయాలి. నూనె జిడ్డు పూర్తిగా వదలక΄ోయినప్పటికీ నీటితో కడిగి టిష్యూతో తుడవాలి తప్ప సబ్బు వాడరాదు. పపయా– హనీ మాస్క్: బాగా పండిన బొప్పాయి పండు ముక్కలు అర కప్పు తీసుకుని బాగా చిదమాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి పట్టించి పదిహేను నిమిషాల తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. మింట్-కుకుంబర్ మాస్క్: కీరదోస కాయ చెక్కు తీసి అర కప్పు ముక్కలు తీసుకోవాలి. అందులో గుప్పెడు పుదీన ఆకులు వేసి మిక్సీలో గ్రైండ్ చేసి చర్మానికి పట్టించాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. నోట్: ఎండలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి. ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి. నీరు ఎక్కువగా లభించే తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. -
లేడీ సూపర్స్టార్ నయన్ లగ్జరీ వాచ్..ధర తెలిస్తే!
లేడీ సూపర్స్టార్ నయనతార భర్త, ట్విన్స్తో కలిసి కొత్త ఏడాది(విషు) వేడుకలను ఘనంగా జరుపుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచు కోవడంతోపాటు, అందరికి పండుగ శుభాకాంక్షలకు కూడా అందించింది. ఈ సందర్భంగా ఆమె ధరించిన రోలెక్స్ ఓస్టెర్ ఫ్యాన్స్ను ఎట్రాక్ట్ చేసింది. సమ్మర్ సీజన్లో క్లాసిక్ సమ్మర్ రెడీ యాక్సెసరీరీ జతగా లగ్జరీ వాచ్నుధరించింది. దుస్తుల నుండి బ్యాగ్ వరకు అన్నీ లగ్జరీ వస్తువులు కావడం విశేషం. ఇందులో రోలెక్స్ ఆయిస్టర్ పర్మనెంట్ బ్రాండ్ వాచీ మరీ స్పెషల్. కాటన్ సూట్కు మ్యాచ్ అయ్యేలా లైట్ పింక్ కలర్ డయల్ ఉన్న రోలెక్స్ వాచ్ అతికినట్టు సరిపోయింది. దీని ధర సుమారు రూ. 53 లక్షలట. నయన్ బర్త్డే సందర్బంగా భర్త విఘ్నేష్ శివన్ రూ.2.7 కోట్ల విలువైన మెర్సిడెస్ మేబ్యాక్ కారును బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే షూట్ టైం అంటూ చీరలో అద్భుతమై ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంది నయనతార. కాగా నయనతార కరియర్ పరంగా వరుసగా హిట్లతో దూసుకుపోతోంది.అలాగే ఇటీవల వ్యాపారంలోకి కూడా అడుగు పెట్టింది. ఒక కొత్త స్టూడియోను నిర్మిస్తున్న విషయాన్ని న్యూజర్నీ అంటూ ఇటీవల ఇన్స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) அனைவருக்கும் இனிய தமிழ் புத்தாண்டு சித்திரை திருநாள் நல்வாழ்த்துகள் #TamilNew2024 ഏവർക്കും ഹൃദയം നിറഞ്ഞ വിഷു ആശംസകൾ#HappyVishu2024 pic.twitter.com/Wh6MlGu21r — Nayanthara✨ (@NayantharaU) April 15, 2024