కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
పాడేరు రూరల్: ఏపీఎండీసీలో కార్మికుల రోజు వారి కూలీ రేట్లు పెంచి, నెలకొన్న ప్రధాన సమస్యలు పరిష్కరించాలని కార్మికులు కుటుంబ సమేతంగా ఖాళీ కంచాలు పట్టుకుని మండలంలో మినుములూరు కాఫీ ఎస్టేట్ ముందు ఆదివారం నిరసన తెలిపారు. అనంతరం కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు ఎల్.సుందర్రావు మాట్లాడుతు కాఫీ కార్మికుల పట్ల సంబంధిత అధికారులతో పాటు రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. అరకొర వేతనాలతో గిట్టుబాటులేని కూలీలతో కుటుంబాలు నెట్టుకొని వస్తున్నారన్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రోజువారి కూలీ రేట్లు పెంచాలన్నారు. 2024లో కార్మికులతో చేసుకున్న ఒప్పందాన్ని తక్షణం అమలు చేయాలన్నారు. వీడీఏ పాయింట్లు ప్రకారం రోజువారి కూలీ రేట్లు తక్షణమే పెంచాలని, ఏపీసీలుగా ఉన్న కార్మికులందరికి ప్లాంటేషన్ కండక్టర్లుగా గుర్తించాలన్నారు, పిఎఫ్, ఈఎస్ఐలు అమలు చేయాలని, ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నాయకులు కాంతమ్మ, సత్యనారాయణ, మంగమ్మ,లక్ష్మి, చిన్నలమ్మ తదితరులు పాల్గొన్నారు.


