గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం | - | Sakshi
Sakshi News home page

గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం

Nov 10 2025 7:36 AM | Updated on Nov 10 2025 8:18 AM

జన్నారం: గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతైన గుండ శ్రావణ్‌కుమార్‌ (33) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఎస్సై అనూష తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలం పొనకల్‌కు చెందిన గుండ లచ్చన్న రెండో కుమారుడు శ్రావణ్‌ శనివారం బాదంపల్లి శివారు నదీ తీరంలో స్నానానికి వెళ్లి, ఫొటో దిగేందుకు బండరాయి పైకి ఎక్కాడు. ఫొటో దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి గోదావరిలో గల్లంతు కాగా ఆదివారం బాదంపల్లి నదీతీరంలో మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లచ్చన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement