ప్రతి హిందువు జాగృతం కావాలి
● ఆర్ఎస్ఎస్ తెలంగాణ సహప్రాంత ప్రచారక్ కల్పగురి ప్రభుకుమార్
● కామారెడ్డిలో శతాబ్ది పథ సంచలన్
కామారెడ్డి అర్బన్: ప్రతి హిందువు జాగృతం కావాలని, జీవన విధానం స్వదేశం కావాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తెలంగాణ సహప్రాంత ప్ర చారక్ కల్పగురి ప్రభుకుమార్ పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కా మారెడ్డి పట్టణంలో నిర్వహించిన పథ సంచలన్ కా ర్యక్రమానికి ఆయన ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు. స్వదేశీ, కుటుంబం, సామాజిక సమరసత, పర్యావరణ పరిరక్షణ, పౌరవిధులను ప్రతిఒక్కరూ పాటించాలన్నారు.
మారుమోగిన దేశభక్తి నినాదాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది పథ సంచలన్ దేశభక్తి నినాదాల తో మారుమోగింది. పట్టణంలోని బస్తీల వారీగా మ ధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి సరస్వతి విద్యా మందిర్ మైదానానికి సాయంత్రానికి చేరుకున్నారు. దేవునిపల్లి జడ్పీహైస్కూల్ నుంచి దత్తబస్తీ, కల్కినగర్, విద్యానగర్, దేవునిపల్లి, లింగాపూర్, హౌసింగ్ బోర్డు కాలనీ సేవకులు పథసంచలన్లో పాల్గొన్నారు. అశోక్నగర్ వాసవీ హైసూల్ మైదానం నుంచి అశోక్నగర్, కాకతీయ, శ్రీనివాస బస్తీలు, టేక్రియాల్, శ్రీరాం బస్తీలు పాల్గొనగా, వీక్లీమార్కెట్ నుంచి భైరవ, పంచముఖి, ఇంద్రానగర్, గాంధీగంజ్, అంబేద్కర్, ఈశ్వరపుర బస్తీలకు చెందిన ఆర్ఎస్ఎస్ సేవకులు సరస్వతి విద్యామందిర్ మైదానానికి చేరుకున్నారు. విభాగ్ సహ సంఘచాలక్ పాలేటి వెంకటరావు, జిల్లా సంఘచాలక్ బొడ్డు శంకర్, జిల్లా సహ సంఘచాలక్ కొమిరెడ్డి స్వామి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజు పాల్గొన్నారు.
ప్రతి హిందువు జాగృతం కావాలి


