కర్ణాటకే ఓ పుణ్యక్షేత్రం | - | Sakshi
Sakshi News home page

కర్ణాటకే ఓ పుణ్యక్షేత్రం

Nov 10 2025 7:34 AM | Updated on Nov 10 2025 7:34 AM

కర్ణా

కర్ణాటకే ఓ పుణ్యక్షేత్రం

మేలుకోటె దేవస్థానంలో ఉపరాష్ట్రపతి

మైసూరు చాముండేశ్వరి ఆలయంలో..

శివాజీనగర: కన్నడిగులు సంస్కృతి, పరంపర, ఆధ్యాత్మికతను కాపాడుతున్నారు. కర్ణాటకే ఒక పుణ్యక్షేత్రమని ఉపరాష్ట్రపతి సీ.పీ.రాధాకృష్ణన్‌ కొనియాడారు. ఆయన ఆదివారం కన్నడనాట విస్తృతంగా పర్యటించారు. ఉదయం ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ గెహ్లాట్‌, ఇతర ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. తరువాత పలు ప్రాంతాల పర్యటన గావించారు. హాసన్‌ జిల్లా శ్రవణ బెళగోళలో శాంతిసాగర మహారాజు 10 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ క్షేత్రం భక్తి, శాంతి, త్యాగానికి సంకేతంగా నిలుస్తోందన్నారు. భారతీయ సంస్కృతీ పరంపరకు జైన మతం సేవలు అపారమని అన్నారు.

చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో..

మైసూరు: చాముండి కొండపై నాడిన శక్తి దేవత చాముండేశ్వరి అమ్మవారిని ఉప రాష్ట్రపతి దర్శించుకున్నారు. మొదట హెలికాప్టర్‌లో మైసూరు మండకళ్ళి ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు, గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌, మంత్రి హెచ్‌.సి.మహదేవప్ప స్వాగతం పలికారు. చాముండి కొండకు చేరుకుని అమ్మవారికి విశేష పూజలు చేశారు.

మేలుకోటెలో

మండ్య: ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ మండ్య జిల్లా మేలుకోటెలో ప్రఖ్యాత చెలువనారాయణ స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. రామానుజుల తపోభూమి అయిన మేలుకోటె అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందజేస్తామని చెప్పారు. ఆలయ స్వామీజీలు, పండితులు ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రాశస్త్యాన్ని వివరించారు. కేంద్రమంత్రి హెచ్‌.డి.కుమార స్వామి, రాష్ట్ర మంత్రి ఎన్‌.చలువరాయస్వామి ఉన్నారు.

సంస్కృతి, ఆధ్యాత్మిక పరంపరకు పరిరక్షణ

ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌ ప్రశంస

పలు చారిత్రక ప్రదేశాలలో పర్యటన

కర్ణాటకే ఓ పుణ్యక్షేత్రం1
1/1

కర్ణాటకే ఓ పుణ్యక్షేత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement