Archive Page | Sakshi
Sakshi News home page

Palnadu

  • జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్‌ హాల్‌ ప్రారంభం

    నరసరావుపేట రూరల్‌: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్‌ హాల్‌ను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. నూతన హాల్‌లో మొదటి క్రైమ్‌ రివ్యూ సమావేశాన్ని ఐజీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర సమీక్షలు, శాఖాపరమైన అంతర్గత సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహణలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్‌ అరుణ్‌బాబు మాట్లాడుతూ పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా హాల్‌ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన హాల్‌లో ప్రారంభ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

  • క్వారీ అనుమతులు రద్దు చేయాలి

    నరసరావుపేట: బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో భద్రత చర్యలు తీసుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1కోటి నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమవారం క్వారీ ప్రమాద స్థలంతో పాటు నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులకు మించి క్వారీలో లోతులోకి వెళ్లి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే క్వారీ యజమానులు ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు కన్పించట్లేదన్నారు. రెవెన్యూ, కార్మిక శాఖ, మైనింగ్‌ శాఖ పర్యవేక్షణ లోపించడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని అన్నారు.

    డిమాండ్‌ చేసిన పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు

  • ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి

    నరసరావుపేట రూరల్‌: ఎరువుల వాడకం తగ్గించే విధంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్‌డివిజన్‌లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పాల్గొని మాట్లాడారు. రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు రైతులతో సత్ససంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి రైతు వేసిన పంటను నమోదు చేయాలని, పంట వేయకపోతే వేయలేదని కూడా నమోదు చేయాలని తెలిపారు. వీఏఏలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ శివకుమారి మాట్లాడుతూ వివిధ పంటలలో కలుపు నివారణ, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. భూసారం పెంచేందుకు రసాయన ఎరువుల ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చిరొట్ట, పీఎండీఎస్‌లు పైరులు వేసి 45 రోజులకు భూమిలో కలియదున్నాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్‌ సెంటర్‌ కో–ఆర్డినేటర్‌ ఎం.నగేష్‌, జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి ఎం.అరుణ తదితరులు పాల్గొన్నారు.

    జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు

  • అట్టహాసంగా పోలేరమ్మ జాతర

    బాపట్ల అర్బన్‌: బాపట్ల పట్టణంలోని రామకృష్ణాపురంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద మూడోరోజు పోలేరమ్మ కొలుపులు సోమవారం ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిషేక మహోత్సవాన్ని వీక్షించడానికి, అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి దూర ప్రాంతాల్లో నివసించే వారితోపాటు చుట్టూ పక్కల గ్రామ ప్రజలు హాజరయ్యారు. పోలేరమ్మ జాతర మహాలక్ష్మి గుడినిపూలు, విద్యుత్‌ దీపాలతో అలకరించారు. కోలాట ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సుమారు 20 మంది పాటలతో లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నాదెండ్ల రాంబాబు, పేరాల నాగేశ్వరరావు, కొన్నే వెంకటేశ్వర్లు, నామేపల్లి లక్ష్మీనారాయణ, శంఖవరపు రాంబాబు, పెద్ద వెంకట్రావు, చిన్న వెంకటరావు, మణి, శరత్‌, మహేష్‌, వినుకొండ శ్రీను, కొండవీటి శ్రీను,సాంబ, పత్తిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఆకట్టుకున్న పెద్దలు, చిన్నారుల నృత్యాలు

  • ద్విచ

    జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు

    నరసరావుపేట రూరల్‌: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల విలువైన ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌, 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అతి వేగంగా ద్విచక్ర వాహనం నడిపే వారిపై, 18 నుంచి 24 వరకు హెల్మెట్‌ ధరించని వారిపై, 25 నుంచి 31వ తేదీ వరకు బ్లాక్‌ స్పాట్స్‌ వద్ద అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడే ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

    తల్లిపాలు బిడ్డ హక్కు

    ప్రత్తిపాడు: తల్లిపాలు బిడ్డ హక్కు అని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌. జయలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం గుంటూరు రూరల్‌ మండలం ఓబులనాయుడు పాలెం–2 అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.జయలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు శిశువు జీవితానికి రక్షణ అని, ఆరోగ్య భవితకు బలమైన పునాదని చెప్పారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా శారీరక, మానసిక ధృఢత్వం లభిస్తుందన్నారు. తదనంతరం కేంద్రంలో ప్రీస్కూల్‌ నిర్వహణ, రిజిస్టర్లును పరిశీలించారు. సీడీపీవో జి. విజయలక్ష్మి, ఏసీ డీపీవో సీహెచ్‌. విజయనిర్మల, సూపర్‌వైజర్లు ఎం.వీ రత్నం, ఎంఎల్‌హెచ్‌పి మేఘన, ఎంఎస్‌కె బి. సుశీల పాల్గొన్నారు.

    ప్రత్తిపాడు మండలంలో..

    ప్రత్తిపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల స్థాయి అధికారులకు ఐసీడీఎస్‌ సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తహసీల్దార్‌ సుజాత, ఎంఈవో సీహెచ్‌. రమాదేవి, ఈవోపీఆర్డీ షేక్‌ ఆదంషఫీ, ఏవో సుగుణబేగంతో పాటు ఆయా శాఖల అధికారులు తల్లిపాల ఆవశ్యతను వివరించే కరపత్రాలు పోస్టర్లును ఆవిష్కరించారు.

    కౌలు రైతులకు సుఖీభవ వర్తింప చేయాలి

    లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): రాష్ట్రంలో 60 నుండి 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని, వీరికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటే భూ యజమాని సంతకం కావాలనే నిబంధన వల్ల గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారన్నారు.

  • అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా

    నరసరావుపేట రూరల్‌: తమకు జరుగుతున్న అన్యాయంపై, తమ సమస్యలపై ఇప్పటికే పోలీసు పీజీఆర్‌ఎస్‌లో పలుమార్లు అర్జీలు ఇచ్చామని, అయితే వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని పలువురు బాధితులు జిల్లా ఎస్పీతో మొరపెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర 106 సమస్యలపై ఫిర్యాదులు అందాయి.

    పీజీఆర్‌ఎస్‌లో రెండు సార్లు ఫిర్యాదు చేశా..

    నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మా ఇంటిపై దాడి చేసి చంపుతామని అన్నెం శివగోపినాథ్‌ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా శివగోపినాథ్‌, కాకుమాను సుధాకర్‌లు నన్ను దుర్భాషలాడుతూ మేం ఎమ్మెల్యే మనుషులం ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు పెట్టరు మా మాటే వింటారు అంటూ బహిరంగంగా చెబుతున్నారు. ఇంటిపై దాడికి పాల్పడిన సీసీ ఫుటేజ్‌ ఇచ్చినా ఇంతవరకు పోలీసులు పరిశీలించలేదు. కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను.

    – కె.స్నేహరెడ్డి, న్యాయవాది, నరసరావుపేట

    ఎస్పీతో మొరపెట్టుకున్న పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు

  • రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్‌డీఏ కృషి

    బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌

    నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్‌డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్‌ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రెండవ విడతగా పల్నాడు జిల్లాలో సారధ్యం పర్యటనను సోమవారం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పల్నాడు ప్రాంతంలో పొగాకు పండించే రైతుల అభ్యున్నతికి రూ.200 కోట్లతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉదయం వివిధ క్షేత్రాల సమావేశం నిర్వహించి స్టేషన్‌రోడ్డులో ఛాయ్‌పే చర్చ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవిందబాబుతో కలిసి పల్నాడు ప్రాంత సమస్యలపై ప్రజల నుంచి తెలుసుకున్నారు. అనంతరం పల్నాడు రోడ్డులోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల వద్ద నుంచి జమిందార్‌ ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించి ఫంక్షన్‌హాల్‌లో కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా మేధావుల సదస్సులో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు.

    చిన్నారులపై అసభ్య ప్రవర్తన

    వ్యక్తిపై పోక్సో కేసు నమోదు

    తాడేపల్లిరూరల్‌: పెనుమాకలో నివాసం ఉండే ఓ వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులు సోమవారం పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. బుక్కా వీరయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో వున్న 9, 10 సంవత్సరాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ముళ్ల పొదల్లోకి తీసుకువెళుతున్నాడు. ఆదివారం కూడా ఒక బాలికను ఇదేవిధంగా చేయడంతో గమనించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

    బాలికను వేధిస్తున్న యువకుడిపై..

    తెనాలిరూరల్‌: ఇంటర్‌ చదువుతున్న బాలికను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటర్‌ ఫస్టియర్‌ చదువుతోంది. బాలిక కళాశాలకు వెళ్లి వచ్చేటప్పుడు, చినరావూరుకు చెందిన యువకుడు విజయ్‌ వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా వారి సహాయంతో వన్‌ టౌన్‌ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు.

    పీజీ 4వ సెమిస్టర్‌ ఫలితాలు విడుదల

    పెదకాకాని(ఏఎన్‌యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్‌ నెలలో జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్‌ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాద్‌ సోమవారం తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్‌ సైనన్స్‌, ఎంబీఏ హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, హాస్పిటల్‌ మేనేజ్మెంట్‌, ఎంబీఏ టీటీఎం జిల్లా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 13వ తేదీ లోపు ఒక్కొక్క పేపర్‌ కు రూ.1860లు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిరాక్స్‌ కాపీల కోసం రూ.2190లు చెల్లించాలని ఆయన సూచించారు.

  • ముగిసిన రాష్ట్రస్థాయి ఫ్లోర్‌ బాల్‌ పోటీలు

    నరసరావుపేట ఈస్ట్‌: గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–14, అండర్‌–19 బాల బాలికల ఫ్లోర్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో 16 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీల విజేతల వివరాలను పాఠశాల చైర్మన్‌ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.సురేంద్ర ప్రకటించారు. బాలికల అండర్‌–14 విభాగంలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమస్థానం కై వసం చేసుకోగా, శ్రీసత్యసాయి జిల్లా రెండవ స్థానం, కర్నూలు, అనంతపురం జిల్లాలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్‌–19 విభాగంలో తిరుపతి ప్రథమస్థానం సాధించగా, కృష్ణా, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర అండర్‌–14 విభాగంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రథమ స్థానం సాధించగా, పల్నాడు, కర్నూలు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్‌–19 విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తిరుపతి, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

    ● ఫ్లోర్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసఫ్‌ మాట్లాడుతూ, పోటీలో పాల్గొన్న క్రీడాకారుల నుంచి రాష్ట్ర జట్టుకు కొందరు పేర్లు ఎంపిక చేశామన్నారు. తిరిగి వారి ప్రతిభను పరిశీలించి తుది జట్టును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రజట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్‌లో బిహార్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విజేతలకు పాఠశాల చైర్మన్‌ నాతాని, డైరెక్టర్‌ కోమటినేని నాసరయ్య బహుమతులు అందించారు. ఫోర్‌ బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఎం.కిషోర్‌బాబు, పాఠశాల ఇన్‌చార్జి కోట బాపూజీ పాల్గొన్నారు.

  • రాష్ట

    సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి నుంచి ఏడుగురు ఎంపిక య్యారు. యోగాసన స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ పల్నాడు జిల్లా, నేషనల్‌ యోగా స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయిలో యోగాసనాలు పోటీలు నరసరావుపేట సరస్వతి శిశు మందిర్‌ స్కూల్లో ఈ నెల 3న నిర్వహించారు. ఈ పోటీలలో సత్తెనపల్లి శక్తి యోగ యోగా గురువు ఎం. రమేష్‌ సారధ్యంలో సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లికి చెందిన ఎమ్‌ సునీల్‌కుమార్‌, తల్లం ఆంజనేయులు, ధనేకుల సాంబశివరావు, వల్లూరు శ్రీనివాస్‌, పులహరి భానోజి, పులికొండ శ్రీనివాసరావు, మహిళా విభాగంలో డి. కాత్యాయినీ ఏడుగురు గోల్డ్‌ మెడలు, మెరిట్‌ సర్టిఫికెట్స్‌ సాధించటంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సంపాదించారు.

    గూడ్స్‌ రైలు ఢీకొని వృద్ధుడి మృతి

    నరసరావుపేట టౌన్‌: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఇన్‌చార్జి రైల్వే ఎస్‌ఐ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. నరసరావుపేట నుంచి మునుమాక వెళ్లే రైలు మార్గంలో ఆదివారం గుంటూరుకు చెందిన పెండెం సాయిబాబు(65) పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం బంధువులకు అప్పగించారు.

    రెంటచింతలలో చోరీ

    బంగారు ఆభరణాలు..నగదు అపహరణ

    రెంటచింతల: రెంటచింతలలోని రేంజర్‌గారి బజారులో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేంజర్‌గారి బజారులో నివసిస్తున్న జెట్టిపాలెం ఏపీ మెడల్‌ స్కూల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు గెల్లిపోగు జనార్ధనరావు మాచర్ల పట్టణంలో ఉంటున్న తన తల్లి మరియమ్మను చూడటానికి శనివారం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో దాచిన 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాస రావు, ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • పని ఒత్తిడి పెంచిన ఈ ఫోన్‌లు మాకొద్దు

    నరసరావుపేట: ఒక వైపు యాప్‌ల భారం, మరో వైపు సక్రమంగా పనిచేయని ఫోన్లతో అంగన్వాడీలకు పని ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి అన్నారు. సోమవారం యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీల వద్ద ఉన్న ఫోన్‌లను నరసరావుపేట ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ కాంత కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ ఎఫ్‌.ఆర్‌.ఎస్‌ ద్వారా సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన విరమించుకోవాలన్నారు. ఫోన్‌ సక్రమంగా పనిచేయక, సరుకులు నెలలో ఒక్కసారిగా ఇవ్వకపోవడం వంటి కారణాలతో అంగన్వాడీలతో పాటు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మాతా, శిశు సంరక్షణలో అంగన్వాడీల పాత్ర కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని కోరారు. 5జి ఫోన్లు పంపిణీ చేయాలని యూనియన్‌ రాష్ట్ర నాయకులు ప్రభుత్వం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే కానీ ఫోన్లు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. 5 జి ఫోన్లు పంపిణీ చేసి యాప్‌లు క్రమబద్ధీకరించే వరకు రికార్డులలో లబ్ధిదారులచే సంతకాలు చేయించి పోషకాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సమ్మెలు, ధర్నాలు ఏమీ చేయడం లేదని పనిఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రికార్డుల ద్వారా పనిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కవిత, నిర్మల, అంగన్వాడీలు మాధవి, విజయలక్ష్మి, రమణ, కమురూన్‌, హసీనా, ఏలీనా పాల్గొన్నారు.

    సీడీపీఓ కార్యాలయంలో ఫోన్లు అందజేసిన అంగన్‌వాడీ యూనియన్‌ నాయకులు

  • షూటింగ్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

    సత్తెనపల్లి: జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. బాలుర విభాగంలో 80 మంది, బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోనంకి కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

    బాలుర జట్టుకు: కె. వెంకట్‌, జి.నవీన్‌, పి.మోబీన్‌, బి.రిషి, జి.వెంకటేష్‌, షేక్‌.అబ్దుల్‌, ఎం.హఫీజ్‌, ఎం.మహీధర్‌, కె.ప్రవీణ్‌, జి.మాంజి, కె.సుధీర్‌, ఎస్‌.భార్గవ్‌లు ఎంపికయ్యారు.

    బాలికల జట్టుకు : యమ్‌.విజయ పరిమళ, కె.హిమ బిందు, జె.లక్ష్మి కీర్తన, జె.యశస్విని, పి.మేఘన, పి.సుచరిత, ఎం.నందిని, సిహెచ్‌.అక్షర, కె.హర్షిత, టి.సింధు, ఎం.జ్యోతిక, ఎస్‌.మధులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్‌దత్తానాయక్‌, షేక్‌.మెహబూబి, బి.తులసీరామ్‌నాయక్‌, ఎ.చిన్నయ్య, తిరుపతమ్మ, రత్నాకర్‌, యమ్‌.ప్రసన్న, పి.శివరామకృష్ణ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

Eluru

  • యాప్‌

    పాలకోడేరు: సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలనే నిర్ణయంతో సోమవారం విస్సాకోడేరు సీడీపీఓ కార్యాలయం వద్ద సెల్‌ఫోన్‌లను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ సిగ్నల్స్‌ లేక ఫోన్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియచేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో యూనియన్‌ రాష్ట్ర కమిటీ సెల్‌ఫోన్లు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొని పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంగన్‌వాడీలను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

    ఏలూరులో..

    ఏలూరు(టూటౌన్‌): పనిచేయని స్మార్ట్‌ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎస్‌ఆర్‌ స్టేడియం వెనుకవైపున ఉన్న ఐసీడీఎస్‌ ఏలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేయని స్మార్ట్‌ఫోన్ల తో డేటా వివరాలు నమోదు చేయలేకపోతున్నామన్నారు. 5జీ టెక్నాలజీ యాప్‌లతో ఓల్డ్‌ వెర్షన్‌ ఫోన్లో ఎలా అప్‌లోడ్‌ చేయాలన్నారు. ప్రాజెక్ట్‌ యూనియన్‌ అధ్యక్ష కార్యదర్శులు షేక్‌ సమీమా, తలారి రజని మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మాన్యూవల్‌ పద్ధతిలోనే పని చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

    కై కలూరులో..

    కై కలూరు: అంగన్‌వాడీ టీచర్లుకు ఇచ్చిన సెల్‌ ఫోన్లు పనిచేయడం లేదు. పైగా మూడు యాప్‌లలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతోంది అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు కై కలూరులో సెక్టార్‌ ఆఫీసు సూపర్‌వైజర్‌ ప్రసన్న లక్ష్మీకి సోమవారం సెల్‌ఫోన్లు ఇచ్చేశారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో కలపి మొత్తం 311 సెల్‌ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. అంగన్‌వాడీ కార్యకర్తల ప్రాజెక్టు సెక్రటరీ సుజాత మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్‌వాడీ సెంటర్లలో యాప్‌ల గొడవ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు మూడు యాప్‌లు కలపి ఒక యాప్‌గా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై న సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

    సెల్‌ఫోన్లు తిరిగిచ్చేసిన అంగన్‌వాడీ కార్యకర్తలు

  • జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి

    కుక్కునూరు: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన రోజే జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. చిరవెల్లి గ్రామానికి చెందిన యర్నం ప్రదీప్‌, కావేరి దంపతులకు సహస్ర(6), స్నేహిత (3) సంతానం. సహస్రకు గత నెల 31న తీవ్రజ్వరం రావడంతో కుటుంబసభ్యులు భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పాపకు పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్‌లెట్‌లు తగ్గినట్టు చెప్పి చికిత్సను ప్రారంభించారు. శనివారం పాపకు జ్వరం తగ్గకపోగా ప్లేట్‌లెట్‌ల సంఖ్య 15 వేలకు పడిపోయి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్‌ చేశారు. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చిన్నారి మృతి చెందింది.

  • సీహెచ

    పెంటపాడు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు(సీహెచ్‌ఓ)లు నిరాదరణకు గురవుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియమితులైన వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సేవలు అందిస్తున్నా సరైన గౌరవం దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 368 సీహెచ్‌ఓలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్‌ ఆరోగ్య సేవలో భాగంగా వీరికి 2019 నుంచి పోస్టులు మంజూరయ్యాయి. పీహెచ్‌సీల కన్నా మొదట వీరు ప్రాథమికంగా వైద్యనిర్ధారణ చేసి వ్యాధి తీవ్రతను బట్టి కేసులపై అధికారులకు రిఫర్‌ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్‌ ఆరోగ్య సేవలు, ఇంటింటికీ సేవలతో పాటు, అంగన్‌వాడీ ప్రధానంగా గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అయినా వారిని పాలకులు పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ హెల్త్‌ అధికారుల యూనియన్‌ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మే నెలలో ఒక నెల పాటు పలు ప్రాంతాలోల సీహెచ్‌వోలు నిరసనలు తెలిపారు. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి సమస్యలు నేటికీ తీరలేదు.

    ప్రధాన డిమాండ్‌లు

    ● ఆరేళ్లు పూర్తయిన కమ్యూనిటీ హెల్త్‌ అధికారులు (సీహెచ్‌ఓ)లను తక్షణం క్రమబద్ధీకరించాలి.

    ● ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్‌ ఇవ్వాలి.

    ● జీతాలతో పాటు, ఇన్సెంటివ్‌లు అందించాలి.

    ● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్‌ల అద్దెలను సకాలంలో చెల్లించాలి.

    రేషనలైజేషన్‌ పేరుతో కుదింపు చర్యలు

    వీరిని రేషనలైజేషన్‌ పేరుతో కుదించేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీహెచ్‌ఓలు మనోవేదనకు గురౌతున్నారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సీహెచ్‌ఓను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషలైజేషన్‌లో భాగంగా ఏ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారో తెలియడం లేదని చెబుతున్నారు. పేదలకు ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారం. పొరుగురాష్ట్రాల్లో సీహెచ్‌వోల సేవలను అక్కడి పాలకులు గుర్తించారు. మన రాష్ట్రంలో వీరిని పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది.

    సమ్మె చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం

    హామీలు అమలు చేయాలని డిమాండ్‌

    గ్రామంలోనే సేవలు

    ఎంతో దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా గ్రామంలోనే మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించడం లేదు.

    – కె. వెంకట్రావు, అలంపురం

    సకాలంలో వైద్య సేవలు

    108,104 కన్నా రోజు మా గ్రామంలో ఆరోగ్యసేవలు అందిస్తున్న సీహెచ్‌ఓ వల్ల మాకు ఎంతో మేలు కలుగుతోంది. మందులు సకాలంలో అందిస్తున్నారు.

    జయవరపు విజయదుర్గ, అలంపురం

  • విద్య

    భీమవరం: విద్యా సంస్థల్లో స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మరెవరికీ ప్రవేశంలేదంటూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను హరించేలా ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్‌ విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం భీమవరం పట్టణం ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యా కమిషనర్‌ ఇచ్చిన ఉత్తర్వులు మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారని వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులుండవన్నారు. ఉత్తర్వులు ద్వారా ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల వ్యాపారం, అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని గణేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించకపోతే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్‌.లక్ష్మణ్‌, బి.సింధు, సాయికృష్ణ, హేమంత్‌, భాగ్యలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

    ఆంక్షలు విరమించుకోవాలి

    పాలకొల్లు సెంట్రల్‌: ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఏఐఎస్‌ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్‌ చేశారు. సోమవారం స్థానిక ఏఎస్‌ఎన్‌ఎం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద జీవోను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్‌ఎంసి కమిటీ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగంలో గాని విద్యార్థులకు గాని సమస్యలు వస్తే తాము తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఏ పట్టణ అధ్యక్షుడు మేడవాల రాజా, తానేటి రంజిత్‌ కుమార్‌, సిహెచ్‌ గణేష్‌, జి.భానుప్రకాష్‌, టి.మహేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు

  • వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తం

    తణుకు అర్బన్‌: వర్షాకాలంలో విద్యుత్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు వృక్షాలు కూలినప్పుడు, విద్యుత్‌ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు తెగిపడుతున్న విద్యుత్‌ తీగలు తగిలి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గృహాల్లో సైతం తడిచేతులతో స్విచ్‌లు వేయడం, వర్షాలకు స్విచ్‌ బోర్డులు తడిసి విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ కావడం వంటివి చూస్తున్నాం. వర్షాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్‌ శాఖ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వర్షాకాలం మొదలైనా ఇంతవరకు విద్యుత్‌ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.

    వర్షాల సమయంలో

    తీసుకోవాల్సిన జాగ్రత్తలు

    ● భారీ వర్షాల సమయాల్లో గృహోపకరణాల స్విచ్‌లు ఆఫ్‌ చేసి ఉంచాలి.

    ● కరెంటు స్విచ్‌ బోర్డుల్లో స్విచ్‌లను తడి చేతులతో తాకరాదు.

    ● చిన్న పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలి.

    ● ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్‌ కట్‌ అయినా తాకకుండా వెంటనే విద్యుత్‌ శాఖకు తెలియచేయాలి.

    ● విద్యుత్‌ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు.

    ● ఇంటి పరిసరాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో దగ్గరకు వెళ్లకుండా ముందుగా విద్యుత్‌ శాఖకు తెలియచేయాలి.

    ● గృహాల ఆవరణలోని నీళ్ల మోటార్లకు ఉన్న కరెంటు వైర్లను తాకరాదు.

    ● గాలి, వాన సమయాల్లో కరెంటు లైన్ల కింద నిలబడడం, కూర్చోవడం చేయరాదు.

    ● రహదారుల్లో విద్యుత్‌ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే విద్యుత్‌ ప్రవాహం ఉన్నట్లుగా భావించి దూరంగా ఉండాలి.

    ● మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వలన నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి.

    ● విద్యుత్‌ ప్రమాదానికి గురైన వారిని కానీ ఆ విద్యుత్‌ పరికరాన్ని కానీ నేరుగా తాకరాదు.

    ● వర్షాలు పడుతున్న సమయాల్లో రహదారులపై ఉన్న విద్యుత్‌ స్తంభాలను ముట్టుకోరాదు.

    ● విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం టోల్‌ప్రీ 1912 నంబరులో సంప్రదించాలి.

  • క్విజ్‌లో రాష్ట్ర స్థాయికి ఎంపిక

    ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): రెడ్‌ రిబ్బన్‌ క్లబ్‌ క్విజ్‌ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్‌, టీబీ ఆఫీసర్‌ డాక్టర్‌ నరేంద్ర కృష్ణ తెలిపారు. స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ఆదేశానుసారం జిల్లా ఇంటిగ్రేటెడ్‌ స్ట్రాటజిక్‌ హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని జూనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు రెడ్‌ రిబ్బన్‌ క్విజ్‌ జిల్లా వ్యాప్తంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో సోమవారం నిర్వహించారు.

    ఆస్పత్రిలో చికిత్స

    పొందుతూ వ్యక్తి మృతి

    ముసునూరు: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని వేల్పుచర్ల శివారు అన్నపునేనివారిగూడెంకు చెందిన దుక్కిపాటి నాగరాజు (48)కూలి పనులు చేసేవాడు. తరచూ భార్యభర్తలు గొడవలు పడుతున్నారు. ఇటీవల గొడవలు అధికం కావడంతో మనస్తాపానికి గురై ఈ నెల మూడున పురుగుల మందు తాగాడు. బంధువులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.

    బీచ్‌లో యువకుడి గల్లంతు

    నరసాపురం రూరల్‌: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్‌లో సోమవారం సాయంత్రం యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం విజయవాడకు చెందిన బి.తన్వీర్‌ భీమవరంలోని ఓ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన మిత్రులతో కలిసి బీచ్‌కి వచ్చాడు. అలల ఉధృతికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు ఎస్సై జి.వాసు సముద్రతీర ప్రాంతంలో గాలిస్తున్నారు.

    హోటళ్లపై దాడులు

    తణుకు అర్బన్‌: గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన రాయితీ గ్యాస్‌ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తణుకు తహసీల్దార్‌ దండు అశోక్‌వర్మ హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్‌ సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లపై సోమవారం దాడులు నిర్వహించారు. తణుకు పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్‌లపై దాడి చేసి మొత్తం 25 రాయితీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • వివాదాస్పదంగా ఈవో తీరు

    జంగారెడ్డిగూడెం: ఆలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్‌లో ఉన్న రామాలయానికి స్థానిక సుబ్బంపేటలో 33.65 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే ఆ భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు భూమిలో ఉన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఈవో కలగర శ్రీనివాస్‌ తన సిబ్బందితో వెళ్లారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులతో ఆలయ తాళాలు ఇవ్వాలని కోరారు. దీనికి వారు ఆలయంలో తమకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకున్న తరువాత మీకు అప్పగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులతో ఈవో దురుసుగా వ్యవహరిస్తూ మాట్లాడటంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని ఎందుకు అప్పగించరు; వ్యాపారాలు చేసుకుందామనా.. అంటూ ఈవో మాట్లాడటంతో ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. పారిజాతగిరి ఈవోగా వ్యవహరిస్తున్న కలగర శ్రీనివాస్‌ జంగారెడ్డిగూడెం మండలంలోని 25 ఆలయాలకు ఇన్‌చార్జిగా వ్యవమరిస్తున్నారు. పలు ఆలయాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రేడ్‌–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్‌–2 అధికారికి ఎలా బాధ్యతలు అప్పగించారో ఉన్నతాధికారులే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. గ్రేడ్‌–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్‌–2 అధికారి ఈవోగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈవో శ్రీనివాస్‌ దేవదాయ శాఖలో చేరిన సంవత్సరం, ఎస్‌ఆర్‌లో నమోదు చేసిన సంవత్సరంలో కూడా తేడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయం స్వాధీనానికి వెళ్లగా.. దానిని ప్రైవేట్‌ వ్యక్తులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నానని, దాని వల్లే తనను అల్లరి చేస్తున్నారని ఈవో కలగర శ్రీనివాస్‌ తెలిపారు.

  • లైంగిక వేధింపుల నుంచి రక్షణకు కృషిచేయాలి

    భీమడోలు: లైంగిక వేఽధింపుల నుంచి మహిళళల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్‌ అన్నారు. భీమడోలు మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సును నిర్వహించారు. కె.రత్నప్రసాద్‌ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక, శాశ్వత పరిహారాన్ని అందిస్తాయన్నారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సీహెచ్‌ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, అలా చేసే వారిని చట్టం తీవ్రంగా శిక్షిస్తుందన్నారు. మహిళలకు అనేక చట్టాలున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రక్షణ పొందుతారన్నారు. పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి కళాశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు.

  • స్మార

    ఏలూరు (టూటౌన్‌): నాడు స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే పగులకొట్టింది అని పిలుపునిచ్చిన కూటమి నాయ కులు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్‌ మీటర్లను బిగిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఒకలా, అధికారం చేపట్టాక మరోలా వ్యవహరించడం కూటమి నాయకులకే చెల్లిందంటూ ప్రజలు దుయ్యబడుతున్నారు. ట్రూఅప్‌ చార్జీల పేరుతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రూ.15,485 కోట్ల అదనపు భారాలు మోపి వినియోగదారుల నడ్డి విరిచారని గుర్తుచేస్తున్నారు. తాజాగా అదానీ లాంటి కార్పొరేట్‌ వ్యక్తులకు మేలు చేసేందుకు స్మార్ట్‌ మీటర్లను బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక పేరుతో కొన్ని రోజులుగా స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి కొనసాగింపుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ భవన్‌ వద్ద, జిల్లాలోని వివిధ సబ్‌ స్టేషన్ల వద్ద స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నాలకు పిలుపునిచ్చారు.

    పెద్ద ఎత్తున సంతకాల సేకరణ

    స్మార్ట్‌ మీటర్లను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు.

    కూటమి నమ్మక ద్రోహం

    గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్‌ మీటర్లు పగులకొట్టండని లోకేష్‌ పిలుపు కూడా ఇచ్చారు. గద్దెనెక్కిన కూటమి నాయకులు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఏడాది కాలంలో కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్మార్ట్‌ మీటర్ల అంశం తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరులో జిల్లా విద్యుత్‌ భవనం, జిల్లాలోని విద్యుత్‌ సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాకు ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

    మీటర్‌ రీడర్లపై కత్తి

    స్మార్ట్‌ మీటర్లతో విద్యుత్‌ మీటర్‌ రీడర్లు ఉపాధిని కోల్పోనున్నారు. ఏలూరు జిల్లాలో 460 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది రోడ్డున పడనున్నారు.

    సర్దుపోటు రూ.15,485 కోట్లు

    ట్రూఅప్‌ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపింది. దీంతో పెరిగిన విద్యుత్‌ బిల్లులతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.

    మరింత దోపిడీకి..

    రాష్ట్రంలోని కూటమి సర్కార్‌ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకే స్మార్ట్‌ మీటర్ల బిగింపును తెరమీదకు తీసుకువచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీతో ఒప్పందం చేసుకుని ‘స్మార్ట్‌’గా ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్‌ మీటర్లతో బిల్లులు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

    తక్షణం రద్దు చేయాలి

    ప్రజలపై మరింత భారాలు మోపేలా ఉన్న స్మార్ట్‌ మీటర్ల బిగింపును తక్షణం రద్దు చేయాలి. పేదల పొట్ట గొట్టి పెద్దలకు పెట్టినట్టు అదానీ లాంటి కార్పొరేట్‌ శక్తులకు అప్పనంగా దోచి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యత్‌ స్మార్ట్‌ మీటర్లను తెరమీదకు తీసుకురావడం దారుణం.

    – డీఎన్‌వీడీ ప్రసాద్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా కమిటీ

    ప్రజలను మోసగిస్తున్నారు

    కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించింది. ఎన్నికలకు ముందు స్మార్ట్‌ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్‌ మీటర్లను నిస్సిగ్గుగా బిగించేస్తున్నారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. ప్రతిఒక్కరూ స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకించాలి.

    – బండి వెంకటేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా కమిటీ

    ప్రజలపై విద్యుత్‌ భారాలు

    స్మార్ట్‌ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలి. ఎటువంటి చార్జీలు పెంచబోమని, అదనపు భారాలు మోపబోమని నమ్మబలికిన కూటమి నాయకులు తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఎడాపెడా విద్యుత్‌ భారాలు మోపడం దుర్మార్గం.

    – బద్దా వెంకట్రావు, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు

    సామాన్యులకు షాక్‌

    స్మార్ట్‌ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు

    ఉపాధి కోల్పోతామంటున్న మీటర్‌ రీడర్లు

    కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్‌ భారాలు

    నేడు జిల్లా విద్యుత్‌ భవన్‌,సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలకు పిలుపు

  • టీడీప
    యాప్‌లతో వేగలేం
    పనిచేయని స్మార్ట్‌ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్‌వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్‌ కార్యాలయాల్లో సెల్‌ఫోన్లను అప్పగించారు. 8లో u

    ఆంక్షలపై నిరసన

    పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 8లో u

    మంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025

    సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్‌మోడల్‌ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్‌ హాట్‌టాపిక్‌గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్‌ ఆపరేషన్‌తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్‌ టీడీపీ రగడ హాట్‌ హాట్‌గా మారింది.

    జనసేన భవితవ్యం గందరగోళం

    జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్‌తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్‌మోడల్‌గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్‌చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్‌ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్‌ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్‌ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్‌ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్‌ చేస్తున్నా టీడీపీ లైట్‌గా తీసుకుంది.

    టీడీపీ ట్రాప్‌లో కరాటం

    మరోవైపు టీడీపీ ట్రాప్‌లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్‌ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కా ర్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్‌ చైర్మన్‌, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్‌ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్‌ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసే లా విజయవంతంగా మైండ్‌ గేమ్‌ నడిపింది.

    న్యూస్‌రీల్‌

    రగులుతున్న జన సైనికులు

    పోలవరం ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిన టీడీపీ శ్రేణులు

    ఉద్దేశ పూర్వకంగానే ఆడియో లీక్‌ చేశారని అభియోగం

    ముదురుతున్న జనసేన వర్సెస్‌ టీడీపీ రగడ

  • కూటమి పాలనలో రైతులకు కష్టాలు

    ఏలూరు(మెట్రో): కూటమి పాలనలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల కన్వీనర్లు మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, కంభం విజయరాజు అన్నారు. రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు కలెక్టర్‌ కె.వెట్రి సెల్వికి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేయకపోగా రైతులను కష్టాలు పాలుజేశారన్నారు. రైతులకు పెట్టుబడి సా యం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్‌ 2024 నుంచి ఈ హామీ అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వా ల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, అలాగే పథకం నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారని మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేక రైతులు అప్పులపాలవుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చారని, గ్రామస్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు.

    ఎరువు.. బరువు : రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వి మర్శించారు. ముఖ్యంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారన్నారు. పొటాష్‌ కలిసిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ప్రైవేట్‌ వ్యాపారులు యూరియా బస్తాపై రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, యూరియా కొ రతను నివారించాలని, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచి రైతులకు పంపిణీ చే యాలని డిమాండ్‌ చేశారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది రైతు భరోసా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అన్నింటా అండగా నిలిచామని చెప్పారు.

    ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్‌బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహన్‌రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ కార్యదర్శి ఇమానైల్‌ జైకర్‌, రాష్ట్ర గ్రీవెన్స్‌ సెల్‌ సంయుక్త కార్యదర్శి బసవ లింగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి ఎం.జాన్‌ గురునాథం, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షు డు నెరుసు చిరంజీవి, జిల్లా గ్రీవెన్స్‌ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, జిల్లా వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు షేక్‌ షమీం, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు స్టాలిన్‌, కార్పొరేటర్లు డింపుల్‌ జాబ్‌ రిషి, ఏలూరు నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్‌, గ్రీవెన్స్‌ అధ్యక్షుడు మద్దాల ఫణి, జిల్లా స్టూడెంట్‌ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్‌, కన్స్యూమర్‌ జిల్లా కార్యదర్శి టి.తులసి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

    యూరియాతో సహా ఎరువుల కొరత

    పూర్తిగా అందని పెట్టుబడి సాయం

    కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ నాయకుల

  • శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
    ఏలూరులో మహిళలపై దాడి ఘటనలో కేసుల నమోదు

    ఏలూరు టౌన్‌: ఏలూరులో ఆదివారం రాత్రి మహిళలపై దాడి చేసిన ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌ సీరియస్‌ అయ్యారు. శాంతిభద్రతల కు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే స హించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో సోమ వారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్‌ పరిధిలో మరడాని రంగారావు కాలనీ, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన కాటూరి నిర్మల కుమారుడు లక్కీ అనే యువకుడు తల్లికి టిఫిన్‌ తెచ్చేందుకు మోటారు సైకిల్‌పై బయల్దేరాడు. అతడు వీఎస్‌ఆర్‌ గ్రాండ్‌ సిటీ వద్దకు చేరుకునేసరికి పల్లెపు సాయికుమార్‌, తురక మురళి, గుంజే జాన్‌ అనే ముగ్గురు వ్యక్తులు.. మోటారు సైకిల్‌ వేగంగా ఎందుకు నడుపుతున్నావంటూ నిలదీశారు. ఈ విషయంలో వారితో వాగ్వివాదం చోటుచేసుకోగా, లక్కీని కొట్టారని బాధితులు చెబుతున్నారు. అనంతరం మరోసారి ఈ ముగ్గురితో పాటు నిడిగట్టి నాగరాజు, బత్తుల దుర్గారావు, మరికొంతమంది కాటూరి లక్కీ ఇంటి వద్దకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగగా కొట్టుకున్నారని, ఆ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ రెండు వర్గాలపై ఏలూరు రూరల్‌ పో లీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశా మని డీఎస్పీ వివరించారు. ఈ రెండు వర్గాల వారికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వల్ప వివాదం నేపథ్యంలోనే గొడవ జరిగిందని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

    మహిళల దుస్తులు చించేస్తూ.. భయోత్పాతం

    బాధితురాలు కాటూరి నిర్మల సోమవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ తన కుమారుడు లక్కీని ముగ్గురు కలిసి కొట్టారని, లక్కీ ఇంటికి రాగా మరో 15 మంది వ్యక్తులు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కొ ట్టారని, ఇదే సమయంలో మరో 50 మందిని పిలిపించుకుని తమ ఇళ్లపై దాడులు చేస్తూ భయో త్పాతం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు చించేస్తూ ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. దీనిపై ఏలూరు రూరల్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ ఏలూరు చిరంజీవి బస్టాండ్‌ వద్ద ఆందోళన చేశామని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించామన్నారు.

  • ప్రొటోకాల్‌ పాటించడం లేదని ఫిర్యాదు

    భీమవరం(ప్రకాశం చౌక్‌): యలమంచిలి మండల పరిధిలో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి సోమవారం ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో జరుగుతున్న శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు తనకు, వైఎస్సార్‌సీపీ చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆహ్వానం గాని, ప్రొటోకాల్‌ పరంగా గౌరవం గానీ ఇవ్వడం లేదన్నారు. ఇలా అనుమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మండలంలో తీర్మానాలు చేసిన వర్క్‌లకు ఆర్డర్స్‌ ఇవ్వకుండా, మండలాన్ని అభివృద్ధి చేయకుండా అధికారులు అలసత్వాన్ని వీడి, ప్రొటోకాల్‌ ద్వారా మండ ల అభివృద్ధికి తోడ్పడేలే చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేయడంతో పాటు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌, పార్లమెంట్‌ ఇన్‌చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, స ర్పంచుల చాంబర్‌ అధ్యక్షుడు కవురు గోపి పాల్గొన్నారు.

    ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి

    భీమవరం (ప్రకాశంచౌక్‌): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్‌చార్జి కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో సోమవారం ప్రాన్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ రైడింగ్‌ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు.

East Godavari

  • ఆటోను

    విద్యార్థులు, డ్రైవర్‌ సహా 11 మందికి గాయాలు

    తుని రూరల్‌: తుని మండలం హంసవరం సమీపంలో పాదాలమ్మతల్లి గుడి మలుపులో విద్యార్థులతో వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది విద్యార్థులు సహా ఆటో డ్రైవర్‌, మరో ప్రయాణికురాలు స్వల్పంగా గాయపడ్డారు. విషయం తెలియడంతో ఏపీ మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు కె.కోటేశ్వరరావు, వి.గోపాలకృష్ణ, వరప్రసాద్‌, రమేష్‌బాబు, ఆశ సంఘటన స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను తుని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తుని మండలం మరువాడకు చెందిన విద్యార్థులు హంసవరంలో ఉన్న ఏపీ మోడల్‌ స్కూల్‌కు ఆటోలో వస్తున్నారు. మార్గం మధ్యలో మరో ప్రయాణికురాలిని డ్రైవర్‌ ఆటో ఎక్కించుకున్నాడు. హంసవరం పాదాలమ్మతల్లి గుడి వద్ద మలుపు తిరుగుతున్న ఆటోను వెనుక కారు ఢీకొంది. దీంతో ఆటో బోల్తా పడింది. కారు సహా డ్రైవర్‌ పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను ఉపాధ్యాయులు ఆస్పత్రికి తరలించారు. ఇద్దరికి మినహా మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స అనంతరం విద్యార్థులను వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

  • విద్యుదాఘాతంతో  ఎలక్ట్రీషియన్‌ మృతి

    పెరవలి: కానూరు అగ్రహారం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ పల్లా దానయ్య(42) సోమవారం విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు, కేబుల్‌ వైర్‌ లాగటానికి విద్యుత్‌ స్తంభం ఎక్కిన అతడు విద్యుదాఘాతానికి గురై, స్తంభం పైనే చనిపోయాడు. స్తంభం ఎక్కినప్పుడు వైర్లు తగలడంతో అలాగే ఉండిపోయాడు. విద్యుత్‌ సరఫరా నిలిపివేశాక మృతదేహం కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, దానయ్యకు భార్య ధనలక్ష్మి, కుమారులు రామసతీష్‌, గోపి సంతోష్‌ ఉన్నారు. భార్య ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్టు ఎసై ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు.

  • ఆయన న

    విద్యార్థుల ఆకలి తీరుస్తున్న బంగారు

    చిన్న శోభనాద్రి సత్రం

    రెండు పూటలా విద్యార్థులకు భోజన

    సదుపాయం

    నిరుపేద వర్గాలకు ప్రాధాన్యం

    ప్రతి శనివారం ఉచిత హోమియో

    వైద్య శిబిరం

    వందేళ్లు దాటిన దాతృత్వపు చరిత్ర

    బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): అలనాడు బాటసారుల కోసం ఏర్పాటు చేసిన సత్రం నేడు నిరుపేద విద్యార్థుల ఆకలి తీరుస్తోంది. కాకినాడ పెద్ద మార్కెట్‌ వద్దనున్న బంగారు చినశోభనాద్రి సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడ వచ్చి ఉంటున్న నిరుపేదల విద్యార్థులకు ఉదయం, సాయంత్రం రుచికరమైన భోజనం ఈ సత్రంలో అందిస్తున్నారు. గతంలో ఈ సత్రంలో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన వారికి ఉచితంగా వసతి కల్పించేవారు. వారి సంఖ్య తగ్గిపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 30 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉచిత భోజనం అందిస్తున్నారు. గతంలో వివిధ హోటళ్ల పాస్‌లను విద్యార్థులకు అందించేవారు. హోటళ్ల భోజనం సక్రమంగా ఉండకపోవడంతో దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు 2017 సత్రం ఆవరణలో అన్నదాన భవనం నిర్మించారు. ఇక్కడ సిబ్బందిని నియమించి భోజన వసతి కల్పిస్తున్నారు. కాకినాడ నగరంలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రాధాన్యమిస్తూ, వారి మెరిట్‌, నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.

    సమాజ సేవలు

    ప్రస్తుతం విద్యార్థులకు ఉచిత భోజనంతో పాటు, సత్రం ఆవరణలో ప్రతి శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రతి శనివారం 120 నుంచి 150 మంది రోగులు ఇక్కడ వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్నారు. ప్రతి వేసవిలో ఇక్కడ ఉచిత మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నారు.

    నేటి నుంచి భోజనం

    సత్రంలో మంగళవారం నుంచి విద్యార్థులకు భోజన వసతి కల్పించేందుకు సత్రం ఈవో విజయభాస్కర్‌ రెడ్డి ఆధ్వర్యంలో దరఖాస్తులను ఆహ్వానించారు. ఇప్పటి వరకు 90కి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నగరంలో ఏ కళాశాలలో చదువుతున్నారో ధ్రువీకరణ సత్రం, నిరుపేద కుటుంబాలు వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం జత చేసి, సత్రం కార్యాలయంలో దరఖాస్తు అందించాలి. అధికారులు వాటిని పరిశీలించి భోజన వసతి కల్పిస్తారు. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి కళాశాలలు మూసివేసే వరకూ ఉదయం, సాయంత్రం విద్యార్థులకు భోజన వసతి కల్పిస్తున్నారు.

    అర్హులైన విద్యార్థులందరికీ

    భోజన వసతి

    దాత ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ పేద విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పిస్తున్నాం. నిరుపేదలకు ఉచిత వైద్య సదుపాయం కూడా కల్పిస్తున్నాం. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నాం. నిరుపేద విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఇస్తాం. అర్హులైన విద్యార్థులంతా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి ఏటా 150 మంది విద్యార్థులకు తక్కువ కాకుండా ఇక్కడ భోజన వసతి కల్పిస్తున్నాం. మంగళవారం నుంచి భోజన సదుపాయం ప్రారంభం కానుంది. విద్యార్థులు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి.

    – చింతపల్లి విజయభాస్కర్‌ రెడ్డి, ఈవో,

    బంగారు చిన శోభనాద్రి సత్రం

    101 ఏళ్ల చరిత్ర

    ఈ సత్రానికి 101 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సత్రాన్ని 1924లో బంగారు చినశోభనాద్రి నెలకొల్పారు. ఈ సత్రం కోసం ఆయన 65 ఎకరాల వ్యవసాయ భూమి, 2,800 చదరపు గజాల స్థలాన్ని ఈ సత్రానికి దానం చేశారు. అప్పట్లో దూర ప్రాంతాల నుంచి కాకినాడకు వచ్చిన రోగులకు, వ్యాపారుకు ఇక్కడ ఎటువంటి సదుపాయాలు ఉండేవి కావు. దీంతో శోభనాద్రి ఇక్కడ ఈ సత్రం ఏర్పాటు చేసి, వారికి ఆసరాగా నిలిచారు. వ్యవసాయ భూములు, దుకాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సత్రం నిర్వహణకు వినియోగిస్తున్నారు.

    ఇతర జిల్లాల విద్యార్థులకు ప్రాధాన్యం

    కాకినాడలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకుంటున్న శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాలకు చెందిన విద్యార్థులకు ఎక్కువగా ఇక్కడ భోజన సదుపాయం కల్పిస్తున్నారు. విద్యార్థుల ఆదాయ ధ్రువీకరణ పత్రం ఆధారంగా వారికి సత్రంలో భోజనం అందిస్తున్నారు.

  • విషాదంలో సీతారామ కాలనీ

    పోలీసుల అదుపులో నిందితుడు?

    సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా గుర్తింపు

    సామర్లకోట: తల్లి, ఇద్దరు పిల్లల హత్య ఘటనతో పట్టణంలోని సీతారామ కాలనీలో సామవారం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కూలీ పనులు చేసుకునే వారితో, పిల్లలు, పెద్దల అరుపులు, కేకలతో సీతారామ కాలనీ నిత్యం సందడిగా ఉంటుంది. ఇదే కాలనీలో నివసిస్తున్న ములపర్తి ధనుప్రసాద్‌ భార్య మాధురి(30), కుమార్తెలు పుష్పకుమారి(8), జెస్సీలోన(6)ను హత్యకు గురైన విషయం విదితమే. తొలుత ధనుప్రసాద్‌పై అనుమానంతో పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి పోలీసులు వివరాలు సేకరించారు. తన భార్య వద్ద ఉండాల్సిన బంగారు ఉంగరాలు, సెల్‌ఫోన్లు కనిపించలేదని అతడు పోలీసులకు తెలిపాడు. శనివారం రాత్రి ధనుప్రసాద్‌ ఏడీబీ రోడ్డు పనుల కాంట్రాక్టర్‌ వద్ద ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసును వేగంగా ఛేదించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేయడంతో.. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడ్డారు. కాగా ధనుప్రసాద్‌ సమాచారం మేరకు మాధురి సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితుడిని ప్రకాశం జిల్లా కనిగిరిలో గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. స్థానిక కోటపేటకు చెందిన తలే సురేష్‌ అనే వ్యక్తి మాధురిని, పిల్లలను హతమార్చినట్టు పోలీసుల విచారణలో వెలుగు చూసినట్టు సమాచారం. మరో వ్యక్తితో కూడా మాధురి వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు తెలుసుకున్న ప్రియుడు సురేష్‌.. ఆమెతో శనివారం రాత్రి ఘర్షణకు దిగినట్టు తెలిసింది. ఆ సమయంలో పిల్లలిద్దరూ నిద్ర లేచి వచ్చారు. ఘర్షణ సమయంలో మాధురి అందుబాటులో ఉన్న కర్రతో సురేష్‌ను కొట్టినట్టు తెలిసింది. అదే కర్రను అందిపుచ్చుకుని అతడు మాధురితో పాటు, పిల్లల తలపై బలంగా కొట్టి హతమార్చినట్టు సమాచారం. సురేష్‌ సొంత లారీపై డ్రైవర్‌గా పని చేస్తూ, తన సంపాదనతో ప్రియురాలికి కోరినవన్నీ కొనిపెడుతుండగా, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని, ఇది వద్దని చెప్పినా వినకపోవడంతోనే సురేష్‌ ఈ హత్యలకు పాల్పడినట్టు తెలుస్తోంది. భార్యాబిడ్డలు హత్యకు గురి కావడంతో ధనుప్రసాద్‌ సోమవారం స్పృహతప్పి పడిపోయాడు. అతడిని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో సీతారామ కాలనీ విషాదంలో మునిగిపోయింది.

  • అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్‌

    మహబూబాబాద్‌ రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్‌ చేసినట్టు మహబూబాబాద్‌ డీఎస్పీ ఎన్‌.తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం మహబూబాబాద్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. టౌన్‌ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి నర్సంపేట బైపాస్‌లో వాహనాల తనిఖీ చేస్తుండగా, బైక్‌పై ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తారసపడ్డాడు. పోలీసులు ఆపగా, పారిపోయేందుకు యత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం ఎస్సీ పేట దేవీచౌక్‌కు చెందిన గొర్రెల చిన్నబాబుగా గుర్తించారు. గత మే 31న డోర్నకల్‌లో ఓ బైక్‌, మహబూబాబాద్‌లోని రామచంద్రాపురంలో 4.5 గ్రాముల బంగారం, 8 గ్రాముల వెండి ఆభరణాలు, ఆర్టీసీ కాలనీలో 4 గ్రాముల వెండి ఆభరణాలను అతడు తస్కరించాడు. చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సంపేట, కోదాడ పట్టణాల్లో కూడా రెండు చోరీలకు పాల్పడినట్టు అతడు అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

  • ముగిసిన ఆలిండియా చదరంగం పోటీలు

    ప్రకాశం నగర్‌ (రాజమహేంద్రవరం): ఆలిండియా ఇండిపెండెన్స్‌ డే కప్‌ చదరంగం పోటీలు రాజమహేంద్రవరంలో విజయవంతంగా ముగిశాయి. ఈ జాతీయ స్థాయి పోటీలను స్థానిక లారెల్‌ హై గ్లోబల్‌ స్కూల్‌లో క్యాల్ఫ్యూషన్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ చెస్‌ అసోసియేషన్‌ సౌజన్యంతో నిర్వహించారు.

    309 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు టోర్నమెంట్‌ డైరెక్టర్‌ విత్తనాల హైమావతి సోమవారం తెలిపారు. విజేతగా రాఘవ శ్రీవాత్సవ్‌ (హైదరాబాద్‌), రన్నరప్‌గా జ్ఞానసాయి సంతోష్‌(కాకినాడ), మూడో స్థానంలో దివ్యతేజ (కాకినాడ) నిలిచారు. ఏడు రౌండ్ల పోటీలను స్విస్‌ పద్ధతిలో జరిగాయి. రాఘవ శ్రీవాత్సవ్‌ చాంపియన్‌షిప్‌ ట్రోఫీతో రూ.25 వేల నగదు, జ్ఞానసాయి సంతోష్‌ రూ.10 వేలు, దివ్యతేజ రూ.5 వేల నగదు బహుమతులను అందుకున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ చెస్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ వై.సుమన్‌,, స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఏక్తా, టోర్నమెంట్‌ కన్వీనర్‌ పూర్ణచంద్ర శర్మ, విత్తనాలు కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

  • రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు సందీప్‌ ఎంపిక

    పి.గన్నవరం: రామచంద్రపురంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థి కలిగితి సందీప్‌ బాలుర అండర్‌–16 లాంగ్‌ జంప్‌లో ప్రథమ, 60 మీటర్ల రన్నింగ్‌లో ద్వితీయ స్థానాలు సాధించాడు. దీంతో అతడిని ఈ నెల 9, 10, 11 తేదీల్లో బాపట్ల జిల్లా చీరాలలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు హెచ్‌ఎం కె.ఉమాదేవి తెలిపారు. ఆమెతో పాటు, వ్యాయామ ఉపాధ్యాయులు ఎం.దుర్గాప్రసాద్‌, కె.భీమేంద్ర తదితరులు సందీప్‌ను అభినందించారు.

    రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక

    మలికిపురం: రామచంద్రపురంలో ఎస్‌కేపీజీఎన్‌ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్‌ పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి వివిధ స్కూళ్లకు చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపికయ్యారు. కేశనపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు 200 మీటర్ల రన్నింగ్‌లో ఎస్‌.సత్యసాయికృష్ణ, ప్రథమ, పి.అభిలాష్‌ తృతీయ, లాంగ్‌ జంప్‌లో ఎస్‌.సత్యసాయి కృష్ణ ద్వితీయ, పి.అభిలాష్‌ తృతీయ స్థానంలో నిలిచారు. సత్యసాయికృష్ణ రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. అలాగే బట్టేలంక ఉన్నత పాఠశాల విద్యార్థులు కె.మోహన్‌, ఎ.గీతిక, జి.భార్గవి, పి.జ్యోతి, కె.ప్రసన్న, కె.శ్రీరామ్‌ వివిధ క్రీడాంశాల్లో ఎంపికయ్యారు.

    అంబాజీపేట: రాష్ట్ర స్థాయి అథ్లెటిక్‌ పోటీలకు స్థాని జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కె.లక్ష్మీ ప్రసన్న, డి.దోనేశ్వర్‌ వంద మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌లో ప్రథమ స్థానాల్లో నిలిచారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

  • మాణిక్యాంబ అమ్మవారికి బంగారు చీర సమర్పణ

    రామచంద్రపురం రూరల్‌: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అమ్మవారికి మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బంగారపు పూత ఉన్న కవచాన్ని సమర్పించారు. ముందుగా ఆలయంలో నంది మండపం వద్ద వేణు సతీమణి వరలక్ష్మి, కుమారుడు నరేన్‌, కోడలు స్రవంతి, మనుమలు సునిధి, విరాజ్‌తో కలసి సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలతో ప్రదక్షిణలు నిర్వహించి అమ్మవారికి బంగారపు చీరను సమర్పించగా, అర్చకులు అమ్మవారిని అలంకరించారు. ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని, శ్రీరాజరాజేశ్వరి పీఠాధిపతి తాళ్ల సాంబశివరావు గురూజీ, రామచంద్రపురం జెడ్పీటీసీ సభ్యుడు మేర్నీడి వెంకటేశ్వరరావు, ఎంపీపీ అంబటి భవాని, వైస్‌ ఎంపీపీలు నరాల రాజ్యలక్ష్మి, శాకా బాబీ, సర్పంచ్‌లు యల్లమిల్లి సతీష్‌కుమారి, అనిశెట్టి రామకృష్ణ, పెమ్మిరెడ్డి దొరబాబు, కట్టా గోవిందు, అంబటి తుకారం, ఎంపీటీసీ సభ్యురాలు తుమ్మూరి సుబ్బలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.

  • కువైట్‌లో మగ్గిపోతున్నా..  స్వదేశానికి తీసుకెళ్లండి

    కోనసీమ మహిళ వేడుకోలు

    కొత్తపేట: కుటుంబ పోషణ కోసం విదేశానికి వెళ్తే, అక్కడ నిర్బంధించారని, పాలకులు దయతలచి స్వదేశానికి తీసుకువెళ్లాలని ఓ మహిళ వేడుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామానికి చెందిన గుమ్మడి ధనలక్ష్మి ఈ వీడియో విడుదల చేసింది. దీనికి సంబంధించి వీడియో, ఆమె అక్క కుమారుడు కొత్తపేట మండలం బిల్లకుర్రు శివారు చిక్కాలవారిపేటకు చెందిన చిక్కాల రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధనలక్ష్మి పుట్టిల్లు బిళ్లకుర్రు శివారు చిక్కాలవారిపేట కాగా, అత్తవారిల్లు ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామం. సుమారు 16 ఏళ్ల క్రితం గుమ్మడి రాంబాబుతో వివాహమైంది. భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వారి ఇద్దరు కుమారులు బీటెక్‌, ఇంటర్మీడియెట్‌ చదువుతున్నారు. ఇలాఉండగా విదేశంలో కొన్నేళ్లు ఉపాధికి వెళితే కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ధనలక్ష్మి ఆశించింది. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రితం కువైట్‌లోని ఓ షేక్‌ ఇంట్లో పనికి కుదిరింది. రెండేళ్ల అనంతరం స్వదేశంలో భర్త, పిల్లలను చూసివస్తానని అడిగితే, అక్కడి వారు జాప్యం చేస్తూ వచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం తాను వెళ్లిపోతానని పట్టుబడితే ధనలక్ష్మిని ఇంట్లో నిర్బంధించారు. తిండి కూడా పెట్టలేదు. ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుని ఇండియన్‌ ఎంబసీకి చేరింది. కాగా ఆమె వాచ్‌ దొంగిలించి పారిపోయిందని షేక్‌ కేసు పెట్టడంతో, ప్రస్తుతం అక్కడే మగ్గుతోంది. ఈ నేపథ్యంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావును ఉద్దేశించి తన దుస్థితిని వీడియో ద్వారా వెళ్లబోసుకుంది. ఆమె భర్త రాంబాబు, కుమారులు, బంధువులు అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాథుర్‌, కలెక్టర్‌ ఆర్‌ మహేష్‌కుమార్‌ను కలిశారు. కువైట్‌లో మగ్గిపోతున్న ధనలక్ష్మిని ఇక్కడకు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్టు రాజేష్‌ తెలిపారు.

National

  • పట్నా: బిహార్‌లో ఓటరు జాబితా ముసాయిదాపై వివాదం నేపథ్యంలో ఆర్జేడీ నేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్‌పై పట్నాలో కేసు నమోదైంది. ఓటరు గుర్తింపు కార్డులు రెండింటిని కలిగి ఉన్న తేజస్వీ యాదవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ లాయర్‌ రాజీవ్‌ రంజన్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

     మీడియా సమావేశంలో ప్రదర్శించిన ఓటరు గుర్తింపు కార్డు, అధికారికంగా అందజేసింది కాదని దానిపై విచారణ జరిపేందుకు తమకు అందజేయాలంటూ పట్నాలోని ఎలక్టోరల్‌ రిజి్రస్టేషన్‌ అధికారి ఆదివారం తేజస్వీని కోరడం తెల్సిందే. ఈసీకి వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసిన తేజస్వీ యాదవ్‌పై చట్టపరంగా ముందుకెళతామని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Chittoor

  • అమ్మ పాలే బిడ్డకు అమృతం
    ● 7 వరకు జిల్లాలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ● అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

    చిత్తూరు కలెక్టరేట్‌ : తల్లిపాల ప్రాముఖ్యతపై ఐసీడీఎస్‌, ఇతర అధికారులు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు అంతర్జాతీయ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా పుట్టిన బిడ్డకు ఎలా పాలను పట్టించాలనే విషయమై వైద్య బాలింతలకు సూచనలిస్తున్నారు. తల్లిపాల ఆవశ్యకతను తెలియజేస్తున్నారు. ముర్రుపాలను బిడ్డకు పట్టిస్తే వ్యాధినిరోధక శక్తి పెరిగి భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయని అవగాహన కల్పిస్తున్నారు.

    తల్లి పాలు బాగా రావాలంటే!

    మహిళ గర్భందాల్చినప్పటి నుంచి పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా ఆకుకూరలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను ఆహారంలో చేర్చుకోవాలని, అతిగా స్వీట్లను తినరాదని చెబుతున్నారు. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదని, పాలిచ్చే సమయంలో కేఫీ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానియాలు తీసుకోకూడదని పేర్కొంటున్నారు.

    ముర్రుపాలలో రోగ నిరోధక శక్తి అధికం

    ముర్రుపాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది అవగాహన లేక బిడ్డకు ముర్రుపాలను తాగించడంలో నిర్లక్ష్యం వహిస్తారు. ఈ పాలలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే గుణం ఉంటుంది. సమతుల్యమైన పోషకాహార పదార్థాలు ఉంటాయి. చాలా రకాల వ్యాధులు రాకుండా తల్లిపాలు కాపాడతాయి. తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలు తాగే పిల్లల్లో ఆకస్మిక మరణాలు తక్కువేనని వైద్యులు చెబుతున్నారు.

    అమృత జల్లు!

    తల్లిపాలు ఎంతో స్వచ్ఛంగా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, ఆస్తమా, చర్మవ్యాధుల నుంచి బిడ్డలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక, శారీరక వికాసానికి తోడ్పడుతాయి. అందుకే బిడ్డ జన్మించిన గంటలోపు తల్లికి వచ్చే ముర్రుపాలు పట్టించాలి. ఆ తర్వాత ఆరు నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. రోజులో 8 నుంచి 10 సార్లు లేదా ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు తల్లిపాలు పట్టించాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. తల్లిపాలలో ప్రొటీన్లు, ఒమెగా 3, ఒమెగా 6, ఒమెగా 9, విటమిన్లు ఉండి బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. లాక్టోజుతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారి నుంచి కాపాడుతాయి. డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నిరోధిస్తాయి. క్యాన్సర్‌, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి.

    జిల్లా సమాచారం

    విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

    జిల్లా వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 1 నుంచి 7వ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం ‘తల్లిపాల సంస్కృతిని ప్రోత్సహిద్దాం’ అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ముర్రుపాలు తప్పనిసరిగా బిడ్డకు పట్టించాలని సూచిస్తున్నాం. బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లులకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ల నివారణకు దోహదపడుతాయని తెలియజేస్తున్నాం.

    – వెంకటేశ్వరి, జిల్లా ఐసీడీఎస్‌ పీడీ.

  • గ్రామీణులకు నాణ్యమైన వైద్యం

    పాలసముద్రం (కార్వేటినగరం) : గ్రామీణులకు నాణ్యమైన వైద్యం అందంఇచాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రం సత్యకుమార్‌ యాదవ్‌ సిబ్బందిని ఆదేశించారు. గత ప్రభుత్వంలో హిందూస్థాన్‌ కోకా–కోలా బేవరేజెస్‌ (హెచ్‌సీపీబీ) సీఎస్‌ఆర్‌ ఆధ్వర్యంలో మంజూరైన పీహెచ్‌సీ భవనాన్ని ఎమ్మెల్యే థామస్‌ సమక్షంలో మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామీణుల ఆరోగ్య సంరక్షణకు హెచ్‌సీసీబీ కట్టుబడి ఉందన్నారు. దీనిపరిధిలో చౌడేపల్లె, శాంతిపురం, తవణంపల్లె, పాలసముద్రం, బుగ్గఅగ్రహరం, బైరెడ్డిపల్లె గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక ఏఎన్‌ఎంలు స్టాప్‌నర్సుగా పదోన్నతి కావాలని మంత్రికి విన్నవించారు. డీఎంహెచ్‌ఓ సుధారాణి, డీఐఓ హనుమంతరాజు, పీహెచ్‌సీ కమిటీ చెర్మన్‌ ఎస్‌.శివప్రకాష్‌రాజు, కోకా కోలా జీఎం హిమాంచుప్రయదర్శి, వైద్యాధికారులు మోహన్‌క్రిష్ణ, జయకుమార్‌, సీహెచ్‌ఓ సుబ్రమణ్యం, తహసీల్దార్‌ అరుణకుమారి, ఎంపీడీఓ విద్యావతి, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప పాల్గొన్నారు.

  • విన్న
    ● కలెక్టరేట్‌కు క్యూ కట్టిన అర్జీదారులు ● వివిధ సమస్యలపై 320 అర్జీలు

    చిత్తూరు కలెక్టరేట్‌ : తమ సమస్యల పై ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా న్యాయం మాత్రం దక్కడం లేదని అర్జీదారులు వాపోయారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తమ గోడు వెళ్లబోసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 320 అర్జీలను అందజేశారు. కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ నరేంద్ర పడాల్‌ తదితరులు అర్జీలు స్వీకరించారు.

    రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారు

    రాజకీయ నాయకుల పేర్లు చెప్పి బెదిరిస్తున్నారని పెనుమూరు మండలం, కత్తిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ, మాణిక్యరాయినిపల్లె దళితవాడకు చెందిన మహాలక్ష్మి మహిళా సంఘం సభ్యులు లక్ష్మమ్మ, చిన్నక్క వాపోయారు. తమ సంఘంలో ఇది వరకు పది మంది సభ్యులు ఉండే వారని, అందులో ఇద్దరు సభ్యులు తీసుకున్న రుణం సరిగా చెల్లించకపోవడం, సంఘం జరుపుకునేందుకు హాజరు కాకపోవడంతో ఆ ఇద్దర్నీ సంఘం నుంచి తొలగించినట్టు తెలిపారు. తొలగించినందుకు రాజకీయ నాయకుల పేర్లు చెప్పి తమను భయపెడుతున్నారన్నారని వాపోయారు. ఈ మేరకు పీజీఆర్‌ఎస్‌లో అర్జీ అందజేయడం వల్ల తమ గ్రూపు సభ్యులు ఒక్కొక్కరికీ రూ.1.50 లక్షలు చెల్లించి గ్రూపును రద్దు చేసుకోవాలని తమ సంఘం ఈవో అధికారి బెదిరిస్తున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.

    హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తున్నారు

    హైకోర్టు తీర్పును ఉల్లంగిస్తున్నారని కాణిపాకం పంచాయతీ మాజీ సర్పంచ్‌ గోపీనాథ్‌, గ్రామస్తులు వాపోయారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమ గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 5 వేల మంది జనాభా ఉన్నారన్నారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన శ్మశాన స్థలంపై గతంలో ఎండోమెంట్‌ ఈవో జోక్యం చేసుకుని హైకోర్టులో కేసు వేశారన్నారు. ఆ కేసులో తీర్పు పంచాయతీకి అనుకూలంగా వచ్చిందన్నారు. అయితే హైకోర్టు తీర్పును ఉల్లంఘించి శ్మశానానికి సంబంధించిన స్థలాన్ని రెవెన్యూ అధికారులు 1 బీ లో నమోదు చేసి డ్రోన్‌ సర్వే చేస్తున్నారన్నారు.

    న్యాయం చేయండి

    క్వారీ పనుల వల్ల తమ గ్రామంలోని గృహాలు చీలిపోతున్నాయని బైరెడ్డిపల్లి మండలం టి.గడ్డూరు గ్రామస్తులు జీవీ భాస్కర్‌రెడ్డి, రవిరెడ్డి, మునిరత్నమ్మ, పుష్పకుమారి వాపోయారు. తమ గ్రామానికి అర్ధ కిలోమీటరు దూరంలో క్వారీ పనులు నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్వారీ పేలుళ్ల వల్ల గ్రామంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని వాపోయారు.

    జీవనోపాధి కల్పించండి

    జీవనోపాధి కల్పించండి సారూ అంటూ సదుం మండలం, ఎరుకులపురం గ్రామానికి చెందిన శంకర, అంజీ కోరారు. తమది బాతులు మేపుకునే వృత్తి అని, ఆ వృత్తిలో విపరీతమైన నష్టాన్ని ఎదుర్కొన్నామన్నారు. వడ్డీ వ్యాపారులు బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఇప్పటికీ సొంత నివాసం లేక ఇబ్బందులు పడుతున్నట్టు వాపోయారు. తమకు స్థిరమైన జీవనోపాధి కల్పించి న్యాయం చేయాలని కోరారు.

  • వరసిద

    కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని సోమవారం హర్యానా రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం దుష్యంత్‌సింగ్‌ చౌతాలా దర్శించుకున్నారు. అలాగే మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌ కూడా స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి, స్వామివారి దర్శనం కల్పించారు. అనంతరం పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో రవీంద్రబాబు పాల్గొన్నారు.

    గోసంరక్షణ ట్రస్టుకు విరాళం

    కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోసంరక్షణ ట్రస్టుకు సోమవారం గంటూరుకు చెందిన అంజిరెడ్డి రూ.లక్షను విరాళంగా అందజేశారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించారు.

    ఇండియా రగ్బీ జట్టుకు ఎంపిక

    పలమనేరు: పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన నర్రా సురేష్‌ కుమార్తె నర్రా అక్షయ అండర్‌–20 ఇండియా రగ్బీ జట్టుకు ఎంపికై ంది. ఇటీవల చైన్నెలో జరిగిన ఈ ఎంపికలో అక్షయ విశేష ప్రతిభకనబరిచిందని ఆమె తండ్రి తెలిపారు. కాగా చైన్నెలో జరిగిన ఓ కార్యక్రమంలో స్పాన్సర్లు సినీ హీరో రాహుల్‌ బోస్‌ ద్వారా ఇండియా జెర్సీలను జట్టుకు అందజేశారని తెలిపారు.

    దరఖాస్తుల ఆహ్వానం

    చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పోస్టుకు అర్హత, ఆసక్తి గల పీడీ, పీటీలు దరఖాస్తులు చేసుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 2025–26 నుంచి 2026–27 సంవత్సరం వరకు స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ (అండర్‌ 14, 17, 19) నియామకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ 58 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పీడీ, పీఈటీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈనెల 7 వ తేదీలోపు దరఖాస్తులను డీఈవో కార్యాలయంలో అందజేయాలన్నారు.

    నేడు ‘టీ తాగుతూ మాట్లాడదాం రండి’

    చిత్తూరు కలెక్టరేట్‌ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మంగళవారం కలెక్టరేట్‌లోని క్యాంటీన్‌లో ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శివయ్య తెలిపారు.

  • లారీన

    ఇద్దరు అక్కడికక్కడే మృతి

    మృతులు బంగారుపాళెం వాసులుగా గుర్తింపు

    చంద్రగిరి: ఎదరుగా వస్తున్న లారీని ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన సోమవారం రాత్రి పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పనపాకం సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. చిత్తూరు జిల్లా, బంగారుపాళ్యం మండలం, తంబుగానిపల్లికి చెందిన పరంధామ(26) వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో సోమవారం రాత్రి తిరుపతికి పయనమయ్యాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన గడ్డం హరీష్‌ నాయుడు(24) తన తల్లితో కలసి కాణిపాకంలో ఉంటూ డ్రైవరుగా జీవనం సాగిస్తున్నాడు. కాణిపాకానికి చేరుకున్న పరంధామ, హరీష్‌ నాయుడును తన ద్విచక్ర వాహనంలో ఎక్కించుకుని ఇద్దరూ తిరుపతికి పయనమయ్యారు. పనపాకం టోల్‌ప్లాజా దాటుకుని వస్తున్న క్రమంలో ఎదురుగా తిరుపతి నుంచి చిత్తూరు వైపుగా వస్తున్న లారీని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో పరంధామతో పాటు హరీష్‌ నాయుడు అక్కడికక్కడే మృతి చెందారు. హైవే పోలీసులు లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

    రోడ్డు విస్తరణ పనులు ఆగిపోవడంతోనే..

    పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి విస్తరణ పనులు ఆగిపోవడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. రహదారి పనులు పనపాకం నుంచి జక్కలవారిపల్లి వరకు సుమారు కిలోమీటర్‌ మేర గత కొన్నేళ్లుగా ఆగిపోయాయి. దీంతో రహదారి విస్తరణ అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం తాత్కాలిక సింగిల్‌ రోడ్డును ఏర్పాటు చేశారు. ప్రమాదానికి గురైన ద్విచక్ర వాహనాదారులకు సింగిల్‌ రోడ్డు అన్న విషయం తెలియకపోవడంతో, మలుపు తీసుకోకుండా నేరు వెళ్లి లారీని ఢీకొట్టారు. ఇకనైనా రహదారి విస్తరణ అధికారులు స్పందిచాల్సి ఉంది.

  • నగరి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ నిర్వాకం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. జగనన్న పాలనలో ప్రతి విద్యార్థికీ ఒక్క ఏడాది కూడా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కష్టం రాకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. 

    కానీ ప్రస్తుత పాలనలో, విద్యాశాఖ మంత్రిగా లోకేష్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో జిల్లాలో సుమారు 600 మంది విద్యార్థులు ఫీజులు చెల్లించలేక, యూనివర్సిటీలు సర్టిఫికెట్లు ఇవ్వక ఉన్నత విద్య అయిన ఎంటెక్‌ అవకాశాన్ని కోల్పోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు పెడుతూ, పథకాన్ని నీరుగార్చడంతో పాటు వారి భవిష్యత్తునే నాశనం చేస్తున్నారన్నారు. ‘మూలనున్న ముసలమ్మ కూడా బటన్‌ నొక్కుతుంది’ అని డైలాగ్‌లు చెప్పిన వాళ్లు నేడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బటన్‌ నొక్కడానికి ఎందుకింత కష్టపడుతున్నారన్నారు. పాలన ఇలాగే కొనసాగితే ప్రభుత్వం విద్యార్థుల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు.

  • అత్యవ

    చిత్తూరు కలెక్టరేట్‌ : బాలికలకు అత్యవస నంబర్లపై అవగాహన ఉండాలని చిత్తూరు మహిళా పోలీసు స్టేషన్‌ సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ఈ మేరకు సోమవారం నగరంలోని విజయం డిగ్రీ కళాశాలలో మహిళా శక్తి యాప్‌, అత్యవసర ఫోన్‌ నంబర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వం శక్తి యాప్‌ అమలు చేస్తోందన్నారు. ప్రతి విద్యార్థినీ మహిళా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. కళాశాలలో శక్తి వారియర్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేయాలని, గ్రూప్‌ ప్రత్యేకతలను వివరించారు. కళాశాల చైర్మన్‌ తేజోమూర్తి పాల్గొన్నారు.

    సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

    చిత్తూరు అర్బన్‌: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. నగరంలోని తన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీతోపాటు అడిషనల్‌ ఎస్పీ రాజశేఖరరాజు, డీఎస్పీ రాంబాబు కలసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. సైబర్‌ క్రైమ్‌, వేధింపులు, కుటుంబ తగదాలు, నగదు లావాదేవీలకు సంబంధించి 55 ఫిర్యాదులు వచ్చాయి.

  • మిథున్‌రెడ్డికి బెయిల్‌ రావాలని ప్రార్థనలు

    చౌడేపల్లె: అక్రమ మద్యం కేసులో కుట్రపూరితంగా రాజంపేట ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డిని జైలుకు పంపారని, త్వరగా ఆయనకు బెయిల్‌ రావాలని కోరుతూ దాదేపల్లెలోని మషాయక్‌ బహదూర్‌ అలీషాబాబా దర్గాలో చౌడేపల్లె కాగతి సర్పంచ్‌ షంషీర్‌, మైనారిటీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు సనావుల్లాల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సోమవారం దర్గాలో బాబా మజ్జార్‌కు చాదర్‌ను కప్పి గంధం, పూలు సమర్పించి మత పెద్దల చేత ప్రత్యేక ప్రార్థనలు, దువ్వా చేశారు. కూటమికి మంచి బుద్ధి ప్రసాదించాలని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్ష సాధింపులు మానుకునే విధంగా చూడాలని ప్రార్థనలు చేసినట్లు తెలిపారు. అన్యాయంగా మిథున్‌రెడ్డిను అక్రమ కేసులు ఇరికించారని, ఆకేసునుంచి విముక్తికల్గిలా చూడాలని కోరుతూ పెద్దిరెడ్డి కుటుంభానికి మనోధైర్యం ప్రసాదించి బెయిల్‌ త్వరగా రావాలని కోరుతూ ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేర్‌ఖాన్‌, రియాజ్‌ అహమ్మద్‌, బషీర్‌సాబ్‌, జహీర్‌, నవాబ్‌, ఈనూస్‌, నిజాం, మాలిక్‌ తదితరులున్నారు.

Anakapalle

  • గో భక
    గో సంరక్షకులుగా బిల్డప్‌ ఇస్తారు.. అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుంటారు. పోలీసులకు అప్పగించి ఆ ఆవులను అధికారికంగానే చారిటబుల్‌ ట్రస్ట్‌ గోశాలకు తరలిస్తారు. ట్రస్ట్‌ ముసుగులో పశువులను ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్‌కు తరలించి పశువధ చేసే వ్యాపారులకు విక్రయిస్తారు. టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు ట్రస్టుగా ఏర్పడి చేస్తున్న దారుణమిది. దీనిపై ఎస్‌.రాయవరానికి చెందిన సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు లోకాయుక్తకు, కలెక్టర్‌ విజయ కృష్ణన్‌, ఎస్పీ తుహిన్‌ సిన్హాలకు ఫిర్యాదు చేశారు.
    రక్షకులు కాదు..
    విజయవాడలో ఉన్న యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా గుర్తింపు పత్రం

    హైవేపై రవాణా చేసేవారే టార్గెట్‌..

    అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సమయంలో వాహనాల్లో పశువుల రవాణా నిర్భయంగా సాగుతోంది. ఈ రవాణాదారులనే లక్ష్యంగా చేసుకొని ట్రస్టు ముసుగులో పశువులను రక్షిస్తామని స్వాధీనం చేసుకుంటున్నారు. అదే తప్పు దర్జాగా వీరు కూడా చేస్తున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 40 వరకు పశువులను తాళ్లతో బంధించి అతి క్రూరంగా వాహనాల్లో తరలిస్తున్నట్లు సమాచారం. రాత్రి వేల పెద్ద ఎత్తున అక్రమంగా పశువుల రవాణా జరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

    వ్యాన్‌లో గోవులను తరలిస్తున్న దృశ్యం

    సాక్షి, అనకాపల్లి:

    దొంగలకు దొంగ.. ఘరానా దొంగ.. ఇలా ఎన్ని పేర్లతోనైనా వీరిని పిలుచుకోవచ్చు. రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరుతో టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు అధికారుల కళ్లుగప్పి అక్రమార్జనకు తెరలేపారు. ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో వీరు చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేశారు. ఏపీ యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు ద్వారా అక్రమ మార్గంలో రికగ్నిషన్‌ సర్టిఫికెట్‌ పొంది గోశాలను నడుపుతున్నారు. జాతీయ రహదారిలో గోవులను అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని వాటిని పోలీసులు అప్పగించి ఆ ఆవులను చారిటబుల్‌ ట్రస్ట్‌కు తరలించుకుంటారు. అంతేకాకుండా ఏజెన్సీలోని పాడేరు, అరకు ప్రాంతాల్లో తక్కువ ధరకే గోవులను కొనుగోలు చేసుకుని ఇక్కడకు తీసుకొస్తారు. రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌ ముసుగులో హైదరాబాద్‌లో పశువధ చేసే వ్యాపారుల ‘కొట్టాయి’కి వ్యాన్లలో ఆవులను తరలిస్తున్నారు. ఎస్‌.రాయవరం మండలంలో పెనుగొల్లు, సోముదేవుపల్లి, గోకులపాడు, ధర్మవరం అగ్రహారం తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి టీడీపీ నాయకుల అండదండలతో పెనుగొల్లు గ్రామంలో డోర్‌ నెం.2–8/2 అడ్రస్‌తో ‘రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌’ ఏర్పాటు చేశారు.

    పశు రవాణా నిబంధనలేమిటంటే..

    పాడి పశువులు, ఆవులు, దూడలు, ఎద్దులను వధించడంపై మన దేశంలో నిషేధం విధించినప్పటికీ యథేచ్ఛగా వధశాలలకు పశువులను తరలించడం నిత్యకృత్యంగా మారింది. వీటి తరలింపునకు ప్రత్యేక నిబంధనలున్నాయి. మూగజీవాలను రవాణా చేసే వాహనాలకు ప్రత్యేక రిజిస్ట్రేషన్‌ పత్రాలతోపాటు జీవాలను తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు కలిగి ఉండాలి. పశువుల రవాణా సమయంలో మూగజీవాలకు సరిపడా గాలి, మేత, నీరు అందుబాటులో ఉండేటట్టు ఏర్పాట్లు చేయాలి. పెద్ద వాహనాల్లో పశువులను తరలించేటప్పుడు ఒక పశువు కోసం రెండు స్క్వేర్‌ మీటర్ల వంతున విడివిడిగా అరలను తయారుచేసి అందులో పశువులను తరలించవలసి ఉంటుంది. గూడ్స్‌ వాహనాల్లో పశువులను తరలించినా, పరిమితికి మంచి మూగజీవాలను తరలించినా భారీ జరిమానాతో పాటు తరలించే వ్యక్తులపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది.

    ఎస్‌.రాయవరం మండలం పెనుగొల్లు గ్రామంలో చారిటబుల్‌ ట్రస్టు ఏర్పాటు

    రక్షణ చారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట పశువుల అక్రమ రవాణా

    ఇక్కడ నుంచి వ్యాన్లలో హైదరాబాద్‌ ‘కొట్టాయి’కి తరలింపు

    వారాంతపు సంతలను ఆదాయ వనరులుగా మార్చుకుంటున్న అక్రమార్కులు

    ఈ ఏడాది పది వాహనాల్లో తరలిస్తూ పోలీసులకు పట్టుబడిన వైనం

    క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి

    పవిత్రంగా భావించే గోవులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్వచ్ఛంద సంస్థ ముసుగులో వివిధ స్టేషన్లలో పోలీసులు పట్టుకున్న ఆవులు, ఏజెన్సీ ప్రాతం నుంచి వచ్చిన ఆవులు, పశువులు, తమ సంస్థ షెడ్‌కు పెద్ద సైజు వ్యానుల్లో తరలిస్తుంటారు. అక్కడ నుండి చిన్న సైజు వాహనాల్లో అనకాపల్లి బోర్డర్‌ తుని వరకు ట్రస్టు పేరుతో పంపిస్తారు. అక్కడ నుంచి వేరే వ్యక్తులు హైదరాబాద్‌కు తరలిస్తుంటారు. కొన్ని ఆవులు తిండి లేక, అనారోగ్యంతో, తరలింపు సమయంలో గాయాల పాలై మృతి చెందుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇటీవలే పోలీసులు 10 మందికి పైగా పశువుల అక్రమ రవాణా చేసే వారిని పట్టుకుని వారిపై కేసులు నమోదు చేశారు. ఆ ఆవులను ఈ సంస్థకే తరలించారు.

    – సోమిరెడ్డి వెంకట అప్పలసత్యసన్యాసి నూకరాజు, ఎస్‌.రాయవరం

  • రైతుల

    అనకాపల్లి : దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచిందని..ఏడాది కాలంలో రైతులు అప్పులు చేసుకుని వ్యవసాయం చేసే పరిస్థితులు నెలకొన్నాయని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని, ఏడాదిగా రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయలేదు..ఈ ఏడాది కూడా కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చి సరిపెట్టారు. మిగిలిన రూ.15 వేలు ఎప్పుడిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా జిల్లాలో సుమారు 24 వేల మంది లబ్దిదారుల్లో కోత విధించారని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఎరువుల కొరత నివారించాలంటూ సోమవారం వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ పాలనలో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీఫ్‌ సీజన్‌కు సచివాలయంలో అగ్రికల్చర్‌ కార్యదర్శితో గ్రామంలో రైతులకు కావలసిన ఎరువులు, విత్తనాలతో పాటు రైతు భరోసా సకాలంలో రైతుల బ్యాంకు ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండగ అని రైతులను కించపరిచారని అన్నారు. రాష్ట్రంలో జీఎస్‌డీపీ 40 నుంచి 42 శాతం ఉండేదన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు నేటి వరకూ కావలసిన ఎరువులు, యూరియా, భూసార పరీక్షలు చేయలేదన్నారు. భూసారాన్ని బట్టి వైఎస్సార్‌సీపీ పాలనలో సచివాలయం అగ్రికల్చర్‌ కార్యదర్శి ద్వారా రైతులకు విత్తనాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు.

    మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని, వరినాట్లు వేసే సమయంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని, యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయశాఖ అధికారులు ఖరీఫ్‌ సీజన్‌ పంటలపై దృష్టి సాధించాలని హితవు పలికారు. రైతులకు గిట్టుబాటు ధర వైఎస్సార్‌సీపీ పాలనలో కల్పించడం జరిగిందని, కూటమి పాలనలో రైతుల సమస్యలు పట్టించుకోనే నాయకుడు కనిపించడం లేదన్నారు. మొద్దు నిద్రలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందన్నారు.

    కార్యక్రమంలో వివిధ నియోజకవర్గ సమన్వయకర్తలు పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌, అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌, కంబాల జోగులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్‌కుమార్‌, ఎంపీపీ గొర్లి సూరిబాబు, పట్టణ, మండలపార్టీ అధ్యక్షులు మందపాటి జానకీరామరాజు, పెదిశెట్టి గోవింద్‌, జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

    మొద్దునిద్రలో కూటమి ప్రభుత్వం..అప్పుల ఊబిలో అన్నదాతలు

    గతేడాది అన్నదాత సుఖీభవ లేదు..ఈ ఏడాది 24 వేల మంది లబ్ధిదారుల కోత

    ఇచ్చింది రూ.5వేలే..మిగిలిన రూ.15 వేలు ఎప్పుడిస్తారో..?

    మండిపడిన వైఎస్సార్‌సీపీ నేతలు

    ఎరువుల కొరతపై పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు

    హాజరైన మాజీ మంత్రులు అమర్‌నాథ్‌, ముత్యాలనాయుడు, సమన్వయకర్తలు

  • ప్రజల్లోకి బాబు మోసాలు

    నక్కపల్లి: చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లి నిలదీసేలా చైతన్యం తీసుకురావాలని వైఎస్సార్‌సీపీ పాయకరావుపేట సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. సోమవారం నక్కపల్లి సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో కాపు కార్పొరేషన్‌ మాజీ డైరక్టర్‌ వీసం రామకృష్ణ అధ్యక్షతన ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ మండల స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన కంబాల జోగులు మాట్లాడుతూ.. సూపర్‌ సిక్స్‌ పథకాలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని బాండ్లపై సంతకాలు చేసి మరీ కూటమి నేతలు హామీ ఇచ్చారని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నమాట నెరవేర్చకుండా మోసం చేశారన్నారు. కూటమి పార్టీలు ఇచ్చిన బాండ్లు, మేనిఫెస్టోలను ఆన్‌లైన్‌లో ఉంచి ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మేనిఫెస్టో’ పేరుతో ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. తల్లికి వందనం పథకం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందికి అందలేదన్నారు. అన్నదాత సుఖీభవ పథకం కూడా అర్హులందరికీ రాలేదన్నారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి భ్రమగానే మిగిలాయన్నారు. ఐదేళ్లలో 20 లక్షలు ఉద్యోగాలన్నారు. రెండు వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. మెగా డీఎస్సీ అని చెప్పి కేవలం అతితక్కువ పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదల చేశారన్నారు.

    దేవవరం నుంచి శ్రీకారం

    వీసం రామకృష్ణ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఈ నెల 15 దాటిన తర్వాత దేవవరం నుంచి మొదలు పెడతామన్నారు. పరిశ్రమలకు భూములిచ్చిన నిర్వాసిత రైతులకు పరిహారం, ప్యాకేజీ విషయంలో పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ క్యూఆర్‌ కోడ్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, వైస్‌ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగా ఈశ్వరరావు, వైఎస్సార్‌సీపీ గ్రీవెన్స్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్లు అయినంపూడి మణిరాజు, పొడగట్ల పాపారావు, మహిళా విభాగం కార్యదర్శి తుమ్మా కల్పన, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు తాజుద్దీన్‌ బాబా, సర్పంచ్‌లు గొర్ల నర్సింహమూర్తి, రోహిణి, అల్లు రమణ, వియ్యపు శ్రీను, పి.వెంకటేష్‌, వెదుళ్ల రమణ, ఎంపీటీసీ సభ్యులు లొడగల చంద్రరావు, గంటా తిరుపతిరావు, గొర్ల గోవిందు, నిట్ల గోవిందు, బచ్చలరాజు, ఉప సర్పంచ్‌ వేగేశ్న చంటి తదితరులు పాల్గొన్నారు.

    నిలదీసేలా చైతన్యం తీసుకురావాలి

    ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సమన్యయకర్త కంబాల జోగులు

  • స్పెషల్‌ ఒలింపిక్స్‌ విజేతకు అభినందన

    బాల సరస్వతిని అభినందిస్తున్న జిల్లా సమగ్ర శిక్ష పీవో డాక్టర్‌ జయప్రకాష్‌

    అనకాపల్లి టౌన్‌: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం భిలాస్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్పెషల్‌ ఒలింపిక్‌ బోసి బాల్‌ గేమ్‌ క్రీడా పోటీలలో గెలుపొందిన దివ్యాంగ విద్యార్థిని బాల సరస్వతిని జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాష్‌ అభినందించారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో ఆమెను సత్కరించారు. రావికమతం మండలం చిన గుమ్ములూరు కస్తూర్బా పాఠశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాల సరస్వతి బాల్‌గేమ్‌ పోటీలలో నాలుగో స్థానం సాధించడం పట్ల జిల్లా సహిత విద్య సమన్వయ అధికారి బి.ఆర్‌.వి.రామకృష్ణ నాయుడు, పాఠశాల ప్రధానోపాధ్యాయిని శకుంతల తదితరులు అభినందించారు.

  • న్యాయమూర్తి చొరవతో నిర్వాసితులకు న్యాయం

    నిర్వాసితులకు చెక్కులు అందజేస్తున్న న్యాయమూర్తి షియాజ్‌ఖాన్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనిత

    నర్సీపట్నం: మాకవరపాలెం మండలం, రాచపల్లి సమీపంలో ఉన్న అన్‌రాక్‌ కంపెనీకి భూములు ఇచ్చిన 21 మంది నిర్వాసితులకు నర్సీపట్నం సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.షియాజ్‌ఖాన్‌ చొరవతో న్యాయం జరిగింది. 2016 నుంచి నష్టపరిహారం కోసం నిర్వాసితులు పోరాడుతున్నారు. అయినా ఎటువంటి పరిహారం ఇవ్వకపోవడంతో బాధిత రైతులు న్యాయస్థానానికి, మండల న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి షియాజ్‌ ఖాన్‌కు ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. న్యాయమూర్తి విచారణ జరపడంతో యాజమాన్యం నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. సోమవారం న్యాయమూర్తి సమక్షంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ అనిత, ఏపీఐఐసీ విశాఖపట్నం, అన్‌రాక్‌ కంపెనీ యాజమాన్యం నిర్వాసితులకు పరిహారం సొమ్ము చెక్కులను అందజేశారు. నిర్వాసితులు సంతోషం వ్యక్తం చేస్తూ న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలియజేశారు.

  • పిల్లల దత్తతలో నిబంధనలు పాటించాలి

    పోస్టర్‌ను విడుదల చేస్తున్న కలెక్టర్‌

    తుమ్మపాల: అనాథ పిల్లలను చట్టపరమైన నిబంధనల మేరకు దత్తత తీసుకోవాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ సూచించారు. ‘మాతృత్వం ఒక వరం..దత్తత అందుకు మరో మార్గం’పోస్టర్‌ను జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఆమె సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల దత్తతను వెబ్‌సైట్‌ http:// WWW.CARA.NIC.IN ద్వారా చట్టపరంగా తీసుకోవాలన్నారు. ఏ విధమైన సందేహాలు ఉన్నా జిల్లా బాలల సంరక్షణ విభాగంలో సంప్రదించాలన్నారు. పిల్లల దత్తతకు సంబంధించిన మరింత సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ రక్షణ అధికారి ఫోన్‌ నంబర్‌ 89789 17154, పరిరక్షణ అధికారి ఫోన్‌ నంబర్‌ 85008 96656లో సంప్రదించాలన్నారు.

  • 10న తాండవ నీటి విడుదల

    నాతవరం: ఖరీఫ్‌ సాగు కోసం తాండవ రిజర్వాయరు నీటిని ఈ నెల 10న విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు జేఈ శ్యామ్‌కుమార్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాండవ రైతులు, ప్రజాప్రతినిధుల ప్రాజెక్టు కమిటీ చైర్మన్‌, సభ్యుల అభీష్టం మేరకు నీటిని విడుదల చేసే తేదీ ఖరారు చేశామన్నారు. స్పీకరు అయ్యన్నపాత్రుడు తాండవ రిజర్వాయరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తారన్నారు. ప్రాజెక్టులో సోమవారం సాయంత్రానికి 371.1 అడుగులు ఉందన్నారు. తాండవ ప్రమాద స్థాయి నీటి మట్టం 380.0 అడుగులు కాగా.. డేడ్‌ స్టోరేజీ నీటి మట్టం 345 అడుగులుగా పరిగణిస్తామన్నారు. తాండవ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీటిని రెండు కాలువలు ద్వారా రోజు ఒక్కంటికి 500 క్యూసెక్కులు చొప్పున 70 రోజులు ఆయకట్టుకు ప్రవహిస్తుందన్నారు. ఈలోపు వర్షాలు కురిసి నీటి మట్టం పెరిగితే ఖరీఫ్‌ సాగుకు ఎలాంటి ఢోకా ఉండదన్నారు.

  • రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ట్రోఫీ ఆవిష్కరణ

    మునగపాక: క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం అందరిపైనా ఉందని రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మండలంలోని నాగులాపల్లిలో ఈ నెల 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మహిళలు, పురుషుల కబడ్డీ పోటీల ట్రోఫీని సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి ఎంతో ఆదరణ ఉందన్నారు. క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపేందుకు ఇటువంటి పోటీలు దోహదపడతాయన్నారు. కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఎమ్మెల్యే విజయకుమార్‌ జన్మదిన సందర్భంగా నాగులాపల్లిలో రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కబడ్డీ అసోసియేషన్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పెద్దలు టెక్కలి పరశురామ్‌, శరగడం యోగి నాగేశ్వరరావు, పొలమరశెట్టి మురళి, ఆడారి గణేష్‌, ఆడారి ఆనంద్‌ సన్యాసినాయుడు, ఆడారి జగన్నాథరావు, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి కోటేశ్వరరావు, జిల్లా టెక్నికల్‌ కోచ్‌లు గణపతి, శివ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • ఆదివాసీ హక్కుల దినోత్సవంగా మార్చాలని ధర్నా

    ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న ఏపీ ఆదివాసీ సంఘ నాయకులు

    నర్సీపట్నం: ఏటా ఆగస్టు 9న నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివాసీ హక్కుల దినోత్సవంగా మార్చాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఆదివాసీ సంఘం నాయకులు సోమవారం స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఆదివాసీ సంఘం నాయకులు కె.జనార్దన్‌, మోసూరి రాజు మాట్లాడుతూ నాన్‌ షెడ్యూల్‌ ఆదివాసీ గ్రామాలను ఏజెన్సీ ప్రాంతాలుగా గుర్తించాలని 1977లోనే ఏపీ మంత్రివర్గం తీర్మానం చేసినా, నేటికి అమలుకు నోచుకోలేదన్నారు. ఆదివాసీల స్వాధీన అనుభవంలో ఉన్న భూములను గుంజుకోవడానికి భూ మాఫియా దాడులు చేస్తుందన్నారు. ఆదివాసీల భూములకు రక్షణ కల్పించాలన్నారు. ఆదివాసీల సాగులో ఉన్న అటవీ, ప్రభుత్వ బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో సుధాకర్‌కు వినతిపత్రం అందజేశారు.

  • ఎస్పీ కార్యాలయానికి 31 అర్జీలు

    అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్‌ సిన్హా

    అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం 31 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తుహిన్‌సిన్హా మాట్లాడుతూ భూ తగాదాలు–16, కుటుంబ కలహాలు–6, ఇతర విభాగాలకు చెందినవి–9 అర్జీలు వచ్చాయని చెప్పారు. చట్టపరిధిలో సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు దిగువ స్థాయి పోలీస్‌ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు, ఎస్‌ఐ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

  • క్షేత
    ● కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ● పీజీఆర్‌ఎస్‌కు 284 అర్జీలు

    వితంతు పింఛన్‌ మంజూరు చేయండి..

    నా భర్త మరణించి మూడేళ్లకుపైగా అవుతోంది. వితంతు పింఛన్‌ మంజూరు చేయకుండా సచివాలయ సిబ్బంది కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారు. ఈ నెలలో కొత్తగా మంజూరు చేసిన పింఛన్లలో నా పేరు లేకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాను. మా అత్తకు నాకు వేర్వేరు రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రస్తుతం కలిసి ఉండటం లేదు. అయినప్పటికీ మా అత్తకు పింఛన్‌ వస్తుందని, సచివాలయ మ్యాపింగ్‌లో ఒకే కుటుంబంగా చూపిస్తుందని సిబ్బంది చెబుతున్నారు. నిరుపేదగా ఉన్న నాకు పింఛన్‌ మంజూరు చేసి న్యాయం చేయాలని కోటవురట్ల మండలం కై లాసపట్నం గ్రామానికి చెందిన వితంతురాలు అప్పికొండ రాజేశ్వరి కలెక్టర్‌కు మొరపెట్టుకుంది.

    తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో వచ్చిన అర్జీలకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిష్కరించాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఆమెతోపాటు జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజల అర్జీల గురించి వెంటనే సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల పరిష్కారానికి అర్జీదారులతో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కరించిన వినతులను దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. పరిష్కారం కాని వాటి గురించి అందుకు గల కారణాలు వివరంగా తెలియజేయడం ద్వారా అర్జీలు రీ ఓపెన్‌ కాకుండా నివారించవచ్చన్నారు. పీజీఆర్‌ఎస్‌ అర్జీలు జిల్లా, మండల అధికారుల లాగిన్‌లో ఉంటే సంబంధిత అధికారులు నేరుగా క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లి, ప్రజల సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి శాఖ అధికారి వారి శాఖకు సంబంధించిన అర్జీల పరిష్కార పరిస్థితిని రోజూ పర్యవేక్షణ చేసి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలన్నారు, అర్జీదారులు తమ అర్జీల సమాచారం కోసం 1100 కాల్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. ఈ వారం మొత్తం 284 అర్జీలు స్వీకరించామని, అధికంగా రెవెన్యూ సంబంధిత సమస్యలు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో కె.ఆర్‌.ఆర్‌,సి, పి.జి.ఆర్‌.ఎస్‌ ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్‌.సుబ్బలక్ష్మి, రమామణి, జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి జి.రామారావు, జిల్లా గృహ నిర్మాణ శాఖ అఽధికారి శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పీడీ శచీదేవి, డ్వామా పీడీ పూర్ణిమాదేవి, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నారాయణమూర్తి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎం. హైమావతి, జిల్లా ఎకై ్సజ్‌ శాఖ అధికారి వి.సుధీర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ప్రజాభిప్రాయ సేకరణ

    రద్దు చేయాలి

    ఈ నెల 6న నిర్వహించనున్న ఏపీ బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని రద్దు చేయడంతోపాటు నిర్మాణ పనులు తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు ఆర్‌.శంకరరావు కలెక్టర్‌ను కోరారు. నక్కపల్లి, ఎస్‌.రాయవరం మండలాల్లో 1270.80 ఎకరాల భూసేకరణపై ఈఐఏ నివేదిక తప్పుల తడకగా ఉందన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూరేలా బలవంతపు భూసేకరణపై తీవ్ర అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. బల్క్‌ డ్రగ్‌ పార్కులో నిర్మించే ఫార్మా పరిశ్రమల్లో రసాయన ప్రక్రియపై వాస్తవాలను దాచి తప్పుడు సమాచారం ప్రజలకందిస్తున్నారన్నారు. ఈఐఏ నివేదిక ఆధారంగా జరిగే ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేసి సరైన వాస్తవ నివేదికతో కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో నిర్వాసితులు అభ్యంతరాలు చెబితే కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామంటూ స్థానిక సీఐ, పోలీసులు గ్రామాల్లో ప్రజలను భయపిస్తున్నారన్నారు. సీఐ చర్యలపై విచారణ చేపట్టి సస్పెండ్‌ చేయాలన్నారు.

  • ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ కోసం వివాహితుల ధర్నా

    నక్కపల్లి: బల్క్‌ డ్రగ్‌ పార్క్‌, మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ల ఏర్పాటు కోసం నివాస ప్రాంతాలను ఇచ్చిన కుటుంబాల్లో పెళ్లయిన ఆడవాళ్లకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ వర్తింజేయాలంటూ పలువురు వివాహితులు సోమవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మండలంలోని చందనాడ, తమ్మయ్యపేట, మూలపర, పాటిమీద, తుమ్మలపేట, తదితర గ్రామాలకు చెందిన పలువురు వివాహితులు ఇక్కడకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2014లో భూసేకరణ సమయంలో ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తామని నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు. ఆ సమయంలో నిర్వాసిత కుటుంబాల్లో వివాహం కాని ఆడవారికి మేజర్లయిన ఆడ, మగవారికి ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో తామంతా జిరాయితీ భూముల్లో ఇళ్లను కంపెనీల కోసం ఇవ్వడానికి ఒప్పుకున్నామన్నారు. తీరా ఇప్పుడు పెళ్లయిన ఆడపిల్లలకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇవ్వడం లేదన్నారు. ప్యాకేజీ కింద ఐదు సెంట్ల ఇల్ల స్థలం, రూ.8.98 లక్షలు చొప్పున వివాహం కాని ఆడవారికి కుటుంబ యజమానికి మేజర్లయిన మగ పిల్లలకు మాత్రమే ఇస్తున్నారన్నారు. నోటిఫికేషన్‌ విడుదల చేసి పదేళ్లు గడిచిందన్నారు. పెళ్లీడుకొచ్చిన ఆడపిల్లలను ఎన్నాళ్లు ఇళ్లలో ఉంచుకుంటారని, అప్పులు చేసి వివాహాలు చేస్తే, ఇప్పుడు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ వర్తింపజేయకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ఎండగడుతూ నినాదాలు చేశారు. వివాహమైన ఆడపిల్లలకు కూడా ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. ఈ ఆందోళనలో సీపీఎం నాయకులు అప్పలరాజు, మనబాల రాజేష్‌, చంటమ్మ, తుమ్మల భవానీ, శిరీషా, ఉప్పలూరి మానస, అశ్విని దుర్గ, నాగదుర్గ, రావి హైమావతి తదితరులు పాల్గొన్నారు.

  • ప్రత్యేక ఉపాధ్యాయుడికి ఘన సత్కారం

    మహాలక్ష్మినాయుడును సన్మానిస్తున్న సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాష్‌

    రావికమతం : జాతీయ స్థాయి దివ్యాంగుల స్పెషల్‌ ఒలింపిక్‌ భారత్‌ బోసిబాల్‌ క్రీడా పోటీల్లో రాష్ట్ర విద్యార్థులు ఆరు పతకాలు సాధించేందుకు కృషి చేసిన కోచ్‌ మేడివాడ హైస్కూల్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల స్కూల్‌ అసిస్టెంట్‌, ప్రత్యేక ఉపాధ్యాయులు మహాలక్ష్మినాయుడును పలువురు అభినందించారు. ఆయనను అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్ట్‌ అధికారి డాక్టర్‌ జయప్రకాష్‌, జిల్లా సహిత విద్య సమన్యకర్త వి.ఆర్‌ కృష్ణంనాయుడు, చిన గుమ్ములూరు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు బి.శకుంతల శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రశంసాపత్రం అందజేశారు. గత నెల 24 నుంచి 28 వరకూ చత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిలాస్‌పూర్‌లోని అటల్‌ బిహారీ వాజ్‌పాయి యూనివర్శిటీ స్టేడియంలో జరిగిన బోసి బాల్‌ గేమ్‌లో రాష్ట్రం నుంచి ఆరుగురు పాల్గొనగా, ఒకరికి బంగారు పతకం, ఇద్దరికి రజత, ముగ్గురికి కాంస్య పతకాలు రావడంలో ప్రత్యేక ఉపాధ్యాయుడి కృషి అభినందనీయమని అన్నారు.

    మూడు దశల్లో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాలు

    మహారాణిపేట: ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా మూడు దశల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశభక్తి భావజాలాన్ని ప్రజల్లో నింపే విధంగా విస్తృత ప్రచార క్యాంపెయిన్లు నిర్వహించాలని సూచించారు. పౌరులు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేయుట, ర్యాలీలు చేపట్టడం, ఇతర కార్యక్రమాల నిర్వహణలో ప్రోత్సాహం అందించాలని చెప్పారు. మొదటి దశ ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు, రెండోది 9 నుంచి 12వ తేదీ వరకు, 13 నుంచి 15వ తేదీ వరకు మూడో దశల్లో కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

    తిరంగతో సెల్ఫీ, ప్రభాత్‌–ఫెరిస్‌, తిరంగ ర్యాలీలు, తిరంగ ప్రదర్శనలు, ఇతర అట్టడుగు స్థాయి జనభాగీదారీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. సెల్ఫీలను www.harghartiranga.com వెబ్‌ సైట్‌ ద్వారా అప్‌లోడ్‌ చేయవచ్చని సూచించారు. అధికారులు, ప్రజలు హర్‌ ఘర్‌ తిరంగా వేడుకల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

  • డెంగ్యూ, మలేరియా ప్రబలకుండా ముందస్తు చర్యలు
    ● కలెక్టర్‌ విజయ కృష్ణన్‌

    తుమ్మపాల: సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వెయ్యాలని, కాలానుగుణ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా జ్వరాలు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ విజయ కృష్ణన్‌ తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా చేపడుతున్న అనేక సేవలపై అధికారులతో సోమవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీడీవోలను ఆదేశించారు. ఎస్‌డబ్ల్యూపీసీ, షెడ్లు, గ్రామీణ నీటి సరఫరా, జీఎస్‌డబ్ల్యూఎస్‌ సర్వే, గృహ నిర్మాణం, పంచాయతీ రాజ్‌, డ్వామా శాఖలపై, సూర్య ఘర్‌, ఉపాధి హామీ అంశాలపై సచివాలయాల ద్వారా నిర్వహిస్తున్న సర్వేలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. గిరి శిఖర గ్రామాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. గోకులం షెడ్డులను త్వరితగతిన పూర్తి చెయ్యాలన్నారు. రెండు ఆవులను స్వయం సహాయక బృందాల ద్వారా లోన్‌ ఇప్పించుటకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసి చెత్త సంపద సృష్టి కేంద్రానికి పంపించే ఏర్పాటు చెయ్యాలన్నారు. ప్రతి గ్రామంలో సూర్య ఘర్‌ యోజన లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. జిల్లాలో 5 సోలార్‌ గ్రామాలతోపాటు మిగిలిన అన్ని గ్రామాల్లో సొలర్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వేగవంతం చెయ్యాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో నారాయణ మూర్తి, డ్వామా పీడీ పి.పూర్ణిమాదేవి, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ ఏఎస్‌ఏ రామస్వామి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి హైమావతి, ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ ప్రసాద్‌, డీపీఆర్సీ జిల్లా కో ఆర్డినేటర్‌ నాగలక్ష్మి, జిల్లా గ్రామ వార్డు సచివాలయల అధికారి మంజులవాణి, పంచాయతీరాజ్‌ డీఈలు, జేఈలు పాల్గొన్నారు.

  • అదనపు భారం మోపొద్దని నిరసన

    అధికారులకు సెల్‌ఫోన్లు సరెండర్‌ చేసిన అంగన్‌వాడీలు

    నక్కపల్లి : ప్రధానమంత్రి మాతృ వందన యోజన వివరాలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని అదనపు బాధ్యత అప్పజెప్పడంపై అంగన్‌వాడీ సిబ్బంది ఆందోళన చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సెల్‌ఫోన్‌లను సోమవారం నక్కపల్లి ఐసీడీఎస్‌ కార్యాలయంలో సరెండర్‌ చేశారు. వాటితోపాటు సిమ్‌ కార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేసారు. అంగన్‌వాడీ వర్కర్ల జిల్లా అధ్యక్షురాలు దుర్గారాణి మాట్లాడుతూ 2జి రామ్‌తో 4జి నెట్‌వర్క్‌తో ఉన్న ఈ ఫోన్లను ఐదేళ్ల క్రితం అందజేశారన్నారు. ప్రస్తుతం 5జీ ఫోన్లలో మాత్రమే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన యాప్‌లు ఇన్‌స్టాల్‌ అవుతున్నాయన్నారు. తక్కువ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ ఫోన్‌ల ద్వారా లబ్ధిదారుల వివరాలు ఆన్‌లైన్‌ చేయడం సాధ్యం కావడం లేదన్నారు. 5జీ టెక్నాలజీ కలిగిన ఫోన్‌లు ఇవ్వాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అంగన్‌వాడీ సిబ్బందికి ట్యాబులు సరఫరా చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఏడాది పూర్తయినా హామీ నెరవేర్చలేదన్నారు. మినీ అంగన్‌వాడీ కేంద్రాలను మెయిన్‌ కేంద్రాలుగా మారుస్తామని హామీ ఇచ్చారని ఇంతవరకు జీవో విడదల చేయలేదన్నారు. ఐసీడీఎస్‌ పరిధిలో 309 మొబైల్‌ ఫోన్‌లను ఐసీడీఎస్‌ కార్యాలయంలో సరెండర్‌ చేశామన్నారు.

  • పరిహారం ఇవ్వలేదని రైతు మనస్తాపం
    ● బలవంతంగా పాకల తొలగింపుతో గుండెపోటు మృతి ● కృష్ణపాలెంలో విషాదఛాయలు

    రాంబిల్లి(అచ్యుతాపురం): పరిశ్రమల ఏర్పాటు కోసం రైతులు సాగు చేసే భూముల సేకరణ, జీవన భృతినిచ్చే పశువుల పాకలను బలవంతంగా తొలగించారనే వేదనతో ఓ రైతు మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన ఘటన రాంబిల్లి మండలంలో చోటు చేసుకుంది. కృష్ణంపాలెం గ్రామస్తులు, మృతుని భార్య వరహాలమ్మ అందించిన వివరాలిలా ఉన్నాయి. రాంబిల్లి మండలం కృష్ణంపాలెం శివారు గ్రామాల్లో ఉన్న భూముల్ని ఏపీఐఐసీ సేకరించింది. ఇటీవల అదనపు కర్మాగారాల స్థాపన కోసం గతంలో సేకరించిన భూముల్లో పశువులు పాకల్ని తొలగించే ప్రక్రియ చేపట్టారు. అయితే సర్వే బృందం ఇచ్చిన నివేదిక మేరకు అర్హులను గుర్తించడంలో పక్షపాతం చూపించారని ఇప్పటికే ఆ గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

    కళ్ల ముందు పాకల్ని తొలగించడం చూసి..

    కృష్ణంపాలెంకు చెందిన రైతు కుప్ప పైడియ్య(63) పశువుల పాకల్ని, ఇతరత్రా జీవన భృతికి దోహదపడే చెట్లను ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తొలగించారు. తమకు న్యాయం జరగలేదని, కుటుంబానికి ఆధారం లేకుండా చేశారని మదనపడిన పైడియ్య సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందారు. తమకు న్యాయం చేయా లని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, ఆ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ సిబ్బంది దురుసు ప్రవర్తన కారణంగా తన భర్త మృతి చెందారని వరహాలమ్మ, కుమారుడు గణేశ్‌ కన్నీరుమున్నీరుగా విలపించారు. అభివృద్ధి పేరిట ప్రజల జీవన భృతిని దూరం చేసి ఆదుకోకపోవడం అన్యాయమని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్‌ చేశారు.

  • ఆ జీవో విద్యార్థుల గొంతు నొక్కేందుకే..!
    ● విద్యాశాఖ ఉత్తర్వులు వెనక్కితీసుకోవాలి ● ఉత్తర్వుల కాపీని దహనం చేసిన ఎస్‌ఎఫ్‌ఐ

    బీచ్‌రోడ్డు: పాఠశాలల్లో విద్యార్థుల స్వేచ్ఛను, ప్రజాస్వామిక హక్కులను హరించే విధంగా ఉన్న విద్యాశాఖ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉత్తర్వుల ప్రతులను దహనం చేసి తమ నిరసనను వ్యక్తం చేసింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.జె. నాయుడు మాట్లాడుతూ పాఠశాల విద్యా కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వులు విద్యార్థులు తమ సమస్యలను బయటకు తెలియజేసే అవకాశాన్ని లేకుండా చేస్తున్నాయని ఆరోపించారు. ఈ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమని, విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నమేనన్నారు. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లే విద్యార్థి సంఘాలకు అనుమతి లభించదని, దీనివల్ల విద్యార్థుల సమస్యలు బయటకు రాకుండా పోతాయన్నారు. ప్రైవేటు పాఠశాలల దోపిడీ మరింత పెరిగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

  • అంగన్‌వాడీ పోస్టు తారుమారుపై కౌన్సిల్‌లో చర్చకు కృషి
    ● దళిత మహిళ సునీతకు ధర్మశ్రీ హామీ ● తిమ్మరాజుపేటలో దీక్ష శిబిరం సందర్శన

    అచ్యుతాపురం రూరల్‌ : తిమ్మరాజుపేటలో గత 20 రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న దళిత మహిళ మంత్రి సునీతను సోమవారం వైఎస్సార్‌సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పరామర్శించారు. తనకు రావల్సిన అంగన్‌వాడీ పోస్టును తారుమారు చేశారని ఆరోపిస్తూ ఆమె చేపట్టిన దీక్ష శిబిరాన్ని ధర్మశ్రీ సందర్శించి సంఘీభావం తెలిపారు. తనకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పటి వరకూ వస్తున్న బెదిరింపుల విషయంపై ఆయనకు సునీత వివరించారు. తనకు న్యాయం చేయాలంటూ ధర్మశ్రీకి ఆమె వినతిపత్రం అందజేశారు. దీనికి స్పందించిన ఆయన.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, తదితర పార్టీ పెద్దలతో మాట్లాడి వచ్చే కౌన్సిల్‌ సమావేశంలో చర్చించి, న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా దీక్ష విరమించాలని ఆమెకు ధర్మశ్రీ సూచించారు.

Bapatla

  • అంగన్‌వాడీలకు ‘యాప్‌’సోపాలు

    చీరాల అర్బన్‌: జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు తొమ్మిది ఉన్నాయి. వీటిలో 1888 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు ఉన్న చిన్నారులు 69,217 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషణ అందించడంతోపాటు గర్భిణులకు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వారి ఆరోగ్య సంరక్షణకు అవసరమైన పోషణ అందించడంలో వీరి పాత్ర ఎంతో ఉంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో కొత్తగా యాప్‌లు తీసుకువచ్చారు. అందుకు వీలుగా స్మార్ట్‌ఫోన్లను అంగన్‌వాడీలకు అందించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు పోషణ సరఫరాలో ప్రత్యేక యాప్‌లలో పలుమార్లు నమోదు చేయాల్సి ఉంది. కేంద్రాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల సంజీవిని యాప్‌, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోషణ ట్రాకర్‌ యాప్‌తో కార్యకర్తలు అవస్థలు పడుతున్నారు. పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో ముఖ గుర్తింపు వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌)/బయోమెట్రిక్‌ తప్పనిసరి కావడంతో నెట్‌వర్క్‌ సరిగా పనిచేయకపోయినా, లబ్ధిదారుల మొబైళ్లలో మెసేజ్‌ బ్యాలెన్స్‌ లేక ఓటీపీలు రాకపోయినా సరుకులు అందించలేని పరిస్థితి ఉంది.

    యాప్‌లే యాప్‌లు

    అంగన్‌వాడీలతోపాటు లబ్ధిదారులు కూడా యాప్‌ల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. పోషణ్‌ ట్రాకర్‌ యాప్‌లో గర్భిణి, బాలింత, టీహెచ్‌ పిల్లల వివరాలు నమోదుతోపాటు వారికి ఎఫ్‌ఆర్‌ఎస్‌, ఈకేవైసీ, ఆధార్‌ ఫేస్‌ మ్యాచింగ్‌ చేయాలి. కొంతమంది లబ్ధిదారులు ఎప్పుడో చిన్న వయస్సులో ఉన్న ఫొటోతో ఆధార్‌ కార్డులతో ఇప్పుడు పోషణ ట్రాకర్‌ యాప్‌లో చేసుకునేందుకు అవకాశం లేదు. దీంతో ఆధార్‌ అప్‌డేట్‌ చేయాల్సి ఉంది. గతంలో ఇచ్చిన ఫోన్లు సహకరించకపోవడంతో సొంత ఫోన్లలో సిమ్‌లు వేసుకుని పనిచేయాల్సి వస్తుంది. ప్రతి నెలా కేంద్రాలకు పాలు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన మిల్క్‌ యాప్‌, రాష్ట్ర ప్రభుత్వం మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కోసం ఉన్న యాప్‌లో ఫొటోలు అప్‌లోడ్‌ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఏఎన్‌ఎంలు చేసే మాతృవందన పథకానికి సంబంధించిన యాప్‌ త్వరలో అంగన్‌వాడీలకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఉన్న యాప్‌లతో అవస్థలు పడుతుంటే మరో యాప్‌ను అప్పగించడంపై అంగన్‌వాడీలు ఆపసోపాలు పడుతున్నారు.

    బోధన తగ్గి.. పనిభారం పెరిగి..

    ప్రస్తుతం అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆయా కేంద్రాలలో 15 వరకు రికార్డులు నిర్వహిస్తున్నారు. లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం, పిల్లలకు, బాలింతలకు, గర్భిణుల నమోదు, ప్రీ స్కూల్‌ అడ్మిన్‌ రికార్డులను ప్రతిరోజూ విధిగా నమోదు చేయాలి. మరోవైపు పిల్లల టీకాల రికార్డులు, విటమిన్‌–ఎ రికార్డు, రిఫరల్‌ సర్వీసెస్‌, గృహ సందర్శన రికార్డులు, నెలవారీ ప్రాజెక్టులు, హౌస్‌హోల్డ్‌ సర్వే రికార్డు, గ్రోత్‌ చార్ట్‌ తదితర రికార్డులు నమోదు చేయాల్సి ఉంది. దీంతో పిల్లలకు ప్రీస్కూల్‌ బోధన అటకెక్కుతుంది.

    యాప్‌ల భారం తమపై మోపవద్దంటూ సీపీడీఓకు వినతిపత్రం అందిస్తున్న అంగన్‌వాడీలు

    ఇచ్చేది గోరంత.. పని కొండంత

    అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చే జీతం కంటే పనిభారం అధికంగా ఉంది. మెయిన్‌ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ కార్యకర్తకు నెలకు రూ.7 వేలు, ఆయాలకు రూ.7 వేలు గౌరవవేతనం అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాల నిర్వహణ, లబ్ధిదారులకు పోషకాహారం సరఫరా చేసేందుకు తీసుకువచ్చిన యాప్‌లతో విసిగిపోతున్నారు. యాప్‌ల భారం తమపై మోపవద్దంటూ ఇప్పటికే పలుమార్లు నిరసనలు చేశారు. యాప్‌ల భారం తమపై వేయవద్దంటూ వేటపాలెం ప్రాజెక్టు సీడీపీఓ ఝాన్సీకి వినతిపత్రం అందించారు. ప్రాజెక్టు పరిఽధిలో 270 అంగన్‌వాడీ కేంద్రాలుండగా 150 మంది అంగన్‌వాడీలు పనిచేయని ఫోన్లు తమకు వద్దంటూ సోమవారం ఐసీడీఎస్‌ కార్యాలయాలకు అప్పగించారు.

    డేటా నమోదు చేయలేక అవస్థలు పడుతున్నాం..

    కేంద్రాల నిర్వహణకు ప్రవేశపెట్టిన యాప్‌లు మోరాయించడం, సర్వర్లు పనిచేయకపోవడంతో నిత్యం ఫోన్లతో ఇబ్బందులు పడుతున్నాం. దీంతో ఒత్తిడికి లోనవుతున్నాం. తక్కువ వేతనం ఇస్తూ పలు రకాల యాప్‌లతో తీవ్రమైన పని ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్ర యూనియన్‌ పిలుపు మేరకు కేంద్రాల నిర్వహణకు గతంలో ఇచ్చిన ఫోన్లును ప్రాజెక్టు కార్యాలయాలలో అప్పగిస్తున్నాం.

    – ఎలిజిబెత్‌ రేఖా, జిల్లా కార్యదర్శి, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌

    పనికంటే యాప్‌లో నమోదే ఎక్కువ పనిచేయని సర్వర్లు యాప్‌లతో సతమతమవుతున్న అంగన్‌వాడీలు యాప్‌ల భారం మోయలేమంటూ ఫోన్లు అప్పగింత

  • క్వారీ అనుమతులు రద్దు చేయాలి

    నరసరావుపేట: బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో భద్రత చర్యలు తీసుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1కోటి నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సోమవారం క్వారీ ప్రమాద స్థలంతో పాటు నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులకు మించి క్వారీలో లోతులోకి వెళ్లి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే క్వారీ యజమానులు ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు కన్పించట్లేదన్నారు. రెవెన్యూ, కార్మిక శాఖ, మైనింగ్‌ శాఖ పర్యవేక్షణ లోపించడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని అన్నారు.

    డిమాండ్‌ చేసిన పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు

  • పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి

    బాపట్ల అర్బన్‌: పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ఓఎస్‌డీ వెంకటకృష్ణ పేర్కొన్నారు. బాపట్ల డివిజనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ కార్యాలయాన్ని ఆయన సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇ.టి.సి ప్రిన్సిపాల్‌ డి.వెంకటరావు, జిల్లా పరిషత్‌ డిప్యూటీ సీఈవో చొప్పర కృష్ణ, ఇ.ఇ.పీఆర్‌ వేణుగోపాల్‌రెడ్డి, బాపట్ల, రేపల్లె, చీరాల డి.డి.వొలు విజయలక్ష్మి, పద్మ, పద్మావతి, ఎంపీడీవో బాబురావు, డి.ఇ.పి.ఆర్‌. పి.రాజన్న, ఏఈ పి.ఆర్‌.మోహన్‌రావు పాల్గొన్నారు.

    బాపట్ల: గ్రామాభివృద్ధిలో ఎంపీడీవోల పాత్ర కీలకమని వెంకటకృష్ణ పేర్కొన్నారు. కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ప్రమోషన్‌ పొందిన ఎంపీడీవోల ఒక నెల శిక్షణ కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఆయన సూచించారు. శిక్షణ పొందిన ఎంపీడీవోలు వారికి కేటాయించిన మండలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని కోరారు. ఈటీసీ ప్రిన్సిపాల్‌ డి.వెంకట్రావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ పి.పద్మజ, శిక్షణలో 48 మంది ఎంపీడీవోలు పాల్గొన్నారు.

  • రెంటచ

    బంగారు అభరణాలు..నగదు అపహరణ

    రెంటచింతల: రెంటచింతలలోని రేంజర్‌గారి బజారులో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేంజర్‌గారి బజారులో నివసిస్తున్న జెట్టిపాలెం ఏపీ మెడల్‌ స్కూల్‌ పాఠశాల ఉపాధ్యాయుడు గెల్లిపోగు జనార్ధనరావు మాచర్ల పట్టణంలో ఉంటున్న తన తల్లి మరియమ్మను చూడటానికి శనివారం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో దాచిన 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాసరావు, ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

    షూటింగ్‌ బాల్‌ జిల్లా జట్ల ఎంపిక

    సత్తెనపల్లి: జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జూనియర్‌ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. బాలుర విభాగంలో 80 మంది, బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోనంకి కిరణ్‌ కుమార్‌ తెలిపారు.

    బాలుర జట్టుకు: కె.వెంకట్‌, జి.నవీన్‌, పి.మోబీన్‌, బి.రిషి, జి.వెంకటేష్‌, షేక్‌.అబ్దుల్‌, ఎం.హఫీజ్‌, ఎం.మహీధర్‌, కె.ప్రవీణ్‌, జి.మాంజి, కె.సుధీర్‌, ఎస్‌.భార్గవ్‌లు ఎంపికయ్యారు.

    బాలికల జట్టుకు: యమ్‌.విజయ పరిమళ, కె.హిమ బిందు, జె.లక్ష్మి కీర్తన, జె.యశస్విని, పి.మేఘన, పి.సుచరిత, ఎం.నందిని, సిహెచ్‌.అక్షర, కె.హర్షిత, టి.సింధు, ఎం.జ్యోతిక, ఎస్‌.మధులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్‌దత్తానాయక్‌, షేక్‌.మెహబూబి, బి.తులసీరామ్‌నాయక్‌, ఎ.చిన్నయ్య, తిరుపతమ్మ, రత్నాకర్‌, యమ్‌.ప్రసన్న, పి.శివరామకృష్ణ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు.

    ద్విచక్ర వాహనాలపై స్పెషల్‌ డ్రైవ్‌

    నరసరావుపేటరూరల్‌: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల విలువైన ప్రాణాల ను కాపాడేందుకు ట్రాఫిక్‌ ఉల్లంఘనకు పాల్పడే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా ఆదేశాల మేరకు జిల్లాలో డ్రైవ్‌ కొనసాగుతుందన్నారు.

  • కలెక్టర్‌ ఆదేశించినా పెన్షన్‌ ఇవ్వని అధికారులు

    మార్టూరు: సాక్షాత్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా బాధితులకు పెన్షన్‌ ఇవ్వకుండా నాటకాలు ఆడుతున్న ఇద్దరు అధికారుల వైనం మార్టూరు మండలం కోనంకి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల వివరాల మేరకు.. మండలంలోని కోనంకి గ్రామం నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలూరి స్వగ్రామం. ఈ గ్రామంలో గత ప్రభుత్వ హయాం నుంచి 27 మంది డప్పు, చర్మ కళాకారులుగా పెన్షన్‌ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తాళ్లూరి అచ్చయ్య, తాళ్లూరి అమరయ్య అనే ఇద్దరు వ్యక్తులకు పంచాయతీ కార్యదర్శి నక్క సుధాకర్‌ ఈనెల మూడో తేదీ వరకు పెన్షన్‌ ఇవ్వలేదు. మార్టూరు ఎంపీడీవో వై శ్రీనివాసరావుకు బాధితులు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోవడంతో నాలుగో తేదీ సోమవారం బాధితులు జిల్లా కలెక్టర్‌ జె. వెంకట మురళికి గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు.

    ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్‌..

    బాధితుల ద్వారా వివరాలు తెలుసుకున్న కలెక్టర్‌, ఎంపీడీవో శ్రీనివాసరావుకు ఫోన్‌ చేసి 27 మందికి పెన్షన్‌ రాగా ఇద్దరికీ ఇవ్వకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజే వారికి వచ్చిన పెన్షన్‌ అందజేయాలని ఎంపీడీవోని ఆదేశించగా బాపట్ల నుంచి మార్టూరు వచ్చిన బాధితులు ఎంపీడీవోని కలిశారు. కోనంకి పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌కు ఫోన్‌ చేసిన ఎంపీడీవో ఇద్దరికీ పెన్షన్‌ ఇవ్వాలని చెప్పి పంపించారు. పెన్షన్‌ కోసం పంచాయతీ కార్యాలయానికి వచ్చిన అచ్చయ్య, అమరయ్యలను సుధాకర్‌ సుమారు రెండు గంటల పాటు కూర్చోబెట్టి పెన్షన్‌ ఇవ్వకుండానే పంపించి వేశారు. పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ ఏమంటున్నాడంటే.. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ను విలేకరులు వివరణ కోరగా అచ్చయ్య, అమరయ్యలు ఇద్దరు సంబంధిత వృత్తి చేయడం లేదని సోమవారం కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేశారని, అందుకని పెన్షన్‌ ఇవ్వలేదన్నారు. ఫిర్యాదు ఎవరు చేశారో చెప్పలేకపోయిన సుధాకర్‌ మొత్తం 27 మందిపై ఫిర్యాదు చేశారని.. దర్యాప్తు చేసి నిర్ధారించుకున్నాకే పెన్షన్‌ ఇస్తానని, అందుకు ఎంపీడీవో కూడా ఇవ్వవద్దని అన్నట్లుగా చెప్పారు.

    మీరుమీరు చూసుకోండన్న ఎంపీడీవో..

    ఇదే విషయాన్ని ఎంపీడీవో శ్రీనివాసరావును వివరణ కోరగా కాన్ఫరెన్స్‌ కాల్‌లో సెక్రటరీ సుధాకర్‌తో మాట్లాడారు. పెన్షన్‌ ఇవ్వవద్దని నేను అనలేదు కదా.. వచ్చిన పెన్షన్‌ ఇచ్చి తరువాత విచారణ ఉంటే చేసుకోమని చెప్పాను కదా అంటూ ఎంపీడీడీవో బదులిచ్చాడు. ఆ తర్వాత ఎంపీడీవో సుధాకర్‌ మీడియా ప్రతినిధులు ఇద్దరినీ ఉద్దేశించి మీరుమీరు చూసుకోండి అని చెప్పడం గమనార్హం. జిల్లా కలెక్టర్‌ ఆదేశించినా కింది అధికారులు పెన్షన్‌ ఇవ్వకపోవడం ఏంటని, 27 మందిపై ఫిర్యాదు ఉంటే అందరికీ పెన్షన్‌ ఆపి దర్యాప్తు చేయాలి కానీ 25 మందికి పెన్షన్‌ ఇచ్చి ఇద్దరికీ ఆపటం ఏంటని బాధితులు అచ్చయ్య అమరయ్య వాపోతున్నారు.

    ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శుల దోబూచులాట.

  • వైన్‌

    మార్టూరు: మండలంలోని ద్రోణాదుల గ్రామంలోని వైన్స్‌ షాప్‌ సమీపంలో సోమవారం ఉదయం ఒక పురుషుని మృతదేహం గుర్తించారు. అందిన వివరాల మేరకు.. ద్రోణాదుల నుంచి బొబ్బేపల్లి వెళ్లే మార్గంలో ఉన్న నేల చట్ట పక్కన ముళ్ల పొదలలో పురుషుడి మృతదేహాన్ని సోమవారం ఉదయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల విచారణలో మృతుడు ఇంకొల్లు మండలం నాగండ్ల గ్రామానికి చెందిన మురికిపూడి విజయ్‌ (65)గా గుర్తించి మృతదేహాన్ని మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడు విజయ్‌ రెండు రోజులుగా స్థానిక వైన్స్‌ షాప్‌ సమీపంలో మద్యం తాగుతూ అక్కడే సంచరిస్తున్నట్లు విపరీతమైన దాహార్తితో కానీ గుండె నొప్పితో కానీ మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

    గుర్తు తెలియని వ్యక్తిమృతి

    చీరాల రూరల్‌: రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం చీరాల–స్టూవర్టుపురం రైల్వేస్టేషన్ల మధ్యగల ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ ఎస్సై సీహెచ్‌ కొండయ్య వివరాల మేరకు.. ఈపురుపాలెం స్ట్రయిట్‌కట్‌ కాలువ సమీపంలో ఉదయం ఏడు గంటల సమయంలో రైలుబండిని గమనించకుండా రైలు పట్టాలు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని రైలుబండి ఢీట్టింది. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో చీరాల ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని వయస్సు 28 సంవత్సరాలు ఉంటాయని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

    గూడ్స్‌ రైలు ఢీకొని వృద్ధుడి మృతి

    నరసరావుపేట టౌన్‌: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఇన్‌చార్జి రైల్వే ఎస్‌ఐ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. నరసరావుపేట నుంచి మునుమాక వెళ్లే రైలు మార్గంలో ఆదివారం గుంటూరుకు చెందిన పెండెం సాయిబాబు(65) పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం బంధువులకు అప్పగించారు.

  • ముగిసిన రాష్ట్రస్థాయి ఫ్లోర్‌ బాల్‌ పోటీలు

    నరసరావుపేట ఈస్ట్‌: గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్‌–14, అండర్‌–19 బాల బాలికల ఫ్లోర్‌ బాల్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో 16 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీల విజేతల వివరాలను పాఠశాల చైర్మన్‌ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ పి.సురేంద్ర ప్రకటించారు. బాలికల అండర్‌–14 విభాగంలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమస్థానం కై వసం చేసుకోగా, శ్రీసత్యసాయి జిల్లా రెండవ స్థానం, కర్నూలు, అనంతపురం జిల్లాలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్‌–19 విభాగంలో తిరుపతి ప్రథమస్థానం సాధించగా, కృష్ణా, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర అండర్‌–14 విభాగంలో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ ప్రథమ స్థానం సాధించగా, పల్నాడు, కర్నూలు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్‌–19 విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తిరుపతి, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి.

    – ఫ్లోర్‌ బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసఫ్‌ మాట్లాడుతూ, పోటీలో పాల్గొన్న క్రీడాకారుల నుంచి రాష్ట్ర జట్టుకు కొందరు పేర్లు ఎంపిక చేశామన్నారు. తిరిగి వారి ప్రతిభను పరిశీలించి తుది జట్టును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రజట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్‌లో బిహార్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విజేతలకు పాఠశాల చైర్మన్‌ నాతాని, డైరెక్టర్‌ కోమటినేని నాసరయ్య బహుమతులు అందించారు. ఫోర్‌ బాల్‌ అసోసియేషన్‌ జాయింట్‌ సెక్రటరీ ఎం.కిషోర్‌బాబు, పాఠశాల ఇన్‌చార్జి కోట బాపూజీ పాల్గొన్నారు.

  • రైతు పక్షాన నిలబడితే కేసులు పెడతారా?

    రేపల్లె: రైతు సమస్యలను రాజకీయం చేయడం కూటమి ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనమని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వరికూటి అశోక్‌బాబును సోమవారం ఆయన పరామర్శించి సంఘీభావం తెలిపారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాల వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమైన సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా నిరసన చేస్తున్న అశోక్‌ బాబును అక్రమంగా అరెస్టు చేసి పిడిగుద్దులతో దాడి చేశారన్నారు. కాలువలు పుడికలు తీయించలేని దిక్కుమాలిన స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వైఎస్సార్‌ సీపీ క్యాడర్‌పై పట్టణ సీఐ మల్లికార్జునరావు తీరు వివాదాస్పదంగా ఉందని, భవిష్యత్‌లో ఆయన తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు ప్రజలపై అధికారులు, కూటమి నేతలు చేస్తున్న ఆగడాలను నమోదు చేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామన్నారు. మంత్రి అనగాని అండదండలతో పోలీసు అధికారులు బ్రోకర్‌ పనులు చేస్తున్నారని విమర్శించారు. అశోక్‌బాబు ఆరోగ్యం క్షీణించిందని, పోలీస్‌ కస్టడీలో అశోక్‌బాబు ఉన్నాడంటూ వైద్యశాల సిబ్బంది డిశ్చార్జి చేయడం లేదన్నారు. అశోక్‌బాబును వేరే ఆసుపత్రికి తీసుకెళితే తమ కస్టడీ నుంచి పరారయ్యాడని మరో అక్రమ కేసు బనాయించే కుట్రలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కారానికి హామీనివ్వటంతో పాటు అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేయాలని డిమాండ్‌ చేశారు.

    అధికారుల ఆడగాలను ప్రత్యేక యాప్‌లలో నమోదు చేస్తున్నాం వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి

  • పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకం

    పర్చూరు(చినగంజాం): పాఠశాల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యులు కావాలని రాష్ట్ర పాఠశాలల పరిశీలన బృందం సభ్యుడు, డైట్‌ లెక్చరర్‌ పీ రమేష్‌ అన్నారు. పర్చూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను పాఠశాలల్లో విద్యాభివృద్ధి పరిశీలనలో భాగంగా ఆయన సోమవారం సందర్శించారు. పాఠశాలలో వివిధ తరగతులు అభివృద్ధి, పాఠశాలలోని రికార్డుల నిర్వాహణ, అకడమిక్‌ అంశాలు, పిల్లల హాజరు, వారిలో విద్యాభివృద్ధి, పాఠశాల పరిసరాలు, మధ్యాహ్న భోజనం అమలు, అందుకు సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించారు. ముందుగా ఆయన పాఠశాల ప్రార్థనా సమయానికి వచ్చి పిల్లలు యూనిఫాం నిర్వహణ, క్రమశిక్షణ అమలు తీరును పరిశీలించారు. మధ్యాహ్న భోజన సమయంలో ఆయన స్వయంగా భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. 1వ తరగతి నుంచి మొదలుకొని అన్ని తరగతులను పరిశీలించారు. పాఠశాలలోని ఉపాధ్యాయులకు వివిధ సూచనలు చేశారు. భవిష్యత్‌లో పాఠశాలను సందర్శిస్తామని విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలను మెరుగు పరచుకునేందుకు చర్యలు తీసుకోవాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ–1 ఏ.శివ కోటేశ్వరరావు, ఎంఈఓ–2 పీ.వెంకటరామయ్య, పాఠశాల హెచ్‌ఎం ఎం. నాగిరెడ్డి, పీ. నాగమణి, సీఆర్‌ఎంటీలు ఏ. ఉమావెంకట మహేశ్వరరావు, సాయికుమార్‌ పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

    రాష్ట్ర పాఠశాలల పరిశీలన బృందం సభ్యుడు రమేష్‌

  • అట్టహాసంగా పోలేరమ్మ జాతర

    బాపట్ల అర్బన్‌: బాపట్ల పట్టణంలోని రామకృష్ణాపురంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద మూడోరోజు పోలేరమ్మ కొలుపులు సోమవారం ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిషేక మహోత్సవాన్ని వీక్షించడానికి, అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి దూర ప్రాంతాల్లో నివసించే వారితోపాటు చుట్టూ పక్కల గ్రామ ప్రజలు హాజరయ్యారు. పోలేరమ్మ జాతర మహాలక్ష్మి గుడినిపూలు, విద్యుత్‌ దీపాలతో అలకరించారు. కోలాట ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సుమారు 20 మంది పాటలతో లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నాదెండ్ల రాంబాబు, పేరాల నాగేశ్వరరావు, కొన్నే వెంకటేశ్వర్లు, నామేపల్లి లక్ష్మీనారాయణ, శంఖవరపు రాంబాబు, పెద్ద వెంకట్రావు, చిన్న వెంకటరావు, మణి, శరత్‌, మహేష్‌, వినుకొండ శ్రీను, కొండవీటి శ్రీను,సాంబ, పత్తిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

    ఆకట్టుకున్న పెద్దలు, చిన్నారుల నృత్యాలు

  • మృత్యుకుహరాలు గ్రానైట్‌ క్వారీలు

    సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని గ్రానైట్‌ క్వారీలు మృత్యుకుహరాలుగా మారాయి. పొట్టకూటి కోసం ఒడిశా, ఎంపీ, యుపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కార్మికులు వచ్చి క్వారీల్లో పనిచేస్తూ మృత్యువాత పడుతున్నారు. ఆర్గనైజర్ల ద్వారా పనిలోకి వస్తున్న కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందినా యజమానులు బయటకు తెలియనీయడంలేదు. మృతుల వివరాలు తక్కువగా చూపి మృతదేహాలను మట్టిలో కప్పెడుతున్నారు. దీంతో తమవారు ఎక్కడున్నారో? ఎక్కడ పనిచేస్తున్నారో, అసలు ఏమయ్యారో కూడా వారి కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశంలేదు. ఒకవేళ మృతుల వివరాలు తెలిసిన కార్మికులు ఉన్నా.. క్వారీల యజమానులు వారిని భయపెట్టి వివరాలు కుటుంబ సభ్యులకు చేరకుండా చూస్తున్నారు.

    ప్రమాద ఘటనలో మృతులెందరు?

    శనివారం జరిగిన బల్లికురవ మండలం కొనెదన రెవెన్యూలోని సత్యకృష్ణ క్వారీ ప్రమాదఘటనలో మృతుల సంఖ్యపై బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పెద్ద దుమారమే రేగింది. పచ్చనేత దివ్యరామాంజనేయులుకు చెందిన ఈ క్వారీలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 15గా ఉందని కొందరు.. కాదు 16 మంది అని మరికొందరు అంతకు మించి ఉండవచ్చని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి ప్రమాద సమయంలో ఆరు జాకీలు పనిచేస్తుండడంతో 18 మందికి తక్కువ లేకుండా ఉన్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారులు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని ప్రకటించారు. వారిలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డట్లు తెలిపారు. కానీ నరసరావుపేట ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు చూపారు. ముగ్గురు గాయపడితే ఏడుగురు ఎలా చికిత్స పొందుతారని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన మృతుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చని, ఆరుగురిని లెక్క చూపి మిగిలిన మృతదేహాలను క్వారీలోనే పూడ్చి పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    పొంతన లేని ప్రకటనలు

    ప్రమాద ఘటనపై అధికారులు, పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. క్వారీలో 12 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని, ఆరుగురు మృతి చెందిగా ముగ్గురు గాయాలపాలయ్యారని, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారని జిల్లా అధికారి, అధికారులు ప్రకటించారు. క్వారీలో తొమ్మిది మంది కార్మికులు ఉన్నారని, ఆరుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని అదేరోజు సాయంత్రం అద్దంకిలో సీఐ విలేకరులకు చెప్పారు. ఆదివారం నాటికి గాయపడినవారి సంఖ్య ఏడుకు పెరిగింది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో మృతుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    చేతులు మారిన కోట్లు

    క్వారీ ప్రమాదంలో పదిమందికి మించి కార్మికులు మృతి చెందితే లీజులు రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రమాదంలో ఎక్కువ మంది మృతి చెందినా ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు చూపుతున్నట్లు సమాచారం. అధికారులు మృతుల సంఖ్యను మార్చిమార్చి చెప్పి ఎట్టకేలకు ఆరుగురుగా ప్రకటించారు. మిగిలిన వారిపై స్పష్టతనివ్వలేదు. క్షతగాత్రుల సంఖ్యను ఇష్టానుసారంగా ప్రకటించడం విమర్శలకు దారితీసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సొంత నియోజకవర్గం కావడంతో ప్రమాద ఘటన అనంతరం అధికారపార్టీ ముఖ్యనేతల జోక్యంతోపాటు రూ.కోట్లలోనే డబ్బులు చేతులు మారిన కారణంగానే అధికారులు మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

    బల్లికురవ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై అనుమానాలు

    మృతుల సంఖ్యను తక్కువగా చూపినట్లు ప్రచారం పచ్చనేత ఒత్తిళ్లు, నోట్ల కట్టలకు తలొగ్గినట్లు అధికారులపై ఆరోపణలు క్వారీల్లో కానరాని భద్రతా చర్యలు పొట్టకూటి కోసం వచ్చి విగత జీవులుగా మారుతున్న వైనం పట్టించుకోని పోలీసులు, మైనింగ్‌, కార్మిక శాఖలు ఇతర రాష్ట్రాల కార్మికులు కావడంతో ఖాతరు చేయని క్వారీ యజమానులు

    నిబంధనలకు పాతర

    వాస్తవానికి క్వారీలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. కార్మికులు పనిచేసేటప్పుడు వారికి భద్రతా పరంగా హెల్మెట్లు, బూట్లు ఇతర సామగ్రి ఇవ్వాలి. కార్మికులకు పర్యవేక్షకులుగా మేట్లు, ఫస్ట్‌క్లాస్‌ మేనేజర్‌ ఉండాలి. ఆదివారం సెలవు కావడంతో వారెవరు లేరని తెలుస్తోంది. అయినా ఆదివారంనాడు కార్మికులతో ఎలా పనిచేయించారో క్వారీ యజమానులు, అధికారులు చెప్పాలి. బల్లికురవ, సంతమాగులూరు పరిధిలో సుమారు 50 క్వారీలు ఉండగా ఒక్కొక క్వారీలో వందమంది చొప్పున 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 60 నుంచి 70 శాతం మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. క్వారీ ప్రమాదాల్లో గడచిన పదేళ్లలో 100 మంది మృతిచెందినట్లు సమాచారం.

  • స్వచ్

    భట్టిప్రోలు (కొల్లూరు): కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్కను తొలగించేందుకు రైతులు స్వచ్ఛందంగా కదిలారు. వైఎస్సార్‌ సీపీ నాయకులు వారికి అండగా నిలిచారు. పనులను అడ్డుకునేందుకు కూటమి నేతలు విఫలయత్నం చేశారు. అయితే రైతులు ప్రతిఘటించడంతోపాటు పోలీసుల జోక్యంతో కూటమి నేతలు వెనుదిరిగారు. అనంతరం భట్టిప్రోలు మండలం అద్దేపల్లి డ్రెయిన్‌లో గుర్రపు డెక్క తొలగింపు పనులు సోమవారం కొనసాగాయి.

    ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వరికూటి

    గుర్రపు డెక్క కారణంగా ఏడాది కాలంగా పంటలు కోల్పోతున్నామంటూ రైతులు వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు వద్ద మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన పదిహేను రోజుల కిందట తొలిసారి అద్దేపల్లి – గూడవల్లి డ్రెయిన్‌ను పరిశీలించారు. గుర్రపు డెక్క, తూటికాడలతో నిండిపోయిన డ్రెయిన్‌లో పనులు చేపట్టాలని కోరుతూ కాలువలో దిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో పనులు చేపట్టని పక్షంలో అదే ప్రాంతంలో ధర్నా చేపడతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం స్పందించకపోవడంతో వరికూటి చివరకు డ్రెయిన్‌ వద్దే బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతానికి చేరుకున్న డ్రెయినేజీ విభాగం అధికారులు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కూటమి ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో మిన్నకుండిపోయారు. దీనిపై ప్రశ్నించేందుకు వరికూటి రేపల్లెలోని కార్యాలయానికి చేరుకున్నారు. దీనిపై అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఆ కార్యాలయం ఎదుట నిరాహారదీక్షకు దిగారు. కూటమి నాయకుల ఒత్తిడితో పోలీసులు ఆయనను బలవంతంగా పోలీసుస్టేషన్‌కు తరలించి విచక్షణారహితంగా దాడి చేశారు. నాలుగు రోజులుగా రేపల్లె ప్రభుత్వ వైద్యశాలలో నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. వరికూటి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అయినా ప్రభుత్వం స్పందించ లేదు. మొండిగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు నిర్ణయించుకున్నారు. స్వచ్ఛందంగా గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులు చేపట్టారు.

    అండగా నిలిచిన వైఎస్సార్‌ సీపీ నాయకులు కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, తూటికాడ తొలగింపు పనులను అడ్డుకునేందు కూటమి నాయకులు విఫల యత్నం రైతులు ప్రతిఘటించడంతో వెనుదిరిగిన కూటమి నేతలు

    పనులను అడ్డుకునేందుకు

    కూటమి నాయకుల యత్నాలు

    రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు చేపట్టిన గుర్రపు డెక్క పనులను కూటమి నాయకులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకుల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకున్నారు. కూటమి నాయకులను అక్కడ నుంచి వెనక్కి పంపారు. అనంతరం తూటికాడ, గుర్రపు డెక్క తొలగింపు పనులు కొనసాగాయి. పొక్లెయిన్‌కు తోడు ఆప్రాంత రైతులు, వైఎస్సార్‌ సీపీ నాయకులు కాలువలో దిగి గుర్రపుడెక్క, తూటికాడ తొలగించారు.

  • సైబర్‌ వలలో సామాన్యులు

    చీరాల: వేటపాలెం మండలం దేశాయిపేట పంచా యతీలోని దంతంపేటకు చెందిన ఓ యువకుడు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అతని వాట్సప్‌కు వచ్చిన మెసేజ్‌ క్లిక్‌ చేసి చూడగా అందులో ఉన్న ఓ ప్రొడక్ట్‌ను క్లిక్‌చేసి స్క్రీన్‌ షాట్‌ తీసి పంపించాలని ఉంది. అతడు అలానే చేయగా ముందుగా రూ.150 బ్యాంకు ఖాతాకు జమ చేశా రు. ప్రొడక్ట్‌లను క్లిక్‌చేస్తే టాస్క్‌లు వస్తాయని నమ్మబలికారు. నగదు జమ అవుతుందని భావించిన అతడు వారు చెప్పినట్లుగా చేశాడు. చిన్నచిన్న అ మౌంట్‌లను సైబర్‌ నేరగాళ్లు అతని అకౌంట్‌లో జమ చేశారు. బాధితుడు పూర్తిగా వారిని నమ్మాడని నిర్ణయించుకుని తర్వాత విడతల వారీగా రూ.10 లక్షల వరకు దోచుకున్నారు.

    ● వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తి ఇంజినీరింగ్‌ కాలేజిలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. సైబర్‌ నేరగాళ్లు అతనికి ఒక లింక్‌ పంపించి క్లిక్‌ చేస్తే ప్రైజ్‌మనీ వస్తుందని మభ్యపెట్టారు. కొంత నగదు అకౌంట్‌లో జమ కావడంతో నకిలీ వెబ్‌సైట్‌ ద్వారా బ్యాంకు ఖాతా నుంచి రూ.30 లక్షలు కాజేశారు.

    ● చీరాల పట్టణంలో ఓ అంగన్‌వాడీ కార్యకర్తకు హెల్త్‌ డిపార్టుమెంట్‌ పేరుతో కాల్‌ వచ్చింది. గర్భిణులకు, బాలింతలకు జననీ సురక్ష కింద ముఖ్యమంత్రి రూ.15 వేలు ఇస్తున్నారని అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని లబ్ధిదారుల ఫోన్‌ నెంబర్లు ఇవ్వాలని కోరడంతో ముగ్గురి నెంబర్లు ఇచ్చారు. ఆ తర్వాత ముగ్గురికి కాల్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు వాట్సప్‌ పే ద్వారా ముగ్గురి అకౌంట్ల నుంచి రూ.1.70 లక్షలు కాజేశారు.

    ● వేటపాలెం మండలం పాపాయిపాలేనికి చెందిన ఓ వ్యక్తికి గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి యాక్సిడెంట్‌ ఫొటోలు వాట్సప్‌లో వచ్చాయి చూడమని చెప్పాడు. దీంతో ఏం జరిగిందోనని అతడు వాట్సప్‌లో చూడగా ఫొటోలు కనిపించలేదు. కొద్ది నిమిషాల్లో అతని బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు డెబిట్‌ అయినట్లుగా మెసేజ్‌లు వచ్చాయి. విడతల వారీగా రూ.5.72 లక్షలు డెబిట్‌ అయ్యాయి. ఇవన్నీ కొంత కాలంగా చీరాల నియోజకవర్గంలో జరిగి వెలుగులోకి వచ్చిన ఘటనలు. ఇలా ఎంతో మంది సైబర్‌ మోసాలకు బలవుతున్నారు. కొందరు తమకు జరిగిన మోసంపై మిన్నకుండిపోతున్నా మరికొందరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

    నిరక్ష్యరాస్యులు మొదలుకొని..

    ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొంత పుంతలు తొక్కుతోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఇదే సాంకేతికతను ఉపయోగించుకుని సైబర్‌ నేరగాళ్లు సామాన్యుల ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. నిరక్షరాస్యులతోపాటు టీచర్లు, ఉద్యోగులు, వ్యాపారులు సైతం మోసపోయి చివరకు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సైబర్‌ నేరాలకు పాల్పడే వాళ్లు ఎక్కువగా ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్లు చేస్తున్నారు. మోసపోయిన వారు ఫిర్యాదు చేసినప్పటికీ నిందితులు ఇక్కడి వారు కాకపోవడంతో గుర్తించడం కష్టతరమని పోలీసులు చెప్తున్నారు.

    కొత్త పుంతలు తొక్కుతున్నారు...

    బ్యాంక్‌ అకౌంట్‌ బ్లాక్‌ అయిందని, ఏటీఎం యా క్టివేషన్‌ చేయాలని బ్యాంకు నుంచి ఫోన్లు చేస్తున్నట్లుగా చేసి ఖాతాదారుని వివరాలు సేకరిస్తున్నారు. ఫేక్‌ ప్రొఫైల్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి స్నేహితులు, బంధువులకు ఫేక్‌ మెసేజ్‌లు పంపుతున్నారు. ఫేస్‌బుక్‌లో స్నేహితులు, బంధువులు అడిగినట్లుగా నగదు పంపించాలంటూ మెసేజ్‌లు రావడంతో నిజమేనని అనుకొని కొందరు నగదు బదిలీ చేసిన సంఘటనలు ఉన్నాయి. ఎవరిని అడగాలో ఏంచేయాలో తెలియక లబోదిబోమంటున్నారు.

    మాయమాటలతో ట్రాప్‌ పలు రకాలుగా ఫోన్లు నమ్మితే ఖాతాలో నగదు మాయం

    సైబర్‌ నేరాల పట్ల

    అప్రమత్తతగా ఉండాలి..

    సైబర్‌ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలియని నెంబర్ల నుంచి కాల్స్‌ వచ్చినా, లింక్‌లు పంపినా వాటిని తెరవవద్దు. లింక్‌పై క్లిక్‌ చేస్తే ఖాతాదారుని వివరాలను హ్యాక్‌ చేసి ఖాతాలోని నగదు మాయం చేస్తారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్‌, ఓటీపీలు ఎవరితోనూ షేర్‌ చేయవద్దు.బ్యాంకు మేనేజర్లతో సమావేశం నిర్వహించాం. సైబర్‌ నేరాల పట్ల ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తున్నాం.

    – ఎం.మోయిన్‌, డీఎస్పీ, చీరాల

  • ప్రార

    పెదకూరపాడు: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. కోటి 50 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయింది. జూలై 18వ తేదీన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చేతుల మీదుగా ఈ రహదారి ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడీ రహదారి కంభంపాడు జలాలపురం మధ్య కుంగిపోయింది. నాసిరకం నిర్మాణానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది.

    గారపాడులో పంచలోహ విగ్రహాలు చోరీ

    పెదకూరపాడు: గారపాడు గ్రామంలో ఆదివారం పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆలయ అర్చకులు గొట్టుముక్కల ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజల నిర్వహించేందుకు ఆదివారం ఉదయం అర్చకులు తలుపులు తెరవగా స్వామివారి, అమ్మవారి కళ్యాణ పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దక్షిణం వైపు గేటు తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి స్థానికులకు, ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పోలీస్‌ స్టేషన్‌ లో ఫిర్యాదు చేశారు. సీఐ పత్తిపాటి సురేష్‌, ఎస్సై గిరిబాబులు సంఘటన స్థలానికి చేరుకొని సోమవారం విచారించారు. క్లూస్‌ టీం ద్వారా ఆనవాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సురేష్‌ తెలిపారు.

    నేడు ప్రభుత్వ

    ఉద్యోగుల ఛాయ్‌ పే చర్చ

    నరసరావుపేట ఈస్ట్‌: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్‌ ఆవరణలోని క్యాంటీన్‌ వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం చేపడుతున్నట్టు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కే.ఆర్‌.సూర్యనారాయణ, రమేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు చుక్కా వెంకటేశ్వర్లు, కంపాల వెంకటేశ్వర్లు, షేక్‌.బాజీ, ఏ.భాగ్యమేరీ, రేణుక తదితరులు పాల్గొన్నారు.

    లక్ష్మీ నృసింహస్వామి వారికి చైన్‌ బహుకరణ

    మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీనృసింహస్వామి వారికి విజయవాడకు చెందిన మండ్రు శ్రీనివాస్‌, భాగ్యశ్రీ దంపతులు రూ.లక్ష విలువైన పింక్‌ కలర్‌ రాయి చైన్‌ను బహూకరించారు. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారికి మంగళగిరి పట్టణానికి చెందిన మానుకొండ వీరభద్రరావు, శివపార్వతి దంపతులు రూ. లక్ష విలువైన తిరునామాలను అందజేశారు.

  • రైతన్నను నట్టేట ముంచిన కూటమి ప్రభుత్వం

    బాపట్ల:కూటమి ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కారవేదికలో జిల్లా కలెక్టర్‌ జె.వెంకటమురళికి వినతి పత్రం అందించారు. నాగార్జున మాట్లాడుతూ రైతు సమస్యలను పరిష్కరించటంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే నాథుడే లేరన్నారు. ధాన్యంకు గిట్టుబాటు ధర లేదు, పొగాకు రైతులు ఇప్పట్లో కొలుకునే పరిస్థితి లేదన్నారు. రైతులకు ఎరువులు దొరకుండా బ్లాక్‌మార్కెట్‌లోకి వెళ్లే పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పడు రైతులను ఆదుకునేందుకు ఆర్బీకే వ్యవస్థను రూపొందించారని గుర్తు చేశారు. ధరల స్థీరీకరణ నిధిని ఏర్పాటు చేయటంతోపాటు ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కిందన్నారు. వ్యవసాయం దండగా అన్న చంద్రబాబునాయుడు మళ్లీ అదే ధోరణిలో ఉన్నారని తెలిపారు. రైతులకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతి ఏటా రూ.13,500 ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ దిశగా చర్యలు లేవన్నారు. రైతులకు అండగా ఉండేందుకు వైఎస్సార్‌ సీపీ సిద్ధంగా ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ డెప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి, పర్చూరు సమన్వయకర్త గాదె మధుసూదనరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు మోదుగుల బసవపున్నారెడ్డి, చేజర్ల నారాయణరెడ్డి, పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి తదితరులు ఉన్నారు.

    వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున బ్లాక్‌మార్కెట్‌లోకి ఎరువులు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

  • క్వారీలో ప్రమాదంపై మైన్స్‌ అధికారుల తనిఖీ

    బల్లికురవ: గ్రానైట్‌ క్వారీలో రాయి తీస్తుండగా ఆదివారం జరిగిన ఘోర ప్రమాదానికి సంబంఽధించి రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన మైన్స్‌ అండ్‌ సెప్టీ అధికారులు సోమవారం క్వారీలో తనిఖీ చేపట్టారు. బల్లికురవ సమీపంలోని ఈర్లకొండ సత్యకృష్ణ క్వారీలో రాయిపడి ఆరుగురు కార్మికులు మృతిచెందినట్లు, మొత్తం 16 మంది పనిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ వెంకట మురళికి అధికారులు తెలిపారు. ప్రమాద ఘటనపై పుర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని మైనింగ్‌ శాఖకు కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు డీఎంస్‌ అశోక్‌ కుమార్‌, డీడీ ఎం జ్ఞానేశ్వర్‌, ఏడీ రామచంద్ర, ఆర్డీవో చంద్రశేఖర్‌ నాయుడు, తహసీల్దార్‌ రవినాయక్‌, ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన సహాయ కమిషనర్‌ బృందం ప్రమాదం సంభవించిన క్వారీ ప్రాంతాన్ని పరిశీలించింది. ఆదివారం ఉదయం నుంచి క్వారీ నిర్వాహకులు కార్యాలయాలకు తాళాలు వేశారు.

    అధికారుల రాకతో అప్పటికప్పుడు క్వారీ, పరిసర క్వారీల నిర్వాహకులతో ప్రత్యక్షమయ్యారు. అప్పటికి అప్పుడు హెల్మెట్లు తెప్పించుకుని తలలకు ధరించారు. కార్మికులు చనిపోయిన ప్రదేశంలో ఒక్క హెల్మెట్‌ గాని, షూ కాని కనిపించక పొవటంతో భద్రతా చర్యలు పాటించకపోవటం వల్లే ఘోర ప్రమాదానికి కారణంగా భావించారు. అనంతరం నరసరావుపేటలోని జీబీఆర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న కార్మికులు ఎం సుదర్శన్‌ కె.నాయక్‌, శివా గౌడలను పరామర్శించి ప్రమాదానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పూర్తి నివేదికను తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Adilabad

  • ‘మధ్యాహ్న’ కార్మికుల సమ్మె

    కై లాస్‌నగర్‌: పెండింగ్‌ వేతనాలు,బిల్లులు విడు దల చేయాలనే డిమాండ్‌తో ఏఐటీయుసీ అ నుబంధ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. సోమవారం విధులు బహిష్కరించి కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించారు. సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంటా ల రాములు మాట్లాడుతూ.. ఏడాదిగా మధ్యా హ్న భోజన పథకానికి సంబంధించిన బి ల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వేతనాలు కూడా ఆరు నెలలుగా అందడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో వంట చేయడం ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. ఇందులో సంఘ నాయకులు శ్రీదేవి, రాంబాయి, పు ష్పలత, సంతోష్‌, నాందేవ్‌, లక్ష్మి పాల్గొన్నారు.

  • ఎఫెక్ట్‌..

    ఆ ఉపాధ్యాయుల వివరాలు పంపండి..

    ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ఆయా పాఠశాలలకు కేటాయించిన ఉపాధ్యాయులు విధుల్లో చేరడం లేదని సోమవారం ‘‘సర్దుబాటు’ ఆదేశాలు బేఖాతరు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన డీఈవో శ్రీనివాస్‌రెడ్డి సర్దుబాటు ప్రక్రియలో భాగంగా కేటాయించిన కొత్త పాఠశాలలకు చేరని టీచర్ల వివరాలు వెంటనే పంపించాలని ఎంఈవోలు, సంబంధిత ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు. వివరాల ఆధారంగా వారిపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

  • ఆమె భద్రతకు భరోసా
    ● పోకిరీల చేష్టలకు ‘షీటీం’తో చెక్‌ ● పలువురిపై పోక్సో కేసులు ● విద్యాసంస్థల్లో అవగాహన ● వేధింపులా.. డయల్‌ 8712659953

    ఆదిలాబాద్‌టౌన్‌: షీటీమ్‌.. మహిళలపై దాడులు, వేధింపులు, ఆకతాయిల చేష్టలకు చెక్‌ పెట్టేందుకు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఇది జిల్లాలో పటిష్టంగా పనిచేస్తోంది. గడిచిన ఆరు నెలల్లో నమోదైన కేసులే ఇందుకు నిదర్శనం. మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న పోలీసుశాఖ వారి రక్షణ కోసం షీ టీంలను ఏర్పాటు చేసింది. ఆడవాళ్లపై వేధింపులకు పాల్పడే వారిని ఉపేక్షించకుండా కేసులు నమోదు చేస్తున్నా రు. మైనర్లను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్న వారిపై పోక్సో కేసులు పెట్టి కటకటాల పాలు చేస్తున్నారు. మరోవైపు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసేందు కు వెనుకంజ వేస్తున్న వారికి సైతం అండగా నిలు స్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తూ వారి వివరాలు గోప్యంగా ఉంటున్నారు.

    జిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనలు..

    ● ఆదిలాబాద్‌లోని ఓ పాఠశాలలో షీటీమ్‌ సభ్యులు గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తుండగా, తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని బృంద సభ్యులకు సదరు విద్యార్థిని తెలిపింది. దీంతో నిందితుడిని అరెస్టు చేసి వన్‌టౌన్‌లో పోక్సో కేసు నమోదు చేశారు.

    ● ఇంద్రవెల్లి మండలంలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడని విద్యార్థినులు షీటీమ్‌ను ఆశ్రయించారు. దీంతో సదరు టీచర్‌పై పోక్సో కేసు నమోదు చేశారు.

    ● ఓ గ్రామం నుంచి యువతి టైలరింగ్‌ కోసం జిల్లా కేంద్రానికి వస్తుంది. ఈ క్రమంలో ఆమెను వేధిస్తున్న యువకుడిని షీటీమ్‌ మారువేషంలో వెళ్లి పట్టుకుని అరెస్టు చేశారు.

    ● ఓ బస్టాండ్‌లోని వాష్‌రూమ్‌లో ఓ మహిళకు సంబంధించిన ఫోన్‌ నంబర్‌ను ఓ వ్యక్తి రాశాడు. దీంతో ముగ్గురు ఆ మహిళకు ఫోన్‌ చేసి వేధింపులకు పాల్పడ్డారు. సదరు మహిళ షీటీంను ఆశ్రయించింది. ముగ్గురిని అరెస్టు చేయడంతో పా టు అక్కడి నుంచి ఫోన్‌ నంబర్‌ తొలగించారు.

    ● గుడిహత్నూర్‌లో ఓ బాలిక ఫొటోలు తీసి నిందితుడు వేధింపుకు పాల్పడ్డాడు. స్నేహితులకు వాటిని షేర్‌ చేశాడు. దీంతో పోలీసులు తొమ్మిది మందిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

    ● ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన ఓ వివాహితను ఏడేళ్లుగా ఓ వ్యక్తి వేధింపులకు పాల్పడుతున్నా డు. దీంతో బాధితురాలు షీటీంను సంప్రదించగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

    విస్తృత స్థాయిలో అవగాహన..

    మహిళలు, యువతులు, విద్యార్థినులపై జరుగుతు న్న అఘాయిత్యాలు, వేధింపులు, గుడ్‌టచ్‌, బ్యాడ్‌ టచ్‌, సోషల్‌ మీడియా తదితర విషయాలపై షీటీ మ్‌ సభ్యులు విస్తృతంగా అవగాహన సదస్సులు ని ర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, షాపింగ్‌ మాల్స్‌, దుకాణ సముదాయాలు, గ్రామాలకు వెళ్లి కూలీల కు సైతం అవగాహన కల్పిస్తున్నారు. జిల్లాలో ప్రస్తు తం ఒక షీటీమ్‌ పనిచేస్తుంది. ఇందులో ఏఎస్సై బి.సుశీల,హెడ్‌కానిస్టేబుల్‌ వాణిశ్రీతో పాటు ఇద్దరు ఏఆర్‌ మహిళా పోలీసులున్నారు. వీరికోసం ప్రత్యేక వాహనం కేటాయించారు. వీరు జిల్లాలో ఎక్కడ సంఘటన జరిగినాచేరుకొని బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడుతున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు.

    జిల్లాలో కేసుల వివరాలు..

    ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు 18 కౌన్సెలింగ్‌లు, 51 పెట్టి కేసులు, 16 ఎఫ్‌ఐఆర్‌, 84 అవగాహ న సదస్సులు నిర్వహించారు. 254 గ్రామాల్లో షీటీ మ్‌ సభ్యులు పర్యటించారు. నాలుగు బాల్య వివా హాలను అడ్డుకున్నారు. గడిచిన నాలుగు నెలల్లో నాలుగు పోక్సో కేసులు నమోదు చేశారు.

    వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు..

    మహిళలు, యువతులు, విద్యార్థినులను పోకిరీలు వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. బాధితులు షీటీమ్‌ సెల్‌:8712659953 నంబర్‌పై సంప్రదించాలి. స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. షీటీమ్‌ ద్వారా జిల్లాలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.

    – అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

  • టీచర్ల తీరు మారలే!
    ● ఫేషియల్‌ అటెండెన్స్‌ వచ్చినా అదే పరిస్థితి ● సమయపాలన పాటించని ఉపాధ్యాయులు

    ఆదిలాబాద్‌టౌన్‌: ఉపాధ్యాయుల హాజరుపై ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కొంతమంది తీ రు మాత్రం మారడం లేదు. ఇదివరకు బయోమెట్రి క్‌ ఉండగా కొందరు సమయపాలన పాటించారు. మరికొంత మంది వివిధ సాకులతో తప్పించుకున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ఇటీవల ఫేషియల్‌ అటెండెన్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. అయినా పలువురు తమ తీరు మార్చుకో వడం లేదని తెలుస్తోంది.

    జిల్లాలో ఇదీ పరిస్థితి..

    జిల్లాలో డీఈవో పరిధిలో 691 పాఠశాలలు ఉండగా, 3,288మంది ఉపాధ్యాయులు, సిబ్బంది పనిచేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఇంకా 230 మంది టీచర్లు యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోకపోవడం గమనా ర్హం. మొదటి రోజు 63 శాతం మంది యాప్‌ ద్వారా హాజరు వేసుకున్నారు. సోమవారం ఉపాధ్యాయు ల హాజరును రాష్ట్రవిద్యాశాఖ అధికారులు పరిశీ లించారు. ఇందులో పలువురు సమయపాలన పా టించలేదని తెలిసింది. జిల్లాకేంద్రంతో పాటు మా రుమూల మండలాల్లో ఉపాధ్యాయులు పాఠశాల కు ఉదయం 9.30 తర్వాత వెళ్లగా, మధ్యాహ్నం 3.30 గంటలకే ఇంటి ముఖం పట్టినట్లు తెలుస్తోంది. మరికొంత మంది 10గంటలు, 11 గంటలకు, 12గంటలు,ఒంటి గంటవరకు వెళ్లగా..మధ్యాహ్నం 3 గంటలు, 3.45 గంటలలోపే యాప్‌లో అటెండెన్స్‌ నమోదు చేసి ఇంటి ముఖం పట్టారని తెలు స్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆ రిపోర్టు ను పంపించగా అందులో పలువురి సమయపాలన వివరాలు ఇలా నమోదయ్యాయి. తిప్ప పాఠశాలకు చెందిన టీచర్‌ మధ్యాహ్నం 3.45 గంటలకు, అంకో లి ఉపాధ్యాయుడు ఉదయం 10.12 గంటలకు, రాంపూర్‌కు చెందిన ఉపాధ్యాయుడు 10గంటలకు, చాందాకు చెందిన ఉపాధ్యాయుడు మధ్యాహ్నం 1.31 గంటలకు, యాపల్‌గూడకు చెందిన ఉపాధ్యాయుడు 11.06 గంటలకు, కచ్‌కంటికి చెందిన టీచర్‌ మధ్యాహ్నం2.53గంటలకు, ఖిల్లాకు చెందిన టీచర్‌ మధ్యాహ్నం 1.37 గంటలకు, కేజీబీవీ మావలకు చెందిన సీఆర్టీలు ముగ్గురు 11.45, మరొకరు 12 గంటలకు, సరస్వతీనగర్‌కు చెందిన టీచర్‌ మధ్యాహ్నం1.05గంటలకు ఫేషియల్‌ అటెండెన్స్‌లో న మోదు చేసుకున్నారు. వీరే కాకుండా మరికొందరు సమయపాలన పాటించలేదని తెలుస్తోంది. ప్రస్తు తం ట్రయల్‌రన్‌కొనసాగుతుండగా, రెండు మూడు రోజుల తర్వాత ఈ అటెండెన్స్‌ పకడ్బందీగా అమలు చేయనున్నట్లు రాష్ట్రశాఖ అధికారులు పేర్కొన్నా రు. దీనిపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇక నుంచి సమయపాలన పాటించని వారికి హైదరాబాద్‌ నుంచే మెమోలు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అటెండెన్స్‌ షీట్‌ విడుదలతో సమయపాలన పాటించని ఉపాధ్యాయుల్లో గుబులు మొదలైంది.

