జయపూర్ ఎమ్మెల్యేకు సత్కారం
కొరాపుట్: కాంగ్రెస్ పార్టీకి చెందిన జయపూర్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ భాహీనీ పతిని పలువురు పార్టీ ప్రముఖులు పరమర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా కేంద్రంలోని అతని స్వగృహాన్ని సందర్శించారు. సాధారణ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్లో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి భాహీనిపతి వెళ్లారు. అక్కడ వైద్య నిపుణులు పరీక్షించి అతని ఊపిరితిత్తులలో తీవ్ర సమస్య ఉందని గుర్తించారు. వెంటనే అత్యున్నత చికిత్స చేశారు. కొద్ది రోజులుగా భాహీని పతి కొరాపుట్లో ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో కొరాపుట్ ఎంసీ సప్తగిరి ఉల్క, కాంగ్రెస్ శాసన సభా పక్ష నాయకుడు రాం చంద్ర ఖడం, ఇతరు సీనియర్ నాయకులు ఉన్నారు. వీరంతా నువాపడా ఉప ఎన్నికల ప్రచారం ముగించరుకొని వస్తూ ఎమ్మెల్యేను పరామర్శించాు. నువాపడలో పార్టీ పరిస్థితిని ఎంఎల్ఎ బాహీని పతికి వివరించారు.


