ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టిన కారు
వేంసూరు: కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో కుటుంబ పెద్ద మృతిచెందాడు. ఏపీలోని ఏలూ రు జిల్లా జంక్షన్కు చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో భద్రాచలం దైవ దర్శనానికి వచ్చాడు. శనివారం అర్ధరాత్రి కారులో తిరిగి ఇంటికి వెళ్తున్నారు. వేంసూరు మండలం లింగపాలెం రోడ్డు పక్కన కొంత దూరంలో నిలిపి ఉన్న ట్రాక్టర్ టక్క్రును డ్రైవింగ్ చేస్తున్న వెంకటేశ్వరరావు కుమారుడు అజయ్ నిద్ర మత్తులో ఢీకొట్టాడు. దీంతో బెడవాడ వెంకటేశ్వరరావు (60) అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ కవిత తెలిపారు.
ప్రమాదంలో ఏపీ వాసి మృతి