  • వినతుల వెల్లువ

    పింఛన్‌, ‘ఇందిరమ్మ’ అర్జీలే అధికం

    ప్రజావాణికి 112 దరఖాస్తులు

    కై లాస్‌నగర్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కి వినతులు వెల్లువెత్తాయి. జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్‌ రాజర్షి షాను కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన ఆయన వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వారం వివిధ సమస్యలకు సంబంధించి మొత్తం 112 అర్జీలు అందాయి. ఇందులో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్ల మంజూరుకు సంబంధించిన వే ఉన్నాయి. అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌. రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ వారం అర్జీదారుల్లో కొందరి నివేదన..

    అధికారుల తీరుపై కలెక్టర్‌ అసంతృప్తి

    ప్రజావాణికి కలెక్టర్‌ ఉదయం 10.30 గంటలకే హాజరయ్యారు. అర్జీలకు సంబంధించి ఆయా శాఖ ల అధికారులను పిలువగా అందుబాటులో లేకపోవడంతో వారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మీ అధికారులెక్కడ అంటూ అక్కడే ఉన్న జిల్లా అధి కారుల సంఘం అధ్యక్షుడు మనోహర్‌ను ప్రశ్నించారు. వచ్చేవారం నుంచి సకాలంలో హాజరయ్యేలా చూస్తామని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం ఆయా శాఖల అధికారులు హుటాహుటిన హాజరయ్యారు. అయితే చాలామంది 11.30గంట ల సమయంలో గ్రీవెన్స్‌కు రావడం కనిపించింది.

  • ● అవగాహన కల్పిస్తున్న ‘సాధన సమితి’ ● మేము సైతం అంటున్న

    ఆదిలాబాద్‌టౌన్‌: విశ్వవిద్యాలయం ఏర్పాటే లక్ష్యంగా యూనివర్సిటీ సాధన సమితి వడివడిగా అడుగులేస్తోంది. ఓ వైపు మేధావులు, రాజకీయ పార్టీల నాయకులను కలుస్తూ ప్రణాళికలు సిద్ధం చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులు, విద్యార్థులకు వర్సిటీ ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ‘మేము మీ వెంట ఉన్నాం.. మీరు మా వెంట రండి.. మీ భవితకు బాటలు వేసుకోండని సూచిస్తున్నారు. సంఘటితంగా పోరాడితే లక్ష్య సాధన సులువేనని అంటున్నారు.

    వర్సిటీ ఆవశ్యకతను వివరిస్తూ..

    యూనివర్సిటీ ఆవశ్యకతపై సాధన సమితి సభ్యులు విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్రంథాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. ఓయూ, కేయూలు దూరంగా ఉండడంతో ఈ ప్రాంత విద్యార్థులు ఏవిధంగా నష్టపోతున్నారు.. అదే ఇక్కడ వర్సిటీ అందుబాటులోకి వస్తే ఒనగూరే ప్రయోజనాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నారు. ఒక ప్రాంతం అభివృద్ధి సాధించాలంటే అందులో విద్యారంగం పాత్ర కీలకమని చెబుతున్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఇందులో కన్వీనర్‌ బద్దం పురుషోత్తంరెడ్డి, కోకన్వీనర్‌ గొడిసెల రమణగౌడ్‌, సలహాదారులు, చిట్యాల సుహాసిని రెడ్డి, సభ్యులు నరేందర్‌రెడ్డి, కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సూరజ్‌ సింగ్‌, లెక్చరర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. అనంతరం ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో లెక్చరర్లతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. యూనివర్సిటీ సాధనకు తోడ్పాటునందించాలని కోరారు.

    ఉద్యమాలకు ప్రణాళిక సిద్ధం..

    వర్సిటీ సాధన సమితి ఉద్యమాలకు సిద్ధమవుతోంది. జిల్లాలోని అన్ని కళాశాలల్లో అవగాహన సదస్సుల అనంతరం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, సభలు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను కలిసి పోరాటంలో భాగస్వాములు కావాలని, అసెంబ్లీ, పార్లమెంట్‌లో విషయాన్ని ప్రస్తావించాలని విన్నవిస్తామని, సీఎంతో పాటు ఆయా శాఖల మంత్రులను కలుస్తామని సమితి సభ్యులు చెబుతున్నారు. వర్సిటీ సాధించేవరకు నిరంతరంగా ఉద్యమిస్తామని, శాంతియుత పోరాటాలు చేస్తామని పేర్కొంటున్నారు.

  • ● ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ

    మహాగర్జనకు తరలిరండి

    ఆదిలాబాద్‌రూరల్‌: పింఛన్‌ పెంపు హామీ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 13న హైదరాబాద్‌లో నిర్వహించనున్న మహాగర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మహాగర్జన సన్నాహక సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ‘సాక్షి’లో వృద్ధులు, దివ్యాంగుల గురించి కథనాలు రావడంతో చలించి వారి సమస్యలపై పోరాటాలు చేస్తున్నానని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో దివ్యాంగులకు రూ.6వేలు, వితంతువులు, వృద్ధులకు రూ.4వేల పింఛన్‌ పెంచి అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడస్తున్నా పింఛన్‌ పెంపు ఊసే లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి, మాజీ సీఎం కేసీఆర్‌కు పేదల బాధలు తెలియవని, ఎందుకంటే వారి ఇంట్లో ఎవరు కూడా పేదలు లేరన్నారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం, ఎమ్మార్పీఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

  • కలెక్టర్‌కు సన్మానం

    కైలాస్‌నగర్‌: సంపూర్ణత అభియాన్‌ సమ్మాన్‌ సమారోహ్‌లో రాష్ట్రస్థాయి పురస్కారం అందుకున్న కలెక్టర్‌ రాజర్షి షాను జిల్లా అధికారులు సోమవారం ఘనంగా సన్మానించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడు తూ, సమష్టి కృషితోనే అవార్డు సాధించగలిగా మని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్యామలాదేవి, ఆర్డీవో స్రవంతి, మున్సిపల్‌ కమిషనర్‌ సీవీఎన్‌.రాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

    తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరం

    కై లాస్‌నగర్‌: తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరమని, వాటి ప్రాముఖ్యతపై మహిళలు, గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. తల్లిపాల వారోత్సవాలు, పోషకాహార దినోత్సవ అవగాహన ప్రచార పో స్టర్లను కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈనెల 7వరకు తల్లిపాల వారో త్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తల్లి పా లలో శిశువు ఎదుగుదలకు అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయన్నారు. ఇందులో అదన పు కలెక్టర్‌ శ్యామలాదేవి, జిల్లా సంక్షేమాధికారి మిల్కా,డీఆర్డీవో రాథోడ్‌రవీందర్‌పాల్గొన్నారు.

  • సమస్యల పరిష్కారానికి  కృషి చేయాలి

    ఆదిలాబాద్‌టౌన్‌: సమస్యలపై బాధ్యతాయుతంగా వ్యవహరించి త్వరితగతిన పరిష్కరించేలా చూడాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ అన్నా రు. జిల్లాకేంద్రంలోని పోలీసు ముఖ్య కార్యాల యంలో సోమవారం నిర్వహించిన గ్రీ వెన్స్‌కు జిల్లా నలుమూలల నుంచి 38 మంది హాజరై దరఖాస్తులు అందజేశారు. వారి సమస్యలను ఓపికగా విన్న ఎస్పీ సంబంధిత పోలీసు అధి కారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో సీసీ కొండరాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారి జైస్వాల్‌ కవిత, సిబ్బంది వామన్‌ పాల్గొన్నారు.

Bhadradri

  • రెండు రోజుల్లో కుమారుడి పెళ్లి..

    పాల్వంచ: రెండు రోజుల్లో కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. అంతలోనే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం... పాల్వంచ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన రిటైర్డ్‌ పోస్ట్‌మాన్‌ నంది వీరభద్రరావు(63) కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. కాగా అతని చిన్న కుమారుడి వివాహం బుధవారం జరగాల్సి ఉంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరభద్రరావు ఆరోగ్యం క్షీణించి మృతి చెందడంతో వివాహం వాయిదా పడింది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది.

    అనారోగ్యంతో తండ్రి మృతి

  • అద్దె
    ఆదాయం సమకూరుస్తున్నా

    కొత్తగూడెంటౌన్‌: రవాణాశాఖ ప్రభుత్వానికి ముఖ్యమైన ఆదాయ వనరుగా ఉంది. కానీ ఆ శాఖ కార్యాలయాలు మాత్రం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలంలలో ఆర్టీఓ కార్యాలయాలు ఉండగా, రెండూ అద్దె భవనాల్లోనే ఉన్నాయి. అద్దె భవనాల్లోనే అధికారులు, సిబ్బంది విధులు నిర్వరిస్తున్నారు. నెలకు రూ. లక్షల్లో ఆదా యం గడిస్తున్నా జిల్లా రవాణాశాఖకు ఇప్పటివరకు సొంత భవనం లేదు. 20 ఏళ్లుగా అద్దె చెల్లిస్తూ సింగరేణి క్వార్టర్‌లో కార్యాలయాన్ని నెట్టుకొస్తున్నారు.

    పేరు నమోదు ఒకచోట.. టెస్ట్‌ మరో చోట

    రైటర్‌బస్తీ సమీపంలోని జిల్లా కోర్టు భవనాల సముదాయం వెనుక భాగంలో ఉన్న సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్‌లో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ఉంది. ప్రస్తుతం ప్రతీ నెల అద్దె చెల్లిస్తూ అధికారులు, సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం, భద్రాచలంలతో పాటు అశ్వారావుపేటలో డ్రైవింగ్‌ టెస్టింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వాహనాల ఫిట్‌నెస్‌, రిజిస్ట్రేషన్‌, లైసెన్స్‌, ట్రాన్ప్‌పోర్ట్‌ పర్మిషన్‌ తదితర అవసరాల కోసం నిత్యం వందల మంది వాహనదారులు ఆర్టీఓ కార్యాలయానికి వస్తుంటారు. ఈ భవనం పాతది కావడంతో ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొటున్నారు. డ్రైవింగ్‌ టెస్టు కోసం కార్యాలయానికి కిలోమీటర్‌ ఉన్న రామవరంలోని డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కొత్తగూడెంలోని జిల్లా కార్యాలయంలో పేరు నమోదు చేసుకుని టెస్టింగ్‌ కోసం వెళ్లాల్సి వస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

    స్థలం కేటాయించినా..

    జిల్లా రవాణాశాఖ కార్యాలయ భవనం, డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి 2016లో ప్రభుత్వం రామవరం సీఆర్‌పీ క్యాంప్‌ సమీపంలో దాదాపు 8 ఎకరాల స్థలం కేటాయించింది. కానీ ఇప్పటివరకు అక్కడా పునాది రాయి కూడా వేయలేదు. బడ్జెట్‌ సమస్య వల్లే ఆలస్యమవుతోందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా ఆర్టీఏ ఉన్నతాధికారులు స్పందించి నిధులు మంజూరు చేసి, సొంత భవనాలు నిర్మించాలని పలువురు కోరుతున్నారు.

    జిల్లాలో సొంత భవనాల్లేని

    ఆర్టీఓ కార్యాలయాలు

    జిల్లా కేంద్రంతోపాటు

    భద్రాచలంలోనూ అదే పరిస్థితి

    కొత్తగూడెంలో 20 ఏళ్లుగా

    సింగరేణి క్వార్టర్‌లోనే నిర్వహణ

    స్థలం కేటాయించినా నిధులివ్వని

    ఆర్టీఏ ఉన్నతాధికారులు

  • తల్లి

    అశ్వారావుపేటరూరల్‌: తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని, తప్పనిసరిగా బిడ్డకు తల్లిపాలే పట్టాలని డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా సూచించారు. సోమవారం అశ్వారావుపేటలోని గెస్ట్‌హౌస్‌ ఏరియా అంగన్‌వాడీ కేంద్రంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అశ్వారావుపేట సెక్టార్‌ పరిధిలో ఏడు నెలలు నిండిన పిల్లలకు అదనపు ఆహారం అందించి, అన్నప్రాసన చేశారు. గర్భిణులకు సీమంతం నిర్వహించారు. వయస్సుకు తగిన బరువు ఉన్న పిల్లలను గుర్తించి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం అమ్మ సేవా సదనంతోపాటు పలు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి రికార్డులను తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమాల్లో సీడీపీవో ముత్తమ్మ, సూపర్‌వైజర్లు ఇమ్మడి పద్మావతి, సౌజన్య, రమాదేవి, వరలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

    ప్రయాణికుల నిజాయితీ

    బూర్గంపాడు: ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన పెరిక రోశయ్య, చల్లా లక్ష్మీనారాయణ, బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు గ్రామానికి చెందిన బాదావత్‌ లలిత సోమవారం ఆటోలో వెళ్తున్న క్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం వద్ద పర్సు కనిపించింది. ఆటో ఆపి పర్సును తీసి పరిశీలించగా, రూ.16వేల నగదు, ఆధార్‌కార్డు ఉన్నాయి. ముగ్గురు వ్యకులు పర్సును పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు ఆధార్‌కార్డు ఆధారంగా బాధితుడిని రప్పించి అందజేశారు. బూర్గంపాడు నుంచి భద్రాచలం వెళ్తున్న క్రమంలో జేబులో నుంచి పర్సు జారిపడిందని బాధితుడు, ఆటోడ్రైవర్‌ మాడుగుల ప్రశాంత్‌ తెలిపాడు. నిజాయితీ చాటుకున్న ముగ్గురు వ్యక్తులను ఎస్‌ఐ మేడ ప్రసాద్‌ అభినందించారు.

    కబడ్డీ క్రీడాకారుల ఎంపిక

    కరకగూడెం: మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు క్రీడాకారులు తెలంగాణ ప్రీమియర్‌ లీగ్‌ కబడ్డీ చాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు హైదరాబాద్‌లో జరిగే పోటీలకు తోలెం ప్రసాద్‌, బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. కాగా వీరు గతంలో ప్రో కబడ్డీ లీగ్‌ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.

    వరకట్న వేధింపుల

    కేసు నమోదు

    చండ్రుగొండ: పోలీసులు సోమవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ శివరామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని అయన్నపాలెం గ్రామానికి చెందిన నల్లగట్ల ఆశాకు ఖమ్మం అల్లీపురం గ్రామానికి చెందిన నాగేంద్రబాబుతో 2022లో వివాహం జరిగింది. దంపతులకు ఇద్దరు సంతానం కలిగారు. కొంతకాలంగా భర్త నాగేంద్రబాబు, అత్త నాగమ్మ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    లాడ్జీలో హైదరాబాద్‌ పోలీసుల తనిఖీలు!

    భద్రాచలంటౌన్‌: పట్టణంలోని ఓ ప్రైవేట్‌ లాడ్జీలో మైనర్లకు రూమ్‌ ఇచ్చిన ఘటనలో హైదరాబాద్‌ పోలీసులు తనిఖీలు చేసినట్లు సమాచారం. వారం రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన బాలుడు, బాలిక పట్టణంలోని ఓ లాడ్జీలో బస చేసినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడి పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం వచ్చి విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఎటువంటి సమాచారం లేదని సీఐ నాగరాజు తెలిపారు.

    20 తులాల బంగారం చోరీ

    కొత్తగూడెంటౌన్‌: టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రుద్రంపూర్‌ నాలేరియాకు చెందిన సింగరేణి ఉద్యోగి వి.వెంకటరమణ ఇంట్లో 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదు చోరీ జరిగింది. సీఐప్రతాప్‌ కథనం ప్రకారం... వెంకట రమణ జీఎం కార్యాలయంలో క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె సోమవారం ఉదయం విధులకు వెళ్లి సాయంత్రం వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంది. ఇంట్లో పరిశీలించగా దొంగలు బీరువాను పగులగొట్టి 20 తులాల బంగారం, రూ.2 లక్షల నగదును చోరీ చేశారు. స్థానికుల సమాచారంతో క్లూస్‌ టీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ప్యూన్‌ బస్తీలో నిర్మాణంలో ఉన్న ఇంటి అవసరాల కోసం దాచి ఉంచిన బంగారం, నగదు అపహరించారని బాధితురాలు ఆవేదనవ్యక్తం చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • విద్య

    కరకగూడెం: విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన సోమవారం జరిగింది. పోలీసు ల కథనం ప్రకారం.. మండలంలోని భట్టుపల్లి గ్రామానికి చెందిన బిలపాటి నరేందర్‌ (18) వరి పొలంలో మోటార్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లాడు. మెయిన్‌ లైన్‌ నుంచి వచ్చిన 2 కోర్‌ సర్వీస్‌ కరెంట్‌ వైరులోని ఓ సింగిల్‌ కోర్‌ వైరును న్యూట్రల్‌ వైరుగా భావించి.. పొరపాటున ఫేస్‌ వైరును పొలంలోని ఇనుప కంచె (ఫెన్సింగ్‌)కు తగిలించాడు. ఆ తర్వాత మోటార్‌ పైపును సరిచేసేందుకు ముందుకు వెళ్లగా ఫెన్సింగ్‌కు తాకి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దుర్ఘటనను గమనించిన స్థానిక రైతు ఇర్రి వెంకన్న ఫెన్సింగ్‌కు ఉన్న తీగలను తొలగించి పెనుప్రమాదాన్ని నివారించాడు. యువకుడి మృతితో తండ్రి రాంబాబు సొమ్మసిల్లి పడిపోయాడు. తల్లి మణెమ్మ కన్నీరు మున్నీరుగా విలపించింది. మృతుడి సోదరుడు శ్యామ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన లారీ

    భద్రాద్రి జిల్లా వాసి మృతి

    కొణిజర్ల: ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కొణిజర్ల ఎస్‌ఐ జి.సూరజ్‌ వెల్లడించిన వివరాలు... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడి గుండాలకు చెందిన ముక్తి భూపతి(38) ఓ ప్రైవేట్‌ బీమా కంపెనీలో పనిచేస్తున్నాడు. వైరాలో మార్కెటింగ్‌ ఏజెంట్ల శిక్షణ సోమవారం జరగగా ఆయన హాజరై తిరిగి ఇంటికి ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. మార్గమధ్యలో కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపాన ఆయన బైక్‌ను వెనక నుంచి కంటైనర్‌ లారీ ఢీకొట్టడమే కాక టైరు భూపతి పైనుంచి వెళ్లడంతో తీవ్ర గాయాల పాలై ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య తులసి, ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భూపతి సోదరుడు విజయ్‌ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

    నీటి తొట్టిలో పడి చిన్నారి మృతి

    జూలూరుపాడు: మండలంలోని మాచినేనిపేటతండా గ్రామ పంచాయతీ పెద్దతండాలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం... పెద్దతండాకు చెందిన భూక్యాగోపి నాయక్‌, సరస్వతి దంపతులకు 26 నెలల కుమార్తె తన్విశ్రీ, 8 నెలల బాబు తన్విష్‌ ఉన్నారు. చిన్నారి తన్విశ్రీ పక్కన ఉన్న అమ్మమ్మ జ్యోతి ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీటి తొట్టిలో పడింది. ఆ సమయంలో అమ్మమ్మ ఇంట్లో ఎవరూ లేరు. కొద్దిసేపటికి పాప కన్పించలేదని తల్లి, కుటుంబ సభ్యులు వెతకగా నీటి తొట్టిలో కన్పించింది. బయటకు తీసి స్థానిక గ్రామీణ వైద్యుడి తీసుకెళ్లగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యుడు తెలిపారు. చిన్నారిమృతితో తల్లిదండ్రులు, బంధువులు గుండెలవిసేలా రోదిచారు. తన్వి శ్రీకి 8 నెలల తమ్ముడు తన్విష్‌ ఉన్నాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

  • అమ్మవారికి శఠగోపం!
    ● పెద్దమ్మగుడి ఏసీ ఫంక్షన్‌ హాళ్లకు వేలంపాట ● పోటీ లేదంటూ అతి తక్కువ ధరకే కట్టబెట్టిన ఆలయ అధికారులు ● గతేడాది కంటే రూ. 31 లక్షలు మైనస్‌ ● కొబ్బరి చిప్పలకు పెరిగిన రూ.1.80 లక్షలు..

    పాల్వంచరూరల్‌: అమ్మవారి ఆలయానికి ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా ఎండోమెంట్‌ అధికారులు మాత్రం ఫంక్షన్‌ హాళ్లకు తక్కువ ధరకే కట్టబెట్టారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో సోమవారం వ్యాపార దుకాణాలు, ఫంక్షన్‌ హాళ్లకు ఉమాసోమలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ వీఎల్‌వీ వెంకట్రావు పర్యవేక్షణలో టెండర్‌ కం బహిరంగ వేలంపాట నిర్వహించారు. భక్తులు అమ్మవారికి సమర్పించిన కొబ్బరి చిప్పలు పోగు చేసుకునేందుకు ఏడాది కాలానికి భద్రాచలానికి చెందిన ఎస్‌.వెంకట చెంచు సుబ్బారావు రూ.17,01,000 లక్షలకు దక్కించుకున్నారు. గతేడాది ఇదే కొబ్బరి చిప్పలకు రూ.15.20 లక్షలు వచ్చాయి. ఈసారి రూ.1.80 లక్షల ఆదాయం అదనంగా పెరిగింది.

    ఫంక్షన్‌ హాళ్లకు తక్కువ పాట

    700 సీటింగ్‌ కెపాసిటీ కలిగిన ఏసీ ఫంక్షన్‌ హాల్‌ ఏడాదికి రూ.26 లక్షల 55వేలకు పాల్వంచకు చెందిన ఆకుల ఆనంద్‌ దక్కించుకున్నారు. గతేడాది ఇదే హాల్‌కు వేలంపాటలో రూ.40 లక్షల 4 వేలు వచ్చాయి. ఈసారి మాత్రం రూ.13 లక్షల 49 వేల ఆదాయం తగ్గింది. 500 సీటింగ్‌ సామర్థ్యం కలిగిన మరో ఏసీ ఫంక్షన్‌హాల్‌ ఏడాదికి రూ.16.20 లక్షలకు కాంపెల్లి కనకేష్‌ దక్కించుకున్నారు. ఇదే ఫంక్షన్‌హాల్‌ గతేడాది రూ.34 లక్షల 2వేలు పలికింది. ఈసారి రూ.16 లక్షల 20వేలకు ఇవ్వడంతో ఆలయానికి రూ.18 లక్షల 32 వేల ఆదాయం తగ్గింది. రెండు ఫంక్షన్‌ హాళ్లపై ఈ ఏడాది అమ్మవారి ఆలయం సుమారు రూ. 31 లక్షల ఆదాయం కోల్పోయింది. ఇంత తక్కువకు రెండు ఫంక్షన్‌ హాళ్లను అప్పగించడం భక్తుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఈఓ రజనీకుమారిని వివరణ కోరగా.. మూడు, నాలుగుసార్లు టెండర్లు పిలిచినా పాట దారులు ఎవరూ ముందుకు రాలేదని, చివరిగా తగ్గించి వారికి కేటాయించామని చెప్పుకొచ్చారు. కాగా ఒకటో నంబర్‌ దుకాణానికి పాటదారులు ఎవరూ ముందుకురాని కారణంగా వాయిదా వేసినట్లు పెద్దమ్మగుడి ఈఓ రజనీకుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ బాలినేని నాగేశ్వరరావు, సభ్యులు పాపారావు, శ్రీను, కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.

  • 45 కేజీల గంజాయి స్వాధీనం

    ఇల్లెందు: భద్రాచలం, ఇల్లెందుల మీదుగా ఒడిశా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను కథనం ప్రకారం.. ఎస్‌ఐ పి.శ్రీనివాసరెడ్డి, సిబ్బంది సోమవారం బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో భద్రాచలం నుంచి మహా రాష్ట్రకు కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం కోట్యాతండాకు చెందిన తేజావత్‌ శంకర్‌, తేజావత్‌ జమ్కు, సూర్యపేట జిల్లా రాజు నాయక్‌ తండాకు చెందిన అంగోతు సంతుగా తేలింది. నిందితులను అరెస్ట్‌ చేసి, కారు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు 22.62 లక్షలు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒడిశాకు చెందిన రాము, తాతారావు, మహారాష్ట్రకు చెందిన హరిబాబు పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి, నిందితులను ముగ్గురిని రిమాండ్‌కు తరలించామని తెలిపారు. సీఐ టి. సురేష్‌, ఎస్‌ఐ పి. శ్రీనివాస రెడ్డి, సిబ్బంది ఉన్నారు.

    ముగ్గురు నిందితుల అరెస్ట్‌, కారు సీజ్‌

  • దళారులకు చెక్‌..

    నాడు దళారులదే రాజ్యం..

    ఒకప్పటి ఆనవాయితీ కొనసాగిస్తూ సింగరేణి కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఇచ్చిన వెసులుబాటు.. మెడికల్‌ బోర్డును అవినీతికి కేరాఫ్‌గా మార్చింది. కారుణ్య నియామక కోటాలో వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు నిర్వహించే అనారోగ్య పరీక్షలు, ఆ తర్వాత జరిగే తంతులో దళారులు ప్రవేశించారు. గని స్థాయిలో సంక్షేమాధికారికి దరఖాస్తు చేయడానికి ముందే ఈ వ్యవహారంలో చొరబడి.. కీలకమైన అనారోగ్య పరీక్షలు నిర్వహించే మెడికల్‌ బోర్డు వరకు అంతా తామే చూసుకుంటామంటూ కార్మికులకు మాయమాటలు చెప్పేవారు. ఒక కార్మికుడిని అనారోగ్య కారణాలతో అన్‌ఫిట్‌ చేయించి అతడి వారసుడికి ఉద్యోగం ఇప్పించేందుకు కనీసం రూ.5లక్షల నుంచి రూ. 8లక్షల వరకు చేతులు మారడం సర్వసాధారణ వ్యవహారంగా నిలిచింది. ఈ దళారుల దందాకు ఆరంభంలోనే బ్రేకులు వేయడంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం పొరపాటుగా పరిణమించింది.

    సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మెడికల్‌ బోర్డులో అవినీతి వ్యవహారాలు శృతి మించుతున్నాయనే ఆరోపణలు రావడంతో గత ఆరు నెలలుగా సింగరేణి సంస్థ మెడికల్‌ బోర్డు నిర్వహణపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కొత్తగా కార్మికుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండా, గతంలో నిర్వహించిన బోర్డుల్లో సెకండ్‌ ఒపీనియన్‌ కోసం హయ్యర్‌ రిఫరల్‌ చేసిన కేసులకే ప్రత్యేకంగా జూలై 30, 31 తేదీల్లో మెడికల్‌ బోర్డు ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. 54 మంది కార్మికులు/ఉద్యోగులను వైద్య పరీక్షల కోసం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన ఆస్పత్రికి పిలవగా 53 మంది హాజరయ్యారు. కాగా, పరీక్షల తర్వాత మెడికల్‌ బోర్డు వెల్లడించిన ఫలితాలు సింగరేణి వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి.

    తొమ్మిది శాతమే..

    మెడికల్‌ బోర్డు ద్వారా అనారోగ్య కారణాల రీత్యా తమను అన్‌ఫిట్‌ చేసి వారసులకు సంస్థలో ఉద్యోగాలు ఇవ్వాలంటూ 53 మంది కార్మికులు ఆర్జీ పెట్టుకుంటే.. ఇందులో ఐదుగురే అన్‌ఫిట్‌గా తేలారు. 17 మంది కార్మికులు భూగర్భ గనుల్లో పని చేసేందుకు ఫిట్‌గా లేరని, వీరికి ఉపరితలంలో పని కల్పించాలని సూచించారు. వీరు కాకుండా మిగిలిన 31 మంది కార్మికులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని మెడికల్‌ బోర్డు తేల్చి చెప్పింది. మొత్తంగా తొమ్మిది శాతం మంది ఉద్యోగులే అన్‌ఫిట్‌ కావడం గమనార్హం. గతంలో సుమారు 70 శాతం మంది కార్మికులు అన్‌ఫిట్‌ అయితే, మరో 20 శాతం మందిని హయ్యర్‌ రిఫరల్‌కు పంపేవారు. వారసత్వ ఉద్యోగాల పేరుతో దళారులు చక్రం తిప్పడం వల్లే మెడికల్‌ బోర్డు ఫలితాల్లో అన్‌ఫిట్‌ శాతం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.

    ప్రక్షాళన బాటలో..

    దళారుల అండ లేకుంటే తమ పిల్లలకు ఉద్యోగాలు రావనే అభిప్రాయం కార్మికుల్లో బలపడింది. దీంతో కాయకష్టం చేసి ఆర్జించిన సొమ్ముతో పాటు అప్పు చేసి దళారుల జేబులు నింపడం పరిపాటిగా మారింది. ‘కారుణ్య నియామకాలు – అవినీతి దందా’పై వరుసగా వార్తా కథనాలు రావడం, సంస్థ ప్రతిష్టకు మచ్చగా నిలుస్తుండడంతో ఈ ఏడాది జనవరి నుంచి సింగరేణి యాజమాన్యం ఈ అంశంపై ఫోకస్‌ పెట్టింది. సంస్థ పరంగా విజిలెన్స్‌ నిఘా పెంచడంతో పాటు ఏసీబీకి విచారణ బాధ్యతలు అప్పగించింది. ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌తో పాటు ఈ మెయిల్‌ అడ్రెస్‌ను సీఎండీ బలరామ్‌ నాయక్‌ అందుబాటులోకి తెచ్చారు. ఈ చర్యల ఫలితమే గడిచిన కొన్ని నెలలుగా సింగరేణి కేంద్రంగా జరుగుతున్న ఏసీబీ అరెస్టులు. తాజాగా 54 మంది కార్మికులకు మెడికల్‌ బోర్డు నిర్వహిస్తే ఇందులో ఐదుగురు కార్మికులే అన్‌ఫిట్‌ అయ్యారు. ఈ మార్పుతో మెడికల్‌ బోర్డు దళారీ వ్యవస్థ గప్‌చుప్‌ అయింది. మార్చి తర్వాత మెడికల్‌ బోర్డు పెట్టడం లేదంటూ నిన్నా మొన్నటి వరకు సన్నాయి నొక్కులు నొక్కిన వారు ఇప్పుడు కిమ్మనడం లేదు. మరోవైపు బోర్డులో అవినీతి ప్రక్షాళనపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    సింగరేణి మెడికల్‌ బోర్డుపై ఏసీబీ నజర్‌

    అనారోగ్యం బారిన పడిన వారే అన్‌ఫిట్‌

    54 మందికి పరీక్షలు.. ఐదుగురికే దక్కిన ‘వారసత్వం’

    49 మంది కార్మికులు తిరిగి విధుల్లోకే..

    సంస్థ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న కార్మికులు

  • రెండే
    ● అమృత్‌ భారత్‌ పనుల్లో జాప్యం ● 60 శాతం మాత్రమే పూర్తయ్యాయని అంచనా ● పనుల వివరాలు వెల్లడించేందుకు రైల్వే అధికారుల నిరాకరణ ● ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

    కొత్తగూడెంఅర్బన్‌: అమృత్‌ భారత్‌ పథకానికి భద్రాచలం రోడ్‌(కొత్తగూడెం) రైల్వే స్టేషన్‌ ఎంపికై మంగళవారానికి రెండేళ్లు పూర్తయింది. ఈ పథకం కింద స్టేషన్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ప్లాట్‌ఫాంపై రేకుల షెడ్‌లు మినహా మిగిలినవన్నీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే ఈ పథకం కింద ఏయే పనులు చేస్తున్నారు, అవి ఎంతవరకు పూర్తయ్యాయి, ఎన్ని నిధులు ఖర్చు చేశారు అనేది పర్యవేక్షించే బాధ్యత ఐఓడబ్ల్యూ విభాగం అధికారులదే. అయితే ఆ విభాగం అధికారిని సంప్రదిస్తే తన వద్ద ఎలాంటి సమాచారం లేదని, డోర్నకల్‌ లేదా సికింద్రాబాద్‌ అధికారులను అడగాలని అంటున్నారు. కనీసం వారి ఫోన్‌ నంబర్లు కూడా తనకు తెలియదని చెప్పడం గమనార్హం.

    ప్రయాణికులకు తప్పని ఇక్కట్లు..

    పనుల్లో జాప్యంతో పాటు రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్‌ఫాంపై రేకుల షెడ్‌లు లేక ఎండ, వానల్లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. వెయిటింగ్‌ హాళ్లు పూర్తి కాకపోవడంతో ఎక్కడ కూర్చోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. కొందరు ప్రయాణికులు స్టేషన్‌ ఆవరణలో ఉండే ఆటోలు, కార్లలో, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిపైన వేచి ఉంటున్నారు. అమృత్‌ భారత్‌ పథకంతో అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఇక్కడ మాత్రం ఉన్న వసతులు కూడా తొలగించారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    60 శాతం మేరకే పనులు..

    అమృత్‌ భారత్‌ పథకం కింద 2023 ఆగస్టు 5న భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ను ఎంపిక చేశారు. అభివృద్ధి పనుల కోసం రూ.25.41 కోట్లు కేటాయించారు. అయితే నాడు ప్రారంభించిన పనులు ఇంకా కొనసా..గుతూనే ఉన్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాకర్లు నెలల తరబడి జాప్యం చేయడం, రైల్వే అధికారులు వారితో చర్చలు జరిపి పనులు ప్రారంభించేసరికి జాప్యం జరుగుతోంది. ఇప్పటివరకు 60 శాతం మేర మాత్రమే పనులు పూర్తయ్యాయని తెలుస్తోంది. కొత్తగూడెం కార్పొరేషన్‌గా మారిన తర్వాత రైలు ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. కానీ అందుకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడంతో స్టేషన్‌ అధికారుల తీరుపై ప్రయాణికులు మండిపడుతున్నారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.25.41 కోట్లు కేటాయించగా, పూర్తయిన పనుల వివరాలను అధికారులు సర్కారుకు పంపితేనే నిధులు విడుదలవుతున్నాయి. ఇంకా విద్యుద్దీకరణ, వెయిటింగ్‌ హాళ్లు, ఎస్కలేటర్‌, లిఫ్ట్‌ పనులు పూర్తి కాలేదు.

    పనులు వేగవంతం చేయాలి

    భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని, ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు సమావేశంలో కోరాం. ప్రస్తుతం కూడా రైల్వే స్టేషన్‌ ఏఓను కలిసి పనులు ఎంత వరకు జరిగాయనే వివరాలు సేకరిస్తున్నాం. పనుల వేగవంతానికి చర్యలు తీసుకుంటాం.

    – శ్రీనివాసరెడ్డి, సౌత్‌ సెంట్రల్‌ రైల్వే బోర్డు మెంబర్‌

  • రామాల

    భద్రాచలంటౌన్‌ : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఫెడరల్‌ బ్యాంక్‌ వారు అందజేసిన రెండో కియాస్క్‌ మిషన్‌ను ఈఓ ఎల్‌.రమాదేవి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భక్తులు ఈ మిషన్‌ను ఉపయోగించుకుని అవసరమైన ప్రసాదాలను పొందవచ్చని తెలిపారు. నిమిషం లోపే టోకెన్‌ పొంది, ప్రసాదం తీసుకునేలా ఏర్పాటు చేశామని చెప్పారు. కియాస్క్‌ మిషన్లకు భక్తుల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఈ రవీంద్రనాథ్‌, ఏఈఓ శ్రవణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

    రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో జిల్లాకు 26 పతకాలు

    కొత్తగూడెంటౌన్‌ : హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో సోమవారం ముగిసిన రాష్ట్ర జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో జిల్లా క్రీడాకారులు 26 పతకాలు సాధించారని జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.మహీధర్‌ తెలిపారు. ఈ పోటీలకు జిల్లా నుంచి 40 మంది అథ్లెట్లు హాజరు కాగా, 26 మంది పతకాలు సాధించారని, జిల్లాకు ఆరు బంగారు, 14 రజిత, 6 కాంస్య పతకాలు వచ్చాయని వివరించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను డీవైఎస్‌ఓ ఎం. పరంధామరెడ్డి, జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యుగంధర్‌, కార్యదర్శి రాజేందర్‌ తదితరులు అభినందించారు.

    క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలి

    పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ సూచన

    కొత్తగూడెంఅర్బన్‌ : పోలీస్‌ శాఖలో పని చేసేవారు క్రమశిక్షణ, నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. జిల్లా పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో సోమవారం ఆయన ఏఆర్‌ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అడ్మిన్‌ ఆర్‌ఐ కార్యాలయంతో పాటు మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌, సంక్షేమ కార్యాలయాలను, హోంగార్డ్‌ ఆర్‌ఐ ఆఫీసులో రికార్డులను తనిఖీ చేశారు. బాంబు డిస్పోజల్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. పోలీస్‌ శాఖలో వినియోగించే సాంకేతికత, శిక్షణను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూ ప్రజలకు సేవలు అందించడంలో ముందుండాలని అన్నారు. శారీరక, మానసిక దృఢత్వం కోసం నిత్యం వ్యాయామం, యోగా చేయాలని చెప్పారు. అధికారులు, సిబ్బందికి ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ సత్యనారాయణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌, ఎంటీఓ సుధాకర్‌, హోమ్‌గార్డ్‌, అడ్మిన్‌, వెల్ఫేర్‌ ఆర్‌ఐలు నరసింహారావు, లాల్‌బాబు, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

    డీఈఓగా జెడ్పీ సీఈఓకు అదనపు బాధ్యతలు

    కొత్తగూడెంఅర్బన్‌ : జిల్లా విద్యాశాఖ అధికారిణిగా జెడ్సీ సీఈఓ నాగలక్ష్మి సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి గత నెల 31న ఉద్యోగ విరమణ చేయగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాగలక్ష్మికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వెంటనే ఆమె బాధ్యతలు స్వీకరించారు.

  • రక్తద

    మణుగూరు టౌన్‌: ఒక యూనిట్‌ రక్తదానంతో ఇతరుల ప్రాణాలకు రక్షణ కల్పించొచ్చని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులు, తలసేమియా, సికిల్‌ సెల్‌ అనీమియా వంటి వ్యాధులతో బాధపడే వారు, ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే రక్త నిల్వ కేంద్రం ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ సంవత్సరానికి రెండుసార్లు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఆస్పత్రిలో వైద్య పోస్టుల భర్తీకి కృషి చేస్తానని చెప్పారు. అనంతరం కలెక్టర్‌ రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ రవిబాబు, సూపరింటెండెంట్‌ సునీల్‌, తహసీల్దార్‌ నరేశ్‌, ఎంపీడీఓ శ్రీనివాస్‌, సాయిమోహన్‌, గౌరి పాల్గొన్నారు.

    ఉన్నత ఆలోచనలతో ముందుకు సాగండి..

    కరకగూడెం: విద్యతోనే సామాజిక మార్పు సాధ్యమని, విద్యార్థులంతా ఉన్నత ఆలోచనతో ముందుకు సాగాలని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పిలుపునిచ్చారు. మండలంలోని భట్టుపల్లి కేజీబీవీని సోమవారం ఆయన తనిఖీ చేశారు. బోధన ఎలా ఉంది, సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయా, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వారి సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం పాఠశాలలో నెలకొన్న సమస్యలను నోట్‌ చేసుకుని, పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. మౌలిక వసతుల కల్పనకు కేటాయించిన ఎస్‌ఎస్‌ఏ నిధులు రూ.5లక్షలతో అవసరమైన పనులు చేయించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మునగ, కరివేపాకు, ఉసిరి మొక్కలు నాటాలని, విద్యార్థులకు ఔషధ మొక్కలపై అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కరకగూడెం జెడ్పీ పాఠశాలను పరిశీలించారు. త్వరలో నవోదయ పాఠశాల ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ గంటా ప్రతాప్‌, ఎంఈఓ మంజుల, విద్యాశాఖ ఏఈ శ్రీనివాస్‌, డిప్యూటీ తహసీల్దార్‌ కాంతయ్య, ఎంపీఓ మారుతీ యాదవ్‌, కేజీబీవీ ఎస్‌ఓ శ్రీదేవి, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

    ఈవీఎం గోడౌన్‌ తనిఖీ..

    సూపర్‌బజార్‌(కొత్తగూడెం): కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం తనిఖీ రిజిస్టర్‌లో సంతకం చేశారు. ఆయన వెంట ఎన్నికల సూపరింటెండెంట్‌ రంగాప్రసాద్‌, సిబ్బంది నవీన్‌ ఉన్నారు.

    కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వెల్లడి

    మణుగూరు 100 పడకల ఆస్పత్రిలో రక్త నిల్వల కేంద్రం ప్రారంభం

  • భారీగ
    ● పగటి వేళ బ్యాక్‌డౌన్‌లో కేటీపీఎస్‌ యూనిట్లు ● 6వ దశలో పది రోజులుగా రిజర్వ్‌ షట్‌డౌన్‌లో 500 మెగావాట్లు

    పాల్వంచ: ఇటీవల కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా తగ్గింది. దీనికి తోడు సోలార్‌, జల విద్యుత్‌ సైతం అధికంగా వస్తుండడంతో థర్మల్‌ విద్యుత్‌ను అంతంతగానే వాడుతున్నారు. ఈ క్రమంలో పాల్వంచలోని కేటీపీఎస్‌ ఽకర్మాగారంలో తరచూ బ్యాక్‌డౌన్‌, రిజర్వ్‌ షట్‌ డౌన్‌లో యూనిట్లను ఉంచుతున్నారు. కేటీపీఎస్‌ 5,6,7 దశల కర్మాగారాల్లో మొత్తం 1,800 మెగావాట్లకు గాను మధ్యాహ్నం 800 మెగావాట్లు మాత్రమే ఇక్కడ ఉత్పత్తిని రాష్ట్ర గ్రిడ్‌కు తీసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

    పగలు అరకొరగా.. రాత్రి ఫుల్‌ లోడ్‌

    పగలు విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉండడంతో పాటు సోలాల్‌ ఉత్పత్తిని వినియోగిస్తుండడంతో కేటీపీఎస్‌ 7వ దశ కర్మాగారంలోని 800 మెగావాట్లకు గాను 450 మెగావాట్లు మాత్రమే తీసుకుంటున్నారు. మిగితాది బ్యాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఫుల్‌ లోడ్‌ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా కేటీపీఎస్‌ 5వ దశలోని 8వ యూనిట్‌ 250 మెగావాట్లలో ఉదయం 175 మెగావాట్లు, సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఫుల్‌ లోడ్‌ తీసుకుంటున్నారు. 9వ యూనిట్‌ 250 మెగావాట్లు, 6వ దశలోని 10వ యూనిట్‌ను గత నెల 25 నుంచి రిజర్వ్‌ షట్‌డౌన్‌లో ఉంచి పూర్తిగా ఉత్పత్తి నిలిపివేశారు. కాగా 9వ యూనిట్‌లో సుమారు పది రోజుల అనంతరం సోమవారం ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చారు.

    డిమాండ్‌ లేకే ఉత్పత్తి

    తగ్గిస్తున్నాం

    పగలు విద్యుత్‌ డిమాండ్‌ తక్కువగా ఉండడంతో పాటు సోలార్‌ ఉత్పత్తిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని యూనిట్లను పగలు బ్యాక్‌డౌన్‌లో ఉంచి, రాత్రి ఫుల్‌ లోడ్‌ తీసుకుంటున్నారు. ఇక 9, 10 యూనిట్లు గత పది రోజులు పూర్తి స్థాయిలో ఉత్పత్తిని నిలిపివేసి రిజర్వ్‌ షట్‌డౌన్‌లో ఉంచాం.

    – ఎం.ప్రభాకర్‌ రావు, 5, 6వ దశల సీఈ

  • ప్రజావాణికి తగ్గిన జనం

    సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి గతంలో జనం పోటెత్తేవారు. కానీ రాను రాను ఈ కార్యక్రమానికి ఫిర్యాదుదారులు తగ్గుతున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పాటు కలెక్టర్‌ ప్రజావాణికి హాజరయ్యారా లేదా అని ఫోన్‌లో తెలుసుకుంటున్నారు. ఆయన లేరని తెలిస్తే ఆ రోజు ఎక్కువ మంది రావడం లేదు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పర్యటించి తెలుసుకోవాలనే సీఎం ఆదేశాల మేరకు కలెక్టర్‌ నిత్యం ఏదో ఒక ప్రాంతానికి వెళుతున్నారు. దీంతో ఆయన ప్రజావాణికి రాలేకపోతున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే వారంలో ఒక పూట మాత్రమే నిర్వహించే ప్రజావాణిలో వినతిపత్రం ఇస్తే తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో వస్తున్న వారు కలెక్టర్‌ లేకపోవడంతో నిరాశకు లోనవుతున్నారు. పలువురు అధికారులు సైతం శాఖా పరమైన పనుల నిర్వహణతో ప్రజావాణికి హాజరు కావడం లేదు. సోమవారం జరిగిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌ డి.వేణుగోపాల్‌, హౌసింగ్‌ పీడీ రవీంద్రనాథ్‌తో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్‌ చేశారు.

    ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయండి

    ఇల్లెందు మున్సిపాలిటీ 19వ వార్డు గోవింద్‌ సెంటర్‌కు చెందిన ప్రజలు.. తాము 40 సంవత్సరాలుగా స్థానిక రైల్వే స్థలంలో ఉంటూ ఇంటి పన్నులు, తాగునీటి పంపు బిల్లులు చెల్లిస్తున్నామని, పేదరికంలో ఉన్న తమకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు. ఆన్‌లైన్‌లో తమ పేర్లు మొదటి లిస్టులో వచ్చాయని, రైల్వే స్థలమనే కారణంతో ఇళ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

    పోడు భూములకు పట్టాలివ్వాలి

    కొత్తగూడెం కార్పొరేషన్‌ చిట్టి రామవరం 19వ డివిజన్‌ వాసులు తమకు పోడు పట్టాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. గరీబ్‌పేట పంచాయతీ అంబేద్కర్‌ నగర్‌ బీట్‌లోని అటవీ భూమిని 45 ఏళ్లుగా పోడు చేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోడు భూములకు పట్టాలివ్వాలని ఆదేశించినందున తమకు కూడా జారీ చేయాలని కోరారు. ఈ మేరకు సీపీఐ నాయకులు బానోత్‌ చందర్‌, బానోత్‌ శ్రీనివాస్‌ నాయక్‌ ఆధ్వర్యంలో రైతులు ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.

  • వైద్య శిబిరాలు నిర్వహించాలి

    జూలూరుపాడు: మలేరియా, డెంగీ ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ జయలక్ష్మి అన్నారు. జూలూరుపాడు పీహెచ్‌సీని సోమవారం ఆమె తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి, ప్రసవాలపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ.. నేషనల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌లో అన్ని అంశాల్లో 100 శాతం లక్ష్యం సాధించాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతాయని, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఆశ కార్యకర్తల సాయంతో ప్రతీ గ్రామంలో ర్యాపిడ్‌ ఫీవర్‌ సర్వే నిర్వహించాలన్నారు. పీహెచ్‌సీలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అనంతరం పీహెచ్‌సీ ఆవరణలో మునగ మొక్కలు నాటారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యాధికారి వెంకటేశ్వర్లు, డాక్టర్‌ తేజస్విని, సీహెచ్‌ఓ ఎం.రామకృష్ణ, స్టాఫ్‌నర్సు సుకుమారి, ఫార్మసిస్టు జి.శశికళ, ఎల్‌టీ జగదీష్‌ పాల్గొన్నారు.

    ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేయాలి

    కొత్తగూడెంఅర్బన్‌: క్షేత్రస్థాయిలో ఆరోగ్య కార్యక్రమాలు సమర్థంగా అమలు చేయాలని డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి అన్నారు. తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సికిల్‌సెల్‌ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అదనంగా పోషక విలువలు అందించడంతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కల్పించే మునగ విశిష్టతను వివరించారు. సమావేశంలో ప్రోగ్రామ్‌ అధికారులు పుల్లారెడ్డి, తేజశ్రీ, ఎండీ ఫైజ్‌ మోహియుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నవజాత శిశువులకు రెటినోపతి ఆఫ్‌ ప్రిమెచ్యూరిటి కార్యక్రమం అమలుపై జిల్లా ఇన్‌చార్జ్‌ సుభద్రతో సమావేశం నిర్వహించారు.

    డీఎంహెచ్‌ఓ జయలక్ష్మి

Ananthapur

  • ‘అనంత

    దిగాలుగా

    ఆకాశం వైపు

    చూస్తున్న రైతు

    అనంతపురం అగ్రికల్చర్‌: జిల్లాను ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందస్తుగానే పలకరించినా ఏ మాత్రమూ ప్రభావం చూపడం లేదు. ‘నైరుతి’ ప్రవేశానికి ముందు ఏప్రిల్‌, మే నెలల్లో అకాల వర్షాలు కురిశాయి. ఏప్రిల్‌లో 12.1 మి.మీ గానూ నాలుగింతలు అధికంగా 56.3 మి.మీ, మేలో 36.7 మి.మీ గానూ ఏకంగా 101.3 మి.మీ వర్షపాతం నమోదైంది. తీరా జూన్‌లో ఖరీఫ్‌ మొదలయ్యేనాటికి వరుణుడు ముఖం చాటేశాడు. జూన్‌ 8, 12 తేదీల్లో మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదైంది. జూన్‌ ముగిసేనాటికి 61.2 మి.మీ గానూ 21.7 శాతం తక్కువగా 47.9 మి.మీ వర్షం పడింది. పంటలు విత్తుకునేందుకు కీలకమైన జూలైలో వాన కోసం ఎదురుచూసినా ఫలితం కనిపించలేదు. జూలైలో 64.3 మి.మీ గానూ 46.4 శాతం తక్కువగా కేవలం 34.7 మి.మీ వర్షం కురిసింది. మొత్తమ్మీద 131.1 మి.మీ గానూ ప్రస్తుతానికి 37 శాతం లోటు వర్షపాతంతో 82.7 మి.మీ నమోదైంది. ఒక మండలంలో మాత్రమే సాధారణం కన్నా అధిక వర్షం కురిసింది. 7 మండలాల్లో సాధారణం నమోదు కాగా మిగతా 24 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సీజన్‌ మొదట్లోనే సుదీర్ఘ వర్షపాత విరామాలు (డ్రైస్పెల్స్‌) నమోదు కావడం కరువు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

    అడపాదడపా కురిసిన వర్షాలకే విధి లేని పరిస్థితుల్లో రైతులు పంటలు వేశారు. అలా సాగు చేసిన పంటలు ప్రస్తుతం ఎండుముఖం పడుతున్నాయి. ఈ ఖరీఫ్‌లో 3.42 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగులోకి వస్తాయని అధికారులు అంచనా వేశారు. కానీ జూన్‌ 15 నుంచి నైరుతి నిరాశపర్చడంతో ప్రధాన పంటలు విత్తుకునే సమయం ముగిసేనాటికి అంటే జూలై ఆఖరుకు 40 శాతం విస్తీర్ణంతో 1.35 లక్షల హెక్టార్లలో మాత్రమే సాగులోకి వచ్చాయి. ఇంకా 60 శాతం భూములు బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఇక.. మిగిలిన సుమారు 2 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడం కష్టమని రైతులు వాపోతున్నారు. గత నాలుగు దశాబ్దాల జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధానపంట వేరుశనగ 1.82 లక్షల హెక్టార్లకు గానూ ప్రస్తుతానికి 47 వేల హెక్టార్లకు పరిమిత మైంది. మరో ప్రధానపంట కంది 49 వేల హెక్టార్లు, 44 వేల హెక్టార్లకు గానూ పత్తి 14 వేల హెక్టార్ల వద్ద ఆగిపోయింది. ఆముదం 17 వేల హెక్టార్లకు గానూ 6,300 హెక్టార్లు, మొక్కజొన్న 15 వేల హెక్టార్లకు గానూ 10,500 హెక్టార్లు, సజ్జ 2,500 హెక్టార్లు, పొద్దుతిరుగుడు 500 హెక్టార్లు, కొర్ర 200 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి. పెద్దవడుగూరు మండలంలో 66 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం పత్తి సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. నెలల తరబడి వర్షాలు కురవకపోవడంతో సాగు చేసిన వేరుశనగ, కంది, పత్తి, ఆముదం తదితర పంటలు చాలా ప్రాంతాల్లో వాడుముఖం పట్టగా మరికొన్ని ప్రాంతాల్లో ఎండిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇదే పరిస్థితి వారం పది రోజులు కొనసాగితే మునుపెన్నడూ లేని విధంగా కరువు కాటు తప్పదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

    గతంలో కూడా చంద్రబాబు పాలనలో వరుస కరువులు విలయతాండవం చేశాయి. అప్పట్లో ఒక్కోసారి అకాల వర్షాలు, మరోసారి అసలు వర్షాలే కురవకుండా పంటలను తీవ్రంగా దెబ్బతీశాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నేడు కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

    రక్కసి కోరల్లోకి అన్నదాతలు

    సీజన్‌ ముగిసినా 40 శాతం

    విస్తీర్ణంలోనే పంటల సాగు

    వర్షాలు లేక ఆ పంటలూ

    ఎండుముఖం

    ‘చంద్రబాబు–కరువు కవలలు’

    అంశంపై మళ్లీ చర్చ

    ఎండుతున్న పంటలు..

    సర్వత్రా చర్చనీయాంశం..

  • దయనీయంగా రైతుల పరిస్థితి

    అనంతపురం అర్బన్‌: కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఆయన సోమవారం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డితో కలిసి ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మకు కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో రైతుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ‘అన్నదాత సుఖీభవ’ కింద పెట్టుబడి సాయం రూ.20 వేలను గత ఏడాది కూటమి ప్రభుత్వం ఎగ్గొట్టిందని మండిపడ్డారు. రెండేళ్లకురూ.40 వేలు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు ఇచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 2,94,353 మంది రైతులకు ‘భరోసా’ అందిస్తే కూటమి ప్రభుత్వం 2,75,642 మంది రైతులనే అర్హులుగా తేల్చిందన్నారు. 18,711 మందికి కోత పెట్టడం అన్యాయమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రభుతమే బీమా ప్రీమియం చెల్లించడంతో పాటు ఏటా జూలైలోనే పెద్ద ఎత్తున పరిహారమూ అందజేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం ఉచిత బీమా పథకాన్ని రద్దు చేసి బీమా పథకాల లబ్ధి అందని ద్రాక్షగా మార్చారన్నారు. గత ఏడాది అతివృష్టి, అనావృష్టి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయినా బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లోనూ వర్షాలు లేవన్నారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 8.50 లక్షలు ఎకరాలు కాగా 3.26 లక్షలు ఎకరాలు మాత్రమే పంటలు సాగయ్యాయన్నారు.

    అధిక ధరలకు యూరియా..

    యూరియా, డీఏపీని వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని ‘అనంత’ మండిపడ్డారు. కాంప్లెక్స్‌ ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామంటూ ఇబ్బంది పెడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత జిల్లాలో 46 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, ఇంత వరకు వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించలేదన్నారు.

    చీనీ రైతుల కష్టాలు..

    కూటమి ప్రభుత్వంలో చీనీ రైతులకూ కష్టాలు తప్పడం లేదన్నారు. గతంలో టన్ను రూ.40 వేలు ఉండగా ఇప్పుడు టన్ను రూ.20 వేలకు మించడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో చీనీ రైతులకు పంటల బీమా ద్వారా పెద్ద ఎత్తున్న పరిహారం అందజేశామని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. హెచ్‌ఎల్‌సీ, హంద్రీ–నీవా ద్వారా నీటి విడుదల నేపథ్యంలో ఇరిగేషన్‌ అడ్వయిజరీ బోర్డు సమావేశం నిర్వహించి నీటి కేటాయింపులు చేయాలన్నారు. హెచ్‌ఎల్‌సీ ఉత్తర, దక్షిణ కాలువకు నీరు విడుదల చేయాలన్నారు. జిల్లా నుంచి ప్రజలు వలసలు వెళ్లకుండా స్థానికంగానే ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఏరాసి నారాయణరెడ్డి, అనుబంధ విభాగాల జిల్లా ఇన్‌చార్జ్‌ ఉదయ్‌కుమార్‌, రైతు విభాగం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిది భాస్కర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి నార్పల సత్యనారాయణరెడ్డి, సంయుక్త కార్యదరిశ పెన్నం శివారెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్లయ్య, మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి జానీ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూలు శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు నీలం భాస్కర్‌, గ్రీవెన్స్‌ సెల్‌ శింగనమల నియోజకవర్గం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, వైసీపీ నాయకులు చెన్నంపల్లి వెంకటరెడ్డి, కొత్తపల్లి నాగలింగారెడ్డి, పురుషోత్తం, శ్రీనివాసులు, సుంకిరెడ్డి, నారాయణస్వామి, కసిరెడ్డి కేశవరెడ్డి, జగదీష్‌, పాటిల్‌ తిమ్మారెడ్డి పాల్గొన్నారు.

    వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు

    అనంత వెంకటరామిరెడ్డి