‘మత్స్య’ మాయాజాలం
చేపపిల్లల పంపిణీలో అవకతవకలు పరిమాణం, నాణ్యతపై అనుమానాలు కాంట్రాక్టర్ తీరుపై విమర్శలు ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు
కై లాస్నగర్: మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఉచి త చేప పిల్లల పంపిణీ చేపడుతోంది. అయితే వీటి ద్వారా మత్స్యకారుల అభివృద్ధి ఏమో కానీ కాంట్రాక్టర్లు, సహకార సంఘాల సభ్యులు మా త్రం భారీగా వెనుకేసుకుంటున్నారనే ఆరోపణ లున్నాయి. నిబంధనలు పాటించకపోవడంతో పాటు నాసిరకం సీడ్ విడుదల చేస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
చేపపిల్లలను వదిలే ముందు పలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. చెరువుల్లో అయితే 30 నుంచి 40 ఎంఎం సైజ్తో కూడిన సీడ్ను వదలాలి. ఎంత మొత్తం వదులుతున్నారో ఆయా మ త్స్యకార సంఘాలకు ముందస్తుగా తెలపాలి. ఆ ప్రకారం నాణ్యతతో కూడిన సీడ్ను కమిటీ సమక్షంలో లెక్కించి విడుదల చేయాలి. ఇందులో ఏమైనా తేడాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని తిరస్కరించే అధికారం జిల్లా మత్స్యశాఖ అధికారికి ఉంటుంది. ఇక రిజర్వాయర్లలో 80–100 ఎంఎం సైజ్ ఉన్న చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. ఈ సైజు పిల్లలను కిలోల లెక్కన తూకం వేసి వదలాలి. కిలోకు 300 నుంచి 350 పిల్లలు రావా లి. అంత కంటే ఎక్కువగా వస్తే వాటి సైజు తక్కువగా ఉన్నట్లుగా గుర్తించి తిరస్కరించవచ్చు. అయితే ఈ నిబంధనలేవీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. చాలాచోట్ల కమి టీ సభ్యులు కనిపించని పరిస్థితి. కాంట్రాక్టర్కు సంబంధించిన వారు కేవలం చాయ్ జాలిలో కొన్నింటిని తీసుకుని నామ్కే వస్తేగా లెక్కిస్తున్నారు. అదే చొప్పున మిగతావి వదులుతున్నారు. దీంతో అధికారులు చెప్పే లెక్కకు, కాంట్రాక్టర్ వదిలే సీడ్కు పొంతన లేకుండా ఉంటుందనే అభిప్రా యం వ్యక్తమవుతుంది. కాగా, ఆదిలాబాద్రూరల్ మండలంలోని జందాపూర్, అంకోలి, తంతోలి, బుర్నూర్, గుడిహత్నూర్ మండలంలోని, సీతాగొంది, మల్కాపూర్, దామన్గూడ చెరువుల్లో సుమారు 6లక్షల సీడ్ను ఆదివారం వదిలి నట్లు అధికారులు వెల్లడించారు.
కమిటీ సమక్షంలోనే పంపిణీ
ప్రభుత్వ నిబంధనల మేరకే చేప పిల్లల సీడ్ను వదలుతున్నాం. మత్స్య సహకార సంఘాల సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శి, మండల వ్యవసాయాధికారితో కూడిన కమిటీ సమక్షంలోనే కాంట్రాక్టర్ తెచ్చిన చేప సీడ్ను పరిశీలించి వదులుతున్నాం. నాణ్యమైన, నిబంధనలకు అనుగుణంగా ఉండే సైజ్తో కూడిన చేపలనే వదిలేలా తగు చర్యలు తీసుకుంటున్నాం.
– భాస్కర్, జిల్లా మత్స్యశాఖ అధికారి


