జాతీయస్థాయిలో రాణించాలి
పెద్దపల్లి: రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులు.. జాతీయస్థాయిలోనూ రాణించి మంచిపేరు తీసుకురావాలని ఖోఖో అసోసియేషన్ రాష్ట్రకార్యదర్శి కృష్ణమూర్తి, డీవైఎస్వో సురేశ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు శంకర్ సూచించారు. రాష్ట్రస్థాయి ఖోఖో ముగింపు పోటీలు ఆదివారం రాత్రి జరిగాయి. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన వేడుకల్లో అతిథులు మాట్లాడారు. మెలుకువలు నేర్చుకుని నైపుణ్యం సాధిస్తే విజయం సులభమవుతుందన్నారు. క్రీడలతో శారీరక, మానసికంగా ఉల్లాసంగా ఉంటారని, స్నేహభావం పెంపొందుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తున్నాయమని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వారికి వ్యక్తిగత నగదు ప్రోత్సాహం అందిస్తున్నాయని చెప్పారు. విద్యార్థిదశ నుంచే క్రీడపై పట్టు సాధించాలని కోరారు. పురుషుల విభాగంలో రంగారెడ్డి జట్టు విన్నర్గా, హైదరాబాద్ జట్టు రన్నర్గా నిలిచాయి. మహిళల విభాగంలో ఆదిలాబాద్ విన్నర్గా, రంగారెడ్డి రన్నర్గా నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు ఆసంపల్లి వాసు, తిరుపతి, ఖోఖో ప్రతినిధులు మహేందర్, వేల్పుల సురేందర్, దాసరి రమేశ్, టీఎన్జీవో నాయకులు శ్రీకాంత్, రాజు భాస్కర్, లక్ష్మయ్య, నరేశ్, కిష్టయ్య, రవీందర్, గెల్లు మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
ఖోఖో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి
ముగిసిన రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు
జాతీయస్థాయిలో రాణించాలి


