కలెక్టర్‌ ప్రశాంతికి రెడ్‌క్రాస్‌ పురస్కారం | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌ ప్రశాంతికి రెడ్‌క్రాస్‌ పురస్కారం

May 9 2025 12:13 AM | Updated on May 9 2025 12:13 AM

కలెక్టర్‌ ప్రశాంతికి రెడ్‌క్రాస్‌ పురస్కారం

కలెక్టర్‌ ప్రశాంతికి రెడ్‌క్రాస్‌ పురస్కారం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి రెడ్‌క్రాస్‌ పురస్కారం అందుకున్నారు. ప్రపంచ రెడ్‌క్రాస్‌ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమెకు గవర్నర్‌ ఈ పురస్కారం, ప్రశంసా పత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా పని చేసిన సమయంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ కార్యకలాపాలకు విస్తృత ప్రచారం కల్పించడం, ప్రజాప్రయోజనాల నేపథ్యంలో పలు కార్యక్రమాలు చేపట్టినందుకు గాను ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా రెడ్‌క్రాస్‌ కార్యక్రమాలు, సభ్యత్వ నమోదుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులుగా విద్యార్థులను చేర్పించాలని సూచించారు.

12 నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ

రాజమహేంద్రవరం రూరల్‌: ఈ నెల 12 నుంచి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్‌ సప్లిమెంటరీ పరీక్షలు పక్కాగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) టి.సీతారామమూర్తి అధికారులను ఆదేశించారు. ఈ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్‌లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమన్వయ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఇంటర్మీడియెట్‌ అధికారి ఎన్‌ఎస్‌వీఎల్‌ నరసింహం మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 20,446 మంది విద్యార్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఫస్టియర్‌ విద్యార్థులకు 37, సెకండియర్‌ విద్యార్థులకు 16 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఫస్టియర్‌ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ జరుగుతాయని వివరించారు.

సీనియారిటీ జాబితాపై

అభ్యంతరాల స్వీకరణ

రాజమహేంద్రవరం రూరల్‌: ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాపై అభ్యంతరాలుంటే శుక్రవారంలోగా ఉమ్మడి జిల్లా విద్యా శాఖ కార్యాలయానికి సమర్పించవచ్చని జిల్లా పాఠశాల విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుల (ఆర్‌జేడీ) పరిధిలో ప్రభుత్వ యాజమాన్యంలోని స్కూల్‌ అసిస్టెంట్ల సాధారణ సీనియారిటీ జాబితాను ఉపాధ్యాయ సమాచార వ్యవస్థ ఆధారంగా రూపొందించారని వివరించారు. దీనిపై అభ్యంతరాలకు గత నెల 4 వరకూ గడువు ఇచ్చారని, వ చ్చిన అభ్యంతరాల ప్రకారం జాబితాలు తయా రు చేసి కాకినాడ ఆర్‌జేడీ వెబ్‌సైట్‌ www. rjdsekkd లోను, ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విద్యా శాఖల వెబ్‌సైట్లలోను, నోటీసు బోర్డుల్లోను అందుబాటులో ఉంచారని తెలిపారు. దీనిపై అభ్యంతరం తెలిపే వారు ఆ ఉపాధ్యాయుడి పూర్తి పేరు, పదవి, సంబంధిత వివరాలు, సీనియారిటీ జాబితాలో తప్పిదం ఎక్కడ ఉందో స్పష్టంగా పేర్కొనాలని, అందుకు సంబంధించిన ఆధారాలు లేదా సంబంధిత సాక్ష్యాలు ఉంటే జత చేయాలని సూచించారు. గడువు తర్వాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోరని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement