ప్రైవేట్ ల్యాబ్లకు అనుమతులివ్వాలి
కొత్తగూడెంఅర్బన్: ఎంఎల్టీ, డీఎంఎల్టీ, బీఎస్సీ ఎమ్మెల్టీ విద్యార్హత కలిగినవారు మెడికల్ ల్యాబ్లు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలని సీఐటీ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజే రమేష్ డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తగూడెంలోని మంచికంటి భవన్లో నిర్వహించిన సీఐటీయూ అనుబంధ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్ అసోసియేషన్లో ఆయన మాట్లాడారు. 2010 క్లినికల్ చట్టం ప్రకారం వీరంతా ప్రైవేటు ల్యాబ్లు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, 2018లో ఎంబీబీఎస్ చదువుకున్నవారు మాత్రమే మెడికల్ ల్యాబ్లు నడిపించాల ని చట్టాన్ని సవరించారని అన్నారు. దీనివల్ల ల్యాబ్ టెక్నీషియన్లకు అన్యాయం జరుగుతోందని అన్నా రు. ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేవరకు పోరాటం చేస్తామని తెలిపారు. అనంతరం ప్రైవేటు మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐ టీ యూ కొత్తగూడెం పట్టణ కన్వీనర్ భూక్య రమేష్, నాయకులు లిక్కి బాలరాజు, మెడికల్ ల్యాబ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వీరభద్రం, కార్యదర్శి సలీం, ఆర్ రమేష్, నరేందర్, రాము, ప్రకాష్, సత్యనారాయణ, సుబ్బారావు, చంద్రమోహన్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సీయూటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి
ఏజే రమేష్


