రాజధానిలో పేలిన తూటా
బొమ్మనహళ్లి: సిలికాన్ సిటీలో తూటా పేలింది. వ్యాపారవేత్త బాలప్ప రెడ్డి, మాదేశ అనే ఇద్దరి హత్య కేసులో ప్రముఖ నిందితుడు, మూలతః ఆంధ్రప్రదేశ్కు చెందిన రవిప్రసాద్రెడ్డిని బెంగళూరు శివార్లలోని ఆనేకల్ తాలూకాలో ఉన్న బొమ్మసంద్ర శ్మశానం వద్ద పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శనివారం రాత్రి సుమారు 10.30 గంటలకు అక్కడ తలదాచుకున్నట్లు తెలిసి పోలీసులు పట్టుకోవడానికి వెళ్లారు. పోలీసులను చూసిన నిందితుడు వారి పైన దాడి చేసి తప్పించుకుపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు హెచ్చరించినా కూడా లొంగిపోలేదు, దీంతో తుపాకులతో కాల్పులు జరిపారు. హెబ్బగోడి ఇన్స్పెక్టర్ సోమశేఖర్ తన పిస్టల్తో కాల్పులు జరిపారు. కాళ్లకు గాయాలైన నిందితుడు పడిపోగా వెంటనే పట్టుకుని ఆస్పత్రికి తరలించారు.
ఆ రోజు ఏం జరిగింది..
రవిప్రసాద్ రెడ్డి హెబ్బగోడి పరిధిలో హోల్సేల్ కిరాణా వ్యాపారం చేసి నష్టాల పాలయ్యాడు. ఇతని స్నేహితులు బాలప్ప రెడ్డికి ఓ స్టీల్ ఫ్యాక్టరీ ఉండగా, మాదేశ టీ హోటల్, కిరాణా స్టోర్ నడుపుతున్నాడు. బాలప్ప వద్ద పెద్దమొత్తంలో అప్పులు తీసుకుని చెల్లించలేకపోయాడు. 4వ తేదీన బాలప్ప ఇంటికి వెళ్లి అతన్ని కిడ్నాప్ చేసి డబ్బులు దోచుకోవాలని పథకం వేశాడు, బాలప్పను కిడ్నాప్ చేసే సమయంలో మాదేశ వచ్చాడు, దీంతో తన పథకం విఫలమైందనే కోపంతో ఇద్దరినీ గొంతు కోసి హతమార్చాడు, ఈ అలికిడి పక్కింటి మల్లికార్జున అనే వ్యక్తి వచ్చి హంతకున్ని అడ్డుకోబోగా తనతో తెచ్చుకున్న బ్యాగును వదిలేసి పారిపోయాడు. బ్యాగులో కత్తులు, కటార్లు, మెటల్ డిటెక్టర్ వంటివి లభించాయి. ఆ రోజు నుంచి పోలీసులు గాలింపు జరుపుతున్నారు. నిందితుడు కర్ణాటక, ఏపీలో అనేక నేరాల్లో పాల్గొన్నట్లు పోలీసులు చెప్పారు.
డబుల్ మర్డర్ నిందితునిపై
పోలీసులు కాల్పులు, అరెస్టు
రాజధానిలో పేలిన తూటా
రాజధానిలో పేలిన తూటా


