-
టీడీపీ ఫేక్ కాల్స్
● ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రజలకు ఫోన్లు ● స్పామ్ కాల్స్గా పేర్కొంటూ బ్లాక్ చేస్తున్న వినియోగదారులు అంబాజీపేట: సార్వత్రిక ఎన్నికల వేళ ప్రభుత్వంపై టీడీపీ ఫేక్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం సాగిస్తోంది. ప్రభుత్వ పనితీరు బాగోలేదని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఓటు వేయాలంటూ ఫోన్ కాల్స్ ద్వారా ఊదరగొడుతోంది. పదేపదే ఫేక్ కాల్స్తో ప్రజల సహనాన్ని పరీక్షిస్తోంది. టీడీపీ సాగిస్తున్న ఊకదంపుడు ప్రచారంపై సెల్ఫోన్ వినియోగదారులు తమదైన శైలిలో తిరుగు సమాధానమిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న పథకాల్లో లోపాలంటూ ఐవీఆర్ఎస్ ద్వారా సంభాషణలు చేయడంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా భూములు లాగేసుకుంటున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ఈవిధంగా ప్రతి వినియోగదారుకూ రోజుకు ఐదు నుంచి పది కాల్స్ టీడీపీ నుంచే వస్తున్నాయి. ఈ కాల్స్ మధ్యప్రదేశ్, గుజరాత్ తదితర ప్రాంతాల నుంచి వస్తున్నట్టు కొంతమంది గుర్తిస్తున్నారు. టీడీపీ నుంచి వస్తున్న కాల్స్ను బ్లాక్ చేస్తూ వాటిని స్పామ్ కాల్స్గా పేర్కొంటూ వినియోగదారులు తిప్పికొడుతున్నారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో కొత్త నంబర్లతో వస్తున్న ఈ ఫేక్ కాల్స్పై ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సి ఉంది.యూత్ ఓటింగ్లో కుర్రాళ్లే అధికం కొవ్వూరు: సాధారణంగా పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉంటారు. తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం 18 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారిలో పురుష ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. యువతుల కంటే 7,317 మంది యువకుల ఓట్లు అధికంగా ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 18–19 ఏళ్ల ఓటర్లలో యువతులకంటే 2,971 మంది యువకులే అధికంగా ఉన్నారు. జిల్లా లో మొత్తం ఓటర్లు 16,23,149 మంది. వారిలో పురుషులు 7,92,317 మంది, కాగా మహిళలు 8,30,735 మంది, ఇతరులు 97 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే 38,418 ఎక్కువగా ఉన్నారు. యువతలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా 18–29 మధ్య వయసు యువతుల ఓట్లు 1,59,686 కాగా, యువకుల ఓట్లు 1,67,003 ఉన్నాయి. యువతుల కంటే యువకుల ఓట్లు అత్యధికంగా రాజానగరం నియోజకవర్గంలో 2,149, అత్యల్పంగా నిడదవోలులో 315 ఓట్లు ఉన్నాయి. కొవ్వూరులో 875, అనపర్తిలో 1,701, గోపాలపురంలో 753, రాజమహేంద్రవరం సిటీలో 1,706, రాజమహేంద్రవరం రూరల్లో 1,831 చొప్పున యువకుల ఓట్లు యువతుల కంటే అధికంగా ఉన్నాయి. -
స్వతంత్రుల ఖిల్లా
రామచంద్రపురం: సామాజిక చైతన్యం కలిగిన నియోజకవర్గాల్లో రామచంద్రపురానికి జిల్లాలో ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి ఓటర్లు విలక్షణమైన తీర్పుతో స్వతంత్రులకు కూడా ఎక్కువ సార్లు పట్టం కట్టారు. ఈ నియోజకవర్గం నుంచి రికార్డు స్థాయిలో ఇప్పటివరకు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. 1952లో ఏర్పడిన రామచంద్రపురం నియోజకవర్గంలో పునర్విభజన జరిగిన ప్రతిసారి మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం నియోజకవర్గంలోని కాజులూరు మండలం పల్లిపాలెం అప్పట్లో ద్విశాసన సభ సభ్యులు కేంద్రంగా ఉండగా, కె.గంగవరం మండలంలోని పామర్రు ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా భాసిల్లింది. 2009తో పునర్విభజన అనంతరం కె.గంగవరం, కాజులూరు, రామచంద్రపురం మండలాలతో పాటు, మున్సిపాలిటీతో కలిసి రామచంద్రపురం నియోజకవర్గంగా మారింది. చారిత్రాత్మక గుర్తింపు 14వ శతాబ్దం నుంచి రామచంద్రపురానికి చారిత్రాత్మకంగా గుర్తింపు ఉంది. అప్పట్లో రామచంద్రపురం గోల్కొండ నవాబులకు సామంత రాజ్యంగా ఉండేది. రామచంద్రపురం సంస్ధానాధీశులుగా శ్రీరాజాకాకర్లపూడి రాజ వంశీయులు సామంతరాజులుగా ఉండేవారు. తదనంతరం విజయనగరం రాజులకు కూడా సామంతరాజులుగా కొనసాగారు. వీరి హయాంలోనే రామచంద్రపురంలో సువిశాలమైన పెద్దకోటను నిర్మించారు. అప్పట్నుంచి కోట రామచంద్రపురంగా పేరుగాంచింది. అప్పటి నుంచి ఈ కోట రాజకీయాలకు కేంద్ర బిందువుగా కొనసాగుతోంది. అష్టాదశ పీఠాల్లో ఒకటిగా, ప్రముఖ శైవ క్షేత్రమైన ద్రాక్షారామ భీమేశ్వరస్వామి దేవాలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. 17 సార్లు ఎన్నికలు ఒకప్పుడు మున్సిపాలిటీ ఉన్న ద్రాక్షారామ ప్రస్తుతం పంచాయితీగా మారింది. నియోజకవర్గంలో ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో జరిగిన తొలి ఎన్నికలో ప్రజాపార్టీ అభ్యర్థి ఎస్ఆర్కే నరసరాజు 14,369 ఓట్లతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు రెండుసార్లు ఉప ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గం ఏర్పడ్డాక 1953, 2012ల్లో ఉప ఎన్నికలు జరిగాయి. 1970లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మల్లిపూడి రామసంజీవరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికవ్వటం ఈ నియోజకవర్గంలో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇండిపెండెంట్ల హవా నియోజకవర్గంలో 1962 నుంచి ఇండిపెండెంట్ల హవా కొనసాగింది. 1962లో నందివాడ సత్యనారాయణరావు సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంటిపూడి కమలాదేవిపై 3,380ఓట్ల మెజార్టీతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాదించారు. అనంతరం 1967లో నున్న వీర్రాజు, 1978లో పిల్లి అప్పారావు, 1994లో తోట త్రిమూర్తులు, 2004లో పిల్లి సుభాష్చంద్రబోస్ ఇండిపెండెంట్లుగా విజయం సాధించటంతో రామచంద్రపురం నియోజకవర్గం స్వతంత్రుల ఖాల్లాగా పేరుగాంచింది. నియోజకవర్గం నుంచి ఇప్పటివరకు మహిళలు ప్రాతినిధ్యం వహించలేదు. 1962లో కాంగ్రెస్ పార్టీ తరఫున కంటిపూడి కమలాదేవి పోటీ చేసి ఓడిపోగా, అప్పట్నుంచి ఇప్పటివరకు మహిళలు పోటీలో లేరు. నియోజకవర్గం ఏర్పడ్డాక ఇక్కడ్నుంచి 2004 నుంచి 2010 వరకు పిల్లి సుభాష్చంద్రబోస్ రెండు సార్లు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ 2021 నుంచి 2024 వరకు మంత్రులుగా పనిచేశారు. ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన వైఎస్సార్ సీపీ, టీడీపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. ఇండిపెండెంట్ నుంచి గట్టి పోటీ ఈసారి లేనట్టేనని తెలుస్తోంది. వైఎస్సార్ సీపీ నుంచి ఎంపీ పిల్లి సుభాష్చంద్రబోస్ తనయుడు సూర్యప్రకాశ్, టీడీపీ నుంచి అమలాపురానికి చెందిన వాసంశెట్టి సూర్యప్రకాశ్ పోటీలో ఉన్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు గెలుపొందిన ఎమ్మెల్యేలు వీరే..సంవత్సరం విజేత పార్టీ ప్రత్యర్థి పార్టీ మెజార్టీ 1952 డేఆర్కే నరసరాజు ప్రజాపార్టీ ఎం పల్లంరాజు కాంగ్రెస్ 14369 1953 కే పట్టాభిరామయ్య సీపీఐ ఎస్ఆర్కే నరసరాజు ప్రజాపార్టీ 13212 1955 ఎస్ఆర్కే రాజబహుద్దుర్ ప్రజాపార్టీ పీ వెంకట్రావు సీపీఐ 15129 1962 ఎన్ సత్యనారాయణరావు స్వతంత్ర కే కమలాదేవి కాంగ్రెస్ 3380 1967 నున్నవీర్రాజు స్వతంత్ర ఎన్ సత్యనారాయణరావు కాంగ్రెస్ 2185 1970 మల్లిపూడి రామసంజీవరావు కాంగ్రెస్ ఏకగ్రీవం 1972 డి.సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ పిల్లా జానకిరామయ్య స్వతంత్ర 4602 1978 పిల్లి అప్పారావు స్వతంత్ర ఎంవీ స్వామినాయుడు జనతాపార్టీ 251 1983 ఎస్ఆర్కే రామచంద్రరాజు టీడీపీ యూసత్యనారాయణమూర్తి కాంగ్రెస్ 14091 1985 ఎంవీవీ రామారావు టీడీపీ పిల్లి సుభాష్చంద్రబోస్ కాంగ్రెస్ 14142 1989 పిల్లి సుభాష్చంద్రబోస్ కాంగ్రెస్ కుడిపూడి సూర్యనారాయణ టీడీపీ 18162 1994 తోట త్రిమూర్తులు స్వతంత్ర గుత్తుల సూర్యనారాయణబాబు టీడీపీ 3104 1999 తోట త్రిమూర్తులు టీడీపీ పిల్లి సుభాష్చంద్రబోస్ కాంగ్రెస్ 19,175 2004 పిల్లి సుభాష్చంద్రబోస్ స్వతంత్ర తోట త్రిమూర్తులు టీడీపీ 7456 2009 పిల్లి సుభాష్చంద్రబోస్ కాంగ్రెస్ తోట త్రిమూర్తులు పీఆర్పీ 3975 2012 తోట త్రిమూర్తులు కాంగ్రెస్ పిల్లిసుభాష్చంద్రబోస్ వైసీపీ 11919 2014 తోట త్రిమూర్తులు టీడీపీ పిల్లి సుభాష్చంద్రబోస్ వైసీపీ 16933 2019 చెల్లుబోయిన వేణు వైసీపీ తోట త్రిమూర్తులు టీడీపీ 5168 20 ఏళ్లకు ఓసారి ఇండిపెండెంట్కే అవకాశం ఈసారి ఆనవాయితీ లేనట్టే.. రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం తీరిదీ.. -
ఈ గుర్తింపు కార్డులతో ఓటుకు అనుమతి : కలెక్టర్
కాకినాడ సిటీ: ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్) లేని ఓటర్లు 12 రకాల ఇతర గుర్తింపు కార్డులు చూపించి, ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ శనివారం తెలిపారు. ఎపిక్ కార్డు లేకపోతే ఆధార్, ఉపాధి హామీ జాబ్ కార్డు, బ్యాంకులు లేదా పోస్టు ఆఫీసులు జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్ పుస్తకం, కార్మిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, నేషనల్ పాప్యులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) ద్వారా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (ఆర్జీఐ) జారీ చేసిన స్మార్ట్ కార్డు, ఇండియన్ పాస్పోర్టు, ఫొటోతో ఉన్న పింఛన్ గుర్తింపు పత్రం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు, సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన దివ్యాంగ గుర్తింపు కార్డులతో ఓటు హక్కు వినియోగించుకోవచ్చని వివరించారు. ఎపిక్లో స్పెల్లింగ్ తప్పులున్నా ఆ ఓటరు నిజమైన ఓటరేనని నిర్ధారించుకున్న తర్వాత ఓటు వేయడానికి అనుమతిస్తారన్నారు. పోలింగ్ కేంద్రంలోని ఓటరు జాబితాలో ఓటు కలిగి మరో అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారి జారీ చేసిన ఎపిక్ ద్వారా కూడా ఓటు వేయడానికి అనుమతిస్తారన్నారు. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటో తప్పుగా ఉంటే మాత్రం ఇతర 12 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు వేయవచ్చని తెలిపారు. -
ఫ ఎన్నికల ప్రచారంలో సింహభాగం సోషల్ మీడియాదేఫ ప్రత్యేకంగా ఉద్యోగుల నియామకంఫ ఎన్నికల కమిషన్కు సైతం సోషల్ మీడియా సహకారం
సాక్షి, అమలాపురం/కాకినాడ సిటీ: కాలం మారుతున్నట్టుగానే ఎన్నికల ప్రచారం, పోలింగ్ నిర్వహణ వంటి వాటిలో కూడా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆధునితక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం అధికమవుతోంది. ఈసారి సార్వత్రిక ఎన్నికల వేళ బహిరంగంగా జరిగిన సభలు, సమావేశాలు, ర్యాలీలతో పాటు.. సామాజిక మాధ్యమాలు సైతం అభ్యర్థుల ప్రచారంలో కీలక పాత్ర పోషించాయి. ఒకప్పుడు ఇంటర్నెట్ వినియోగం అంతంత మాత్రంగానే ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. పల్లెపల్లెనా దాదాపు అందరి చేతుల్లోనూ ఇంటర్నెట్ సౌకర్యంతో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు ఈసారి వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా కూడా విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారం ఒకవైపు.. ప్రచార రథాల మీద ర్యాలీలు మరోవైపు చేస్తూనే.. సోషల్ మీడియాలో ప్రచారానికి ప్రత్యేకంగా ఉద్యోగులను, బృందాలను నియమించుకున్నారు. సూటిగా.. సుత్తి లేకుండా.. ఫ ముఖ్యంగా వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్ట్రాగాం, యూట్యూబ్ ద్వారా ప్రచారాలు జోరుగా సాగించారు. ఆయా సామాజిక మాధ్యమాల్లో తమ పేరిట ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకుని మరీ తమ అనుచరులకు సమాచారం చేరవేయడంతో పాటు, ఆసక్తి కలిగించే రీతిలో ప్రచారాలు నిర్వహించారు. అభ్యర్థులతో పాటు, వారి ముఖ్య అనుచరులు కూడా సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా వినియోగించుకున్నారు. ఫ ఎక్స్ వంటి వాటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, విపక్ష కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వంటి వారు వినియోగిస్తూండగా.. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, వాట్సాప్ వంటి వాటిని అధికంగా ఉపయోగించుకుంటున్నారు. ఫ ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్, యూట్యూబ్లలో రీల్స్, షార్ట్స్ ప్రచారం అధికంగా సాగింది. చూసిన వారికి విషయం సూటిగా అర్థమయ్యేలా.. ఎటువంటి సాగదీత లేకుండా చిన్నచిన్న వీడియోలుగా ఈ రీల్స్, షార్ట్స్ రూపొందించారు. ఫ కొన్ని కొన్ని రీల్స్ ప్రచారంలో పాపులర్గా చొచ్చుకుపోయాయి. పార్టీల అధినేతల ప్రసంగాల బిట్లు, పంచ్ డైలాగులను పదేపదే చూసేవారు, ఆసక్తిగా చదివే వారు అధికంగా ఉంటున్నారు. దీంతో ఈ తరహా పోస్టుల తయారీకి ఇప్పుడు గిరాకీ ఏర్పడింది. ఫ ఆయా పార్టీల అనుకూల పోస్టులు, ప్రత్యర్థి వ్యతిరేక పోస్టులను షేర్ చేయడం, కొత్తకొత్త పోస్టులు తయారు చేయడానికి ఆయా పార్టీలు ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాన్నే తయారు చేసుకున్నాయి. ఫ దీనికోసం కొంత మంది అభ్యర్థులు ప్రత్యేకంగా ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ఫ మరికొంత మంది యువత, సాంకేతిక అనుభవం ఉన్న వ్యక్తులను బృందాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు. చేసిన మంచి చెప్పుకొంటూ.. అధికార వైఎస్సార్ సీపీకి ఎన్నికల్లోనే కాకుండా సోషల్ మీడియా ప్రచారంలో కూడా సామాన్యులు, పేదలే స్టార్ క్యాంపైనర్లుగా మారారు. రీల్స్లో వారిదే అగ్రస్థానం. పింఛన్ తీసుకున్న వారితో పాటు వైఎస్సార్ ఆసరా, చేయూత, చేదోడు, గృహ నిర్మాణం, రైతు భరోసా, నేతన్న నేస్తం, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం వంటి పథకాల లబ్ధిదారులే ప్రభుత్వానికి, సీఎం జగన్కు ప్రచారకర్తలుగా మారారు. సీఎం జగన్ పలు ప్రచార సభల్లో చెబుతున్నట్టుగా ‘మంచి చేస్తే గెలిపించండి’ అనే నినాదాన్ని మారుమూల ప్రాంతాలకు కూడా చేరడంలో సామాన్యుల మాధ్యమాల ప్రచారమే కారణమైంది. యువతీ యువకులు, నాడు–నేడు, అమ్మ ఒడి, యూనిఫాం, మధ్యాహ్న భోజనం, ఇంగ్లిష్ మీడియం వంటి ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి సోషల్ మీడియాలో విద్యార్థులు సైతం ప్రధాన ప్రచారకర్తలుగా మారారు. ప్రత్యర్థులపై విమర్శలకన్నా చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెప్పుకుంటూ పాజిటివ్ ప్రచారానికి వైఎస్సార్ సీపీ శ్రీకారం చుట్టింది. ఇదే సమయంలో చంద్రబాబు ఆధ్వర్యంలో విపక్ష కూటమి అధికారంలోకి వస్తే జరిగే నష్టాలను సైతం వివరించింది. 2014–19 మధ్య చంద్రబాబు హామీలు అటకెక్కిన తీరును ప్రశ్నించడం కూడా ఓటర్లను ఆలోచింపజేస్తోంది. తప్పుడు ప్రచారంతో.. వైఎస్సార్ సీపీ పాజిటివ్ ప్రచార పంథాను ఎక్కువగా అనుసరిస్తే.. మిత్రపక్షాలై టీడీపీ, బీజేపీ, జనసేనలు దీనికి భిన్నమైన పంథాను ప్రచారంలో ఎంచుకున్నారు. మేధావులు సైతం అసాధ్యమని భావిస్తున్న సూపర్ సిక్స్కు మరో నాలుగు పథకాలు కలిపిన మొత్తం పది పథకాలను ప్రకటించగా.. వాటిని జనం నమ్మే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో వాటిపై పెద్దగా ప్రచారం చేయకుండా.. సీఎం జగన్, వైఎస్సార్ సీపీ అభ్యర్థులపై తప్పుడు ప్రచారానికే సోషల్ మీడియాను అధికంగా వాడుకుంటున్నారు. వీరి ప్రచారంలో బుల్లితెర నటీనటులతో పాటు పెయిడ్ ఆరిస్టుల ప్రభావం అధికంగా ఉంది. ఈ తప్పుడు ప్రచారం పలుచోట్ల తేలిపోతున్నా విపక్ష కూటమి ఇదే పంథాను అనుసరిస్తోంది.ఈసీకి సైతం సోషల్ మీడియానే.. మరోవైపు ఎన్నికల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇటు ఎన్నికల కమిషన్ (ఈసీ) సైతం సోషల్ మీడియానే ఆయుధంగా ఉపయోగిస్తూండటం విశేషం. ఎన్నికల నిఘా, ప్రజలకు ఓటు విలువపై అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటోంది. సామాన్య పౌరులను సైతం భాగస్వాములను చేస్తూ ఈసీ ఈసారి పలు రకాల యాప్లను అందుబాటులోకి తెచ్చింది. సీ–విజిల్, సువిధ, అబ్జర్వర్, సాక్ష్యం, కేవైసీ, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్, ఓటర్ హెల్ప్లైన్ యాప్లను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఎన్నికలకు సంబంధించిన సమాచారం, కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదులతో పాటు, ఎన్నికల నియమావళి, ఓటర్లకు అవసరమైన సాయం, ఎన్నికల ఖర్చు, పోలింగ్ బూత్ల సమాచారం వంటివి తెలుసుకునేందుకు ఉపయోపడేలా ఈ యాప్లను రూపొందించారు. -
పవన్ ఓటు సైకిల్కే..
ఫ తన ఓటు తనకు వేసుకునే అవకాశం లేని జనసేనాధినేత ఫ ఓటు ఉన్న చోట టీడీపీ పోటీ పిఠాపురం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ఓటు తనకు వేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ఓటు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉంది. అక్కడ టీడీపీ నేత నారా లోకేష్ పోటీలో ఉన్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఓటు ఎక్కడ ఉన్నా అభ్యర్థిగా ఎక్కడైనా పోటీ చేయవచ్చు. దీని ప్రకారమే పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తమ ఓటు తమకే వేసుకునే అవకాశం ఉండగా.. పవన్ ఒక్కరికే ఆ భాగ్యం దక్కలేదు. రాష్ట్రంలో ఎక్కడ ఓటు ఉన్నా తాము పోటీ చేసే నియోజకవర్గాలకు ఓటును ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అభ్యర్థులకు ఉంది. కానీ చివరి నిమిషం వరకూ తాను ఎక్కడ పోటీ చేయాలో తెలియని అయోమయంలో ఉన్న పవన్ తన ఓటును మార్పు చేసుకోలేదని ఆ పార్టీ నేతలే అంటున్నారు. తాను ఇక పిఠాపురంలోనే ఉంటానని, పిఠాపురం తన శాశ్వత నివాసమని ఆయన చెబుతున్నప్పటికీ కనీసం ఓటునే మార్చుకోలేని వ్యక్తి ఇక్కడ తన నివాసాన్ని ఎలా మార్చుకుంటారని, అందుకే ఆయన లోకల్ కాదని ప్రచారం జరుగుతోంది. ఒక పార్టీ అధినేత తన ఓటు తనకే వేసుకునే పరిస్థితి లేకపోవడంపై ఆ పార్టీ నేతలే విచిత్రంగా చెప్పుకుంటున్నారు. -
కొత్తపేటలో ఒకే ఒక్క మహిళా ఎమ్మెల్యే భానుతిలకం
కొత్తపేట: నియోజకవర్గ చరిత్రలో శాసనసభకు ఎన్నికైన ఒకే ఒక్క మహిళ దెందులూరి భానుతిలకం. గృహిణిగా ఉన్న ఆమె అనూహ్యంగా రాజకీయరంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఎమ్మెల్యేగా వరుస విజయాలతో హ్యాట్రిక్ సాధించి, రాజకీయ అపరచాణుక్యుడిగా గుర్తింపు పొందిన మంతెన వెంకట సూర్య సుబ్బరాజు(ఎంవీఎస్ సుబ్బరాజు)పై విజయం సాధించిన ఘనత ఆమెకే దక్కింది. వరుస విజయాలతో తిరుగులేని నాయకుడిగా, కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సుబ్బరాజును నియోజకవర్గ ప్రజలు ఓడించి అప్పుడే రాజకీయాల్లోకి వచ్చిన భానుతిలకానికి పట్టం కట్టారు. అప్పట్లో ఆమె విజయం సంచలనం సృష్టించింది. కొత్తపేట నియోజకవర్గం ఏర్పడిన తరువాత 1955లో జరిగిన తొలి ఎన్నికల్లో అంతకు ముందు ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో మంత్రిగా, ఏఐసీసీ కార్యదర్శిగా, జాతీయ స్థాయి నాయకునిగా ఉన్న కళా వెంకటరావు విజయం సాధించారు. ఆయన రాష్ట్ర కేబినెట్లో ఆర్థిక, తదితర శాఖల మంత్రిగా పదవి చేపట్టారు. 1959లో కళా వెంకట్రావు హఠాన్మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో కళా శిష్యుడిగా ఎంవీఎస్ సుబ్బరాజు గెలుపొందారు. అక్కడి నుంచి వరుసగా 1962, 1967 ఎన్నికల్లో కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. అలాంటి నాయకుడిని 1972లో భానుతిలకం కంగు తినిపించారు. అప్పటికే వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తూ వచ్చిన సుబ్బరాజుపై సహజంగానే వ్యతిరేకత వచ్చింది. కొత్తగా రాజకీయ రంగంలో అడుగుపెట్టి, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మహిళ కావడంతో పాటు సుబ్బరాజు వ్యతిరేక వర్గం నాయకులు భానుతిలకానికి మద్దతు పలికారు. ముఖ్యంగా అప్పట్లో యువ రాజకీయ నాయకునిగా ప్రజల్లో పేరు పొందిన డాక్టర్ చిర్ల సోమసుందరరెడ్డి కూడా భానుతిలకం పక్షాన నిలవడంతో ఆమె విజయం సాధించారు. భర్త సర్పంచ్.. భార్య ఎమ్మెల్యే.. భానుతిలకం.. కొత్తపేట గ్రామ పంచాయతీకి 1953–64 మధ్య 11 సంవత్సరాల పాటు సర్పంచ్గా పని చేసిన దెందులూరి వీరభద్రం భార్య. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న పీవీ నరసింహారావు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావించారు. దీంతో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన భానుతిలకం మహిళా కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేశారు. పీవీ సిఫారసు మేరకు ఆ ఎన్నికల్లో భానుతిలకంతో పాటు జిల్లాలో పలువురు మహిళలకు టికెట్లు కేటాయించారు. వరుస విజయాలు సాధించిన ఎంవీఎస్ సుబ్బరాజు తనకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో విజయం భానుతిలకాన్నే వరించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో మరో మహిళ ఎమ్మెల్యే కాలేదు. అంతే కాదు ప్రధాన పార్టీలు మహిళకు టికెట్ కూడా కేటాయించలేదు. 69 ఏళ్ల నియోజకవర్గ చరిత్రలో భానుతిలకం ఒక్కరే అసెంబ్లీకి వెళ్లిన ఏకైక మహిళా ఎమ్మెల్యేగా నిలిచారు. రాజకీయ అపరచాణుక్యుడు సుబ్బరాజుపై ఘన విజయం పీవీ నిర్ణయంతో వరించిన కాంగ్రెస్ టికెట్టు -
నోట్లు పంచుతూ దొరికిన టీడీపీ నాయకుడు
కడియం: రాజమహేంద్రవరం రూరల్టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఓట్లు వేయాలని కోరుతూ కడియపుసావరం గ్రామంలో ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకుడు కె.నాగేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.64 వేలు స్వాధీనం చేసుకున్నారు. అతను నగదు పంపిణీ చేస్తున్నాడని 100కు గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. నిందితుడిని పట్టుకుని కడియం పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం విక్రయాల బంద్ రాజమహేంద్రవరం రూరల్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి మద్యం విక్రయాలను బంద్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని 137 ప్రభుత్వ మద్యం షాపులు, 26 బార్లకు జిల్లా మద్యనిషేధ, అబ్కారీ అధికారి వై.శ్రీలత నేతృత్వంలో అధికారులు సీల్ వేశారు. సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మద్యం షాపులు, బార్లను తెరుస్తారు. అప్పనపల్లి.. భక్తులతో శోభిల్లి మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామి ఆలయం శనివారం భక్తజన సందోహంలా మారింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉదయమే పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా కొలువు దీరిన శ్రీబాల బాలాజీ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు సమర్పించుకున్నారు. భక్తుల రాకతో పాత గుడితో పాటు కొత్త గుడి కోలాహలంగా మారింది. స్వామివారి ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.2.76 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి గ్రంధి మాధవి తెలిపారు. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2.17 లక్షలు, నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.58,583 విరాళాలుగా అందించారని చెప్పారు. 3,097 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, 2,415 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. స్వామివారి సన్నిధిలో శ్రీలక్ష్మీనారాయణ హోమాన్ని అర్చకులు ఘనంగా జరిపించారు. -
