రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులు
కట్ల సకేత
కొలిమికుంట వర్షిత
కొత్తపల్లి త్రివేద
సేపూరి అరవిందరాణి
జన్నారం: రాష్ట్ర విద్యాశాఖ, వారధి ఫౌండేషన్, హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన, డిబేట్ పోటీల్లో జన్నారం మండలం కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థులు సత్తాచాటారు.. పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు కట్ల సాకేత, ఈర్ల రిషిక, దుంప టి అక్షితలు పోటీల్లో పాల్గొని హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ 2025 అనే అంశంపై రా సిన వ్యాస రచన పోటీల్లో మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. మొదటి బహుమతిగా రూ.36 వేల నగదు, ప్రశంసా పత్రాలు అందుకున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండ రాజన్న, విద్యార్థుల గైడ్ టీచర్ దాముక కమలాకర్ తెలిపారు. డిబేట్ రా ష్ట్రస్థాయి పోటీల్లో సేపూరి అరవింద రాణి, కొలిమి కుంట వర్షిత, 9వ తరగతి విద్యార్థి కొత్తపల్లి త్రివేద మూడో స్థానం సాధించి రూ. 27 వేలు నగదు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. విద్యార్థులు ప్ర తిభ చాటడంపై జిల్లా విద్యాధికారి యాదయ్య, మండల విద్యాధికారి విజయకుమార్, అమ్మ ఆదర్శ పాఠశాలల చైర్మన్ మంగ అభినందించారు.
రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులు
రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులు
రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులు


