అలరించిన నృత్య పోటీలు
పాల్వంచ: పట్టణంలోని కేటీపీఎస్ ఎ కాలనీలో ఉన్న సీతారామ కల్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన భద్రశైల డ్యాన్స్ పోటీలు అలరించాయి. కూచిపూడి నాట్యనిలయం వ్యవస్థాపకులు రమాదేవి రామ్ నేతృత్వంలో పోటీలు నిర్వహించగా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తరలివచ్చి నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ముగింపు వేడుకల్లో నవలిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శరత్ బాబు, ఎంపీడీఓ విజయ భాస్కర్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపాల్ నరసింహాకుమార్, చండ్ర నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.