మైకు మూగబోయింది
సాక్షి, అమలాపురం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. నెల రోజుల పాటు హోరెత్తించిన మైక్లు మూగబోయాయి. పోలింగ్కు 48 గంటల ముందు నుంచి ఎటువంటి ప్రచారం చేయకూడదనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ముగించారు. ఈ సారి ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు సైతం ప్రచారాన్ని జోరుగా నిర్వహించడం విశేషం. జిల్లాలో ఒక పార్లమెంట్, ఏడు అసెంబ్లీ స్థానాలకు సోమవారం ఎన్నికల జరగనున్న విషయం తెలిసిందే. ప్రధాన అభ్యర్థుల మధ్యే పోటీ ఉండనుంది. అమలాపురం పార్లమెంట్తో పాటు మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రపురం, అమలాపురం స్థానాల్లో వైఎస్సార్ సీపీ, టీడీపీల మధ్య, పి.గన్నవరం, రాజోలు అసెంబ్లీ స్థానాలలో వైఎస్సార్ సీపీ, జనసేనల మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ప్రధాన పార్టీల ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. సాయశక్తులు ప్రదర్శించారు. ప్రచారంలో అధికార పార్టీ వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ పార్టీకి ఒకేసారి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం కలిసి వచ్చిన అంశమని చెప్పాలి. అప్పటి నుంచి అభ్యర్థులు జనం మధ్యనే ఉన్నారు. పోటీలో ఉన్న ఎమ్మెల్యేలు గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో రెండేళ్లుగా జనంలోనే ఉంటున్నారు. ఇవన్నీ వారి ప్రచారానికి కలసి వచ్చే అంశాలు. ఇంటింటా ప్రచారాలు, భారీ ర్యాలీలు నిర్వహించారు. ఆటోలు, మోటారు సైకిళ్లకు మైక్లు పెట్టి ప్రచారం హోరెత్తించారు. వినూత్నంగా ఎల్సీడీలో వీడియోలతో సైతం ప్రచారం చేశారు. అధికార పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. కొత్తపేట నియోజకవర్గ పరిధిలో బస్సు యాత్ర నిర్వహించగా, పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో ఎన్నికల సభలో ప్రసంగించారు. ఈ రెండుసార్లు జరిగిన సభలు జన ప్రభంజనాన్ని తలపించింది. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారానికి సీఎం పర్యటన మరింత జోష్ తెచ్చింది. వైఎస్సార్ సీపీతో పోల్చుకుంటే టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రచారం పేలవంగా సాగింది. పి.గన్నవరం, అమలాపురం, రాజోలు, రామచంద్రపురం అసెంబ్లీ స్థానాలకు, అమలాపురం పార్లమెంట్ స్థానానికి కూటమి అభ్యర్థుల ప్రకటన ఆలస్యమైంది. పైగా అభ్యర్థుల ఎంపిక రెండు పార్టీల్లో అసంతృప్తులకు దారితీసింది. పి.గన్నవరంలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించి తరువాత జనసేనకు ఇచ్చింది. ఇక్కడ జనసేన నేతలు విధ్వంసానికి సైతం పాల్పడ్డారు. అలాగే రామచంద్రపురం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రకటన సైతం ఆ పార్టీలో వివాదానికి కారణమైంది. ఈ తలనొప్పుల కారణంగా ప్రచారంలో వారు వెనుకబడిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత రావులపాలెంలో విడిగా, పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట, అమలాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పవన్కల్యాణ్, చంద్రబాబులు రామచంద్రపురం, మండపేటల్లో ప్రచారం చేశారు. అధినేతలు పర్యటించినా ఆ పార్టీకి పెద్దగా కలసి రాలేదనే చెప్పాలి. -
వీరేశ్వరా... సర్వేశ్వరా..
ఐ.పోలవరం: నిత్య కల్యాణం.. పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గ్రామంలోని మహిళలు ఆలయ ఆవరణలో పసుపు కొమ్ములను దంచి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. శైవాగమ పద్ధతిలో రాష్ట్ర ఆదిశైవ అర్చక సంఘ అధ్యక్షుడు యనమండ్ర సత్యసీతారామ శర్మ ఆధ్వర్యంలో ఆలయ అర్చకస్వాములు, అధికారుల పర్యవేక్షణలో ఐదు రోజుల క్రతువుకు శ్రీకారం చుట్టారు. ఆలయంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవచనం, స్వామి వారికి పంచామృత అభిషేకం చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లను వధూవరులను సంప్రదాయ పద్ధతిలో చేశారు. బ్రహ్మోత్సవ కల్యాణ మూర్తులకు జంపన రామకృష్ణంరాజు, ప్రసన్న రాణి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో అగ్ని ప్రతిష్ఠాపన చేశారు. స్వామి, అమ్మవార్లను భద్రపీఠంపై ఉంచి గ్రామోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. నిత్యం జరిగే స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో చలువ పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణ, యాగశాల తదితర ఏర్పాట్లు చేశారు. నిత్యం కల్యాణ కాంతులతో వెలిగే ఆలయానికి బ్రహ్మోత్సవ శోభ తోడవడంతో మరింత ఆధ్యాత్మిక శోభ వచ్చింది. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లను ఆలయ ఈఓ మాచిరాజు లక్ష్మీనారాయణ పర్యవేక్షిస్తున్నారు. ఫ మురమళ్ల ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం ఫ ఐదు రోజులు.. ఆధ్యాత్మిక సంబరాలు -
తూ.గో.లో వ్యాన్ బోల్తా.. కోట్లలో పట్టుబడిన డబ్బు
సాక్షి తూర్పుగోదావరి జిల్లా: ఓ రోడ్డు ప్రమాదంతో అక్రమంగా తరలిస్తున్న డబ్బులు పట్టుబడ్డాయి. ఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలో భారీగా తరలిస్తున్న నగదు గుట్టు బయటపడింది. వివరాలు.. నల్లజర్ల మండలం అనంతపల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. తౌడులో కలిపే కెమికల్ బస్తాలతో వెళ్తోన్న వ్యాన్ను వెనకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ బోల్తా పడగా, క్లీనర్, డ్రైవర్కు గాయాలయ్యయి. వారిని ఆసుపత్రికి చేర్చి చికిత్స అందిస్తున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ క్రమంలో వ్యాన్ అడుగు భాగంలో 7 అనుమానాస్పద బాక్స్లను పోలీసులు గుర్తించారు. ఉన్నతాధికారుల సమక్షంలో బాక్స్లను అనంతపల్లి టోల్ ప్లాజా వద్ద తెరిచి చూడగా భారీగా నగదు బయటపడింది.Cinematic: Accident leads to Rs 7 crore cash seizure packed in 7 cardboard boxes loaded in Tata Ace vehicle going from Vijayawada towards Vizag, that overturned after hitting a truck & one box fell out revealing currency hidden packed in between sacks #AndhraPradesh #EastGodavari pic.twitter.com/OXoy0oaRJI— Uma Sudhir (@umasudhir) May 11, 2024 బాక్స్లోని డబ్బులను అధికారులు,ఎలక్షన్ ఫ్లైయింగ్ స్వ్కాడ్ లెక్కిస్తోంది. నగదు మొత్తం రూ. 7 కోట్ల వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. వీటిని రాజమండ్రి నుంచి విజయవాడకు తరలిస్తున్నట్టుగా సమాచారం.ఆ సొమ్ము ఎవరిదై ఉంటుందన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఎన్నికలకు రెండు రోజుల ముందు భారీ గా నగదు లభ్యం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. -
‘కోట’.. ప్రగతి బాట
మున్సిపాలిటీ విశేషాలు ఆవిర్భావం 1956 అక్టోబర్ 1 సామర్లకోట: కాకినాడ జిల్లాలో ప్రధాన పట్టణంగా, ముఖ్య రైల్వే జంక్షన్గా, పరిశ్రమలకు నెలవుగా పేరొందిన సామర్లకోట ప్రగతి దిశగా పరుగులు తీస్తోంది. ప్రజలకు కనీస అవసరాలైన ఇళ్లు, రోడ్లు, డ్రెయిన్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన.. ఇదీ వైఎస్సార్ సీపీ ఐదేళ్ల పాలనలో గొప్ప మార్పు. నాడు.. నేడు.. తేడా ఇదీ.. ఫ మున్సిపాలిటీ పరిధిలో నాడు–నేడు పథకం కింద రూ.11.07 కోట్లతో అభివృద్ధి, ఎనిమిదో తరగతి విద్యార్థులు 980 మందికి రెండు విడతల్లో ట్యాబ్లు పంపిణి చేశారు. ఫ రూ.2 కోట్లతో మున్సిపల్ సీహెచ్సీని 30 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. 108, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో 15 సచివాలయాల్లో 130 మందికి ఉద్యోగాలు లభించాయి. ఫ వలంటీరు వ్యవస్థతో 10వ తరగతి చదువుకున్న 272 మందికి కూడా స్థానికంగానే ఉపాధి లభించింది. ఇవిగో ప్రగతి కాంతులు ఫ అమృతధార నిధులు రూ.1.10 కోట్లతో కోట్లమ్మ చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రూ.26 కోట్లతో తాగునీటి సరఫరా అభివృద్ధి. వీటితో పాటు 14, 15 ఆర్థిక సంఘం నిధులతో రహదారులు, డ్రైన్లు, కల్వర్టుల నిర్మాణం. 2,444 మందికి ఇళ్ల స్థలాలు మున్సిపల్ పరిధిలో 55 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన జగనన్న లే అవుట్లో 2,444 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. కిర్లంపూడి రోడ్డుకు ఇరువైపులా జగనన్న లే అవుట్లో 11 పార్కులు ఏర్పాటు చేశారు. సుందరంగా నిర్మించిన జగనన్న కాలనీ విస్తీర్ణం : 14.88 చ.కిమీ. వార్డులు : 31 ఫ స్కూళ్లు, ఆసుపత్రులకు కొత్త రూపు ఫ రూ.కోట్లతో రోడ్ల నిర్మాణం ఫ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీటజనాభా : 56,865ఇతరులు 1 సీ్త్రలు 28,749 పురుషులు 28,115 ఓటర్లు : 43,606ఇతరులు 2 సీ్త్రలు 22,506 పురుషులు 21,098 -
ప్రగతిలో పెద్దాపురం
పెద్దాపురం: చెత్త దారులు.. మురుగు గుంతలు.. నీరు రాల్చని పైపులైన్లు.. ఆహ్లాదం పంచని పార్కులు.. శిథిలావస్థలో బడులు.. పేదలకు గూడు లేక అవస్థలు.. గత టీడీపీ పాలనలో పెద్దాపురం పట్టణంలో పరిస్థితి ఇది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకెళ్లారు. పట్టణాన్ని ప్రగతి పథాన తీసుకెళ్లారు.. పేరులో ఉన్నట్టే ప్రగతిలో ‘పెద్దా’పురం అనేట్టు తీర్చిదిద్దారు. పెద్దాపురం మున్సిపాలిటీలో గత ఐదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూసొద్దాం రండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండో మున్సిపాలిటీ పెద్దాపురం. ఇక్కడ 50 పడకల ఏరియా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్తో పాటు ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నారు. ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ కళాశాలలతో పాటు 24 మున్సిపల్ పాఠశాలలు, 26 ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు ఆసరాగా మారాయి. ఐదేళ్ల కిందట వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పట్టణ ప్రగతికి ఊహించని విధంగా బాటలు వేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నాడు–నేడు’ కార్యక్రమంలో భాగంగా రూ.4.50 కోట్లతో మున్సిపల్ పాఠశాలల అభివృద్ధి పనులు జరిగాయి. అన్నింటా అగ్రాసనం ఫ పెద్దాపురంలోని వాలుతిమ్మాపురం రోడ్డులో టిడ్కో ఇళ్ల నిర్మాణానికి రూ.221 కోట్లు కేటాయించి సకల సౌకర్యాలు కల్పించింది. సుమారు రూ.20 కోట్లతో వాటి వద్ద రోడ్లు, డ్రైన్లు నిర్మించింది. ఫ పేదలందరికీ ఇళ్లు పథకంలో స్థానిక సూరంపాలెం రోడ్డులో 2,550 మందికి ఇళ్లు కేటాయించింది. వాటి వద్ద రూ.2 కోట్లతో మౌలిక వసతులు కల్పించారు. ఫ స్థానిక పాత ఆసుపత్రి, బంగారమ్మ గుడి వీధుల్లో రూ.2 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్లను నిర్మించారు. ఫ పట్టణంలో 14, 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.6.30 కోట్లతో తాగునీటి పైపులైన్లు, డ్రైన్లు, సీసీ రోడ్లు నిర్మించారు. రహదారుల అభివృద్ధికి మరో రూ.4.05 కోట్లతో పనులు సాగుతున్నాయి. పెద్దాపురంలో సుందరంగా టిడ్కో గృహ సముదాయంపెద్దాపురం మున్సిపాలిటీ ఆవిర్భావం: 1915 ఫ మున్సిపాలిటీలో అభివృద్ధి బావుటా ఫ వైఎస్సార్ సీపీ పాలనలో సమస్యలన్నీ పరిష్కారం ఫ తాగునీటి సరఫరా, పారిశుధ్య పనుల్లో భేష్ ఫ ‘నాడు– నేడు’తో పాఠశాలలకు మహర్దశ విస్తీర్ణం : 41.13 చ.కిమీ. వార్డులు : 29జనాభా : 49,579 మొత్తం ఓటర్లు : 60,051పురుషులు : 30,130 సీ్త్రలు : 29,919 ఇతరులు : 2 గృహాలు : 11,500 -
మున్సిపాలిటీలో అభివృద్ధి మంత్రం
రామచంద్రపురం: అర్బన్ పరిధిలో అభివృద్ధి మంత్రంతో పాటుగా సంక్షేమానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమాన్ని అందించడంతో పాటుగా పట్టణంలోని పలు సమస్యల పరిష్కారం దిశగా రామచంద్రపురం మున్సిపాలిటీ అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగింది. గతానికి భిన్నంగా పట్టణంలోని పలు సమస్యలకు పరిష్కార చర్యలను తీసుకుంది. గుడ్ మార్నింగ్ కార్యక్రమం, గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల ద్వారా గుర్తించి, ప్రజల నుంచి వచ్చిన విన్నపాలను మన్నిస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లను నిర్మించారు. ఏప్రిల్–2022 నుంచి మార్చి 2023 వరకు రూ.75కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు పూర్తి చేశారు. ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం పట్టణంలోని తోటవారి వీధిలోని రాజుమాస్టారు వీధి ఎంతో కాలంగా అభివృద్దికి నోచుకోలేదు. కనీస రోడ్డు లేక అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండేవారు. ఇదే ప్రాంతంలో డ్రైనేజీ లేకపోవటంతో మురుగునీరు రహదారిలోకి వచ్చి బురదగా ఉండేది. మార్కెట్లోని చిన్న వీధి గత 18 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవటంతో వర్షాకాలంలో రోడ్డంతా నీటితోనే నిండిపోయేది. ఇలా 28 వార్డుల్లోను ఏళ్లునాటి సమస్యలను మోక్షం ఏర్పడింది. రాజుమాస్టారు వీధిని సీసీ రోడ్డు, సీసీ డ్రైన్లను నిర్మించి సమస్యను పరిష్కరించారు. మార్కెట్లోని చిన్న వీధిని కూడా సీసీ రోడ్డు వేసి అక్కడి ప్రజల సమస్యను పరిష్కరించగలిగారు. అభివృద్ధితో సమూల ప్రక్షాళన కౌన్సిల్ పాలక వర్గం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే సుమారుగా రూ.50 కోట్లతో అభివృద్ది పనులు పూర్తి చేశారు. రెండో ఏడాదిలో రూ.75 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేశారు. ఇప్పటివరకు అన్ని నిధులు కలిసి రూ.75.71 కోట్ల నిధులు ఖర్చు చేశారు. మూడో ఏడాదికి సంబంధించి వివిధ పథకాల నిధులతో పాటుగా ప్రత్యేక నిధులు రూ.40 కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారు చేశారు. రూ.1.25 కోట్లతో రైతు బజారు నిర్మాణాన్ని పూర్తి చేశారు. రూ.10 కోట్లతో ఏరియా ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు. మున్సిపాలిటీ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దారు. రూ.6.45 కోట్లతో పాఠశాల విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు అభివృద్ధి చేశారు. ఆరు కిలోమీటర్ల పొడవున్న ప్రధాన డ్రైన్లను రూ.23 లక్షలతో పూడిక తీసి ఎంతో కాలంగా ఉన్న సమస్యను సమూల ప్రక్షాళన చేశారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా నిర్మించి వదిలేసిన టిడ్కో గృహాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించి అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మొదటి విడతలో 998 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఏళ్ల నాటి సమస్యలకు మోక్షం 1,14,449 మంది సంక్షేమ పథక లబ్ధిదారులు రూ.121.8 కోట్ల పంపిణీ -
అభివృద్ధిలో అందనంత ఎత్తుకు..
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఇడియట్ సినిమాలో ‘చంటిగాడు లోకల్’ అనే డైలాగ్ ఓ రేంజ్లో పాపులరైంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి చూపూ పిఠాపురం పైనే ఉందన్న విషయం తెలిసిందే. అక్కడి నుంచి వైఎస్సార్ సీపీ తరఫున కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీత, జనసేన నుంచి స్వయానా ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తలపడుతూండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలోనే స్థానికురాలైన వంగా గీతను ఉద్దేశించి పిఠాపురం ప్రజలు ప్రస్తుతం ‘పక్కా లోకల్’ సినిమా డైలాగ్ తెగ వాడేస్తూండటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అభ్యర్థుల ఛరిష్మాను బట్టి లోకల్, నాన్ లోకల్ అనే అంశాన్ని పెద్ద ప్రాధాన్యంగా తీసుకోరు. కానీ ఈసారి పిఠాపురంలో లోకల్, నాన్ లోకల్ అనే అంశమే స్థానికుల్లో అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. అభివృద్ధి చేస్తారని.. మహిళా ప్రజాప్రతినిధిగా రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరున్న గీత కాకినాడ జిల్లా వాసి. దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అన్ని స్థాయిల పదవులూ అలంకరించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్గా, రాజ్యసభ సభ్యురాలిగా, పిఠాపురం ఎమ్మెల్యేగా, కాకినాడ లోక్సభ సభ్యురాలిగా, పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ఆమె జిల్లాకు తీసుకుని రాగలిగారు. ఓటమి ఎరుగని ప్రజాప్రతినిధిగా రాజకీయ యవనికపై నిలిచారు. ఎంపీగా కేంద్రంతో పోరాడి అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు సాధించడంలో ఆమె దిట్ట అని కాకినాడ పరిసర ప్రాంతాల్లో కళ్ల ముందు నిలుస్తున్న పలు అభివృద్ధి పనులే సాక్షిగా నిలుస్తున్నాయి. ప్రస్తుత ఎంపీగా కాకినాడలో రూ.110 కోట్లతో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఆమె సాధించారు. దేశంలోనే మూడోదైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ను కాకినాడలో ఏర్పాటు చేయించారు. ప్రసాద్ స్కీములో అన్నవరం దేవస్థానం అభివృద్ధికి నిధులు సాధించారు. జాతీయ రహదారులను అనుసంధానించే భారత్మాల ప్రాజెక్టు వంటి వాటిలో ఇక్కడి రహదారులను చేర్చేలా కేంద్రంతో గీత పోరాడి సాధించారు. అందుబాటులో ఉంటారని.. అటువంటి వంగా గీత ఈ ఎన్నికల్లో మరోసారి పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆమె పుట్టినిల్లు కాకినాడ. మెట్టినిల్లు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం పెనుమల్ల. ఈ రెండు ప్రాంతాలూ ఒకప్పటి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనివే. గీతా విశ్వనాథ్ న్యాయవాద వృత్తి చేపట్టాక, రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కాకినాడ కేంద్రంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా ‘గీతమ్మా’ అని సొంతింట్లో మనిషిగా పిలుచుకునే చనువు ఈ ప్రాంత ప్రజలకు ఉంది. ఆవిధంగా ఆమె దాదాపు 35 ఏళ్లుగా ఇక్కడి వారికి సుపరిచితురాలే. పిలిస్తే పలికే నాయకురాలు. ఫోన్ చేస్తే స్పందించే మనస్తత్వం గీత సొంతం. ఆమె గతంలో ఒక పర్యాయం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల్లో భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండుచోట్లా ఘోరంగా ఓడిపోయారు. ఆ చేదు అనుభవాల నేపథ్యంలో ఆయన ఈసారి పిఠాపురం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మిగిలిన వారి మాటేమో కానీ ఈ ఎన్నికలు పవన్కు చావోరేవో అన్నట్టుగా మారాయి. అయినప్పటికీ ఆయన ఇక్కడ స్వయంగా పెద్దగా ప్రచారం చేయడం లేదు. తన తరఫున చోటామోటా నటులతోనే ప్రచారాన్ని సరిపెడుతున్నారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి పోలింగ్కు మరో మూడు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉన్న నేటి వరకూ నియోజకవర్గంలో ముచ్చటగా మూడు రోజులు కూడా ప్రచారం చేసే తీరిక, ఓపిక ఆయనకు లేకపోయాయి. అటువంటి పవన్ను ఎన్నికల అనంతరం కలవడం సాధ్యం కాదనే అభిప్రాయం స్థానికుల్లో బలపడింది. ఆయనను కలవడానికి హైదరాబాద్, విజయవాడ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందేమేననే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. రూ.110 కోట్లతో కాకినాడలో నిర్మించిన 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిసర్వేల్లో ‘గీతమ్మ’కే మొగ్గుగీత, పవన్లలో ఎవరిని ఎంపిక చేసుకుంటారని వివిధ సర్వే బృందాలు, మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే.. ‘ఫోన్ చేస్తే పలికే గీతమ్మ వైపే ఉంటాం’ అని పిఠాపురం వాసులు ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. సినీ గ్లామర్తో పవన్ నెట్టుకొచ్చేయాలనుకుంటే ఇక్కడ సాగదని స్పష్టంగా చెబుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటే ఇక్కడి ప్రజలు నెత్తిన పెట్టుకుంటారు. ఆ నమ్మకంతోనే సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును రెండుసార్లు, దివంగత అటవీ శాఖా మాజీ మంత్రి కొప్పన మోహనరావును రెండుసార్లు, మాజీ ఎమ్మెల్యే వెన్నా నాగేశ్వరరావును మూడుసార్లు ఎమ్మెల్యేల్ని చేశారు. అటువంటిది నోటిఫికేషన్ నుంచి ఇప్పటి వరకూ పవన్ నామ్కే వాస్తేగా ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారని, ఆయన తమకు అందుబాటులో ఉంటారనే నమ్మకం కలగడం లేదని ఇక్కడి ప్రజలు అంటున్నారు. జిల్లాకు వచ్చే సందర్భాల్లో గొల్లప్రోలు మండలం చేబ్రోలులో తీసుకున్న ఇంట్లో రాత్రి బస చేయడం ద్వారా అందరికీ అందుబాటులో ఉంటానని, రోజుకు 200 సెల్ఫీలు దిగుతానని చెప్పడం ద్వారా స్థానికుల్లో నమ్మకం కలిగించేందుకు పవన్ మొదట్లో ప్రయత్నించారు. తీరా ఎన్నికలు చివరి అంకానికి చేరుకున్న తరుణంలో పార్టీలో చేరిన వారితో తప్ప ఒక్కరితో ఒక్క సెల్ఫీ అయినా దిగారా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పవన్ స్థానికంగా అందుబాటులో ఉంటారంటే ఎలా నమ్ముతామని వారు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ అందరినీ పేరు పెట్టి పిలవగలిగే పరిచయాలు ఉండటంతో పాటు, అందరికీ అందుబాటులో ఉంటున్న మహిళా నేత వంగా గీత రియల్ హీరోగా ఇక్కడి నుంచి బరిలో నిలిస్తే.. ఆమైపె స్థానికంగా అందుబాటులో ఉంటారనే నమ్మకం లేని రీల్ హీరో పవన్ కల్యాణ్ తలపడుతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ సెగ్మెంట్పై అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది. గతంలో ఇదే పిఠాపురానికి ఎమ్మెల్యేగా పని చేసినప్పుడు ప్రజల సమస్యలపై ఎంతో సానుకూల దృక్పథంతో పని చేయడంతో గీత అభ్యర్థిత్వంపై స్థానికుల్లో సానుకూల దృక్పథం స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఫ పిఠాపురం నియోజకవర్గ వాసుల మనోగతం ఫ వైఎస్సార్ సీపీ అభ్యర్థి వంగా గీత అందుబాటులో ఉంటారంటున్న స్థానికులు ఫ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తారని విశ్వాసం ఫ పవన్ అందుబాటులో ఉంటారనే నమ్మకం లేదంటున్న ప్రజలు -
హింసను ఉపేక్షించం
● ప్రచారానికి నేటితో తెర ● జిల్లాలో 144 సెక్షన్ అమలు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలత సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత విజ్ఞప్తి చేశారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థులు, వారి ప్రతినిధులతో కలెక్టరేట్లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అభ్యర్థులు స్నేహపూర్వక వాతావరణంలో, ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకారం అందించాలని కోరారు. ఆమె ఏమన్నారంటే.. ● పోలింగ్ సోమవారం జరగనున్న దృష్ట్యా ఈ మూడు రోజులూ అత్యంత కీలకం. ● ప్రచార గడువు శనివారం సాయంత్రం 6 గంటలతో ముగుస్తుంది, ఆ తరువాత ఎటువంటి ప్రచారానికి, ర్యాలీలకు అనుమతులు లేవు. ● ఎమ్మెల్యే అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3 వాహనాలకు, ఎంపీ అభ్యర్థులు తన పరిధిలో 3 వాహనాలకు, అసెంబ్లీ సెగ్మెంట్కు ఒక్కొక్కటి చొప్పున వాహనాల అనుమతులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ వాహనాల్లో అభ్యర్థి మాత్రమే తిరగాలి. ● జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. ప్రజలు గుంపులు గుంపులుగా సంచరించరాదు. ● పోలింగు కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకూ నిర్దేశించిన మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలి. ● ఓటరు స్లిప్పులు పంపిణీ సందర్భంగా ఎటువంటి ప్రచారమూ చేయరాదు. ● ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిస్తే, ఎటువంటి నోటీసులూ ఇవ్వకుండానే బైండోవర్ కేసులు నమోదు చేస్తాం. ఒకసారి ఎన్నికల బైండోవర్ కేసు నమోదు చేస్తే, ప్రతి ఎన్నికలోనూ ఆయా పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. ● ఎన్నికల ఫలితాలకు సంబంధించి రాజకీయ పార్టీలు ముందస్తుగా ఎగ్జిట్ పోల్ సర్వేలు నిర్వహించరాదు. ● జూన్ 6వ తేదీ వరకూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుంది. ● ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక పోలింగ్ ఏజెంట్, ఇద్దరు రిలీవర్లను నియమించుకోవచ్చు. పోలింగ్ ఏజెంట్లుగా స్థానికులనే అనుమతిస్తాం. వీరికి ప్రిసైడింగ్ అధికారి గుర్తింపు కార్డు ఇస్తారు. ● ఫామ్–10 చూపించిన వారిని పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. ఒకసారి ఒక్కరినే లోపలకు అనుమతిస్తారు. ● పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు. ● తగిన గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తాం. ● పోలింగ్ కేంద్రాల బయట, లోపల వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నాం. ● పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఎటువంటి రాజకీయ ప్రకటనలూ జారీ చేయకూడదు. ● రాజకీయ ప్రయోజనాల కోసం ఈ నెల 12, 13 తేదీల్లో వార్తా పత్రికల్లో ప్రచురించదలచిన ప్రకటనలకు ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి. మీడియా సంస్థలు కూడా అనుమతి లేని ప్రకటనలు ప్రచురించరాదు. ● శాటిలైట్ చానళ్లు, కేబుల్ టీవీ, రేడియో, బల్క్ మెసేజ్లు, ఈ–పేపర్లు, సామాజిక మాధ్యమాలు, సినిమా హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లోని ఎల్ఈడీ స్క్రీన్లు ఎలక్ట్రానిక్ మీడియా కిందకే వస్తాయి. వీటిలో ప్రచారాలు చేస్తే ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసులు నమోదు చేస్తాం. ● సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు కూడా పాల్గొన్నారు. -
● ప్రగతి పథంలో తుని మున్సిపాలిటీ ● గత ఐదేళ్లలో మారిన పట్టణ రూపురేఖలు ● ప్రభుత్వ పాఠశాలలు, రోడ్లు, పార్కులకు మహర్దశ
తుని: గత ఐదేళ్లలో తుని మున్సిపాలిటీ అన్నిరంగాల్లో ప్రగతిని సాధించింది. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేశారు. రోడ్లు, డ్రైన్లు, పార్కులను నిర్మించడంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మున్సిపల్ నిధులకే పరిమితం కాకుండా కేంద్ర ప్రభుత్వ నిధులను రాబట్టి పలు దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించారు. పురపాలకసంఘం వివరాలు తుని పురపాలక సంఘం 1959లో ఏర్పడింది. గ్రేడ్–2 మున్సిపాలిటీ అయిన తునిలో 30 వార్డులు ఉన్నాయి. 7.02 చదరపు కిలోమీటర్లు పరిధిలో విస్తరించి ఉంది. జనాభా 53,425 మంది కాగా వీరిలో పురుషులు 25,503, మహిళలు 27,503 మంది ఉన్నారు. ఓటర్లు 42,387 మంది ఉండగా పురుషులు 20,121 మంది, మహిళలు 22,230 మంది ఉన్నారు. తుని పట్టణంలో 150 పడకల ఏరియా ఆసుపత్రి, రెండు అర్బన్ హెల్త్ సెంటర్లు, 30 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. రెండు జూనియర్ కళాశాలలు, 25 మున్సిపల్ పాఠశాలలు, 23 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. పట్టణంలో 14 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పట్టణంలో వర్షాలకు తరచూ ముంపునకు గురవుతున్న ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మించి ముంపు సమస్యకు పరిష్కారం చూపారు. పట్టణ పరిధిలోని 30 వార్డుల్లో రూ.11.42 కోట్లతో 106 సీసీ రోడ్లు నిర్మాణం, మరమ్మతులు చేశారు. పట్టణంలోని 20, 21 వార్డులకు సంబంధించి ఇసుకలపేట నుంచి ఉప్పరగూడెం వైఎస్సార్నగర్ కాలనీ వరకు రూ.1.20 కోట్లతో 1.8 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. 22, 25 వార్డులకు సంబంధించి రూ.1.25 కోట్లతో 12 అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణం జరిగింది. ఎన్నో ఏళ్ల నాటి సమస్యకు పరిష్కారం లభించింది. సీసీ డ్రైన్ల నిర్మాణం పట్టణ పరిధిలో 14, 15వ ఆర్థిక సంఘాల నిధులు రూ.4 కోట్లతో 40 కొత్త కాలవలు నిర్మాణం జరిగింది. పట్టణ పరిధిలోని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా పైపు లైన్ల నిర్మాణం కోసం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1.28 కోట్లు ఖర్చు చేశారు. నాడు–నేడు కార్యక్రమంలో రూ.5.54 కోట్ల ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేశారు. అదనపు తరగతిగదుల నిర్మాణం, మౌలిక వసతులు, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించారు. పట్టణంలోని రెండు పార్కులను రూ.2.64 కోట్లతో అభివృద్ధి చేశారు. 14, 15 ఆర్థిక సంఘం, బీపీఎస్, ఎంపీ నిధులతో రాజా రాజబాబు మున్సిపల్ పార్కు, గణపతినగర్ పార్కులను సుందరంగా తీర్చిదిద్దారు. సచివాలయాలు పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి 14 సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఇందులో సచివాలయ ఉద్యోగులు 82 మంది విధులు నిర్వహిస్తున్నారు. వార్డు వలంటీర్లు 316 మంది ఉన్నారు. సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలతో పాటు వివిధ రకాల సర్టిఫికెట్లు నేరుగా ప్రజలకు అందించారు. అధికారుల లెక్కల ప్రకారం సచివాలయాల పరిధిలో 52 వేల మంది సేవలు పొందారు. పేదల సొంతింటి కల సాకారం పట్టణ పరిధిలోని పేదలు 4716 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. తుని మండలం రాజుపేటలో పేదల కోసం వేసిన లే అవుట్లో రూ.82.76 కోట్లతో స్థలం చదును, గ్రావెల్ రోడ్లు, తాగునీరు, విద్యుత్ తదితర సదుపాయాలను కల్పించారు. సంక్షేమ పథకాలు తుని పురపాలక సంఘంలో 2019 నుంచి 24 వరకు డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రూ.310 కోట్ల మేర ప్రయోజనం చేకూరింది. ఇందులో డీబీటీ ద్వారా 61,941 మందికి రూ.178 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా 30,042 మందికి రూ.182 కోట్లు పేదలకు అందాయి. గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇంత ప్రయోజనం జరగలేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు గత ఎన్నికల సమయంలో పట్టణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశాం. అర్హులైన పేదలకు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేశాం. సొంత గూడు లేని 4716 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి, ప్రభుత్వ పరంగా గృహనిర్మాణానికి నిధులు మంజూరు చేశాం. పట్టణంలో కొత్తగా 106 సీసీ రోడ్లు నిర్మించాం. పార్కులు అభివృద్ధి, కాలవల నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చాం. తుని మున్సిపాలిటీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందడం ఆనందంగా ఉంది. –ఏలూరి సుధారాణి, మున్సిపల్ చైర్పర్సన్,తుని తుని మున్సిపల్ పార్కులో నిర్మించిన స్కేటింగ్ ట్రాక్ మున్సిపల్ పార్కులో నిర్మించిన స్కేటింగ్ ట్రాక్ -
ప్రగతి కాంతులు
కంబాల చెరువు పార్కు కంబాల చెరువు వద్ద దండి మార్చ్ జంక్షన్ పుష్కరాల రేవు వద్ద పుష్కర ప్లాజా హ్యాపీ స్ట్రీట్లాలాచెరువు వద్ద ఆకట్టుకుంటున్న గ్లో గార్డెన్ ●● ఐదేళ్లుగా అభివృద్ధి పథంలో రాజమహేంద్రవరం ● రూ.433 కోట్లతో మౌలిక వసతులు, సుందరీకరణ పనులు ● చారిత్రక నగరంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి ● రూ.125 కోట్ల ప్రత్యేక నిధుల కేటాయింపు ● రూ.10 కోట్లతో కంబాల చెరువు ఆధునీకరణ ● 90 శాతం పైగా పూర్తయిన పనులు సాక్షి, రాజమహేంద్రవరం: చారిత్రక నగరం.. సాంస్కృతిక రాజధానిగా ప్రతీతి చెందిన ప్రాంతం.. హోల్సేల్ వస్త్ర వాణిజ్యానికి చుక్కాని.. నేడు జిల్లా కేంద్రం.. ఇటువంటి రాజమహేంద్రవరం నగరం రూపురేఖలు ఐదేళ్లలో పూర్తిగా మారిపోయాయి. ఐదు లక్షలకు పైగా ఉన్న జనాభా ఉన్న ఈ నగరంలో ప్రజలకు అవసరమైన అన్ని రకాల మౌలిక వసతులూ ప్రభుత్వం కల్పించింది. నగరంలోని పలు కూడళ్లు, ప్రధాన ప్రాంతాలను పెద్దపెద్ద నగరాలను తలదన్నే రీతిలో అందంగా తీర్చిదిద్దింది. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, పార్కులు, రోడ్లు, డ్రెయిన్లు అభివృద్ధి చేసింది. నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా సాధారణ, మున్సిపల్, ప్రత్యేక, రుడా నిధులు రూ.558 కోట్లు వెచ్చించింది. వీటిలో రూ.217 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నగరాభివృద్ధికి ప్రత్యేకంగా రూ.125 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. పర్యాటక కేంద్రంగా కంబాల చెరువు నగరం నడిబొడ్డున ఉన్న కంబాల చెరువు పార్కును పర్యాటక మణిహారంగా తీర్చిదిద్దారు. పదెకరాల్లో విస్తరించిన ఈ పార్కులో ఆరెకరాల్లో చెరువును అభివృద్ధి చేసి, బోటింగ్ సదుపాయం కల్పించారు. మరో నాలుగు ఎకరాల్లో జాగింగ్ ట్రాక్, బోట్ సైక్లింగ్, లేజర్ షో, 360 డిగ్రీ సైక్లింగ్, 360 డిగ్రీ అమ్యూజ్మెంట్ రైడ్, ట్రాంపోలిస్ ఎక్విప్మెంట్, స్కై బెలూన్ (చిల్డ్రన్స్), స్కై రోలర్, వాటర్ వాకింగ్ బాల్స్, బాడీ బార్బింగ్ బాల్స్, ప్లూ కోర్ట్, పురుషుల జిమ్, సీటింగ్ గ్యాలరీ, మెయిన్ ఎంట్రన్స్ ప్లాజా, ఓఏటీ జోన్, స్టేట్ ప్రైడ్ జోన్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటి అధునాతన ఆకర్షణలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఆక్వా లేజర్ షో ఏర్పాటు చేశారు. పట్టాలెక్కిన పుష్కర ప్లాజా పుష్కర్ ఘాట్ సమీపాన రైల్వే అండర్ బ్రిడ్జి పక్కన వృథాగా ఉన్న స్థలం నేడు సుందర ప్రదేశంగా రూపుదిద్దుకుంది. 200 మీటర్ల పైబడిన ఈ రోడ్డును పూర్తి స్థాయిలో ఆధునీకరించారు. సందర్శకులు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆహ్లాదాన్ని పంచేలా సైన్ బోర్డులు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. పచ్చదనం పెంపొందించడంతో ప్రజలు సెల్ఫీల కోసం పోటీ పడుతున్నారు. హ్యాపీ స్ట్రీట్ సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు జేఎన్ రోడ్డులోని ఏకేసీ కళాశాల సమీపాన అభివృద్ధి చేసిన హ్యాపీ స్ట్రీట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇక్కడ రూ.80 లక్షలతో ప్రజలను ఆకర్షించే ఆకృతుల్లో నిర్మాణాలు చేపట్టారు. ఇప్పటి వరకూ దేశంలోని మహానగరాలకే పరిమితమైన హ్యాపీ స్ట్రీట్ మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరంలో కొలువు తీరింది. దండి మార్చ్ సెంటర్ జాతిపిత మహాత్మా గాంధీ రాజమహేంద్రవరాన్ని ఐదుసార్లు సందర్శించారు. ఆయన గురుతులను, స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తికి ప్రతీకగా దండి మార్చ్ సెంటర్ను రూ.1.5 కోట్లతో అభివృద్ధి చేశారు. దీంతో పాటు పుష్కర ఘాట్, దేవీచౌక్ వంటి 12 జంక్షన్లను రూ.7.26 కోట్లతో ఆధునీకరించారు. రూ.4.3 కోట్లతో పార్కుల సుందరీకరణ నగరంలో రూ.4.3 కోట్లతో 40 ఎకరాల విస్తీర్ణంలో 37 పార్కుల సుందరీకరణ చేపడుతున్నారు. కొత్తగా మహాలక్ష్మి పార్క్, గాదాలమ్మ నగర్ పార్క్, ఏకేసీ పార్క్, అంబేద్కర్ పార్క్, సాయి చైతన్య కాలనీ పార్క్, ఎస్బీఐ కాలనీ పార్కుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించగా.. ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి. చౌడేశ్వరి నగర్లో రూ.4.4 కోట్లతో గ్లో గార్డెన్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. గాంధీపురం వద్ద కూడా రూ.3 కోట్లతో గ్లో గార్డెన్ నిర్మాణం పూర్తయింది. పద్మావతి నగర్ పార్కులో చిన్నారులకు రూ.2 కోట్లతో స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి తెచ్చారు. జగనన్న స్మార్ట్ రోడ్స్ జగనన్న స్మార్ట్ రోడ్స్ పేరిట రూ.8.5 కోట్లతో వై జంక్షన్ నుంచి లాలాచెరువు జంక్షన్ వరకూ 3 కిలోమీటర్ల మేర అధునాత రహదారి అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీని నిర్మాణంలో 8 అంశాలను ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఆహ్లాదాన్ని పంచుతూనే ప్రయాణం సాఫీగా సాగేలా ఈ రోడ్డు రూపుదిద్దుకుంటోంది. దీనికి ఇరువైపులా 2.5 మీటర్ల వెడల్పున ఫుట్పాత్ నిర్మిస్తున్నారు. దీనిపై ఆహ్లాదాన్ని నింపేలా గడ్డి ఏర్పాటు చేస్తున్నారు. యువత ఆనందంగా గడిపేందుకు అక్కడక్కడ సెల్ఫీ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్నారు. గోడలు అందంగా కనిపించేలా రంగు రంగుల బొమ్మలు వేయిస్తున్నారు. వై–జంక్షన్ నుంచి పుష్కర ఘాట్ వరకూ రూ.5 కోట్లతో ఫుట్పాత్ల నిర్మాణంతో పాటు పార్కింగ్, డస్టు బిన్లు ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో 16 కిలోమీటర్ల మేర రూ.12.6 కోట్లతో 15 రకాల రహదారులు నిర్మిస్తున్నారు. ఇంకా షెల్టన్ హోటల్ నుంచి మోరంపూడి జంక్షన్ రోడ్డును రూ.7 కోట్ల వ్యయంతో 100 అడుగులకు విస్తరించారు. పచ్చదనానికి పెద్దపీట జగనన్న హరిత నగరాల్లో భాగంగా రూ.4.3 కోట్లతో రాజమహేంద్రవరంలో 7.3 కిలోమీటర్ల మేర డివైడర్ల మధ్యన పచ్చదనం పెంపొందించారు. అలాగే, 17 కిలోమీటర్ల మేర 15,000 మొక్కలు పెంచారు. ఎయిర్పోర్ట్ రోడ్డులో 12 కిలోమీటర్ల మేర రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా), మున్సిపల్ నిధులతో మొక్కలు పెంచుతున్నారు. రూ.53 కోట్లతో మురుగు కాలువలు రూ.53.85 కోట్లతో నగరంలో 51 కిలోమీటర్ల మేర మురుగు కాలువల నిర్మాణాలు, ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే సింహభాగం పూర్తయ్యాయి. మిగిలినవి పురోగతిలో ఉన్నాయి. ఆరోగ్యానికి ప్రాధాన్యం నగర ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి అనుగుణంగా నగరంలో రూ.5 కోట్లతో 5 అర్బన్ హెల్త్ సెంటర్లకు మరమ్మతులు చేపట్టారు. ఒక్కొక్కటి రూ.80 లక్షల వ్యయంతో 6 అర్బన్ పీహెచ్సీల నిర్మాణం చేపడుతున్నారు. మెడి‘కల’ సాకారం నగర వాసుల మెడికల్ కళాశాల ఏర్పాటు కలను ప్రభుత్వం నెరవేర్చింది. సెంట్రల్ జైలు స్థలంలో రూ.475 కోట్లతో కళాశాల నిర్మాణ పనులు చేపట్టారు. అకడమిక్ కార్యకలాపాలకు ఉద్దేశించిన ప్రీ ఇంజినీర్డ్ బిల్డింగ్ (పీఈబీ) నిర్మాణం చేపట్టారు. దీంతో 2023–24 విద్యా సంవత్సరంలో 150 మెడికల్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా రాజమహేంద్రవరం జీజీహెచ్కు మహర్దశ పట్టింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఈ ఆస్పత్రిని 500 పడకల బోధనాస్పత్రిగా విస్తరించారు. ఇంకా.. ● వై–జంక్షన్, హ్యాపీ స్ట్రీట్ వంటి ప్రధాన, ప్రజలు ఆహ్లాదంగా గడిపే ప్రదేశాల్లో రూ.1.2 కోట్ల వ్యయంతో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేశారు. ● నగరంలో ప్రజలకు రుచికరమైన ఆహారం ఒకేచోట అందించేందుకు ఆర్ట్స్ కళాశాల వద్ద ఈట్ స్ట్రీట్ను అందుబాటులోకి తెచ్చారు. ● కళాభిమానులు సాంస్కృతిక కార్యక్రమాలు కూర్చొని తిలకించేందుకు వీలుగా ఆనం కళాకేంద్రం వద్ద అతి పెద్ద అధునాతన ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం అందుబాటులోకి తెస్తున్నారు. దీనికి రూ.1.2 కోట్లు వెచ్చిస్తున్నారు. ● సుబ్రహ్మణ్య మైదానంలో ఓపెన్ యాంఫీ థియేటర్ అందుబాటులోకి తెచ్చారు. ● గోదావరి నదిపై చారిత్రక నేపథ్యం కలిగిన హేవలాక్ బ్రిడ్జిపై 2.7 కిలోమీటర్ల మేర ఆర్నమెంటల్ లైటింగ్ అమర్చారు. గోదావరి స్నానాలకు వస్తున్న భక్తులను ఇది అమితంగా ఆకట్టుకుంటోంది. ● నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణకు, సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించేందుకు రూ.4.6 కోట్లతో అధునాతన కమాండ్ కంట్రోల్ రూము నిర్మాణం చేపట్టారు.అభివృద్ధికి నిధులు ఇచ్చారిలా.. పనులు నిధులు (రూ.కోట్లలో) రోడ్లు 98 డ్రైన్లు 54 నీటి సరఫరా 28 వీధి దీపాలు 9 పార్కులు 9 బ్యూటిఫికేషన్ 13 సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 16 భవనాలు 6 ప్రత్యేక నిధులు 100 సీఎం మంజూరు చేసినవి 125 -
ట్రైనీ ఐపీఎస్లకు కలెక్టర్ అభినందన
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సార్వత్రిక ఎన్నికల విధుల్లో భాగస్వాములు కావడం ఒక మంచి అవకాశమని ట్రైనీ ఐపీఎస్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత అభినందించారు. శిక్షణ నిమిత్తం జిల్లాకు కేటాయించిన ట్రైనీ ఐపీఎస్లు ఎస్పీ పి.జగదీష్ సమక్షంలో కలెక్టర్ను ఆమె చాంబర్లో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా ఎన్నికల యంత్రాంగం, పోలీసు యంత్రాంగం మధ్య సమన్వయం సాధించడం ముఖ్యమని అన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు కచ్చితంగా పాటించాలని చెప్పారు. ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ, ట్రైనీ పోలీసు అధికారులను జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల విధుల్లో భాగస్వాముల్ని చేస్తున్నామని తెలిపారు. పోలింగ్ రోజున వేతనంతో కూడిన సెలవు సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని వివిధ ప్రైవేటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, ఇతర అన్ని రకాల సంస్థలు, దుకాణాలు, హోటళ్లలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులకు సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజైన సోమవారం వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుందని జిల్లా సహాయ కార్మిక కమిషనర్ బీఎస్ఎం వలి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిబంధనను ఉల్లంఘించిన యాజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎన్నికల రోజున వేతనంతో కూడిన సెలవు మంజూరు చేసి, ఉద్యోగులు, కార్మికులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించారు. స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నగరంలోని స్కానింగ్ సెంటర్లలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న పలు స్కానింగ్ సెంటర్లపై ఈ తనిఖీలు చేశారు. గంగిన హాస్పిటల్, శ్రీలత హాస్పిటల్, రాయల్ హాస్పిటల్స్ను తనిఖీ చేసి, అక్కడ స్కానింగ్ చేస్తున్న విధానాన్ని, స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. లింగ నిర్ధారణ పరీక్షలు, ఇతర అంశాలను పరిశీలించారు. ప్రతి స్కాన్కు ఆధార్ నంబర్ తప్పనిసరిగా అప్లోడ్ చేయాలని, పీసీపీఎన్డీటీ యాక్ట్ చార్టులు తప్పనిసరిగా రిసెప్షన్లో, స్కానింగ్ చేసే రూముల్లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల్లో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, ఎంపీహెచ్ఓ నాగు తదితరులు పాల్గొన్నారు. -
రాజమహేంద్రవరంపై సీఎంకు ప్రత్యేక అభిమానం
● రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ కేటాయించనంతగా నగరానికి నిధులు ● రాజమండ్రి సిటీలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయం ● వైఎస్సార్ సీపీ సీనియర్ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి సిటీ నియోజకవర్గమంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి అమితమైన అభిమానమని, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ కేటాయించనంతగా నిధులు మంజూరు చేయడమే దీనికి సాక్షిగా నిలుస్తోందని ఏపీఐఐసీ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో సిట్టింగ్ ఎంపీ, వైఎస్సార్ సీపీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్, ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలసి ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరబోతోందని చెప్పారు. ప్రజల నాడి గ్రహించే ఈ విషయం చెబుతున్నానని స్పష్టం చేశారు. నగర ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టనున్నారని, భరత్ అత్యధిక మెజార్టీతో గెలుపొందడం ఖాయమని చెప్పారు. తాను పార్టీకి ఎప్పుడూ దూరంగా లేనన్నారు. సీఎం జగన్ తనకు సూచించిన విధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పార్టీ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తున్నానని చెప్పారు. సీఎంను పదవులు కోరేందుకు తాను కలవలేదన్నారు. పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పి.మిథున్రెడ్డి తనపై అభిమానంతోనే తన ఇంటికి వచ్చారని అన్నారు. పార్టీ జెండాయే తన అజెండా అని చెప్పారు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ విజయం కోసం పని చేయడం తనకు చేతకాదని స్పష్టం చేశారు. సీఎం జగన్ రాజమండ్రి సిటీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని, ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా తనను కోరారని తెలిపారు. రాజమండ్రి నగర అభివృద్ధిలో భరత్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో నమ్మకం – విశ్వాసం ఒకవైపు, మోసం – అబద్ధాలు మరోవైపు పోటీ పడుతున్నాయని, ప్రజలు మంచివైపు మొగ్గు చూపాలని కోరారు. ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ రాజ్యాన్ని అందించారని, ఆయనతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని చెప్పారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా భరత్ను, ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను గెలిపించి, జననేత జగన్కు బహుమతిగా ఇవ్వాలని శ్రీఘాకోళ్లపు కోరారు. మార్గాని భరత్రామ్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టుగా వైఎస్సార్ సీపీకి ఎవరూ దూరంగా లేరని, ప్రతి ఒక్కరూ నిజాయతీగా పార్టీ విజయానికి శక్తివంచన లేకుండా పని చేస్తున్నారని అన్నారు. శివరామ సుబ్రహ్మణ్యం తనకు అత్యంత ఆప్తులని, నిజాయతీగా పని చేసే నాయకుడని కొనియాడారు. సమావేశంలో రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నందెపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారానికి రేపటితో ఫుల్స్టాప్
