సరస్వతి ఆలయంలో కార్తిక సందడి | - | Sakshi
Sakshi News home page

సరస్వతి ఆలయంలో కార్తిక సందడి

Nov 10 2025 7:36 AM | Updated on Nov 10 2025 7:36 AM

సరస్వతి ఆలయంలో  కార్తిక సందడి

సరస్వతి ఆలయంలో కార్తిక సందడి

బాసర: బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మ హారాష్ట్ర నుంచి భక్తులు తరలివచ్చారు. కార్తికమాసం సందర్భంగా ఆదివారం వేకువ జామున శ్రీ జ్ఞాన సరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి అమ్మవార్లకు ఆలయ వైదిక బృందం అభిషేకం, అర్చన, హారతి, సరస్వతీ పూజ, గణపతి పూజ, కలశ పూజలు చేశారు. పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అభిషేకం నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ఆదివారం మొత్తం ఆదాయం రూ. 9లక్షలు సమకూరిందని ఆలయ ఈవో అంజనదేవి వెల్లడించారు.

సైబర్‌ వలలో

క్రేన్‌ ఆపరేటర్‌

ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలో రోజురోజుకు సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. పట్టణంలోని క్రాంతినగర్‌కు చెందిన జల్వే సతీశ్‌ అనే క్రేన్‌ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. ఆయనకు ఈ నెల 4న గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. తాను ఎల్‌అండ్‌టీ కంపెనీలో పనిచేస్తానని, సగం ధరకే డీజిల్‌ ఇస్తానని నమ్మించాడు. 3150 లీటర్ల డీజిల్‌కు రూ.1,57,500 అవుతుందని పేర్కొన్నాడు. పలుసార్లు ఫోన్‌ చేయడంతో బాధితుడు నమ్మి మొదట ఫోన్‌పే ద్వారా రూ.13వేలు పంపించాడు. తన స్నేహితుడి ఫోన్‌ నుంచి రూ.50వేలు, క్రేన్‌ యజమాని ద్వారా రూ.73,500 పంపించాడు. సైబర్‌ నేరగాడు పట్టణంలోని జై జల్‌రాం పెట్రోల్‌ బంక్‌కు వెళ్లి డీజిల్‌ తీసుకోవాలని సూచించాడు. బాధితుడు అక్కడికి వెళ్లి అడగ్గా పెట్రోల్‌ బంక్‌ యజమాని అలాంటిదేమి లేదని పేర్కొనడంతో సైబర్‌ నేరగాడికి ఫోన్‌ చేస్తే స్విచ్‌ఆఫ్‌ వచ్చింది. మోసపోయినట్లుగా గుర్తించి వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ సునీల్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement