బీసీ రిజర్వేషన్లపై ఏ పార్టీకి చిత్తశుద్ధి లేదు
● 15న కామారెడ్డిలో బీసీ ఆక్రోశసభ
● పార్టీలకతీతంగా బీసీలు తరలిరావాలి
● బీసీ రిజర్వేషన్ల సాధన సమితి
గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య
కామారెడ్డి అర్బన్: రాష్ట్రంలో బీసీలకు 42శాతం రి జర్వేషన్ల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదని, బీసీలంతా ఏకమై ఉద్యమించాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి గౌరవ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరు ల సమావేశంలో కామారెడ్డి బీసీ ఆక్రోశ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఈశ్వ రయ్య మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం 42 శాతం బీసీ రిజరేషన్ల కోసం తాను ఇచ్చిన తమిళనాడు తరహా బీసీ రిజర్వేషన్ల ముసాయిదాను పక్కన పెట్టి సొంత ఆలోచనతో ముందుకు వెళ్లి రిజర్వేషన్ల అమలుపై చిత్తశుద్ధి లేదని రుజువు చేసిందని ఆరోపించారు. ఏం చేసినా సుప్రీంకోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లను అంగీకరించదని జస్టిస్ ఈశ్వరయ్య స్పష్టం చేశారు. 1990లో తమిళనాడు పాటించిన విధానంతో పార్లమెంట్ ఆ మోదం ద్వారా 42 శాతం బీసీ రిజర్వేషన్లు తీసుకురావడమే ఏకై క మార్గం కాగా, సీఎం రేవంత్రెడ్డి తప్పు డు విధానాలు అవలంబిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో బీఆర్ఎస్ తొలి నుంచి వ్యతిరేకంగానే ఉందని, బీజేపీ బీసీల పార్టీకాదన్నారు. రాజకీయాలకు అతీతంగా బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాలకు అన్యాయం జరుగుతున్నందున జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశా రు. ఈ నెల 15న కామారెడ్డి సత్యగార్డెన్లో నిర్వహించే బీసీ ఆక్రోశసభను విజయవంతం చేయాలని జస్టిస్ ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. బీసీలకు మద్దతు ఇస్తున్న ఎస్సీ, ఎస్టీ ప్రజా, బహుజన సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కామారెడ్డి బీసీ ఆక్రోశ సభతో బీసీ ఉద్యమం జాతీయ ఉద్యమం అవుతుందన్నారు. బీసీ సాధన సమితి, వివిధ సంఘాల నా యకులు డాక్టర్ విజయభాస్కర్, గంగాధర్యాదవ్, క్యాతం సిద్ధిరాములు, మర్కంటి భూమన్న, విఠల్ ముదిరాజ్, బాలార్జున్గౌడ్, హరికిషన్గౌడ్, సునీల్గౌడ్, దేవరాజ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