● శనివారం సాయంత్రం 6 గంటల వరకే గడువు ● జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీలతసీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం జరగనున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6 గంటల వరకూ మాత్రమే ప్రచారానికి గడువు ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.మాధవీలత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ గడువు తర్వాత అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రచారాలు, సభలు, ర్యాలీలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. పోలింగ్ రోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ నెల 12, 13 తేదీల్లో పత్రికల్లో ఇచ్చే ప్రకటనలకు 48 గంటలు ముందుగా అన్ని వివరాలతో బొమ్మూరు కలెక్టరేట్లో ఉన్న మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీకి (ఎంసీఎంసీ) దరఖాస్తు చేసుకుని, అనుమతి పొందాలని స్పష్టం చేశారు. 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు జిల్లాలోని 21 మండలాల్లో 30 మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కొక్కటి చొప్పున మహిళల కోసం ప్రత్యేకంగా ఏడు పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే, యువ ఓటర్ల కోసం రాజమండ్రి సిటీ, కొవ్వూరు నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాజానగరం, రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో దివ్యాంగ ఓటర్ల కోసం రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
రికార్డు మళ్లీ తిరగరాస్తారా
సామాజిక వర్గాల వారీగా ఓటర్లు రెడ్డి 47,918 కమ్మ 12,330 కాపు 43,577 బీసీ 73,558 ఎస్సీ 33,270 ఎస్టీ 1,161 వైశ్యులు 1,852 బ్రాహ్మణులు 2,585 క్షత్రియులు 1,058 ముస్లింలు 1,909 ట్రాన్స్జెండర్ 2 ఇతరులు 3,828 మొత్తం ఓటర్లు 2,23,048 అ న ప ర్తి లో పెదపూడి: ఒకప్పుడు అనపోతవరం లేదా అనపర్రుగా పిలుచుకునే అనపర్తికి రాజా అనపోతారెడ్డి కారణంగా ఆ పేరొచ్చిందని నానుడి. కాటన్ దొర పుణ్యమా అని పచ్చని పంట పొలాలతో కళకళలాడే అనపర్తి ప్రాంతం వ్యవసాయానికే కాదు వడ్డీ వ్యాపారులకు సైతం పెట్టింది పేరు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాకుండా భారత దేశంలోని అనేక రాష్ట్రాల్లో అనపర్తి సమీప గ్రామాలకు చెందినవారు వడ్డీ వ్యాపారులుగా స్థిరపడ్డారు. అంతేకాదు ఎన్నో దశాబ్దాలుగా గోదావరి జిల్లాల్లోని ప్రధాన వాణిజ్య కేంద్రాల్లో ఒకటిగా అనపర్తికి పేరుంది. నియోజకవర్గ ముఖచిత్రం అనపర్తి నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకూ ఆ పేరుతోనే నియోజకవర్గం మనుగడ సాగిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలు జరిగినప్పుడల్లా భౌగోళికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. 1962లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన కారణంగా సోమేశ్వరం, తాపేశ్వరం ఫిర్కాలతో కూడిన అనపర్తి నియోజకవర్గం ఏర్పడింది. అనంతరం 1978లో సమితి ప్రాతిపదికగా జరిగిన పునర్విభజనలో నియోజకవర్గం కొత్తరూపును సంతరించుకుంది. 1985లో ఏర్పడిన మండల వ్యవస్థ తరువాత అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, బిక్కవోలు, రాయవరం మండలాలు మాత్రమే ఉండేవి. 2009 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో అనపర్తి నియోజకవర్గంలోని రాయవరం మండలాన్ని మండపేట నియోజకవర్గంలో విలీనం చేసి జగ్గంపేట నియోజకవర్గంలోని రంగంపేట, సంపర నియోజవర్గంలో ఉన్న పెదపూడి మండలాలను అనపర్తి నియోజకవర్గంలో కలిపారు. నాటి నుంచి అనపర్తి నియోజకవర్గంలో అనపర్తి, బిక్కవోలు, రంగంపేట, పెదపూడి మండలాలున్నాయి. రసవత్తర రాజకీయ పోరు 1952 నుంచి ఇప్పటివరకూ ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరగగా మూడు పర్యాయాలు తప్ప మిగిలిన 12 సార్లు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుపొందితే రాష్ట్రంలోనూ అదే పార్టీ అధికారం చేపడుతుందన్న సెంటిమెంట్ ప్రజల్లో నెలకొంది. సర్పంచ్లకు సైతం ఎమ్మెల్యేలుగా పట్టం కట్టిన చరిత్ర అనపర్తి నియోజవర్గం సొంతం. రామవరం సర్పంచ్గా గెలిచిన మూలారెడ్డి టీడీపీ నుంచి 1983లో, అనపర్తి సర్పంచ్గా గెలిచిన రామారెడ్డిని కాంగ్రెస్ తరపున 1989, 2004ల్లో ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. 1952లో అనపర్తికి మొట్టమొదటి ఎమ్మెల్యేగా నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం కొంకుదురుకు చెందిన పడాల సత్యనారాయణరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందారు. 1955లో సీపీఐకి చెందిన కొవ్వూరి వెంకటరెడ్డిపై ప్రజా పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన తేతలి లక్ష్మీనారాయణరెడ్డి గెలుపొందారు. 1962లో నియోజకవర్గాల పునర్విభజన తరువాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తేతలి లక్ష్మీనారాయణరెడ్డిపై సీపీఐ అభ్యర్థి పాలచర్ల పనసరామన్న విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో వల్లూరి రామకృష్ణ చౌదరి కాంగ్రెస్ తరుపున పోటీలో నిలిచి స్వతంత్ర అభ్యర్థి గొలుగూరి వెంకటరెడ్డిపై విజయం సాధించారు. 1972లో వల్లూరి రామకృష్ణ చౌదరి(కాంగ్రెస్) ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978లో రాజకీయ దిగ్గజంగా పేరున్న కాంగ్రెస్ అభ్యర్థి వుండవిల్లి సత్యనారాయణమూర్తి(రాయవరం మునసబు)ను ఢీకొని కొమరిపాలెంకు చెందిన పడాల అమ్మిరెడ్డి జనతా పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పడాల అమ్మిరెడ్డిపై పోటీ చేసిన నల్లమిల్లి మూలారెడ్డి గెలుపొందారు. 1989లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన నల్లమిల్లి మూలారెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్థి తేతలి రామారెడ్డి గెలుపొందారు. తదుపరి 1994, 1999ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన తేతలి రామారెడ్డిపై టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి మూలారెడ్డి విజయం సాధించారు. 2004లో తిరిగి నల్లమిల్లి మూలారెడ్డిపై తేతలి రామారెడ్డి గెలుపొందారు. 2009లో పీఆర్పీ అభ్యర్థిగా డీఆర్కే రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా నల్లమిల్లి మూలారెడ్డిలపై కాంగ్రెస్ తరపున బరిలో నిలిచిన నల్లమిల్లి శేషారెడ్డి విజయ కేతనం ఎగురవేశారు. ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి కుమారుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,373 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి 55,208 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డులు తిరగరాశారు. ఇప్పటివరకూ అనపర్తి నియోజకవర్గంలో జరిగిన 15 ఎన్నికల్లో ఇదే అత్యధిక మెజార్టీ కావడం విశేషం. మరో మూడు రోజుల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరపున డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి, బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ముచ్చటగా మూడోసారి ప్రత్యర్థులుగా పోటీ పడనున్నారు. 2019 ఎన్నికల కంటే మించిన మెజార్టీ సాధించే లక్ష్యంతో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి ముందుకు సాగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, పారదర్శక పాలన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ప్రచారం సాగిస్తున్నారు. సౌమ్యుడిగా పేరున్న డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి ప్రజల్లో విశ్వాసం, అవినీతి రహిత పాలన, నిరంతరం ప్రజల్లో ఉండడం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. టీడీపీ హయాంలో తీవ్ర అవినీతి ఆరోపణలతో వ్యతిరేకత మూటగట్టుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఈ ఎన్నికల్లోనూ ఎదురుగాలి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అనపర్తి నియోజకవర్గంలో ఓటర్లు మండలం గ్రామాలు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం అనపర్తి 11 28,433 30,690 0 59,123 బిక్కవోలు 13 27,675 29,510 1 57,186 రంగంపేట 16 23,724 23,714 1 47,439 పెదపూడి 18 29,434 29,866 0 59,300 58 1,09,266 1,13,780 2 2,23,048 2019 ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వైఎస్సార్సీపీ 1,11,169 నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ 56,240 రేలంగి నాగేశ్వరరావు జనసేన 12,800 వై.ఏ.వడయార్ కాంగ్రెస్ 1,127 మేడపాటి హరినారాయణరెడ్డి బీజేపీ 622 అనపర్తి నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి ఫిబ్రవరి 2024 వరకూ వివిధ పథకాల ద్వారా చేకూరిన లబ్ధి పథకం పేరు లబ్ధిదారులు ఆర్థిక సహాయం (రూ.కోట్లలో) వైఎస్సార్ పెన్స్న్ కానుక 46,777 496.81 జగనన్న అమ్మఒడి 44,141 131.61 వైఎస్సార్ చేయూత 15,869 62.99 వైఎస్సార్ రైతు భరోసా 42,362 154.10 వైఎస్సార్ నేతన్న నేస్తం 360 1.84 వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్హెచ్జీ) 43,536 195.39 వైఎస్సార్ ఆసరా 34,123 174.99 నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు 13,118 145.29 వైఎస్సార్ ఉచిత పంటల బీమా 26,262 69.18 వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు 16,690 6.52 వైఎస్సార్ కాపు నేస్తం 5,429 23.85 రైతులకు ఇన్ఫుట్ సబ్సిడీ 24,348 23.37 జగనన్న వసతి దీవెన 11,564 48.52 జగనన్న విద్యా దీవెన 14,326 37.47 ఈబీసీ నేస్తం 5,852 14.24 వైఎస్సార్ బీమా 630 11.07 మొత్తం 3,45,387 1597.32 ఇతర పథకాలు జగనన్న చేదోడు 2,605 5.02 వైఎస్సార్ ఆరోగ్యశ్రీ 13,012 43.68 వైఎస్సార్ ఆరోగ్య ఆసరా 7,933 9.03 వైఎస్సార్ లా నేస్తం 14 0.12 వైఎస్సార్ కల్యాణమస్తు/షాదీ తోఫా 119 1.32 అర్చకులు/ఇమామ్లు/మౌజామ్లు/పాస్టర్లు 192 2.96 వైఎస్సార్ మత్స్యకార భరోసా 103 0.19 మొత్తం 23,978 62.36 నియోజకవర్గ ప్రత్యేకతలు అనపర్తి నియోజకవర్గం రైసు మిల్లులు, పౌల్ట్రీ పరిశ్రమలకు పెట్టింది పేరు. అనపర్తి మండలం పులగుర్తలో చేనేత సొసైటీకి మంచి పేరుంది. అలాగే అనపర్తిలో ఐటీసీ లిమిటెడ్ ఐఎల్టీడీ కంపెనీ ఉంది. దీంట్లో ఇండియన్ లీఫ్ టుబాకో గ్రేడింగ్ చేస్తారు. బిక్కవోలులో రాష్ట్ర స్థాయిలో ప్రసిద్ధి చెందిన శ్రీలక్ష్మీగణపతి ఆలయం, కుమార సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం ఉన్నాయి. అలాగే పెదపూడి మండలం జి.మామిడాడలో రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన శ్రీసూర్యనారాయణస్వామివారి ఆలయం, కోదండరామాలయాలున్నాయి. ఏటా సంక్రాంతి సమయంలో ఐదు రోజుల పాటు అనపర్తి వీరుళ్లమ్మ అమ్మవారి జాతర నిర్వహిస్తారు. లక్షల్లో భక్తులు వీరుళ్లమ్మను దర్శించుకుంటారు. అనపర్తి రైల్వేస్టేషన్లో రోజూ 34 రైళ్లు ఆగుతాయి. రామచంద్రపురం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల ప్రజలంతా ప్రధానంగా ఈ స్టేషన్ నుంచే ప్రయాణాలు సాగిస్తుంటారు. ఇటీవల అమృత భారత్ కింద రూ.31 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆదిత్య బిర్లా వారి గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉంది. ఇక్కడ సుమారు 4 వేల మంది పనిచేస్తున్నారు. 20వ శతాబ్దపు ప్రముఖ రచయితల్లో ఒకరైన శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి అనపర్తి మండలం పొలమూరుకు చెందినవారే కావడం విశేషం. బిక్కవోలు మండలం కొంకుదురు జాతీయ గ్రంథాలయ పితామహుడు అయ్యంకి వెంకటరమణయ్య జన్మస్థలం. రాష్ట్ర రాజకీయాలకు అనపర్తి సెంటిమెంట్ దశాబ్దాలుగా వాణిజ్య కేంద్రంగా వెలుగులు -
అభివృద్ధి చేశారిలా...
చేపట్టిన పని పనుల నిధులు సంఖ్య సీసీ రోడ్లు 69 రూ.10.93 కోట్లు సీసీ డ్రెయిన్లు 75 రూ.6.25 కోట్లు మంచినీటి సరఫరా 42 రూ.2.23 కోట్లు వీధిదీపాల నిర్వహణ 14 రూ.67.28 లక్షలు పార్కుల సుందరీకరణ 8 రూ.77.80 లక్షలు నాడు–నేడు (మొదటి విడత) 8 రూ.2.22 కోట్లు నాడు–నేడు (రెండో విడత) 13 రూ.5.91 కోట్లు నాడు–నేడు (రెండో విడత–ఎ) 9 రూ.7.75 లక్షలు వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ 2 రూ.1.01 కోట్లు ఏఐఐబీ పథకం (గోదావరి జలాల సరఫరా) 2 రూ.58.09 కోట్లు పేదలందరికీ ఇళ్లు (రోడ్లు) 8 రూ.2.33 కోట్లు పేదలందరికీ ఇళ్లు పథకం (పూడిక పనులు) 6 రూ.5.07 కోట్లు పేదలందరికీ ఇళ్లు (నీటి సరఫరా) 7 రూ.1.65 కోట్లు డంపింగ్ యార్డు (ఘన పదార్థాలు వేరు చేయడం) 1 రూ.3.29 కోట్లు డంపింగ్ యార్డు ప్రాసెసింగ్ 1 రూ.23.88 లక్షలు మాలకోడు (మురుగునీటి శుద్ధీకరణ) 1 రూ.6.10 లక్షలు మురుగునీటి శుద్ధీకరణ (ప్లాంట్) నిర్మాణం 1 రూ.4.95 కోట్లు మాలకోడు సుందరీకరణ 1 రూ.4.52 కోట్లు జగనన్న కాలనీలో నీటి సరఫరా 1 రూ.5.30 కోట్లు మలవ్యర్థ శుద్ధీకరణ ప్లాంట్ 1 రూ.2.05 కోట్లు చెత్త సేకరణ (ఈ–ఆటోలు) రూ.24.06 లక్షలు రివర్ ఫ్రంట్ పార్కు 1 రూ.1.00 కోట్లు ఈట్ సీ్త్రట్ 1 రూ.80.00 లక్షలు గణపతి జంక్షన్ అభివృద్ధి రూ.67 లక్షలు ఆర్అండ్బీ రోడ్డు 3 రూ.7.80 కోట్లు రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.200.74 కోట్లు గడ్డర్ బ్రిడ్జి నిర్మాణం 1 రూ.4.65 కోట్లు 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం 1 రూ.19.60 కోట్లు ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి 1 రూ.6.00 కోట్లు షాదీ ఖానా నిర్మాణం 1 రూ.1.00 కోట్లు -
నిడదవోలు.. ప్రగతి చూడు
● పట్టణంలో ఐదేళ్లుగా గణనీయమైన అభివృద్ధి ● రూ.376.64 కోట్లతో వివిధ పనులు ● రూ.359.26 కోట్లతో సంక్షేమం ● పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణంనిడదవోలు: జిల్లా కేంద్రం, ప్రధాన వాణిజ్య ప్రాంతంగా ఉన్న రాజమహేంద్రవరం.. అటు పశ్చిమ గోదావరి జిల్లాలోని మరో వ్యాపార కేంద్రం తాడేపల్లిగూడెంతో పాటు తణుకు తదితర పట్టణాలకు చేరువగా ఉన్న నిడదవోలు గడచిన ఐదేళ్లుగా జోరుగా అభివృద్ధి చెందుతోంది. జిల్లాలోని ఏకై క రైల్వే జంక్షన్ అయిన ఈ పట్టణంలో రూ.371.33 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పలు పనులు పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. పట్టణ ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. వీటితో పాటు పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేశారు. ప్రగతి పనులతో పాటు ప్రజా సంక్షేమానికి కూడా పెద్ద పీట వేయడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాయి. పట్టణంలోని 28 వార్డుల్లో అర్హతే ప్రామాణికంగా వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.359.26 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. ఫలితంగా పట్టణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. స్వచ్ఛాంధ్రప్రదేశ్లో భాగంగా పట్టణంలోని అన్ని వార్డుల్లో పరిశుభ్రతతో ఆహ్లాదకర వాతావరణం కల్పించారు. ఆర్ఓబీ నిర్మాణం ఉభయ గోదావరి జిల్లాల చిరకాల కోరిక నిడదవోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఆర్ఐఎఫ్ నిధులు రూ.185 కోట్లు మంజూరు కావడంతో పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. దీని భూసేకరణలో భాగంగా నిడదవో లు పట్టణంతో పాటు సమిశ్రగూడెం గ్రామంలో స్థలా లు, నిర్మాణాలు కోల్పోయిన వారికి పరిహారంగా ఇప్పటికే రూ.10.55 కోట్లు అందజేశారు. దీంతో వ్యా పారులు, నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ ప్రజల చిరకాల కోరిక నెరవేరుతోంది. పేదలకు కార్పొరేట్ వైద్యం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో రూ.91.16 లక్షలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందనున్నాయి. పేద, మధ్యతరగతి ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం, కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఉచితంగా అందాలనే సంకల్పంతో ప్రభుత్వం అర్బన్ హెల్త్ సెంటర్ నిర్మించింది. నాలుగు లేన్ల రోడ్డు విస్తరణ పట్టణంలోని పాటిమీద సెంటర్ నుంచి గణపతి సెంటర్ వరకూ నాలుగు లేన్ల రోడ్డు విస్తరణతో పాటు గణపతి జంక్షన్ అభివృద్ధి పనులను రూ.6 కోట్లతో చేపట్టారు. గణపతి జంక్షన్ అభివృద్ధిలో భాగంగా విశాలమైన నాలుగు లేన్ల రోడ్డు, వాటర్ ఫౌంటైన్, అందమైన పార్కు, మంచినీటి పైపులైన్, డ్రైనేజీ, బస్ షెల్టర్, పచ్చదనంతో ఆహాదకరంగా ఉండేలా సుందరీకరణ పనులు చేపట్టారు. ఎన్నడూ లేనంతగా అభివృద్ధి నిడదవోలు పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కోట్లాది రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రధానంగా రోడ్లు, డ్రైయినేజీల నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూనే ప్రతి వార్డులో పనులు చేశారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో వార్డుల్లోని సమస్యలు గుర్తించి, పరిష్కరించారు. కొన్నేళ్ల నుంచి డంపింగ్ యార్డులో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను పూర్తిగా నిర్మూలించేందుకు లెగసీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేశారు. అక్కడ నిల్వ ఉన్న 40 వేల టన్నుల చెత్తను రీసైక్లింగ్ చేస్తున్నారు. సుమారు రూ.కోటితో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ చెంతన చినకాశిరేవు వద్ద చేపట్టిన రివర్ ఫ్రంట్ పార్కు నిర్మాణం దాదాపు పూర్తి కావస్తోంది.వార్డులు : 28విస్తీర్ణం : 14.15 చదరపు కిలోమీటర్లు జనాభా : 43,809 పురుషులు : 21,281 మహిళలు : 22,528 ఓటర్లు : 35,112 పురుషులు : 16,584 మహిళలు : 18,112 మున్సిపల్ పాఠశాలలు : 15 ప్రభుత్వ ఆసుపత్రులు : 3 వార్డు సచివాలయాలు : 13 -
స్టోరేజ్ ట్యాంక్లో పడి కాంట్రాక్ట్ వర్కర్ మృతి
కాకినాడ రూరల్: మండలంలోని పి.వెంకటాపురం వద్ద పండూరు సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ స్టోరేజ్ ట్యాంక్లో ప్రమాదవశాత్తూ పడి అక్కడ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పంప్ ఆపరేటర్గా పనిచేస్తున్న యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప సతీష్చంద్ర కాలనీకి చెందిన సిద్ధి వెంకటదుర్గాప్రసాద్(38)మృతి చెందాడు. ఉదయమే ఇంటి వద్ద నుంచి విధులకు వాటర్ స్కీమ్ వద్దకు వచ్చిన దుర్గాప్రసాద్ స్టోరేజ్ ట్యాంక్ వద్ద చనిపోయిన చేపల నుంచి దుర్గంధం రావడంతో తొలగించే ప్రయత్నంలో గట్టుపై నుంచి సుమారు 20 అడుగుల లోతు గల స్టోరేజ్ ట్యాంక్లో పడిపోయాడు. సహచర సిబ్బంది బయటకు తీసే ప్రయత్నం చేయగా మృతి చెందాడు. మృతుడికి భార్య మీనాక్షి, ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత కుటుంబానికి చెందిన దుర్గాప్రసాద్ 10నెలలుగా పండూరు వాటర్ స్కీమ్ వద్ద పనిచేస్తూ ఏసీ రిపేరు వర్క్ నేర్చుకుంటున్నాడు. ప్రమాదం గురించి తెలుసుకున్న దుర్గాప్రసాద్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. తోటి వర్కుర్లు దుర్గాప్రసాద్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేయడంతో సీపీడబ్ల్యూఎస్ నిర్వహణ బాధ్యత చేపడుతున్న కాంట్రాక్టర్ పరిహారం అందించేందుకు ముందుకు వచ్చాడు. సంఘటనపై మృతుడు తండ్రి జగ్గారావు ఫిర్యాదు మేరకు తిమ్మాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శుక్రవారం పోస్ట్మార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
అంతంతమాత్రం నుంచి సంతృప్త స్థాయికి..
అమలాపురం టౌన్: గత చంద్రబాబు ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అరకొర సంక్షేమం అందితే ప్రస్తుత ప్రభుత్వంలో వారికి నవ రత్నాలతోనే కాకుండా పలు హామీల అమలుతో సంతృప్తికరమైన సంక్షేమం అందుతోందని రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు (పీకే రావు) అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం అంబాజీపేటలోని తన స్వగృహంలో పీకే రావు బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా అందుతున్న సంక్షేమం గుచించి ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యమంత్రి జగన్ తాను ఇచ్చిన హామీకి కట్టుబడి అర్చకులకు 65 ఏళ్లకు పదవీ విరమణ నిబంధనను రద్దు చేసి, వారికి వంశ పారంపర్యంగా ఆయా ఆలయాల్లో సేవలు అందించే అవకాశాన్ని కల్పించడం గొప్ప విషయమన్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 40 లక్షల మంది బ్రాహ్మణులకు ఈ సంక్షేమ లబ్ధి చేకూరిందన్నారు. ఇంటర్వ్యూలో పీకే రావు గత టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు అందించిన సంక్షేమాన్ని, వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలను పోల్చినప్పుడు ఈ ప్రభుత్వంలో కొన్ని రెట్లు అదనంగా అమలయిందని గుర్తు చేశారు. ఇంటర్వ్యూ సారాంశం ఆయన మాటల్లోనే.. ● బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గత టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.216 కోట్లు కేటాయిస్తే అదే వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గత అయిదేళ్లలో రూ.780 కోట్ల మేర సంక్షేమం అందింది. ● గత టీడీపీ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా కేవలం 50,121 బ్రాహ్మణులకు లబ్ధి చేకూరితే ఈ ప్రభుత్వం ద్వారా అయిదేళ్లలో 1,30,914 మందికి ప్రయోజనం చేకూరింది. ● టీడీపీ ప్రభుత్వంలో భారతి విద్యా పథకం ద్వారా ఏటా విద్యార్థులకు రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకూ లబ్ధి చేకూరగా ఇప్పుడు అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు అందుతోంది. ● గరుడ పథకం కింద చనిపోయినవారికి అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేల వంతున అయిదేళ్లలో 2,434 కుటుంబాలకు రూ.2 43 కోట్లు అందించింది. ● కశ్యప పథకం కింద గత టీడీపీ ప్రభుత్వంలో 16,200 మందికి మాత్రమే తక్కువ మొత్తంలో నెలనెలా పెన్షన్ అందితే ఈ ప్రభుత్వంలో 50,222 మందికి వైఎస్సార్ పెన్షన్ కానుక పథకం కింద ప్రస్తుతం నెలకు రూ.3 వేల వంతున లబ్ధి అందుతోంది. ● ఈబీసీ కింద 25,300 మందికి రూ.73.96 కోట్ల లబ్ధి చేకూరింది. ● బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా తక్కువ వడ్డీతో సుమారు 40 వేల మందికి దాదాపు రూ.200 కోట్ల మేర రుణాలు ఇచ్చాం. ● గుంటూరులో ఉన్న ఎడవల్లివారి సత్రం, నెల్లూరులో ఉన్న అయిలూరి వెంకయ్యపంతుల సత్రం ఈ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకున్నాయి. టీడీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణుల సంక్షేమానికి రూ.216 కోట్లు అదే వైఎస్సార్ సీపీ సర్కారులో రూ.780 కోట్ల లబ్ధి బ్రాహ్మణ కార్పొరేషన్ పథకాలు నవరత్నాలతో భర్తీ అర్చకుల పదవీ విరమణ తొలగించి వంశ పారంపర్య సేవలు రాష్ట్ర బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పీకే రావుతో ‘సాక్షి’ ఇంటర్వ్యూ
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఏపీలో పోలింగ్ శాతం పెరిగింది: ఏపీ సీఈవో
బాబర్ ఆజం అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్గా
పెట్రోల్ బాంబులతో రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
డాక్టర్ కాళ్లు పట్టుకున్నా.. అర్ధరాత్రి రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లా..
ముంబైని ముంచెత్తిన భారీ వర్షం
PBKS: మేనేజ్మెంట్ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?
ఆలస్యం చేయొద్దు.. కదలండి ఓటేయండి.. (ఫొటోలు)
ఓటు వేసిన వైఎస్సార్సీపీ నేతలు (ఫొటోలు)
Elections 2024: పాతబస్తీలో ఉద్రిక్తత
హేమంత్ సోరేన్కు కేజ్రీవాల్ తరహా ఊరట: సుప్రీంను కోరిన కపిల్సిబల్
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement